Rani Mukerji
-
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్కు 'మెగా' ఆఫర్
'భోళాశంకర్' పరాజయం తర్వాత చిరంజీవి చాలా సినిమాలను లైన్లో పెట్టారు. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్ కథలను ఎక్కువగా వింటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విశ్వంభరతో ఆయన బిజీగా ఉన్నారు. అయితే, దసరా మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరు ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్లో ఒకప్పుడు అందాలభామగా గుర్తింపు తెచ్చుకున్న రాణీ ముఖర్జీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరుతో క్రేజీ కాంబోను హీరో నాని సెట్ చేశారని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి సమర్పకుడిగా నాని వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి హీరో నాని ట్విటర్(ఎక్స్) వేదికగా గతంలో పంచుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ను కూడా ఆయన షేర్ చేశారు. చేతులకు రక్తం కారుతున్న పోస్టర్ను విడుదల చేసి ఫ్యాన్స్లో హైప్ పెంచారు. అయితే, ఈ మూవీలో చిరు సరసన నటించే హీరోయిన్ పాత్ర కథకు చాలా ప్రాముఖ్యతను ఇస్తుందట. ఆ పాత్రకు రాణీ ముఖర్జీ అయితే సెట్ అవుతుందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అన్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని చిరుతో చెప్పగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. తన వయసుకు తగ్గట్టు సరిజోడీగా రాణీ ముఖర్జీ మంచి సెలక్షన్ అని చిరు కూడా అన్నారట. ఇదే వార్త బాలీవుడ్ సర్కిల్లో ట్రెండ్ అవుతుంది. -
మళ్లీ తెరపైకి శివానీ శివాజీ రాయ్
బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ లీడ్ రోల్లో నటించిన ‘మర్దానీ 3’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఆమె లీడ్ రోల్లో ప్రదీప్ సర్కార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మర్దానీ’. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా 2014 ఆగస్టు 22న విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శివానీ శివాజీ రాయ్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాణీ ముఖర్జీ నటించారు.న్యాయం కోసం పోరాడే వారి కోసం ధైర్యంగా నిలబడే పాత్రలో తనదైన నటనతో ఆమె ఆకట్టుకున్నారు. అంతేకాదు... కష్టాల్లో ఉన్న వారిని కాపాడటం కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే రోల్లో అద్భుతంగా నటించి, మెప్పించారు. ‘మర్దానీ’కి సీక్వెల్గా రాణీ ముఖర్జీ లీడ్ రోల్లోనే ‘మర్దానీ 2’ సినిమా రూపొందింది.గోపీ పుత్రన్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా 2019 డిసెంబరు 13న రిలీజై, సూపర్ హిట్గా నిలిచింది. ‘మర్దానీ’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా ‘మర్దానీ 3’కి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది యశ్ రాజ్ ఫిల్మ్స్. మళ్లీ శివానీ శివాజీ రాయ్గా రాణీ ముఖర్జీ నటన చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి అని మేకర్స్ పేర్కొన్నారు. -
ఇక నేను బిడ్డను కనలేను: రాణీ ముఖర్జీ
కడుపులో బిడ్డ పెరుగుతుందంటే కోటి ఆశలతో ఎదురు చూస్తుందా మహిళ. కానీ ఆ బిడ్డ ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే కాలం చేసిందంటే ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లుతుందో! అలాంటి నరకవేదన అనుభవించింది రాణి ముఖర్జీ.. తనకు గర్భస్రావమైన విషయాన్ని గతేడాది వెల్లడించింది. తాజాగా మరోసారి ఆ బాధను గుర్తు చేసుకుంది నటి. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించా.. 'నా కూతురికి ఇప్పుడు ఎనిమిదేళ్లు. తనకు ఏడాది వయసు రాగానే మళ్లీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేశాను. దాదాపు ఏడేళ్లు ప్రయత్నించాము. 2020వ ఏడాది గర్భం దాల్చాను. కానీ ఆ సంతోషం ఎన్నోనాళ్లు నిలవలేదు. కడుపులోనే బిడ్డను కోల్పోయాను. ఆ నరకం అనుభవించినవారికే తెలుస్తుంది. నేను పైకి కనిపించేంత యంగ్ కాదు. నేనిప్పుడు 46వ పడిలోకి అడుగుపెట్టాను. ఈ వయసులో బిడ్డను కనలేను. కానీ నా కూతురికి ఒక తమ్ముడినో, చెల్లెనో ఇవ్వలేకపోయానన్న బాధ మాత్రం ఇప్పటికీ ఉంది. తనతో ఆడుకోవడానికి బిడ్డను ఇవ్వలేకపోయా అయినా ఉన్నదాంట్లోనే సంతోషం వెతుక్కోవాలి. అధీరా (రాణి కూతురు) నా బంగారు తల్లి. తన వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. బిడ్డను కనే వయసు దాటేశాను. కాబట్టి నాకు అధీరా ఒక్కరు చాలు' అని చెప్పుకొచ్చింది. కాగా రాణి ముఖర్జీ.. హలో బ్రదర్, హర్ దిల్ జో ప్యార్ కరేగా, ప్యార్ దీవానా హోతా హై, చలో ఇష్క్ లడాయే, చోరీ చోరీ, ఎల్వోసీ: కార్గిల్, మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే వంటి హిట్ చిత్రాల్లో నటించింది. చదవండి: అయ్యో శ్రీలీల.. అప్పుడేమో నెలకో సినిమా.. ఇప్పుడేమో ఇలా.. -
సరదా.. దసరా..
బాలీవుడ్లో దసరా సందడి జోరు బాగా కనిపిస్తోంది. ప్రతి ఏడాదీ కొందరు స్టార్స్ ప్రముఖ ఏరియాల్లో అమ్మవారిని ప్రతిష్ఠించే చోటుకి వెళ్లి, పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా కాజోల్, రాణీ ముఖర్జీ తప్పకుండా వెళుతుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఇద్దరూ అమ్మవారిని దర్శించుకున్నారు. కాజోల్ తన తనయుడు యుగ్తో కలిసి వెళ్లారు. ఇంకా హేమా మాలిని, ఆమె కుమార్తె ఈషా డియోల్ తన తల్లి దులారీ ఖేర్తో కలిసి అనుపమ్ ఖేర్ తదితరులు దుర్గా మాత ఆశీస్సులు అందుకున్నారు. -
ఐఎఫ్ఎఫ్ఎం అవార్డ్స్ 2023: అదరగొట్టిన నటి, బ్లాక్ చీర ధరపై చర్చ
IFFM Awards 2023 Rani Mukerji మెల్బోర్న్లో (ఆగష్టు 11,2023న) జరిగిన ఐఎఫ్ఎఫ్ఎం అవార్డ్స్ 2023 ప్రదానోత్సవంలో బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేలో తన అద్భుతమైన నటనకు గాను రాణి ముఖర్జీ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా ఆమె ధరించిన చీర, ఆమె రూపం అక్కడున్న వారందరినీ మెస్మరైజ్ చేసింది. మిసెస్ ఛటర్జీ Vs నార్వేని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించడం చాలా గర్వంగా ఉందంటూ, IFFM జ్యూరీకి తోపాటు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ఇది తల్లి శక్తి ప్రదర్శించే విశ్వవ్యాప్త కథ అని దీనికి ఉత్తమ నటి అవార్డు రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా అన్నారు. అలాగే షారుఖ్ ఖాన్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ పఠాన్ IIFMలో పీపుల్స్ ఛాయిస్ అవార్డును అందుకుంది. ఆస్ట్రేలియాలో 4.7 మిలియన్ డాలర్లు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. భర్త, నిర్మాత ఆదిత్య చోప్రా, పఠాన్ టీం తరపున రాణీ ముఖర్జీ ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన తెలుగు చిత్రం సీతా రామం ఉత్తమ చిత్రం అవార్డును కైవసం చేసుకుంది ఈ ఈవెంట్లో రాణి ముఖర్జీ లుక్ అదిరిపోయింది. ప్రఖ్యాత డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన బ్లాక్ చీరలో అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది. విశాలమైన ఈ ఫెదర్ బోర్డ్ర్ చీరకు జతగా సీక్విన్డ్ హాఫ్-స్లీవ్ బ్లౌజ్తో జత చేసి అద్భుతంగా కనిపించింది. అంతేనా లగ్జరీ బ్రాండ్ మల్టిపుల్ టైర్డ్ పెర్ల్ నెక్లెస్, చక్కటి మేకప్తో మరింత స్టన్నింగ్ లుక్స్లో కనిపించడం ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. అంతకుముందు కూడా మసాబా గుప్తా రూపొందించిన నలుపు-రంగు చందేరీ ముల్, వైట్ థ్రెడ్స్ ముడి పట్టు చీరను ధరించింది. దీనిపై దేవనాగరిలో ముద్రించిన 'మా', తెల్లటి టాసెల్ ఎంబ్రాయిడరీ చేయించి ఉండటం విశేషం. దీని ధర రూ. 17,000. దీంతో లేటెస్ట్ సవ్యసాచి డిజైన్డ్ సారీ ధర ఎంత ఉంటుందనే దాని అభిమానుల్లో చర్చ మొదలు కావడం విశేషం View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) -
5 నెలలకే నా రెండో బిడ్డను కోల్పోయా, ఎవరికీ తెలీదు: హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ తన జీవితంలోని చేదు అనుభవాన్ని పంచుకుంది. కోవిడ్ సమయంలో కడుపులో బిడ్డను పోగొట్టుకున్నానని వెల్లడించింది. మెల్బోర్న్లో జరుగుతున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో ఆమె ఈ విషాదవార్తను బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. 'ఈ విషయాన్ని బయటకు చెప్పడం ఇదే మొదటిసారి. ఈ రోజుల్లో జీవితంలోని ప్రతి విషయాన్ని పబ్లిక్గా చెప్తుంటే సినిమా ప్రమోషన్స్కోసమేనని విమర్శలు చేస్తున్నారు. అందుకే నా సినిమా ప్రమోషన్స్ చేసేటప్పుడు నా వ్యక్తిగత విషయాల గురించి నేనెక్కువగా మాట్లాడను. కోవిడ్తో ప్రపంచమే అల్లకల్లోలం అవుతున్నప్పుడు నా జీవితంలో కూడా పెను విషాదం చోటు చేసుకుంది. 2020లో నేను రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. దురదృష్టవశాత్తూ ఐదు నెలలకే బిడ్డను కోల్పోయాను. 2020 చివర్లో ఈ సంఘటన జరిగింది. ఈ విషయం ఎవరికీ తెలియదు. నా బిడ్డను కోల్పోయిన 10 రోజులకే నిర్మాత నిఖిల్ అద్వానీ నాకు ఫోన్ చేశాడు. డైరెక్టర్ చెప్పిన కథను నాకు వినిపించాడు. నాకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కానీ ఏదైనా తీవ్రమైన బాధలో ఉన్నప్పుడే దాని నుంచి బయటవేసేందుకు ఇలాంటి మంచి సినిమా ఆఫర్ వస్తుందేమో అనిపించింది. మొదట మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే కథ వినప్పుడు అంత నమ్మకం కుదరలేదు. నార్వేలాంటి దేశంలో ఒక భారతీయ కుటుంబం ఇన్ని ఇబ్బందులు పడుతుందా? అనిపించింది' అని చెప్పుకొచ్చింది. కాగా మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రం అనురూమ్, సాగరిక భట్టాచార్య దంపుతల నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: జైలర్ రికార్డుల వేట మొదలైంది... తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే? అడిగినా సాయం చేయలేదు.. సింధు మరణం తర్వాత కన్నీరు తెప్పించే ఘటన తెరపైకి -
కరోనా: వాయిదాపడ్డ బాలీవుడ్ చిత్రం
రానా నటించిన ‘హాథీ మేరే సాథీ’ (తెలుగులో ‘అరణ్య’గా ఈ చిత్రం నేడు విడుదలవుతోంది) సినిమా తర్వాత మరో బాలీవుడ్ మూవీ ‘బంటీ ఔర్ బబ్లీ 2’ విడుదల వాయిదా పడింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్స్కు ఆడియన్స్ రారని, ఆ ప్రభావం కలెక్షన్స్పై పడుతుందని భావించిన యశ్ రాజ్ నిర్మాణసంస్థ ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన ‘బంటి ఔర్ బబ్లీ 2’ సినిమా విడుదలను వాయిదా వేసింది. #BreakingNews: #BuntyAurBabli2 - which was scheduled to release in *cinemas* on 23 April 2021 - has been postponed... #YRF will announce the new release date later. #SaifAliKhan, #RaniMukerji, #SiddhantChaturvedi #Sharvari pic.twitter.com/nBsSw5swch — taran adarsh (@taran_adarsh) March 25, 2021 2005లో వచ్చిన ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమాకు సీక్వెల్గా ‘బంటీ ఔర్ బబ్లీ 2’ తెరకెక్కింది. వరుణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, రాణీ ముఖర్జీ, సిద్ధార్థ్ చతుర్వేదీ, షార్వారీ ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: బిగ్బాస్ కంటెస్టెంట్కు సల్మాన్ కానుక భర్త నగ్న ఫొటోను షేర్ చేసిన సన్నీ లియోన్ -
పరాయి దేశంతో పోరాడే వివాహిత కథ!
నార్వే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడనున్నారు బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రాణీ ముఖర్జీ. ఎందుకంటే ‘మిస్ట్రస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమా కోసం. మార్చి 21న రాణీ ముఖర్జీ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఆషిమా చిబ్బర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఇది ఓ మంచి హ్యూమన్ స్టోరీ. తన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఓ వివాహిత పరాయి దేశంతో పోరాడే కథ ఇది. ఈ సినిమా కథ బాగా నచ్చింది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఓ మంచి సినిమాలో భాగమైనందుకు, ఇటువంటి సినిమాను నా బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు రాణీ ముఖర్జీ. ఇక రాణి తాజా చిత్రం ‘బంటీ ఔర్ బబ్లీ 2’ వచ్చే నెల విడుదల కానుంది. పదిహేనేళ్ల క్రితం రూపొందిన ‘బంటీ ఔర్ బబ్లీ’కి ఇది సీక్వెల్. తొలి భాగంలోనూ రాణీ ముఖర్జీ నటించారు. చదవండి: ఈ హీరోయిన్ నిజ జీవితంలోనూ ఓ సివంగి -
నా భర్త కరణ్లా ఉంటే ఇష్టపడను
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ తను కుటుంబ నేపథ్య ఆలోచనలు కలిగిన మహిళనని.. తాను ఎప్పుడు కుటుంబంతో గడపడానికే ఇష్టపడతానని చెప్పారు. ఆరేళ్ల క్రితం ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రాను ఆమె ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బడా నిర్మాత అయినప్పటికీ మీడియాకు దూరంగా ఉండే తన భర్త ఆదిత్య చోప్రా గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను రాణీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. (ఒళ్లు గగుర్పొడిచేలా అనుష్క వెబ్ టీజర్..) ‘కరణ్ జోహార్ మాదిరిగా ఆదిత్య సామాజిక వ్యక్తి అయివుంటే.. నేను ఎప్పటికీ ఆయనను ప్రేమించేదాన్ని కాదు. ఆదిత్య తన వ్యక్తిగత జీవితాన్ని వీలైనంత వరకు ప్రైవేటుగా ఉంచడానికే ప్రయత్నిస్తుంటారు. తను పెద్ద నిర్మాత అయినప్పటికీ మీడియాకు దూరంగా ఉంటారు. తన పర్సనల్ లైఫ్ను కానీ.. కుటుంబానికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ ఆదిత్య, కరణ్ జోహర్లా ప్రతి విషయాన్ని బహిరంగపరిస్తే నేను ఆయనను ఇష్టపడే దాన్ని కాదేమో. కరణ్ మీడియా ఫ్రెండ్లీ పర్సన్. తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని బహిర్గతం చేస్తుంటారు. అంతేగాక పార్టీ లైఫ్కు చాలా దగ్గరగా ఉంటారు. ఇక నా విషయానికి వస్తే నేనెప్పుడు కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉండాలనుకుంటాను. అలాగే ఆదిత్య కూడా. షూటింగ్ అయిపోయాక సరాసరి ఆయన ఇంటికే వచ్చేస్తారు’’ అని రాణీముఖర్జీ తెలిపారు. ('షూ' ఛాలెంజ్.. ట్రై చేశారా?) కాగా నిర్మాత కరణ్ జోహార్ తరచూ తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. అంతేగాక తన పర్సనల్ లైఫ్ విషయాలను పంచుకోవడంతలో ఏమాత్రం మొహమాటం చూపించరు. నిరంతరం తన పిల్లలు ఫొటోలను, కుటుంబానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. -
లెక్కకు మించి వసూళ్లు చేస్తున్న చిత్రం
నిజ జీవితంలో జరిగిన కిరాతకమైన అత్యాచారాల సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘మర్దానీ 2’. బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలిరోజు అంతంతమాత్రంగానే వసూలు చేసింది. ఇది చిత్రబృందాన్నిఅయోమయానికి గురిచేసినప్పటికీ అనూహ్యంగా రెండోరోజు విపరీత వసూళ్లను సాధించింది. సాధారణంగా ఏ సినిమానైనా విడుదలైన తర్వాతి రోజుల్లో 50 నుంచి 60 శాతం వసూళ్లు పుంజుకుంటాయి. కానీ మర్దానీ 2 అందుకు భిన్నంగా రాకెట్ స్పీడులో రెండోరోజే 75 శాతం వసూళ్లు పుంజుకున్నాయి. ఈ సినిమా శుక్రవారం సుమారు రూ.4 కోట్లు అందుకోగా శనివారం ఏకంగా రూ. 6 కోట్ల పైచిలుకు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఈ చిత్రం మొత్తంగా రూ.10 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టింది. ఇక బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్ నటించిన ‘దబాంగ్ 3’ శుక్రవారం రిలీజ్ అవుతుండటంతో మర్దానీ 2 చిత్రానికి వసూళ్లు తగ్గే అవకాశం లేకపోలేదు. -
‘ఆపద తలుపు తట్టి రాదు.. పక్కనే ఉంటుంది’
ప్రపంచంలోని ఏ దేశం కూడా మహిళలకు, యువతులకు సురక్షితం కాదనేది సాధారణంగా తెలిసిన విషయమేనని బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ అన్నారు. అయితే ఆపదలను ధైర్యంగా ఎదుర్కొనేలా.. నైపుణ్యాలు పెంపొందించుకునేలా మహిళలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. రాణి ముఖర్జీ తాజాగా నటిస్తున్న చిత్రం మార్దానీ-2. ఇటీవల విడుదలైన సినిమా ఈ ట్రైలర్లో యువతులపై జరిగే భయనక లైంగిక దాడులు ఉండటంతో ఈ చిత్రం వివాదస్పదమైంది. ఈ విషయంపై స్పందించిన రాణీ ముఖర్జీ ‘మర్దానీ-2’ మహిళలకు, యువతులకు అవగాహన కల్పించేలా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో కనిపించే సంఘటనలను గుడ్డిగా వ్యతిరేకించకుండా అలాంటి దాడులు నిజంగానే జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. ప్రతి తల్లిదండ్రులుగా తమ కూతురు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు.. అదే క్రమంలో వారికి భద్రత కూడా కల్పించాలని రాణి ముఖర్జీ పేర్కొన్నారు. ‘ప్రతి ఏటా మహిళలపై 2000లకు పైగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. అందులోనూ ఎక్కువగా 18 ఏళ్ల వయసున్న యువకులే ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు నేషనల్ క్రైం బ్యూరో తమ అధికారిక రికార్డులలో పేర్కొంది. వాటి ఆధారంగానే ‘మర్దానీ-2’ తెరకెక్కించాం. మేము తీసేది భారతీయ సినిమా కాబట్టి భారత్లో జరిగే లైంగిక దాడులనే ప్రధానంగా తీసుకుని సినిమా చేశాం’ అని రాణి చెప్పుకొచ్చారు. ‘యువతను ఉద్దేశించి వారికి అవగాహన కల్పించడమే మర్దానీ సారాంశం. ఆపద అనేది ఇంటి తలుపు తట్టి రాదు.. అది మన పక్కనే ఉంటుంది. అయితే అది గ్రహించి అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించడమే సినిమా ఉద్దేశం. అయితే ఇది పూర్తిగా నేరాలను అరికట్టకపోవచ్చు కానీ కొంతమేర యువతులను మాత్రం అప్రమత్తం చేయగలదని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు. కాగా 2014లో వచ్చిన ‘మర్దానీ’ సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాణి ముఖర్జీ క్రైం పోలీసు ఆఫీసర్గా కనిపించనున్నారు. సినిమాను యష్రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. (చదవండి: ఇది ఆమోదయోగ్యం కాదు: ఓం బిర్లా) -
ఆ మూవీపై లోక్సభ స్పీకర్ అభ్యంతరం!
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మార్దానీ-2 సినిమాపై రాజస్తాన్లోని కోటా వాసులు నిరసన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలతో తెరకెక్కిన సినిమాలో తమ పట్టణం పేరు ప్రస్తావించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎడ్యుకేషన్ హబ్గా ఉన్న కోటా గురించి ఇలాంటి సీన్లు చిత్రీకరించి సిటీ వారసత్వాన్ని, ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి చిత్ర బృందంపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఓం బిర్లా మాట్లాడుతూ... సంబంధిత వ్యక్తులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ‘ సినిమాలో పట్టణం పేరును ప్రస్తావించడం ఆమోదయోగ్యం కాదు. కల్పిత కథ కోటాలో జరిగిందని చెప్పడం సరైంది కాదు’ అని పేర్కొన్నారు. ఇక ఓం బిర్లా కోటా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన విషయం విదితమే. కాగా 2014లో బాలీవుడ్ హిట్గా నిలిచిన ‘మర్దానీ’ సినిమాకు సీక్వెల్గా మార్దానీ-2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. యదార్థ ఘటనల ఆధారంగా కిరాతకమైన అత్యాచారాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. ఇందులో శక్తిమంతమైన పోలీసు అధికారిణి శివానీ శివాజీరాయ్గా రాణీ ముఖర్జీ మరోసారి తన నటనా విశ్వరూపం ప్రదర్శించనున్నారు. అయితే పాశవిక అత్యాచారాలే ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమాలో పదే పదే కోటా పేరును ప్రస్తావిస్తాంచడం నిరసనకు కారణమైంది. కాగా మార్దానీ-2 ను డిసెంబర్ 13న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.(మర్దానీ 2 ట్రైలర్: ఒళ్లు గగుర్పొడిచే రేప్ సన్నివేశాలు..) -
ఒళ్లు గగుర్పొడిచే రేప్ సన్నివేశాలు..
దేశంలో 2000కు పైగా అత్యాచారాలు చేస్తున్నది 18 ఏళ్ల లోపు వయసున్నవారే. ఇది రికార్డుల్లో నమోదైన లెక్కలు. మరి రికార్డులకు అందనివి ఇంకెన్ని ఉంటాయి? మానవ మృగాలు ఒంటరిగా కనిపించిన మహిళలనే టార్గెట్ చేస్తూ వారిని చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తున్నారు. ఇలాంటి భయానక ఘటనలతో మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగడం మాట అటుంచితే, కనీసం పట్టపగలు కూడా గడప దాటాలంటే జంకుతున్నారు. నిజ జీవితంలో జరిగిన కిరాతకమైన అత్యాచారాల సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘మర్దానీ 2’. ఈ సినిమా ట్రైలర్ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. 2014లో విజయాన్ని సొంతం చేసుకున్న మర్దానీకి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్ఫుల్ పోలీస్ అధికారిణిగా శివానీ శివాజీరాయ్ పాత్రలో రాణి ముఖర్జీ నటించింది. ఈ సినిమా ట్రైలర్ ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో నిండి ఉంది. ఇందులోని ప్రతీ సీన్ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. అత్యాచారాలు చేస్తూ హత్య చేస్తున్న వ్యక్తి... మృతదేహాలకు రాణీ ముఖర్జీ మాస్క్లు పెట్టి ఆమెకు సవాల్ విసురుతాడు. అతన్ని పట్టుకోడానికి రాణీ ఏం చేసింది? ఆ దారుణాలను ఎలా అరికట్టింది? అనేది సినిమా విడుదలయ్యాక చూడాలి. ఇందులో రాణీ ముఖర్జీ ఒక నటిగా కాకుండా ఆడపిల్లలను వేధించేవాళ్ల భరతం పట్టే స్త్రీ శక్తిగా దర్శనమిస్తుంది. ఈ సినిమాతో రాణీముఖర్జీ స్థాయి రెట్టింపు అవుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది. ‘మర్దానీ 2’ లో విక్రమ్ సింగ్ చౌహాన్, శ్రుతి బాప్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాణీ ముఖర్జీ ఉగ్రరూపాన్ని చూసిన నెటిజన్లు ఈ యేడాదిలోనే బెస్ట్ ట్రైలర్ అని కొనియాడుతున్నారు. -
అయిగిరి నందిని నందిత మేదిని
చెడు మీద మంచి గెలిచిన ప్రతిసారీ ఆ గెలుపు వెనుక ఉండే శక్తి.. స్త్రీ!దేశమంతా ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో రోజుకో అలంకారాలతో స్త్రీ శక్తిని కొలుస్తూ ఉన్న ఈ సమయంలో.. సరిగ్గా నవరాత్రులు ఆరంభమైన 29వ తేదీన బాలీవుడ్ ఒక శక్తిని టీజర్ ద్వారా సాక్షాత్కరింపజేసింది! ఆ శక్తి.. రాణీ ముఖర్జీ.ఆ సినిమా.. మర్దానీ 2. ఆ టీజర్.. ‘అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే..’ స్తోత్రానికి సరిగ్గా సరిపోయే దృశ్యరూపం. 38 సెకన్ల ఆ టీజర్లో పోలీస్ ఆఫీసర్ రాణీ ముఖర్జీ బెల్టు తీసి బాదిపడేసే సన్నివేశం చూస్తే ఈవిల్ డెడ్డే..! చెడు చచ్చిందే.శివానీ శివాజీ రాయ్ ఆమె పేరు. అమ్మాయిల్ని వెంటాడేవాళ్ల మోకాళ్లలో బులెట్లు దింపుతుంది.అమ్మాయిల్ని వేటాడే కళ్లను వేళ్లతో పైకి పెకిలిస్తుంది. ఇంత కోపం ఏంటి! ఇంత నిర్దయ ఏంటి! ఇంత క్రౌర్యం ఏంటి! దేవుడంటే కూడా భయం లేదా! భయమా?! దుర్గామాతకు భయం ఉంటుందా?! టీజర్ ఎలా మొదలైందో చూడండి. పోలీస్ ఆఫీసర్స్ టీమ్ గన్స్తో అలర్ట్ అయింది. ఎవర్నో షూట్ చేయాలి. ఎవర్నో కాదు. అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠా వెనుక ఉన్న దుష్టశక్తిని. ఎవరా దుష్టశక్తి! ఒకడే ఉంటాడా? మాఫియా లీడర్, పొలిటికల్ లీడర్, డిపార్ట్మెంట్లోనే ఒక పోలీస్ లీడర్.. అందరూ కలిసిన దుష్టశక్తి. ఆ దుష్టశక్తిని వెంటాడుతూ ఎన్కౌంటర్కు సిద్ధమైంది దుర్గా శక్తి.ముందు టీమ్. వెనుకే రాణీ ముఖర్జీ.‘‘ఇప్పుడు తాకండ్రా ఒక్క అమ్మాయినైనా’’..!ఆమె ఆగేట్లు లేదు.‘‘ఒంటికి ఒంటిని తాకిచ్చారు కదా. ఇప్పుడు నేను తాకిస్తా మీ ఒంటికి నా ఒంటిని. ఎలా ఉంటుందో చూద్దురు. చెప్పుకోడానికి కూడా మీకు మీ వయసెంతో గుర్తుకు రాదు’’ ఆమె ఆగేట్లు లేదు. ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. నడుముకు ఉన్న తోలు బెల్టుతో తోలు తీస్తోంది. వాడిలో కదలిక ఉందో చచ్చిందో తెలీదు. రాణీ ముఖర్జీలోని ల్టు మాత్రం కదులుతూనే ఉంది.టీజర్ ఎండ్. సినిమా డిసెంబర్ 13న రిలీజ్ అవుతోంది. 2014లో వచ్చిన వణుకు పుట్టించే (నేరస్తులకు లెండి) యాక్షన్ థ్రిల్లర్ ‘మర్దానీ’కి ఇది సీక్వెల్. ‘మార్దానీ 2’. రాణీ ముఖర్జీ అందులోనూ పోలీస్ ఆఫీసరే, ఇందులోనూ పోలీస్ ఆఫీసరే. అందులో ట్రాఫికింగ్, డ్రగ్స్ మీద.. ఇందులో అమ్మాయిల మీద చెయ్యేసిన వాళ్ల మీద. కన్నేసిన వాళ్ల మీద. మర్దానీ అంటే ‘మగతనం’ అని అర్థం. నిజంగా మగతనం ఉన్న మగాడెవడూ ఆడపిల్లల్ని అల్లరి పెట్టడు. అమ్మాయిల్ని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించడు. రాణీ ముఖర్జీలో కనిపించే మర్దానీ అలాంటి మగాళ్లకొక సమాధానం. ఒక సవాల్. టీజర్లో రాణీ మాటలు వినిపించవు. యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఈ సినిమాలో రాణి 21 ఏళ్ల విలన్తో తలపడుతుంది. ‘యశ్రాజ్ ఫిల్మ్స్’ సంస్థ దీనిని నిర్మిస్తోంది.పోకిరీలకు భయం ఉండాలంటే.. ప్రతి పోలీస్ స్టేషన్లో ఇలాంటి ఒక మహిషాసుర మర్దిని ఉండాలి. -
స్క్రీన్ టెస్ట్
హీరోయిన్ అంటే తెరపై కనిపించడం వరకే అనే రోజులు మొదటి తరంలోనే లేవు. తెరపై రాణించడంతో పాటు తెర వెనక కూడా సాంకేతిక నిపుణులుగా సత్తా చాటిన, చాటుతున్న నాయికలు ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆ ప్రతిభావంతుల గురించి స్పెషల్ క్విజ్. 1. తెలుగు చలన చిత్రరంగంలో మొదటితరం సూపర్స్టార్ ఈమె. సినిమాకి సంబంధించిన అనేక శాఖల్లో ఈమెకు టాలెంట్ ఉండటం వల్ల ‘అష్టావధాని’ అనేవారు. అలా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న ఈ ప్రముఖ నటి ఎవరు? ఎ) సావిత్రి బి) భానుమతి సి) వాణిశ్రీ డి) జమున 2. 1990లలో లేడీ సూపర్స్టార్ అనిపించుకున్న నటి ఆమె. తెలుగులో హీరోలకు సమానంగా పారితోషికం తీసుకున్నారామె. ఎవరా నటి? ఎ) రాధిక బి) ఖుష్బూ సి) విజయశాంతి డి) రాధ 3. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘సింధుభైరవి’కి నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న ఆ చిత్రకథానాయిక ఎవరు? (చిన్న క్లూ: కథానాయిక కాకముందు ఆమె కెమెరా శాఖలో చేశారు) ఎ) సుహాసిని బి) సుమలత సి) ఆమని డి) సరిత 4. ‘అరుంధతి’ ‘రుద్రమదేవి’ ‘భాగమతి’ ఇలా హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలకు చిరునామాగా మారారు అనుష్క. కానీ ఈమె తన మొదటి సినిమాలో కిలాడి లేడీగా నటించారు. అనుష్కను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎస్.ఎస్. రాజమౌళి బి) త్రివిక్రమ్ శ్రీనివాస్ సి) పూరి జగన్నాథ్ డి) శ్రీను వైట్ల 5. తమిళ నటుడు ‘శివాజీ గణేశన్’ని డైరెక్ట్ చేసిన నటీమణులు ఇద్దరే ఇద్దరు. అందులో ఒకరు సావిత్రి. మరో దర్శకురాలు ఎవరో కనుక్కోండి? ఎ) సుజాత బి) కన్నాంబ సి) భానుమతి డి) విజయనిర్మల 6. ఆమె అసలు పేరు సరస్వతి. మూడు సార్లు నేషనల్ అవార్డు పొందారు. ఆ నటి పేరేంటి? (ఆమె తెలుగులో ఎంత పాపులరో మలయాళంలో కూడా అంతే పాపులర్) ఎ) శారద బి) కాంచన సి) అంజలీదేవి డి) ‘షావుకారు’ జానకి 7. జపాన్, జర్మన్, ఇంగ్లీషు భాషల్లోని పాటలతో పాటు మొత్తం 17 భాషల్లో తన గళాన్ని వినిపించారు ఈమె. వేల పాటలు పాడిన ఆ ప్రముఖ సింగర్ ఎవరో కనుక్కోండి? ఎ) వాణీ జయరాం బి) పి.సుశీల సి) చిత్ర డి) ఎస్. జానకి 8. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారీమె. ఆ తర్వాత కథానాయికగా కూడా రాణించారు. ‘సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా’ అంటూ నాగార్జునతో స్టెప్పులేసిన ఆ అందాల సుందరి ఎవరు? ఎ) సుస్మితా సేన్ బి) ప్రియాంకా చోప్రా సి) దియా మీర్జా డి) మాధురీ ధీక్షిత్ 9. ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుపై ‘మీటూ’ ఆరోపణలు చేసిన ప్రముఖ సింగర్, డబ్బింగ్ కళాకారిణి ఎవరు? ఎ) కస్తూరి బి) శ్రీరెడ్డి సి) చిన్మయి డి) కల్పన 10. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దగ్గర అసిస్టెంట్గా 7 సంవత్సరాలు పని చేశారీమె. 2010లో ‘ద్రోహి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో సినిమా తీసి తమిళ, హిందీ, తెలుగు భాషల్లో విజయం సాధించారు. ఎవరా దర్శకురాలు? ఎ) సుధా కొంగర బి) నందినీ రెడ్డి సి) అంజనా డి) చునియా 11. నెల్లూరులో పుట్టిన ఈ నటి పేరు రత్నకుమారి. 1966లో నటి జమున పక్కన చిన్న చెలికత్తె వేషంలో నటించారీమె. తర్వాత కాలంలో ఆమె చాలా పెద్ద హీరోయిన్ అయ్యారు. ఆమెవరో తెలుసా? ఎ) జయంతి బి) శారద సి) వాణీశ్రీ డి) ‘షావుకారు’ జానకి 12. 1994లో శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన ‘బాండిట్ క్వీన్’ చిత్రంలో హీరోయిన్గా నటించిన అస్సామీ నటి పేరేంటి? ఎ) సీమా బిస్వాస్ బి) ఆషిమాల్లా సి) పాంచీ బోరా డి) నేహా జుల్కా 13. శివాజీగణేశన్తో 17 సినిమాలు, యన్టీఆర్ కాంబినేషన్లో 12 చిత్రాలు, అక్కినేనితో 8 చిత్రాల్లో నటించిన ఈ ప్రముఖ హీరోయిన్ ఎవరో కనుక్కోండి ? ( క్లూ: 2016లో ఆమె మరణించారు) ఎ) అంజలీదేవి బి) సావిత్రి సి) కృష్ణకుమారి డి) జయలలిత 14. ఇద్దరు టీవీ యాంకర్లను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ, దర్శకుడు దాసరి నారాయణరావు ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమా తీశారు. అందులో హీరోగా చేసింది అప్పటి యాంకర్, ఇప్పటి ఫిల్మ్ డైరెక్టర్ వక్కంతం వంశీ. మరి ఈ హీరోయిన్ ఎవరు? ఎ) సుమ బి) ఝాన్సీ సి) ఉదయభాను డి) శిల్పా చక్రవర్తి 15. తమిళంలో కె.బాలచందర్, తెలుగులో కె.రాఘవేంద్రరావు ఆమెను హీరోయిన్గా పరిచయం చేశారు. ‘మిస్టర్ ఇండియా’ చిత్రంలో క్రైమ్ రిపోర్టర్. ఆమె పేరేంటి? ఎ) శ్రీదేవి బి) జయప్రద సి) రేఖ డి) హేమమాలిని 16. మలయాళీ బ్యూటీ విద్యాబాలన్ బాలీవుడ్లో హోమ్లీ క్యారెక్టర్స్తో కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఓ ఐటెమ్ సాంగ్స్ క్వీన్ బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’లో హాట్గా కనిపించారు. ఇంతకీ ఆ ఐటెమ్ క్వీన్ ఎవరో తెలుసా? ఎ) జయమాలిని బి) సిల్క్ స్మిత సి) అనూరాధ డి) జ్యోతిలక్ష్మీ 17. 13వ శతాబ్దానికి చెందిన ‘పద్మావత్’ కథను అద్భుతంగా చూపించారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్లీలా బన్సాలీ. పద్మావతిగా నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవరు? ఎ) కరీనా కపూర్ బి) అలియా భట్ సి) దీపికా పదుకొనే డి) ప్రియాంకా చోప్రా 18. తెలుగు ప్రేక్షకులకు ‘దేవదాసు’ అనగానే అక్కినేని, సావిత్రి గుర్తుకొస్తారు. అదే పేరుతో బాలీవుడ్లో 2002లో షారుక్ ఖాన్ ఓ సినిమా చేశారు. అందులో దేవ్గా షారుఖ్ ఖాన్ నటించారు. మరి పార్వతిగా నటించింది ఎవరో కనుక్కోండి? ఎ) కాజోల్ బి) రాణీ ముఖర్జీ సి) ప్రీతీ జింటా డి) ఐశ్వర్యా రాయ్ 19. ‘ఓం శాంతి ఓం’ చిత్రంతో దీపికా పదుకొనే లాంటి స్టార్ బాలీవుడ్కు లభించారు. ఆమెను ఆ చిత్రం ద్వారా పరిచయం చేసిన ప్రముఖ దర్శకురాలెవరు? ఎ) దీపామెహతా బి) ఫరాఖాన్ సి) జోయాఅక్తర్ డి) కొంకణాసేన్ శర్మ 20. ‘మిత్ర్.. మైఫ్రెండ్’ అనే ఇంగ్లిష్ ఫిల్మ్కి దర్శకత్వం వహించి నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న దక్షిణ భారత నటి ఎవరో తెలుసా? ఎ) రేవతి బి) భానుప్రియ సి) శ్రీప్రియ డి) గౌతమి సమాధానాలు 1) (బి) 2) (సి) 3) (ఎ) 4) (సి) 5) (డి) 6) (ఎ) 7) (డి) 8) (ఎ) 9) (సి) 10) (ఎ) 11) (సి) 12) (ఎ) 13) (డి) 14) (ఎ) 15) (ఎ) 16) (బి) 17) (సి) 18) (డి) 19) (బి) 20) (ఎ) మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! నిర్వహణ: శివ మల్లాల -
‘ఇప్పటివరకు ఇంత చెత్త మాటలు నేను వినలేదు’
‘నా అంతరాత్మ క్షోభిస్తోంది. ఇప్పటివరకు ఇంత చెత్త మాటలు నేను వినలేదు. బాధితులే మారాలి గానీ, కారకులకు ఈ విషయంతో ఎటువంటి సంబంధం ఉండదని చెప్పాలనుకుంటున్నారా ఏంటి రాణీ గారు!’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మీరు చెప్పిందే సరైంది అనుకుంటే...నాలుగు నెలల పాపాయి తనపై అకత్యానికి పాల్పడే వ్యక్తిని ఎలా అడ్డుకోగలదు అని ఆమెను విమర్శిస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే... ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చలో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, అనుష్క శర్మ , అలియా భట్, రాణి ముఖర్జీలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోన్న ‘మీటూ’ ఉద్యమం గురించి వారి వారి అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో దీపికా, అనుష్కలు మాట్లాడుతూ ఇంటి తర్వాత మహిళలకు అత్యంత సురక్షితంగా భావించాల్సిన ప్రదేశం పని ప్రదేశమే కాబట్టి వారికి అక్కడ రక్షణ ఉండాలని పేర్కొన్నారు. కాగా వీరి వ్యాఖ్యలకు స్పందించిన రాణీ ముఖర్జీ..‘ మహిళలు స్వతహాగా బలవంతులుగా ఉండాలి. వేధింపులు ఎదురైనపుడు, అకృత్యాలు జరిగినపుడు వాటిని అడ్డుకునే ధైర్యవంతులై ఉండాలి. అందుకోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. అప్పుడే పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో... ‘ఒక పెద్ద ప్రొడక్షన్ హౌజ్ కలిగి ఉన్న మహిళ ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెప్పారు.. ఇందుకు బదులు ప్రతీ తల్లి తన కొడుకును సత్ప్రవర్తనతో పెంచాలని మీకు అనిపించడం లేదా... మీరు జోక్ చేయట్లేదు కదా! పసికందులు ఎన్ని విద్యలు నేర్చుకున్నా మీరు చెప్పినట్లు జరిగే అవకాశమే లేదు’ అని రాణీని విమర్శిస్తున్నారు. ఇక.. రాణీముఖర్జీ బాలీవుడ్ బడా నిర్మాత ఆదిత్య చోప్రా భార్య అన్న సంగతి తెలిసిందే. I'm cringing my soul out! Rani's take on #Metoo is the worst thing I have ever heard, she's basically saying that the victims should change but not the other way around. Annoying as fuck that she didn't let Anu & Deepika talk... #RaniMukerji pic.twitter.com/du5ieVYhW1 — ♡ (@bollypardesi) December 30, 2018 #RaniMukerji was never relevant enough to be cancelled but seeing what she had to say abt #Metoo movement is truly appalling. The woman who has the biggest production house behind her rich entitled ass saying women should behave themselves? You've got to be kidding me!!! pic.twitter.com/RSN6jC5QNX — ً (@srkkajol_) December 29, 2018 -
సల్మాన్.. షారూఖ్లు వియ్యంకులైతే..!
బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్లు ఇటీవల పాత పగలను పక్కన పెట్టి కలిసి మెలిసి కనిపిస్తున్నారు. ఒకరి సినిమాలో ఒకరు అతిథి పాత్రలు చేస్తూ సాయం చేసుకుంటున్నారు. తాజా ఈ ఇద్దరి గురించి నటి రాణీ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. షారూఖ్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న దస్ కా ధమ్ కార్యక్రమ గ్రాండ్ ఫినేలుకు సల్మాన్ రాణీ ముఖర్జీలు గెస్ట్లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాణీ ముఖర్జీ సల్మాన్ పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ని ఉద్దేశించి ‘నువ్వు పెళ్లి చేసుకోకపోయినా.. కూతుర్ని మాత్రం కను. షారూఖ్ కొడుకు అబ్రామ్కు సల్మాన్ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే చూడాలిని ఉంది’ అన్నారు. అంతేకాదు ‘నేను సల్మాన్ షారూఖ్లు ఇద్దరితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశాను. వీరిలో షారూఖ్ ప్రేమగా స్వీట్గా ఉంటే.. సల్మాన్ప్రేమ మాత్రం ప్రత్యేకంగా ఉంటుంద’న్నారు. -
మనిషిగా ఉండటం గొప్ప
‘ఉద్యోగ సంతృప్తి’ని పొందేవారు నిజంగా అదృష్టవంతులు. చేస్తున్న పనిలో అపరిమితమైన సంతోషాన్ని అనుభవిస్తారు వాళ్లు. కొందరికి ఏ ఉద్యోగమూ సంతృప్తినివ్వదు. వాళ్లను దురదృష్టవంతులు అనలేం కానీ, స్థిరంగా ఒక చోట ఉండలేరు వాళ్లు. మారడంలోనే వాళ్లకు జాబ్ శాటిస్ఫ్యాక్షన్! ప్రపంచంలో ఎక్కడైనా ప్రధానంగా ఈ రెండు రకాల ఉద్యోగులే ఉంటారు. అయితే రాణీ ముఖర్జీ మాత్రం తను తనకిష్టమైన జాబ్ చెయ్యడానికే పుట్టానని అంటున్నారు. ఆమెకు ఇష్టమైన జాబ్.. యాక్టింగ్. ఆ విషయం రాణీ ముఖర్జీకి 24వ యేట తెలిసిందట. 2002లో మణిరత్నం చిత్రం ‘సాథియా’ షూటింగ్లో తనకు ఈ ఫీలింగ్ కలిగిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. ఆ తర్వాత రాణీ చాలా సినిమాలు చేశారు. అవన్నీ సూపర్హిట్ కాకపోయినా, అన్నిట్లోనూ రాణీ యాక్షన్ హిట్టు, సూపర్హిట్టే. అంతలా ఆమె తన ప్రొఫెషన్ని ప్రేమించారు. రాణి లేటెస్ట్ చిత్రం ‘హిచ్కీ’.. ఆమెకు చాలా మంచి పేరు తెచ్చింది. అంతకుముందు ‘మర్దానీ’లోనూ ఆమెది మర్చిపోలేని యాక్టింగ్. అయితే నటిగా ఇంత పేరు వచ్చినా.. రాణీ మాత్రం ఒక మనిషిగానే గుర్తింపును కోరుకుంటున్నారట! ముందు మనిషిగా ఉండటం గొప్ప. ఆ తర్వాతే మిగతా గొప్పలు అని ఆమె అంటున్నారు. ‘నటన కోసమే నేను పుట్టాను’ అని ఆమె అనడంలోనే మనిషిగా ఆమె ఔన్నత్యం తెలుస్తోంది. వృత్తిని ప్రేమించేవారు, వృత్తిని ఆరాధించేవారు.. వారి హోదా చిన్నదైనా, పెద్దదైనా వాళ్లంతా గొప్పవాళ్లే. -
పెళ్లయితే సినిమా హిట్ కాకూడదా?
సాక్షి, ముంబై : పెళ్లయి తర్వాత గ్యాప్ తీసుకుంటున్న హీరోయిన్లు.. సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కువగా పాత్రా ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. కానీ, నాలుగేళ్ల తర్వాత తిరిగి ‘హిచ్కీ’తో రీఎంట్రీ ఇచ్చిన రాణీ ముఖర్జీ మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. మొదటి రోజు ఆ చిత్రం రూ. 3కోట్ల 30లక్షలు వసూలు చేసి.. ఈ మధ్య రిలీజ్ వచ్చిన లేడీ ఓరియంటల్ చిత్రాల్లో తొలి రోజు వసూళ్లలో టాప్ స్థానంలో నిలిచింది. అయితే పెళ్లయితే వాళ్ల సినిమాలు హిట్ కాకూడదా? అని రాణీ ముఖర్జీ ఇప్పుడు ప్రశ్నిస్తోంది. ‘ఓ సినిమా విజయవంతం కావటానికి కావాల్సింది మంచి కథ, నటీనటుల ఫెర్ ఫార్మెన్స్. అంతేగానీ అందులో నటించేవారికి పెళ్లయ్యిందా? లేదా? అన్నది ముఖ్యం కాదు. వ్యక్తిగత జీవితాన్ని.. సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతానా? అన్న అనుమానాల మధ్యే నటించటం మొదలుపెట్టాను. కానీ, నటనే నా జీవితం అన్న విషయం నాకు ఈ చిత్రం మళ్లీ గుర్తు చేసింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో నా కూతురు అదిరాను చూసుకుంటూనే.. ఇకపై నటనలోనూ కొనసాగుతా. ఆదరిస్తున్న వారికి నా కృతజ్ఞతలు’ అని ఆమె తెలిపారు. టూరెట్ సిండ్రోమ్తో బాధపడే ఓ మహిళ, టీచర్గా మారి వీధి బాలల బతుకులను మార్చాలని యత్నించటం... ఆ క్రమంలో అందరితో ఆమె అవమానాలు ఎదుర్కోవటం...ఆ ప్రయత్నంలో చివరకు విజయం సాధించటం అనే కథాంశంతో హిచ్కిని దర్శకుడు సిద్ధార్థ్ మల్హోత్రా తెరకెక్కించాడు. Heroine-centric movies and Day 1 biz... Note: Diverse genres... Varying screen count... India biz...#Hichki Day 1: ₹ 3.30 cr#TumhariSulu Day 1: ₹ 2.87 cr#Mom Day 1: ₹ 2.90 cr#Simran Day 1: ₹ 2.77 cr#BegumJaan Day 1: ₹ 3.94 cr — taran adarsh (@taran_adarsh) 24 March 2018 -
నేటితో 'బ్లాక్' బ్యూటీకి 40
బాలీవుడ్ 'బ్లాక్' బ్యూటీ రాణీ ముఖర్జీ జన్మదినం నేడు. నేటితో ఈ భామకు 40ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా తన 40 ఏళ్ల ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటూ ఒక లేఖను విడుదల చేశారు రాణీ. '40ఏళ్లు.. అని తలుచుకుంటేనే చాలా అద్భుతంగా ఉంది. ఈ 40ఏళ్లలో, 22ఏళ్లు బాలీవుడ్లోనే గడిచిపోయాయి. ఇక్కడ ప్రతిరోజు నన్ను నేను నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఇన్నేళ్లు నాతో పనిచేసిన చిత్ర నిర్మాతలకు, నన్ను నమ్మి సమాజ నియమాలను సవాలు చేసే పాత్రలను నాకు ఇచ్చిన దర్శకులకు కృతజ్ఞతలు. ఇన్నేళ్లుగా నాపై చూపిస్తున్న ప్రేమాభిమానలకు ధన్యవాదాలు. నటీనటులకు సమాజం, మనుషుల ఆలోచనల మీద ప్రభావం చూపే కథలు చాలా అరుదుగా దొరుకుతాయి. అదృష్టవశాత్తు అలాంటి అవకాశాలు నాకు ఎన్నో వచ్చాయి. ఇదంతా ప్రేక్షకుల ఆశీర్వాదం వల్లే. నేను పుట్టిందే నటించడం కోసం అనే విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. అయినా నేను మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోగలిగాననే భావిస్తున్నాను. ఒక విషయమైతే నేను ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. చిత్ర పరిశ్రమలో నటీనటులుగా రాణించడం చాలా కష్టమైన అంశం. ఆడవారికైతే మరీ కష్టం. ఎందుకంటే హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ కాలం ఉంటుంది.ఇక పెళ్లయిన హీరోయిన్ల సంగతి చెప్పనవసరం లేదు. తల్లిగా మారాక స్త్రీలు తమ ఆశలను, కలలను, కోరికలను చంపుకోవాల్సిందే. ఇక్కడ స్త్రీ ప్రధానంగా వచ్చే చిత్రాలు విజయవంతమవ్వడం చాలా కష్టం. ఈ వివక్షలను దాటుకుని మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి మేము ప్రతీరోజూ పోరాడుతూనే ఉంటాము. పరిశ్రమలో హీరో, హీరోయిన్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ మా రూపాన్ని, గాత్రాన్ని, నటనను, నాట్యాన్ని, ఎత్తును బట్టి మమ్మల్ని ప్రతిరోజు నిర్ణయిస్తారు. వీటన్నిటిని దాటుకుని మమ్మల్ని మేము నిరూపించుకుంటాము. నేను నా స్నేహితుల నుంచి అనేక విషయాలను నేర్చుకుంటాను' అంటూ ముగించారు. లాంగ్ గ్యాప్ తరువాత రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘హిచ్కీ’ ఈ శుక్రవారం రిలీజ్ అవుతుండగా.. షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జీరో సినిమాలోనూ రాణీ ముఖర్జీ నటిస్తున్నారు. -
పారితోషికంపై నటి భిన్న స్పందన
ముంబై : సినీ ఇండస్ట్రీలో హీరోల కన్నా హీరోయిన్ల పారితోషికం తక్కువన్న విషయం తెలిసిందే. ఇందుకు బాలీవుడ్ మినహాయింపేమీ కాదు. సోనమ్ కపూర్ నుంచి ప్రియాంక చోప్రా వరకూ ఈ విషయంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితులో మార్పు వస్తోంది. అందుకు నిదర్శనం 'పద్మావత్' సినిమానే. ఈ సినిమాలో రాణి పద్మావతిగా నటించిన దీపికా పదుకొనే తీసుకున్న పారితోషికం రణవీర్ సింగ్, షాహీద్ కపూర్ కన్నా అధికం. ఆ సంగతలా ఉంచితే హీరోయిన్ల తక్కువ పారితోషికం విషయంపై... రాణి ముఖర్జిని అడిగితే ఆమె భిన్నంగా స్పందించారు. తనకు డబ్బు ముఖ్యం కాదని, పనికే ప్రాధన్యత ఇస్తానని తెలిపారు. తానెప్పుడు పనిచేయడం గురించే ఆలోచిస్తానని, ఆర్థిక వ్యవహారాలన్ని తన తల్లిదండ్రులే చూసుకుంటారని తెలిపారు. 'ఈ మధ్యకాలంలో నటించడం రానివాళ్లు కూడా పారితోషికం గురించి మాట్లాడుతున్నారు. మనం చేసే పనికి సంబంధించి మెళకువలు నేర్చుకుంటే డబ్బు దానంతట అదే వస్తుంది' అన్నారు. నటులు ప్రకటనలు, రిబ్బన్ కటింగ్ల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం రాణిముఖర్జి 'హిచ్కి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె 'టౌరెట్ సిండ్రోమ్' తో బాధపడే ఉపాధ్యాయురాలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 23న విడుదల కానుంది. -
నా భర్తను ప్రతిరోజూ తిడతాను..
సాక్షి, ముంబై: ‘ఔను నా భర్తను ప్రతిరోజూ తిడతాను. దూషిస్తాను. కానీ ద్వేషంతో కాదు. ప్రేమతో. అతను ప్రేమతో చేసే విషయాలు చూసి తిడతాను. అందులో ప్రేమ తప్ప ద్వేషం లేదు. నేను ఎవరినైనా తిట్టానంటే.. వారిని నిజంగా ప్రేమించినట్టు’ అంటోంది బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ. ప్రముఖ నిర్మాత, యశ్రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్యచోప్రాను నాలుగేళ్ల కిందట రాణి పెళ్లాడిన సంగతి తెలిసిందే. వారికి అధీర అనే రెండేళ్ల కూతురు ఉంది. పెళ్లి, సంతానం నేపథ్యంలో సినిమాల నుంచి విరామం తీసుకున్న రాణి ఇప్పుడు ‘హిచ్కీ’ అనే వినూత్న సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలుకరించబోతోంది. మాట్లాడుతున్నప్పుడు ‘హిచ్క్క్’ అంటూ వింత శబ్దం చేసే ఓ స్కూల్ టీచర్ ఏవిధంగా తన విద్యార్థులను తీర్చిదిద్దిందనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా రాణి ముఖర్జీ తాజాగా నేహా ధూపియా చాట్లో ముచ్చటించింది. సెలబ్రిటీ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన పెళ్లి, వైవాహిక జీవితం, తమ అనుబంధం గురించి వివరించింది. ‘ముఝ్సే దోస్తీ కరోగీ’ సినిమా సమయంలో తొలిసారి ఆదిత్య చోప్రాతో పరిచయం అయిందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని రాణి తెలిపింది. తనకు, ఆదిత్యకు పెద్దగా ప్రచార ఆర్భాటాలు, ఆడంబరాలు ఇష్టం ఉండవవని, అందుకే కేవలం 12మంది సమక్షంలో నిరాడంబరంగా తమ పెళ్లి జరిగిందని రాణి వెల్లడించింది. అందరూ సెలబ్రిటీ కిడ్స్ తరహాలో తమ చిన్నారి అధిరా ఫొటోలు మీడియాలో, సోషల్ మీడియాలో కనిపించడం తమకు నచ్చదని, అందుకే తనను ఎక్కువగా ఫొటోలు తీసేందుకు ఇష్టపడమని చెప్పింది. -
హిచ్కీ టీచర్.. రాణి ఈజ్ బ్యాక్!
‘‘నాకు తెలిసి మాట్లాడడంలో ఇబ్బంది పడేవారు టీచర్లు అయినట్టు ఎక్కడా లేదు’’ అంటాడు ప్రిన్సిపాల్, తమ స్కూల్లో టీచర్ ఉద్యోగం కోసం వచ్చిన హీరోయిన్తో! ‘‘కానీ నాకు టీచర్ అవ్వాలన్నదే డ్రీమ్’’ అంటుంది హీరోయిన్. హీరోయిన్కేమో మాట్లాడడం సరిగ్గా రాదు. మాట్లాడలేదు. టోరెట్ సిండ్రోమ్ ఆమెకు. నత్తిలాంటి ఒకరకం లోపం. ఎక్కిళ్లు వచ్చినట్టుగా ఉంటూ, మాటలు మధ్యలోనే ఆగిపోతాయి. అలాంటి ఒక టీచర్ పాఠాలు చెప్తే విద్యార్థులు ఎలా ఉంటారు? అసలు ఆమె మాటను పట్టించుకుంటారా? ఆమెకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ఈ కథతో హిచ్కి (ఎక్కిళ్లు అని..) అనే ఓ సినిమా వస్తోంది. ఆ హీరోయిన్ పాత్రలో కనిపిస్తోంది ఎవరో కాదు.. మన రాణి ముఖర్జీ. కెరీర్ రెండో దశలో థ్రిల్లర్స్తో మెప్పించిన ఆమె, కూతురు పుట్టాక సినిమాలకు దూరమయింది. ఇక ఇప్పుడు మళ్లీ అన్నీ సెట్ చేస్కొని, ఒక కొత్త కథాంశంతో హిచ్కీ అంటూ వచ్చేస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకుడు. నటనలో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న రాణి, ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకుంటూ, ఒక స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇస్తారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఫిబ్రవరి 23, 2018న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఆ హీరోయిన్ పేరుతో ఉన్నవన్నీ నకిలీ ఎకౌంట్లే
ముంబై: హీరో, హీరోయిన్ల పేరుతో కొందరు సోషల్ మీడియాలో నకిలీ ఎకౌంట్లు ఓపెన్ చేయడం, అందులో వారి విషయాలు, ఫొటోలను పోస్ట్ చేసిన సంఘటనలు గతంలో వెలుగుచూశాయి. ఈ తర్వాత సంబంధిత నటులు ఈ విషయం తెలుసుకుని స్పందించారు. అవి నకిలీ ఎకౌంట్లను, తమకు సంబంధంలేదని స్పష్టం చేశారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. రాణి ముఖర్జీ ముద్దుల తనయ అడిరా ఫొటో ఇంటర్నెట్లో చక్కర్లుకొట్టడంతో ఆమె తరఫున ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశాడు. రాణి ముఖర్జీకి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ ఎకౌంట్ లేదని తెలియజేశాడు. ఇక మీదట కూడా ఉండబోదని చెప్పాడు. సోషల్ మీడియాలో రాణి ముఖర్జీ పేరు మీద నకిలీ ఎకౌంట్లు చాలా ఉన్నాయని ఆమె ప్రతినిధి వెల్లడించారు. అభిమానులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని, రాణి పేరు మీదున్న ఎకౌంట్లను ఫాలోకావద్దని, వాటిలో పోస్ట్ చేసే వివరాలు నిజంకాదని చెప్పాడు. 2014లో రాణి ముఖర్జీ నిర్మాత ఆదిత్య చోప్రాను ఇటలీలో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు గతేడాది డిసెంబర్లో ఓ పాప జన్మించింది. -
ఐష్ వదులుకుంది.. రాణి అందుకుంది!
ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుని బాలీవుడ్ లో అడుగుపెట్టి అగ్రతారగా ఎదిగింది ఐశ్వర్యరాయ్ బచ్చన్. హిందీలో టాప్ హీరోలు అందరి సరసన నటించింది. బాలీవుడ్ లో ఆమె నటించిన సినిమాల్లో చాలా చిత్రాలు ఘన విజయం సాధించాయి. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి బిజీ అయిపోయిన ఐష్ డైరీ ఖాళీలేక వదిలిలేసిన సినిమాలు కూడా సక్సెస్ కావడం విశేషం. కుచ్ కుచ్ హోతా(1998) సినిమాలో రాణిముఖర్జి పాత్రకు మొదట ఐష్ ను అడిగారు. అయితే డేట్స్ ఖాళీలేకపోవడంతో ఈ అవకాశం వదులుకుంది. 'దోస్తానా' సినిమాలో ప్రియాంక చోప్రా చేయాల్సి పాత్ర ముందుగా ఐశ్వర్యరాయ్ కే దక్కింది. బిజీగా ఉండడంతో ఈ అవకాశం కూడా ఐష్ వదులుకుంది. హీరోయిన్, భూల్ భులైయా, వీర్ జారా సినిమాల్లో కూడా ఆమె నటించాల్సినవే. 'చల్తే చల్తే' సినిమా షూటింగ్ లో షారూఖ్ ఖాన్ తో సల్మాన్ ఖాన్ గొడవ చేయడంతో ఐశ్వర్యరాయ్ స్థానంలో రాణిముఖర్జిని తీసుకున్నారు. మిస్ ఇండియాగా ఎంపికైనప్పుడే బాలీవుడ్ లో తెరంగ్రేటం చేయడానికి రెడీ అయింది. 'రాజా హిందూస్తానీ'లో ఆమిర్ ఖాన్ సరసన నటించేందుకు ఓకే చెప్పింది. అయితే మిస్ వరల్డ్ పోటీలు ఉండడంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది. కాగా, ఐష్ వదిలేసిన సినిమాల్లో నటించిన రాణిముఖర్జి స్టార్ గా ఎదిగించింది. ఈ విషయంలో ఐష్ కు రాణి థ్యాంక్స్ చెప్పుకోవాలి. -
పారిస్ లో పాగా వేసిన హీరోయిన్ ఫ్యామిలీ
ముంబై: ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రాణీ ముఖర్జీ. కొన్ని నెలల కిందట ఆమె అమ్మగా ప్రమోట్ అయ్యాక ఎంతో సంతోషంగా ఉంది. 2014 ఏప్రిల్లో ప్రముఖ దర్శక,నిర్మాత ఆదిత్యచోప్రాను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. వారి పాపకు భర్త, తన పేరు లింక్ అయ్యేలా 'ఆదిరా' అని పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చోప్రా కుటుంబం కొన్ని నెలలు పారిస్ ట్రిప్ కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో హాలీడ్ ట్రిప్ తో పాటు గెట్ టుగెదర్ లా సెలబ్రేట్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇంట్లోకి ఆదిరా చేరని తర్వాత ఎక్కడికి వెళ్లడానికి తీరక దొరకలేదని, ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఇలా ప్లాన్ చేసుకున్నారు. ఈ మధ్య ప్రియురాలు నర్గీస్ ఫక్రీతో బ్రేకప్ తర్వాత ఉదయ్ చోప్రా కాస్త మూడ్ ఆఫ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. రాణి ముఖర్జీ తన కూతురు అదిరా, తల్లి పమేలాతో కలిసి పారిస్ లో కొన్ని రోజులు జాలీగా గడపనుంది. రాణి తల్లిదండ్రులతో పాటు సోదరుడు కూడా ట్రిప్ లో జాయిన్ అవుతారని కథనాలు వస్తున్నాయి. ఆదిత్యా చోప్రా 'బేఫికర్' మూవీ తీస్తున్నాడు. రణ్ వీర్ సింగ్, వాణీ కపూర్ లు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పారిస్ లో 6 బెడ్ రూమ్స్ ఉన్న ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకున్నారట. కుటుంబసభ్యులతో పాటు ఇంటి పనివాళ్లను కూడా యూరప్ ట్రిప్ భాగ్యం కలిగించారు. వంటవాళ్లు, ఓ ఆయాను కూడా తమవెంట తీసుకెళ్లారు. -
రాణి ఇంట యువరాణి
‘ఆదిరా’... ఏంటిదీ ఇలాంటి పదం ఎక్కడా విన్నట్లు లేదే అనుకుంటున్నారా? ఆదిత్యా చోప్రా-రాణీ ముఖర్జీల ముద్దుల కూతురి పేరిది. బుధవారం ఉదయం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో రాణీ ముఖర్జీ ఓ పాపకు జన్మనిచ్చారు. ఆది, రాణి అనే తమ ఇద్దరి పేర్లు కలిసివచ్చేలా తమ కుమార్తెకు ‘ఆదిరా’ అని ఈ పేరు పెట్టుకున్నారు. -
పాపకు జన్మనిచ్చిన రాణీ ముఖర్జీ
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ అమ్మగా ప్రమోట్ అయ్యారు. 2014 ఏప్రిల్లో ప్రముఖ దర్శక,నిర్మాత ఆదిత్యచోప్రాను పెళ్లి చేసుకున్న ఆమె నటనకు గుడ్ బై చెప్పేశారు. చివరగా మర్థానీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాణీ. వివాహం తరువాత పూర్తిగా సినీ రంగానికి, మీడియాకు దూరంగా ఉంటున్నారు ఈ దంపతులు. రాణీ ముఖర్జీ గర్భవతి అయిన సమయంలో కూడా చాలా వార్త సంస్థలు ఈ విషయంపై ప్రచారం చేసినా, రాణీ, ఆదిత్య దంపతులు మాత్రం అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. గతంలో రాణీ ముఖర్జీ సోదరి త్వరలో రాణీ తల్లి కాబోతోంది అంటూ ప్రకటించటంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ రోజు(బుధవారం) రాణీ ముఖర్జీ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని కూడా కరణ్ జోహార్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ' ఈ రోజు నేను ఓ అందమైన పాపకు అంకుల్ అయ్యాను. రాణీ, ఆదిలు ఆడబిడ్డకు జన్మనిచ్చారు' అంటూ ట్వీట్ చేశాడు కరణ్ జోహార్. ముంబై బ్రిచ్ కాండీ హాస్పిటల్ లో జన్మించిన ఈ పాపకు అదిరా అని నామకరణం చేశారు. ఈసందర్భంగా రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా దంతులకు అభినందనలు వెల్లువెత్తాయి. Am an uncle to a beautiful baby girl today!!!!! @udaychopra !!! Rani and Adi had a baby girl!!— Karan Johar (@karanjohar) December 9, 2015 -
కనులు చూడలేని ప్రపంచం
దేడ్ కహానీ - బ్లాక్ ‘‘కళ్లున్న ప్రతి వాళ్లూ కలలు కంటారు-’’ అని టీచర్ క్లాసులో పాఠం చెబుతోంది. విద్యార్థులంతా శ్రద్ధగా వింటున్నారు. అంతలో హా అని ఒక గర్జనతో కూడిన అరుపు వినిపించింది. మిచెల్ అనే అంధ విద్యార్థిని. మతిస్థిమితం, వినికిడి శక్తి కూడా సరిగాలేని ఆమెని మనిషిగా మలచిన టీచర్ దేవరాజ్ సహాయ్ ఆమెకి ట్రాన్స్లేటర్గా క్లాస్రూమ్లో పక్కనే కూర్చుని ఉన్నాడు. సహాయ్ వల్లే మిచెల్ అందరు పిల్లల్తోపాటు గ్రాడ్యుయేషన్ వరకూ వచ్చింది. ‘నో’ అని అర్థం వచ్చేలా ఆమె అరిచిన అరుపుకి పాఠం చెప్తున్న టీచరు, వింటున్న పిల్లలు, పక్కనే కూర్చున్న సహాయ్ అందరూ ఉలిక్కిపడి ఆమెవైపు చూశారు. మిచెల్, సహాయ్ చేయి పట్టుకుని ఏదో సంజ్ఞ చేసింది. సహాయ్ టీచర్తో ట్రాన్స్లేట్ చేసి చెప్పాడు. ‘‘మీరు చెప్పిన విషయంతో నేను ఏకీభవించను అంటోంది టీచర్’’. టీచర్ మిచెల్ని నించోమంది. తన అభ్యంతరం ఏమిటో చెప్పమంది. మిచెల్ ఆంగికంతో అభినయం చేస్తుంటే సహాయ్ వాచికంతో చెప్పాడు - ‘‘కళ్లున్నవాళ్లు మాత్రమే కలలు కంటారన్నది తప్పు. కళ్లున్నవాళ్లు బయటి ప్రపంచాన్ని మాత్రమే చూస్తారు. కానీ, మనసున్నవాళ్లు లోపల మరో ప్రపంచాన్ని చూస్తారు. కలల్ని మనసుతో మాత్రమే చూడగలం. కళ్లు మూసుకున్నాకే మనసు తలుపులు తెరుచుకుని కలలు బైటకొస్తాయి. నాకు కళ్లు లేవు. కానీ నేను రోజూ కలలు కంటాను. వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడతాను’’ అంది మిచెల్. టీచర్తో సహా అందరూ చప్పట్లు కొట్టారు - ఆ సన్నివేశాన్ని థియేటర్లో చూస్తున్న ప్రేక్షకులతో సహా. ఒక పెద్ద బంగ్లా. మిచెల్ చెల్లెలి నిశ్చి తార్థం. పెళ్లికొడుకు, అతని తల్లిదండ్రులు, మిచెల్, ఆమె చెల్లెలు, వాళ్ల తల్లిదండ్రులు, మిచెల్ ట్రాన్స్లేటర్ కమ్ టీచర్ సహాయ్.. అందరూ భోజనాలకి కూర్చున్నారు. మిచెల్ చెల్లెలు అందరినీ ఉద్దేశించి మాట్లా డటం ప్రారంభించింది. నాకీ ఇంటితో చాలా జ్ఞాపకాలున్నాయి. చాలా ఏళ్లుగా చెప్పుకోలేని విషయాలున్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఆరేళ్ల వయసున్నప్పుడు నేను, మిచెల్ ఆడు కుంటూ పరుగెత్తాం. ఇద్దరం కిందపడ్డాం. ఇద్దరమూ ఏడ్చాం. అమ్మ, నాన్న ఇద్దరూ కంగారుగా గార్డెన్లోకి వచ్చారు. మిచెల్ని ఎత్తుకున్నారు. ఊరడిస్తూ లోపలికి తీసు కెళ్లారు. నాకూ దెబ్బతగిలింది. ఎత్తుకో మని చేతులు చాపి ఏడుస్తున్నాను. కానీ ఎత్తుకోలేదు ఆ దెబ్బ ఇంకా మానలేదు. ఇవాళ్టికీ అలాగే ఉంది. నేనూ చేతులు జాపి హత్తుకోమని అలాగే ఉన్నాను. ఇప్పటికీ అమ్మ, నాన్న మిచెల్ని కంటికి రెప్పలా చూస్తూనే ఉన్నారు. అన్నీ సవ్యంగా ఉండి, అందంగా పుట్టడం నేను చేసిన తప్పు కాదు. అమ్మానాన్నల ప్రేమను అక్క మిచెల్ మాత్రమే పొందింది. అది అదృష్టవంతురాలు. తల్లి దండ్రుల ప్రేమకి నోచు కోని నేను నిజ మైన వికలాంగురాలిని’’ - ఈ ప్రసంగం మొత్తాన్నీ సహాయ్ సంజ్ఞల ద్వారా మిచెల్కి అనువదిస్తూనే ఉన్నాడు. ఆమెలో ఉద్రేకం కట్టలు తెంచుకుంది. చెల్లెల్ని తనెంత ప్రేమించిందో ఆమె రాసుకున్న ప్రసంగాన్ని సహాయ్కిచ్చింది. అతను చదివి వినిపించాడు. చుట్టూ ఉన్న పాత్ర లన్నీ, నిందించిన చెల్లెలితో సహా కన్నీళ్లు పెట్టుకున్నాయి - ఈ దృశ్యం చూస్తున్న మనలాంటి ప్రేక్షకులతో సహా. అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే ఒక మెతుకు చూసి చెప్పమన్నారు. నేను రెండు మెతుకులు శాంపిల్ చూపించాను. ఉడికిందా? మనసు తడిసిందా? కడుపు నిండా, గుండె నిండా ఆ అనుభూతిని అనుభవించాలని ఉందా? అయితే సంజయ్లీలా భన్సాలీ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘బ్లాక్’ చిత్రం చూసెయ్యాల్సిందే. 2005లో విడుదలైన ఈ చిత్రం ‘ఎ’ సెంటర్లలో కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు, 2 నేషనల్ అవార్డులు, 11 ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకుని రికార్డులు సృష్టించింది. మానసిక అపరిపక్వత, అంగవైకల్యం జీవితంలో ఎదగడానికో, అనుకున్నది సాధించడానికో అవరోధాలు కాదు అని నమ్మిన సహాయ్ (అమితాబ్), మిచెల్ అనే చిన్న పాపకి ట్యూటర్గా చేరతాడు. ఆమె కన్నుల్లో అంధకారాన్ని ఏమీ చేయలేకపోయినా, లోపలున్న అంధకారాన్ని తొలగించి, ఆత్మజ్యోతిని అతడు వెలి గించడమే ఇతివృత్తం. అసహనం, చిరాకు కలగలిసిన ఓ తాగుబోతు సహాయ్. మిచెల్ (రాణీముఖర్జీ)ని ఆమె కుటుంబ సభ్యులు, సభ్యసమాజం ఒక విక లాంగురాలిగా, మతిస్థిమితం లేని దానిగా సానుభూతితో చూడకుండా, ఇండిపెండెంట్ హ్యూమన్ బీయింగ్ లా చూడాలని తాపత్రయపడటం, అతని సహాయంతో మిచెల్ తన వైకల్యాన్ని అధిగమించి జీవితంలో ఎదిగిన వైనం చూసి తీరాల్సిందే. అంధురాలిగా రాణీముఖర్జీ, ఆమె ఉన్నతికై తాపత్రయపడే సహాయ్గా అమితాబ్ బచ్చన్ నటన శిఖరాగ్ర స్థాయిలో ఉంటాయి. నిజానికి రాణీముఖర్జీ ప్రొఫెషనల్ అండ్ సీజన్డ్ ఆర్టిస్ట్. ఆమె బాగా చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్ననాటి మిచెల్గా నటించిన బాలనటి ఆయేషా కపూర్ కూడా రాణీ అంత బాగా చేయడం విశేషం. ఆ పాత్ర తాలూకు స్వరూప స్వభావాలని ముందు చిన్ననాటి పాత్రయే ప్రేక్షకులకి రుచి చూపిస్తుంది కాబట్టి ఆమె రాణించడం పెద్ద సవాలు. ఆ సవాలును స్వీకరించి చక్కగా సక్సెస్ సాధించింది ఆయేషా కపూర్. అలా ఆమెకి రెండు మార్కులు ఎక్కువే వేయొచ్చు. అయితే వీళ్లందరితో ఇంత బాగా చేయించిన ఘనత మాత్రం దర్శకుడు సంజయ్లీలా భన్సాలీదే. ఆయన ఈ చిత్రాన్ని మలిచిన తీరు అమోఘం! ఈ చిత్రంలోనే కాదు... చిత్ర నిర్మాణం వెనుక కూడా కొన్ని ఆసక్తి కరమైన విశేషాలు ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని... పాత్ర చాలా చాలెంజింగ్గా ఉంది కాబట్టి దానికి న్యాయం చేయగలనో లేదో అని రాణీముఖర్జీ ఈ పాత్రని ఒప్పుకోవ డానికి మొదట చాలా తటపటా యించిందట. ఈ చిత్రానికి ముందు ఎ.ఆర్.రెహ్మాన్ని సంగీత దర్శకుడిగా అనుకున్నారట. కానీ ఆ సమయానికి ఆయనకి ఖాళీ లేక మాంటీశర్మని ఫిక్స్ అయ్యారట. ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ (రిషికపూర్ కొడుకు), ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్కపూర్ (అనిల్కపూర్ కూతురు) ఇద్దరూ ఈ చిత్రానికి దర్శకత్వ శాఖలో సహాయ దర్శకులుగా పనిచేశార్ట. హెలెన్ కెల్లెర్ ఆత్మకథని చదివి, ఆమె ఇన్స్టిట్యూట్కి వెళ్లి ఇంకొంత రీసెర్చ్ చేసి సంజయ్లీలా భన్సాలీ ఈ కథని తయారుచేసుకున్నాట్ట. 2013లో టర్కీ భాషలో ‘బెనిమ్ డున్యమ్’ పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఇలాంటి ఎన్ని విశేషాలు ఉన్నా... ఈ చిత్రం ద్వారా భన్సాలీ ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం తర్వాతే ఏదయినా. మానసి కంగా అయినా, శారీరకంగా అయినా వైకల్యాన్ని జయిస్తే కైవల్యం సిద్ధిస్తుందన్న వాస్తవాన్ని అందమైన దృశ్య రూపంలో చూపించిన ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే! - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
తల్లికాబోతున్న హీరోయిన్?
న్యూఢిల్లీ: ప్రముఖబాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ తల్లి కాబోతోందా? ఇటీవల ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యానాల్నిబట్టి చూస్తే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం లండన్లో ఉన్న ఈ భామ ప్రసవానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మసాజ్కు సంబంధించి కొన్ని కమెంట్లు చేసింది. దీంతో ఆమె తల్లికాబోతోందనే వార్తలు ఇపుడు బాలీవుడ్లో షికార్లు చేస్తున్నాయి. రాణీ ప్రముఖ దర్శకుడు, యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లయిన తర్వాత రాణి బాలీవుడ్కు, మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాణి తల్లిగా ప్రమోషన్ కొట్టేసిందన్న వార్తలపై వారిద్దరినుంచి ఎలాంటి దృవీకరణ ఇంకా లభించలేదు. ఆదిత్య, రాణి దంపతులు తమ ప్రేమ, పెళ్లి విషయంలో వచ్చిన వార్తలను మొదట్లో రూమర్లు అంటూ చాలాకాలం కొట్టేశారు. ఇపుడు ఎలా స్పందిస్తారో చూడాలి. రాణి నటించిన చివరి చిత్ర్దం మర్దానీ. వివాహం తర్వాత రాణీ ముఖర్జీ మరే చిత్రంలోనూ నటించలేదు. -
మాఫియా రాణిగా..
‘మర్దానీ’ హిట్ను ఎంజాయ్ చేస్తున్న రాణీ ముఖర్జీ త్వరలోనే మాఫియా రాణి పాత్ర పోషించనుంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం చెల్లెలు హసీనా పర్కార్ జీవిత కథ ఆధారంగా అపూర్వ లఖియా తెరకెక్కించనున్న చిత్రంలో రాణీ ముఖర్జీ టైటిల్ రోల్లో కనిపించనుంది. దక్షిణ ముంబైలోని నాగ్పడా ప్రాంతం నుంచి కార్యకలాపాలు సాగించిన హసీనా ‘గాడ్మదర్ ఆఫ్ నాగ్పడా’గా పేరుమోసింది. ఆమె పాత్రకు రాణీ ముఖర్జీ పూర్తిగా న్యాయం చేయగలదని దర్శకుడు లఖియా చెబుతున్నాడు. -
పెళ్లయితే లిప్ లాక్ సీన్స్ చేయకూడదా?
‘‘ఇప్పటివరకు నా సినిమాలు మాత్రమే విజయం సాధించాలని కోరుకుంటూ వచ్చాను. ఇకనుంచీ మా యశ్రాజ్ ఫిలింస్ రూపొందించే చిత్రాలన్నీ విజయం సాధించాలని కోరుకోవాలి. ఆ ఇంటి కోడల్ని కాబట్టి.. ఇప్పుడీ అదనపు బాధ్యత’’ అని రాణీ ముఖర్జీ అన్నారు. ప్రముఖ నిర్మాత యశ్చోప్రా తనయుడు, దర్శక, నిర్మాత ఆదిత్య చోప్రాను రాణీ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాణీ నటించిన ‘మర్దానీ’ ఇటీవల విడుదలై, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పెళ్లి తర్వాత ఆమె అందుకున్న తొలి విజయం ఇది. ఈ సందర్భంగా తన సినీ జీవితం, వ్యక్తిగత జీవితం గురించి బోల్డన్ని విశేషాలను రాణీ ఈ విధంగా పంచుకున్నారు. ఆ మాటలు నాకు విచిత్రంగా అనిపించాయి ‘ఇప్పుడు నువ్వు పెద్దింటి కోడలివి కదా.. ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యకూడడదు.. పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహించాలి’ అని కొంతమంది సన్నిహితులు నాతో అంటున్నారు. ఆ మాటలు నాకు విచిత్రంగా అనిపించాయి. పెద్దింటి కోడలైతే కెరీర్ని మానుకోవాల్సిందేనా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నాకు దొరికిన సమాధానం ’అవసరం లేదు’ అని. నా భర్త ఆదిత్య చోప్రా మంచి దర్శక, నిర్మాత. తన ఆలోచనలన్నీ ఆధునికంగా ఉంటాయి. పెళ్లయిన తర్వాత నువ్వు నటించకూడదని నాకెప్పుడూ చెప్పలేదు. అందుకని నిక్షేపంగా నేను సినిమాలు చేస్తా. నా కెరీర్ అంటే నాకు ప్రాణం. అలాగని చివరి శ్వాస వరకూ నటించాలనుకోవడంలేదు. ఎన్నాళ్లు కుదిరితే అన్నాళ్లు చేస్తా. నాకు సంతృప్తికరంగా అనిపించే పాత్రలు వచ్చేవరకూ చేస్తాను. నచ్చలేదనుకోండి.. ఇంట్లోనే కూర్చుంటా. వాళ్లే నోళ్లు మూసుకుంటారు ప్రస్తుతం హిందీ రంగంలో లిప్ లాక్ సీన్స్ చాలా కామన్ అయ్యాయి. కానీ, పెళ్లయినవాళ్లు ఇలాంటి సన్నివేశాల్లో నటించకూడదని అంటుంటారు. సీన్ డిమాండ్ చేసిందనుకోండి.. చేయాల్సిందే. కుదరదని చెప్పి, సినిమాకి అన్యాయం చేయాలా? లిప్ లాక్ సీన్స్లో నటించాలా? వద్దా? అనేది వ్యక్తిగత విషయం. ఒకవేళ ఆ హీరోయిన్కి నచ్చితే చేస్తారు. విమర్శించేవాళ్లు నోళ్లు ఎలాగూ ఆగవు. వాగీ వాగీ నోళ్లు మూసుకుంటారు. గర్భవతిగా ఉన్నా నటిస్తా.. గర్భం దాల్చిన తర్వాత వచ్చే శారీరక మార్పులు, ఏర్పడే ఇబ్బందుల కారణంగా ఓ ఏడాది పాటు కెరీర్కి దూరంగా ఉండాలని కొంతమంది ఆడవాళ్లు కోరుకుంటారు. కానీ, గర్భం దాల్చినా నేను నటించడానికి రెడీయే. కానీ, దర్శకులు అంగీకరించాలి కదా. హాలీవుడ్ తారల్లో చాలామంది గర్భంతో ఉన్నప్పుడు కూడా హ్యాపీగా నటించారు. మరి.. మనకేంటి సమస్య? ఆడవాళ్లందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి ‘మర్దానీ’లో నేను క్రిమినల్ బ్రాంచ్కి చెందిన సీనియర్ ఇన్స్పెక్టర్ పాత్ర చేశాను. ఈ పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. సినిమా కోసమే నేర్చుకున్నప్పటికీ వ్యక్తిగతంగా ఆడవాళ్లందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నది నా అభిప్రాయం. ఆత్మరక్షణకు అది ఉపయోగపడుతుంది. పెళ్లికి ముందు తండ్రి లేక సోదరుల తోడు, పెళ్లి తర్వాత భర్త తోడు లేనిదే బయటికి వెళ్లలేని స్త్రీలు ఇప్పటికీ మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. అలాగే, లైంగిక వేధింపులను ఎదిరించలేని స్త్రీలూ ఉన్నారు. తిరగబడే ధోరణిని పెంచుకోవాలి. మార్షల్ ఆర్ట్స్వంటి వాటివల్ల ఆత్మస్థయిర్యం పెరుగుతుంది. నా భర్త దర్శకత్వంలో నేను నటించాను యశ్రాజ్ ఫిలింస్ మా సొంత సంస్థ కాబట్టి, ఇకనుంచీ నాకు సినిమాలకు కొదవ ఉండదని కొంతమంది భావన. ‘మర్దానీ’ ఈ సంస్థే రూపొందించింది కానీ, నా తదుపరి చిత్రం ఈ సంస్థలో ఉండదు. నేను బయటి సంస్థల్లో కూడా సినిమాలు చేస్తాను. నా భర్త ఆదిత్య చోప్రా దర్శకత్వంలో అస్సలు సినిమాలు చేయాలనుకోవడంలేదు. ఎందుకంటే షూటింగ్ లొకేషన్లో తనను కేవలం ఓ దర్శకునిగా ట్రీట్ చేయడం నావల్ల కాదు. నా భర్త అనే ఫీలింగ్ నా మనసులో ఉంటుంది కాబట్టి, లొకేషన్లో తనేమైనా నియమాలు పెడితే, అలిగే ప్రమాదం ఉంది. మా మాధ్య చిరు అలకలు, చిన్ని చిన్ని గొడవలు కామన్. అవన్నీ ఉన్నాయి కాబట్టే.. మాది ‘హ్యాపీ ఫ్యామిలీ’ అనొచ్చు. -
రూమర్లు నిజమైతే ఎంత బాగుంటుందో: రాణీ ముఖర్జీ
ముంబై: తనపై వస్తున్న రూమర్లు నిజమైతే బాగుంటుందని బాలీవుడ్ తార రాణీ ముఖర్జీ స్పందించారు. బాలీవుడ్ నిర్మాత ఆదిత్యా చోప్రాను పెళ్లాడిన రాణీ ముఖర్జీ ప్రస్తుతం గర్భవతి అని సినీ పరిశ్రమలో రూమర్లు జోరుగా షికారు చేస్తున్నాయి. త్వరలో తాను తల్లిని కావాలనుకుంటున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాణీ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు తాజా రూమర్లకు బలాన్ని చేకూర్చాయి. పెళ్లికి ముందే ఆదిత్య, తాను వివాహం చేసుకున్నామని గతంలో రూమర్లు వచ్చాయని.. ఆ తర్వాతే మా పెళ్లి జరిగిందని రాణీ తెలిపారు. అలాగే తాను గర్భవతి అంటూ వస్తున్న రూమర్లు కూడా నిజం కావాలని కోరుకుంటున్నానని.. అంతకంటే ఆనందం ఏముంటుందని రాణీ ప్రశ్నించింది. ఓ బిడ్డకు జన్మనివ్వడమనే విషయం కంటే మహిళ జీవితంలో మరో గొప్ప విషయం ఏముంటుందని రాణీ ముఖర్జీ అన్నారు. -
ఇంటిపేరు మార్చుకోను
ఇంటి పేరు మార్చుకోవడానికి బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ఎంతమాత్రం ఇష్టపడడం లేదు. నిర్మాత ఆదిత్య చోప్రాను ఈ ఏడాది ఏప్రిల్లో వివాహమాడిన ఈ వగలాడి రాణీ ముఖర్జీగానే చలామణీ కావాలని అభిలషిస్తోంది. ఇటలీలో అత్యంత సాదాసీదాగా వీరి వివాహం జరిగింది. ఐశ్వర్యరాయ్, కరీనాకపూర్లు తమ తమ భర్తల ఇంటి పేర్లను సొంతం చేసుకున్నప్పటికీ అదే బాటలో నడిచేందుకు రాణి ఆసక్తి కనబరచడం లేదు. ‘నా పేరంటే నాకు ఎంతో ఇష్టం. నేను దానినే కొనసాగిస్తా. రాణీ ముఖర్జీగానే నేను నటించిన సినిమాలన్నింటిలోనూ ప్రేక్షకులకు పరిచయం. ఆ పేరుతోనే నన్ను గుర్తిస్తారు. ఇక వ్యక్తిగతంగా నా పిల్లలను బడిలో చేర్చే సమయంలో మాత్రం ఇంటిపేరు మారుతుంది. అయితే నా అభిమానులందరికీ రాణీ ముఖర్జీనే’ అని తన మనసులో మాట బయటపెట్టింది. నగరంలో మంగళవారం తన తాజా సినిమా ‘మర్దాని’ట్రయలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఈ వయ్యారిభామ పెళ్లి ఇటలీలోనే ఎందుకు చేసుకున్నారని అడగ్గా ఇందులో తన ప్రమేయం ఏమీ లేదంది. ఆదిత్య కోరిక మేరకే ఈ వివాహం అక్కడ జరిగిందని తెలిపింది. ఆదిత్యకు మొహమాటం ఎక్కువని, కనీసం మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడడని తెలిపింది. నటులనందరినీ బిచ్చగాళ్లతో పోల్చింది. పాత్రల ఎంపికలో తమకు ఎటువంటి చాయిస్ ఉండదని, ఇచ్చిన పాత్రను పోషించడమే తమ కర్తవ్యమంది. మహిళా ప్రధాన పాత్రలో భాగస్వామి కావాలని తన కోరికని చెప్పింది. -
'వదిన మా కుటుంబాన్ని ఏకం చేసింది'
ముంబై: తన వదిన బాలీవుడ్ తార రాణీ ముఖర్జీపై నటుడు, నిర్మాత ఉదయ్ చోప్రా ప్రశంసలతో ముంచెత్తారు. తన కుటుంబాన్ని ఒక్కటి చేసిన ఘనత రాణీ ముఖర్జీకి చెందుతుందని ఉదయ్ అన్నారు. అంతేకాక రాణీ ముఖర్జీ ఉత్తమ ఇల్లాలు, గృహిణీ అని ఆదిత్య చోప్రా సోదరుడు, యష్ చోప్రా కుమారుడు ఉదయ్ కితాబిచ్చారు. రాణీ తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయముందని.. తాను, రాణీ కలిసి ముజ్ సే దోస్తి కరోగే అనే చిత్రంలో కలిసి నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రాణి వ్యక్తిత్వం కూడా చాలా గొప్పగా ఉంటుందని.. అలాంటి వ్యక్తి తన వదినగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి యష్ చోప్రా తమ నుండి దూరమయ్యారనే దుఖాన్ని కూడా రాణీ దూరం చేసిందని ఉదయ్ తెలిపారు. చాలా సందర్భాల్లో తనకు బాసటగా నిలిచిందని.. గొప్పవాడివి అవుతావని రాణీ ఎప్పుడూ చెబుతుంటుందని ఉదయ్ మీడియాకు వెల్లడించారు. చాలా ఏళ్ల నుంచి సన్నిహితంగా మెలుగుతున్న ఆదిత్య, రాణి ముఖర్జీలు ఏప్రిల్ నెలలో ఇటలీ దేశంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
సహజీవనానికి రాణి ముఖర్జీ స్వస్తి !
బాలీవుడ్ నీలికళ్ల సుందరి రాణి ముఖర్జీ త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని ఇన్నిరోజులు బాలీవుడ్ జనాలు అనుకున్నారో అతడితోనే. అతడే ఆదిత్య చోప్రా . వీరిద్దరి మధ్య చాలాకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ఇటివలే వీరిపెళ్లిగురించి ఇరు కుటుంబాల వారు మాట్లాడుకున్నారని ప్రముఖ పత్రిక మంగళవారం ఓ కథనాన్ని ప్రచురించింది. వచ్చే ఏడాది ఫ్రిబవరి 10వ తేదీన జోధ్పూర్లోని ఉమైద్ ప్యాలెస్లో ఆదిత్య చోప్రా, రాణీ ముఖర్జీల వివాహం జరగనుందని వెల్లడించింది. అయితే వారిద్దరి వివాహం వ్యక్తిగతం కావున ఆ వ్యవహారాన్ని గోప్యతగా ఉంచాలని అటు చోప్రా, ఇటు ముఖర్జీల కుటుంబాలు నిర్ణయించాయని ఆ పత్రిక పేర్కొంది. అయితే ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీలు గతంలోనే రహస్యంగా వివాహం చేసుకున్నారు. వారిద్దరు సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇరుకుటుంబాలు ఆదిత్య, రాణి ముఖర్జీల వివాహనికి పచ్చ జెండా ఊపడంతో వారి సహజీవనానికి తొందరలో స్వస్తి పలకనున్నారు. ప్రముఖ బాలీవుడ్ చలన చిత్ర నిర్మాత యష్ చోప్రా తనయుడు ఆదిత్య చోప్రా. అతగాడు గతంలోనే తన చిన్ననాటి స్నేహితురాలు పాయల్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాణీముఖర్జీ వివాహం చేసుకునే క్రమంలో పాయల్కు ఆదిత్య విడాకులకు అప్లై చేశాడని వినికిడి. బాలీవుడ్ బాక్స్ ఆఫిస్ను బద్దలు కొట్టిన దిల్వాలే దుల్హనియా లేజాయింగే చిత్రానికి ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
బాలీవుడ్ మొఘల్కు శుభాకాంక్షలు తెలిపిన ఆశాపరేఖ్
బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ 91వ జన్మదినోత్సవ వేడుకులు బుధవారం ముంబయిలోని ఆయన నివాసంలో అత్యంత సాదాసీదాగా జరిగాయి. ఆ వేడుకలకు బాలీవుడ్ అలనాటి ప్రముఖ నటీ ఆశాపరేఖ్తోపాటు ధర్మేంద్ర, రాణీముఖర్జీలు తదితరులు హాజరైయ్యారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బాలీవుడ్ సినిమా రచయితలు సలీం ఖాన్, హెలెన్లు కూడా ఆ వేడుకల్లో పాల్గొన్నారు. తాను దిలీప్ కుమార్లో నటించాలని ఉందని ఆశాపరేఖ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కొరికను వెల్లడించిన సంగతి తెలిసిందే. దేవదాసు, మధుమతి, మొఘల్-ఎ-అజాం చిత్రాల్లో దిలీప్ తన అద్భుతమైన నటను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. దిలీప్ కుమార్ ఇటీవల తీవ్ర ఆనారోగ్యానికి గురైయ్యారు. దాంతో ఆయన ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.