Round Table Conference
-
కడపలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం
-
ప్రమాదంలో ముస్లిం సమాజం
సాక్షి, అమరావతి: కూటమి కుతంత్రంతో ముస్లిం సమాజం పెను ప్రమాదంలో పడిందని, ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం హక్కులు కాపాడతానని భరోసా ఇచ్చిన సెక్యులర్ లీడర్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవడం మన ధర్మమని ముస్లిం మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ), ముస్లిం ఆలోచనపరుల వేదిక(ఎంటీఎఫ్)ల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం రౌంట్ టేబుల్ సమావేశం జేఏసీ రాష్ట్ర కన్వినర్ షేక్ మునీర్ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించారు. ‘ముస్లిం సమస్యలు–ప్రజాస్వామ్య పరిరక్షణ మార్గాలు’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని ముస్లిం ఉలేమాలు, జమాత్ల ప్రతినిధులు, డాక్టర్లు, లాయర్లు, పలు రంగాలకు చెందిన నిపుణులు, ఆలోచనపరులు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. పలువురు మాట్లాడుతూ.. విద్యాపరంగాను, సామాజికంగాను అత్యంత వెనుకబాటుకు గురైన ముస్లింలకు వైఎస్సార్ నాలుగు శాతం రిజర్వేషన్లు కలి్పంచారని తెలిపారు. అవి మతపరమైన రిజర్వేషన్లుగా దు్రష్పచారం చేసి ఎన్డీఏ కూటమి ముస్లిం సమాజాన్ని దారుణంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందన్నారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, వక్ఫ్ బోర్డును తీసివేస్తామనే ప్రకటనలతో మైనారీ్టల పట్ల వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలను అవమానిస్తున్న ఎన్డీఏ కూటమితో గతంలోనూ, ఇప్పుడు జతకట్టిన చంద్రబాబు ముస్లిం సమస్యలపై పోరాడుతానంటే ఎలా నమ్మాలని ప్రశి్నంచారు. కూటమిలో చేరిన టీడీపీ, జనసేన రానున్న కాలంలో బీజేపీలో విలీనం కావడం ఖాయమన్నారు.ప్రసంగించిన వారిలో తబ్లిక్ జమాత్ అధ్యక్షుడు అక్బర్ బాషా, జమాత్ అహ్లెహదీస్ అధ్యక్షుడు నసీర్ ఉమరి, కార్యదర్శి అతీఖ్ రెహమాన్, జమాత్ అయిమ్మ ఉలమ ప్రతినిధులు ముఫ్తి యూసుఫ్, ముఫ్తీ హబీబ్, అహ్లె సున్నత్ వల్ జమాత్ ప్రతినిధి ఖలీల్, ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ ప్రతినిధి అబ్దుల్ మతీన్, ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ప్రతినిధి హబీబ్ రెహమాన్, అంజుమాన్ ఇస్లామియా ఉపాధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, మోహిద్దీన్, షఫీ అహ్మద్, ముస్లిం ఆలోచనపరుల వేదిక రాష్ట్ర కనీ్వనర్ యజ్దూనీఖాన్ తదితరులున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిద్దాం రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకోసం ముస్లింలంతా ఏకతాటిపై పనిచేయాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్టు ముస్లిం జేఏసీ రాష్ట్ర కనీ్వనర్ షేక్ మునీర్ అహ్మద్ మీడియాకు తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లు కాపాడతానని సీఎం వైఎస్ జగన్ ప్రకటించాకే బీజేపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పారీ్టలు మూకుమ్మడిగా ఆయనపై దాడిని పెంచాయన్నారు. ధైర్యంగా ముస్లింలకు అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్ను మరోసారి గెలిపించుకోవడం మన బాధ్యతగా తెలిపారు. కాంగ్రెస్కు ఓటేసినా బీజేపీ కూటమికే లాభం రాష్ట్రంలో ముస్లిం సమాజానికి చెందిన ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ విషయంలో ముస్లింలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ– విజయవాడ) మాజీ అధ్యక్షుడు డాక్టర్ రెహమాన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్కు ఓటేస్తే.. ముస్లిం ఓట్లు చీలిపోయి పరోక్షంగా బీజేపీ, దాని కూటమి పారీ్టలకే మేలు చేసినట్టవుతుందన్నారు. ప్రతి ముస్లిం ఓటు వైఎస్సార్సీపీ అభ్యర్థులకే పడేలా ఎవరికి వారే బాధ్యత వహించాలని సూచించారు. -
చిన్నారుల్లో సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇలా చేయండి
చిన్నారుల ఆరోగ్యం ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఓ వైపు తల్లిదండ్రుల్లో అవగాహన లోపం, మరోవైపు జంక్ ఫుడ్ వీర విహారం.. పాఠశాల విద్యార్ధుల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటీవలే ఏఐజీ ఆసుపత్రి నిర్వహించిన ఓ సర్వేలో శారీరకంగానే కాక మానసికంగా కూడా అనారోగ్యం పాలు జేసే శక్తి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్కు ఉందని దీనిని వినియోగిస్తున్న వారిలో చిన్నారులే అధికమని తేలింది. ఈ సందర్భంగా 8–5–1–0 పేరిట ఒక హెల్త్ ఫార్ములాను ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఫ్యూచర్ ఫుడ్ ఫౌండేషన్, కంట్రీ డిలైట్, పలు పాఠశాలల ఆధ్వర్యంలో చిన్నారుల ఆరోగ్యంపై ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఈ ఫార్ములా రూపకర్తలు మాట్లాడారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే.. కారణాలెన్నో.. నిశ్చల జీవనశైలి, పెరిగిన స్క్రీన్ సమయం శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరగడం, అవుట్డోర్ లో ఆటలకు దూరంగా ఉండటం వలన వ్యాయామం తగ్గిపోయింది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చక్కెరలు అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరిగిపోయింది. ఇది ఊబకాయంతో మొదలై గుండె సంబంధ సమస్యల దాకా దారితీసింది. కాలుష్య కారకాలు టాక్సి¯Œ ్సతో సహా పర్యావరణ కారకాలు పిల్లలు ఎదుర్కొంటున్న ఆరోగ్య ప్రమాదాలను మరింత Mపెంచుతున్నాయి. జీవనశైలి కారకాలకు మించి, పిల్లల ఆరోగ్యం క్షీణించడంలో సామాజిక అంశాలు కూడా పాత్ర పోషిస్తాయి. సమగ్ర వికాసానికి ఈ హెల్త్ ఫార్ములా.. పాఠశాల పిల్లల్లో ఆరోగ్యాన్ని, సమగ్ర వికాసాన్ని పునర్నిర్వచించే లక్ష్యంతో ఈ 8–5–1–0 ఫార్ములా రూపొందింది. రోజుకి 8గంటల నిద్ర , 5 రకాల పండ్లు కూరగాయలు, 1 గంట వ్యాయామం, హాని కలిగించే ఆహారం, అలవాట్లను సున్నాకి చేర్చడం...అనేదే ఈ ఫార్ములా అంతరార్ధం. పోషకాహారం, వ్యాయామం, తగినంత విశ్రాంతిల మేలు కలయిక ఇది. తల్లిదండ్రులు పాఠశాలలకు ఆచరణాత్మక సాధనంగా ఉపయోగపడుతుంది. పిల్లలను సరైన ఆరోగ్యం వైపు నడిపిస్తుంది. దీని అమలులో భాగంగా జీవనశైలి మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇదొక అలవాటుగా మారడానికి కొంత వ్యవధి పడుతుంది. ఇది వారాల నుంచి నెలల వరకు ఉండవచ్చు. సాధారణంగా పెద్ద పిల్లల కంటే చిన్నారులు దీన్ని చాలా సులభంగా అలవరచుకోవచ్చు. . ఇంటి వాతావరణం తల్లిదండ్రుల ప్రమేయాన్ని బట్టి ఈ వ్యవధి ఆధారపడి ఉంటుంది. కొంతమంది పిల్లలు వారాల్లోనే అలవాటు పడతారు, మరికొందరికి నెలలు పట్టవచ్చు. ఆరోగ్య అక్షరాస్యత అవసరం... నేటి పాఠ్యాంశాల్లో ఆహార అక్షరాస్యత తప్పనిసరి అని అన్ని పాఠశాలల్లో ఏకాభిప్రాయం వచ్చింది. ఈ రౌండ్టేబుల్ సమావేశం 8–5–1–0 నియమాన్ని ఎలా అమలులోకి తీసుకురావాలి అనేదాన్ని చర్చించింది. దీని పట్ల పాఠశాలల నుండి స్పందన ప్రోత్సాహకరంగా ఉంది, కొన్ని పాఠశాలలు ఇప్పటికే వారి సాధారణ అభ్యాసాలు/తరగతులలో ఆరోగ్యకరమైన ఆహార సంస్కృతి పెంచేలా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆహార అక్షరాస్యతను పెంపొందించడానికి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పని చేయడానికి ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మనకు అవసరం. ఈ సందర్భంగా కంట్రీ డిలైట్ సహ వ్యవస్థాపకులు గాదె చక్రధర్ మాట్లాడుతూ దేశ భవితకు మూల స్థంభాల్లాంటి చిన్నారుల ఆరోగ్యకరమైన భవిత విషయంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములం కావాలనే ఉద్ధేశ్యంతోనే ఈ కార్యక్రమలో చేతులు కలిపామన్నారు. ఈ హెల్త్ ఫార్ములాను స్వాగతిస్తున్నామన్నారు. ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ నిర్వాహకులు పవన్ అగర్వాల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పాఠశాలలన్నింటికీ ఈ ఫార్ములా చేరువయ్యేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. ఇదీ చదవండి: జస్ట్ ఈమూడు వ్యాయామాలు చేయండి! బరువు తగ్గడం ఖాయం! -
హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కోవిడ్ 19 మహమ్మారి ఎదుర్కున్న తీరులో విఫలమైన నేపథ్యంలో రాబోయే మహమ్మారి పట్ల మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలని భావిస్తూ, తనకు అధికారాలు కావాలని కోరుతోంది. ప్రపంచ దేశాలను నిర్దేశించడానికి తనకు అధికారాలు పెంచడానికి అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు (ఐహెచ్ఆర్), ప్రపంచ మహమ్మారి ఒప్పందం హెచ్ఈఆర్పీ గురించి తన సభ్య దేశాలతో చర్చల ప్రక్రియను ప్రారంభించింది. ఈ మూడు దారుల ద్వారా తన అధికారాలరను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్యం మీద తన గుత్తాధిపత్యం స్థాపించుకోవడానికి, కొనసాగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మే 2024 కల్లా పూర్తి కావాలని భావిస్తోంది. వీటి ద్వారా అన్ని దేశాలలో ఆరోగ్యంపై జాతీయ ప్రణాళికలను శాసించే విధంగా ఈ ఒప్పందాలను తయారు చేస్తున్నారు. ముసాయీదా ఒప్పందాల గురించి చర్చించడం ప్రారంభించారు. అయితే, ఇది కేవలం ఆరోగ్య రంగం కాకుండా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆహారం తదితర రంగాలకు కూడా తన ‘ప్రభావం’ విస్తరించే ప్రయత్నంలో డబ్ల్యూహెచ్ఓ ఉంది. దీని వెనుక ఉన్న శక్తులు బిల్ గేట్స్, క్లాస్ శ్వాబ్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ) వంటి ప్రముఖులు ఉన్నారు. ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని, ఒక కొత్త ప్రాపంచిక వ్యవస్థను స్థాపించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. భారత దేశం కూడా ఈ చర్చలలో పాల్గొంటోంది. కానీ మన దేశంలో, పార్లమెంటులో దీనిపై చర్చ లేదు. కనీసం ప్రస్తావన కూడా చాల తక్కువ. పైగా చాలా మంది ప్రజలకు అసలు ఈ విషయం కూడా తెలియదు. ఈ విషయం మీద అవగాహన పెంచాల్సిన అవసరం మాత్రం ఉంది. భారత ప్రజాస్వామ్యాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఒక సమావేశం నిర్వహిస్తున్నారు అధికారులు. రౌండ్ టేబుల్ సమావేశం : డబ్యూహెచ్ఓ ప్రపంచ మహమ్మారి ఒప్పందం (Global Pandemic Accord): దేశ సార్వభౌమత్వానికి , పౌరుల హక్కులకు పొంచి ఉన్న విపత్తు తేదీ : 09-08-2023 సమయం : ఉదయం 10 - 2 గంటలకు ప్రదేశం : ఆడిటోరియం సెమినార్ హాల్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ & సోషల్ స్టడీస్ ( సెస్ ) బేగంపేట్, హైదరాబాద్ వక్తలు : ప్రొఫెసర్ కోదండరాం, డా. దొంతి నర్సింహ రెడ్డి, సరస్వతి కవుల ప్రెజెంటేషన్ తర్వాత ఓపెన్ ఫోరమ్ చర్చ. (చదవండి: మళ్లీ మహమ్మారి కొత్త వేరియంట్ కలకలం..భయం గుప్పెట్లో దేశాలు!) -
టెక్ పవర్హౌస్గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కువ సంఖ్యలో సాంకేతిక ఆధారిత (టెక్) ఉద్యోగాలను సృష్టించడం ద్వారా హైదరాబాద్ ‘టెక్ పవర్హౌజ్’గా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఎలక్ట్రానిక్స్, విమానయాన, అంతరిక్ష, రక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్, రవాణా, వస్త్రోత్పత్తి రంగాలకు తెలంగాణ నిలయంగా ఉందన్నారు. యూకే పర్యటనలో భాగంగా కేటీఆర్ శుక్రవారం లండన్లో భారత హైకమిషనర్ విక్రమ్ కె. దొరైస్వామి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు. వివిధ రంగాలకు చెందిన పెట్టుబడిదారులు పాల్గొన్న ఈ సమావేశంలో తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను కేటీఆర్ వివరించారు. పుంజుకున్న పారిశ్రామికీకరణ రాష్ట్రంలో ప్రాథమిక సమస్యలన్నింటిపైనా దృష్టి సారించి వాటి పరిష్కారానికి ప్రయత్నించామని కేటీఆర్ చెప్పారు. ఆవిష్కరణలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దీంతో వ్యవసాయం, ఐటీ మొదలుకొని అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధ్యమైందని, పారిశ్రామికీకరణ కూడా వేగం పుంజుకుందని తెలిపారు. ‘టీఎస్ఐపాస్ ద్వారా పారిశ్రామిక అనుమతుల విధానంలో పారదర్శకత, వేగం పెరిగాయి. హైదరాబాద్లోని ఆవిష్కరణల వాతావరణం, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు, స్టార్టప్లు, ప్రపంచ ప్రసిద్ధ కంపెనీల మూలంగా ఆయా రంగాల్లో అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకొచ్చే సంస్థలకు సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’అని కేటీఆర్ వెల్లడించారు. యూకే విద్యాసంస్థలు కింగ్స్ కాలేజ్, క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వంటి ప్రసిద్ధ సంస్థలతో తెలంగాణ చేసుకున్న భాగస్వామ్యాలను ఆయన ప్రస్తావించారు. భారత హై కమిషనర్ విక్రమ్ కే. దొరైస్వామి మాట్లాడుతూ.. భారీ యంత్రాలు, వైమానిక, రక్షణ, వినోద, విద్యారంగాల్లో యూకే కంపెనీలతో తెలంగాణ భాగస్వామ్యానికి అనేక అవకాశాలు ఉన్నాయని స్పష్టంచేశారు. తెలంగాణలో నూతన సచివాలయం, అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటుతో సహా తొమ్మిదేళ్లుగా సాధించిన ప్రగతిని బ్రిటిష్ భారత వ్యాపారవేత్త బిల్లీమోరియా ప్రస్తావించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్ర వెనుక బాటుతనంపై రౌండ్ టేబుల్ సమావేశం
-
అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో యాత్ర ఎలా?: చెట్టి ఫాల్గుణ
సాక్షి, అల్లూరి జిల్లా: విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుతోనే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తెలిపారు. వికేంద్రీకరణకు మద్దతుగా పాడేరులో గిరిజన సంఘాల అధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పార్టీలకతీతంగా అన్ని వర్గాలను ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. 'శ్రీకృష్ణ కమిషన్ కూడా వెనుక బడిన విశాఖ లో రాజధాని ఏర్పాటు చేయాలని సూచించిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి నినాదం అని మండిపడ్డారు. అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో ఎలా యాత్ర చేపడతారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాటలకు తలొగ్గి ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు వికేంద్రీకరణపై విమర్శలు చేస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులకు కూడా అమరావతి రాజధాని ఇష్టం లేదన్నారు. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు అయితే ప్రయోజనం ఉంటుందని టీడీపీ నేతల్లో కూడా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు మాటలు వినడం మాని ఇప్పటికైనా టీడీపీ నాయకులు బయటకు రావాలని కోరారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అంతటా అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. హైదరాబాద్ను విడిచి రావడంతో ఏపీకి నష్టం జరిగిందని ఆదివాసీ ఐక్యవేదిక అభిప్రాయపడింది. విభజన సమయంలోనే వికేంద్రీకరణ జరిగి ఉంటే అమరావతిలో పెట్టిన డబ్బు వృథా అయ్యేది కాదని స్పష్టం చేసింది. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని గిరిజన ఉపాధ్యాయ సంఘం తెలిపింది. గిరిజనుల అభివృద్ధి విశాఖ రాజధానితోనే సాధ్యమని, విశాఖ కేంద్రంగా రాజధాని సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. ఒకే చోట అభివృద్ధి ఎప్పటికైనా ప్రమాదకరని, గిరిజనులు ప్రాజెక్టుల కోస భూములు త్యాగం చేశారని గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తెలిపింది. అమరావతి రైతులు ఉచితంగా భూములు ఇవ్వలేదని పేర్కొంది. -
భారత్లో మరింత ఇన్వెస్ట్ చేయండి
టోక్యో: అపార వ్యాపార అవకాశాలు ఉన్న భారత్లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలంటూ జపాన్ కార్పొరేట్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో జపాన్ది చాలా కీలకపాత్ర అని ఆయన పేర్కొన్నారు. దీన్ని పురస్కరించుకుని ’జపాన్ వారోత్సవాల’ను నిర్వహించడంపై ప్రధాని ప్రతిపాదన చేశారు. జపాన్ పర్యటనలో భాగంగా వ్యాపార దిగ్గజాలతో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. 34 సంస్థల సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్లు దీనికి హాజరయ్యారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఉక్కు, టెక్నాలజీ, ట్రేడింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ తదితర రంగాల కంపెనీల ప్రతినిధులు వీరిలో ఉన్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. జపాన్ కంపెనీలు భారత్లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలని మోదీ ఈ సందర్భంగా ఆహ్వానించినట్లు వివరించింది. ‘టాప్ వ్యాపార సంస్థల సీఈవోలతో భేటీ అయ్యాను. భారత్లో పుష్కలంగా ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి వివరించాను‘ అని ప్రధాని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. హోండా, సుజుకీ, టయోటా వంటి ఆటోమొబైల్ సంస్థలు, సుమిటోమో కెమికల్, ఫ్యుజిత్సు, నిప్పన్ స్టీల్ కార్పొరేషన్, మిత్సుబిషి కార్పొరేషన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. చాలామటుకు కంపెనీలకు భారత్లో పెట్టుబడులు, కార్యకలాపాలు ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఎఫ్డీఐలు.. భారత్, జపాన్ సహజమైన భాగస్వాములని సమావేశం సందర్భంగా ప్రధాని చెప్పారు. భారత్–జపాన్ సంబంధాలు బలోపేతం అయ్యేందుకు వ్యాపార వర్గాలు బ్రాండ్ అంబాసిడర్ల పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) అంతర్జాతీయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) మందగించినా, భారత్లోకి రికార్డు స్థాయిలో 84 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. భారత ఆర్థిక వృద్ధి సత్తాపై ఇన్వెస్టర్లకు ఉన్న ధీమాకు ఇది నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చిలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక పెట్టుబడులను వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల ఎన్ల స్థాయికి పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయని ప్రధాని చెప్పారు. ఇటీవలి కాలంలో ఇండియా–జపాన్ ఇండస్ట్రియల్ కాంపిటీటివ్నెస్ పార్ట్నర్షిప్ (ఐజేఐసీపీ), క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ మొదలైన ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. -
బోస్టన్లో హెల్త్ కేర్ ఎట్ గ్లాన్స్ సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్
-
వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు: విష్ణువర్ధన్రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టులపై ఆదివారం బీజేపీ రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్రెడ్డి, నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకి వైఎస్ రాజశేఖర్రెడ్డి శంకుస్థాపన చేశారని, ఆ ప్రాజెక్టు కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులను చంద్రబాబు నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా కేంద్రం అండగా ఉంటుందన్నారు. అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాలను ప్రభుత్వం పరిష్కరించాలని విష్ణువర్ధన్రెడ్డి కోరారు. -
వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్టేబుల్ సమావేశం
సాక్షి, విజయవాడ : వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేధావులు, యువజన విద్యార్థి విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి మాట్లాడుతూ.. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న టీడీపీ నాయకులు చర్రిత హీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. బినామీ ఆస్తులను కాపాడుకోవడానికే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని 13 జిల్లాల స్వాగతిస్తున్నారని చెప్పారు. ప్రొఫెసర్ డాక్టర్ మెహబూబ్ షేక్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నా చంద్రబాబు మాత్రం డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవడానికే.. డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైనా చంద్రబాబుకు బుద్ధి రావడం లేదన్నారు. -
‘టీడీపీ ప్రభుత్వమే పంటలను తగులబెట్టించింది’
సాక్షి, తుళ్లూరు : గత టీడీపీ ప్రభుత్వమే రాజధానిలో పంటలను తగులబెట్టించిందని రైతు సంఘం నేత శేషగిరిరావు ఆరోపించారు. గురువారం తుళ్లూరులో రాజధాని రైతులు, కూలీలు ‘చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం’ పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శేషగిరిరావు మాట్లాడుతూ.. చంద్రబాబు బంధువులకు కూడా రాజధానిలో భూములున్నాయని విమర్శించారు. రాజధాని భూములను టీడీపీ నేతలు తమ గుప్పిట్లో పెట్టుకున్నారని.. తమ భూములన బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. రైతులను చంద్రబాబు భయంకరంగా మోసం చేశారని మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో టీడీపీ నేతలు అవినీతిని పాల్పడ్డారని విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ అంటూ రైతులకు నోటీసులు ఇచ్చారని.. భూమి ఇవ్వకపోతే రూ. 5లక్షలే ఇస్తామని చంద్రబాబు బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు గారడీ నుంచి ప్రజలు బయటకొచ్చారని తెలిపారు. సీఆర్డీఏలో ఎన్నో అవకతవకలు జరిగాయని.. రైతులకు చంద్రబాబు చేసిన అన్యాయాన్ని మరచిపోమని అన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు రూ. 58వేల కోట్లు దోచేశారని శేషగిరిరావు ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా తీయించారు : జోగి రమేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారని తెలిపారు. నాలుగున్నరేళ్లుగా అమరావతి పేరుతో చంద్రబాబు ఏమి సాధించారని ప్రశ్నించారు. బాహుబలి గ్రాఫిక్స్, విఠలాచార్య సినిమా జిమ్మిక్కులు చూపించారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ నివాసం అమరావతిలోనే ఉందని.. చంద్రబాబు మాత్రం హైదరాబాద్లో ఇళ్లు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాజధానిపై విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం చంద్రబాబుకు సిగ్గుగా లేదని నిలదీశారు. చంద్రబాబు అంటరానితనాన్ని ప్రోత్సహించారు : భాగ్యరావు దళిత హక్కుల పోరాట నేత మన్నెం భాగ్యరావు మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అంటరానితనాన్ని, వివక్షతను ప్రోత్సహించారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలోని రైతులకు న్యాయం చేయాలని ఆనాడూ ప్రభుత్వం దృష్టికి తీసుకోచ్చిన పట్టించుకోలేదని తెలిపారు. భారతదేశంలో రాజ్యాంగ ఉల్లంఘన చేసింది చంద్రబాబు ఒక్కరేనని విమర్శించారు. రాష్ట్రంలోని దళితులంతా సీఎం వైఎస్ జగన్ వెంట నడిచారని చెప్పారు. భారీగా తరలివచ్చిన రైతులు.. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, సీపీఐ నేతలు, పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. తమకు జరిగిన అన్యాయాన్ని రాజధాని రైతులు రౌండ్టేబుల్ దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని పేరిట చంద్రబాబు తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే ఉద్దేశంతోనే.. ఆయన పర్యటనలో నిరసన చేపట్టామని స్పష్టం చేశారు. -
మహమ్మారిలా డెంగీ..
సాక్షి, హైదరాబాద్: డెంగీ మహమ్మారిలా వ్యాప్తిచెందిందని పలువురు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మందికి డెంగీ జ్వరాలు సోకుతున్నాయని, తీవ్రత అధికంగా ఉండటం వల్ల వైద్యులు, ఆసుపత్రులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇటువంటి పరిస్థితి మరెక్కడైనా నెలకొని ఉంటే పరిస్థితిపై రోజూ కొన్ని బులెటిన్లు విడుదల చేసే వారని, కానీ ఇక్కడ మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదని వాపోతు న్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో, ఫాగింగ్ వంటి నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ‘డెంగీని ఎలా ఎదుర్కోవాలి’అనే అంశంపై గురువారం ఫ్లూచరిస్టిక్ సిటీస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న వైద్యులు పలు అభిప్రాయాలు వెల్లడించారు. పాఠశాలలు, కాలేజీల్లో డెంగీ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు విద్యార్థులు గ్లౌవ్స్, ఫుల్ ప్యాంట్ మొదలైన వాటితో యూనిఫాం ధరించడానికి అనుమతించాలని సూచించారు. జూన్ నుంచి వ్యాప్తి విస్తృతం..: డాక్టర్ వసంతకుమార్, అపోలో ఆసుపత్రి ‘డెంగీ ఉన్నట్లు అంగీకరించడం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన మొదటి పని. ఈ సంవత్సరం జూన్ నుంచి డెంగీ, చికున్ గున్యాలు విస్తృతంగా వ్యాపించాయి. ఏటా అనేక కేసులు వస్తున్నప్పటికీ గత 3 దశాబ్దాలుగా హైదరాబాద్లో ఇంతటి ఘోరమైన పరిస్థితి చూడలేదు.’ గర్భిణులపై తీవ్ర ప్రభావం: డాక్టర్ విజయలక్షి్మ, సీనియర్ గైనకాలజిస్ట్ ‘ప్రస్తుతం వస్తున్న కేసులు గతంలో ఇచి్చన మార్గదర్శకాలకు తగినట్లుగా లేవు. గర్భిణీలపై డెంగీ తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తస్రావం వల్ల తల్లీ బిడ్డలకు నష్టం జరుగుతుంది. డెంగీ పాజిటివ్ తల్లులకు ప్రసవించే శిశువులకు ఐసీయూలో చికిత్స, పర్యవేక్షణ తప్పనిసరి’ హోమియోపతి మద్దతు తీసుకోవాలి: డా.శ్రీనివాసరావు, కేంద్ర ఆయుష్ ‘హోమియోపతి ద్వారా స్వైన్ఫ్లూను నియంత్రించగలిగాం. డెంగీ నియంత్రణకు హోమియోపతి మద్దతు కూడా తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం ఎపిడమిక్ సెల్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’ అందరమూ బాధ్యత వహించాలి: డా.విజయానంద్, చిల్డ్రెన్స్ స్పెషలిస్టు ‘డెంగీ మహమ్మారిలా వ్యాపించింది. దీనికి మనమంతా బాధ్యత వహించాలి. ప్రభుత్వం, కొందరు ప్రజలు డెంగీని అత్యంత క్యాజువల్గా తీసుకుంటున్నారు. ఇది మరింత నష్టాన్ని కలిగిస్తుంది. వర్షాకాలం ముందు నుంచే చర్యలు తీసుకోవాలి. ప్రజలను చైతన్యం చేయాలి. డెంగీ వస్తే ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోవాలని బాధితులే కోరుతున్నారు. అవసరమా లేదా అనేది వైద్యుడు నిర్ణయించాలి. కానీ ప్రజల్లో భయాందోళనలు పెరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది’ -
టీడీపీ ఎమ్మెల్యే సూరి చర్యపై మానవ హక్కుల సంఘాలు సమావేశం
-
‘చట్టసభల్లో బీసీ ప్రతినిధుల సంఖ్య పెరగాలి’
సాక్షి, హైదరాబాద్ : చట్టసభల్లో బీసీ ప్రతినిధుల సంఖ్య పెరగాలని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన జాతీయ ఓబీసీ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బండారు దత్తాత్రేయ, పొన్నాల లక్ష్మయ్య, ఎల్ రమణ, దేవేందర్ గౌడ్లతో పాటు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. చైతన్యం ద్వారానే మార్పు సాధ్యమని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో శాస్త్రీయత లేకుండా గత ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని విమర్శించారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు ఆ దిశలో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీలంతా ఒకేతాటి పైకి రావాలని పిలుపునిచ్చారు. బీసీలకు రాజ్యాధికారం రావాలన్నారు. ఓటుకు నోటు ఇస్తున్నారు.. అయినా బీసీ సామాజిక వర్గానికే ఓటు వేయాలని కోరారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒత్తిడి పనిచేస్తోంది.. ఒత్తిడితోనే మన హక్కులు సాధించుకోవాలన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు ఎదగాలని అకాంక్షించారు. -
వైఎస్సార్ జిల్లాకు ఉక్కు పరిశ్రమ సాధనే ధ్యేయం
సాక్షి, తిరుపతి : ‘‘కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు’’ అని, వైఎస్సార్ జిల్లాకు ఉక్కు పరిశ్రమ సాధనే ధ్యేయమని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు ఉద్ఘాటించాయి. శుక్రవారం ‘కడప ఉక్కు పరిశ్రమ సాధన’ అంశంపై తిరుపతిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వామపక్షాలతోపాటు పలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. రానున్న రోజుల్లో అందరిని కలుపుకుని ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ఐక్యవేదిక ప్రకటించింది. కేంద్రం తీరని అన్యాయం చేసింది కడప : ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం తీరని అన్యాయం చేసిందని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పి. రామసుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం వైఎస్సార్ కడప జిల్లాలో అఖిలపక్షం చేపట్టిన ఉక్కు ఉద్యమానికి ఏపీయూడబ్ల్యూజే తరపున ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖిలపక్షం చేపట్టే ప్రతి ఆందోళనలో పాల్గొంటామన్నారు. జర్నలిస్టు యూనియన్గా జిల్లా ప్రజలకు అండగా ఉంటామన్నారు. -
కేంద్రం దిగ్గొచ్చే వరకు పోరాటం..
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై కేంద్రం దిగ్గొచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని హోదా సాధన సమితి ప్రకటించింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చించడానికి హోదా సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సినీ నటుడు రాంకీ, ప్రొఫెసర్ సదాశివరెడ్డితో పాటు 13 జిల్లాల నుంచి ఉద్యమ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం హోదా సాధన సమితి సభ్యులు ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. మే 22న అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో దీక్ష శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రామ పంచాయితీ స్థాయి నుంచి హోదాకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని నిర్ణయించామని.. ఇందుకు అనుకూలంగా తీర్మానాలు చేయని వారిని ఉద్యమ ద్రోహులుగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు జూన్లో గానీ, జూలైలో గానీ బస్సు యాత్ర చేపట్టడంతోపాటు.. బహిరంగ సభలు కూడా నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగ్గొచ్చేలా ఒక మెరుపు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంతిమ పోరాటానికి సిద్ధం కావాలి : రామకృష్ణ ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు అంతిమ పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ రామకృష్ణ పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నేరవేర్చలేదు. ఉత్తరాంధ్ర ప్యాకేజీ నిధుల సంగతి ఇప్పటి వరకు తేలలేదు. జూన్లో విద్యాసంస్థలు ప్రారంభమయ్యాక విధ్యార్థులు రోడ్డెక్కె పరిస్థితి నెలకొంది. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు హోదా సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. అలా చేస్తేనే ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. 20 వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో హోదా దీక్షలు ప్రారంభమవుతాయి.. ఆగస్టు 15లోపు శుభవార్త వినాలంటే.. హోదా ఉద్యమాన్ని ఇప్పటినుంచే మరింత తీవ్రతరం చేయాలి’ అని అన్నారు. ఏపీకి నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోం : చలసాని బీజేపీ నేతలు రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఇబ్బంది లేదు కానీ.. ఏపీకి నష్టం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ..‘త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేయబోతున్నాం. హోదా అంశాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దానిపై సలహాలు, సూచనలు స్వీకరించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అందరు కలిసి ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. ఏపీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉద్యమం చేస్తే బాగుంటుంది. ప్రజాభిష్టానికి తలవంచే సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యమ బాట పట్టారు’ అని తెలిపారు. -
నీటి సమస్యను పరిష్కరించుకుందాం
-జీడీపీ నుంచి కోడుమూరుకు మంచినీటి పైపులైన్ అవసరం - రూ. 56 కోట్లతో నాబార్డుకు ప్రతిపాదనలు -అఖిలపక్ష పారీ్టల నేతల రౌండ్టేబుల్ సమావేశంలో ఎంపీ బుట్టా రేణుక కోడుమూరు రూరల్: పార్టీలకతీతంగా కలసి కట్టుగా మంచినీటి సమస్యను పరిష్కరించుకుందామని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. శనివారం ఎంపీ కోడుమూరులో నెలకొన్న మంచి నీటి సమస్యపై స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో అఖిలపక్ష పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన కోడుమూరులో నెలకొన్న నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి కోడుమూరుకు మంచినీటి పైపులైన్ నిర్మాణం చేపట్టడమొక్కటే మార్గమన్నారు. కోడుమూరు, చుట్టు పక్కల గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ. 56కోట్లు అవసరమని నాబార్డుకు ప్రతిపాదనలు పంపామన్నారు. గడిచిన మూడేళ్లల్లో కోడుమూరు నియోజకవర్గంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు, అభివృద్ధి పనులకు రూ.2.17కోట్ల నిధులను ఖర్చు చేశామన్నారు. అన్ని పార్టీల నేతలు కలసి వస్తే నీటి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని ఎంపీ సూచించారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో నిరుద్యోగం, నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేస్తే సాగు, తాగునీటి ఇబ్బందులు ఉండవన్నారు. తన పార్లమెంట్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతి సంవత్సరం పుస్తకం ముద్రిస్తున్నట్లు చెప్పారు. -
సదస్సు నిర్వహించే అర్హత ఎక్కడిది?
రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎంపై పలువురు మహిళా నేతల మండిపాటు సాక్షి, అమరావతి: ‘మహిళల హక్కులను ఏమాత్రం కాపాడలేని ముఖ్యమంత్రి చంద్రబాబుకు జాతీయ మహిళా పార్లమెంటు సదస్సును నిర్వహించే అర్హత, హక్కు ఏమాత్రం లేదని మహిళా సంఘాలు గొంతెత్తాయి. విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత–సవాళ్లు’అనే అంశంపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, ప్రభుత్వ నేతల తీరుపై విరుచుకుపడ్డారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడిన శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళలకు తప్పుడు వాగ్దానం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర రాజధానిలో నిర్వహించే జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు మాత్రం డ్వాక్రా గ్రూపు సభ్యులకు ప్రాతినిథ్యం లేకుండా చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో చేసిన తీర్మానాలపై శుక్రవారం నుండి మూడు రోజుల పాటు నిర్వహించే జాతీయ మహిళా పార్లమెంటు సమావేశంలో చర్చించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేంలో మాజీ పార్లమెంటు సభ్యురాలు చెన్నుపాటి విద్య మాట్లాడుతూ మహిళలు సంఘటితం కావాలన్నారు. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో రాష్ట్రానికి చెందిన మహిళా నేతలకు ప్రాతినిథ్యం కల్పించకపోవడం దురదృష్టకరమని చంద్రబాబు పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నా చర్యలేవని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి తన ప్రసంగంలో నిప్పులు చెరిగారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయమనీ మహిళాలోకానికి ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎఫ్డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అక్కినేని వనజ డిమాండు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి పి.శ్రీలక్ష్మి మాట్లాడుతూ డ్వాక్వా రుణమాఫీ పేరుచెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు తర్వాత అమలు చేయకుండా మహిళల్ని మోసం చేశారన్నారు. ఇతర మహిళా నేతలు కూడా తమ ప్రసంగాల్లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
జిల్లాల విభజన ఏ ప్రాతిపదికన?
హైదరాబాద్: ఏ ప్రాతిపదికన జిల్లాలను విభజిస్తున్నారో అర్థం కావడం లేదని, ఇది ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాల విభజన ప్రాతి పదికను ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభిప్రాయాలను చెప్పేందుకు నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే విభజన నిర్ణయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల ప్రాంతాల విషయంలో షెడ్యూల్ 5, భూరియా కమిటీ సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఆదివాసీలు అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్నారని, 1/70 చట్టం అమలు కావడం లేదని అన్నారు. రాజ్యాంగంలో గిరిజనులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, కేసీఆర్కు నిజమైన ప్రేమ ఉంటే గిరిజనులకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డియాండ్ చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ.. రాష్ర్టంలో 12 శాతం ఉన్న ఆదివాసీలు స్వయంపాలిత జిల్లాలు కావాలని ఎంతోకాలం నుంచి డిమాండ్ చేస్తున్నా, విస్మరించడం బాధాకరమన్నారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. ముందు తరాల కోసం ప్రకృతి సంపదను కాపాడుతున్న ఆదివాసీల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ర్ట సాధన కంటే ఇది ప్రజాస్వామికమైన డిమాండ్ అన్నారు. కెచ్చల రంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, టీడీపీ రాష్ర్ట నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్, కరుణం రామకృష్ణ, ఆర్ఎస్పీ నాయకుడు జానకి రాములు, న్యూ డెమోక్రసీ నాయకుడు పోటు రంగారావ్, ఆదివాసీ నాయకులు వట్టం నారాయణ, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు ఝాన్సీ, సూర్యం, ఎం. హన్మేష్, గౌతం ప్రసాద్, ఎస్ఎల్ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుదాం
– 15న సామూహిక నిరాహారదీక్ష – రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం పిలుపు తిరుపతి కల్చరల్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంతవరకు పోరాడుదామని, ఈనెల 15న సామూహిక నిరాహారదీక్షను చేపట్టనున్నట్లు అఖిల పక్ష నేతలు పిలుపునిచ్చారు. సీపీఎం ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం... ప్రత్యేక హోదా సాధిద్దాం’ అనే అంశంపై తిరుపతి యశోదనగర్లోని ఎంబీ భవన్లో సోమవారం అఖిలపక్ష నాయకుల రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ ప్యాకేజీ జేబులు నింపుకోవడానికి ఉపయోగపడుతాయే తప్ప రాష్ట్రాభివృద్ధి కాదన్నారు. మోదీ, బాబు తిరుపతి ఎన్నికల సభలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి నేడు నిరాకరించడం దగాకోరుతనమేన్నారు. ప్యాకేజీ తాత్కాలిక భిక్ష మాత్రమేనని, హోదా శాశ్వత పరిష్కారమన్నారు. ప్రత్యేక హోదా కోసం వామపక్షాలతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ విభజనకు కారకులు బీజేపీ, టీడీపీ నాయకులే అన్నారు. వీరే ప్రత్యేక హోదాను విస్మరించడం దుర్మార్గమన్నారు. హోదాకు చట్ట సవరణ చేయాల్సిన పని లేదని, ప్రధానే ఇవ్వచ్చని రాజ్యంగంలో ఆ వెసులుబాటు ఉందన్నారు. కేజీ బేసిన్ గ్యాస్ ద్వారా వచ్చే 50 శాతం నిధులను ముఖ్యమంత్రి ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లను బతికించే దశగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె.కుమార్రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం బంద్ చేపడితే అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, పోలీసుల రాజ్యం నడుస్తోందన్నారు. ప్రభుత్వాల మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించేందుకు రాజకీయాలకు అతీతంగా పోరాడదామని పిలుపు నిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు మాట్లాడుతూ పోలీసులు నిర్భందాలతో ఉద్యమాలను ఆపలేరని చంద్రబాబుకు హెచ్చరిక చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత ప్రభాకర్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఉద్యమిస్తామని తెలిపారు. జనసేన పార్టీ నేత కిరణ్రాయల్ మాట్లాడుతూ హోదా కోసం పవన్ కల్యాణ్ కట్టుబడి ఉన్నాడని, ప్రభుత్వ తీరును బట్టి పోరాటాలు రూపకల్పన చేసి ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా అనేక ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. అనంతరం ఈనెల 15న సామూహిక నిరాహారదీక్ష చేపట్టాలని రౌండ్టేబుల్ సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో సీపీఎం సీపీఐ నగర కార్యదర్శులు సుబ్రమణ్యం, చిన్నం పెంచలయ్య, బీసీ సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మయ్య, సీఐటీయూ చంద్రశేఖర్రెడ్డి, డీవైఎఫ్ఐ జయచంద్ర, ఐద్వా సాయిలక్ష్మి, పీఎన్ఎం నేత శ్రీనివాసులు, నవసమాజ ఫెడరేషన్ నాయకుడు నరేష్, వైఎస్ఆర్సీపీ నేతలు మణి, రాజేంద్ర, సాకం ప్రభాకర్, ఐఎన్టీయూసీ అనూషా, పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. -
‘డిండి ఎత్తిపోతల’ను వ్యతిరేకిద్దాం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్) : పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించతలపెట్టిన డిండి ఎత్తిపోతలను వ్యతిరేకిద్దామని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలకు భవిష్యత్తులో కృష్ణానదీ నీళ్లు తప్ప మరో అవకాశం లేదన్నారు. రైతాంగానికి సాగునీరు, యువతకు ఉపాధి కోసమే జిల్లా ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, డిండి ఎత్తిపోతలతో జిల్లాకు నష్టం జరిగితే తిరగబడతారన్నారు. ఈ విషయంపై ఈనెల 23వ తేదీన టీఎన్జీఓ భవన్లో వివిధ సంఘాలతో రౌండ్ టేబుల్సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో రాఘవాచారి, రామకృష్ణరావు, బాల్కిషన్ తదితరుల పాల్గొన్నారు. -
హంద్రీ-నీవాతోనే జిల్లా సస్యశ్యామలం
► డిస్ట్రిబ్యూటరీలను వెంటనే నిర్మించాలి ► ఆయకట్టుకు నీటి సాధన కోసం ఐక్య పోరాటం ► రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతలు అనంతపురం రూరల్ : హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తేనే జిల్లా సస్యశ్యామలం అవుతుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అయితే.. ఈ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తోందని దుయ్యబట్టారు. సోమవారం అనంతపురంలోని ఎన్జీవో హోంలో హంద్రీ-నీవా డిస్ట్రిబ్యూటరీ పనులను ప్రారంభించి జిల్లాలోని 3 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న డిమాండ్తో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అఖిలపక్ష నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ హంద్రీ-నీవా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని గుర్తు చేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించి.. రూ.6,800 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ప్రస్తుత బడ్జెట్లో హంద్రీ-నీవాకు రూ.558 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని చూస్తే ఈ ప్రాజెక్టుపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.12వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. దీనిద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్న చంద్రబాబు ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీల నీరు అందించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే హంద్రీనీవా పనులు వేగవంతంగా పూర్తవుతాయన్నారు. బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించినప్పటికీ హంద్రీ-నీవాను పూర్తి చేసి అనంతపురం జిల్లాకు నీరందిస్తామంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే పట్టిసీమను పక్కన పెట్టి హంద్రీనీవాను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోలేదన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి పట్టిసీమ వైపు మొగ్గు చూపారని విమర్శించారు. హంద్రీ-నీవా ద్వారా జిల్లాలోని ప్రతి ఎకరా ఆయకట్టుకు నీరందించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం జిల్లాకు చేస్తున్న అన్యాయంపై ప్రజలను చైతన్యపరచి ఐక్యఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవా పనులకు రీ టెండర్లు పిలిచి ఐదు రెట్లు ఎక్సెస్కు టీడీపీ అనుయాయులకు కేటాయించారని విమర్శించారు. జిల్లాలో 87వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో 33వప్యాకేజీ కింద భూసేకరణ చేపట్టిన టెండర్లను సైతం రద్దు చేశారన్నారు. కుప్పంకు నీరు తీసుకుపోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన కాలువ పనులను మాత్రమే వేగవంతం చేయిస్తున్నారని విమర్శించారు. సీపీఐ సీనియర్ నేత రమణ మాట్లాడుతూ జిల్లా నాయకులు రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి పార్టీలకు అతీతంగా ఆయకట్టుకు నీటి సాధన కోసం ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతు ఆత్మహత్యలను నివారించడం కోసం ప్రతి ఎకరాకు సాగు నీరు తీసుకువచ్చే లక్ష్యంతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ నాయకుడు కేవీ రమణ, అఖిల పక్ష నాయకులు జాఫర్, రంగారెడ్డి, కదలిక ఇమామ్, పెద్దన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఈశ్వరయ్య, శరత్చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చింతమనేనిని అరెస్ట్ చేయూలి
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ ఏలూరు (మెట్రో) : అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ శుక్రవారం విరుచుకుపడిన ఘటనను మహిళా, కార్మిక, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది. శనివారం జిల్లా ఐద్యా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు జి.విజయలక్ష్మి అధ్యక్షతన రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐద్యా జిల్లా నాయకురాలు జి.విమల మాట్లాడుతూ చింతమనేని జీవితం రౌడీయిజంతో ముడిపడి ఉందన్నారు. తల్లిదండ్రులను కష్టపెట్టటం, కిడ్నాప్ చేసి వివాహం చేసుకోవటం వంటివి ఆయన జీవిత చరిత్రలో ఓ భాగమని చెప్పారు. ఉపయోగించుకుని వదిలిపెట్టేసే వ్యక్తి చింతమనేని అని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తిని చట్టసభలోకి ఎందుకు పంపించారో అర్ధం కావడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు గంపల బ్రహ్మావతి మాట్లాడుతూ ఇటువంటి వారి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఎం జిల్లా అధ్యక్షులు బి.బలరామ్ మాట్లాడుతూ చింతమనేనికి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. టీడీపీకి మహిళలపై ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే అతనిని అరెస్ట్ చేయాలన్నారు. రౌడీషీటర్, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి ఆ పార్టీ పదవులు కట్టబెట్టడం తగదన్నారు. తక్షణమే అంగన్వాడీలకు క్షమాపణ చెప్పాలన్నారు. మున్నుల జాన్గుర్నాథ్ మాట్లాడుతూ రౌడీలతో, గూండాలతో చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారనడానికి చింతమనేని తీరే నిదర్శనమన్నారు. ఐద్వా జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారిత గురించి ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి వెంటనే చింతమనేనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
రైతు ఆత్మహత్యలపై రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత తోపాటు పలువురు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జాగృతి సంస్థ ఆదుకుంటుందని కవిత స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు పిల్లలను చదివిస్తామని చెప్పారు. పంటబీమా విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత నిబంధనలు మార్చాలని కోరారు. 2009 తర్వాత చోటు చేసుకున్న పరిణామాల వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని కవిత పునరుద్ఘాటించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టి.జేఏసీ ఛైర్మన్ కోదండరాం కోరారు. రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను ప్రభుత్వం సమీక్షించాలన్నారు. తక్షణమే రైతులకు రూ.5 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. -
హక్కుల సాధనకు గౌడ కులస్తులు ఏకం కావాలి: పొన్నం
హైదరాబాద్: గౌడ కులస్తులంతా ఏకతాటిపైకి వచ్చి తమ హక్కులను సాధించుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శనివారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో తెలంగాణ గౌడ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హజరైన పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌడ కులస్తుల సంక్షేమానికి చిన్నాచితకా సంఘాలు కాకుండా అన్ని సంఘాలు ఒకే గొడుగు కిందికి వచ్చి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సాక్షాత్తూ మంత్రి అయ్యి ఉండి విస్కీ తాగితే ఆయుష్షు పెరుగుతుందని చెప్పడం సబబు కాదని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావునుద్దేశించి అన్యాపదేశంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పోలీసులకు అధికారం ఇచ్చి దాడులు చేయించి గౌడ కులస్తులను అణచివేసే కుట్ర చేస్తోందన్నారు. ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు నర్సగౌడ్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లే లక్ష్మణ్గౌడ్, ప్రధాన కార్యదర్శి శశిధర్రావు, ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్తో పాటు 10 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాతో ప్రగతి సాధ్యం
స్పష్టం చేసిన నాయకులు ప్యాకేజీ సరికాదని వాదన వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష పార్టీ నాయకులు,,న్యాయవాదులు, ప్రొఫెసర్లు, విద్యార్థి నాయకులు, మేధావులు గళమెత్తారు. బీచ్రోడ్డులోని ఓ హోటల్లో శ నివారం వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో వీరంతా ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు.. ప్రత్యేక హోదా వల్ల కలిగే అభివృద్ధ్ది.. ప్యాకేజీ వల్ల వచ్చే నష్టాలను విశ్లేశించారు. ప్యాకేజీ అధికార పార్టీ జేబులు నింపడానికి తప్ప ప్రజలకు ఒరిగేదిలేదని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కంపా హనోకు, జాన్వెస్లీ, ప్రచార కమిటి నాయకులు రవిరెడ్డి, ట్రేడ్ యూనియన్నాయకులు మస్తానప్ప, నాయకులు సత్తి రామకృష్ణ్ణారెడ్డి, న్యాయవాదులు బీవీఆర్ మూర్తి, సత్యనారాయణ ప్రొఫెసర్ జాన్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. - పెదవాల్తేరు (విశాఖ) చేతులెత్తేసిన కేంద్ర.. రాష్ర్ట ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ,టీడీపీ విభజన హామీలిచ్చాయి. అధికారంలోకి వచ్చాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ప్రత్యేక హోదా కావాలని అడిగిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీయే. ప్రత్యేక హోదా వస్తేనే నిరుద్యోగ యువతికి ఉపాధి కలుగుతుంది. ప్యాకేజీ వస్తే టీడీపీ నాయకుల ఆస్తులు పెరుగుతాయే తప్ప రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు. - మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు చేతులెత్తేసిన కేంద్ర.. రాష్ర్ట ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ,టీడీపీ విభజన హామీలిచ్చాయి. అధికారంలోకి వచ్చాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ప్రత్యేక హోదా కావాలని అడిగిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీయే. ప్రత్యేక హోదా వస్తేనే నిరుద్యోగ యువతికి ఉపాధి కలుగుతుంది. ప్యాకేజీ వస్తే టీడీపీ నాయకుల ఆస్తులు పెరుగుతాయే తప్ప రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు. - మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాటమార్చిన టీడీపీ అన్ని జిల్లాల ప్రజలు హైదరాబాద్ వెళ్లి ఆర్ధిక రాజధానిగా ఎదగడానికి కష్టపడ్డారు. విభజనతో హైదరాబాద్తో ఉన్న సంబంధాలు తెగిపోయాయి. సోనియాగాంధీ, చంద్రబాబు వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని సోనియా చెప్పారు. ప్రత్యేక హోదా తెస్తామని టీడీ పీ హామీ ఇచ్చి మాట మార్చి ప్యాకేజీ అనడం సరికాదు. - ఒ.ఆర్.రెడ్డి, మాజీ ఉపకులపతి ప్యాకేజీ ఐస్ముక్క ప్యాకేజీ ఐస్ముక్కలాంటిది. ప్రజల వద్దకు వచ్చేసరికి కరిగిపోతుంది. ఎలాంటి అభివృద్ధి ఉండదు. ప్రత్యేక హోదా వల్ల పన్నుల్లో రాయితీలు కలిగి పరిశ్రమలు వస్తాయి. ఐటి అభివృద్ధి పెరిగి పారిశ్రామికంగానే కాకుండా నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుంది. ప్రత్యేక హోదాతో రాష్ట్రాభివృద్ధి జరిగితే ఆ క్రెడిట్ అధికార పార్టీకే చెందుతుంది. - ప్రసాద్రెడ్డి, ఫ్రొఫెసర్ హామీ నెరవేర్చాలి రాష్ట్ర విభజన ప్రజలు కోరుకోలేదు. పదిహేనేళ్ల ప్రత్యేక హోదా, రూ.5లక్షల కోట్లు ప్యాకేజీ తెస్తామని టీడీపీ ఇచ్చిన విభజన హామీని నెరవేర్చాలి. - సూరప్పడు, ప్రొఫెసర్ కేంద్రంపై ఒత్తిడి తేవాలి మేధావుల మౌనం జాతికి శాపం. ప్రత్యేక హోదా పక్కన పెట్టి ప్యాకేజీ కావాలని అడుగుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక గురించి మరిచిపోయారు. అధికార పార్టీ ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలి. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. - బాబు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు -
నేడు లండన్కు స్పీకర్ కోడెల బృందం
హైదరాబాద్: వాతావరణ మార్పులతో పాటు పర్యావరణ అంశాలపై జరిగే రౌండ్ టేబుల్ సమావే శంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు నేతృత్వంలోని బృందం ఆరు రోజుల పర్యటనకై శనివారం బ్రిటన్ రాజధాని లండన్కు వెళ్లనుంది. వాతావరణ మార్పుల వల్ల సమాజానికి జరుగుతున్న నష్టంపై చర్చించేందుకు నిర్వహించే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా బ్రిటిష్ హైకమిషన్ ఆహ్వానించింది. బ్రిటన్ ప్రభుత్వ ఇంధన, వాతావరణ మార్పుల శాఖ, యూకే కార్బన్ ట్రస్ట్ నిర్వహించే ఈ సమావేశంలో కోడెలతో పాటు రాష్ర్ట అటవీ పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శాసనసభ ఇన్చార్జి క్యాదర్శి కె.సత్యనారాయణ, 8 మంది ఎంపీల బృందం పాల్గొననుంది. -
ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చడం తగదు
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించి నీటిని మళ్లించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్రం మొత్తమ్మీద గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాణహిత నీటిని గాటుకు కట్టి.. కాళేశ్వరం నుంచి నీటిని తీసుకొని నిధులను ఎత్తిపోస్తారా? అని సూటిగా ప్రశ్నించింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు సరిగా జరగనందువల్లే తుమ్మిడిహెట్టిపై ఆ రాష్ట్రం అభ్యంతరాలు లేవనెత్తిందని.. ఇప్పటికైనా సీఎం సుహృద్భావ చర్చలకు పూనుకోవాలని సమావేశం సూచించింది. తప్పుడు నివేదికలిచ్చిన ‘వ్యాప్కోస్’పై న్యాయ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నీళ్లపై అనుమానాలను నివృత్తి చేయాలన్న ఉద్యమకారులను పిచ్చోళ్లు, సన్నాసులు అన్న కేసీఆర్.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. తుమ్మిడిహెట్టి వద్దే ప్రాణహిత పథకాన్ని చేపట్టాలని తీర్మానం చేసింది. గురువారం ప్రాణహిత-చేవెళ్ల-కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదనలపై తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ నేతృత్వంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. దీనికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, టీడీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, బీజేపీ తరఫున ప్రేమ్చంద్రారెడ్డి, రిటైర్డ్ జడ్డి జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ జల సాధన సమితి నేత నైనాల గోవర్ధన్, న్యూడెమోక్రసీ నేత వెంకటేశ్వర్రావు, ఓయూ జేఏసీ నేతలు దుర్గం భాస్కర్, ఆదిలాబాద్ జిల్లా నేతలు, ఉద్యమకారులు పాల్గొన్నారు. ‘రాష్ట్రంలోని సహజ వనరులన్నింటినీ తాను, హరీశ్, కేటీఆర్, కవిత పంచుకుంటే నాల్గున్నర కోట్ల జనాలకు పంచినట్లే అన్న ధోరణి కేసీఆర్లో కనిపిస్తోంది. ఇది సరికాదు. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి వద్దే బ్యారేజీ కట్టాలి’ - మల్లు భట్టి విక్రమార్క ‘20 శాతం పనులు చేస్తే పూర్తయ్యే ప్రాజెక్టులను విస్మరించి కొత్త ఎత్తిపోతలు చేపట్టే అవసరం ఏమొచ్చింది. కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారు’ - పెద్దిరెడ్డి, టీడీపీ ‘తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి వరకు నీటిని తరలించవచ్చు. అదే కాళేశ్వరం అయితే నీటిని ఎత్తిపోయాలి. నిధులు ఎత్తిపోసేందుకే కాళేశ్వరం అంటున్నారు కేసీఆర్’ - నైనాల గోవర్ధన్, జల సాధన సమితి ‘తుమ్మిడిహెట్టి వద్ద చిన్న బ్యారేజీ, కాళేశ్వరం వద్ద మరో బ్యారేజీ అంటే మొత్తంగా రూ. 37 వేల కోట్లు ఖర్చు కాదా? కాబట్టి తుమ్మిడిహెట్టి వద్దే బ్యారేజీ నిర్మించాలి. - తమ్మినేని వీరభద్రం, సీపీఎం ‘2008లో ఒకమారు ఓ నివేదిక ఇచ్చి ఇప్పుడు దాన్నే తప్పు పడుతూ మరో విధంగా మాట్లాడుతున్న వ్యాప్కోస్పై న్యాయ విచారణ జరిపించాలి’ - జస్టిస్ చంద్రకుమార్ -
విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.
-
విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు
* ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏపీ సీఎం తీరుపై పాత్రికేయుల ఆగ్రహం * అర్ధరాత్రి టీ చానల్కు నోటీసులు ఇవ్వడంపై మండిపాటు * నోటీసులు ఉపసంహరించు కోవాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారని, తెలుగు ప్రజలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీనియర్ పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే శుక్రవారం అర్ధరాత్రి టీ న్యూస్ చానల్కు నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు. శనివారమిక్కడ టీ న్యూస్ చానల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలు చానళ్లకు చెందిన సీఈఓలు, పత్రికా ప్రతినిధులు, సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు యూనియన్ నాయకులు చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రెస్అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం కావాలని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు. ఈ కేసులో చంద్రబాబు అవినీతి బాగోతాలను బయటపెట్టిన టీ న్యూస్ చానల్కు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. వెంటనే నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ... తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసుకోవాలంటే ప్రజల్లోకి వెళ్లి మన్నన పొందాలే తప్ప ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే నేరస్తులు అవుతామనే చిన్న లాజిక్ను కూడా చంద్రబాబు తెలుసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చర్యలను చూస్తుంటే దేశంలో మరోసారి ఎమర్జెన్సీ నిజంగానే వచ్చేలా కనిపిస్తోందన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు నేరం నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నందునే.. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్రెడ్డి మాట్లాడుతూ... నోటీసులు ఇచ్చిన తీరు, అంతకుముందు జరిగిన రాజకీయ ప్రకటనలు చూస్తే ఆధిపత్యంతో దాడిచేసి లొంగదీసుకోవడానికి చూసే పక్రియలా కనిపిస్తోందన్నారు. టేపులు బయటకు వచ్చి రెండు వారాలు గడుస్తున్నా అది తన గొంతో కాదో ఇప్పటివరకూ చెప్పకుండా ఓ మీడియా సంస్థకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. 6టీవీ సీఈవో శైలేశ్రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు టీ చానల్కు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్, టీ న్యూస్ సీఈవో నారాయణరెడ్డి, గౌరీ శంకర్ (దక్కన్ క్రానికల్), ఆర్.రవికాంత్రెడ్డి (ద హిందూ), ఈశ్వర్రెడ్డి(ఆంధ్రభూమి) క్రాంతి కిరణ్ (జై తెలంగాణ), పల్లెరవికుమార్, విరాసత్ఆలీ తదితరులు పాల్గొన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళన: టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్యలు తెలిపారు. -
బీజేపీ, టీడీపీ దొందూ దొందే
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అనంతపురం సిటీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ, టీడీపీ దొందూ దొందేనని వక్తలు ఎద్దేవా చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో గురువారం ఏపీకి ప్రత్యేక హోదా-రాయల సీమకు ప్రత్యేక ప్యాకేజీ-జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరుతూ సీపీఎం నగరకమిటీ కార్యదర్శి నాగేంద్ర అధ్యక్షతన రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఒ.నల్లప్ప, సిపిఐ నగర కార్యదర్శి లింగమయ్య, నరసింహులు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్రెడ్డి, డాక్టర్ వీరభధ్రయ్య, సీఐటీయూ నాయకులు సూర్యనారాయణ, ముష్కిన్, గోపాల్, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు ఊరికే ఉంటాయా అంటూ దాటవేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్కు రావాలని ఇతర దేశాల్లో అడుక్కుంటున్న చంద్రబాబు ప్రత్యేకహోదా గురించి అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రాజెక్టుల గురించి ఆలోచించలేద న్నారు. ప్రస్తుతం నిధులు కేటాయించకుండా కాలువగట్లపై నిద్ర పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాయలసీమకు అన్యాయం చేసి కోస్తాను తన పార్టీకి పెట్టని కోటగా మార్చుకునేందుకు బాబు యత్నిస్తున్నాడన్నారు. పట్టిసీమకు రూ.1300 కోట్లిచ్చి, హంద్రీ-నీవాకు కేవలం 200 కోట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నీరు చెట్టు పేరుతో కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్న చంద్రబాబు అదే సొమ్మును కాలువల నిర్మాణానికి పెడితే బాగుంటుందని హితవు పలికారు. ఎన్నికల సమయంలో టీడీపీ పెట్టిన ఖర్చును రాబట్టుకోవడానికి చూస్తున్నారే తప్ప రాయలసీమకు నీరివ్వాలి, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా తేవాలన్న తపన ఏ కోశానా లేదన్నారు. ముందు ముందు పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
రాజధాని రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం
►రాజ్యాంగ విరుద్ధంగా జీవోల జారీ ►రౌండ్టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు విజయవాడ : రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని, రాజ్యాంగ విరుద్ధంగా జీవోలు జారీ చేస్తోందని పలువురు వక్తలు ఆరోపించారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో రాజధాని భూములు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా గురువారం రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అవసరం లేకపోయినప్పటికీ రైతులనుంచి వేల ఎకరాల భూమిని బలవంతంగా లాగేసుకుంటున్నారన్నారు. రాజ్యాంగ విరుద్దంగా జీవోలు జారీ చేసి రైతులను మోసగిస్తోందన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 1.39లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీచేయకుండా నిరంతరం రాజధాని చుట్టూ పాలకులు చక్కర్లు కొడుతున్నారన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ 109, 110 ,166.జీవోలతో ప్రభుత్వ మోసం బయటపడిందన్నారు, సీపీడిఎంసీ పేరుతో కంపెనీ పాలనకు తెరధీశారని మండిపడ్డారు. కంపెనీ పేరును తర్వాత కార్పొరేషన్గా ప్రభుత్వం మార్పు చేసిందన్నారు. రైతులు తమకు అంగీకారం ఉంటేనే భూముఇలివ్వండని నమ్మబలుకుతూ మరో వైపు బెదిరింపులకు దిగుతున్నారన్నారు. కార్పొరేషన్ పాలన అమల్లోకి వస్తే ప్రతి పనికి పన్ను వసూలు చేస్తారన్నారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ రాజధాని పేరుతో భూములు సమీకరించి కంపెనీలకు ధారదత్తం చేస్తున్నారన్నారు. తులసీదాసు మాట్లాడుతూ క్రెడా చట్టం ప్రకారం భూములు సేకరించి కార్పొరేషన్కు అప్పగించడం ద్వారా ప్రభుత్వం పూర్తి ప్రజావ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. భూములు కోల్పోతున్న రైతుల పక్షాన ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎంల్) న్యూడెమోక్రసీ నాయకుల పోలారి, సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి జె.వి.రాఘవులు, రాజధాని ప్రాంత కన్వీనర్ రాధాకృష్ణ, సీపీఐ నాయకులు, వై కేశవరావు, కోటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను అడ్డుకోవాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న భూములను 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తే రానున్న కాలంలో భూములిచ్చిన రైతులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి దాపురిస్తోందన్నారు. అంతా కలిసి ప్రభుత్వా నిర్ణయాలకు వ్యతిరేకంగా సమైక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎం విజయ్కుమార్, గంగాధరరావు, శ్రీనివాస్, జి వీరాంజనేయులు, మల్నిడి ఎలమందరావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు భూ ఆర్డినెన్స్పై రౌండ్ టేబుల్ సమావేశం
కడప అగ్రికల్చర్ : రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే భూ ఆర్డినెన్స్పై బుధవారం ఉదయం కడప నగరంలోని ఎద్దుల ఈశ్వరరెడ్డి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామసుబ్బారెడ్డి, జి చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలను, మేధావులను ఆహ్వానించామన్నారు. ప్రయివేట్ భాగస్వామ్య ప్రాజెక్టులకు 80 శాతం పచ్చని వ్యవసాయ భూములను లాక్కొనేందుకు రంగం సిద్ధమైందని, దీనిపై రాజ్యసభలో కూడా చర్చ సాగుతోందని పేర్కొన్నారు. ఈ తరుణంలో రైతులు కూడా వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. -
పీఆర్సీ వెంటనే అమలు చేయాలి
ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ డిమాండ్.. ముఖ్యమంత్రిని కలసి నివేదించాలని తీర్మానం పీఆర్సీ, హెల్త్కార్డులపై పీఆర్టీయూ రౌండ్ టేబుల్ సమావేశం హెల్త్కార్డులు జేబులో పెట్టుకునేందుకే పరిమితమయ్యాయని విమర్శ సాక్షి, హైదరాబాద్: పదో వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) సిఫార్సులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలవాలని తీర్మానించింది. పదో పీఆర్సీ, హెల్త్కార్డులు తదితరల అంశాలపై శుక్రవారం పీఆర్టీయూ భవన్లో వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఇందులో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ.. హెల్త్కార్డులు జేబులో పెట్టుకునేందుకే పరిమితమయ్యాయని, పీఆర్సీ అమల్లో జాప్యంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొందన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ.. పీఆర్సీ అమలుకు, ఉద్యోగుల విభజనకు సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో 3.5 లక్షల మంది ఉద్యోగులు, 2.7 లక్షల మంది పెన్షనర్లు పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. గతేడాది జూలై 1నుంచి ఆర్థిక లాభం వర్తింపజేయాలని సీఎంను ఇప్పటికే కోరినట్లు చెప్పారు. హెల్త్ కార్డుల అమలుపై కార్పొరేట్ ఆసుపత్రులతో సంప్రదింపుల బాధ్యతను ముఖ్యమంత్రి... డిప్యూటీ సీఎం రాజయ్యకు అప్పగించారని చెప్పారు. సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదనరెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు శివశంకర్, సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గుప్తా, ఎయిడెడ్ కళాశాలల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజమహేందర్రెడ్డి, డీటీఎఫ్ అధ్యక్షుడు నారాయణరెడ్డి, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు చంద్రప్రకాశరావు, పీఆర్టీయూ(టీఎస్) ప్రధాన కార్యదర్శి సరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం తీర్మానాలివే.. పీఆర్సీ అమలుకు జేఎసీ పక్షాన సీఎం కేసీఆర్ను కలవడం 63 శాతం ఫిట్మెంట్తో గత జూలై నుంచి ఆర్థిక లాభం కోరడం ప్రతి మూడేళ్ల సర్వీసుకు ఒక వెయిటేజీ ఇంక్రిమెంట్ వర్తింపు మహిళా ఉద్యోగులకు రెండేళ్ల చైల్డ్కేర్ లీవ్ మంజూరు ఉద్యోగుల తల్లి లేదా తండ్రి మరణిస్తే 11 రోజుల ప్రత్యేక సెలవు హెల్త్కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలయ్యేలా చర్యలు -
ఏపీ రాజధానిపై ఏకపక్ష నిర్ణయం తగదు
జనచైతన్య వేదిక సమావేశంలో మేధావుల మనోగతం తిరుపతి: ఏపీ రాజధాని ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. రాజధాని కోసం పంటపొలాల విధ్వంసాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. తిరుపతిలోని యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘ఏపీ రాజధాని-భూసేకరణ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ భూసమీకరణ ద్వారా కాకుండా భూసేకరణ చట్టం 2013ను అనుసరించి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా రాజధాని ఏర్పాటు జరగాలన్నారు. రాజధాని ప్రాంతంలో కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. వాస్తు లాంటి మూఢ నమ్మకాలతో రాజధాని ఎంపిక తగదన్నారు. కార్పొరేట్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు వేలాది ఎకరాలు దోచిపెట్టే భూయజ్ఞాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రాజధాని ఎంపిక శాస్త్రీయంగా జరగలేదన్నారు. పంట భూములను విధ్వంసం చేసి రాజధానిని నిర్మించే ప్రయత్నం మంచిది కాదని స్పష్టం చేశారు. కార్పొరేట్ సంస్థలకు ఎర్ర తివాచీ పరిచే సింగపూర్ లాంటి పట్టణాలు మనకు అవసరం లేదన్నారు. రాజధాని పేరుతో సన ్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల ప్రయోజనాలను హరిస్తే ఉద్యమాలు తప్పవన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి మాట్లాడుతూ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చుచేసి ఆకాశాన్ని అంటే మేడలు నిర్మించాల్సిన అవసరం కానీ, హైదరాబాద్ లాంటి నగరాన్ని కోరుకోవాల్సిన అవసరం కానీ లేదని అన్నారు. పరిపాలన సౌలభ్యంగా రాజధాని ఉంటే చాలన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం నాయకుడు ఆదికేశవులు రెడ్డి మాట్లాడుతూ రాజధాని ఏర్పాటుకు వ్యవసాయేతర బంజరు, బీడు, ప్రభుత్వ భూములను వాడుకోవాలన్నారు. పంట పొలాలను లాగేసుకుని రైతులు కడుపులు కొట్టడం మంచి పద్ధతి కాదన్నారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి వద్ద నిరుపయోగంగా ఉన్న 4,500 ఎకరాల ప్రభుత్వ భూముల్లో రాజధానిని ఎందుకు నిర్మించరాదని ప్రశ్నించారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కందారపు మురళి ప్రసంగిస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏదో అద్భుతాలు జరగ బోతున్నట్లు ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ వెనుక రూ.6 లక్షల కోట్ల కుంభకోణం దాగి ఉందని, ఎన్నికల్లో తనకు సహాయ పడిన వారికి లబ్ధి చేకూర్చేందుకే చంద్రబాబు అవసరాలకు మించి భూములు సేకరిస్తున్నారని ఆరోపించారు. రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మాంగాటి గోపాల్రెడ్డి మాట్లాడుతూ రాజధాని కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న భూసమీకరణ విధానానికి చట్టబద్ధత లేదన్నారు. భూముల అప్పగింత విషయంలో రాజీ పడితే సత్యవేడు ఎస్ఈజెడ్ రైతులకు వచ్చిన కష్టాలే తుళ్లూరు రైతులకు వస్తాయన్నారు. రాయలసీమకు అనాదిగా జరుగుతున్న అన్యాయాల పరంపరలో భాగంగానే రాజధాని ఏర్పాటు నిర్ణయం జరిగిందని సీనియర్ పాత్రికేయులు రాఘవశర్మ అన్నారు. ప్రొఫెసర్ సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ సీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని అడిగే హక్కు సీమ ప్రజలకు ఉందన్నారు. రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ మాట్లాడుతూ రాజధాని అవసరమేనని అయితే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.అంజయ్య మాట్లాడుతూ ఒక సామాజిక వర్గానికి ప్రయోజనం కల్పించే దృక్పథంతో రాజధాని నిర్మాణం జరుపుతున్నారని ఆరోపించారు. సీపీఎం నాయకుడు వి నాగరాజు, ఊట్ల రంగనాయకులు, రామ్మూర్తి రెడ్డి, జేఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.నవీన్కుమార్రెడ్డి, విద్యార్థి నాయకులు హరిప్రసాద్ రెడ్డి, కాటంరాజు, రాజశేఖర్రెడ్డి, హేమంత్ యాదవ్ పాల్గొన్నారు. -
విభజన సమస్యలపై పోరుబాట
తెలంగాణ ఉద్యోగ సంఘాల నిర్ణయం ♦ 18 ఎఫ్ రద్దు చేసే వరకు పోరాటం ♦ ఈనెల మూడో వారంలో చలో ఢిల్లీ ♦ గ్రూపు-1 అధికారుల సంఘం రౌండ్టేబుల్ భేటీలో తీర్మానం ♦ నేడు సీఎంను కలవనున్న ఉద్యోగ సంఘాల జేఏసీ సాక్షి, హైద రాబాద్: ఉద్యోగుల విభజన సమస్యలపై పోరాట పంథానే కొనసాగించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. స్థానికత ఆధారంగా ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పని చేసేలా చర్యలు చేపట్టాలని సంఘాలు డిమాండ్ చేశాయి. తెలంగాణలో మంజూరైన పోస్టుల కంటే ఉద్యోగులు తక్కువగా ఉంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉద్యోగులను నియమించేలా విభజన మార్గదర్శకాల్లో పొందుపరిచిన 18 ఎఫ్ నిబంధనను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు విభజన సమస్యలపై లోతుగా చర్చించారు. స్థానికత ఆధారంగానే విభజన జరిగేలా మార్గదర్శకాల్లో మార్పుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకురావాలని నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీ ప్రసాద్ మాట్లాడుతూ విభజన సమస్యలను బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపైనా ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల మూడో వారంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమస్యలను ఎంపీల ద్వారా పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఉద్యోగుల వివరాలను పూర్తిగా ఇవ్వని విభాగాధిపతులపై క్రిమినల్ చర్యలతోపాటు క్రమశిక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే ఏ మార్పులు అయినా చేస్తామని కేంద్రం చెప్పిందని, ఇందుకు ఆంధ్రప్రదేశ్ ముందుకు రావాలని అన్నారు. కాని ఆ ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగినా ఆంధ్రా ఉద్యోగులంతా తెలంగాణలోనే ఉండేలా దుర్బుద్ధిని ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. 9, 10వ షెడ్యూళ్లలోని ఉమ్మడి సంస్థలకు చెందిన వేల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ఇష్టారాజ్యంగా వినియోగిస్తోందని, ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని అన్నారు. ఉమ్మడి నిధులపై రెండు రాష్ట్రాలకు అధికారం ఉంటుందన్న జ్ఞానం కూడా లేకుండా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆంధ్రా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఏపీ సచివాలయం ముందు ధర్నా చేస్తామన్నారు. ఆంధ్రా విభాగాధిపతుల కింద పని చేసేందుకు ఒప్పుకునేది లేదని, ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలోనే పని చేసేలా మార్పులు వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తీవ్రమైన పోరాటం చే స్తామన్నారు. గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ జోనల్, మల్టి జోనల్ ఉద్యోగుల విభజనపై రెండు రాష్ట్రాలు విధానపర నిర్ణయం తీసుకోవాలన్నారు. అక్రమంగా వచ్చిన వారిని ఆంధ్రాకు పంపించాలని, ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ వారిని ఇక్కడకు తీసుకురావాలని అన్నారు. 18 ఎఫ్ను రద్దు చేయకపోతే భవిష్యత్తులో తెలంగాణ ఉద్యోగం అనేది లేకుండాపోతుందని, ఇక్కడి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు శివశంకర్, ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ మధుసూదన్రెడ్డి, టీజీవో సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, బీసీ వెల్ఫేర్ విభాగం ఇన్చార్జి డెరైక్టర్ ఆలోక్, సీటీవో శశిధర్, ఆడిట్ ఆఫీసర్ ర మేష్, విద్యుత్ జేఏసీ కన్వీనర్ శివాజీ, హరిత, నవనీతరావు, మణిపాల్రెడ్డి ప్రసంగించారు. -
ఆర్టీసీ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
- రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ, కార్మిక నేతలు - నిరవధిక సమ్మెకు మద్దతు కాకినాడ సిటీ : ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 11 నుంచి వివిధ డిమాండ్లపై రాష్ట్రంలోని 13 జిల్లాల్లో చేపట్టనున్న నిరవధిక సమ్మెకు సంఘీభావం కోరుతూ ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కాకినాడలోని ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ భవనంలో రాజకీయ, కార్మిక సంఘాల నాయకులతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పెదిరెడ్డి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సబ్బతి ఫణీశ్వరరావు, ఏపీఎన్జీఓ సంఘ రాష్ట్ర కార్యదర్శి బూరిగ ఆశీర్వాదం, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు జె.వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎంఎల్) నాయకులు వి.రామయ్య, సీఐటీయూ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, అజయ్కుమార్, ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు గుత్తుల ఈశ్వరరావు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.హనుమంతరావు పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీ పరిరక్షణ కోరుతూ చేపట్టనున్న నిరవధిక సమ్మెకు రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు తమ మద్దతును ప్రకటించారు. ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిన ఆర్టీసీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి డిమాండ్ల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టి సమ్మెను నివారించాలని కోరారు. ప్రభుత్వం వివిధ పద్ధుల కింద ఆర్టీసీకి బకాయిపడ్డ రూ.రెండు వేల కోట్లను తక్షణం విడుదల చేయాలని, ఆర్టీసీని ప్రైవేటీకరణ చర్యలు మానుకోవాలని, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాల్సిన సొమ్ము వెంటనే విడుదల చేయాలని, ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవడానికి మంత్రులు, అధికారులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని తదితర 11 డిమాండ్ల తీర్మానాలను చర్చించి సమావేశంలో ఆమోదించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి పి.సత్యానందం, రీజనల్ అధ్యక్షుడు ప్రసాద్, కాకినాడ డిపో కార్యదర్శి ఆర్.ఇందేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘ముంపు’ గోడు పట్టని కేసీఆర్
పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాల్సిందే: ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పూర్తిగా విఫలమయ్యారని, పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లోని ప్రజల సమస్యలను విస్మరించారని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు విమర్శించారు. శనివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ సామాజిక న్యాయ ప్రజాస్వామిక ఫ్రంట్ ఆధ్వర్యంలో ‘పోలవరం ముంపు గ్రామాలు -హైదరాబాద్ నగరంలో గవర్నర్ పాలన, విప్లవ సంస్థలపై నిషేధం’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్రావు మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ చల్లబడి పోయారని విమర్శించారు. ముంపు గ్రామాల ప్రజల అభిప్రాయాలు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం దుర్మార్గమన్నారు. ఈ విషయంపై ముఖ్య మంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక 175 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వంలో గవర్నర్కు అత్యధిక అధికారాలు ఇవ్వడం అన్యాయమన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామిక హక్కుల్ని కాల రాయడం హేయమైన చర్య అని అన్నారు. ప్రజాసంఘాలు, మావోయిస్టులపై విధించిన నిషేధాన్ని గులాబీ ప్రభుత్వం ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎం.ధర్మారావు మాట్లాడుతూ ఆది వాసీలను ముంచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఉద్యమాలు చేపట్టాలన్నారు. హైకోర్టు అడ్వొకేట్ కె.చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్టేబుల్ సమావేశంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు సూర్యం, సీపీఐ నాయకులు ఎన్.జ్యోతి, మాజీ ఎంపీ ఆర్.రాంచంద్రయ్య, తెలంగాణ ప్రజా సమితి ప్రధాన కార్యదర్శి జి.సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని కోసం రణం చేద్దాం
- సీమలో రాజధాని ఏర్పాటు చేయాలని నినదించిన నేతలు - సమైక్యంగా ఉద్యమించాలని పిలుపు - ప్రొద్దుటూరులో రౌండ్టేబుల్ సమావేశం ప్రొద్దుటూరు: రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేసేంతవరకు ఉద్యమానికి సన్నద్ధం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. శ్రీబాగ్ ఒడంబడిక మేరకు రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ యునెటైడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో స్థానిక పద్మశాలీయ కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే రాయలసీమ వాసులం ఎంతో నష్టపోయామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని ఏర్పాటు కోసం వెంటనే కార్యాచరణ చేపట్టాలన్నారు. దీనికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. తాను రాజధాని సాధనకోసం ఎంత వరకైనా పోరాడతానన్నారు. ముందుగా అందరం కలిసి ప్రధానమంత్రికి విన్నవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం మనం మేల్కొనకపోతే మళ్లీ నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ గతంలో సాగునీటికి సంబంధించి అటు కర్నాటక, ఇటు మహారాష్ట్రలతో పోరాటం చేయాల్సి వచ్చేదని, ప్రస్తుతం తెలంగాణ కూడా ఇందుకు తోడైందన్నారు. శ్రీశైలం ద్వారా 13 జిల్లాలకు సాగు నీరు అందుతోందన్నారు. కడపలో హైకోర్టును ఏర్పాటు చేయాలని, ఫార్మా కంపెనీలను నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. రిమ్స్ను అప్గ్రేడ్ చేసి ఎయిమ్స్గా మార్చాలని, ఎర్రచందనం, బెరైటీస్లతో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కోరామన్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ గతంలో మనకు చాలా అన్యాయం జరిగిందని, అప్పుడు పోరాటాలు చేయలేకపోయామన్నారు. నాడు ఉద్యమ స్ఫూర్తితో తుపాకి గుండ్లకు ఎదురొడ్డి పోరాటం చేశారని, నేటి పరిస్థితులు వేరుగా ఉన్నాయని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్థాయిని 12వేల నుంచి 44వేల క్యూసెక్కులకు పెంచారని తెలిపారు. 1983లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, చీఫ్ ఇంజనీర్ శివరామకృష్ణ ద్వారా కమిటీ వేసి సాగునీటిపై శ్రద్ధ చూపించారన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఉండేల గురివిరెడ్డి మాట్లాడుతూ రతనాల సీమ రాయలసీమ నేడు అన్ని విధాలా దోపిడీకి గురైందన్నారు. విద్య, వైద్యం, అన్నింటా నష్టం జరిగిందన్నారు. ఐక్యంగా అందరం కలిసి పోరాటం చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని కోరుతూ ఉద్యమం చేసేందుకు సమయం ఆసన్నమైందన్నారు. కోస్తా వారితో రాయలసీమ వాసులం తరచూ నష్టపోతున్నామన్నారు. కోస్తాలో 25.70 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుండగా రాయలసీమలో 2 లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతోందన్నారు. అలాగే మనకు కేవలం 670 పరిశ్రమలు మాత్రమే ఉండగా కోస్తాలో 1918 పరిశ్రమలు ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమలో రాజధాని ఎందుకు ఏర్పాటు చేయకూడదో తెలపాలన్నారు. అన్నింటికి విజయవాడే అనుకూలమని టీడీపీ ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. మనకు రోడ్డు మార్గాలు బాగున్నాయని, రవాణాకు అనుకూలంగా ఉందని, భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా లేదన్నారు. తమ అధినేత జగన్మోహన్రెడ్డిని కలిసి సమస్యను వివరిస్తామన్నారు. తద్వారా రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలతో చర్చించి వారితో ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్ఎస్ఎఫ్ కన్వీనర్ భాస్కర్ మాట్లాడుతూ కోస్తాలో సాగు నీటి ద్వారా ఏటా 8వేల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. అక్కడ 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుండగా సాగునీటి అవకాశం కూడా వారికే ఉందన్నారు. రాయలసీమలో 600 మి.మీ. వర్షం పాతం ఉండగా సాగు నీరు కూడా లేక కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నామన్నారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ఎక్కడా కూడా రాష్ట్ర రాజధాని రాష్ట్రం మధ్యలో లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. కాంగ్రెస్పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గొర్రె శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా పరిషత్ల వరకు రాజధాని సాధన కోసం తీర్మానాలు చేయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజా ఉద్యమానికి అందరూ సహకరించాలని కోరారు. ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఆలస్యం అయిందని, వెంటనే ఉద్యమానికి సిద్ధం కావాలని కోరారు. ఉద్యోగులంతా ఇందుకు సహకరించాలన్నారు. రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ ఎన్నెస్ ఖలందర్ మాట్లాడుతూ శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం తొలుత అందరం చెన్నైలోని కాశీనాథుని నాగేశ్వరరావు ఇంటికి వెళ్లాలన్నారు. అక్కడి నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని సూచించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజారామ్మోహన్రెడ్డి, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి చెన్నా రాఘవేంద్రనాథ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రామయ్య, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి,ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ కోశాధికారి టీవీ రమణారెడ్డి, రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి చిప్పగిరి ప్రసాద్, కౌన్సిలర్ పిట్టా శ్రీనివాసులు, ఎస్టీయూ నాయకులు శ్రీనివాసులు, రషీద్ఖాన్, రచయిత జింకా సుబ్రమణ్యం, ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ రమణారెడ్డి, షేక్షావల్లి తదితరులు ప్రసంగించారు. -
సీమాంధ్ర అభివృద్ధి అన్ని నగరాల్లో ఉండాలి
సీమాంధ్రను అన్ని రంగాల్లో.. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి తప్ప ఏదో ఒక్క నగరానికే అభివృద్ధి పరిమితం కాకూడదని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర అభివృద్ధిపై ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఇన్నాళ్లూ అలా కేవలం ఒక్క హైదరాబాద్ నగరానికి మాత్రమే అభివృద్ధి పరిమితం కావడం వల్లే సమస్యలు వచ్చాయని, అలా ఇకముందు జరగకుండా చూడాలని అన్నారు. సీమాంధ్ర జిల్లాల్లో సమతుల్యత పాటించాలని, కేంద్రం ప్రకటించిన... నాయకులు చెబుతున్న ప్యాకేజీలన్నీ మోసపూరితమని శాంతా బయోటిక్స్ అధినేత వరప్రసాద్ రెడ్డి అన్నారు. సింగపూర్లా కేవలం ఒకే నగరాన్ని అభివృద్ధి చేస్తే ఎలాగని, అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. -
విదేశీ కుట్రను తిప్పికొట్టండి
బెంగళూరు, న్యూస్లైన్ : తెలుగు తల్లిని నిలువునా చీల్చాలని చూస్తున్న విదేశీవని త కుట్రను తిప్పి కొట్టాలని పలువురు వ క్తలు అభిప్రాయపడ్డారు. బెంగళూరులో ని ఎంజీ రోడ్డులో ఉన్న అజంతా హోట ల్లో కర్ణాటక తెలుగు ప్రజా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర రౌండ్ టేబుల్ సమావేశం విజ యవంతమైంది. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి మాట్లాడుతూ... 1947లో మనకు స్వతంత్య్రం వచ్చినా ఫలితం లేకపోయిందని, ఇప్పటికీ విదేశీయులు చెప్పిన విధంగానే మన భారత ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నివసించే హక్కు ప్రతి భారతీయుడికీ ఉందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత సీమాంధ్ర వాసులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇప్పటి నుంచే ఒత్తిడి పెట్టడం చాలా బాధకరమని అన్నారు. తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం దక్కలేదన్న అక్కసుతో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారని గుర్తు చేశారు. ఒక ఎకరా పొలంలో పంట పండించి రూ. కోటి సంపాదిస్తున్నట్లు కేసీఆర్, ఆ నైపుణ్యం ఏమిటో బహిర్గతం చేస్తే రైతులందరూ మూకుమ్మడిగా బాగుపడతారని అన్నా రు. ఎకరా పొలంలో వ్యవసాయం ద్వా రా రూ. కోటి సంపాదించే రైతు ఈ ప్ర పంచంలోనే లేడని, అదే నిజమైతే తెలంగాణ ఎలా వెనుకబడిందో కేసీఆరే చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ను లూటీ చేసేందు కే కేసీఆర్ లాంటి దొరలు తెలంగాణ వా దాన్ని వినిపిస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక తెలుగు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బెల్లం రమణ చౌ దరి మాట్లాడు తూ... హైదరాబాద్ అభివృద్ధి సీమాం ధ్రుల వల్లనే సాధ్యమైందని అన్నారు. కర్ణాటక వైఎస్ఆర్ యువ వేదిక కార్యదర్శి డాక్టర్ రసూల్ మాట్లాడుతూ.. ని యంతలుగా వ్యవహిం చిన వారు చరి త్రలో బాగుపడిన దాఖలా లు లేవని గు ర్తు చేశారు. రాాష్ట్ర విభజనకు వత్తాసు పలుకుతున్న వారికి ఇదే గతి పడుతుంద ని హెచ్చరించారు. అనంతరం వక్తల అభిప్రాయాలను లిఖితపూర్వకం గా స్వీకరించారు. వీటి ద్వారా సుప్రీం కో ర్టును ఆశ్రయించనున్నట్లు బొందు రామస్వా మి తెలిపారు. సమావే శం ప్రారంభానికి ముందు మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద చోటు చేసుకున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటనలో మృ తి చెం దిన కోటె వెంకటేష్ యాదవ్కు ని వాళులర్పిం చా రు. సమావేశంలో కేటీపీఎ స్ నాయకులు బాబు రాజేంద్రకుమార్, శివకుమార్, హ లసూరు విజయకుమా రి, ప్రతాప్, వరలక్ష్మి, సునీత, అంబరీష్రెడ్డి, జీ వరలక్ష్మి, రామచంద్ర, కర్ణాటక వైఎస్ఆర్ యువ వేదిక అధ్యక్షుడు సు రే ష్, సుందర్, తెలుగు కళావికాసిని కా ర్యదర్శి శ్రీధరరావు, లావణ్య, చిత్తూరుకు చెందిన టీడీపీ నేత వెంకటరమణ, రాము, ముఖర్జీ, చౌడప్ప, దానం పాల్గొన్నారు. -
భద్రాచలం తెలంగాణదే: రౌండ్ టేబుల్లో తీర్మానం
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం తెలంగాణలో అంతర్భాగంగానే ఉండాలని తెలంగాణ మహిళా రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. టీఆర్ఎల్డీ అధ్యక్షురాలు కె.ఇందిరా దిలీప్కుమార్ అధ్యక్షతన హైదరాబాద్లో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో.. సంధ్య(పీవోడబ్ల్యూ), సొగరా బేగం(టీఆర్ఎల్డీ), అనితారెడ్డి, సంధ్య, సత్యలక్ష్మి (డాక్టర్స్ జేఏసీ), మల్లీశ్వరి (టీచర్స్ జేఏసీ), జూపాక సుభద్ర (రచయిత్రి), వాణి (విద్యుత్ జేఏసీ)తోపాటు ఎమ్మెల్సీలు కె.దిలీప్కుమార్, చుక్కా రామయ్య, ప్రొఫెసర్లు కేశవరావు జాదవ్, లక్ష్మణ్, తెలంగాణ రచయితల వేదిక చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్పై ఆంక్షలు పెట్టకుండా, భద్రాచలంతో కూడిన సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలని సదస్సు తీర్మానించింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేసింది. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని.. పెండింగ్లో ఉన్న అన్ని తెలంగాణ ప్రాజెక్టులను కేంద్ర నిధులతోనే పూర్తిచేయాలని కోరింది. -
ప్రజా ఉద్యమాలతో మీడియా ఎంతో నేర్చుకోవాలి
హైదరాబాద్, సాక్షి : మీడియాను సమాజం నుంచి వేరుచేసి చూడరాదని, ప్రజా ఉద్యమాలను చూసి మీడియా పాఠాలు నేర్చుకోవాలని సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలు-ఉద్రిక్తతలు-మీడియా పాత్ర అనే అంశంపై బుధవారం హైదరాబాద్, బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో దిలీప్రెడ్డి ప్రసంగించారు. హైదరాబాద్ జర్నలిస్టుల యుూనియున్ (హెచ్యుూజే) ఆధ్వర్యంలో విశాలాంధ్ర ఎడిటర్ శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రవుంలో దిలీప్రెడ్డి వూట్లాడుతూ, వాస్తవాలను ప్రతిబింబించే విధంగా వార్తలు ఉండాలని, విశ్వసనీయత పత్రికలకు ఊపిరివంటిదన్నారు. వివిధ రకాల మీడియాలో వస్తున్న వార్తలను ప్రజలు విడగొట్టి వురీ చూస్తున్నారని, ఏది ఒప్పో ఏది తప్పో గ్రహిస్తున్నారని అన్నారు. ప్రజాశక్తి పత్రిక ఎడిటర్ తెలకపల్లి రవి మాట్లాడుతూ మీడియా సంస్థలు సత్యనిష్ట, సమతూల్యత, సమభావం పాటించాలని, ఉద్రిక్తతను పెంచేలా వ్యవహరించరాదని, ఏకపక్ష ధోరణలు చూపరాదన్నారు. ప్రింట్ మీడియా సర్కులేషన్ కోసం, ఎలక్ట్రానిక్ మీడియా రేటింగ్ కోసం,రాజకీయ నాయకులు ఓటింగ్ కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. ఎన్టీవీ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాస్రావు మాట్లాడుతూ మీడియూ పరిధులను దాటి వ్యవహరిస్తున్నదని, ఇది సరికాదన్నారు. టీఎన్ఎన్ చానల్ ప్రతినిధి పాశం యాదగిరి మాట్లాడుతూ జర్నలిజానికి కుల, మత విచక్షణ ఉండరాదని, ఏకపక్షంగా వ్యవహరిచడం సరికాదని అన్నారు. నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ వూట్లాడుతూ, తెలంగాణ వారు తెలంగాణలో వివక్షకు గురవుతున్నారని, హైదరాబాద్లో ఏపీఎన్జీవోల సభకు అనుమతించిన ప్రభుత్వం, తెలంగాణ వాదుల ర్యాలీకి అనుమతించకపోవడం అవమానకరవున్నారు. ఐజేయుూ ప్రధాన కార్యద ర్శి దేవులపల్లి అమర్ మాట్లాడుతూ, అబద్ధాల పునాదులపై రాష్ట్ర విభజన జరుగుతోంద న్న మీడియూ వాదన సరికాదన్నారు. యజవూన్యాల వైఖరి కారణంగా జర్నలిస్టుల మధ్య చీలికలు రాకూడదన్నారు. కార్యక్రవుంలో హెచ్ఎంటివీ కోఆర్డినేటర్ వి. రహత్, హెచ్యుూజే అధ్యక్షుడు యాదగిరి, సీనియర్ పాత్రికేయులు శైలైష్ రెడి ్డ తదిరులు పాల్గొన్నారు.