second day
-
పులివెందులలో రెండో రోజు.. బిజీబిజీగా వైఎస్ జగన్ (ఫొటోలు)
-
రెండో రోజు మనదే జోరు
భారత గడ్డపై టెస్టు మ్యాచ్ అంటే ప్రతీ విదేశీ జట్టుకూ సవాలే... బంగ్లాదేశ్కు కూడా అది తొలి టెస్టు తొలి రోజే చాలా వరకు అర్థమైంది. రెండో రోజుకు వచ్చేసరికి బంగ్లా పూర్తిగా చేతులెత్తేసింది. తొలి రోజు ఆట ఆరంభంలో పదునైన బౌలింగ్తో భారత్ను ఇబ్బంది పెట్టిన బంగ్లా ఆ తర్వాత టీమిండియా జోరుకు తలవంచింది. శుక్రవారం కూడా భారత్ చివరి నాలుగు వికెట్లను త్వరగా తీసిన ఆనందం ముగియక ముందే మన పేసర్ల దెబ్బకు జట్టు కుప్పకూలింది. బంగ్లా పతనంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఫాలో ఆన్ ఆడించకుండా మళ్లీ బ్యాటింగ్కు దిగిన రోహిత్ బృందం ఆధిక్యం ఇప్పటికే 300 దాటింది... మ్యాచ్ తీరు చూస్తే మూడో రోజే ముగిసినా ఆశ్చర్యం లేదు...రెండో రోజు ఆటలో ఇరు జట్లు కలిపి మొత్తం 17 వికెట్లు కోల్పోవడం చెప్పుకోదగ్గ అంశం. చెన్నై: బంగ్లాదేశ్తో తొలి టెస్టుపై భారత్ రెండో రోజే పట్టు బిగించింది. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 47.1 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌటైంది. షకీబ్ అల్ హసన్ (64 బంతుల్లో 32; 5 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో ప్రధాన పాత్ర పోషించగా...జడేజా, ఆకాశ్దీప్, సిరాజ్ తలా 2 వికెట్లతో అండగా నిలిచారు. మొదటి ఇన్నింగ్స్లో భారత్కు ఏకంగా 227 పరుగుల ఆధిక్యం దక్కింది. అయితే ఫాలో ఆన్ ఇవ్వడంకంటే మళ్లీ బ్యాటింగ్ చేసేందుకే రోహిత్ మొగ్గు చూపించాడు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత్ 23 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు సాధించింది. శుబ్మన్ గిల్ (64 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు), రిషభ్ పంత్ (12 నాటౌట్) ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 339/6తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో భారత్ 376 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు 11.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగిన జట్టు మరో 37 పరుగులు జోడించగలిగింది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్న టీమిండియా ప్రస్తుతం తమ ఓవరాల్ ఆధిక్యాన్ని 308 పరుగులకు పెంచుకుంది. బౌలర్ల జోరు... బుమ్రా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతిని ఆడలేక వదిలేసిన షాద్మన్ ఇస్లామ్ (2) క్లీన్»ౌల్డయ్యాడు. అలా మొదలైన బంగ్లా పతనం వేగంగా సాగింది. ఆకాశ్ దీప్ తన రెండో ఓవర్లో తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లతో బంగ్లా పని పట్టాడు. ఆకాశ్ బంతికి జాకీర్ హసన్ (3) స్టంప్ ముక్కలవగా...తర్వాతి బంతికే మోమినుల్ హక్ (0) ప్యాడ్లకు తాకుతా వెళ్లిన బంతి వికెట్లను పడగొట్టింది. బౌల్డ్ కాకపోయినా మోమిన్ ఎల్బీగానైనా వెనుదిరిగేవాడే! రెండో సెషన్లో కూడా భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ సెషన్లో బంగ్లా ఐదు వికెట్లు కోల్పోయింది. నజు్మల్ (20)ను సిరాజ్...ముషి్ఫకర్ రహీమ్ (8)ను బుమ్రా అవుట్ చేయడంతో స్కోరు 40/5 వద్ద నిలిచింది. ఈ దశలో షకీబ్, లిటన్ దాస్ (22) కొద్ది సేపు ప్రతిఘటించారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు ఆరో వికెట్కు 51 పరుగులు జోడించారు. అయితే జడేజా వరుస ఓవర్లలో స్వయంకృతంతో వీరిద్దరు పరుగు తేడాతో వెనుదిరగడం బంగ్లా ఆశలు కోల్పోయేలా చేసింది. అనవసరపు భారీ షాట్కు ప్రయత్నించి దాస్ అవుట్ కాగా, రివర్స్ స్వీప్కు ప్రయత్నించి షకీబ్ వికెట్ ఇచ్చేశాడు. ఆ తర్వాత హసన్ (9) వికెట్ బుమ్రా ఖాతాలో చేరింది. టీ విరామం తర్వాత మిగిలిన రెండు వికెట్లు తీసేందుకు భారత్కు ఎక్కువ సమయం పట్టలేదు. కోహ్లి దురదృష్టవశాత్తూ... ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే యశస్వి (10) పది పరుగులు రాబట్టగా...రోహిత్ శర్మ (5) తొలి బంతికే ఫోర్తో మొదలు పెట్టాడు. అయితే వీరిద్దరు ఎక్కువ సేపు నిలవలేకపోయారు. మరో వైపు గిల్ కొన్ని చక్కటి షాట్లు ఆడి క్రీజ్లో పాతుకుపోయాడు. రెండో రోజు ఆట ముగియడానికి కొద్ది సేపు ముందు మిరాజ్ బౌలింగ్లో ఫ్లిక్ చేయబోయి విరాట్ కోహ్లి (17) వికెట్ల ముందు దొరికిపోయాడు. గిల్తో మాట్లాడిన అనంతరం కోహ్లి రివ్యూ చేయకుండానే వెళ్లిపోయాడు. తర్వాత రీప్లేలో బంతి ప్యాడ్కు తగలక ముందే బ్యాట్కు తాకినట్లు తేలింది. రివ్యూ చేసి ఉంటే కోహ్లి నాటౌట్ అయ్యేవాడు. ఆ తర్వాత మరో 3.4 ఓవర్ల పాటు గిల్, పంత్ వికెట్ పడకుండా ఆటను ముగించారు. స్కోరు వివరాలుభారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) షాద్మన్ (బి) నాహిద్ 56; రోహిత్ (సి) నజ్ముల్ (బి) హసన్ 6; గిల్ (సి) దాస్ (బి) హసన్ 0; కోహ్లి (సి) దాస్ (బి) హసన్ 6; పంత్ (సి) దాస్ (బి) హసన్ 39; రాహుల్ (సి) జాకీర్ (బి) మిరాజ్ 16; జడేజా (సి) దాస్ (బి) తస్కీన్ 86; అశి్వన్ (సి) నజు్మల్ (బి) తస్కీన్ 113; ఆకాశ్ (సి) నజు్మల్ (బి) తస్కీన్ 17; బుమ్రా (సి) జాకీర్ (బి) హసన్ 7; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 30; మొత్తం (91.2 ఓవర్లలో ఆలౌట్) 376. వికెట్ల పతనం: 1–14, 2–28, 3–34, 4–96, 5–144, 6–144, 7–343, 8–367, 9–374, 10–376. బౌలింగ్: తస్కీన్ 21–4–55–3, హసన్ మహమూద్ 22.2–4– 83–5, నాహిద్ రాణా 18–2– 82–1, మెహదీ హసన్ మిరాజ్ 21–2–77–1, షకీబ్ 8–0–50–0, మోమినుల్ 1–0–4–0. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: షాద్మన్ (బి) బుమ్రా 2; జాకీర్ (బి) ఆకాశ్ 3; నజు్మల్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 20; మోమినుల్ (బి) ఆకాశ్ 0; ముషి్ఫకర్ (సి) రాహుల్ (బి) బుమ్రా 8; షకీబ్ (సి) పంత్ (బి) జడేజా 32; లిటన్ దాస్ (సి) (సబ్) జురేల్ (బి) జడేజా 22; మిరాజ్ (నాటౌట్) 27; హసన్ (సి) కోహ్లి (బి) బుమ్రా 9; తస్కీన్ (బి) బుమ్రా 11; నాహిద్ (బి) సిరాజ్ 11; ఎక్స్ట్రాలు 4; మొత్తం (47.1 ఓవర్లలో ఆలౌట్) 149. వికెట్ల పతనం: 1–2, 2–22, 3–22, 4–36, 5–40, 6–91, 7–92, 8–112, 9–130, 10–149. బౌలింగ్: బుమ్రా 11–1–50–4, సిరాజ్ 10.1–1–30–2, ఆకాశ్ దీప్ 5–0–19–2, అశ్విన్ 13–4–29–0, జడేజా 8–2–19–2. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) దాస్ (బి) నాహిద్ 10; రోహిత్ (సి) జాకీర్ (బి) తస్కీన్ 5; గిల్ (బ్యాటింగ్) 33; కోహ్లి (ఎల్బీ) (బి) మిరాజ్ 17; పంత్ (బ్యాటింగ్) 12; ఎక్స్ట్రాలు 4; మొత్తం (23 ఓవర్లలో 3 వికెట్లకు) 81. వికెట్ల పతనం: 1–15, 2–28, 3–67. బౌలింగ్: తస్కీన్ 3–0–17–1, హసన్ మహమూద్ 5–1–12–0, నాహిద్ 3–0–12–1, షకీబ్ 6–0–20–0, మిరాజ్ 6–0–16–1. -
రెండో రోజు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
-
రెండో రోజూ మార్కెట్ ర్యాలీ
ముంబై: అనిశి్చతికి తెరదించుతూ మూడోసారి బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టనుండటంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. సెన్సెక్స్ 692 పాయింట్లు జంప్చేసింది. 75,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 75,075 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 201 పాయింట్లు ఎగసి 22,821 వద్ద నిలిచింది. తొలుత ఒక దశలో గరిష్టంగా సెన్సెక్స్ 75,298కు చేరగా.. నిఫ్టీ 22,910ను తాకింది. వెరసి సెన్సెక్స్ 915 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు చొప్పున దూసుకెళ్లాయి. దీంతో బీజేపీకి మెజారిటీ లభించకపోవడంతో మంగళవారం నమోదైన రూ. 31 లక్షల కోట్ల మార్కెట్ విలువ నష్టంలో చాలావరకూ రికవరైంది. గత రెండు రోజుల్లో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 21 లక్షల కోట్లకుపైగా బలపడింది. ఫలి తంగా బీఎస్ఈ మార్కెట్ క్యాప్ దాదాపు రూ. 416 లక్షల కోట్లకు(4.98 ట్రిలియన్ డాలర్లు) చేరింది. నేటి ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టినేడు(శుక్రవారం) ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ఇకపై ఇన్వెస్టర్ల దృష్టి వడ్డీ రేట్లవైపు మళ్లనున్నట్లు మార్కెట్ నిపుణులు వివరించారు. కాగా.. రియలీ్ట, మీడియా, పీఎస్యూ బ్యాంక్స్, ఐటీ, ఆయిల్, మెటల్ రంగాలు 5–1.5 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు హిందాల్కో, హీరోమోటో కార్ప్, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం, నెస్లే, ఇండస్ఇండ్, సిప్లా, బ్రిటానియా 2.4–1% మధ్య నీరసించాయి.కాగా, బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 2,981 లాభపడితే.. కేవలం 878 నష్టపోయాయి. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) మరోసారి అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. రూ. 6,868 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీ ఫండ్స్ మాత్రం రూ. 3,718 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. గత 2 రోజుల్లో ఎఫ్పీఐలు రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసు కున్నారు.బీహెచ్ఈఎల్ 9% జంప్ అదానీ పవర్ రూ. 3,500 కోట్ల భారీ ఆర్డర్ నేపథ్యంలో బీహెచ్ఈఎల్ షేరు తాజాగా 9 శాతం జంప్చేసింది. రూ. 278 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 15% దూసుకెళ్లి రూ. 292ను అధిగమించింది. మార్కెట్ విలువ రూ. 7,974 కోట్లు బలపడి రూ. 96,854 కోట్లకు చేరింది. అదానీ షేర్లు జూమ్ వరుసగా రెండో రోజు అదానీ గ్రూప్ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. గ్రూప్లోని 10 లిస్టెడ్ కంపెనీలలో అదానీ పోర్ట్స్ స్వల్ప వెనకడుగు వేయగా.. ఎనర్జీ సొల్యూషన్స్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ, పవర్, విల్మర్, ఏసీసీ, ఎంటర్ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, అంబుజా 5– 2 శాతం మధ్య ఎగశాయి. గ్రూప్ మార్కెట్ విలువ రూ. 17 లక్షల కోట్లను అధి గమించింది. -
Ayodhya Ram Mandir: అయోధ్యలో కలశ పూజ
అయోధ్య: అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కోసం ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. పూజరులు నిర్వహిస్తున్న ప్రత్యేక క్రతువులు రెండో రోజుకు చేరాయి. బుధవారం కలశ పూజ చేపట్టారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా దంపతులు ‘యజమానులుగా’ సరయూ నది తీరంలో కలశ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కలశాలను సరయూ నదీ జలాలలో నింపి పూజలు చేశారు. రామ్లల్లా ప్రతిష్టాపన సందర్భంగా ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ఈ కలశాలను తీసుకెళ్తారు. ప్రతిష్టాపన కంటే ముందు ఈ జలాలతో పూజలు చేస్తారు. మొత్తం 121 మంది ఆచార్యులు క్రతువుల్లో పాల్గొంటున్నారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యుడిగా వ్యవహరిస్తున్నారు. గురువారం గణేశ్ అంబికా పూజ, వరుణ పూజ, మాత్రికా పూజ, వాస్తు పూజ నిర్వహిస్తారు. మంగళవారం ప్రారంభమైన ఈ క్రతువులు ఈ నెల 21వ తేదీ దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. అయోధ్యకు చేరుకున్న ‘రామ్లల్లా’ భవ్య మందిరంలో ప్రతిష్టించబోయే రామ్లల్లా విగ్రహం బుధవారం అయోధ్యకు చేరుకుంది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య వాహనంలో ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. గర్భాలయంలోని వేదికపైకి చేర్చారు. కళ్లకు గంతలు కట్టి ఉన్న ఈ విగ్రహం చిత్రాలను తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేయలేదు. ఈ నెల 22న ఇదే విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయబోతున్నారు. ప్రాణప్రతిష్ట తర్వాతే రామ్లల్లా చిత్రాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, రామ్లల్లా ప్రతీకాత్మక (సింబాలిక్) విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. 19 నుంచి ‘అఖండ్ పథ్’ అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన కోసం హిందువులతోపాటు ఇతర మతాల ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ మూడు రోజులపాటు ‘అఖండ్ పథ్’ నిర్వహించేందుకు సిక్కు మతస్థులు సిద్ధమవుతున్నారు. అయోధ్యలోని గురుద్వారా బ్రహ్మకుండ్ సాహిబ్లో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. రామాలయ ప్రాణప్రతిష్ట సజావుగా జరగాలని ఆకాంక్షిస్తూ అఖండ్ పథ్ నిర్వహించనున్నట్లు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సిక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. అయోధ్య శ్రీరాముడితో సిక్కులకు చరిత్రాత్మక అనుబంధం ఉందని వివరించారు. 1510లో గురునానక్ అయోధ్యను దర్శించుకున్నారని గుర్తుచేశారు. 1858లో సిక్కు మత పెద్దలు అయోధ్య రామాలయంలో పూజలు చేశారని, గోడలపై రామ్ అని రాశారని చెప్పారు. సిక్కు మత ఆచారాలు, సంప్రదాయాల్లో అఖండ్ పథ్కు ప్రత్యేక స్థానం ఉంది. పవిత్ర గురుగ్రంథ సాహిబ్ను నిరంతరాయంగా భక్తితో పఠించడమే అఖండ్ పథ్. ఇందుకు 48 గంటలకుపైగా సమయం పడుతుంది. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ సాహిబ్లో ‘రామ్’ అనే పదం 2,533 సార్లు ఉందని ఆర్పీ సింగ్ వెల్లడించారు. ప్రాణప్రతిష్టకు ‘ప్రధాన యజమాని’ ప్రధాని మోదీ అయోధ్య: రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ప్రధాన యజమాని’గా వ్యవహరిస్తారని ప్రధాన ఆచార్యుడు పండిత లక్ష్మీకాంత్ దీక్షిత్ చెప్పారు. మొదట రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రాను ప్రధాన యజమానిగా ఖరారు చేశారు. కానీ, ఈ విషయంలో మార్పు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గర్భాలయంలో రామ్లల్లా ప్రాణప్రతిష్టతోపాటు కీలకమైన పూజలను ప్రధాన యజమాని తన చేతుల మీదుగా నిర్వహిస్తారు. అయోధ్యకు 200కుపైగా ఆస్థా ప్రత్యేక రైళ్లు అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత భక్తులు పోటెత్తనున్నారు. వారి సౌకర్యార్థం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు 2 వేల ఆస్థా ప్రత్యేక రైళ్లు నడిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. టయర్–1, టయర్–2 నగరాల నుంచి బయలుదేరి ఈ రైళ్లు అయోధ్య ధామ్ స్టేషన్కు చేరుకుంటాయి. ఈ నెల 22వ తేదీ నుంచి 100 రోజులపాటు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇవి పరిమితమైన స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. అయోధ్య ధామ్ స్టేషన్ నుంచి మళ్లీ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఈ రైళ్లలో ప్రయాణానికి ఐఆర్సీటీసీ ద్వారా మాత్ర మే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా 20 వేల ఉద్యోగాలు అయోధ్య ఇక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారనుంది రామ్లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్యను ప్రతిఏటా కోట్లాది మంది దర్శించుకోనున్నారు. అదేస్థాయిలో ఇక్కడ ఉద్యోగ, ఉపాధి పెరగడం ఖాయం. ఆతిథ్యం, రవాణా, పర్యాటక రంగాల్లో కలిపి 20 వేల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగిందని సమాచారం. ప్రతిఏటా శ్రీరాముడికి ‘సూర్య తిలకం’ అయోధ్య రామ మందిరంలో ప్రతిఏటా చైత్ర మాసంలో శ్రీరామనవమి రోజు భక్తులు అపూర్వమైన దృశ్యాన్ని తిలకించవచ్చు. ఆ రోజు గర్భాలయంలో రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. సూర్య కిరణాలే తిలకంగా రామయ్యను అలంకరిస్తాయి. దీన్ని సూర్య తిలకంగా పిలుస్తారు. ఈ తిలకం వ్యవస్థను సీఎస్ఐఆర్–సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీబీఆర్ఐ) సైంటిస్టులు డిజైన్ చేశారు. ఇందుకోసం ఆలయంలో కటకాలు, అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 6 నిమిషాల పాటు సూర్య తిలకాన్ని దర్శించుకోవచ్చు. రామ భక్తులపై మోసాల వల సైబర్ నేరగాళ్లు అయోధ్య రామమందిర ప్రారం¿ోత్సవాన్ని కూడా అక్రమ సంపాదనకు వాడుకుంటున్నారు. అయోధ్య నుంచి రామమందిర ప్రసాదం పంపిస్తామంటూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెట్ సైట్లలో ఇలాంటి ప్రసాదం కనిపిస్తోంది. డెలివరీ చార్జీల కింద కేవలం రూ.51 ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే చాలు ఈ నెల 22వ తేదీ నాటికి ఉచితంగా ప్రసాదం పంపిస్తామంటూ మరికొందరు నేరగాళ్లు వల విసురుతున్నారు. నిజానికి దీనికి, అయోధ్య రామమందిరానికి ఎలాంటి సంబంధం లేదు. అదంతా నకిలీ ప్రసాదమని అధికారులు అంటున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కొందరైతే డొనేషన్లు సేకరిస్తున్నామంటూ రామ్ జన్మభూమి ట్రస్టు పేరిట వాట్సాప్ ద్వారా క్యూఆర్ కోడ్ పంపుతున్నారు. వాటిని స్కాన్ చేస్తే బ్యాంకు ఖాతాల్లో నగదు గల్లంతవుతోంది. అలాగే రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనను ప్రత్యక్షంగా తిలకించడానికి వీఐపీ పాసులు అందజేస్తామంటూ ఉచ్చులోకి లాగుతున్నారు. ‘రామ్ జన్మభూమి గృహ్ సంపర్క్ అభియాన్–ఏపీకే’ పేరిట ఇలాంటి సందేశాలను ఫోన్ల ద్వారా పంపిస్తున్నారు. నగదు బదిలీ చేయించుకొని ఫోన్లు స్విచ్ఛాప్ చేస్తున్నారు. -
ఐటీ, మెటల్, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు
ముంబై: ఫైనాన్స్, మెటల్, ఫైనాన్స్ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. కీలక వడ్డీ రేట్లను నిర్ణయించే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు(మినిట్స్), ఉపాధి కల్పన డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ తయారీ రంగం డిసెంబర్లో 19 నెలల కనిష్టానికి క్షీణించి 54.9 స్థాయికి దిగిరావడం సెంటిమెంట్పై ప్రభావం చూపింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 539 పాయింట్లు నష్టపోయి 71,357 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 149 పాయింట్లు క్షీణించి 21,517 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు బలహీనంగా మొదలయ్యాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 588 పాయింట్లు క్షీణించి 71,304 వద్ద, నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 21,500 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. నష్టాల మార్కెట్లోనూ వినిమయ, సరీ్వసెస్, రియల్టీ, విద్యుత్, ఫార్మా రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.666 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.863 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో, చైనాలో డిమాండ్ తగ్గుదల ఆందోళనలతో మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దేశీయ ఐటీ రంగ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అదానీ షేర్ల పరుగు.. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో బుధవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 12%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ గ్రూప్ ఎనర్జీ 6%, అదానీ పవర్ 5% చొప్పున లాభపడ్డాయి. అదానీ విల్మార్ 4%, ఎన్డీటీవీ 3.50%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.50%, అదానీ పోర్ట్స్ 1.30%, అంబుజా సిమెంట్స్ 1%, ఏసీసీ 0.10% పెరిగాయి. ఫలితంగా అదానీ గ్రూప్ 10 కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.64,189 కోట్లు పెరిగి రూ.15.11 లక్షల కోట్లకు చేరింది. -
నిలిచిన బందీల విడుదల!
జెరుసలేం: ఇజ్రాయెల్–హమాస్ బందీల విడుదల ఒప్పందానికి రెండో రోజే అవాంతరం ఎదురైంది. శనివారం దాదాపు 14 మంది ఇజ్రాయెలీలను వదిలేయాల్సిన హమాస్ అడ్డం తిరిగింది. గాజాకు అత్యవసర సాయం అందడంలో ఆలస్యంపై కినుక వహించింది. ఒప్పందంలో భాగంగా గాజాకు మరింత సాయాన్ని అనుమతించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించడం తెలిసిందే. ఆ మేరకు గత రెండు రోజుల్లో 340కి పైగా ట్రక్కులు ఈజిప్టు వైపు నుంచి రఫా క్రాసింగ్ దాటాయి. కానీ ఇప్పటికీ అవి గాజాకు చేరుకోకపోవడంపై హమాస్ ఆగ్రహంగా ఉంది. వాటన్నింటినీ అనుమతించడంతో పాటు మరింత సాయం కూడా అందాల్సిందేనని పట్టుబడుతోంది. అప్పటిదాకా బందీలను వదిలేది లేదని చెప్పడంతో గందరగోళం నెలకొంది. అయితే గాజాలోకి వెళ్తున్న ట్రక్కులన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేసి గానీ పోనిచ్చేది లేదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. దానికి సమయం పడుతోంది తప్ప మరేమీ లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యమైనా ఒప్పందం మేరకు బందీల విడుదల ప్రక్రియ కొనసాగుతుందని ఇజ్రాయెల్ విశ్వాసం వెలిబుచి్చంది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య బుధవారం నాలుగు రోజుల కాల్పుల విరామణ ఒప్పందం కుదరడం తెలిసిందే. అందులో భాగంగా 50 మంది ఇజ్రాయెలీ బందీల విడుదలకు హమాస్, ప్రతిగా 150 మంది పాలస్తీనియా ఖైదీలను వదిలేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించాయి. గాజాకు మరింత అత్యవసర సాయాన్ని అనుమతించేదుకు కూడా ఇజ్రాయెల్ ఒప్పుకుంది. శుక్రవారం తొలి రోజు 24 మందిని హమాస్, 39 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేశాయి. శనివారం 14 మందిని వదిలేయనున్నట్టు హమాస్ ప్రకటించింది. 42 మంది పాలస్తీనియన్లను విడుదల చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
కశ్మీర్లో ముగిసిన ఎన్కౌంటర్..
రాజౌరీ/జమ్మూ: జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో గురువారం రెండో రోజు కూడా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. బుధవారం ఎన్కౌంటర్ గాయపడిన ఇద్దరు జవాన్లలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని అధికారులు తెలిపారు. దీంతో, ఈ ఎన్కౌంటర్ అసువులు బాసిన జవాన్ల సంఖ్య అయిదుగురుకు చేరుకుంది. బుధవారం చనిపోయిన వారిని కెప్టెన్ ఎంవీ ప్రాంజల్(కర్ణాటక), కెప్టెన్ శుభమ్ గుప్తా(యూపీ), పారా ట్రూపర్ సచిన్ లౌర్(యూపీ), హవల్దార్ అబ్దుల్ మాజిద్(జమ్మూకశ్మీర్)గా గుర్తించారు. గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ధర్మసాల్లోని బాజిమాల్ ప్రాంతంలో బుధవారం ఎన్కౌంటర్ సందర్భంగా ఇద్దరు కెప్టెన్లు సహా నలుగురు జవాన్లు నేలకొరిగారు. మరో ఇద్దరు గాయాలపాలైన విషయం తెలిసిందే. రాత్రి వేళ కాల్పులను నిలిపివేసిన బలగాలు ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశం లేకుండా, అక్కడి దట్టమైన అటవీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో దిగ్బంధించాయి. గురువారం ఉదయం తిరిగి రెండు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో, ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ ముగిసినట్లయిందని తెలిపారు. మృతుల్లో ఒకరిని పాకిస్తాన్కు చెందిన పేరుమోసిన ఉగ్రవాది క్వారీగా గుర్తించారు. మందుపాతరలను అమర్చడం, స్నైపర్ కాల్పుల్లోనూ ఇతడు నిపుణుడు. గుహల్లో ఉంటూ ఉగ్ర చర్యలకు పాల్పడుతుంటాడు. పాక్, అఫ్గానిస్తాన్లలో ఉగ్ర శిక్షణ పొందిన క్వారీ లష్కరే తోయిబాలో టాప్ కమాండర్గా వ్యవహరిస్తున్నాడు. హతమైన మరో ముష్కరుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
Israel-Hamas war: గాజాలో నరకయాతన
రఫా/టెల్ అవీవ్: ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. ప్రధానంగా గాజా సిటీ శివారు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. పూర్తిస్థాయి భూతల యుద్ధం త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నామని, అది సుదీర్ఘకాలం, సంక్లిష్టంగా ఉండబోతోందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ చెప్పారు. గాజాలో హమాస్ మిలిటెంట్లు నిర్మించుకున్న సొరంగాల వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. గల్లాంట్ శుక్రవారం విదేశీ జర్నలిస్టులతో మాట్లాడారు. భారీ స్థాయిలో సైనిక బలగాలతో భూతల యుద్ధం ప్రారంభిస్తామని అన్నారు. వారికి వెన్నుదన్నుగా వైమానిక దళం కూడా ఉంటుందని చెప్పారు. తమ జవాన్లు గురువారం ఉత్తర గాజాపై భూతల దాడి చేసి, క్షేమంగా తిరిగి వచ్చారని వెల్లడించారు. శుక్రవారం కూడా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యిందన్నారు. 9 వేలు దాటిన మృతుల సంఖ్య మూడు వారాల క్రితం ప్రారంభమైన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 9 వేలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 7,300 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 3,000 మంది మైనర్లు, 1,500 మందికిపైగా మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య గతంలో జరిగిన నాలుగు యుద్ధాల్లో దాదాపు 4,000 మంది మృతిచెందారు. ఈ నెల 7న మొదలైన యుద్ధంలో మృతుల సంఖ్య ఇప్పటికే 7,300 దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో వెస్ట్బ్యాంక్లో మృతిచెందినవారి సంఖ్య 110కు చేరుకుంది. హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇజ్రాయెల్ భూభాగంలో 1,400 మందికిపైగా మృత్యువాతపడ్డారు. హమాస్ వద్ద 229 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని విడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా నలుగురు బందీలను మిలిటెంట్లు విడుదల చేశారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో ఇప్పటిదకా 200కిపైగా పాఠశాలలు ధ్వంసమయ్యాయని ‘యునెస్కో’ ప్రకటించింది. అంటే గాజాలోని మొత్తం స్కూళ్లలో 40 శాతం స్కూళ్లు ధ్వంసమైనట్లు తెలియజేసింది. ఇంధనాన్ని అనుమతించేది లేదు సరిపడా ఆహారం, నీరు, నిత్యావసరాలు, ఔషధాలు లేక గాజాలో ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనం నరకయాతన అనుభవిస్తున్నారు. ఆసుపత్రుల్లో రోగులు, క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంక్యుబేటర్లు పనిచేయక శిశువులు కన్నుమూస్తున్నారు. ఈజిప్టు ప్రభుత్వం పరిమితంగా ఆహారం, నిత్యావసరాలను ఈజిప్టు నుంచి గాజాలోకి అనుమతిస్తోంది. మరోవైపు గాజాకు పెట్రోల్, డీజిల్ సరఫరాను అనుమతించబోమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్ మరోసారి తేలి్చచెప్పారు. ఇంధనం మిలిటెంట్ల చేతుల్లోకి చేరితే దురి్వనియోగమయ్యే అవకాశం ఉందన్నారు. మిలిటెంట్లు జనరేటర్లతో సొరంగాల్లోకి గాలిని పంపిస్తుంటారని, ఇందుకోసం ఇంధనం వాడాల్సి ఉంటుందన్నారు. ‘‘హమాస్ మిలిటెంట్లకు గాలి కావాలంటే ఇంధనం కావాలి, ఇంధనం కావాలంటే మేము కావాలి’’ అని గల్లాంట్ వ్యాఖ్యానించారు. బందీల్లో 30 మంది పిల్లలు! ఈ నెల 7న ఇజ్రాయెల్పై హఠాత్తుగా దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు దొరికినవారిని దొరికినట్లు ఊచకోత కోశారు. చాలామందిని నిలబెట్టి కాల్చేశారు. వెనక్కి వెళ్లిపోతూ 229 మందిని బందీలుగా బలవంతంగా లాక్కెళ్లారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. బందీలను గాజాలోని గుర్తుతెలియని ప్రాంతంలో దాచినట్లు తెలుస్తోంది. బందీల్లో 30 మంది చిన్నపిల్లలు ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ధారణకు వచి్చంది. తమ పిల్లలను విడిపించాలంటూ వారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. మూడేళ్లు, నాలుగేళ్ల వయసున్న చిన్నారులను కూడా మిలిటెంట్లు అపహరించడం గమనార్హం. వారి క్షేమ సమాచారాలు తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. జెనీవా తీర్మానం ప్రకారం.. సాధారణ పౌరులను బందీలుగా మార్చడం ముమ్మాటికీ యుద్ధ నేరమే అవుతుంది. సిరియాలో అమెరికా దాడులు వాషింగ్టన్: తూర్పు సిరియాలో ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డ్ సేనల స్థావరాలే లక్ష్యంగా అమెరికా ఫైటర్ జెట్లు శుక్రవారం ఉదయం నిప్పుల వర్షం కురిపించాయి. రెండు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. గతవారం సిరియాలోని తమ సైనిక స్థావరాలపై ఇరాన్ అనుకూల మిలిటెంట్లు క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశారని, వాటికి ప్రతిస్పందనగానే తాము వైమానిక దాడులు చేసినట్లు వెల్లడించింది. ఒకవైపు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కొనసాగుతుండగా, మరోవైపు అమెరికా సైన్యం సిరియాలో ఇరాన్ అనుకూల శక్తులపై విరుచుకుపడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, సిరియాలో దాడికి ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణతో ఏమాత్రం సంబంధం లేదని అమెరికా తేలి్చచెప్పింది. తమ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతోనే తూర్పు సిరియాలో ఇరాన్ సాయుధ దళాలపై దాడి చేశామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ పేర్కొన్నారు. అమెరికా దళాలపై దాడులను సహించబోమని పేర్కొన్నారు. అక్టోబర్ 17 నుంచి ఇరాక్, సిరియాలోని తమ సైనిక స్థావరాలపై, జవాన్లపై కనీసం 19 దాడులు జరిగాయని పెంటగాన్ ఆరోపించింది. ఈ దాడులకు బాధ్యులైనవారిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ పశ్చిమాసియాలో భారీ సంఖ్యలో సైనిక బలగాలను మోహరిస్తోంది. -
నెల కనిష్టానికి సూచీలు
ముంబై: బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల ప్రభావం కొనసాగడంతో స్టాక్ మార్కెట్ రెండో రోజూ నష్టపోయింది. సెన్సెక్స్ 286 పాయింట్లు పతనమై 65,226 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93 పాయింట్లు క్షీణించి 19,436 వద్ద నిలిచింది. రెండు సూచీలకు ముగింపు స్థాయిలు నెల కనిష్టం. ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం ప్రారంభం నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించారు. స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో షేర్లు పెద్ద ఎత్తున నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 633 పాయింట్లు నష్టపోయి 65 వేల స్థాయి దిగువన 64,879 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు పతనమై 19,334 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.4,424 కోట్ల షేర్లు అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,769 కోట్ల షేర్లను కొన్నారు. ► అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 3% పెరిగి రూ.2464 వద్ద స్థిరపడింది. అబుదాబీ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ హోల్డింగ్(ఐహెచ్సీ) ఓపెన్ మార్కెట్ కొనుగోళ్ల ద్వారా ఆదానీలో తన వాటాను 4.98% నుంచి 5.04 శాతానికి పెంచుకోవడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ► అప్డేటర్ సరీ్వసెస్ లిమిటెడ్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.300)తో 0.03 స్వల్ప డిస్కౌంట్తో 299.90 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 6% క్షీణించి రూ.282 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచి్చంది. చివరికి 5.38% నష్టంతో 284 వద్ద నిలిచింది. -
రెండో రోజూ.. బైబై గణేశా
సాక్షి, సిటీబ్యూరో: వినాయక విగ్రహాల నిమజ్జనం శుక్రవారం రెండో రోజూ కొనసాగింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విగ్రహాలు తరలివచ్చాయి. దీంతో ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్డు, పీపుల్స్ప్లాజా వైపు నిమజ్జన వాహనాలు భారీ ఎత్తున బారులు తీరాయి. గురువారం మొదలైన వినాయక విగ్రహాల నిమజ్జన వేడుకలు నిరాటంకంగా శుక్రవారం కూడా కొనసాగగడంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ♦ రామంతాపూర్, అంబర్పేట్, మలక్పేట్, దిల్సుఖ్నగర్, పాతబస్తీలోని పలు ప్రాంతాల నుంచి విగ్రహాలు తరలివచ్చాయి. రెండు రోజులుగా సుమారు 10 వేలకుపైగా భారీ విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు పోలీసు వర్గాలు అంచనా వేశాయి. మరోవైపు 5 అడుగుల కంటే తక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలు సుమారు 30 వేలకుపైగా నిమజ్జనం చేసినట్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు ఆరంభమైన మూడో రోజు నుంచే నిమజ్జన వేడుకలు మొదలయ్యాయి. 5వ రోజు కూడా భారీ సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఉత్సవాల అనంతరం గురువారం పెద్ద ఎత్తున విగ్రహాలను నిమజ్జనం చేయగా, శుక్రవారం కూడా అన్ని వైపులా నుంచి విగ్రహాలు తరలి వచ్చాయి. శుక్రవారం రాత్రి వరకూ నెక్లెస్రోడ్డు, పీపుల్స్ప్లాజా వైపు విగ్రహాల నిమజ్జనం కొనసాగింది. మహాగణపతి నిమజ్జనంతో మొదలు.. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత మిగతా విగ్రహాల తరలింపు క్రమంగా పెరిగింది. గురువారం సాయంత్రం వరకు మందకొడిగా సాగిన తరలింపు ప్రక్రియ రాత్రి నుంచి వేగంగా సాగింది. బాలాపూర్ విగ్రహాన్ని తరలించిన అనంతరం వరుసగా పాతబస్తీలోని వివిధ ప్రాంతాలకు చెందిన విగ్రహాలు బారులు తీరాయి.భారీ విగ్రహాలు కావడంతో నెమ్మదిగా ముందుకు కదిలాయి. అదే సమయంలో రామంతాపూర్, అంబర్పేట్ వైపు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలు కూడా ప్రధాన శోభాయాత్రలో చేరడంతో నిమజ్జనం నెమ్మదిగా సాగింది. కొన్నిచోట్ల అర్ధరాత్రి తర్వాత నిమజ్జన ఏర్పాట్లు చేయగా, కొన్ని విగ్రహాలను శుక్రవారం ఉదయం తరలించారు. దీంతో గురువారం మొదలైన నిమజ్జన శోభాయాత్ర నిరాటంకంగా సాగింది. అబిడ్స్, కోఠి, బషీర్బాగ్, లిబర్టీ, హిమాయత్నగర్ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సిటీబస్సులు, ఇతర వాహనాలు స్తంభించడంతో నగరవాసులు ఇబ్బందులకు గురయ్యారు. సాధారణంగా ప్రతి సంవత్సరం మొదటి రోజే ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం అవుతాయి. రెండో రోజు మిగిలిన విగ్రహాలను ఉదయం పదింటి వరకే పూర్తి చేస్తారు.కానీ అందుకు పూర్తిగా భిన్నంగా రెండు రోజులు నిమజ్జనం కొనసాగింది. శుక్రవారం రాత్రి కూడా విగ్రహాలను నిమజ్జనం చేశారు. -
జ్ఞానవాపి మసీదులో రెండోరోజూ సర్వే
వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో పురావస్తు శాఖ(ఏఎస్ఐ) అధికారుల సర్వే రెండో రోజూ కొనసాగింది. హిందూ ఆలయ నిర్మాణంపైనే 17వ శతాబ్దంలో ఈ మసీదును నిర్మించారనే పిటిషన్పై వారణాసి కోర్టు శాస్త్రీయ సర్వేకు ఆదేశించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వే పనులు సాగాయి. ఏఎస్ఐ అధికారులతోపాటు ప్రభుత్వ న్యాయవాది రాజేశ్ మిశ్రా, ఐఐటీ కాన్పూర్ నిపుణులు, అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సభ్యులు అక్కడున్నారు. ఆదివారం కూడా సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సర్వేకు పూర్తిగా సహకరిస్తున్నట్లు మసీదు కమిటీ తెలిపింది. మసీదులో శాస్త్రీయ సర్వే జరపాలంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచి్చన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు సమరి్థంచడం తెలిసిందే. సెప్టెంబర్ 4 లోగా సర్వే పూర్తి చేయాలని శుక్రవారం వారణాసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
Ind Vs WI 2nd Test Day 5: వదలని వాన... రెండో టెస్టు డ్రా! సిరీస్ భారత్దే
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్ గెలుపు ఆశలపై వరుణదేవుడు నీళ్లు చల్లాడు! కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్ ‘డ్రా’ కావడంతో టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో కీలక పాయింట్లు కోల్పోయింది. క్వీన్స్ పార్క్ ఓవల్లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్టులో వాన కారణంగా ఫలితం తేలకుండా పోయింది. భారీ వర్షంతో మ్యాచ్ చివరి రోజు సోమవారం ఒక్క బంతి కూడా సాధ్యం కాలేదు. పలుమార్లు వాన రావడం, తగ్గడం, మళ్లీ రావడం జరిగాయి. ఆట ఆరంభమవుతుందని అనిపించడం, పిచ్ను సిద్ధం చేసే ప్రయత్నం చేయడం, అంతలోనే చినుకులతో పరిస్థితి మారిపోవడం తరచుగా జరిగింది. చివరకు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 2:50కు అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి టెస్టు గెలిచిన భారత్ సిరీస్ను 1–0తో సొంతం చేసుకుంది. గత మ్యాచ్లో 12 పాయింట్లు సాధించిన టీమిండియా ఖాతాలో ఈ ‘డ్రా’ కారణంగా 4 పాయింట్లే చేరాయి. అంతకు ముందు నాలుగో రోజు 365 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. బ్రాత్వైట్ (28), చందర్పాల్ (24 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఆఖరి రోజు ఆట సాగితే మిగిలిన ఎనిమిది వికెట్లు తీయడం భారత్కు కష్టం కాకపోయేది. కానీ వానతో లెక్క మారిపోయింది. నాలుగో రోజు చివరి సెషన్లో భారత్ దూకుడైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. ఈ సెషన్లో ఆడిన 9 ఓవర్లలోనే టీమిండియా 63 పరుగులు చేసింది. రోచ్ ఓవర్లో ఇషాన్ ‘సింగిల్ హ్యాండ్’తో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది 33 బంతుల్లోనే కెరీర్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో బంతి తర్వాత భారత్ తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి విండీస్కు 365 పరుగుల లక్ష్యాన్ని విధించింది. భారీ ఛేదనలో విండీస్కు సరైన ఆరంభం లభించలేదు. బ్రాత్వైట్ పరుగులు జోడించేందుకు ప్రయతి్నంచగా, చందర్పాల్ పూర్తిగా డిఫెన్స్కే పరిమితమయ్యాడు. ఒకదశలో అతను 50 బంతుల్లో 3 పరుగులే చేశాడు. అశి్వన్ ఈ జోడీని విడదీసి భారత్కు తొలి వికెట్ అందించాడు. స్వీప్ చేయబోయిన బ్రాత్వైట్ ఫైన్లెగ్లో క్యాచ్ ఇచ్చాడు. అశి్వన్ తన తర్వాతి ఓవర్లోనే మెకన్జీ (0)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత చందర్పాల్, బ్లాక్వుడ్ (20 నాటౌట్) వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 438; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 255; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) సిల్వ (బి) వారికాన్ 38; రోహిత్ (సి) జోసెఫ్ (బి) గాబ్రియెల్ 57; గిల్ (నాటౌట్) 29; ఇషాన్ కిషన్ (నాటౌట్) 52; ఎక్స్ట్రాలు 5; మొత్తం (24 ఓవర్లలో 2 వికెట్లకు) 181 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1–98, 2–202. బౌలింగ్: రోచ్ 4–0–46–0, జోసెఫ్ 4–0–37–0, హోల్డర్ 4–0–26–0, గాబ్రియెల్ 6–0–33–1, వారికాన్ 6–0–36–1. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: బ్రాత్వైట్ (సి) ఉనాద్కట్ (బి) అశి్వన్ 28; చందర్పాల్ (నాటౌట్) 24; మెకెన్జీ (ఎల్బీ) (బి) అశి్వన్ 0; బ్లాక్వుడ్ (నాటౌట్) 20; ఎక్స్ట్రాలు 4; మొత్తం (32 ఓవర్లలో 2 వికెట్లకు) 76. వికెట్ల పతనం: 1–38, 2–44. బౌలింగ్: సిరాజ్ 8–2–24–0, ముకేశ్ 5–4–5–0, ఉనాద్కట్ 3–2–1–0, అశ్విన్ 11–2–33–2, జడేజా 5–1–10–0. -
అమర్నాథ్ యాత్రకు బ్రేక్
జమ్మూ: అమర్నాథ్ యాత్ర వరుసగా రెండో రోజు శనివారం కూడా నిలిచిపోయింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతూ ఉండడంతో అధికారులు యాత్రను నిలిపివేశారు. యాత్రకు వెళ్లే మార్గం మధ్యలో వేలాది మంది భక్తులు చిక్కుకుపోయారు. భక్తులెవరూ ఆందోళనకు గురి కావొద్దని అధికారులు అనుక్షణం పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. అధికారులు ఇచ్చిన ఆదేశాలను భక్తులందరూ తూచ తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్లో రెండు మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అమర్నాథ్ ఆలయం ఉన్న ప్రాంతంలో విపరీతంగా మంచుకురుస్తోంది. ‘‘అమర్నాథ్ యాత్రకు వెళ్లే రెండు మార్గాలైన పాహల్గామ్, బాల్టాల్ మార్గాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో యాత్రను నిలిపివేస్తున్నాం’అని ఒక అధికారి వెల్లడించారు. బేస్ క్యాంప్ అయిన భగవతి నగర్ నుంచి శనివారం కొత్త బ్యాచ్ ఎవరినీ అనుమతించలేదు. జులై 1న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 31తో ముగుస్తుంది. 80 వేల మందికి పైగా భక్తులు ఈ ఏడాది యాత్రకు డబ్బులు చెల్లించారు. -
వైఎస్సార్ జిల్లాలో రెండో రోజు సీఎం జగన్ పర్యటన (ఫోటోలు)
-
ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్
-
మీరంతా ప్రపంచంతో పోటీ పడేలా ఉండాలి: సీఎం జగన్
అహోబిలపురం స్కూల్ను ప్రారంభించిన తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ.. ►నాడు-నేడుతో స్కూల్స్ రూపురేఖలు మార్చాం ►రాబోయే రోజుల్లో మన పిల్లల తలరాతలు మారతాయి ►విద్యకు సంబంధించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ►విద్యార్థులు భవిష్యత్తు బావుండాలనే తపనతోనే విద్యకు పెద్ద పీట వేస్తున్నాం ►మనం కాంపిటేషన్తో ఉండేది పులివెందులతోనో, ఆంధ్ర రాష్ట్రంతోనో కాదు.. ►మీరంతా ప్రపంచంతో పోటీ పడేందుకే ఈ తరహా మంచి కార్యక్రమాలు చేపట్టాం ►అందుకే అంతా చక్కగా చదువుకోవాలి. ►విద్యార్థుల తల్లులకు ఒక అన్నగా, విద్యార్థులకు మేనమామగా అండగా ఉంటా 03:53PM అహోబిలపురం స్కూల్ను ప్రారంభించిన సీఎం జగన్ 03:16PM పులివెందులలో బస్టాండ్ను ప్రారంభించిన తర్వాత ప్రజలనుద్దేశించి మాట్లాడిన సీఎం జగన్ ►మనం చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం ►జరుగుతున్న అభివృద్ధి వారికి కనిపించడం లేదు ►గతంతో పోలిస్తే అప్పుల్లో పెరుగుదల ఇప్పుడే తక్కువ ►గతంలో అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్ ►గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది ►గ్లాసులో 75 శాతం నీళ్లున్నా.. నీళ్లే లేవని బాబు ప్రచారం చేస్తున్నారు ►అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ►విద్యార్థులు, పేదలు, రైతుల తలరాతలు మారుతున్నాయి ►మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ►కేవలం సీఎం మారడంతోనే పేదల తలరాతలు మారుతున్నాయి ►రూ. 1.71లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశాం ►గత ఎన్నికల్లో 151 సీట్లు.. ఈసారి వైనాట్ 175కి 175 సీట్లు ►లంచాలకు తావులేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ►నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం ►గతంలో అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్ ►గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది ►పులి వెందులను ఆదర్శవంత నియోజకవర్గంగీ తీర్చిదిద్దుతున్నాం ►అత్యాధునిక వసతులతో వైఎస్సార్ బస్ టెర్మినల్ను ప్రారంభించాం ►రాష్ట్రంలోని బస్ టెర్మినల్కు పులివెందుల బస్ టెర్మినల్ ఆదర్శం 03.14PM ►పులివెందులలో సీఎం జగన్ ►కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణను ప్రారంభించిన సీఎం జగన్ ►పులివెందులలో కూరగాయల మార్కెట్ను ప్రారంభించిన సీఎం జగన్ ►పులివెందుల బస్టాండ్ను ప్రారంభించిన సీఎం జగన్ 02:11PM ►వైఎస్సార్ కడప జిల్లా కూరగాయల మార్కెట్ అనుకుని నూతనంగా నాలుగుకోట్ల 30 లక్షలతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ పార్క్ను ప్రారంభించిన సీఎం జగన్ 01: 58 PM ►పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో కోటి ఇరవై లక్షలతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కూరగాయల మార్కెట్ను ప్రారంభించిన సీఎం జగన్ 01: 15 PM వైఎస్సార్ జిల్లా ►పులివెందులకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ►విజయ హోమ్ వద్ద జంక్షన్ను, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ 10: 25 AM ►వైఎస్సార్ జిల్లాలో రెండో రోజు సీఎం జగన్ పర్యటన ►ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్ ►పులివెందులలో పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ►పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్ను ప్రారంభించనున్న సీఎం జగన్ సాక్షి, పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పులివెందులకు రానున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మధ్యాహ్నం 12.30గంటలకు ఇడుపులపాయ నుంచి భాకరాపురం హెలీప్యాడ్కు చేరుకుంటారు. 1.10గంటల నుంచి 1.20 వరకు విజయ హోమ్స్ వద్ద ఉన్న జంక్షన్ను ప్రారంభిస్తారు. 1.30 నుంచి 1.45గంటల వరకు కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణ రోడ్డును, 1.50 నుంచి 2గంటల వరకు నూతన కూరగాయల మార్కెట్ను, 2.05 నుంచి 2.20 గంటల వరకు మైత్రి లేఅవుట్లో వైఎస్సార్ మెమోరియల్ పార్కును ప్రారంభిస్తారు. 2.35 నుంచి 2.50 గంటల వరకు రాయలాపురం నూతన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. 3గంటల నుండి 3.30గంటల వరకు డాక్టర్ వైఎస్సార్ బస్ టర్మినల్ను ప్రారంభించి బస్టాండు ఆవరణంలో ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తారు. 3.35గంటల నుంచి 3.55గంటల వరకు నాడు – నేడు ద్వారా అభివృద్ధి చేసిన అహోబిలాపురం స్కూలును ప్రారంభిస్తారు. 4.05గంటల నుంచి 4.20గంటల వరకు మురుగునీటిశుద్ధి కేంద్రాన్ని, 4.30గంటల నుంచి 4.45గంటల వరకు గార్బేజీ ట్రాన్స్ఫర్ స్టేషన్ను ప్రారంభిస్తారు. అనంతరం 5.00గంటలకు భాకరాపురం హెలీఫ్యాడ్కు చేరుకుని అక్కడ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళతారు. సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే క్రిస్మస్ కేక్ను కట్ చేయనున్నారు. సీఎం పర్యటనా ప్రాంతాల పరిశీలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శని, ఆదివారాలు పులివెందుల పర్యటన దృష్ట్యా అందుకు సంబంధించిన ఏర్పాట్లను కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డిలతో కలిసి శుక్రవారం ఉదయం పరిశీలించారు. నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండులో సీఎం బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించే అభివృద్ధి పనులను కూడా ఆయన పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇడుపులపాయకు చేరుకున్న ముఖ్యమంత్రి వేంపల్లె: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23 నుంచి 25వ వరకు మూడు రోజులపాటు జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు చేరుకున్నారు. శుక్రవారం కడప, కమలాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముగించుకుని హెలీకాప్టర్ ద్వారా ఇడుపులపాయకు వచ్చారు. సాయంత్రం 5.51 గంటలకు ఇడుపులపాయలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న హెలీపాడ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డి, డీసీఓ సుభాషిణి, స్పెషల్ కలెక్టర్ రోహిణి, జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి వాహనం ద్వారా రోడ్డు మార్గాన బయలుదేరి వైఎస్సార్ గెస్ట్హౌస్కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. -
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ దాడులు, కీలక పత్రాలు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు నిర్వహిస్తున్న దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా కాలేజీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే, మంత్రి ఇంట్లో ఉండగానే.. కేంద్ర పోలీసు బలగాల పహారాలో ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు ప్రారంభమయ్యాయి. మొత్తం 50 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించిన అధికారులు, రూ.8.8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మెడికల్ సీట్ల కేటాయింపుల్లో అవకతవకలు, రియల్ ఎస్టేట్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు గుర్తించినట్లు సమాచారం. చదవండి: (టార్గెట్ మల్లారెడ్డి.. మంత్రి ఆస్తులు లక్ష్యంగా ఐటీ దాడులు) -
జడేజా ‘కత్తి’ దూశాడు!
రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్కు శ్రీలంక కకావికలమైంది. గాయం నుంచి కోలుకొని మళ్లీ జట్టులోకి వచ్చిన అతను తొలి మ్యాచ్లోనే తన విలువేంటో చూపించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన జడేజా మెరుపు ప్రదర్శనతో శతకం బాదడంతో పాటు బౌలింగ్లో కీలక వికెట్ తీసి రెండో రోజే మ్యాచ్ను భారత్ చేతుల్లోకి తెచ్చాడు. అశ్విన్ కూడా ఇదే తరహా ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి పని పట్టాడు. అటు పేలవ బౌలింగ్, ఫీల్డింగ్తో పూర్తిగా చేతులెత్తేసిన లంక బ్యాటింగ్లోనూ తడబడి అప్పుడే నాలుగు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. లంకను ఎక్కువ ఓవర్లు ఆడించే క్రమంలో జడేజా డబుల్ సెంచరీకి అవకాశం ఇవ్వకుండా భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయడమే రెండో రోజు ఆటలో కాస్త చర్చనీయాంశం! మొహాలి: శ్రీలంకతో తొలి టెస్టులో రెండో రోజే భారత్కు మ్యాచ్పై పట్టు చిక్కింది. ఓవర్నైట్ స్కోరు 357/6తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 129.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా (228 బంతుల్లో 175 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్స్లు) కెరీర్లో అత్యుత్తమ స్కోరు సాధించగా, అశ్విన్ (82 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు ఏడో వికెట్కు 130 పరుగులు జత చేశారు. అనంతరం లంక ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 466 పరుగులు వెనుకబడి ఉంది. భారీ భాగస్వామ్యం... తొలి రోజు అజేయంగా నిలిచిన జడేజా, అశ్విన్ ద్వయం శనివారం అదే జోరును కొనసాగిస్తూ శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండో ఓవర్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జడేజాకు అశ్విన్ అండగా నిలిచాడు. వీరిద్దరూ వన్డే తరహాలో ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఫెర్నాండో ఓవర్లో జడేజా రెండు ఫోర్లు కొట్టడంతో స్కోరు 400 పరుగులకు చేరింది. ఆ తర్వాత అశ్విన్ హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. తొలి సెషన్లో అశ్విన్ వికెట్ కోల్పోయినా... 27 ఓవర్లలో భారత్ ఏకంగా 111 పరుగులు నమోదు చేసింది. ఎంబుల్డెనియా బౌలింగ్లో సింగిల్ తీసి 160 బంతుల్లో జడేజా సెంచరీ మార్క్ను అందుకున్నాడు. లంచ్ విరామం తర్వాత కొద్ది సేపటికే జయంత్ యాదవ్ (2) వెనుదిరిగాడు. ఈ స్థితిలో జడేజా స్కోరు 104 పరుగులు. ఆ తర్వాత జడేజా మరింత చెలరేగిపోయాడు. 60 బంతుల్లోనే తర్వాతి 71 పరుగులు సాధించాడు. ఫెర్నాండో బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అనంతరం ఎంబుల్డెనియా ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదాడు. డిసిల్వా బౌలింగ్లో మరో భారీ సిక్స్తో అతను 150 పరుగులకు చేరుకున్నాడు. షమీ (20 నాటౌట్) అతనికి చక్కగా సహకరించాడు. వీరిద్దరు 94 బంతుల్లోనే 103 పరుగులు జోడించగా జడేజానే 71 పరుగులు చేశాడు. అయితే డబుల్ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో అనూహ్యంగా భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శ్రీలంక ఓపెనర్లు కరుణరత్నే, తిరిమన్నె 18 ఓవర్ల పాటు భారత బౌలర్లను నిరోధించారు. అనంతరం అశ్విన్ బౌలింగ్లో తిరిమన్నె వికెట్ల ముందు దొరికిపోవడంతో పతనం మొదలైంది. ఆ తర్వాత కరుణరత్నేను జడేజా... మాథ్యూస్ (22)ను బుమ్రా... ధనంజయ డిసిల్వా (1)ను అశ్విన్ పెవిలియన్కు పంపించారు. హ్యాడ్లీని దాటిన అశ్విన్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ దిగ్గజం రిచర్ హ్యాడ్లీ (431)ను అశ్విన్ అధిగమించాడు. ప్రస్తుతం 432 వికెట్లతో అతను ఓవరాల్గా 11వ స్థానానికి చేరుకున్నాడు. మరో 3 వికెట్లు తీస్తే కపిల్దేవ్ (434)ను అశ్విన్ దాటుతాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (ఎల్బీ) (బి) ఎంబుల్డెనియా 33; రోహిత్ (సి) లక్మల్ (బి) కుమార 29; విహారి (బి) ఫెర్నాండో 58; కోహ్లి (బి) ఎంబుల్డెనియా 45; పంత్ (బి) లక్మల్ 96; శ్రేయస్ (ఎల్బీ) (బి) డిసిల్వా 27; జడేజా (నాటౌట్) 175; అశ్విన్ (సి) డిక్వెలా (బి) లక్మల్ 61; జయంత్ (సి) తిరిమన్నె (బి) ఫెర్నాండో 2; షమీ (నాటౌట్) 20; ఎక్స్ట్రాలు 28; మొత్తం (129.2 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్డ్) 574. వికెట్ల పతనం: 1–52, 2–80, 3–170, 4–175, 5–228, 6–332, 7–462, 8–471. బౌలింగ్: లక్మల్ 25–1–90–2, ఫెర్నాండో 26–1–135–2, కుమార 10.5–1–52–1, ఎంబుల్డెనియా 46–3–188–2, డిసిల్వా 18.2–1–79–1, అసలంక 3.1–0–14–0. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: కరుణరత్నే (ఎల్బీ) (బి) జడేజా 28; తిరిమన్నె (ఎల్బీ) (బి) అశ్విన్ 17; నిసాంక (బ్యాటింగ్) 26; మాథ్యూస్ (ఎల్బీ) (బి) బుమ్రా 22; డిసిల్వా (ఎల్బీ) (బి) అశ్విన్ 1; అసలంక (బ్యాటింగ్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (43 ఓవర్లలో 4 వికెట్లకు) 108. వికెట్ల పతనం: 1–48, 2–59, 3–96, 4–103. బౌలింగ్: 7–3–17–0, బుమ్రా 9–2–20–1, అశ్విన్ 13–6–21–2, జయంత్ 5–2–14–0, జడేజా 9–3–30–1. -
తిరుమల బ్రహ్మోత్సవాలు: చిన్న శేషవాహనంపై శ్రీవారు
-
ఏపీలో ఎగుమతుల పామర్ధ్యం రెట్టీంపు చేయీలన్న లక్ష్యంతో కార్యక్రమం
-
ఏపీ ఫైబర్నెట్ కేసు: రెండో రోజు సీఐడీ విచారణ
-
TS: రెండోరోజుకు చేరిన జూడాల సమ్మె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ జూనియర్ డాక్టర్లు(జూడాలు) చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. నేటినుంచి అత్యవసర సేవలను కూడా బంద్ చెస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం రాత్రి వరకు జూడాలు డీఎంఈతో చర్చలు కొనసాగించారు. అయితే ఈ చర్చలు విఫలం కావడంతో సమ్మెను రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. ఇక జూడాల సమ్మెపై సీఎం కేసీఆర్ సీరియస్ అయి వెంటనే విధుల్లో చేరాలని కోరిన విషయం తెలిసిందే. ప్రభుత్వ హామీలు లిఖితపూర్వకంగా ఇస్తేనే తాము విధుల్లో చేరుతామని జూడాలు స్పష్టం చేశారు. ఇవాళ మరోసారీ డీఎంఈతో జూడాల చర్చలు జరగనున్నాయి. చదవండి: జూడాల సమ్మె సరికాదు: సీఎం కేసీఆర్ -
తెలంగాణ: రెండోరోజుకు చేరిన జూడాల సమ్మె
-
వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోలు ధర
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. మార్చి 25, గురువారం పెట్రోల్ ధర లీటరుకు 21 పైసలు, డీజిల్పై 20 పైసలు చొప్పున తగ్గిస్తూ చమురు రంగ సంస్థలు నిర్ణయించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న(మార్చి24, బుధవారం) తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం కూడా ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. తాజా సవరణతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు. 90.99 నుండి లీటరుకు. 90.78 కు చేరింది. డీజిల్ 20 పైసలు తగ్గి 81.30 నుండి. 81.10 స్థాయికి చేరింది. వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోలు ధర రూ. 97.19, డీజిల్ ధర 88.20 చెన్నైలో పెట్రోల్ రూ.92.77, డీజిల్ రూ.86.10 కోల్కతాలో పెట్రోల్ రూ.90.98, డీజిల్ రూ.83.98 బెంగళూరులో పెట్రోల్ రూ.94.04, డీజిల్ రూ.86.21 హైదరాబాద్లో పెట్రోల్ రూ.94.39 డీజిల్ రూ.88.45 అమరావతి పెట్రోల్ రూ.96.99, డీజిల్ రూ.90.52 -
గ్రేటర్ వార్: రెండో రోజు భారీగా నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమైన రెండో రోజు (గురువారం) 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో ఇప్పటి వరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లను దాఖలు చేశారు. నేడు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో బీజేపీ నుండి 140 మంది, సీపీఐ నుండి ఒకరు, సీపీఐ(ఎం) నుండి నలుగురు, కాంగ్రెస్ నుండి 68, ఎంఐఎం నుండి 27, టీఆర్ఎస్ నుంచి 195 మంది, టీడీపీ నుండి 47.. రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుండి 16 మంది, స్వతంత్రులు 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాగా రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. (చదవండి: గ్రేటర్ ఎన్నికలు: టీఆర్ఎస్ రెండో జాబితా ఇదే..) -
బాలాత్రిపుర సుందరీ నమోస్తుతే..
-
రెండో రోజు గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు నేడు రెండో రోజు రాష్ట్ర్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరుకు గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సర్వేయర్ల పోస్టులకు పరీక్షలు జరుగుతాయి. 2,880 వీఆర్వో, 11,158 సర్వేయర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరుకు 13,540 ఏఎన్ఎం, వార్డు హెల్త్ సెక్రటరీ పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 72,581 అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి... పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. సెల్ఫోన్లు, ఇతర వస్తువులు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబడవని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ 500 బస్సులను ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. బస్టాండ్, రైల్వేస్టేషన్లో అభ్యర్థుల కోసం హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల అవస్థలు.. విశాఖపట్నం: అరకు పాసింజర్ ఆలస్యంతో..సచివాలయం రాత పరీక్షకు ముందుగా బయలుదేరిన గిరిజన యువత ఇబ్బందులు పడ్డారు. ఉత్తరసింహాచలంలో అర్ధరాత్రి 12 గంటల వరుకు పాసింజర్ నిలిచిపోయింది. చంటి పిల్లల తల్లులు నరకయాతన పడ్డారు. -
ఉప్పల్ శిల్పారామం కిటకిట
-
సీఎం రమేష్ ఇళ్లపై రెండోరోజు ఐటీ సోదాలు
-
ఇండియా 649 డిక్లేర్డ్
-
ఎక్కడ లారీలు అక్కడే !
విజయవాడ : రవాణా రంగ సమస్యల పరిష్కారం కోసం ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా శనివారం కృష్ణా జిల్లాలో రెండో రోజు లారీల నిరవధిక సమ్మె కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా లారీలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో ఆటోనగర్, భవానీపురం, జిల్లాలో గుడివాడ, నందిగామ, ఇబ్రహీంపట్నం, నూజివీడు ప్రాంతాల్లో రవాణా వాహనాలు నిలిపివేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే లారీలు కూడా గమ్యస్థానాలకు చేరుకుని నిలిపివేశామని కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు కోనేరు రామారావు, ప్రధాన కార్యదర్శి అడుసుమిలి సదాశివరావు, ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావులు సంయుక్త ప్రకటనలో తెలిపారు. లారీ యజమానులు చేపట్టిన సమ్మెకు టాక్సీ, మినీట్రాన్స్పోర్టు, తదితర సంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి. లారీ ఓనర్ల సమస్యలు పరిష్కరించకపోతే తాము కూడా బంద్లో పాల్గొంటామన్నారు. -
ఒక్క రోజులోనే మారిన అన్న క్యాంటీన్.. గేట్లకు తాళం
-
రెండో రోజుకు చేరిన రైతుల ఆందోళన
న్యూఢిల్లీ/పట్నా: రైతులు చేపట్టిన దేశవ్యాప్త ఆందోళన రెండోరోజుకు చేరుకుంది. సరఫరా నిలిచిపోవటంతో కొన్ని నగరాల్లో కూరగాయల ధరలు పెరిగాయి. ఈ నెల 5వ తేదీ నుంచి ఆందోళనలను ఉధృతం చేయనున్నట్లు వామపక్ష రైతు సంఘాల సమాఖ్య హెచ్చరించింది. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు, రైతు రుణాల మాఫీ తదితర డిమాండ్లతో దేశంలోని 22 రాష్ట్రాల్లో 10 రోజుల పాటు నిరసనలు తెలపాలని రైతు సమాఖ్య పిలుపునివ్వడం తెల్సిందే. పంజాబ్లోని నభా, లూథియానా, ముక్త్సర్, తరన్తారన్, నంగల్, ఫిరోజ్పూర్ తదితర ప్రాంతాల్లో రైతుల ఆందోళనలు కొనసాగాయి. పాలు, కూరగాయలను మార్కెట్లకు తీసుకెళ్తున్న వాహనాలను రైతులు అడ్డుకున్నారు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకే ఆందోళనలు చేస్తున్నారని వ్యవసాయ మంత్రి రాధా మోహన్సింగ్ అన్నారు. రైతుల ఆందోళన పట్టించుకునే అంశమే కాదని హరియాణా సీఎం మనోహర్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. -
రెండో రోజు పాదయాత్ర డైరీ
-
కాసేపట్లో 2వ రోజు ప్రజసంకల్ప యాత్ర
-
రెండు రోజులకే టమాట కౌంటర్ మూత
అనంతపురం అగ్రికల్చర్ : కిలో రూ.60 అంటూ మార్కెటింగ్శాఖ ఆర్భాటంగా రైతుబజార్లో శుక్రవారం ప్రారంభించిన టమాట కౌంటర్ రెండు రోజులకే మూతేశారు. ఆదివారం ఉదయం కాసేపు అమ్మిన ఆ శాఖ సిబ్బంది... స్టాకు లేదంటూ బోర్డు తగిలించేసి వెళ్లిపోయారు. ఆదివారం కావడంతో కొందరు వినియోగదారులు రైతుబజార్కు వచ్చి.. కౌంటర్మూతేయడం చూసి నిరాశతో వెనుదిరిగారు. మొదటి రోజు కొనుగోలు చేసి తీసుకొచ్చిన టమాటాలు అయిపోయినట్లు తెలిపారు. కిలో రూ.60 కావడంతో ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. బయట కూడా కాస్త అటు ఇటుగా లభిస్తున్నాయని, చాలా మంది పెదవి విరిచారు. ఉన్న టమాటాలను సమీప ప్రాంతాల్లోని చిరువ్యాపారులకు అమ్మేసి కౌంటర్ క్లోజ్ చేశారు. సోమవారం కూడా టమాటాలు అందుబాటులో ఉండదని బోర్డు అతికించారు. -
తలాక్పై సుప్రీంకోర్టులో రెండోరోజూ విచారణ
-
రెండో రోజు కొనసాగుతోన్న ఏసీబీ రైడ్స్
-
రాట్నాలమ్మకు లక్ష కుంకుమార్చన
రాట్నాలకుంట(పెదవేగి రూరల్): రెండో రోజు ధనలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన రాట్నాలమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం 9 గంటలకు సామూహిక విశేష లక్ష కుంకుమార్చన, మధ్యాహ్నం 12 గంటలకు లలితా త్రిపుర సుందరి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. రాత్రి 7 గంటలకు పుష్పయాగోత్సవం, రాత్రి 9 గంటలకు రేలా రేలా జానపద నృత్య ప్రదర్శన, భక్తచింతామణి నాటకం వేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో పెదపాడు ఎంపీపీ మోరు శ్రావణి పాల్గొని పూజలు నిర్వహించారు. -
కోహ్లి నమ్మకమే నడిపించింది
కటక్: దాదాపు మూడేళ్ల విరామం అనంతరం వన్డే జట్టులోకి వచ్చినా డాషింగ్ బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్ సూపర్ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదకర క్యాన్సర్ బారిన పడడంతో పాటు ఫామ్లో లేకపోవడం కారణంగా ఇన్నాళ్లూ తనకు జట్టులో చోటు లేకుండా పోయింది. ఈ దశలో ఇక కెరీర్కు ముగింపు పలకాలని కూడా ఆలోచించాడట. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లి తనపై ఉంచిన నమ్మకం కారణంగానే భవిష్యత్పై ఆశలు పెంచుకున్నానని యువీ తెలిపాడు. ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో యువీ 150 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ‘జట్టు ఆటగాళ్లతో పాటు కెప్టెన్ మన వెనకాల ఉంటే ఆత్మవిశ్వాసం ఎప్పటికీ ఉంటుంది. నా విషయంలో కోహ్లి చాలా నమ్మకం ఉంచాడు. గడ్డు స్థితిలో ఉన్నప్పుడు కెరీర్లో కొనసాగాలా? వద్దా? అని కూడా ఆలోచించాను. ఈ ప్రయాణంలో నాకు చాలా మంది సహకరించారు. ఫిట్నెస్ కోసం రెండు మూడేళ్లు కఠినంగా శ్రమించాను. జట్టులో కూడా నిలకడగా స్థానం లేకుండా పోయింది. అయితే పరిస్థితులు కచ్చితంగా మారతాయని విశ్వసించాను’ అని 35 ఏళ్ల యువరాజ్ తెలిపాడు. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక చేసిన ఈ సెంచరీ చాలా ప్రత్యేకమైందని అన్నాడు. రెండో వన్డేలో ధోని, తాను ముందుగా 25, 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాలని చర్చించుకున్నామని అన్నాడు. ఆ తర్వాత తాము కూడా క్రీజులో కుదురుకున్నాక పరుగులు భారీగా వచ్చాయని వివరించాడు. ధావన్ కు గాయం : భువనేశ్వర్ నుంచి కోల్కతా చేరుకున్న వెంటనే శిఖర్ ధావన్ ఆస్పత్రికి వెళ్లడం చర్చనీయాంశమైంది. గత అక్టోబర్లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో ధావన్ ఎడమ బొటనవేలికి గాయమైంది. ఇప్పుడు అదే మళ్లీ తిరగబెట్టిందని అనుమానిస్తున్నారు. గంటకు పైగా తను రేడియాలజీ డిపార్ట్మెంట్లో గడిపినట్టు సమాచారం. ఇంగ్లండ్కు జరిమానా: భారత్తో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ మోర్గాన్ పై 20%, ఆటగాళ్లపై 10% మ్యాచ్ ఫీజులో కోత వేశారు. మరోవైపు గాయంతో అలెక్స్ హేల్స్ చివరి వన్డే, టి20లకు దూరమయ్యాడు. -
రెండో రోజు నంది ఉత్సవం
-
తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ సందడే..సందడి
-
ఆట అదిరింది
రెండో రోజు కొనసాగిన స్కేటింగ్ పోటీలు పలు విభాగాల్లో మెరిసిన క్రీడాకారులు భానుగుడి (కాకినాడ) : అంతర్ జిల్లాల పాఠశాల క్రీడల్లో భాగంగా జరుగుతున్న రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలు రెండో రోజైన శనివారం కూడా కొనసాగాయి. కాకినాడ రాజా ట్యాంకు స్కేటింగ్ రింక్లో 9 జిల్లాల క్రీడాకారులకు అండర్–11, 14, 17, 19 విభాగాల్లో పలు పోటీలు నిర్వహించారు. కర్ణాటక గుల్బర్గాలో నిర్వహించే జాతీయ స్థాయి క్రీడలకు రాష్ట్రం నుంచి 48 మంది క్రీడాకారులను ఈ పోటీల ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం స్థానిక పిండాల చెరువు నుంచి నూకాలమ్మ గుడి వరకూ రోడ్డును బ్లాక్ చేసి రోడ్–1, రోడ్–2లుగా పోటీలు నిర్వహించారు. రోడ్ రేస్ అండర్–11 విభాగంలో పీఎస్పీ రజని (విశాఖ), బి.యశ్విని (కృష్ణా), బి.çసుప్రియ; అండర్–11 బాలుర విభాగంలో అభిరామ్ (కృష్ణా), పి.శివబాలాజీ (కృష్ణా), పి.సాహత్శ్రీ (విశాఖ) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అండర్–14 విభాగంలో ఎంపీ విఠల్, కేఎస్ఎస్వీ లక్షి్మ; అండర్–17 విభాగంలో జి.కారుణ్యవర్మ, ఎ¯ŒSఎస్పీ వైజయంతి మణి, అండర్–19 విభాగంలో బి.విజయశంకర్, కేఎల్ కౌసల్యలు ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు అందుకున్నారు. స్కేటింగ్ రింక్లో ఆయా విభాగాలకు సంబంధించి క్రీడలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. విజేతలకు డీఎస్డీవో పి.మురళీధర్, పాఠశాల క్రీడల కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి, డీవైఈఓలు ఆర్ఎస్ గంగాభవాని, డి.వాడపల్లి, అబ్జర్వర్ రామ్కుమార్, స్టేట్ టెక్నికల్ అఫీషియల్ గంగాధర్, దొరయ్యస్వామి, సుబ్రహ్మణ్యం, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం వెంకటేశ్వరరావు, పీడీ రంగా, పీఈటీ స్వామి పాల్గొన్నారు. -
రద్దుతో విపక్షాల ఎదురు దాడి
-
గుంటూరు జిల్లాలో జగన్ రెండో రోజు పర్యటన
-
రెండోరోజు ఆత్మకూర్ బంద్ విజయవంతం
– జేఏసీ నాయకుల అరెస్టు, సెల్టవర్ ఎక్కి నిరసన ఆత్మకూర్ : పాలమూరు జిల్లాలోనే ఆత్మకూర్, అమరచింత, చిన్నచింతకుంట మండలాలు కొనసాగించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం రెండోరోజు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు గంగాధర్గౌడ్, గాడి కృష్ణమూర్తి, రామలక్ష్మారెడ్డి, తిప్పారెడ్డి, పురం సుదర్శన్రెడ్డి, రవికుమార్యాదవ్ మాట్లాడుతూ మూడు మండలాలు పాలమూరులోనే కొనసాగితే డివిజన్, నియోజకవర్గకేంద్రంగా ఏర్పడుతుందని అన్నారు. తమను బలవంతంగా వనపర్తిలో కలిపితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. గాం«ధీచౌక్లో నిరసన తెలుపుతున్న జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి చిన్నచింతకుంట పోలీస్స్టేçÙన్కు తరలించారు. బంద్ సందర్భంగా ఆందోళనకారులు స్థానిక రేయిన్బో బేకరిపై దాడిచేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రాకపోకలు స్థంభించిపోయాయి. దుకానాలు మూతపడడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టవర్ఎక్కి నిరసన.. జేఏసీ నాయకుల అరెస్టును నిరసిస్తు ఆత్మకూర్కు చెందిన అజ్జపాగ లక్ష్మణ్, కర్రెశ్రీను, మొగిలన్న స్థానిక ఎయిర్టెల్ టవర్ఎక్కి నిరసన తెలిపారు. పాలమూరులోనే తాము కొనసాగుతామని తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. తహసీల్దార్ ప్రేమ్రాజు, ఎస్ఐ సీహెచ్ రాజు టవర్ వద్దకు వెళ్లి కిందికి దిగాలని ఫోన్ద్వారా కోరారు. తమ నాయకులను విడుదల చేస్తేనే దిగుతామని తేల్చి చెప్పారు. సుమారు నాలుగుగంటల పాటు టవర్పైనే ఉండి నినాదాలు చేశారు. జేఏసీ నాయకుల విడుదల అనంతరం వారు కిందికి దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా గద్వాల డీఎస్పీ బాలకోటి, సీఐ ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పుట్నాల రమేష్, అశ్విన్కుమార్, అబ్దుల్జలీల్, అశోక్కుమార్, రత్నం, రాములు, బంగారు శ్రీను, చెన్నయ్య, ఎస్టీడీ శ్రీనివాసులు, రహమతుల్లా, ప్రతాప్రెడ్డి, బంగారు భాస్కర్, లింగయ్య, వెంకటేష్, మాసన్న, గడ్డంశ్రీనివాస్యాదవ్, తుకారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఏలూరులో రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు
-
కృష్ణమ్మ.. చల్లంగా చూడమ్మ
-
రెండో రోజు కృష్ణమ్మ పుష్కర శోభ
-
రెండో రోజు పుష్కరా పుణ్యస్నానాలు
-
పుష్కర క్షేత్రంలో భక్తుల సందడి
బాల్కొండ/మోర్తాడ్/రెంజల్ : అంత్య పుష్కరాల రెండో రోజు సోమవారం భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండప్రదానం చేశారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ పుష్కరక్షేత్రంలో 2, 4 ఘాట్ల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. నదిలోని పురాతన శివాలయం వద్ద భక్తులు పూజలు చేశారు. మోర్తాడ్ మండలంలోని తడపాకల్, బాల్కొండ మండలంలోని ఎస్సారెస్పీ పుష్కర ఘాట్ల వద్ద కూడా సోమవారం సందడి కనిపించింది. ఎస్సారెస్పీ పుష్కర ఘాట్లకు భక్తులు తరలివచ్చారు. సమీపంలోని కోదండ రామాలయంలో పూజలు చేశారు. మహంకాళి ఆలయంలో రెండో రోజూ నవ చండీ యాగం కొనసాగింది. -
రెండవ రోజు ఇండియా ఫ్యాషన్ వీక్
-
2వ రోజు పార్లమెంట్ సమావేశాలు
-
రెండో రోజు కొనసాగనున్న రావెల సుశీల్ విచారణ
హైదరాబాద్: మహిళను వేధించిన కేసులో ఏపీ మంత్రి రావెల కిశోర్బాబు కుమారుడు సుశీల్, అతని డ్రైవర్ రమేష్ను బంజారాహిల్స్ పోలీసులు గురువారం కూడా విచారించనున్నారు. నిందితులను రెండో రోజులు విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. పోలీసులు బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారించారు. నేటితో విచారణ ముగియనుంది. ఇప్పటికే అతను బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 3న బంజారాహిల్స్ రోడ్నెం-13లోని అంబేద్కర్నగర్ బస్తీలో రోడ్డుపై వెళుతున్న మహిళా టీచర్ ఫాతిమా బేగం పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో సుశీల్ తో పాటు అతడి కారు డ్రైవర్ రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్ప తాగిన మైకంలో పబ్లిక్గా ప్రైవేటు స్కూల్ టీచర్ ఫాతిమా బేగంను చేయిపట్టుకు లాగి కారులో తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటనలో నిర్భయ చట్టం, ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గురువారం విచారణ అనంతరం అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. ఇది ప్రతిపక్ష కుట్ర: సుశీల్ తనపై కేసు నమోదు చేయడం వెనక ప్రతిపక్ష పార్టీ హస్తముందని రావెల సుశీల్ ఆరోపించారు. కస్టడీలోకి తీసుకున్న అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చిన సుశీల్ మాట్లాడుతూ.. తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. ఆ ఘటనలో కేసు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. తాను మంత్రి కుమారుడినైనందునే కేసు పెద్దదైందన్నారు. హోటల్ తాజ్ బంజారాకు వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. -
ఆటో ఎక్స్ పో.. రెండో రోజూ సందడి
గ్రేటర్ నోయిడా: ఆటో షో రెండో రోజు కూడా సందడిగా సాగింది. పలు కంపెనీలు కొత్త కార్లను ఆవిష్కరించాయి. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుండటంతో పర్యావరణానికి అనుకూల వాహనాలకే పెద్ద పీట వేస్తున్నామని పలు కంపెనీలు పేర్కొన్నాయి. బీఎస్-సిక్స్ పర్యావరణ నిబంధనలను 2020 నుంచి అమలు చేయడం తప్పనిసరి చేస్తామని రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. ఈ నిబంధనలకు అనుగుణమైన ఇంధనాలు లభిస్తాయో లేదో నన్న ఆందోళన, భయాలు పెట్టుకోవద్దని వాహన కంపెనీలకు ఆయన అభయం ఇచ్చారు. ఈ నిబంధనలకు తగ్గట్లుగా ఇంజిన్లను రూపొందించడంపై దృష్టి కేంద్రీకరించాలని వాహన కంపెనీలను ఆయన కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాలని సూచించారు. రానున్న బడ్జెట్లో వాహన రంగానికి మేలు చేసే కొత్త స్కీమ్లను ప్రవేశపెట్టాల్సిందిగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు. మహీంద్రా: కంపెనీ కొత్త కాన్సెప్ట్ కూపే ఎక్స్యూవీ ఏరోను ఆవిష్కరించింది. కొరియా భాగస్వామి సాంగ్యాంగ్ కాంపాక్ట్ ఎస్యూవీ టివొలిని కూడా డిస్ప్లే చేసింది. బ్లేజ్ బ్రాండ్తో కొత్త రేంజ్ ట్రక్కులను, ఎలక్ట్రిక్ కారు ఈ20లో స్పోర్ట్స్ను వేరియంట్ను ఆవిష్కరించింది. హ్యుందాయ్: 4 మీ. లోపు ఎస్యూవీ కాన్సెప్ట్ కారు కార్లినోను ఆవిష్కరించింది. తామందిస్తున్న ఎంట్రీ లెవల్ ఎస్యూవీ ఇదని కంపెనీ పేర్కొంది. మారుతీ సుజుకీ: ఈ ఏడాది పండుగల సీజన్ కల్లా స్మార్ట్ అర్బన్ కాంపాక్ట్ కార్ ఇగ్నిస్ను, ప్రీమియం స్పోర్ట్స్ హ్యాచ్బాక్ బాలెనొ ఆర్ఎస్ను అందిస్తామని తెలిపింది. ఈ మోడళ్లకు చెందిన కాన్సెప్ట్ కార్లను మారుతీ ఆవిష్కరించింది. టాటా మోటార్స్: నిర్మాణ రంగం కోసం సిగ్నా రేంజ్ వాణిజ్య వాహనాలను ఆవిష్కరించింది. సిగ్నాలో ట్రాక్టర్, ట్రక్కు, టిప్పర్లను డిస్ప్లే చేసింది. ఆల్ట్రా 1518 పేరుతో మధ్య తరహా, తేలిక రకం వాణిజ్య వాహనాన్ని కూడా ఆవిష్కరించింది. భవిష్యత్ అవసరాల కోసం హైబ్రిడ్ వాహనాలను అందించనున్నామని పేర్కొంది. హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయల్-సెల్ టెక్నాలజీలతో రూపొందించే మ్యాజిక్ ఐరిస్ జివా, టాటా స్టార్బస్ హైబ్రిడ్, టాటా ఐస్ మెగా ఎక్స్ఎల్ను అందిస్తున్నామని వివరించింది. కొత్త డస్టర్: రెనో కంపెనీ అంతా కొత్తదైన డస్టర్ మోడల్ను ఆవిష్కరించింది. 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఈ కారు ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఫోక్స్వ్యాగన్: స్పోర్ట్స్ హ్యాచ్బ్యాక్ పొలో జీటీఐను ఆవిష్కరించింది. 7 స్పీడ్ గేర్ బాక్స్ ఈ కారు ప్రత్యేకత. ఏబీఎస్, ఈఎస్పీ, హిల్-హోల్డ్ వంటి ఫీచర్లున్నాయని పేర్కొంది. బీఎండబ్ల్యూ: ఈ ఏడాది జూన్కల్లా మినీ కన్వర్టబుల్ను అందుబాటులోకి తెస్తామని బీఎండబ్ల్యూ తెలిపింది. మినీ క్లబ్మేన్ కారును కూడా త్వరలోనే భారత్కు తెస్తామని పేర్కొంది. ఫియట్ క్రిస్లర్: పంటో ప్యూర్ కారును ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ కార్ల ధరలు రూ.4.49 లక్షల నుంచి రూ.5.49 లక్షల రేంజ్లో ఉన్నాయని పేర్కొంది. దీంతో పాటు లినియా 125 ఎస్, అవెంచుర అర్బన్ క్రాస్ను కూడా డిస్ప్లే చేసింది. వీటిని ఈ ఏడాదే భారత మార్కెట్లోకి తెస్తామని పేర్కొంది. ఆడి: ఆడి కార్లలోనే అత్యంత సురక్షితమైన ఏ8 ఎల్ సెక్యూరిటీ సెడాన్ను ఆవిష్కరించింది. ఈ కార్ల ధరలు రూ.9.15 కోట్ల నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. టయోటా ప్రియస్: అంతా కొత్తదైన హైబ్రిడ్ కారు ప్రియుస్ను టయోటా కంపెనీ ఆవిష్కరించింది. పర్యావరణ అనుకూల వాహనాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొంది. ఈ కారు ధర రూ.38.1 లక్షలు. నిస్సాన్ బ్రాండ్ అంబాసిడర్గా జాన్ అబ్రహం: భవిష్యత్తులో భారత్లో నిస్సాన్ అందించే బ్రాండ్లకు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. స్పోర్ట్స్ కారు జీటీఆర్, హైబ్రిడ్ ఎస్యూవీ ఎక్స్ట్రయిల్ను త్వరలో అందిస్తామని నిస్సాన్ పేర్కొంది. ఈ ఏడాది ఎక్స్ట్రయల్ ఎస్యూవీలో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ క్రాసోవర్ను అందించనున్నామని పేర్కొంది. భారత్లో ఇదే తొలి పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కానున్నది. -
రెండో రోజు గోదావరి జిల్లాల్లో కోడిపందాల జోరు
-
2వ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్
-
రెండో రోజు ఘనంగా అరకు ఉత్సవాలు
-
నేడు ద్వాసహస్ర చండీ పారాయణం
-
రెండో రోజు ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర
-
కరీంనగర్లో రెండో రోజు వైఎస్ షర్మిల పరామర్శయాత్ర
-
సింహవాహనంపై శేషాచలవాసుడు
-
సాయమ్మ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
రెండో రోజూ సాక్షి 'లివ్ వెల్ ఎక్స్పో'
-
రెండో రోజు కాంగ్రెస్ నిరసనలు
-
రెండో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె
-
రెండో రోజుకు చేరిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే దీక్ష
కావలి: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. సంగెం బ్యారేజ్ ను త్వరగా నిర్మించాలని ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కావలి కాల్వకు పూర్తిస్థాయి సాగునీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గురువారం ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు.సాగునీటిని వెంటనే విడుదల చేసి రైతుల సమస్యలు పరిష్కరించే వరకు వైఎస్ఆర్ సీపీ నేతలు పోరాటం సాగిస్తారని ఆయన అన్నారు. -
రెండోరోజు పరామర్శ యాత్ర ప్రారంభం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర.. మహబూబ్నగర్ జిల్లాలో రెండో రోజుకు చేరుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శిస్తున్నారు. అశేష జనసందోహం మధ్య మొదటి రోజు మూడు కుటుంబాలను పరామర్శించిన షర్మిల... రెండో రోజు మరో మూడు కుటుంబాలను పరామర్శించనున్నారు. కల్వకుర్తి నుంచి ఆమె ఉదయం బయల్దేరారు. మొదట అమ్రాబాద్లోని రంగయ్య కుటుంబాన్ని పరామర్శించి.. అదే ఊరిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత నాగర్కర్నూల్లో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాల వేసి... ఎత్తం గ్రామంలో నర్సింగ్ కుటుంబాన్ని, కొల్లాపూర్లో రామచంద్రయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు. -
నాగేంద్రప్రసాద్ చిత్రం రెండో రోజు విశేషాలు
-
నాగేంద్రప్రసాద్ చిత్రం రెండో రోజు విశేషాలు
స్కిప్ట్ టు స్క్రీన్ గిన్నిస్బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం రెండో రోజు విశేషాలు తారాగణం ఎంపిక కోసం ఫేస్బుక్లో చేసిన ప్రచారానికి విశేషాదరణ లభించింది. చాలామంది తమ ప్రొఫైల్స్ పంపించారు. వాటిల్లోంచి 15 మందిని ఎంచుకుని, మేకప్ టెస్ట్కు పిలిచారు. ఫైనల్గా ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేశారు. ఒక హీరోగా చేస్తున్న సుమంత్రెడ్డికిదే తొలి సినిమా. మరో హీరో మనీష్ ఇంతకుముందు ‘హమ్తుమ్’ తదితర చిత్రాల్లో నటించారు. కథానాయికలు ఆకృతి, మధులగ్నదాస్ ఇప్పటికే కొన్ని సినిమాలు చేశారు. కొన్ని సన్నివేశాలు సంభాషణలతో సహా సిద్ధమయ్యాయి. సంగీత దర్శకుడు సుమన్ జూపూడి తానే ఓ పాట రాసి బాణీతో సహా సిద్ధం చేశారు. ప్రస్తుతం పాట ఆ రికార్డింగ్ జరుగుతోంది. షూటింగ్కు కావాల్సిన సరంజామా అంతా సిద్ధం చేసుకున్నారు. లొకేషన్ల ఎంపిక కూడా పూర్తయింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్-మియాపూర్లోని ఓ ఫామ్ హౌస్లో చిత్రీకరణ మొదలు పెట్టారు. తెల్లవారు జాము 6 గంటల వరకూ నిర్విరామంగా ఈ షూటింగ్ జరుగుతుంది. -
భారత్ తో మూడో టెస్టు: బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్
సౌతాంప్టన్: భారత్తో మూడో టెస్టులో రెండో రోజు సోమవారం ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగింది. 247/2 ఓవర్నైట్ స్కోరుతో కుక్ సేన బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ బాలెన్స్ (104), ఇయాన్ బెల్ (16) క్రీజులోకి వచ్చారు. మ్యాచ్ తొలిరోజు నిలకడగా ఆడిన ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేసింది. భారత బౌలర్లు రోజంతా శ్రమించినా కేవలం రెండు వికెట్లు తీశారు. మొదటి రోజు ఆటతో పోలిస్తే రెండో రోజు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ కాస్త దూకుడు పెంచారు. -
మున్సిపల్ సమ్మె ఉదృతం