singers
-
స్వరంతో కోట్లు సంపాదించిన గాయనీమణులు వీరే! (ఫోటోలు)
-
స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులు
ధనికుల జాబితాలో చోటు సంపాదించుకోవడంలో వ్యాపారవేత్త(BusinessMan)లతో సమానంగా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు ముందుంటున్నారు. అందులో భారతీయ మహిళా గాయకుల(Singers)కు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని సర్వేల ప్రకారం భారత్లోని ధనిక మహిళా గాయకుల జాబితా కింది విధంగా ఉంది. ఇందులో లాతా మంగేష్కర్, తులసీ కుమార్, శ్రేయాఘోషల్, సునిధి చౌహాన్లు ముందు వరుసలో ఉన్నట్లు తెలిసింది.టాప్ ధనిక భారతీయ మహిళా గాయకులు, వారి ఆస్తుల(Asset) విలువ కింది విధంగా ఉంది.లతా మంగేష్కర్ రూ.368 కోట్లుతులసి కుమార్ రూ.210 కోట్లు శ్రేయా ఘోషల్ రూ.185 కోట్లు సునిధి చౌహాన్ రూ.100-110 కోట్లు నేహా కక్కర్ రూ.104 కోట్లు ఆశా భోంస్లే రూ.80-100 కోట్లు అల్కా యాగ్నిక్ రూ.68 కోట్లు మోనాలీ ఠాకూర్ రూ.25 కోట్లుపలక్ ముచ్చల్ రూ.8-9 కోట్లుఇదీ చదవండి: మధ్య తరగతికి పన్ను మినహాయింపు..?సంపద పెరగాలంటే భవిష్యత్తులో మంచి రాబడి ఇచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రధానంగా రియల్ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు, డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు.. వంటి చాలా మార్గాలు సంపదను పెంచుతాయని చెబుతున్నారు. -
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ సింగర్స్ జంట (ఫొటోలు)
-
కెనడా: ఇండియన్ సింగర్స్ ఇళ్ల వెలుపల కాల్పులు
టొరంటో: కెనడాలోని టొరంటోలో ఇండియన్ సింగర్స్ ఉంటున్న ప్రాంతంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటన రికార్డింగ్ స్టూడియో వెలుపల జరిగింది. దుండగులు దాదాపు 100 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కెనడియన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు దుండగులు చోరీ చేసిన వాహనంలో ఘటన జరిగిన ప్రాంతానికి వచ్చారు. అనంతరం స్టూడియో వెలుపల కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా స్టూడియోలో ఉన్నవారు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ కేసులో కెనడా పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 16 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనపై భారత ఏజెన్సీలు నిఘా సారించాయి. కాల్పులు జరిగిన ప్రాంతంలో పలువురు పంజాబీ గాయకుల ఇళ్లు ఉన్నాయి. అలాగే వారి మ్యూజిక్ స్టూడియోలు కూడా ఉన్నాయి.ఈ కాల్పుల ఘటనకు ముందుదిగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో కొందరు పాటలు ప్లే చేస్తూ, ఆయుధాలతో నృత్యం చేయడం కనిపిస్తోంది. ఈ సంఘటన మూడు రోజుల క్రితం జరిగిందని, కెనడియన్ మహిళా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ సమయంలో దుండగులు దాదాపు 100 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఆమె తెలిపారు.ఇదిలావుండగా ఇటీవల ప్రముఖ పంజాబీ గాయకుడు ఏపీ. ధిల్లాన్ ఇంటి బయట కూడా కాల్పులు జరిగాయి. కెనడాలోని వాంకోవర్లో గల అతని ఇంటి వెలుపల కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికిముందు కెనడాలోని ప్రముఖ పంజాబీ గాయకుడు గిప్పీ గ్రేవాల్ ఇంటిపై కూడా కాల్పులు జరిగాయి.ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదంలో యువతీ యువకులు మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు -
చిన్నప్పుడే విషప్రయోగం కానీ.. ‘క్వీన్ ఆఫ్ గజల్స్’ బేగం అఖ్తర్!
చీకటి తరువాత వెలుగు’ అనేది ప్రకృతి సూత్రం.అయితే బేగం అఖ్తర్ విషయంలో ఈ సూత్రం తిరగబడింది. చీకటి తరువాత చీకటి...మరింత చీకటి... ఆమె జీవితం. అంత అంధకారంలోనూ వెయ్యి దీపకాంతులతో సంగీతంతో వెలిగిపోయింది. అందుకే అఖ్తర్ బేగం ‘క్వీన్ ఆఫ్ గజల్స్’ అయింది. ‘అమ్మీ’ నాటకంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ప్రముఖ నటి పద్మిని కొల్హాపురి అక్తర్ బేగం పాత్ర పోషించిన అమ్మీనాటక ప్రదర్శన వివిధ నగరాలలో ప్రారంభమైన సందర్భంగా..వన్స్ అపాన్ ఏ టైమ్... ఇన్ ఫైజాబాద్: న్యాయవాది అస్ఘర్ హుస్సేన్కు ముస్తారీ రెండవ భార్య. కొద్దికాలం తరువాత భార్య, కవల కుమార్తెలు జోహ్ర, బిబ్బీలను దూరం పెట్టాడు. నాలుగేళ్ల వయసులో అక్కాచెల్లెళ్లపై విష ప్రయోగం జరిగింది. మిఠాయిలు తిన్న అక్కాచెల్లెళ్లు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో జోహ్రా చనిపోయింది. విషయం తెలియని బిబ్బీ ‘జోహ్ర ఎక్కడ?’ అని అడిగింది.‘దేవుడి ఇంటికి వెళ్లింది’ అని చెప్పింది కళ్లనీళ్లతో అమ్మ. అప్పుడు బిబ్బీకి ఏం అర్థం కాలేదు. ఆ తరువాత మెల్లగా అర్థం కావడం మొదలైంది. అక్కతో మాట్లాడడం మిస్ అయింది. అక్కతో కలిసి నవ్వులు పంచుకోవడం మిస్ అయింది. జోహ్ర వీపు మీద కూర్చొని గుర్రంలా స్వారీ చేస్తూ బిగ్గరగా అరవడం మిస్ అయింది. క్రమంగా బిబ్బీ నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది.ఎప్పుడూ మౌనంగా ఉండే అమ్మాయి అయింది. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఉండేది. ఇది గమనించిన తల్లి బిబ్బీని సంగీత తరగతులకు పంపించింది. ఆ తరగతులకు ఇష్టంతో వెళ్లిందా, తల్లి బలవంతం మీద వెళ్లిందా అనేది తెలియదుగానీ ఏడేళ్ల వయసులో చంద్రబాయి అనే ఆర్టిస్ట్ సంగీతానికి ఫిదా అయిపోయింది బిబ్బీ. ఇక అప్పటి నుంచి సంగీతం వైపు ఇష్టంగా అడుగులు మొదలయ్యాయి. పట్నాకు చెందిన ప్రసిద్ధ సారంగి విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్దాద్ఖాన్ దగ్గర సంగీతంలో శిక్షణ పొందింది. తల్లితో కలిసి కోల్కతాకు వెళ్లి లాహోర్కు చెందిన మహ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ఖాన్లాంటి శాస్త్రీయ సంగీత దిగ్గజాల దగ్గర సంగీతం నేర్చుకుంది. బిబ్బీ ‘బేగం అఖ్తర్’ అయిందిపదిహేనేళ్ల వయసులో తొలిసారిగా వేదిక మీద కనిపించింది. నేపాల్–బిహార్ భూకంప బాధితుల సహాయంకోసం ఏర్పాటు చేసిన కచేరిలో బేగం అఖ్తర్ గానాన్ని సరోజినీనాయుడు ప్రశంసించింది. ఆ ప్రశంస తనకు ఉత్సాహాన్ని ఇచ్చింది. గజల్స్, దాద్రాలు, టుమ్రీల గ్రామ్ఫోన్ రికార్డులతో బేగం అఖ్తర్ పేరు మారుమోగిపోయింది. వినేకొద్దీ వినాలనిపించే స్వరం, అందమైన రూపం ఆమెను సినిమా రంగానికి తీసుకెళ్లింది. మన దేశంలో టాకీ శకం మొదలైన తరువాత కొన్ని హిందీ చిత్రాలలో నటించింది. తాను నటించిన అన్ని సినిమాల్లోని పాటలను స్వయంగా పాడింది.లక్నోకు చెందిన ఇష్తియాక్ అహ్మద్ అబ్బాస్ అనే బారిస్టర్తో అఖ్తర్కు వివాహం అయింది. వివాహానంతరం భర్త ఆంక్షల కారణంగా దాదాపు ఐదేళ్ల పాటు గానానికి దూరం అయింది. దీనికి తోడు తల్లి చనిపోవడంతో అఖ్తర్ మానసికంగా, శారీరకంగా బాగా కుంగిపోయింది. ‘మీరు దుఃఖం నుంచి బయటపడే మార్గం సంగీతం మాత్రమే’ అని వైద్యులు సలహా ఇచ్చారు. అలా వారి సలహాతో సంగీతానికి మళ్లీ దగ్గరైంది.సంగీతం వైపు తిరిగిరావడం బేగం అఖ్తర్కు రెండో జీవితం అయింది. ఆల్ ఇండియా రేడియో ద్వారా తన తీపి గళాన్ని దేశం నలుమూలలా వినిపించింది. 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన బేగం అఖ్తర్ అభిమానుల గుండ్లెలో ‘క్వీన్ ఆఫ్ గజల్స్’గా నిచిలింది.‘ఏ మొహబ్బతే’ పుస్తకం రాసిన రీటా గంగూలి మాటల్లో... ‘బేగం అఖ్తర్ అంటే ఏళ్ల తరబడి ఒంటరితనం. నీడలా వెంటాడే బాధ. విషాదం అనేది తన జీవితంలో విడదీయని భాగం అయింది. జీవితంలో లోతైన శూన్యాన్ని అనుభవించిన బేగం అఖ్తర్ దేవుడా, తర్వాత ఏమిటి అనే భయంతోనే జీవించింది. ప్రకాశవంతమైన చిరునవ్వుతో అత్యంత విషాదకరమైన పాటను పాడే సామర్థ్యం ఆమెలో ఉంది’.‘అమ్మీ’గా రంగస్థలం పైకి...నాటకరంగాన్ని తన కాలింగ్ అండ్ కంఫర్ట్జోన్గా పిలిచే నటి పద్మిని కొల్హాపురి గత కొన్ని నెలలుగా ఉర్దూ మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించింది. దీనికి కారణం అమ్మీ. ఈ నాటకంలో ఆమె బేగం అక్తర్గా కనిపిస్తుంది. ‘బేగం అక్తర్ పాత్ర పోషించడంతో నా కల సాకారమైంది’ అంటుంది పద్మిని కొల్హాపురి.పద్మిని గతంలో కొన్ని నాటకాల్లో నటించినా ‘అమ్మీ’ నాటకం మాత్రం ఆమెకు నిజంగా సవాలే.‘బేగం అక్తర్ పాత్రను పోషించడం అనేది కత్తిమీద సాములాంటిది. ఈ పాత్ర ఒకే సమయంలో ఉత్తేజపరుస్తుంది. ఆందోళనలోకి నెడుతుంది. విషాదంలోకి తీసుకువెళుతుంది’ అంటుంది పద్మిని కొల్హాపురి. -
Aria: ‘మా కలలు, కన్నీళ్లు, కష్టాలు.. ఈ ఆల్బమ్లో ఉంటాయి’
డిజిటల్ సింగిల్ ‘కీపింగ్ ది ఫైర్’తో ఆరంగేట్రం చేసింది ‘ఎక్స్: ఇన్’ అనే అయిదుగురు సభ్యుల మల్టీనేషనల్ గర్ల్ గ్రూప్. ఈ గ్రూప్లోని సభ్యుల పేర్లు.. ఇషా, నిజ్, హన్నా, నోవ, ఆరియా (ఇండియా) సెకండ్ మినీ ఆల్బమ్ ‘ది రియల్’తో మరోసారి సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది ‘ఎక్స్:ఇన్’ బృందం.‘మా కలలు, కన్నీళ్లు, కష్టాలు ఈ ఆల్బమ్లో ఉంటాయి’ అంటుంది మెయిన్ ర్యాపర్, లీడ్ డ్యాన్సర్ నోవ. ఈ ఆల్బమ్ తమ పర్సనల్ స్టోరీలకు సంబంధించిన ‘మ్యూజికల్ ఎక్స్ప్రెషన్’ అని కూడా అంటుంది నోవ. ‘ది రియల్’లో నో డౌట్, మై ఐడల్, విత్డ్రా, నెవర్ సారీ అనే పాటలు ఉన్నాయి. సవాళ్లు, ఆటుపోట్లను అధిగమించి ఉన్నతస్థానానికి చేరడమే ఆల్బమ్లోని పాటల సారాంశం.‘కష్టాలు ఉన్నట్లే వాటిని అధిగమించే దారులు ఉన్నాయి. అయితే ఆ దారి గురించి ఎంత త్వరగా తెలుసుకుంటామనేది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది’ అంటుంది ఆరియా.ఇవి చదవండి: Aditya Dadia: అతను.. అక్షరాలా ఆల్రైట్! -
Pankaj Udhas కాలం పగబట్టిందేమో! మరో దిగ్గజం నింగికెగిసింది!
లెజెండ్రీ గాయకుడు, గజల్ మాస్ట్రో పంకజ్ఉద్దాస్ సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడతున్న ఆయన సోమవారం ఇక సెలవంటూ వెళ్లిపోయారు. పంకజ్ ఉదాస్అనేక ఆల్బమ్లను విడుదలచేశారు ప్రపంచవ్యాప్తంగా కచేరీలిచ్చారు. మధురమైన గాత్రంతోనే కాదు, పదునైన సాహిత్యంతో కూడా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. గజల్ పంకజ్.. పంకజ్ గజల్! 'చిట్టి ఆయీ హై', 'జీయే తో జీయే కైసే', 'చుప్కే చుప్కే' 'ఔర్ అహిస్తా', లాంటి పాటలతో దశాబ్దాల పాటు ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ గళం మూగపోయింది. కానీ తరతరాలుగా శ్రోతల చెవులలో ఆ మధుర గీతాలుప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. పంకజ్ ఉద్ధాస్ మరణంతో యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. సోనూ నిగమ్ లాంటి గాయకులు ఆయనను గుర్తు చేసుకొని సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. కాలం పగబట్టిందేమో.. పెద్దవాళ్లు, గొప్పవాళ్లు ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు అంటూ కన్నీటి పర్యంత మవుతున్నారు. సోషల్ మీడియాలో ఆర్ఐపీ పంకజ్ ఉద్దాస్ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. Thank you Pankaj Udhas Ji for such masterpieces 😊 RIP to the departed soul 💔 Legend never Dies !! @musicculturehub pic.twitter.com/YAiWccPgvo — Utkarsh (@utkarshh_tweet) February 26, 2024 View this post on Instagram A post shared by Sonu Nigam (@sonunigamofficial) 1951న మే 17, గుజరాత్లో జన్మించారు. తన ముగ్గురు సోదరులలో చిన్నవాడు పంకజ్. చిన్న వయస్సులోనే సంగీతం పట్ల ఆకర్షితులై, తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. అలా భారతీయ సంస్కృతి, సంగీతం ఆయన ముద్ర చెరగనిది. 1980 , 1990 లలో ఆయన పాటలు, గజల్స్ బాగా పాపులర్ అయ్యాయి. గజల్స్తోపాటు, బాలీవుడ్ సినిమాల్లో పాటలు అనేకం సూపర్హిట్గా నిలిచాయి. 1989లో 'నబీల్' ఆల్బమ్ అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్లలో ఒకటిగా నిలిచింది. తొలి కాపీ వేలంలో రూ. 1 లక్షకు విక్రయించారు. సంగీత ప్రపంచంలో తన ప్రతిభను చాటుకున్న పంకజ్ఉద్దాస్ దాత్వంలోని తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ లక్ష రూపాయలను కేన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్కు అందజేశారు. ఇలాంటి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు సామాజిక సంక్షేమం కార్యక్రమాలకు మద్దతిచ్చేవారు. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలకుగాను 2006లో భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మశ్రీ దక్కింది. మరికొన్ని సంగతులు పంకజ్ఉద్దాస్ కన్సర్ట్లో బాలీవుడ్ స్టార్ హీరోషారూఖ్ఖాన్ అందుకున్న తొలి పారితోషికం 50 ఆ డబ్బుతో రైల్లో ఆగ్రా వెళ్లి తాజ్ మహల్ చూశామని స్వయంగా షారూఖ్ ఒకసారి వెల్లడించారు. బాలీవుడ్కు పాటలను అందించడమే కాకుండా నటుడు జాన్ అబ్రహంను కూడా తెరపైకి తెచ్చింది కూడా పంకజ్ ఉద్ధాస్. పంకజ్ తొలుత డాక్టర్ కావాలనుకున్నారట. తండ్రి కేశుభాయ్ ఒక రైతు , తల్లి జితుబెన్ సాధారణ గృహిణి. పెద్ద సోదరుడు మన్హర్ బాలీవుడ్ చిత్రాలలో హిందీ నేపథ్య గాయకుడు. రెండో అన్నయ్య నిర్మల్ ఉద్దాస్ కూడా ప్రసిద్ధ గజల్ గాయకుడే. పంకజ్ భార్య ఫరీదా. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు- నయాబ్, రీవా -
Grammy Awards 2024: భారత్కు ‘గ్రామీ’ సంబరం
ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. 2024 సంవత్సరానికి గాను ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్ నగరంలో ఆదివారం రాత్రి ఈ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్రామ్ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్కు మొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. న్యూఢిల్లీ: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్లో ఆదివారం పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహాదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్రామ్ను గ్రామీలు వరించాయి. జాకీర్ హుస్సేన్కుమొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్లో విడుదల చేసిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్కు గాను శంకర్ మహాదేవన్, గణేశ్ రాజగోపాలన్, సెల్వగణేశ్ వినాయక్రామ్, జాకీర్ హుస్సేన్కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్కు గాను శక్తి బృందం ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్ హుస్సేన్కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్(పాష్తో), బెస్ట్ కాంటెపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్(యాజ్ వీ స్పీక్) కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాష్తో, యాజ్ వీ స్పీక్ ఆల్బమ్లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. గ్రామీ విజేతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. టేలర్ స్విఫ్ట్కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఈ ఏడాది 80కి పైగా కేటగిరీల్లో గ్రామీ పురస్కారాలు ప్రదానం చేశారు. ‘మిడ్నైట్స్’ ఆల్బమ్కుఅమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ లభించింది. ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఆమెకిది నాలుగోసారి! మిలీ సైరస్కు రికార్డు ఆఫ్ ద ఇయర్ (ఫ్లవర్స్), బిల్లీ ఐలి‹Ùకు సాంగ్ ఆఫ్ ద ఇయర్ (వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?) గ్రామీలు దక్కాయి. ‘బెస్ట్ న్యూ ఆర్టిస్టు’ విభాగంలో విక్టోరియా మాంట్ గ్రామీని సొంతం చేసుకున్నారు. -
స్వీట్ ట్యూన్ ట్విన్ సిస్టర్స్!
ట్విన్ సిస్టర్స్ సుకృతి, ప్రకృతి కకర్లకు సంగీతం బాల్యం నుంచి సుపరిచితం. తల్లి మ్యూజిక్ టీచర్. అక్క ప్రొఫెషనల్ సింగర్. ఎనిమిది సంవత్సరాల వయసులో సంగీత ప్రపంచంలో తొలి అడుగులు వేశారు. పాపులర్ హిట్స్తో సింగర్స్గా బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అక్క సుకృతి సంగీతంలో తమకు స్ఫూర్తి అని చెబుతారు. అలా అని అక్కను అనుకరించకుండా తమదైన ముద్ర కోసం ప్రయత్నించి విజయం సాధించారు ప్రకృతి. ‘మొదట్లో ప్రశంసలను మాత్రమే ఆస్వాదించే వాళ్లం. విమర్శలను దూరంగా పెట్టేవాళ్లం. అయితే సంగీత పరిశ్రమలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా సహజం అనే వాస్తవం తెలుసుకున్నాను. నిర్మాణాత్మక విమర్శలు ముఖ్యం. ద్వేషపూరిత విమర్శలతో ట్రోలింగ్ చేయడం తగదు’ అంటుంది ప్రకృతి. వంద వరకు లైవ్ షోలు చేసిన ఈ సిస్టర్స్ ‘ప్రతి షో ఒక పాఠం నేర్పుతుంది’ అంటారు. ‘ప్రపంచవ్యాప్తంగా మ్యూజిషియన్లు లైవ్ షోలకు ప్రాధాన్యత ఇస్తారు. మేము కూడా అంతే. ఆన్లైన్లో కంటే ప్రేక్షకుల సమక్షంలో వారి ప్రతిస్పందనలు, ప్రశంసలు, చప్పట్లు ఆస్వాదిస్తూ లైవ్ షో చేయడంలో ఎంతో మజా ఉంటుంది. ఇక ఇండిపెండెంట్ మ్యూజిక్ మాలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది. యువ సంగీతకారులు తమను నిరూపించుకోవడానికి ఇండిపెండెంట్ మ్యూజిక్ సహాయపడుతుంది’ అంటుంది సుకృతి. (చదవండి: చీకటిమయంగా ఉన్న కూతురి జీవితాన్ని 'ప్రేరణ ' ఇచ్చే శక్తిగా మార్చిన ఓ తల్లి కథ!) -
గాయకులతో కలిసి బతుకమ్మ పాట పడిన ఎమ్మెల్సీ కవిత
-
భారతదేశంలోని టాప్ 10 జానపద గాయకులు
-
అంతర్జాతీయంగా గుర్తింపుపొందిన సింగర్స్
-
ఓరి బాబోయ్ ఇది మాములు ర్యాగింగ్ కాదు...నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారు..
-
విశాఖ : సుశీల, ఉషా ఉతుప్లకు మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమన్ అవార్డు (ఫొటోలు)
-
'సరిగమప' : శ్రీముఖి కోసం చరణ్.. డేనియల్పై పార్వతి సెటైర్లు
బుల్లితెరపై జీ తెలుగు ఛానెల్లో ప్రసారమవుతున్న 'సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్' ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ను సంపాదించుకుంది. టీఆర్పీ రేటింగ్లోనూ దుమ్మురేపుతున్న ఈ షో ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. సరిగమప గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం 8మంది సింగర్స్ ప్రణవ్, పార్వతి, అభినవ్, శృతిక, సుదాన్షు, డేనియల్, చరణ్, శివాణి టైటిల్ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది చూడాల్సి ఉంది. ఇక ఈ సందర్భంగా సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ ఫైనలిస్టులతో సాక్షి టీవీ సరదాగా ముచ్చటించింది. షోకి సంబంధించిన విషయాలతో పాటు సరదా కబుర్లతో ఈ చిట్చాట్ సాగింది. ముఖ్యంగా డేనియల్పై పార్వతి వేసే పంచులు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తున్నాయి. ఇక శ్రీముఖి కోసం చరణ్ ఓ లవ్లీ సాంగ్ను డెడికేట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఈ సింగర్స్ సరదా మూమెంట్స్ చూసేయండి. -
‘కళావతి’ పాటతో కల్లోలం రేపుతున్న సింగర్స్ (ఫొటోలు)
-
Singer Parvathy: నా అదృష్టం.. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి: పార్వతి
వసంతకాలం అనగానే విరబూసిన పూలు, లేలేత మావి చిగుళ్లు కోయిలమ్మల రాగాలు మదిలో మెదులుతాయి. అలాగే, ఈ సీజన్లో తమ గానామృతంతో మనల్ని అలరిస్తూ సందడి చేస్తున్నారు దాసరి పార్వతి, దివ్యజ్యోతి, దుర్గవ్వలు. టాలెంట్ ఉంటే ఏ మూలన ఉన్నా అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి అనే మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. పని కష్టం మర్చిపోవడానికి నోటినుండి వెలువడే పదాలే పాటలుగా ఆకట్టుకుంటాయి. అవే జానపదాలై గ్రామీణుల గొంతుల్లో విరాజిల్లుతాయి. అలా మట్టిపరిమళం నుంచి వచ్చిన గొంతుక దుర్గవ్వది. తను పాట పాడితే వెన్నెల చల్లదనమంతా కురుస్తుందా అనిపించే గొంతుక పార్వతిది. అలసిన వేళ పాటే తోడు అంటూ విరిసిన గొంతుక జ్యోతి ది. తెలుగువారి హృదయాలను గెలుచుకున్న ఈ కోయిలమ్మలు తమ కమ్మటి రాగాల వెనక దాగి ఉన్న కష్టాన్ని, తమ పాట తమను నిలబెట్టిన తీరును సాక్షితో పంచుకున్నారు. ఊరంతా వెన్నెల... పార్వతి ఓ టీవీ కార్యక్రమంలో ‘ఊరంతా వెన్నెల మనసంతా చీకటి...’ పాటతో యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది దాసరి పార్వతి. తమ ఊరికి బస్సు రావాలని కోరిన ఆమె మంచి మనసుకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలుగునాట నెట్టింట పార్వతి పాడిన పాటను సెర్చ్ చేయని వాళ్లు లేరు అనేంతగా గుర్తింపు పొందింది. పార్వతి స్వస్థలం కర్నూల్ జిల్లా, లక్కసాగర గ్రామం. వ్యవసాయ కుటుంబం. ‘చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుండేదాన్ని. ఊళ్లో అందరూ గొంతు కోయిలలా ఉందని మెచ్చుకుంటుండేవారు. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా నా పాట ఉండేది. చదువుకుంటూనే పొలం పనులకు వెళ్లేదాన్ని. పొలం పనులకు వచ్చేవాళ్లు కూడా నా చేత పాటలు పాడించుకునేవారు. ఇంటర్మీడియెట్ తర్వాత ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు మా అన్నయ్యల స్నేహితులు మ్యూజిక్ కాలేజీలో చేరమన్నారు. అలా ఇప్పుడు తిరుపతి మ్యూజిక్ కాలేజీలో ఎం.ఎ చేస్తున్నాను. టీవీ ప్రోగ్రామ్ వాళ్లు పెట్టిన ఆడిషన్స్లో సెలక్ట్ అయ్యాను. ఆ సందర్భంగా పాడిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి. ఇంత గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అలనాటి జ్ఞాపకాలను ఆనందంగా పంచుకుంది పార్వతి. మట్టిగొంతుక... దుర్గవ్వ పల్లె పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ. కూలిపనులు చేసుకుని, జీవనం సాగించే దుర్గవ్వకు ఇటీవల ఓ స్టార్ హీరో సినిమాలో పాట పాడే అవకాశం దక్కింది. ఆమె పాడిన ‘అడవి తల్లి..’ పాట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్మోగింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. పల్లె పాటను ప్రాణం పెట్టి పాడిన ఈ సింగర్ కోసం నెటిజన్లు తీవ్రంగా వెతుకుతున్నారు. దుర్గవ్వ పాటకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. కొడుకు, కూతురు ఉన్న దుర్గవ్వ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. కాయకష్టంలో వచ్చే పల్లె పదాలు ఎన్నో. ‘‘చిన్నతనం నుంచి పాటెన్నడూ నన్ను వీడలేదు. ఓ రోజు నా బిడ్డ నా చేత నాలుగు పాటలు పాడించి చానళ్లలో పెట్టింది. ముందు వద్దన్న. కానీ, పిల్లలు వినలేదు. ఆ పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మా దగ్గర కొంతమంది జానపద కళాకారులు నా చేత ఇంకొన్ని పాటలు పాడించారు. అక్కడి నుంచి సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఎక్కడో కూలి చేసుకుని బతికే నేను ఇలా అందరి ముందు పాటలు పాడటం, పేరు రావడం ఆనందంగా ఉంది’ అని వివరిస్తుంది దుర్గవ్వ. ప్రైవేట్ ఆల్బమ్లలో దుర్గవ్వ పాడిన పాటల్లో ‘సిరిసిల్ల చిన్నది..’, ‘నాయితల్లే.., ఉంగురమే.. రంగైనా రాములాల టుంగూరమే’ అనే పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. ఊరటనిచ్చిన పాట.. అనుకోకుండా ఎగిసిన గొంతుకలా నెట్టింట వైరల్ అయ్యింది దివ్యజ్యోతి. కరీంనగర్ జిల్లా నర్సింగపురం నుంచి పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ చేరిన కుటుంబం జ్యోతిది. భర్త కారు డ్రైవర్గా పనిచేసేవాడు. జ్యోతి ప్రైవేట్ కంపెనీలలో హౌస్ కీపర్గా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు కూతుళ్లు చదువుకుంటున్నారు. యాక్సిడెంట్ అయ్యి భర్త కాలు తీసేయడంతో కుటుబానికి జ్యోతి సంపాదనే ఆదరవు అవుతోంది. ‘‘కష్టంలో నాతో పాటు ఎప్పుడూ తోడుండేది పాటనే. ఆనందమేసినా నోటికొచ్చిన పాటలు పాడుకునేదాన్ని. చాలాసార్లు మాటలే పాటలవుతుంటాయి. నేను పనిచేసే చోట నాగవల్లి మేడం నాచేత పాట పాడించింది. ఆ పాటను సోషల్ మీడియాలో పెట్టడంతో నా గొంతుకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్లలో పాటలు పాడుతున్నాను. ఉదయం పూట డ్యూటీ చేస్తున్నాను. రాత్రిపూట పాటలు ప్రాక్టీస్ చేసుకుంటున్నా. నీ గొంతు చాలా బాగుంది. సినిమాల్లోనూ నీ చేత పాటలు పాడిస్తామని పెద్దోళ్లు చెబుతున్నరు’’ అని ఆనందంగా వివరిస్తుంది జ్యోతి. మనసు పెట్టి వినాలే కానీ, మన ఇరుగు పొరుగు, మనతోపాటు పని చేసేవారి గొంతుకలలో గమకాలు పలుకుతుంటాయి. గుర్తించి ఆస్వాదించాలి. పదిమందికీ వినిపించాలి. అప్పుడే పాటకు పట్టాభిషేకం జరుగుతుంది. – నిర్మలారెడ్డి -
మల్టీట్రాక్
-
ఏఆర్ రెహమాన్ పరిచయం చేసిన సింగర్లు
లతా అతని కోసం ‘జియా జలే జాన్ జలే’ పాడింది. ఆశా భోంస్లే ‘మై హూ రంగీలారే’ పాడింది. చిత్ర ‘కన్నానులే’తో అశేష అభిమానులను పొందింది. ‘చిన్ని చిన్ని ఆశ’ పాడిన మిన్మిని ఆ ఒక్క పాటతో చరిత్రలో నిలిచిపోయింది. ఏ.ఆర్.రహమాన్ కొత్త సంగీతం మాత్రమే తేలేదు. భారతీయ సంగీతంలో కొత్త గాయనీమణుల గొంతులెన్నో తెచ్చాడు. ‘గుంజుకున్నా.. నిన్ను ఎదలోకే’ పాడిన శక్తిశ్రీ గోపాలన్ గొంతు అతడు వినిపించకపోతే తెలిసేదా. లోకం ఒమిక్రాన్ కలకలంలో ఉంది. ఇవాళ ఈ పాటలే కాసింత స్వస్థత. ప్రతి పాట పాడటానికీ ఒక కోకిల పుట్టి ఉంటుంది. చేయాల్సింది ఏమిట్రా అంటే ఆ కోకిలను వెతకడం. సరైన చివురు ఉన్న కొమ్మపై కూచోబెట్టి కూకూ అనిపించడం. సుశీల, జానకి, చిత్ర... వీళ్లే ఎన్ని కొమ్మల మీద వాలతారు? ప్రతిసారి తమ గొంతు విప్పుతారు. కొత్త గొంతులు రావాలి. వేల కోకిలమ్మలు పాటల చెట్టుపై వాలాలి అనుకున్నవాడు ఏ.ఆర్.రహమాన్. అతడే బాల సుబ్రహ్మణ్యం ఏక గాయకుడిగా వెలుగుతున్నప్పుడు అనేకమంది మేల్ సింగర్స్ను తీసుకువచ్చాడు. అతడే జానకి, చిత్రలకు అలవాటు పడిన చెవులకు కొత్త స్త్రీ గొంతుక లు వినిపించాడు. 1992లో తన తొలి సినిమా ‘రోజా’లో ఒక్క పాట కూడా జానకి, సుశీల వంటి సీనియర్లకు ఇవ్వలేదు రహమాన్. సినిమాను నిలబెట్టిన ‘చిన్ని చిన్న ఆశ’ పాటను కూడా చిత్రకు ఇవ్వలేదు. ఆ పాటకు కొత్త గాయని మిన్మినిని ఎంచుకున్నాడు. ఆ సినిమా తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లకు మిన్మినియే పాడింది. ‘జాబిలిని తాకి ముద్దులిడ ఆశ... వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ’... ఆ తర్వాత ఆ గాయని అనారోగ్య కారణాల రీత్యా పాటకు దూరమైంది. కాని ఇప్పటికీ ఆ పాటే ఆమెకు గుర్తింపు, ఉనికి, ఉపాధి అయ్యింది. కన్నులతో చూసేదీ గురువా... ‘జీన్స్’ ఈ పాట ఇప్పటికీ డాన్స్ నంబర్. ఐశ్వర్య రాయ్ స్టేజ్ మీద స్టెప్పులేస్తుంటే థియేటర్లో ఆడియన్స్ జత కలిశారు. కాని ఆ పాటలో ఒక కొత్తదనం ఉంటుంది. ఏమిటది? దానిని ఏఆర్ రహమాన్ క్లాసికల్ సింగర్ నిత్యశ్రీ మహదేవన్ చేత పాడించాడు. ఆమె మహాగాయని పట్టమ్మాళ్ మనవరాలు. ఆమెకు ఇదే తొలి సినిమా గీతం. అందుకే ఆ ఫ్రెష్నెస్. ఒక సొగసు. ‘బొంబాయి’ సినిమాలో ‘కన్నానులే’ పాటను చిత్ర చేత పాడించాను రహమాన్. దానిని మణిరత్నం ముందు స్పీడ్ నంబర్గా కోరాడు. కాని చివరి నిమిషంలో మెలొడీ ఉండాలి... అందరూ కన్నార్పకుండా ‘వినాలి’ అన్నాడు. ఆ సూఫీ స్టయిల్ గీతం చిత్రకు ఎక్కడలేని గుర్తింపు తెచ్చింది. అందమైన ప్రేమరాణి బాలూ కుమార్తె ఎస్.పి. పల్లవి మంచి గాయని. కాని ఆమె ఆ రంగాన్ని సీరియస్గా ఎంచుకోలేదు. కాని రహమాన్ తనకున్న చనువు కొద్దీ పల్లవితో ఒక పాట పాడించాడు. అదే ‘ప్రేమికుడు’లోని ‘అందమైన ప్రేమరాణి చేయి తగిలితే’. అదే పాటకు బాలూ కూడా గొంతు అందించారు. చిన్న వయసులోనే మరణించిన గాయని స్వర్ణలత చేత రహమాన్ పెద్ద హిట్స్ పాడించాడు. ‘ప్రేమికుడు’లోని ‘ముక్కాలా ముకాబలా’లో ‘తుపాకీ లోడ్ చేసి గురి పెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా’ అని స్వర్ణలత పాడిన అందం రహమాన్ వల్లే సాధ్యం. ఈ స్వర్ణలతే ‘బొంబాయి’లో ‘కుచ్చికుచ్చి కునమ్మా పిల్లనివ్వు’ పాడింది. కొంచెం నిప్పు కొంచెం నీరు మణిరత్నం తీసిన ‘దొంగ దొంగ’ ఆడాల్సినంత ఆడలేదు. కాని అందులోని పాట నేటికీ నిలుచుని ఉంది. అదే ‘కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోనా’. ఈ పాటను అనుపమ చేత పాడించాడు రహమాన్. పల్లవి చివర ‘చంద్రలేఖా’...అనే ఆలాపన ఒక తరంగంలా వ్యాపిస్తుంది. ఈ పాట పాడుతున్నట్టుగా ఉండదు. అరుస్తున్నట్టుగా, నీల్గుతున్నట్టుగా, రహస్యం చెబుతున్నట్టుగా ఉంటుంది. ఇటీవలి ఇండియన్ ఐడెల్ గాయని షణ్ముఖ ప్రియ ఈ స్టయిల్లోనే పాడుతుంది. అనుపమ ఆ తర్వాత ఎక్కువ పాటలు పాడలేదు. కాని ఈ పాట ఆమెకు ఇప్పటికీ పాస్పోర్ట్. రంగీలారే మన రామ్గోపాల్ వర్మ ద్వారా రహమాన్ హిందీలో ప్రవేశించాడు. తొలి సినిమా ‘రంగీలా’. మొదటిసారి ఆశాభోంస్లే చేత పాడించాడు. ‘యాయిరే యాయిరే జోర్ లగాకే నాచెరే’... అరవై దాటిన ఆశాభోంస్లేకు కొత్త హుషారు వచ్చింది ఆ పాటతో. అదే సినిమాలో ‘తన్హా తన్హా యహాపే జీనా’ ఆశా గొంతులో మరింత సరసంగా వినిపించింది. ఆ తర్వాత లతా మంగేష్కర్ చేత రహమాన్ ‘దిల్ సే’లో పాడించాడు. ‘దియా జలే జాన్ జలే’ పాట బహుశా పాడిన కొత్తరకం పాటల్లో ముఖ్యమైనది. ‘దిల్సే’లో సూపర్హిట్ అయిన ‘ఛయ్య ఛయ్య’ కోసం సప్న అవస్థిని వెతికి ఆమె వల్ల పాటకు కొత్త ఫీల్ తెచ్చాడు. ఎందరో గాయనులు ‘కడలి’లో ‘గుంజుకున్నా’ పాడిన శక్తిశ్రీ గోపాలన్, ‘ఇందిర’లో ‘లాలి లాలి అని’ పాడిన హరణి, ‘రోబో’లో ‘కిలిమంజారో భళా భలిమంజారో’ పాడిన చిన్మయి, ‘జంటిల్మన్’ లో ‘నెల్లూరు నెరజాణ’ పాడిన మహలక్ష్మి అయ్యర్, ‘శివాజీ’లో ‘వాజి వాజి వాజి రారాజే నా శివాజీ’ పాడిన మధుశ్రీ... వీరంతా తెలుగు పాటకు కొత్త గుబాళింపును తెచ్చారు రహమాన్ వల్ల. ఇవాళ రహమాన్ పుట్టినరోజు. వేయి పాటలు అతడు చేయనీ. పదివేల కొత్త గాయనీమణుల గళాలు వినిపించనీ. -
మట్టి కవులకు పుట్టినిల్లు.. పాలమూరు
ఒకప్పుడు కరువు విలయ తాండవం చేసిన గడ్డపైనే.. సాహిత్యం అలరారింది. పనితోనే పాట పుట్టిందని.. పాటే ‘పనీపాట’ అయిందని ఎందరో కవులు చాటి చెప్పారు. జానపదం, యక్షగానం, వీధినాటకం, కాళ్లగజ్జల దరువులో ఓలలాడింది.. రేలా ధూలాకు ఎగిరి గంతులేసింది.. మద్దెల మోతల జడకొప్పులు జానపదానికి కొత్త అందం తెచ్చిపెట్టాయి. దొరలు, భూస్వాముల అన్యాయాలను ప్రశ్నిస్తూ.. పాటల రూపంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ‘పల్లె కన్నీరు పెడుతుందో..’నంటూ ప్రజలను ఆలోచింపజేస్తూ.. ‘గౌలిగూడ గల్లీకాడ గోల చేసినా..’ అంటూ యువతను ఉర్రూతలూగిస్తూ ఎన్నో పాటలు ఇక్కడి కవుల నుంచి జాలువారాయి. మొత్తంగా మట్టి కవులకు పుట్టినిల్లు గా నిలిచింది పాలమూరు జిల్లా. మదనాపురం: ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ కళా రూపాల్లో రాణించిన కళాకారులందరూ మట్టిలోని పరిమళాలే. గ్రామీణ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు అవార్డులు సినీ పరిశ్రమలో తెలంగాణ ఉద్యమంలో జానపద కళారూపాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు పాలమూరు కళాకారులు. గోరటి వెంకన్న, బెల్లం సాయిలు, జంగారెడ్డి, కోట్ల వెంకటేశ్వర్రెడ్డి, సాయిచంద్, భీంపల్లి శ్రీకాంత్, శివనాగులు శివలింగం లాంటి ఎందరో కవులు సాహితీ ఔనత్యాన్ని ప్రభవించారు. ఇక్కడి కవులు రాసిన పాటలు, యక్షగానాలు, జడకొప్పులాట, తంబూరా లాంటి పాటలు నేటికీ తెలుగు ప్రజల మనసు చూరగొన్నాయి. కవిత సంపుటిలో ‘కోట్ల’ మైలురాయి గుండె కింద తడి.. రంగు వెలిసిన జెండా.. రహస్యాలు లేని వాళ్లు.. నాన్నా! నాలా ఎదుగు (దీర్ఘ కవిత తెలుగు, ఆంగ్ల భాషల్లో).. నూరు తెలంగాణ నానీలు.. మనిషెళ్లిపోతుండు (పాలమూరు వలసలపై కవిత్వం) వంటి అనేక రచనలు కోట్ల వెంకటేశ్వరరెడ్డి నుంచి జాలువారాయి. 2019లో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ అవార్డుతో సత్కరించగా.. దాదాపు 50అవార్డులు అందుకున్నారు. తన రచనలు ప్రజలకు ఎంతో దోహదపడాలనీ కోరుకుంటున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జానపదాల ‘బెల్లం సాయిలు’ ఐదు దశాబ్దాల క్రితమే పాలమూరులో జానపదానికి విత్తనాలు నాటిన కవి బెల్లం సాయిలు. ఆయన రాసిన ‘మరదల పోదామా మన్యంకొండకు’.. పొద్దంతా పోయింది ఎంకి పాట, సాంఘి క నాటకాలతో ప్రజ ల అభిమానాలు పొందాడు. అనేక రచనలు, వందల సంఖ్యలో అవార్డులు ఆయన సొంతం. కురుమూర్తిక్షేత్రంపై ఆయన చేసిన పరిశోధన చెరగని ముద్ర. గాయకుడిగా, నటుడిగా విభిన్న పాత్రలు పోషించిన ఆయనతాను బతికున్నంత కాలం పాలమూరు బిడ్డలకు జానపదాలు అంకితం చేస్తానంటున్నాడు. ఉద్యమానికి ఊపిరిపోసిన ‘గోరటి’ తెలంగాణ మలిదశ ఉద్యమంలో గోరటి వెంకన్న పాట తెలంగాణ ప్రజలను నిద్ర లేపింది. ఉద్యమానికి ఊపిరి పోసింది. యక్షగానం, విప్లవ సాహిత్య రచనల్లో ఆయన మణిహారాల పుట్ట. పాలమూరు మట్టిలో పుట్టిన పరిమళం. ఆయన చేతి నుంచి జాలువారిని పల్లె కన్నీరు పెడుతుందన్న జానపదం జనాలను ఆలోచింపజేసింది. 5 వేల పాటలు, 150 అవార్డులు, 50 రచనలు ఆయన సొంతం. పాటే నాకు జీవితమని.. పేర్కొంటూ తనను ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పాటలతో ఉర్రూతలూగించే ‘ఎద్దుల జంగిరెడ్డి’ ఆయన పాట పాడితే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. ఆయనే ఎద్దుల జంగిరెడ్డి. రెండు దశాబ్దాల క్రితం ‘గౌలిగూడ గల్లీ కాడ గోల చేసినా..’ అనే జానపదంతో యువతను ఉర్రూతలుగించాడు. ఎంకి పాటలు అంటే ఆయన సొంతం. పాలమూరు జిల్లాతోపాటు అమెరికా, ఆ్రస్టేలియా, జపాన్, జర్మనీ దేశాల్లో జానపద ప్రదర్శనలిచ్చి అవార్డులు అందుకున్నారు. వెయ్యి పాటలు, 500 రచనలు చేసి శభాష్ అనిపించుకున్నాడు. తాను పాట కోసమే బతుకుతున్నానని చెబుతున్నాడు. మధురం.. ‘రోజారమణి’ గాత్రం ‘నిమ్మ లోగొట్టే రో రఘువోనంద.. ’ అనే జానపదం, మధురమైన గానంతో కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకుంది గాయకురాలు రోజారమణి. తాను పాడిన పాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఓ ప్రముఖ టీవీ చానల్లోని రేలా రే రేలా కార్యక్రమంతో ప్రారంభించిన పాటల సందడి ఇప్పటికీ 200 పాటలు పాడి యూట్యూబ్లో తనదైన ముద్ర వేసుకుంది. కొత్తకొత్త పాటలతో ప్రజల ముందు కొస్తానని తెలిపాడు. పల్లెటూరి పాటగాడు ‘శివలింగం’ పల్లెటూరి పాటలు వినాలంటే శివలింగం నోటనే వినాలి. భిన్నమైన గొంతు.. ఆకట్టుకునే రకం ఆయన నైజం. రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ గాయకుడిగా రెండు సార్లు అవార్డు, నగదు అందుకున్నాడు. మారుమూలపల్లెలో పుట్టి పల్లె పాటల పురుడు పోసుకున్న శివలింగాన్ని జిల్లా ప్రజలు మరిచిపోరు. కవిత పరిశోధనలో దిట్ట ‘భీంపల్లి’ పాలమూరు సాహితి అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్.. అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతూ జిల్లా తెలుగు సాహిత్య వికాసం అనే అంశంపై పీహెచ్డీ పరిశోధన చేశారు. జిల్లా కల్చరల్ అకాడమీ అధ్యక్షుడిగా, రాష్ట్ర రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో 50కి పైగా పత్ర సమర్పణలు చేశారు. 40కి పైగా అవార్డులు అందుకొని.. కవిగా, కథకుడిగా,పరిశోధకుడిగా,విమర్శకుడిగా పేరుగాంచారు. సాహితీ కార్యక్రమాలకు క్రియాశీలక కార్యకర్త. పత్రికల్లో కవితలు, గేయాలు, వ్యాసాలు, కథలు, సమీక్షలు ఆయన సొంతం. పౌరాణికంలో రారాజు ‘కోట్ల వేమారెడ్డి’ జాతీయ స్థాయిలో పౌరాణికంలో అవార్డులు అందుకున్న ఘనత కోట్ల వేమారెడ్డిది. 300పైగా ప్రదర్శనలు, 200 పైగా అవార్డులు ఆయన సొంతం. తొమ్మిది పర్యాయాలు జాతీయస్థాయి అవార్డులు అందుకొని, తాను పుట్టిన ఊరిలో వ్యవసాయం చేస్తూ అంతరించిపోతున్న పౌరాణిక రంగాన్ని నేటి యువతకు అందిస్తానని చెబుతున్నారు. -
కన్నీళ్లకే కన్నీరొచ్చే...నీ పాటే శరణ్యం
సాక్షి,హైదరాబాద్: కోట్లాదిమంది అభిమానులను కన్నీటి సాగరంలో ముంచి గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కానరాని లోకాలకు తరలిపోయి అప్పుడే సంవత్సరం కావస్తోంది. తన స్వర మాధుర్యంతో ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ గొంతు మూగబోయిందనే విషయాన్ని జీర్ణించుకోవడం ఇంకా కష్టంగానే ఉంది. ఆ దివికేగిన ఎస్పీబీని తలచుకుంటే ఇప్పటికీ అభిమానులు గుండెలు కన్నీటి సంద్రాలే. సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారిపై సుదీర్ఘ పోరాటం తరువాత ఇక సెలవంటూ తనువు చాలించి అపుడే సంవత్సరం గడిచిపోతోంది. దశాబ్దాల తరబడి తన అమృత గానంతో మైమరపించిన ఆ స్వరధార గత ఏడాది సెప్టెంబరు 25న ఆగిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి వస్తారని వేయి దేవుళ్లకు మొక్కుకున్న అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంతోమంది యువకళాకారులు, గాయకులకు స్ఫూర్తినివ్వడమే గాదు, వారికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించిన బాలు లేని లోటు తీరదు గాక తీరదు. ఆయనకు ఆయనే సాటి. బంగారానికి తావి అబ్బిన చందంగా తన అపూర్వ ప్రతిభతో ఇంతింతై వటుడింతై అన్నట్టు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో వేనవేల పాటలతో అలరించారు. కేవలం గాయకుడిగానే కాదు డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా తన దైన ప్రతిభను చాటు కున్నారు. తన ప్రయాణాన్ని అలా అప్రతిహతంగా కొనసాగిస్తున్న తరుణంలో.. మాయదారి మహమ్మారి ఆయనను మింగేసింది. సంగీత ప్రపంచానికి అంతులేని అగాధాన్ని మిగిల్చింది. రానున్న బాలూ మొదటి వర్ధంతిని పురస్కరించుకొని ‘నీవు లేకపోయినా..నీ పాట ఆ చంద్రతారార్కం నిలిచే ఉంటుందంటూ తోటి గాయకులు, సినీ సంగీతాభిమానులు ఆయన జ్ఞాపకాలను తలచుకుంటున్నారు. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి గొంతునుంచి జాలు వారిన సుస్వరాలను మళ్లీ గుర్తు చేసుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వేదికల్లో ఆయన పాటలతో ఘన నివాళులర్పించేందుకు సిద్ధ మవుతున్నారు. ప్రఖ్యాత గాయని ఉష ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. లెజెండరీ గాయకుడు దివంగత పద్మవిభూషణ్ ఎస్పీబీ వారసత్వాన్ని కొనసాగించేలా సెప్టెంబర్ 25న ఒక సంస్మరణ కార్యక్రమాన్ని, ఆ తరువాత ఆయన పాటలతో ఒక స్వరఝరి నిర్వహిస్తున్నట్టు ఫేస్బుక్లో వెల్లడించారు. -
చిన్న వయస్సులోనే పెద్ద సినిమాల్లో పాటలు పాడుతున్న అన్నాచెల్లెల్లు
-
‘లోయ’కు గొంతునిచ్చారు
సంగీతం మగవారిది అని అక్కడ కొందరు అనుకుంటారు. ‘మాది కూడా’ అని ఈ ఆడపిల్లలు అన్నారు. కశ్మీర్ లోయలో ఐదారుమంది ఆడపిల్లలు కలిసి ‘వికసించే పూలు’ పేరుతో ఒక సూఫీ సంగీత బృందంగా ఏర్పడ్డారు. వారే పాడతారు. వారే వాయిద్యాలు వాయిస్తారు. కశ్మీర్ మొత్తంలో ఆ మాటకొస్తే దేశంలోనే ఇలాంటి సర్వ మహిళా సూఫీ గీత బృందం లేదు. నిరాశ నిశ్శబ్దపు లోయకు ఈ సంగీతం అవసరం అని వారు అనుకుంటున్నారు. ఒకరిద్దరు భృకుటి ముడివేసినా వీరుగొంతు ఎత్తగానే అప్రయత్నంగా కనులు విప్పారుస్తున్నారు. కశ్మీర్ సూఫీ గర్ల్స్ పరిచయం. ఆ నలుగురైదుగురు అమ్మాయిలు అలా చెట్ల మధ్యగా నడుచుకుంటూ ఒక తిన్నె మీదకు చేరుకుంటారు. తాము తెచ్చుకున్న చాదర్లను నేల మీద పరిచి తామూ వాయిద్యాలు పట్టుకుని కుదురుగా కూచుంటారు. ఒకమ్మాయి సంతూరును సవరిస్తుంది. ఒకమ్మాయి తబలా మీటుతుంది. ఒకమ్మాయి కశ్మీరి వయొలిన్లో కంపనం తెస్తుంది. మెల్లగా అందరూ పాటలు మొదలెడతారు. ప్రకృతి వాటిని పులకించి వింటుంది. బహుశా ఆధ్యాత్మిక తాదాత్మ్యం కూడా చెందుతుంది. ఎందుకంటే వారు పాడేది సూఫీ భక్తి సంగీతం కనుక. కశ్మీర్లో గత రెండేళ్ల నుంచి ఈ బృందం అందరినీ ముచ్చటగొలుపుతోంది. ఈ బృందం తనకు పెట్టుకున్న పేరు ‘వికసించే పూలు’. కాని కశ్మీర్ ప్రాంతం, దేశం సులువుగా ‘సూఫీ గర్ల్స్’ అని పిలుస్తున్నారు. లోయలో బృంద గీతం కశ్మీర్ బండిపోర జిల్లాలో గనస్థాన్ అనే చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో ఈ సంగీత గాథను ఇర్ఫానా యూసఫ్ అనే కాలేజీ అమ్మాయి మొదలెట్టింది. ఆ అమ్మాయి తండ్రి సంగీత విద్వాంసుడు. సాయంత్రమైతే ఇంట్లోని వాయిద్యాలు తబలా, సితార్, సంతూర్ తీసి సాధన చేస్తుండేవాడు. ఇర్ఫానా అది గమనించి తానూ నేర్చుకుంటానని చెప్పింది. అయితే సంగీత వాయిద్యాలను అమ్మాయిలకు నేర్పడం పట్ల ఆ ప్రాంతంలో కొంత పట్టింపు ఉంది. ఇర్ఫానా తండ్రి దానిని పట్టించుకోలేదు. కూతురు ఎప్పుడైతే నేర్చుకుంటానందో ఆ ప్రాంతంలోని ఉస్తాద్ ముహమ్మద్ యాకూబ్ షేక్ అనే గురువు దగ్గరకు తీసుకువెళ్లి చేర్పించాడు. ఉస్తాద్ ముహమ్మద్ షేక్ ఆ ప్రాంతంలో అమ్మాయిలకు సంగీతం నేర్పిన తొలి గురువు. సంగీతం మగవారిది మాత్రమే కాదు అమ్మాయిలది కూడా అని అతని విశ్వాసం. ఆయనకు ఉన్న పేరుకు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. అలా ఇర్ఫానా సంగీతం నేర్చుకుంది. నేర్చుకున్న సంగీతాన్ని దూరదర్శన్లో ప్రదర్శించింది. అంతే. ఆమె ఊళ్లో ఆ కార్యక్రమాన్ని చూసిన ఇతర అమ్మాయిలు ఎంత స్ఫూర్తి పొందారంటే ‘మనమంతా ఒక బృందంగా ఏర్పడి కచ్చేరీలు ఇద్దాం’ అని అనేవరకు. ఇర్ఫానాకు కావలసింది అదే. లోయ వినాలనుకుంటున్న సంగీతమూ అదే. ‘సూఫీ సంగీతంలో దేవుణ్ణి, ప్రవక్తని, పీర్లను స్తుతించడం ఉంటుంది. వారి గొప్పతనాన్ని శ్లాఘించడం, కృతజ్ఞతను ప్రకటించడం ఆ పాట ల్లో ఉంటుంది. పారశీ గీతాలు మాకు తెలియకపోయినా పెద్దల నుంచి అర్థం తెలుసుకుని పాడుతున్నాం’ అంటున్నారు ఈ అమ్మాయిలు. సూఫీ సంగీతం కశ్మీరీ ఫోక్లోర్ పాడే బృందాలు కశ్మీర్లో చాలానే ఉన్నాయి. కాని సూఫీ సంగీతం పాడే బృందాలు లేవు. మగవారే పాడుతున్నారు. కశ్మీర్ అంతటా ఉర్సుల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, ఇళ్లల్లో జరిగే ఉత్సవాల్లో సూఫీ సంగీతం వినిపించడం ఆనవాయితీ. పారశీ, కశ్మీరీ భాషల్లో కశ్మీర్ ప్రాంతంలోని సూఫీ గురువులు పూర్వం రాసిన గీతాలను లయబద్ధంగా పాడటం అక్కడ ఎంతో ఆదరంతో చూస్తారు. ‘సూఫీ సంగీతంలో 12 నిర్దేశిత స్వరాలు ఉంటాయి. వాటిలోనే పాడాలి. వాటిలో కొన్ని స్వరాలకు కొన్ని సమయాలు ఉంటాయి. ఉదాహరణకు మొకామ్-ఏ-కూహి స్వరాన్ని రాత్రి తొలిజాము లోపల పాడేయాలి. ఆ తర్వాత పాడకూడదు. కొన్ని సాయంత్రాలు మాత్రమే పాడాలి’ అంటుంది ఇర్ఫానా. ఈ అమ్మాయిల తల్లిదండ్రులందరూ వీరి పాటకు సమ్మతించారు. కొందరు మొదట ‘ఆడపిల్లలకు పాటలా’ అని అన్నా తర్వాత ఈ బృందానికి వస్తున్న పేరును ప్రోత్సహిస్తున్నారు. ‘మా దగ్గర నిన్నమొన్నటి వరకూ సొంత వాయిద్యాలు లేవు. కాని మా కచ్చేరీలు మొదలయ్యాక వచ్చిన డబ్బుతో వాటిని కొనుక్కున్నాం. అందుకు దాదాపు లక్ష రూపాయలు అయ్యింది’ అంది ఫర్హానా. యూనివర్సిటీలోనూ కశ్మీర్ యూనివర్సిటీలో సంగీత వాయిద్యాల శాఖ ఉంది. ఫర్హానా అక్కడ సంతూర్ వాయిద్యం లో శిక్షణ కోసం చేరినప్పుడు ఆ అమ్మాయితో పాటు మరొక్క అమ్మాయి మాత్రమే ఆ కోర్సులో ఉంది. వాయిద్యాలన్నీ అక్కడ దుమ్ము పట్టి కనిపించేవి. ఇవాళ వీరికి వచ్చిన పేరు చూసి వాయిద్యాలు నేర్చుకోవడానికి చేరుతున్న ఆడపిల్లల సంఖ్య పెరిగింది. ‘మేము యూనివర్సిటీలో నేర్చుకుంటున్నాం. ఇంటికి వచ్చి సంప్రదాయబద్ధంగా గురువు దగ్గరా నేర్చుకుంటున్నాం. సంగీతం నేర్చుకోవడం ఆషామాషీ కాదు. తాళం పట్టాలి’ అంటారు ఈ అమ్మాయిలు. ‘కశ్మీర్లో ఆధునిక పోకడలు ఏనాడో మొదలయ్యాయి. కళ, సాంస్కృతిక రంగాలలో చాదస్తాలు తగ్గాయి. కశ్మీర్లో కళా వికాసం జరుగుతోంది. ప్రోత్సాహం దక్కితే మాలాంటి అమ్మాయిలు ఇంకా చాలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటోంది ఈ బృందం. ‘వికసించే పూలు’ బృందానికి ముఖ్య నగరాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. లాక్డౌన్ లేకపోతే వారు మరింతగా వినిపించి ఉండేవారు. తెలుగు నగరాల్లో కూడా వీరిని చూస్తామని ఆశిద్దాం. - సాక్షి ఫ్యామిలీ -
ఆన్లైన్లో సంగీత పోటీలు
తెలుగు గాయకుల ప్రతిభను వెలికి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ‘తెలుగు డిజిటల్ ఐడల్’ తొలిసారి సంగీత పోటీలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా గాయనీ గాయకులకు తెలుగు పాటకు పట్టంకట్టే విధానంలో శాస్త్రీయ, సినీ, లలిత సంగీత విభాగాల్లో ఈ పోటీ జరగనుంది. ఇందుకు సంబంధించిన లోగోను సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఆవిష్కరించారు. ‘‘అంతర్జాతీయంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేవలం ఆన్లైన్లోనే మాత్రమే వీక్షించగలరు. ఇందులో పాల్గొనే గాయనీ గాయకుల వయో పరిమితి కనీసం 16 సంవత్సరాలు. మొదటి రౌండులో ఎంపికైన వారికి ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తాం. ఈ నెల 31 రాత్రి 11 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు తాము పాడిన శాస్త్రీయ, సినీ, లలిత గీతాల తాలూకు వీడియో నిడివి 2 నిమిషాలకు మించకూడదు. ఈ పోటీల్లో పాల్గొనే ఔత్సాహిక గాయనీ గాయకులు తమ పేర్లను www.telugudigitalidol.com వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి’’ అని నిర్వాహకులు కోరారు. -
65 మంది సింగర్స్.. 5 భాషల్లో స్పెషల్ సాంగ్
దేశ వ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ అందరు తమ తమ కార్యాలయాలలో జాతీయ జెండాని ఎగుర వేసి దేశభక్తిని చాటుకుంటున్నారు. మరికొంత మంది సోషల్ మీడియా ద్వారా దేశంపై వారికి ఉన్న ప్రేమను పంచుకుంటున్నారు. ఇక సినీ గాయకులు కూడా తమదైన శైలీలో దేశభక్తిని చాటుకున్నారు. భిన్న మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు కలిగిన భారతీయులందరూ ఒకటేనని ప్రపంచానికి చాటి చెప్పారు. (చదవండి : సల్మాన్ నోట దేశభక్తి పాట.. వైరల్) భారతీయు ఐకమత్యం చాటుకోవడానికి 65 మంది సింగర్స్ 5 భాషలలో దేశ భక్తి పాట పాడారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దేశభక్తి చిత్రం ‘రోజా. ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఇందులోని ‘వినరా.. వినరా.. దేశం మనదేరా’అనే పాటను 65 మంది గాయకులు పాడారు. ‘టుగెదర్ యాజ్ వన్’ పేరుతో తీర్చిదిద్దిన ఈ పాటను రామ్చరణ్ విడుదల చేశారు. ‘టుగెదర్ యాజ్ వన్ ట్రాక్ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇది మనలోని ఏకత్వాన్ని చూపిస్తోంది. ఒక ముఖ్యమైన కారణం కోసం 65మంది సింగర్లు కలిసి ఈ పాట పాడటం విశేషం. ఈ క్లిష్ట సమయంలో అందరం ఒక్కటే అంటూ ఐకమత్యం చాటడానికి ఇంత మంది సింగర్స్ కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’అని చరణ్ ట్వీట్చేశారు. -
పుడమి తల్లికి ప్రణామం
గాత్రాలన్నీ శృతిలో ఉన్నాయి. తొమ్మిది మంది గాయనీగాయకులు! బాంబే జయశ్రీ–టు–శంకర్ మహదేవన్. ఇక స్వరాలు కావాలి. పుడమిపై పరిచేశాడు అమృత్ రామ్నాథ్. కర్ణాటక సంగీతంలో కసుగాయి. 21 ఏళ్లుంటాయంతే. పాడతాడు. పాటలకు ఉయ్యాలలు కడతాడు. అతడికొచ్చింది ఆఫర్! వరల్డ్ ఎర్త్డేకి మంచి మ్యూజిక్ వీడియో చెయ్యాలి. అదీ ఆఫర్. ఆర్నెల్ల కిందటే వరల్డ్ ‘ఎర్త్ డే నెట్వర్క్’.. ఇండియాలో వెదకులాట మొదలు పెట్టింది. బాగా పాడేవారి కోసం. బాగా ట్యూన్ కట్టేవాళ్ల కోసం. బాగా లిరిక్స్ రాసేవారి కోసం. ఎర్త్ డే నెట్వర్క్కి భారతీయ రాయబారి బాంబే జయశ్రీ. కర్ణాటక లలిత సంగీత, సినీ గాయని. జయశ్రీనే దగ్గరుండి టీమ్ని తయారు చేసుకున్నారు. ఉత్సాహవంతుడైన అమృత్ రామనాథ్కి దర్శకత్వ బాధ్యతల్ని ఇచ్చేశారు! ఆ సంగీత దృశ్యకావ్యమే.. ‘ధర్తీ మా’. పుడమి తల్లికి ప్రణమిల్లడం. ఒకే పాటను ఎనిమిది భాషల్లో.. హిందీ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీలలో.. పాడించాలి. ఒకే భావాంశానికి ఈ ఎనిమిది భాషల్లో అక్షరాలను పొదగాలి. వయోలిన్, గిటార్, తబలా, మృదంగం.. ప్రధాన వాద్యాలు. అందరూ తిరుగులేని విధంగా కుదిరారు. లిరిక్స్ వచ్చేశాయి. కొంత పని అయ్యాక మార్చి 25 కి కట్టుబడి నిలిచిపోయింది. లాక్డౌన్! అప్పటికి రికార్డింగ్ అయింది ముగ్గురి గాత్రాలు మాత్రమే. జయశ్రీ, అభిషేక్, శ్వేత. చెన్నైలోని అమృత్ రామ్నాథ్ హోమ్ స్టూడియోలో ఉన్నారు వాళ్లు ముగ్గరూ. మిగతావాళ్లు చెన్నై చేరుకోలేకపోయారు. ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరు, శాన్ఫ్రాన్సిస్కో.. ఎక్కడున్న వాళ్లు అక్కడి నుంచే పాడి పంపిస్తే.. మిగతా ఖాళీలను స్టూడియోలో పూరించుకున్నాడు అమృత్ రామనాథ్. ఆ మాత్రం త్వరగానైనా అయింది.. ప్లానింగ్లో అతడు జాగ్రత్తగా ఉండటం వల్లనే. జయశ్రీ మేమ్తో తను ఎన్నిమాటలైనా పడతాడు. కానీ జయశ్రీ మేమ్కు మాట రాకూడదు అనుకున్నాడు. ఒరిజినల్ ట్యూన్ ఇదీ అనుకున్నాక ఆ ట్యూన్కి తగ్గట్లు హిందీలో తనే పాట భావాన్ని రాయించి మిగతా ఏడు భాషల్లోని గేయ రచయితలకు పంపించాడు. ఎర్త్ డే నెట్వర్క్కి సహ రాయబారి కౌశికి చక్రవర్తి. ఆమె కూడా రామ్నాథ్కి కీలకమైన దర్శక సహకారం అందించారు. చిత్రా సాయిరామ్ (కన్నడ), చేతనా శ్రీకాంత్ (హిందీ, మరాఠీ) కార్తీక్ దలాల్ (గుజరాతీ), వి.పి.రామ్నాథ్ (బెంగాలీ), మథురాంతకి (తమిళ్), షిజిత్ నంబియార్ (మలయాళం), విధూ పుర్కాయస్థ (పంజాబీ).. వీళ్ల నుంచి పాట లిరిక్స్ తెప్పించి, మూలార్థానికి అనువాదాలు సరిపోయిందీ లేనిదీ చెక్ చేయించిందంతా కౌశికీనే. బెంగాలీ లిరిక్స్ రాయడంలో రామ్నాథ్కి కూడా ఆమె సహాయం చేశారు. యజ్ఞం పూర్తి అయింది. ‘‘భూమాతా నీకు వందనాలు. మా జీవనాధారం నువ్వే. తరాలుగా మా పోషణ నువ్వే. ప్రణామాలు తల్లీ.. నీకు ఆత్మ ప్రణామాలు..’’ అని ‘ధర్తీ మా’.. ఆలపించే ఈ బహుభాషా స్తుతి గీత గుచ్ఛం.. యాదృచ్ఛికంగానే అయినా సరైన సమయంలో వచ్చింది. వరల్డ్ఎర్త్డే సందర్భంగా నేడు విడుదల అవుతున్నా.. ఈ కరోనా కష్ట కాలమూ ఒక సందర్భం అయింది. -
పాటల పల్లకీకి కొత్త బోయీలు
తెలుగు సినీరంగంలో పాటల పల్లకిని మోస్తన్న బోయీలు ఎందరెందరో! అలనాటి బోయీలలో ఎందరో మహానుభావులు! పాటల పల్లకిని భుజానికందుకున్నారు నవతరం బోయీలు! వారి అనుభవాలూ అనుభూతులూ మీకోసం... జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా... ఏ ఆర్ రెహ్మాన్ రియల్హీరో నేను పుట్టింది చెన్నైలో. నాకు సంవత్సరం వయసు ఉన్నప్పుడే అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకి వెళ్లిపోయాము. మా అమ్మ గారి నాన్న కర్ణాటక సంగీత విద్వాంసులు. ఇంట్లో సంగీత వారసత్వముంది. ఆ విద్య మా అమ్మకు వారసత్వంగా వచ్చింది. అమెరికాలో అమ్మ ‘శ్రీ లలిత గాన విద్యాలయ’ పేరుతో కర్ణాటక సంగీత పాఠశాల పెట్టారు. నేను, అక్క మేమిద్దరమే ఆ స్కూల్లో ఫస్ట్ స్టూడెంట్స్. నాకు మూడేళ్ల వయస్సు వచ్చే సరికే సభల్లో, కచేరీల్లో పాడటానికి అమ్మ స్టేజ్ ఎక్కించేది. అలా చాలా అవకాశాలు అమ్మ ద్వారా వచ్చాయి. నాకు పదమూడేళ్లు వచ్చే వరకు రోజూ ఉదయం రెండు గంటలు సాధన చేయటం, స్కూల్కి వెళ్లటం, మళ్లీ స్కూల్ నుంచి రాగానే సాధన చేయటం ఇదే నా పని. ఏ ఆర్ రెహమాన్గారు అమెరికా వచ్చినçప్పుడు అందరిలాగానే నేను కూడా లైన్లో నిల్చొని ఆయన కోసం ఎదురు చూశాను. అప్పుడు ఎంతో కష్టపడి ఆయన మెయిల్ ఐడీ సంపాదించాను. ఆ తర్వాత నేను పాడిన పాటలను ఆయనకు పంపించాను. అవన్నీ చూసిన రెహమాన్గారు ఓ ఆర్నెల్ల తర్వాత మెయిల్లో ‘నీ వాయిస్ చాలా వెరైటీగా ఉంది. అవకాశం వస్తే కలిసి పనిచేద్డాం’ అన్నారు. అన్నట్టుగానే ఓ రోజు కాల్ చేసి స్కైప్లోకి రమ్మన్నారు. సరే అని వచ్చాను. ఆయన నాతో ఇలా పాడు అలా పాడు అని చెప్తూ ఉంటే ఓ నాలుగు గంటల పాటు పాడాను. రెహ్మాన్ సార్ ఓ నెల తర్వాత ఫోన్చేసి ‘మీ వాయిస్ మణిరత్నంగారికి నచ్చింది’ అని చెప్పారు. ‘అవునా! చాలా థ్యాంక్స్. రికార్డింగ్ ఎప్పుడు?’ అని అడిగాను. ‘అదేంటి ఆ రోజు నువ్వు స్కైప్లో పాడావు కదా’ అన్నారు. ఒక్కసారిగా ఆశ్చర్య పోవటం నా వంతు అయ్యింది. అలా నాకు మొదటి సినిమా పాట పాడే అవకాశం రెహ్మన్ సార్ వల్ల వచ్చింది . ఆయన నా లైఫ్లో రియల్ హీరో. ఇక తెలుగు పాటల విషయానికొస్తే 2017లో కోన వెంకట్గారు ఓ పాట పాడాలి అని చెప్పారు. నాని హీరోగా నటించిన ‘నిన్నుకోరి’ చిత్రంలోని ‘అడిగా అడిగా...’ అనే పాటతో తెలుగుకు పరిచయం అయ్యాను. ఆ తర్వాత పరశురాం గారు ఓ పాట పాడించారు. ఆ పాటే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీతగోవిందం’ చిత్రంలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...చాల్లే.. ఇది చాల్లే...’ పాటతో నా లైఫ్ టర్న్ తీసుకుంది. తెలుగువారే కాకుండా భారతదేశం మొత్తం ఈ పాట మార్మోగిపోయింది. అమెరికాలో కూడా ఈ పాట పాడకుండా నా షో ఉండదంటే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. కొత్తగా పాడాలనే ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చెయ్యాలి. రోజూ సంగీతానికి సంబంధించిన ఏ విషయంలోనైనా ఎదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. మీరు ఉదాహరణకి గమనిస్తే బాలు గారు గత 50 ఏళ్లుగా పాడుతూనే ఉన్నారు. ఆయన ఈ ప్లానెట్లో ఉండాల్సిన వ్యక్తి కాదు. ఆయన టాలెంట్కి ఈ ప్లానెట్ సరిపోదు. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా అందరూ చక్కగా పాడుతూనే ఉండాలి అన్నారు. దగా... భలే కిక్ ‘‘దగా.. దగా.. దగా.. కుట్ర, మోసం...’ ఈ పాట ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలోనిది. ఈ పాట ప్రేక్షకుల్లో ఎంత సంచలనం సృష్టించిందో రెండు రాష్ట్రాల్లోని తెలుగువారందరికీ తెలుసు. అసలు ఈ పాట ఎలా పుట్టింది? ఆ పాట వెనక జరిగిన విశేషాలేంటి? చిత్ర సంగీతదర్శకుడు, ‘దగా.. దగా..’ పాట పాడిన కళ్యాణీ మాలిక్ మాట్లాడుతూ– ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి మొదట నేను సంగీత దర్శకుడిని అని లిరిక్ రైటర్ సిరాశ్రీ చెబితే నమ్మలేదు. కారణం నాకు రామ్గోపాల్ వర్మ గారు అసలు పరిచయం లేదు. ఇండస్ట్రీలో ఇద్దరు వ్యక్తులు కలిసి పని చేయాలంటే ఎంతో కొంత పరిచయం అవసరం. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఫస్ట్ రికార్డ్ చేసిన పాట ‘దగా..’. సాంగ్. ‘దగా’ అన్న ఒక్క మాటను పట్టుకొని ఆ పాట ట్యూన్ను రెడీ చేశాను. ముందుగా నాకు ఆర్జీవీ (రామ్గోపాల్ వర్మ)గారు ఆ పాటలో కోపం, కసి, పగ ఇలా అన్ని రకాల ఎమోషన్స్తో కూడిన వేరియేషన్స్ ఉండాలన్నారు. పాట వినగానే ఆడియన్స్ గుండెల్లోకి వెళ్లిపోవాలి అని చెప్పారు. సాంగ్ రెడీ అవ్వగానే రఫ్గా నేను ఒక వెర్షన్ పాడి ఆయనకు పంపాను. ఆయన చిన్న పిల్లాడిలా సంబరపడిపోయి ఈ పాటను ఎవరితో పాడిస్తున్నారు? అని అడిగారు. నేను కొన్ని పేర్లు చెప్పాను. ఎవరూ అవసరం లేదు.. అదే ఇంటెన్సిటీతో ఈ పాటను మీరే పాడండి అన్నారు. నేనా! అని ఆశ్చర్యానికి లోనయ్యాను. సరే అనుకొని రెండు వెర్షన్స్లో పాడి వినిపించాను. మొదటి వెర్షన్ ఆయనకు నచ్చలేదు, రాముగారు చిన్నపిల్లాడిలాంటి వాడు, నచ్చితే ఎంత బాగా ఉంది అని చెప్తారో, నచ్చకపోతే అంతే నిర్మొహమాటంగా బాగాలేదు అని మొహం మీదే చెప్పేస్తారు. మొదటిసారి పాడిన పాట విని నచ్చలేదు అని మెసేజ్ పెట్టారు. సరే.. అనుకొని ఇంకో వెర్షన్ పాడి మెసేజ్ పెట్టాను. శభాష్ అంటూ ఆనందంతో గంతులేసినంత పనిచేశారాయన. హమ్మయ్య అనుకున్నాను. ఆ సినిమా జరుగుతున్నప్పుడు అందరూ అనుకున్నట్లుగానే నాకు ఓ సందేహం ఉండేది. రాముగారు సినిమా తీస్తున్నారా లేక మాటలు చెప్తున్నారా అనుకునేవాణ్ని. నా సందేశాలకు బ్రేక్ వేస్తూ సినిమాలో 11 పాటలు ఉంటే నేను పాడిన పాటను మొదట రిలీజ్ చేశారు. ఆ పాట ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆయన ఆ పాటను వైస్రాయ్ సంఘటన తర్వాత వాడుకుంటారు అనుకున్నాను. కానీ ఆయన చాలా తెలివిగా సినిమా అంతా వాడుకున్నారు. ఆ పాట విడుదలైన కొన్ని రోజులకు తారక్ (ఎన్టీఆర్) కలిసి పాట చాలా బాగా చేశారు అని అప్రిషియేట్ చేశారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన మెచ్చుకోవటం నా పనికి దక్కిన గౌరవంగా భావించాను. ఓ రోజు నేను, రాజమౌళి, ప్రభాస్ అందరం కలిసి చిన్న పార్టీలో ఉన్నప్పుడు తారక్తో జరిగిన సంభాషణ ఇది. ఆయనకు నేను చేసిన సినిమాల్లో ‘ఆంధ్రుడు’ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలోని అన్ని సాంగ్స్ను ట్యూన్ లేకపోయినా అలవోకగా పాడతారు తారక్. ఆ సంగతలా ఉంచితే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చేసినప్పుడు నేను గమనించిన విషయం ఏమిటంటే పని చేసినవారికి ఆర్జీవీ డబ్బులు సరిగా ఇవ్వరని, పాటలు చేసేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ను ఆయన ఒళ్లో కూర్చోపెట్టుకొని పాటలు ట్యూన్ చేయిస్తాడని చాలామంది చెప్పారు. ఆయన నాతో మీరు చాలా ఫ్రీడమ్ తీసుకొని కథకు తగ్గట్లుగా మంచి ట్యూన్స్ ఇవ్వమని మాత్రమే అడిగారు. ఆయన గురించి బయట విన్నవన్నీ అబద్ధం అని చిన్న ఉదాహరణతో మీకు చెప్తాను. ఈ సినిమాలోని ఐదు పాటలను సింగర్స్లో టాప్ సింగరైన యస్పీ బాలసుబ్రహ్మణ్యంగారితో పాడించారు. డబ్బు కోసం నేను ఏ విధంగానూ ఇబ్బంది పడలేదు. అప్పుడు నేను అనుకున్నాను ఏ మనిషి గురించైనా ఒక అంచనాకు వచ్చే ముందు వాళ్ల మాటలు వీళ్ల మాటలు వినకూడదు అని. మనకు మనంగా చూసి అభిప్రాయానికి రావాలి. మొత్తానికి నేను ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా రానంత తృప్తి ఈ సినిమా ద్వారా, ఈ పాట ద్వారా పచ్చింది. సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కోసం నేను రాముగారితో, ఆ టీమ్తో పని చేసిన ఆరు నెలల టైమ్ నా కెరీర్లో బెస్ట్ టైమ్. ఈ సంవత్సరం వరల్డ్ మ్యూజిక్ డేకు నాకొచ్చిన కిక్ మాటల్లో చెప్పలేనిది’’ అన్నారు. వై నాట్.. బాధ్యతగా ఉంటే విజయమే పీవీయన్యస్ రోహిత్ అనే పేరు రెండేళ్ల కింద భారతదేశం అంతా మార్మోగిపోయింది. 2017లో ‘ఇండియన్ ఐడల్’లో రన్నరప్గా నిలిచిన తెలుగువాడిగా అందరికీ తెలుసు. 2018లో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన ‘సవ్యసాచి’ చిత్రం కోసం రోహిత్ ‘వై నాట్...’ అంటూ గొంతువిప్పారు. ఆ పాట ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ పాట గురించి రోహిత్ మాట్లాడుతూ– ‘‘యం.యం. కీరవాణిగారు ఆ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఆ పాట కోసం కీరవాణిగారు రెండు మూడు ట్యూన్స్ను రెడీ చేశారు. ఆయన ఆ ట్యూన్ను వాళ్ల టీమ్ అందరికీ పంపారు. టీమ్లోని అందరూ ఈ ట్యూన్కి కనెక్ట్ అయ్యారు. అప్పుడు ‘వై నాట్..’ సాంగ్ను సినిమాలోని సన్నివేశాలకు కనెక్ట్ చేశారు. సింగర్గా నాకు మంచి పేరు వచ్చింది. కొత్తగా పాటలు పాడుతూ పైకి రావాలనే వాళ్ల కోసం వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా నేను చెప్పేదేంటంటే మనం ఒక పాట పాడుతున్నాం అంటే ఆ పాటకు ఎన్ని క్లిక్కులు వస్తాయి అనేది ఆలోచించకూడదు. ఒక పాటకి విలువ ఇంత అని చెప్పలేం. దాన్ని కొలవడానికి ఏ మెషిన్ లేదు. మ్యూజిక్ను ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. దానికోసం కష్టపడుతూ, ప్యాషనేట్గా ఉండాలి. అదో నిరంతర ప్రక్రియ. పాట ఎలాంటిదైనా చాలా బాధ్యతగా ఉండాలి. అప్పుడే అది ప్రేక్షకుల దగ్గరికి పరిపూర్ణంగా వెళుతుంది అని నేను నమ్ముతాను. నేను ఇప్పుడు హిందీలో, తెలుగులో పెద్ద హీరోలకు పాటలు పాడుతున్నాను. కానీ వాటి వివరాలు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నందుకు సారీ. కారణం నేను ఇండియన్ ఐడల్ వాళ్లకి మూడేళ్లు అగ్రిమెంట్లో ఉన్నాను. దేవుడి దయవల్ల భవిష్యతులో చాలా మంచి పాటలు పాడతాను. నాకు ఎన్నో పాటలు పాడే అవకాశం ఇచ్చిన, ఇస్తున్న సంగీత దర్శకులకు ఈ వర ల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారూ వీరూ... అభినందిస్తే ఆనందమే ‘‘సంగీతమంటే ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మనకు ప్రతి ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. సంగీతం ద్వారా ఆ ఎమోషన్స్ను సులువుగా వ్యక్తపరచవచ్చు. సంగీతానికి రాళ్లు సైతం కరుగుతాయి అంటారు. నిజంగా వాటిని కదిలించకపోయినా నా గొంతుతో ప్రేక్షకుల హృదయాల్ని కదిలించాలన్నది నా ముఖ్య ఉద్దేశం. కళాకారుడి ముఖ్య ఉద్దేశం కూడా అదే’’ అని సింగర్ అనురాగ్ కులకర్ణి తెలిపారు. గత ఏడాది ‘ఆర్ఎక్స్ 100’లో పిల్లా రా..., ఆశా పాశం, వారూ వీరు వంటి సూపర్ హిట్ సాంగ్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. సింగర్గా తన ప్రయాణం గురించి అనురాగ్ కులకర్ణి చెబుతూ– ‘‘ప్రస్తుతం జర్నీ చాలా బావుంది. ఒక సింగర్కు వర్సెటాలిటీ చూపించడానికి మించిన అదృష్టం ఉండదు. గత కొన్ని నెలల్లోనే ‘ఆర్ఎక్స్ 100’లో ‘పిల్లా రా..’, ‘కేరాఫ్ కంచరపాలెం’లో ‘ఆశా పాశం’ ఫిలాసఫికల్గా ఉంటుంది. ‘దేవదాస్’లో ‘వారూ వీరు’ పెప్పీ నంబర్. వీటన్నింటినీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేయడం సంతోషం. ఈ పాటలన్నీ పాడటాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒక పాట పాడేప్పుడు హిట్ అవుతుందా? లేదా? అనేది మనం ఊహించలేం. నిజంగా ఊహించలేం. నా వరకైతే ఇప్పటి వరకూ ఎంతమంది ఏయే పాటలు బాగా వింటున్నారన్న సంగతి కూడా తెలియదు. దాని మీద ప్రత్యేకించి ఎఫర్ట్ కూడా పెట్టను. ఎవరైనా చెప్పినప్పుడు ఓహో ఇది హిట్ అయిందా? దీనికి బాగా రీచ్ ఉందా? అనుకుంటాను. ఈ పాట బాగా రీచ్ అవుతుంది అనుకున్నవి అవ్వలేదు. ఈ ట్యూన్ని వింటారా? వినరా? అని సందేహించిన వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో.. ఏ సాంగ్ అయినా ఒకటే యాటిట్యూడ్తో అప్రోచ్ అవుతాను. నేను కొంచెం ఓల్డ్ స్కూల్ టైప్. సోషల్ మీడియాను అంత సీరియస్గా తీసుకునే టైప్ కాదు. జెన్యూన్ రెస్పాన్స్ కోరుకుంటాను. సోషల్ మీడియాలో ఉన్నదానికంటే ఎక్కువ చేసి చూపిస్తారు. అందుకే వాటిని పెద్దగా పట్టించుకోను. మన పని మనం బాగా చేశామా? లేదా? అన్నదే ముఖ్యం. ప్రత్యేకంగా ఈ సంగీత దర్శకుడికి పాడాలని ఎప్పుడూ అనుకోలేదు. మనం ఒక మ్యూజిక్ డైరెక్టర్కు పాడాలని కోరుకోవడం కంటే.. మన టాలెంట్ను బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే వాళ్లే మనల్ని అప్రోచ్ అవుతారు అనే పద్ధతిని ఫాలో అవుతాను. అందుకే మ్యూజిక్ డైరెక్టర్స్ అందర్నీ ఒకేలా గౌరవిస్తాను. ‘పిల్లా రా..’ అప్పుడు చైతన్య భరద్వాజ్ కొత్త సంగీతదర్శకుడు. అప్పటికి మణిశర్మగారికి పాడుతూ ఉన్నాను. అందరికీ ఒకేలా కష్టపడతాను. ఇంకా నా గొంతులో ట్యాప్ చేయని ఏరియాలు చాలా ఉన్నాయి. వాటిని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. అలాగే నా పాట నలుగుర్నీ నయం చేయగలగాలి. పూర్వం కులాసా వాతావరణం ఉండేది. ప్రస్తుతం అంతా ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో మ్యూజిక్ మాత్రమే ఒక ఫ్రెండ్గా మనల్ని గైడ్ చేస్తుంది. సంగీతం ద్వారా ఒక ఆరోగ్యవంతమైన సొసైటీని నిర్మించుకోగలం. అది తయారవడానికి నా గొంతు ఉపయోగపడుతుందంటే చాలా సంతోషం. చాలా డిప్రెస్డ్గా ఉన్నప్పుడు ఫలానా పాట మా మైండ్ని ఫ్రెష్గా చేసింది అని ఎవరైనా చెబితే చాలా సంతోషిస్తాను. పాట బావుంది అని చెప్పడం కంటే కూడా మీ పాట వల్ల మేం ప్రభావితం అయ్యాం అని చెబుతున్నప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఆర్టిస్ట్కి అదే నిజమైన ఆనందం’’ అన్నారు. రెడ్డమ్మ తల్లీ... ఓ ఊహించని మలుపు ‘రెడ్డమ్మ తల్లీ’... ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలోని హిట్ సాంగ్స్లో ఇదొకటి. ఈ పాటను మోహనా బోగరాజు పాడారు. ‘‘ఇది నా జీవితంలో మరచిపోలేని పాట’’ అని మోహనా భోగరాజు చెబుతూ – ‘‘రెడ్డమ్మ తల్లి...’ పాట పాడిన తర్వాత నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పటివరకు 90 పాటలు పైనే పాడాను. కానీ, ఈ పాట మాత్రం నా జీవితానికి ఊహించని మలుపు. ఈ పాట నా దగ్గరికి ఎలా వచ్చిందో చెప్తాను. నేను యాక్చువల్గా ‘అరవింద సమేత’ చిత్రానికి రీ–రికార్డింగ్కి పాడటానికి వెళ్లాను. పాడి వచ్చేశాను. సినిమా రిలీజయ్యే కొద్దిరోజుల ముందు ఓ పెద్ద వయసున్న ఆడమనిషి గొంతు అయితే ఈ పాటకు న్యాయం జరుగుతుందని అందరూ అనుకున్నారట. అప్పుడు సింగర్ శ్రీకృష్ణ అన్న ‘ఇటువంటి సాంగ్ మోహన పాడుతుంది పిలవమంటారా తమన్గారు’ అని అడిగారట. సరే అనుకొని రికార్డింగ్కి పిలిచారు. నేను వెళ్లి పాడి వచ్చేశాను. సినిమా రిలీజ్ తర్వాత ఆ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసి నేను నమ్మలేకపోయాను. ఓ మై గాడ్.. నేను పాడిన పాటేనా ఇది అనుకున్నాను. ఎందుకు ఇలా అంటున్నానంటే గతంలో నేను తమన్ గారి దగ్గర కొన్ని సినిమాలకు పాడాను. అప్పుడు కూడా నా దగ్గర ఇలాంటి గొంతు ఉంది అని ఆయన అనుకోలేదు, నాకు తెలియదు. అప్పటివరకు నేను అలాంటి పాట పాడగలనని నాకూ తెలియదు. ఇదే నా మొదటి పాట. నాకు ఆయన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆయనతో పాటు ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, హీరో తారక్గారు వీళ్లందరికీ నేను వ్యక్తిగతంగా పెద్ద ఫ్యాన్ని. వాళ్లందరూ నేను పాడిన పాటను పొగుడుతూ ఉంటే ఇంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. ఆ రోజు నేను పాడుతుంటే అక్కడ టీమ్ అందరూ ఉన్నారు. నేను అభిమానించే తమన్ గారు వెరీగుడ్, వెల్డన్ అని, చాలా బాగా పాడావమ్మా అని త్రివిక్రమ్ గారు అన్నారు. అక్కడ రచయిత పెంచల్దాస్ గారు కూడా ఉన్నారు. పాటలో ఓ చోట దువ్వెన అని పాడాను. పెంచల్దాస్ గారు దువెయన అని పాడమన్నారు. సరే అని పాడేశాను. నాకు జీవితంలో ఇంత మంచి అవకాశం వచ్చినందుకు ఈ వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా తమన్ గారికి, నా నిజమైన అన్నయ్య శ్రీకృష్ణకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అల్లుడు చూడే... పాపులరే ‘‘కొన్నిసార్లు మనకు ఎవరో అవకాశం ఇస్తారు అని ఎదురుచూసే కంటే మనమే అవకాశం కల్పించుకోవాలి. అందుకే ప్రైవేట్ ఆల్బమ్స్ పాడటం మొదలు పెట్టాను. తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి’’ అని మంగ్లీ అన్నారు. గత ఏడాది విడుదలైన ‘శైలాజారెడ్డి అల్లుడు’ సినిమాలో ‘శైలజారెడ్డి అల్లుడు చూడే...’ పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటను పాడింది మంగ్లీ. రేలారే రేలా, బతుకమ్మ పండగ మీద ప్రైవేట్ పాటల ద్వారా పాపులర్ అయ్యారు మంగ్లీ. ‘నీదీ నాదీ ఒకే కథ, సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ, శైలజా రెడ్డి అల్లుడు, వేర్ఈజ్ ద వెంకటలక్ష్మీ. లచ్చి’ వంటి సినిమాల్లో ఇప్పటి వరకూ పాడారామె. ‘శైలాజారెడ్డి అల్లుడు చూడే..’ పాట పాపులర్ అవడం గురించి మంగ్లీ మాట్లాడుతూ – ‘‘ముందుగా ఇంత మంచి గొంతునిచ్చిన మా అమ్మానాన్నలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కొన్నిసార్లు ట్యూన్ వినగానే ఆ పాట ఎక్కడి వరకూ పోతుందో ఊహించగలం. ఈ పాట బాగా పేలుతుంది అనుకున్నాం, అనుకున్నట్టుగానే బాగా పేలింది. రచయిత కాస్లర శ్యామ్ చెప్పగా, దర్శకుడు మారుతిగారు దగ్గరుండి ఈ పాటను పాడించుకున్నారు. గోపీ సుందర్ సంగీతంలో పాడటం అదృష్టం అని చాలా మంది నాతో చెప్పారు. నేను పాడిన సినిమా పాటల్లో నా ఫేవరెట్ పాట అంటే ‘నీది నాదీ ఒకే కథ’లో ‘జిమ్మేదారి కోయిల..’. అది ఎంత రీచ్ అయిందో తెలియదు కానీ నాకు పర్సనల్గా ఇష్టం. ఇంకో విషయం ఏంటంటే.. ఆంధ్రా, రాయలసీమ ఆ ప్రాంతాల వైపు వెళ్లినప్పుడు రేలారే రేలా పాట పాడమని అడుగుతుంటారు. ‘ఓరి నాయనా అది ఆ ప్రాంతం పాట కదా?’ అని అనుకుంటాను. కళకు ప్రాంతాలతో సంబంధం ఉండదు. మనమే పేర్లు పెట్టి విభజిస్తుంటాం. ఓ మంచి పాటను ఏదీ ఆపలేదు. సంగీతానికి ఉన్న పవర్ అలాంటిది. వెంకటేశ్వరస్వామి అంతటి ఆయనే అన్నమయ్యను ఇంకా బతుకు అని వరాన్ని ప్రసాదించాడు. ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఎంఎస్ సుబ్బలక్ష్మిగారి పాటలు, హిందీ పాటలు వింటుంటాను. సుబ్బలక్ష్మిగారి పాటలు విన్నప్పుడైతే కళ్లలో నీళ్లు వచ్చేస్తాయి. మణిశర్మ, కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ వంటి వారి కంపోజిషన్లో పాడాలనుంది. ప్రస్తుతం ‘ఆకాశవాణి’ సినిమాలో ఓ పాట పాడాను. ‘స్వేచ్ఛ’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాను’’ అని అన్నారు. పిచ్చి పిచ్చిగా... కల నెరవేరెగా ‘‘క్లాసికల్ సాంగ్, ఐటమ్ నెంబర్, సోల్ఫుల్ సాంగ్ అనే తేడా లేకుండా ఏ పాటైనా పాడి శ్రోతలను అలరించగలను. అదే నా çప్లస్ పాయింట్’’ అంటున్నారు పరోమా దాస్గుప్తా. హిందీలో పరోమా పాడిన పాటల్లో ‘ఓకే జాను’లో ‘కారా.. ఫంకారా’, ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’లో ‘కాఫీ పీతే పీతే’ కూడా ఉన్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘మెహబూబా’ సినిమాలో ‘పిచ్చి పిచ్చిగా..’ అనే పాటతో పరోమా తన గొంతును తెలుగుకి పరిచయం చేశారు. ఇటీవల తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమాలో ‘రోల.. రోల..’ అనే సాంగ్తో శ్రోతలను మెప్పించారు. ఈ పాటల విశేషాల గురించి పరోమా దాస్గుప్తా మాట్లాడుతూ– ‘‘మెహబూబా’ సినిమాలో ‘పిచ్చి పిచ్చి..’గా సాంగ్ పాడటం అమేజింగ్ ఫీలింగ్. ఈ సినిమాకు సంగీత దర్శకుడైన సందీప్ చౌతాగారి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నతనం నుంచి ఆయన సంగీతాన్ని ఇష్టంగా వింటున్నాను. ఇక పూరి జగన్నాథ్ డైరెక్షన్లోని సినిమాకు పాట పాడటం అంటే ఏ సింగర్కైనా కల నిజమైనట్లే. ఇంకా ఆయన సినిమాతో సింగర్గా నేను తెలుగు పరిశ్రమకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇటీవల తేజగారి దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమాలో ‘రోల రోల’ అనే మరో పాట పాడాను. ఇది సర్ప్రైజింగ్గా జరిగింది. ఓ సందర్భంలో మా సిస్టర్ అనూప్ రూబెన్స్ను కలిశారు. ఆ సందర్భంలో ఈ స్పెషల్ సాంగ్ డిస్కషన్ వచ్చింది. డిఫరెంట్ వాయిస్తో పాడించాలని ఆయన మా సిస్టర్తో అన్నారు. అలా నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ సాంగ్ను బాంబేలో రికార్డ్ చేశాం. ఈ సాంగ్ జర్నీ సూపర్ ఫీలింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు తెలుగులో రెండు పాటలు మాత్రమే పాడాను. మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. బాంబేలో సింగర్గా బిజీగానే ఉన్నా. సౌత్లో నా వాయిస్ మరింత మందికి సంగీత దర్శకులకు రీచ్ అవుతుందన్న నమ్మకం ఉంది. అప్పుడు తప్పకుండా ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఆ సమయం దగ్గర్లోనే ఉందని నా నమ్మకం. మన దేశంలో బాలీవుడ్ అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీలు చాలా పెద్దవి. నేను ముంబైలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ అవకాశాల పరంగా కొంచెం కంఫర్ట్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ టాలీవుడ్లో ప్రతి కొత్త సింగర్కు మంచి వెల్కమ్ ఉంటుంది. బాలీవుడ్, టాలీవుడ్ అని కాదు. సింగింగ్ ఆర్టిస్టుగా పెద్ద పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది మా ఫ్యామిలీది. మా అమ్మగారు క్లాసికల్ సింగర్. వ్యక్తిగతంగా ఘజల్స్ అంటే నాకు చాలా ఇష్టం’’ అన్నారు. డియో డియో కెరీర్ పీక్సయ్యో రఘురాం మల్టీ టాలెంటెడ్. పాటలు పాడటమే కాదు.. రాస్తారు కూడా. అది మాత్రమే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మారారు. గత ఏడాది బాగా వినిపించిన పెప్పీ సాంగ్స్లో ‘డియో డియో డిసక డిసక...’ ఒకటి. రఘురాం మాట్లాడుతూ – ‘‘‘పీయస్వీ గరుడవేగ’ చిత్రంలో పాడిన ‘డియో డియో డిసక డిసక...’ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అలాగే ‘పేపర్బాయ్’ చిత్రంలోని ‘బొంబాయి పోతావ రాజా బొంబై పోతావా..’ పాటతో పాటు మరో రెండు పాటలు కూడా పాడాను. ఇవేకాకుండా గత ఏడాది నితిన్ హీరోగా నటించిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంలోని మెలొడీ ‘అర్థం లేని అర్థాలెన్ని..’ పాట రాశాను. శ్రీకాంత్ హీరోగా నటించిన ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’తో పాటు ‘ప్రతిక్షణం’ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించాను. ప్రస్తుతం నేను ‘కళాకారుడు’ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాను. ఇప్పటివరకు దాదాపు 70 సినిమా పాటల వరకు పాడాను. ఇప్పుడు వరల్డ్కప్ జరుగుతుండటంతో క్రికెట్కి సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో ఆల్బమ్ను సింగర్ లిప్సికతో కలిసి రూపొందించాను. ఆ పాటకు చాలా మంచి పేరొచ్చింది. నేను సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టటానికి కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లోని మ్యూజిక్ లవర్స్కి నా పాట గట్టిగా వినిపించాలి అని. సంగీత దర్శకుల్లో నాకు ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, గాయకుల్లో యస్పీబీ గారు, శంకర్ మహదేవన్గారు చాలా స్ఫూర్తి. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా కొత్తగా సంగీతంలోకి వచ్చే వారికి నేను రెండు సలహాలు ఇస్తాను. ఏ జాబ్లో అయినా ప్రాక్టీస్కు సబ్స్టిట్యూట్ లేదు. ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత బాగా పాటల ప్రపంచంలో ఉంటాం. అలాగే మ్యూజిక్ ఈజ్ నాట్ ఏ బిజినెస్, మ్యూజిక్ ఈజ్ ఏ ప్యాషన్ అనుకొని ఎవరైనా ఈ ఇండస్ట్రీలోకి రావాలని మనసారా కోరుకుంటున్నాను’’ అన్నారు. – సినిమా డెస్క్ -
స్క్రీన్ ప్లే 8th August 2018
-
మూడు కోకిలలు.. ఆరు పాటలు
ప్రతిరోజూ పండగలానే... ఉగాది అనగానే నాకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పిండివంటలు. ఇప్పటివరకు నేను ఎనిమిది భాషల్లో మూడు వందలకు పైగా పాటలు పాడాను. బాలీవుడ్లో కూడా చాలా మంచి పాటలు పాడి పేరు సంపాదించాను. ఉగాది అని ప్రత్యేకంగా చెప్పను కాని ప్రతి రోజూ పండగ లాగానే ఉంటుంది. మన తెలుగువారందరూ విళంబి నామ సంవత్సరంలో మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. రోజూ అందరూ చాలా కష్టపడి పని చెయ్యాలి. నా విషయానికొస్తే నాకైతే ఇంకా అన్ని భాషల్లో పాటలు పాడాలి అని ఉంటుంది. అలాగే నేను నటిస్తానని కూడా అందరికీ తెలుసు. ఇప్పటివరకు మూడు తెలుగు సినిమాల్లో నటించాను. ఇప్పుడు తెలుగులో ‘ఉగ్రం’ అనే సినిమాలో జేడీ చక్రవర్తి, నేను కలిసి నటిస్తున్నాం. ఈ ఉగాదికి స్పెషల్ ఏంటంటే అమెజాన్ ప్రైమ్లో నా కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘దరీమిక్స్’ అనే షో ప్రసారమౌతుంది. నాకు చాలా పేరొస్తుందనే గట్టి నమ్మకముంది. వారానికి ఒక షో రిలీజవుతుంది. ఇప్పటివరకు రెండు ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. ఇందులో సింగింగ్, డాన్సింగ్కి చాలా స్కోప్ ఉంది. హిందీలో మంచి ఆల్బమ్స్ చేస్తున్నాను. వచ్చే ఉగాది లోపు నటుడిగా మంచి అవకాశలొస్తాయని ఆశిస్తున్నా. – శ్రీరామచంద్ర బాలీవుడ్లో ఎంటరవుతా 2017 సంవత్సరానికి సంబంధించిన ఇండియన్ ఐడల్ ట్రోఫీని సొంతం చేసుకున్నా. ఈ టైటిల్ను సొంతం చేసుకున్న తర్వాత వచ్చిన మొదటి ఉగాది ఇది. మాది మధ్యతరగతి కుటుంబం. కంబైన్డ్ ఫ్యామిలీ. ఉగాది అనగానే ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. ఈసారి పచ్చడి మిస్సవుతానేమో అనుకొన్నాను. కాకపోతే ఈ సంవత్సరం మీ అందరికంటే ముందే నేను ఉగాది పచ్చడి రుచి చూశాను. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను. అమెరికా వెళ్లే ముందే మా అమ్మగారు నాకు ఉగాది పచ్చడి ఇష్టమని ముందే తయారు చేసి రుచి చూపించారు. గతేడాది ఉగాదికి నేను మన రాష్ట్రాంలోని తెలుగువారికి మాత్రమే తెలుసు. ఈ ఉగాదికి భారతదేశం మొత్తం తెలుసు. ఎప్పుడైతే నా పేరు పక్కన ‘ఇండియన్ ఐడల్’ అని చేరిందో అది నా జీవితాన్ని మార్చేసింది. ఉగాది పండగ స్పెషల్ ఏంటంటే మన జీవితంలో ఉన్న అన్ని రుచులు ఈ ఉగాది పచ్చడిలో ఉంటాయి. మనం జీరోలో ఉన్నప్పుడు మనల్ని ఎవరూ పట్టించుకోరు. అలాగే మనం ఏదైనా సాధించగానే అందరూ మనవాళ్ల లాగే మన దగ్గరికి వస్తారు. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. మన కష్టం, మన యాటిట్యూడ్ మాత్రమే మనల్ని మనలా నిలబెడతాయి. అవే మనకెప్పుడూ మనతో పాటు తోడుంటాయి. ఈ ఉగాది సందర్భంగా నేను కొన్ని అనుకొంటున్నాను. అవేంటంటే.. నా సింగింగ్తో బాలీవుడ్లోకి ఎంటర్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంటాను. అలాగే ఇండియన్ మైఖేల్ జాక్సన్ అవుతా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. – రేవంత్ అప్పుడే తీపి విలువ తెలుస్తుంది ఉగాది అనగానే మొదట గుర్తొచ్చేది ఉగాది పచ్చడే. ఎందుకంటే నేను భోజన ప్రియుణ్ణి. అందరూ బతకటం కోసం తింటే నేను మాత్రం తినడం కోసమే బతుకుతాను. కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత కూడా ఉంది కదా. మా ఇంట్లో అందరం కలిసి భోజనం చేసేటప్పుడు కనీసం ఫోను కూడా క్యారీ చెయ్యం. ఒక్క ఎలక్ట్రానిక్ గాడ్జెట్ను కూడా మేం డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకురాం. భోజనం చేసేటప్పుడు మనకు ఇష్టమైన మనుషులతో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యాలి. ఎందుకు ఫుడ్ గురించి ఇంత మాట్లాడుతున్నానంటే ఉగాది పండగలోని ఆరు రుచులు మన లైఫ్ ఫిలాసఫీని గుర్తు చే స్తాయి. అందులో చేదు రుచిని చూస్తేనే కదా మనకు తర్వాత వచ్చే తీపి విలువ తెలుస్తుంది. 2006 సంవత్సరంలో నేను మొదట ఇండియన్ ఐడల్ గెలిచిన ఉగాదిని ఎప్పటికీ మరచిపోలేను. ఆ ఉగాది నా కెరీర్కే మైల్స్టోన్ లాంటిది. ఆ తర్వాత ఎన్నో బెస్ట్ ఉగాదులు నన్ను పలకరించినా 2017 ఉగాది మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ప్రస్తుతం నాకు సింగింగ్ అనేది వృత్తికాదు, ప్రవృత్తి మాత్రమే. నేను గతేడాది నా సొంత యూట్యూబ్ చానల్ని ప్రారంభించింది ఉగాది రోజునే. అదిప్పుడు పదిలక్షల మంది సభ్యులకు చేరువలో ఉంది. నా చానెల్ కోసం యస్పీ బాలసుబ్రమణ్యం లాంటి వారు వీడియోలు చేయటం నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాను. అలాగే గతేడాది ఉగాది నుండి ఈ ఏడాది ఉగాదికి నేను మూడు పెద్ద పనులు ప్రారంభించాను. అవేంటంటే మొదటిది నాకు నేనుగా నా యూట్యూబ్ చానల్ కోసం సంగీతం తయారు చేసుకోవటం, రెండోది మా పెద్దనాన్న వాళ్లు చాలా గొప్ప సంగీత విద్వాంసులు. వారు సొంతంగా తయారు చేసుకున్న లలిత సంగీతాన్ని ఇప్పటివరకు మా ఇంట్లో మేం మాత్రమే పాడుకున్నాం. అవి బయట వారికి తెలియవు. ఇప్పుడు వాటిని యూట్యూబ్ చానల్ ద్వారా ప్రజలకు అందజేయటం . ఇక మూడోది కర్ణాటక సంగీత కచేరీలను కూడా మొదలెట్టాను. సినిమాలు కాకుండా ముచ్చటగా ఈ మూడు పనులను ఉగాది నుండి ఉగాది వరకు అన్నట్టు చేసుకున్నాను. ఈ ఉగాదికి ‘సాక్షి’ పాఠకులందరూ ఆరు రుచులతో హాయిగా ఉండాలి. – కారుణ్య -
వేదికపై సింగర్ల గొడవ
-
మా అమ్మను వేధిస్తారా: వేదికపై సింగర్ల గలాట
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన తాజ్ మహోత్సవ్లో ఇద్దరు సింగర్లు వేదికపై రభస చేశారు. ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజ్ మహోత్సవ్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమ్లాల్లో భాగంగా గాయకులు పలక్ ముచ్చల్, ఆమె సోదరుడు పలాష్ ముచ్చల్ సంగీత విభావరి ఇచ్చారు. అయితే, ఈ సమయంలో ఒక నిర్వాహకుడు తమ తల్లితో దురుసుగా ప్రవర్తించాడంటూ.. వారు వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై రచ్చ చేస్తూ.. నిర్వాహకుడి తీరుపై పలక్ మండిపడింది. అతను తన తల్లికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వేదిక మీద మైక్లో ఆమె పేర్కొనడం వీడియోలో వినిపిస్తోంది. సాంస్కృతిక కార్యక్రమం మధ్యలోనే గాయకులు ఇలా గొడవకు దిగడంతో నిర్వాహకులు జోక్యం చేసుకొని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. తాజ్మహల్ను, మొఘల్ సంస్కృతిని గుర్తుచేసుకునేందుకు ప్రతి ఏడాది యూపీ సర్కారు తాజ్ మహోత్సవ్ నిర్వహించే సంగతి తెలిసిందే. -
పాటల పల్లకి
-
రాగ దీపం
-
సిటీ సై
టిక్.. టిక్.. టిక్.. కాలం గుర్రం డెక్కల చప్పుడు.. అచ్చం మన గుండె శబ్దిస్తున్నట్టుగా.. గంటలు.. నిమిషాలు కాలం ఒడిలో కరుగుతున్నాయి. కొత్త ఏడాది సమీపిస్తోంది. గ్రేటర్ సిటీజన్లు వేడుకలకు రెడీ అవుతున్నారు. మహానగర వ్యాప్తంగా ఉన్న పబ్లు, రిసార్ట్లు, క్లబ్లు వినూత్న స్వాగతానికి సిద్ధమవుతున్నాయి. డీజే.. రాక్.. పాప్ ఈవెంట్స్లో జోష్ నిపేందుకు.. డ్యాన్స్ ఫ్లోర్లను అదరగొట్టేందుకు యువత సై అంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ డీజేలు, సింగర్స్తో పాశ్చాత్య సంగీత ఝరి ఉర్రూతలూగించనుంది. – సాక్షి,సిటీబ్యూరో -
ఆకట్టుకున్న శాస్త్రీయ సంగీతం
పాత గుంటూరు: గాయత్రీ మహిళా çసంగీత సన్మండలి ఆధ్వర్యంలో బ్రాడీపేట సిద్ధేశ్వరీ పీఠపాలిట ఓంకార క్షేత్రంలో ఆదివారం శాస్త్రీయ సంగీత కచేరి నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్ ఎ.వి.దక్షిణామూర్తి జ్యోతి ప్రజ్వలన చేయగా డాక్టర్ బండ్లమూడి సూర్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నూజివీడుకు చెందిన బి.విద్యాసాగర్ గాత్రం చేయగా విజయవాడ హేమాద్రి చంద్రకాంత్ వయోలిన్, గుంటూరుకు చెందిన బి.సురేష్బాబు మృదంగంతో నిర్వహించిన సంగీత కార్యక్రమం ఆహూతులను ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని కె.ఆర్.ఎస్.ఆర్.కృష్ణ నిర్వహించారు. -
కోలీవుడ్ గాయకుడిగా ప్రవాస తమిళన్
సినిమాకు ఎల్లలు లేనట్టుగా నే గాయకుడికీ భాషాభేదం ఉం డదు. తెలుగు, మలయాళం, ఉత్తరాదికి చెందిన అనేక మంది గాయకులు తమిళ చిత్రాల్లో పాడుతూ ప్రాచుర్యం పొదుతున్నారు. ఇప్పు డీ కోవలోకి అమెరికాలో నివసిసు ్తన్న ప్రవాస తమిళుడు నారాయణన్మోహన్ చేరారు. ఆయన ఇప్పటి కే అయ్యనార్ వీధి, తోండియాన్ చిత్రాల్లో పాడి గుర్తింపు పొందారు. వ్యాపారరంగంలో రాణిస్తున్న నా రాయణన్మోహన్ సినీ గాయకుడైన తీరును మీడియాకు తెలుపుతూ తాను 1980లో తమిళ నాడు వదిలి అమెరికా వెళ్లానన్నా రు.కాలిఫోర్నియాలో ఒక వ్యాపార సంస్థకు అధినేతగా ఉంటూ 250 మందికి ఉపాధి కల్పిస్తున్నానని తెలిపారు. అరుుతే ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆఫీస్ పనులు చూసుకుంటూ సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వచ్చి ఏడు గంటల నుంచి 10 గంటల వరకూ సంగీత సాధన చేస్తానన్నారు. ఒ క్కోసారి తెల్లవారు జమున సూ ర్యోదయం వరకూ పాడుకుం టూనే ఉంటానని తెలిపారు. సం గీతం అంటే అంత ఆసక్తి అని చె ప్పారు. అమెరికాలో చాలా సంగీత కచేరీలు నిర్వహించానని, అలా కొన్ని నెలల క్రితం సంగీత దర్శకుడు యూకే.మురళిని కలిసే సందర్భం వచ్చిందన్నారు. అప్పు డు తన కు తమిళనాడు రావాల నే కోరిక కలిగిందన్నారు. ఆ తరువాత చెన్నైలో నిర్వహించిన సంగీత విభావరిలో పలువురు ప్రముఖ గాయనీగాయకులతో కలిసి పాడే అవకాశం కలగడం సంతోషాన్నిచ్చిందన్నారు. తన మానసిక గురువు,గాయకుడు శంకర్మహాదేవన్ అని తెలిపారు. తమిళంలో ఇప్పటి కే నాలుగైదు చిత్రాలలో పాడానని చెప్పారు. తాను ఇటీవల తోండియాన్ చిత్రంలో పాడిన అమ్మా అనే పాట మంచి ప్రాచుర్యం పొందుతుందనే నమ్మకం ఉందని గాయకుడు నారాయణన్మోహన్ అన్నారు. -
అలరించిన సంగీత విభావరి
పాత గుంటూరు: బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దసరా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని రాజరాజేశ్వరీదేవిగా అలంకరించడంతో భక్తులు అధికసంఖ్యలో దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆంధ్రాబ్యాంకు గార్డెన్స్ శాఖ ఆధ్వర్యంలో అన్నమయ్య కళావేదికపై మహతీస్వరసుధ వారి సినీసంగీత విభావరిలో గాయకులు అమ్మవారి భక్తిగీతాలను ఆలపించారు. ఆలయకమిటీ అధ్యక్షుడు సి.హెచ్ మస్తానయ్య బ్యాంకు డి.జి.యం చదలవాడ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
స్వరార్చన
-
స్వరార్చన Part 2
-
స్వరార్చన Part 1
-
కైగట్టి పాడుతూ.. గజ్జెకట్టి ఆడుతూ..
ధూం.. ధాంగా పాటల తూటాలు.. సిరిసిల్ల జిల్లా సాధనకు గళమెత్తిన గాయకులు.. సిరిసిల్ల : ‘‘ ఓ కేటీఆర్ సారూ.. మా ఐటీ మంత్రిగారు.. సిరిసిల్ల జిల్లా హామీ.. ఏమైందో చెప్పు సారూ..’’ అంటూ కళాకారులు గళం విప్పుతే.. చప్పట్లు మోగాల్సిందే. సిరిసిల్ల జిల్లా సాధన కోసం సాగుతున్న ఉద్యమంలో కళాకారుల ఆటాపాటలు ఆకట్టుకుంటున్నాయి. పాటలను కైగట్టి పాడుతూ.. గజ్జె కట్టి ఆడుతూ అలరిస్తున్నారు. సిరిసిల్ల డివిజన్లోని తొమ్మిది మండలాల్లో తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ.. జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు కళాకారులు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధన ఉద్యమంలో ఆట.. పాటలు ఎంతగా ప్రభావం చూపాయో ఆ తరహాలోనే అదే బాణీల్లో సిరిసిల్ల సాధన ఉద్యమంలోనూ కళాకారులు పాటలు పాడుతున్నారు. విద్యావంతులైన కళాకారులు సరికొత్త బాణీల్లో పాటలను కైగట్టి గానం చేస్తున్నారు. డప్పుల మోతలు, గజ్జెల సంగీతంలో పాటలు పరుగు పెడుతున్నాయి. ‘‘సిరిసిల్ల మాకు జిల్లా.. నగాదారిలో.. జిల్లా కావాలే నగాదారిలో..’’ అంటూ డిగ్రీ చదువుతున్న బైరగోని చంద్రం పాటందుకుంటే.. ఉరకలెత్తే ఉత్సాహం కలుగుతుంది. బతుకమ్మ పాటలు, పీరీల ఆటలు, కులవృత్తుల స్మరణలతో కళాకారులు గొంతెత్తి పాడుతున్నారు. డప్పు దరువుల మోతలు... జిల్లా సాధన ఉద్యమంలో డప్పు దరువులు ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది. కళాకారుల దరువులు లేచి డ్యాన్స్ చేయాలన్నంతా ఉత్సహాన్ని తెప్పిస్తుంది. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన కళాకారులు కులేరి కిశోర్, సామల్ల బాబు, బర్కుటి విజయ్, రాయల తిరుపతి, డప్పు పర్శరాములు, నక్క శ్రీకాంత్, పిల్లిట్ల రమేశ్, బర్కుటి సురేశ్, బైరగోని చంద్రం బృందం సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమంలో ధూం.. ధాం..గా ఉర్రూతలూగిస్తున్నారు. న్యాయవాదులు, జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో కళాకారుల బృందం ముందుకు సాగుతుంది. -
మాస్టారి పాటలు వింటూ... పాడుతూ బతికాడు
స్మృతిరాగం / నేడు రామకృష్ణ ప్రథమ వర్ధంతి ప్రముఖ సినీ నేపథ్య గాయకులు రామకృష్ణ ప్రథమ వర్ధంతిని (తిధుల ప్రకారం) ఈనెల 31వ తేదీ నుండి మూడు రోజులపాటు హైదరాబాద్లో వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా రామకృష్ణ పిన్ని, సీనియర్ గాయని అయిన పి.సుశీల మనోభావాలు. మా అక్క కుమారుడు కాబట్టి నేనే సినిమాల్లోకి తీసుకువచ్చానని అందరూ అనుకుంటారు. ఇది నిజం కాదు. సంగీత దర్శకులు రమేష్నాయుడు గారు ఎవరి ద్వారానో రామకృష్ణ గురించి విని ‘మీ అక్క కుమారుడు అట కదా... పాడించేదా?’ అని నా దగ్గరకు వచ్చి అడిగారు. నేను సరే అన్నాను. తొలిపాటే మా ఇద్దరి మధ్యన యుగళగీతం. ‘వయసే ఒక పూలతోట’. పంపిణీదారులు రామకృష్ణ పాటలు తీసివేయమంటున్నారు అంటూ నిర్మాత నా సలహా అడిగారు. ‘కొత్తవారు కదా నిరుత్సాహపడిపోతారు. మరొక్కసారి పరిశీలించండి’ అని చెప్పాను. దాంతో వాడి పాటలు ఉంచేయడం, హిట్ కావడం జరిగిపోయింది. ఘంటసాల తరువాత పెద్ద నిర్మాతలంతా రామకృష్ణను ఎంతగానో ప్రోత్సహించారు. ‘భక్త తుకారాం’ సమయంలో ఘంటసాల మాస్టారుకు పూర్తిగా అనారోగ్యం. దీంతో రామకృష్ణ చేత ఆదినారాయణరావు, అంజలి పట్టుబట్టి పాడించారు. ఆ సినిమాలో ఘంటసాల మాస్టారు పాడిన పాటలతో సమానంగా రామకృష్ణ పాటలు హిట్ అయ్యాయి. మా అక్క కొడుకు నా ఇంట్లో కాక మరెక్కడుంటాడు. ఇందులో తప్పేంటి. దీంతో రామకృష్ణను సుశీల సిఫార్సు చేస్తున్నారని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేశారు. నిజానికి వాడి ప్రతిభను మెచ్చుకునే తీసుకున్నారు. గాత్రంలో మాధుర్యం లేకుంటే ఘంటసాల మాస్టారుతో అలవాటు పడిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్బాబు, కృష్ణంరాజులు పాడించుకుంటారా? నా కోడలు ఎంతో చక్కగా పాడుతుంది, ఎవరికైనా సిఫార్సు చేశానా? ఏ కళాకారులకైనా సిఫార్సులు తాత్కాలికమే, ప్రతిభే పర్మనెంటు. ఘంటసాల మాస్టారుకు రామకృష్ణ ఏకలవ్య శిష్యుడు. ఆయనంటే ప్రాణం. అన్నం తిని కాదు మాస్టారి పాటలు వింటూ, పాడుతూ బతికాడని చెప్పవచ్చు. ‘తెలుగువీర లేవరా’ పాటను మాస్టారుతో కలిసి పాడినపుడు రామకృష్ణ ఆనందానికి అవధులులేవు. ఘంటసాల పాటల కోసం మూడుసార్లు వరుసగా అమెరికాకు తీసుకెళ్లగా రామకృష్ణకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. మరో ఘంటసాల అని పొగిడారు. కుమారుడు సాయి కిరణ్ చదువు కోసం, చిత్ర పరిశ్రమతోపాటూ హైదరాబాద్కు మకాం మార్చాడు. అయితే ఆ తరువాత అంతగా ప్రోత్సాహం లభించలేదు. టీవీ సీరియల్స్లో నటించాడు. ప్రతిభకు తగిన ప్రోత్సాహం క్రమేణా కరువై పోయింది. పోటీ ప్రపంచంతో అలసిపోయిన మా మధుర గాయకుడు తన 65వ ఏట ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. - సంభాషణ: కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై రామకృష్ణ పాడిన ప్రసిద్ధ గీతాలలో కొన్ని.. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం (తాత-మనవడు) పాండురంగనామం పరమపుణ్యధామం (భక్త తుకారాం) ఏదొ ఏదొ అన్నది (ముత్యాల ముగ్గు) శివ శివ శంకర (భక్త కన్నప్ప) నా జీవన సంధ్యా సమయంలో (అమరదీపం) -
కొత్తకోకిలలు
కవర్ స్టోరీ పాట అంటే తోట. గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిరాలతో సంబంధం లేని తోట. ఇక్కడంతా నిత్య వసంతమే. వసంతం అంటేనే... తుమ్మెదలూ పువ్వులూ ఝంకారాలూ చిగురాకులూ కోకిలలూ కిలకిలలూ! సినిమా పాటల తోటలో ఒకప్పుడు అయిదారు కోయిలలే. కానీ, ఈ వసంత పరిమళానికి దాసోహమై ఎక్కడెక్కడ్నుంచో కొత్త కోకిలలు వచ్చి ఇప్పుడు ఈ తోటలో సందడి చేస్తున్నాయి. ఇప్పుడిది కొత్త కోయిలల రాజ్యం. నిజమే... ఒకప్పుడు తెలుగు సినిమా పాట ఇద్దరు ముగ్గురికే సాష్టాంగ నమస్కారం చేసింది. ఇప్పుడు ట్రెండ్ మారింది. తెలుగు సినిమా పాట ఎంతమందికైనా షేక్హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అప్పుడు సినిమాల్లో పాటలెక్కువ, సింగర్స తక్కువ. ఇప్పుడు పాటలు తక్కువ, సింగర్స ఎక్కువ. అయినా బాగుంది. కొత్తదనమెప్పుడూ తియ్యదనమే కదా! ‘పాడుతా తీయగా... సూపర్ సింగర్స... లిటిల్ చాంప్స్...’ ఇలా రకరకాల టీవీ ప్రోగ్రామ్స్. ఇవన్నీ కొత్త కోయిలల్ని వెతికి పట్టుకొచ్చే దుర్భిణులు. ఒకప్పుడు రావు బాలసరస్వతి, పి.సుశీల, ఎస్. జానకి, లీల, జిక్కీ, జమునారాణి, ఎల్.ఆర్. ఈశ్వరి, వాణీ జయరామ్, శైలజ - ఇలా గాయనులు అంటే కొందరే. నిన్నటి తరం చిత్ర వరకు ఇదే పరిస్థితి. కానీ, కొత్త సహస్రాబ్దిలో తెలుగు పాట సరికొత్తగా ముస్తాబైంది. సునీత, ఉష, కౌసల్య, గీతా మాధురి, శ్రావణభార్గవి, అంజనా సౌమ్య, చిన్మయి - ఇలా చాలామంది నవతరం గాయనులు తెర ముందుకు వచ్చారు. తెలుగు పాటకు కొత్త గ్లామర్, గ్రామర్ అద్దారు. కేవలం గడచిన పది, పదిహేనేళ్లలో వందల మంది ఫిమేల్ సింగర్స ఉద్భవించారు. ఇంకా వస్తారు కూడా. కొందరు మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటే... ఇంకొందరు మాత్రం తమ సప్త స్వరాలాపనతో ఏడు రంగుల ఇంద్రధనుస్సుల్ని సృష్టిస్తున్నారు. ఒకప్పుడు కొన్ని తరాల పాటు కొందరి గాన గాంధర్వమే వినిపించింది. ఇప్పుడు అలా కాదు... తరానికో స్వరం. స్వరానికో గళం. ప్రతి గళం... ఒక వరం. ఏ పాట ఎవరు పాడారో గుర్తు పెట్టుకొనే లోపలే మరో కొత్త కోయిల కమ్మగా గొంతు సవరిస్తుంది. మరో పాట మెత్తగా మన చెవి మీటుతుంది. ప్రతి అయిదారేళ్ళకో కొత్త పాటల తెమ్మెర వీస్తోంది. ఇంగ్లీషు చదువులు, ఇంజినీరింగ్ ఉద్యోగాల గందరగోళపు పరుగుపందెంలో నవ తరం మళ్ళీ తెలుగు మాట నేర్చుకోవడానికి సినిమా పాట ఒక సాధనమైంది. ప్రతిభాన్వేషక పోటీలు, పాటకచ్చేరీలు, సంగీత విభావరుల పుణ్యమా అని తల్లితండ్రులు పిల్లలకు మన సంగీతం నేర్పుతున్నారు. మన సంస్కృతి, సాహిత్యం మప్పుతున్నారు. అందుకే, ఆధునిక తరానికి కూడా గళసీమలో పాట ఒక ‘శంకరాభరణం’. కొత్త కోకిలలు గొంతు సవరించి చేస్తున్న కలకూజితాల కచ్చేరీ నిజంగా మధురాతి మధురం! అలా ఇటీవలి కాలంలో తమ స్వరాలతో మన మనసు దోస్తున్న ఏడుగురు తెలుగింటి విరిబోణుల గురి తప్పని పాటల్ని ఆలకిద్దాం. రమ్య బెహరా ‘బాహుబలి’తో భారీగా గుర్తింపు తెచ్చుకున్న యువ సింగర్ రమ్య బెహరా. ‘ధీవర...’ పాట ఈ యువతికి ఇప్పుడు పెద్ద టర్నింగ్ పాయింట్. ఒక్క తెలుగుకే పరిమితం కాకుండా, పలు ఇతర భారతీయ భాషల్లో కూడా రమ్య గళం విప్పుతున్నారు. ఏ భాషలో పాడినా ఆ భాష తాలూకు సౌందర్యం, భావం అర్థం చేసుకొని పాడడానికే ప్రయత్నిస్తానంటారు. సహజంగానే, శాస్త్రీయ సంగీత శిక్షణ, లలిత సంగీత పరిచయం ఆమెకు పెట్టనికోట అయ్యాయి. స్వస్థలం: పుట్టింది గుంటూరు జిల్లా నరసరావుపేటలో. స్థిరపడింది హైదరాబాద్లో. చదువు: బీఎస్సీ పూర్తయ్యింది. ప్రస్తుతం కర్ణాటక, లలిత సంగీతాలు నేర్చుకుంటోంది. తొలి పాట: ‘వెంగమాంబ’లో ‘సప్తగిరీశుని...’, పేరు తెచ్చిన పాటలు: 1. రారీ రోరేలా (రాజన్న), 2. సూడు సూడు సూడు (లౌక్యం), 3. కొత్తగున్నా హాయే నువ్వా... (ప్రేమకథా చిత్రమ్), 4.కుంగ్ఫూ కుమారీ... (బ్రూస్లీ), 5. గువ్వా గోరింకతో... రీమిక్స్ (సుబ్రహ్మణ్యం ఫర్ సేల్), 6. ధీవర... (బాహుబలి) తెలుగు, కన్నడ, తమిళ, ఒరియా, హిందీ భాషల్లో పాడుతున్నాను. హిందీలో ‘బేబీ’ (2015) అనే సినిమాలో ‘మై తురుసే ప్యార్ నహీ కర్తీ’ పాటను కీరవాణిగారే నాతో పాడించారు. ఒరియాలో కూడా రెండు పాటలు పాడాను. ఇలా అన్ని భాషల్లోనూ అందరు సంగీత దర్శకులతోనూ పాడాలని ఉంది. ఇంగ్లీషులో కూడా ఒక్క జింగిల్ అయినా పాడాలని ఉంది. జీవితాంతం ఇలా మంచి మంచి పాటలు పాడుతూ పోవాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. అదే నా లక్ష్యం. - రమ్య లిప్సిక కొత్త తరంలో ఆల్రౌండర్ లిప్సిక. ఈవిడ సింగర్గా ఎంత పేరు తెచ్చుకుందో డబ్బింగ్ ఆర్టిస్ట్గా అంతకన్నా ఎక్కువ పేరే తెచ్చుకుంది. ఈ పదేళ్లలో దాదాపు 150 సినిమాలకు పైగా పాడిన లిప్సిక, గత ఏడాది విడుదలైన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘కుమారి 21ఎఫ్’లో హీరోయిన్ హెబ్బా పటేల్కు గాత్రదానం చేసి, యువతను ఆకట్టుకుంది. చదువు: ఎంబీయే పూర్తయ్యింది. కర్ణాటక సంగీతంలో డిప్లొమో, వెస్ట్రన్ మ్యూజిక్లో ఫిఫ్త్ గ్రేడ్ పూర్తయ్యాయి. పేరు తెచ్చిన పాటలు: 1. వన్మోర్ టైమ్... (టెంపర్), 2. హ్యాపీ హ్యాపీ... (లవర్స), 3.ఓ మై లవ్... (ప్రేమకథా చిత్రమ్), 4. పిల్ల గాలుల పల్లకీలో... (మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు), 5. తూహీ తూహీ... (కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ). సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇంకా పెద్ద పేరు తెచ్చుకుంటాను. ఎప్పటికైనా మ్యూజిక్ స్కూల్ పెట్టాలనేది నా డ్రీమ్. - లిప్సిక దామినీ భట్ల ఒక్క పాట. ఒకే ఒక్క పాటతో దామిని సూపర్ సింగరైపోయింది. ‘బాహుబలి’ సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పాట... ‘పచ్చ బొట్టేసినా...’. ఈ పాట పాడింది దామినియే. ఓ తమాషా తెలుసా? ‘బాహుబలి’ ఆడియో రిలీజయ్యే వరకూ ఈ పాటకు సింగర్ని తానేనన్న విషయం దామినికి తెలియనే తెలియదు. టాప్ మ్యూజిక్ డెరైక్టర్ కీరవాణి మ్యూజిక్ ట్రూప్లో మెంబర్ తను. ‘బాహుబలి’ కోసం ‘పచ్చబొట్టేసినా’ పాటను దామినితో పాడించారు కీరవాణి. అది వట్టి ట్రాకేననుకుందామె. కీరవాణి మాత్రం ఆ పాటకు ఆ వాయిస్సే కరెక్టనుకున్నారు. అదే ఫైనల్. ఆడియో రిలీజై, అందరూ కంగ్రాట్స్ చెప్పేవరకూ దామినికి విషయం తెలియలేదు. ఆ క్షణం నుంచి ఆ పాటే ఆమెకు పచ్చబొట్టయిపోయింది. బెస్ట్ సింగర్గా ఇటీవలే ‘గామా’ అవార్డు కూడా అందుకుందామె. సొంతవూరు: రాజమండ్రి స్థిరపడింది: హైదరాబాద్లో చదువు: ఆంధ్ర మహిళా సభలో, కర్ణాటక సంగీతంలో బి.ఎ. ఫైనలియర్. స్ఫూర్తి: గాయని చిత్ర తొలి పాట: మలయాళ హీరో పృథ్వీరాజ్ నటించిన ‘లవ్ ఇన్ లండన్’ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేశారు. అందులో ‘నీకోసం...’ అనే పాటను సింగర్ దీపుతో కలిసి పాడింది. పేరు తెచ్చిన పాటలు: 1. పచ్చబొట్టేసినా... (బాహుబలి), 2. క్రేజీ (లచ్చిందేవికో లెక్కుంది), 3. చిట్టి తల్లి... (పడేశావే) నాన్న రాధాకృష్ణ ప్రైవేటు ఉద్యోగి. అమ్మ శ్రీఝాన్సీ గృహిణి. అక్క మౌనిమ కూడా గాయనే. కాకినాడ స్కూల్లో చదువుతున్నప్పుడు చదువుతో పాటు ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోమంటే అక్క మ్యూజిక్నీ, నేను డ్యాన్సనీ ఎంచుకున్నాం. అక్క పాడుతుంటే నేను కూడా మ్యూజిక్ వైపు ఎట్రాక్ట్ అయిపోయా. అప్పటి నుంచీ సంగీతంలో శిక్షణ తీసుకున్నాను. బుల్లితెరపై పలు సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తర్వాత కీరవాణి గారి సంగీత బృందంలో చేరాను. ‘పచ్చబొట్టేసినా’ పాట పాడే అవకాశం వస్తుందని నేను ఊహించను కూడా ఊహించలేదు. సంగీతమే నా ప్రపంచం. చివరి క్షణం వరకూ ఇక్కడే ఉండాలి. అంతకు మించి లక్ష్యాలేమీ లేవు. - దామిని మోహన భోగరాజు ‘బాహుబలి’ చాలామందికి లైఫ్ ఇచ్చింది. ఆ జాబితాలో కచ్చితంగా చేర్చాల్సిన పేరు మోహన. చిన్నతనం నుంచీ పాటే ప్రాణంగా బతికినందుకు ఆమెకు దక్కిన అపురూప బహుమతి ‘బాహుబలి’లోని ‘మనోహరి...’ గీతం. చాలా మనోహరంగా పాడింది మోహన. చాలా తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న సింగర్ అంటే మోహన పేరే చెప్పాలి. సొంతవూరు: పుట్టింది ఏలూరు. కానీ ఇప్పుడు హైదరాబాదే సొంతవూరు. స్ఫూర్తి: చిత్ర, బాంబే జయశ్రీ, సునిధీ చౌహాన్, చిన్మయి. తొలి పాట: ఉదయ్కిరణ్ హీరోగా నటించిన ‘జై శ్రీరామ్’లో ‘సయ్యామ మాసం...’ పేరు తెచ్చిన పాటలు: 1. మనోహరి (బాహుబలి), 2. సైజ్ సెక్సీ (సైజ్ జీరో), 3. భలే భలే భలే భలే మగాడివోయ్ (భలే భలే మగాడివోయ్), 4. అక్కినేని అక్కినేని... (అఖిల్), 5. దేవ్ దేవ్ దేవుడా... (సౌఖ్యం), 6. డిక్కి డిక్కి డుమ్ డుమ్... (సోగ్గాడే చిన్ని నాయనా) చిన్నతనంలోనే సింగర్గా చాలా పురస్కారాలు గెలుచుకున్నా. ‘జై శ్రీరామ్’లో పాడాక, రెండేళ్లు చదువు మీదే శ్రద్ధ పెట్టా. ఆ తర్వాత కీరవాణిగారిని కలిసి ఆయన బృందంలో చేరా. కోరస్ సింగర్గా చాలా పాడాను. ప్రభాస్ బర్తడే సందర్భంగా రిలీజ్ చేసిన ‘బాహుబలి’ టీజర్ కూడా నేను పాడిందే. ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంలో ‘అంతే ప్రేమంతే...’ పాటను కీరవాణి గారి అబ్బాయి భైరవతో కలిసి పాడాను. - మోహన సమీరా భరద్వాజ్ మన తెలుగుమ్మాయే. కానీ పదేళ్లుగా చెన్నైలో స్థిరపడిపోయింది. చెన్నైలో వివిధ సంస్థలు నిర్వహించిన పాటల పోటీల్లో పాల్గొని, బహుమతులు సంపాదించింది. ఆ పాపులారిటీతో, చెన్నైలో స్థిరపడిన సంగీత దర్శకుల ప్రోత్సాహంతో సినిమాల్లోకి అడుగు పెట్టింది. రెండేళ్ళ వ్యవధిలో దాదాపు 200 సినిమాలకు పాడింది. తెలుగు, తమిళ భాషలు రెంటిలోనూ సింగర్గా రాణించాలని ఆకాంక్ష, ఆశయం. అన్నట్లు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తమిళ వెర్షన్లో సమంతకు తమిళ డబ్బింగ్ చెప్పింది కూడా సమీరే. పుట్టింది: హైదరాబాద్, స్థిరపడింది చెన్నై చదువు: మార్కెటింగ్ మేనేజ్మెంట్లో బీకాం, సీఎస్ పూర్తయ్యింది. ప్రస్తుతం కర్ణాటక సంగీతం, హిందుస్తానీ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. ఫేవరెట్ సింగర్: పి. సుశీల. ఆవిడ ఏ పాట పాడినా మనసుతో పాడినట్టే అనిపిస్తుంది. ఏ హీరోయిన్కి పాడినా వాళ్లలో లీనమైపోయి పాడిన ఫీలింగ్. అందుకే ఆమె వాయిస్ ఎవర్గ్రీన్ అంటారు సమీర. తొలి పాట: రామ్ హీరోగా నటించిన ‘శివమ్’ కోసం ‘ఐ లవ్యూ...’ అనే పాటను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పాడించారు. పేరు తెచ్చిన పాటలు: 1. అలీ అలీ బ్రూస్లీ... (బ్రూస్లీ), 2. చల్ చలోనా... (షేర్), 3. గణ గణ గణ గణ ఆంధ్రా తెలంగాణ... (డిక్టేటర్), 4.తెలుసా తెలుసా... (సరైనోడు) 5. దావాని పుల్లే... (తమిళ చిత్రం ‘ఎన్నై పిరియాదే’) 6.కన్వే... (తమిళ చిత్రం ‘అరణ్యం’) సింగర్ అవుతాననీ, ఇదే నా ప్రొఫెషన్ అవుతుందని అస్సలు ఊహించలేదు. ఏదో నా మానాన నేను పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని. అది విని, మా ఇంట్లోవాళ్లు నా టాలెంట్ను గుర్తించారు. ఎంకరేజ్ చేశారు. అందుకే ఈ స్థాయికి చేరుకున్నాను. తెలుగు, తమిళ భాషలు రెండిట్లోనూ గాయనిగా మంచి పేరు తెచ్చుకోవడం కోసమే నా తాపత్రయమంతా. - సమీరా సత్య యామిని చిన్నప్పటి నుంచి సంగీతం మీద ఆసక్తి ఉన్న యామిని అనేక ప్రైవేట్ ఆల్బవ్ు్సలో పాడారు. ఇంజినీరింగ్ చదువుతున్న ఈ యువ గాయని కూడా ‘బాహుబలి’ సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్న సింగరే. ‘మమతల తల్లి ఒడి బాహుబలి...’ అంటూ ఈమె పాడిన సూపర్హిట్ సాంగ్ జనాదరణతో పాటు, ఇటీవల ప్రతిష్ఠాత్మక ప్రైవేట్ అవార్డుల్లో ఒకటైన ‘ఐఫా’ అవార్డును కూడా సంపాదించి పెట్టింది. ఈ ఏడాది సంక్రాంతి రిలీజుల్లో సూపర్ హిట్టయిన నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలోని టైటిల్ సాంగ్ కూడా సత్య యామిని పాడినదే. స్వస్థలం: హైదరాబాద్ చదువు: ఘట్కేసర్లోని సీఎస్సార్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం ఫేవరెట్ సింగర్: పి.సుశీల పేరు తెచ్చిన పాటలు: 1. మమతల తల్లి ఒడి బాహుబలి... (బాహుబలి), 2. సోగ్గాడే చిన్నినాయనా ఒక్క పిట్టనైన కొట్టలేడు... (సోగ్గాడే చిన్నినాయనా) 3. ఎదురుగా ఒక వెన్నెల... (భద్రం బీకేర్ఫుల్ బ్రదరూ), 4. మగువ మనసు... (ఏమో గుర్రం ఎగరావచ్చు), 5. సన్నజాజి పడక... రీమిక్స్ (సైజ్ జీరో) సంగీతమంటే నాకు ప్రాణం. సుశీల గారి పాటలంటే చెవి కోసుకుంటాను. ఓపక్క చదువులో బిజీ అయినా పాటలకిచ్చే ప్రాధాన్యం ఎక్కువే. మంచి గాయనిగా పేరు తెచ్చుకోవడం కోసం నిరంతర ప్రయత్నం, సాధన చేస్తున్నా. ‘ఐఫా’ అవార్డు లాంటివి రావడం నాకు ఈ దశలో ఎంతో ప్రోత్సాహమిచ్చాయి. - సత్య యామిని మౌనిమ ‘బాహుబలి’తో బ్రేక్ తెచ్చుకున్న వారిలో ఇద్దరు సిస్టర్స ఉన్నారు. ఒకరేమో ‘పచ్చబొట్టేసినా...’ ఫేవ్ు దామిని, ఇంకొకరు మౌనిమ. దామినికి అక్క మౌనిమ. ఆమెకు చిన్నప్పటి నుంచీ సంగీతమంటే ప్రాణం. స్వస్థలం: రాజమండ్రి. ఇప్పుడు ఉండేది హైదరాబాద్లోనే. చదువు: బీకామ్ కంప్యూటర్స. అమెరికన్ కొలాబరేషన్ బ్యాంక్లో ఏడాది పాటు పని చేసింది. ఇప్పుడు దృష్టంతా సంగీతమ్మీదే. తొలి పాట: ‘బాహుబలి’ చిత్రంలోని ‘ఎవ్వడంట ఎవ్వడంట...’. బోలెడన్ని భక్తి గీతాల ఆల్బమ్స్, బతుకమ్మ పాటలు పాడాను. ‘బాహుబలి’లోని ఒక్క పాటతోనే నాకు బోలెడంత క్రేజ్ వచ్చేసింది. నాకు సింగింగ్తో పాటు యాక్టింగ్ మీద కూడా చాలా ఆసక్తి.‘వర్షం సాక్షిగా’ అనే షార్ట ఫిల్మ్లో నేను యాక్ట్ చేశాను. ‘స్టేజెస్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తున్నాను. - మౌనిమ ఇంకొన్ని కొత్త కోకిలలు... * సాయి శివాని (‘టక్కరి’లో ‘అమ్మి... అమ్మి...’ పాట, ‘మగధీర’లో ‘బంగారు కోడిపెట్ట...’ పాట రీమిక్స్, ‘కృష్ణ’లో ‘అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్ని...’ పాట, ‘రైడ్’లో ‘దంచవే మేనత్తా కూతురా...’ పాట రీమిక్స్) * శ్రుతి (‘ఆలస్యం అమృతం’లో ‘మొదటి క్షణం...’ పాట, ‘రాజా చెయ్యి వేస్తే’లో ‘చిన్నారి తల్లి...’ పాట, ‘హితుడు’ సహా పలు ఇతర చిత్రాల్లో పాటలు) * స్ఫూర్తి (‘కిక్-2’లో ‘తీస్మార్ఖాన్...’ పాట) * హర్షిక (‘ఉయ్యాల-జంపాల’లో ‘ఉయ్యాలైనా జంపాలైనా...’ పాట, ‘హ్యాపీడేస్’లో ‘వీడుకోలు...’ పాట) * పర్ణిక (‘దేనికైనా రెడీ’లో ‘పిల్లందం కేక కేక...’ పాట) * సాహితి (‘కొత్త జంట’లో ‘అటు అమలా పురం ఇటు పెద్దాపురం...’ రీమిక్స్ సాంగ్) * ఉమా నేహ (‘టెంపర్’, ‘జ్యోతిలక్ష్మి’ చిత్రాల్లో టైటిల్ సాంగ్స) * నూతన (‘బెంగాల్ టైగర్’లో ‘ఆసియా ఖండంలో...’ పాట, నిఖిల్ ‘శంకరాభరణం’లో టైటిల్సాంగ్) -
ఓటమే పాడిస్తుంది విజయ 'గీతం'
ఓటమి ఎదురైందని డీలా పడిపోకూడదు, ఓటమి విజయానికి నాంది అన్న విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలి అన్నారు. సినీ నేపథ్య గాయకలు మల్లికార్జున్, గోపికా పూర్ణిమా దంపతులు. భోగాపురం సమీపంలోని దెంకాడ మండలం బంటుపల్లి గ్రామదేవత శ్రీకనకదుర్గమ్మ జాతరలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షితో పంచుకున్న ముచ్చట్లవి. పాటంటే ప్రాణం నాది విశాఖ జిల్లా అనకాపల్లి. చిన్నప్పటి నుంచి సినిమాలను ఎంతో ఆసక్తిగా చూసేవాడిని. మా అమ్మ, అక్క ఎక్కువగా పాటలు పాడేవారు. వాళ్లే నాకు స్ఫూర్తి. దీంతో చిన్నప్పటి నుంచి పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సినీ గీతాలు పాడుతూ, పాటలు పాడేవాడిని. దీంతో అంతా మంచి గాయకుడివి అవుతావని అంటుండటంతో ఉత్సాహం పెరిగి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాను. చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే ప్రాణం. సంగీత దర్శకుల్లో ఇళయరాజా అంటే దైవంతో సమానం. గాయకులకు వివిధ చానళ్ఉల నిర్వహిస్తున్న 'సూపర్ సింగర్', 'పాడుతా తీయగా' తదితర కార్యక్రమాలు చక్కని వేదికలుగా నిలుస్తాయి. విజయనగరం అమ్మాయినే.... నా జన్మస్థలం విజయనగరం. విద్యాభ్యాసం హైదరాబాద్లో జరిగింది. విద్యల నగరం విజయనగరంలో జన్మించడం నా అదృష్టం. 1999 నుంచి సినీ నేపథ్య గాయనిగా కొనసాగుతున్నాను. సినిమాలో పాటల కన్నా ఎక్కువగా భక్తిగీతాలు, సాయిబాబా భక్తి పాటలు ఆల్బమ్స్కు పని చేశాను. మల్లితో పాటు పలు సినిమాల్లో పాటలు పాడాను. జల్సా, బొమ్మరిల్లు, శంకర్ దాదా జిందాబాద్, నాని సినిమాల్లో పాడిన పాటలు మంచి పేరు తీసుకొచ్చాయి. సంగీతంపై ఆసక్తి ఉన్న పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు ఓ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయడమే నా లక్ష్యం. - గోపికా పూర్ణిమ 'సింగన్న'తో పాటల ప్రయాణం తొలుత 1997లో సింగన్న చిత్రంలో 'కలగంటి... కలగంటి పాటతో సినీ గాయకుడిగా నా ప్రస్థానం మొదలైంది. ఆది సినిమాలో నీ నవ్వుల చల్లదనాన్ని..., ఇంద్రలో ఘల్లు ఘల్లుమని..., ఠాగూర్లో మన్మధ... మన్మధ..., ఒక్కడులో సాహసం... శ్వాసగా..., గుడుంబా శంకర్లో చిట్టి నడుమనే చూస్తున్నా...తోపాటు పలు పాటలు మంచి పేరు తీసుకొచ్చాయి. కత్తి కాంతారావు సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేశాను. నేపథ్య గాయకుడినైనా... రాబోయే రోజుల్లో మంచి సంగీత దర్శకునిగా పేరు తెచ్చుకోవడమే నా ఆశయం. కొత్తగా వస్తున్న గాయకులు ఆవకాశాలు రానప్పుడు నిరాశ పడకూడదు. ప్రతిభ ఉంటే అవకాశాలు వెతుక్కుని వస్తాయి. అంతవరకు పట్టుదలతో కృషి చేయాలి - మల్లికార్జున్ -
స్టార్లు పాడితే... లోకమే ఆడదా..!
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ప్రెజెంట్ ట్రెండ్ ఏమిటంటే... హీరోలూ, హీరోయిన్లూ గొంతు విప్పి పాటలు పాడడం. తెలుగు చిత్రసీమలోనూ, హిందీ చిత్రసీమలోనూ ఈ కల్చర్ ఎక్కువైపోయింది. లేటెస్ట్గా ఈ వారంలో... సింగర్స్ అవతారమెత్తిన ఓ ముగ్గురు స్టార్స్ గురించి డీటైల్స్... గొంతు సవరించిన బన్నీ అల్లు అర్జున్ డ్యాన్సులు బాగా చేస్తారు. ఫైట్లు ఇరగదీస్తారు. మరి... ఆయన సాంగ్ సింగితే ఎలా ఉంటుంది? నిజంగానే మరికొన్ని రోజుల్లో ఆయన పాడిన పాటను మనం వినబోతున్నాం. యస్.. ఈ స్టయిలిష్ స్టార్ పాట పాడేశారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘సరైనోడు’ చిత్రం రూపొందు తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఎస్. ఎస్. తమన్ స్వరాలందిస్తున్నారు. మామూలుగా తాను ఏ సినిమాకి పాటలందించినా ఆ సినిమాలో నటించే హీరోతోనో, హీరోయిన్తోనో పాట పాడించడానికి ట్రై చేస్తారు తమన్. చిన్న ఎన్టీఆర్, రవితేజ, శ్రుతీహాసన్ వంటి తారలు తమన్ ట్యూన్స్కు పాడారు. ఇప్పుడు అల్లు అర్జున్తో పాడించడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ‘‘బన్నీ లాంటి బెస్ట్ డ్యాన్సర్కి ట్యూన్స్ తయారు చేయడం సవాల్గా అనిపించింది’’ అని ఈ సందర్భంగా తమన్ పేర్కొన్నారు. చెన్నైలోని రికార్డింగ్ థియేటర్లో అల్లు అర్జున్ పాడగా ఓ పాటను రికార్డ్ చేశారు. బన్నీ భలేగా పాడారట. మార్చిలో ఆడియోను విడుదల చేయాలనుకుంటున్నారు. సో... సింగర్గా బన్నీ గొంతు వినడానికి మరెన్నో రోజులు లేదన్నమాట. పరిణీతి పాడుతుందోచ్! బాలీవుడ్లో సింగర్స్గా ఆకట్టుకున్న కథానాయికలు చాలామందే ఉన్నారు. సోనాక్షీ సిన్హా, శ్రద్ధాకపూర్, ఆలియా భట్లతో పాటు మన దక్షిణాది బ్యూటీ శ్రుతి కూడా హిందీలో పాడి, భేష్ అనిపించుకున్నారు. ప్రియాంకా చోప్రా ఏకంగా ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బమ్స్తో గాయనిగా ఫేమస్ అయిపోయారు. సింగర్స్ అవతారమెత్తిన కథానాయికల జాబితాలో ఇప్పుడు పరిణీతి చోప్రా చేరిపోయారు. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘మేరీ ప్యారీ బిందు’. సంగీత దర్శక ద్వయం సచిన్- జిగర్ ఈ చిత్రానికి పాటలు స్వరపరుస్తున్నారు. ఈ చిత్రంలోని ‘మనా కీ హమ్ యార్ నహీ...’ అనే పాటను పరిణీతితో పాడించాలనుకున్నారట. ఈ బ్యూటీని అడగ్గానే.. ఓకే చెప్పేశారు. వాస్తవానికి పరిణీతి గాయకురాలిగా శిక్షణ కూడా పొందారు. అయితే, ఇప్పటివరకూ ఆమె సినిమాలకు పాడలేదు. ‘‘పాడాలని చాలామంది దర్శకులు, సంగీత దర్శకులు అన్నారు. కానీ, ఎందుకనో కుదరలేదు. ఇప్పుడు కుదిరింది’’ అని పరిణీతి పేర్కొన్నారు. త్వరలో ఆమె పాడగా ఈ పాటను రికార్డ్ చేయనున్నారు. అంజలి నోట... తమిళ పాట... పదహారణాల తెలుగమ్మాయి అంజలి ఒకవైపు గ్లామరస్ రోల్స్ చేయడంతో పాటు మరోవైపు నటనకు అవకాశం ఉన్న ట్రెడిషనల్ రోల్స్ చేస్తూ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రాల్లో ‘చిత్రాంగద’ ఒకటి. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ వెర్షన్కి ‘యార్ నీ’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి స్వామినాథన్ పాటలు స్వరపరుస్తున్నారు. ఓ పాటను అంజలితో పాడించాలనుకుంటున్నారట. అంజలి వాయిస్ ముద్దు ముద్దుగా ఉంటుంది. ఇక, పాడితే ఎంత ముద్దుగా ఉంటుందో? అంజలి పాడనున్న తొలి పాట ఇదే అవుతుంది. ఇది ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ. వివిధ ప్రాంతాలతో పాటు అమెరికాలోని ఎనిమిది నగరాల్లో కూడా ఈ సినిమా చిత్రీకరణ జరిపారట. హారర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అంజలి పాట కచ్చితంగా స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని చిత్ర యూనిట్ భావన. -
శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో ప్రముఖ నటుడు సాయికుమార్, ప్రముఖ సినీ గాయకులు మనో, సునీత, వందేమాతం శ్రీనివాస్ తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వారికి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
ఆ ఎంపీ గణనాథునిపై కాసుల వర్షం కురిపించాడు
-
తిరుమలలో పాటల మాంత్రికులు
తిరుమల: తిరుమలలో ఆదివారం సినీ గాయినీ, గాయకుల సందడి నెలకొంది. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన గాయకులు మనో, వందేమాతం శ్రీనివాస్, సునీత, శ్రీరామచంద్ర ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకుని శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మనో మాట్లాడుతూ ప్రజలందరికి మంచి జరగాలని స్వామిని ప్రార్థిం చి నట్లు తెలిపారు. సంగీతాన్ని దేవుడు తనకు ప్రసాదించడం ఎన్నోజన్మల పుణ్యంగా భావిస్తున్నానని చెప్పారు. వందేమాతం శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కళాకారులందరి తరుపున ప్రార్థించినట్టు తెలిపారు. గాయని సునీత మాట్లాడుతూ తిరుమలకు ఎప్పుడు వచ్చినా తెలియని కొత్త అనుభూతి లభిస్తుందని అన్నారు. స్వామి దయతో మంచి పాటలు పాడుతూ తెలుగు ప్రజలకు దగ్గరగా ఉండడంతో అదృష్టంగా భావిస్తునట్టు చెప్పారు. అంతకుముందు సుప్రభాత సేవలో యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలు అందజేశారు. -
60’s సింగర్స్
‘యే... మేరా దిల్ ప్యార్ కా దివానా...’ అంటూ ప్రేమకే కాదు, పాడటానికి వయసు అడ్డు రాదని నిరూపించారా జేష్ట్య పౌరులు. హైడొరైట్, లాడ్జికీస్ సంస్థ నిర్వహించిన ‘వృద్ధుల అంత్యాక్షరి’లో పాల్గొని ‘వృద్ధాప్యమూ ఓ బాల్యద శే’నన్న షేక్స్పియర్ మాటలను నిజం చేశారు. ‘కలువకు చంద్రుడు ఎంతో దూరం... కమలానికి సూర్యుడు మరీదూరం, దూరమైన కొలదీ పెరుగును అనురాగం... విరహంలోనే ఉన్నది అనుబంధం’ అని యవ్వనపు తీపి గురుతులను నెమరువేసుకున్నారు. వృద్ధాప్యం శరీరానికే కానీ మనసుకు కాదని రుజువు చేశారా సీనియర్ సిటిజన్స్. ఒక్కసారిగా సిక్స్టీస్ నుంచి సిక్స్టీన్స్లోకి వెళ్లిపోయారు. ఆణిముత్యాల్లాంటి అలనాటి తెలుగు, హిందీ మధురగీతాలను ఆలపించి ప్రొఫెషనల్ సింగర్స్ను తలపించారు. ఆ జేష్ట్య పౌరుల పాటల అల్లరితో మోక్ష్ బాంక్వెట్ హాల్ నర్సరీ క్లాస్రూమ్లా మారిపోయింది. తమ వయసుతోపాటు కష్టాలన్నీ మరిచి ఎంతో సంతోషంగా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు 55 నుంచి 82ఏళ్ల యువతీయువకులు. హైడొరైట్ ఫౌండేషన్ గత మూడేళ్లుగా జరుపుతున్న వంద రోజుల ‘ఇండియాస్ లాంగెస్ట్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాటల పోటీలో గెలిచిన వారికి ప్రెజ్మనీ కూడా అందించారు. వృద్ధుల ఉత్సాహానికి 92.7 బిగ్ఎఫ్ఎం రేడియో జాకీ ‘క్రిష్’ యాంకరింగ్ తోడవ డంతో కార్యక్రమంలో మరింత జోష్ వచ్చింది. నిఖిత నెల్లుట్ల; ఫొటోలు: జి.రాజేష్ చాలా హ్యాపీ... ఎన్నో పోగ్రామ్స్ చేశాను కానీ ఈ కార్యక్రమం నాకు ఎంతో స్పెషల్. వీళ్లు వృద్ధులేంటి. ఒక్కొక్కరు వయసు మరచిపోయి ఉత్సాహంగా అంత్యాక్షరిలో పాల్గొం టుంటే చాలా సంతోషంగా అనిపించింది. నేను పుట్టక ముందు పాటలు వింటుంటే థ్రిల్ కలిగింది. - క్రిష్, 92.7 ఎఫ్ఎం ఆర్జే జడ్జిగా వ్యవహరించడం కష్టం.. ఎన్నో మంచి పాటలు పాడారు. ఒకరికి మించి ఇంకొకరు ఉత్సాహంగా అంత్యాక్షరిలో పాల్గొన్నారు. తెలుగు పాటలంటే చాలా అభిమానం. అయినా హైదరాబాద్లోని ట్రెండ్ ఎంతో మారింది. తెలుగు పాటల్లోనూ హిందీ పదాలు ఉపయోగిస్తున్నారు. ఈ నగరవాసులందరికీ రెండు భాషల పాటలు వస్తాయనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనం. - ఖాన్ అలీఖాన్, నగర ఘజల్ గాయకుడు 2012లో ప్రారంభించాం... దేశంలోని అన్ని నగరాల్లో ఏదో ఒక ఫెస్టివల్లాంటిది నిర్వహిస్తున్నారు. మరి హైదరాబాద్లో లేకపోవడమేంటనే ఆలోచన వచ్చి మేం ఈ హైడొరైట్ ట్రస్ట్ను 2012లో ప్రారంభించాం. అప్పటి నుంచి 100 రోజుల కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుతున్నాం. వృద్ధులు, అనాథ పిల్లలను సంతోషంగా ఉంచడానికి అంత్యాక్షరి లాంటివి నిర్వహిస్తున్నాం. - రామకృష్ణ, హైడొరైట్ ట్రస్టీ తగ్గని ఉత్సాహం.. ఇక్కడికి రావడం ఇది రెండోసారి. నాకు 82 ఏళ్లు వచ్చాయన్న మాటే కానీ నేనెప్పుడూ టీనేజర్నే. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఆట, పాటల్లో ఉత్సాహంగా ఉండేదాన్ని. సినిమాలు కూడా బాగా చూసేదాన్ని. అందుకే పాటలు పాడడం హాబీగా మారింది. - శకుంతలా సెహగల్, 82ఏళ్లు మాకూ సత్తా ఉంది నేను ఓ రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్. నాకు ఘంటసాల, పీబీ శ్రీనివాస్ పాటలంటే చాలా ఇష్టం. తెలుగు, హిందీ పాటలు పాడటం ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. వృద్ధులు శారీరకంగా బలహీనంగా ఉంటారేమో కానీ వారిలోనే ఎంతో ప్రతిభ ఉంటుంది. మాకు ఇలాంటి వేదిక దొరకడం చాలా సంతోషంగా ఉంది. - గంటా రామకృష్ణ, 78ఏళ్లు ఆనందం కోసమే... గతేడాది అంత్యాక్షరీలో మొదటి బహుమతి అందుకున్నా. నేను బహదూర్పురా నుంచి వచ్చా. అలనాటి సినిమాలు, పాటలు అంటే ఎంతో ఆసక్తి. పద్మిని, వైజయంతి మాల, మనోజ్కుమార్ అంటే ఇష్టం. ఎంత వయసొచ్చినా ఆనందంగా ఉండాలని కోరుకుంటా. - సరోజ్ అగర్వాల్, 62ఏళ్లు -
పల్లవించే పాట కాలానికి ప్రతినిధి
-
2014లో మెరుపులు మెరిపించిన పాటలు
-
సరిగమల వీడ్కోలు
-
నీ మరణం సినీ జగత్తుకు తీరనిలోటు..
-
సినీ సంగీత 'చక్ర'ధరుడు
తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలివచ్చాక ఇక్కడ కెరీర్ను ప్రారంభించి, అచిరకాలంలోనే అగ్రస్థాయికి చేరిన తొలి సినీ సంగీత దర్శకుడిగాచక్రిని చెప్పుకోవచ్చు. 2000 ప్రాంతంలో తెలుగు చిత్రసీమలోకి పొంగిపొర్లి వచ్చిన కొత్తనీరులో ఆయన భాగం. జాగ్రత్తగా గమనిస్తే, దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోగా రవితేజ, సంగీత దర్శకుడు చక్రి, రచయిత భాస్కరభట్ల తదితరుల కెరీర్ దాదాపు ఏకకాలంలో కలసి ఉన్నత శిఖరాల వైపు సాగినట్లు కనిపిస్తుంది. * ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన జిల్లా చక్రధర్ సినీరంగంలో ‘చక్రి’గా తనకంటూ పేరు, స్థానం సంపాదించుకోవడానికి ముందు ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. వరంగల్ దగ్గరి స్వస్థలం నుంచి ఉద్యోగార్థం హైదరాబాద్ వచ్చిన ఆయన తొలిరోజుల్లో అమీర్పేట ప్రాంతంలో చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేశారు. * సంగీతం మీద ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే సాంస్కృతిక ఉత్సవాల్లో ఒక దేశభక్తి గీతానికి చక్రి బాణీ కట్టారు. ఆ తరువాత తనలాగే సంగీతం పట్ల ఆసక్తి ఉన్న మిత్రులను కలుపుకొని, ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తొలి రోజుల్లో కొన్ని క్యాసెట్లు కూడా రూపొందించి, విడుదల చేశారు. చివరకు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'బాచి' (2000) చిత్రంతో తెలుగు తెరకు సంగీత దర్శకుడిగా చక్రి పరిచయమయ్యారు. * ఒక దశలో సినిమా అవకాశం కోసం అమితంగా కష్టపడ్డ ఆయన ఆ తరువాత ఏకంగా ఒకే ఏడాది 18 సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డెరైక్టర్గా అరుదైన ఘనత సాధించారు. 1980లలో ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రవర్తి తరువాత మళ్ళీ సంఖ్యాపరంగా ఆ ఘనత అందుకున్నది చక్రి కావడం, ఇద్దరికీ పేరులో సారూప్యత ఉండడం యాదృచ్ఛికమే అయినా, గమ్మత్తై వాస్తవం. * ఒక దశలో అగ్ర హీరోల భారీ బడ్జెట్ చిత్రాల నుంచి చిన్న హీరోల లో బడ్జెట్ చిత్రాల దాకా ఎటు చూసినా చక్రి హవానే కొనసాగింది. తరువాత ఆ జోరు కొంత తగ్గినా, చక్రికంటూ ఒక వర్గం సినిమాలు ఉండేవి. దర్శక - నిర్మాతలు ఉండేవారు. * ఇప్పటికి దాదాపు 80కి పైగా చిత్రాలకు చక్రి సంగీతం అందించినట్లు ఒక లెక్క. ఆ చిత్రాల్లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని 'ఇట్లు... శ్రావణి సుబ్రహ్మణ్యం', 'శివమణి', 'అమ్మ - నాన్న - ఓ తమిళ అమ్మాయి', 'ఇడియట్', 'దేశముదురు', కృష్ణవంశీ దర్శకత్వంలోని 'చక్రం', వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలోని 'దేవదాసు', శ్రీను వైట్ల 'ఢీ' లాంటి పలు విజయాలు ఉన్నాయి. * చక్రి సినీ సంగీతంలోని ఒక విశేషం ఏమిటంటే - ఒక పక్క ఎంత మెలొడీ పాటలు ఆయన అందించారో, అంతే స్థాయిలో బీట్ పాటలు, ఆధునిక తరానికి నచ్చే ట్రెండీ బాణీలు కూడా అందించడం. 'నాకు వ్యక్తిగతంగా శ్రావ్యగీతాలంటే ఇష్టమైనా, దర్శక - నిర్మాతలు కోరిన విధంగా బీట్ పాటలు ఇస్తుంటా' అని ఆయనే చెప్పారు. సుమారు 80కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన చక్రి పాటల్లో అనేక హిట్లున్నాయి. 'నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిల...' లాంటి ఆల్టైమ్ హిట్లు ఆయన పాటలే. అలాగే, 'జగమంత కుటుంబం నాది...'('చక్రం' చిత్రంలోని సీతారామశాస్త్రి రచన) లాంటి తాత్త్విక గీతాలున్నాయి. మాస్, బీట్ పాటలకైతే లెక్కే లేదు. * సినీ సంగీత రంగంలోకి ప్రవేశించడానికి తాను పడ్డ కష్టాలను చక్రి చివరి దాకా మర్చిపోలేదు. అందుకే, అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ వచ్చిన ఆయన కౌసల్య లాంటి పలువురు వర్ధమాన గాయనీ గాయకులకు పదే పదే అవకాశాలిచ్చి, ప్రోత్సహించారు. స్వతహాగా తనలో ఉన్న గాయకుడి కోణాన్ని కూడా వీలైనప్పుడల్లా వెలికితీసేవారు. తారస్థాయిలో పాడాల్సిన పాటలను సైతం అలవోకగా పాడడం చక్రిలోని విశిష్టత. * ఇటీవల దాసరి దర్శకత్వంలో విడుదలైన 151వ చిత్రం 'ఎర్రబస్సు'కు సంగీతం అందించింది చక్రే! చక్రి సంగీతం అందించగా వై.వి.ఎస్. చౌదరి దర్శక - నిర్మాతగా, సాయిధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం 'రేయ్' లాంటివి కొన్ని ఇంకా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. * తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఈ సంగీతకారుడు ఆ మధ్య 'జై బోలో తెలంగాణ' చిత్రానికి సంగీతం అందించి, పుట్టినగడ్డ ఋణం తీర్చుకొనే ప్రయత్నం చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకు ఒక ప్రత్యేక గీతాన్ని కూర్చాలని రచయిత భాస్కరభట్లతో చర్చిస్తున్నారు. ఆ కోరిక నెరవేరకుండానే హఠాత్తుగా కనుమరుగయ్యారు. ఇప్పుడు ఆయన లేరు... ఆయన పాటలే తీపిగుర్తులుగా మిగిలాయి. చక్రికి 'సాక్షి' తరఫున నివాళులర్పిస్తున్నాం. - రెంటాల -
ఆ గాయకులకు.. చక్రినే అండ
హైదరాబాద్ : శ్రోతలకు మంచి సంగీతాన్ని ఇవ్వడమేకాదు...ఎంతో మంది మంచి గాయకులను చక్రి తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు. కౌసల్య, సింహ, రఘు కుంచే, రవి వర్మ లాంటి గాయకులకు చక్రీయే అండా దండ. చక్రి ఇచ్చిన ప్రోత్సాహంతోనే వీరంతా టాలీవుడ్లో నిలదొక్కుకోగలిగారు. అంతే కాదు...కొత్తవారిని పరిచయడం చేయడంలో చక్రి ఎప్పుడూ ముందుంటారు. చక్రీ మృతి పట్ల గాయకుడు సింహ మాట్లాడుతూ తనకు గాయకుడిగా జీవితాన్ని ఇచ్చింది చక్రి అన్నారు. గత పదేళ్లగా ఆయన సంగీతం అందించిన ప్రతి సినిమాలోనూ ఓ పాట పాడేందుకు అవకాశం ఇచ్చారని.. ఆయన సంగీతం అందించిన చివరి చిత్రం ఎర్రబస్సు వరకూ తనకు పాడే అవకాశం ఇచ్చారని సింహ గుర్తు చేసుకున్నారు. చక్రితో అనుబంధం మరవలేనిదని, స్నేహానికి ఆయన మారుపేరు అన్నారు. వర్ధమాన గాయనీ, గాయకులకు చక్రి ఉన్నారనే భరోసా ఉండేదని, ప్రతిపాట ఆయన ప్రేమగా చేసేవారని సింహ అన్నారు. అలాంటి వ్యక్తిని మళ్లీ చూడలేమని...ఇంకా చూడలేమని సింహ పేర్కొన్నారు. చక్రి మరణం సంగీత ప్రపంచానికి తీర్చలేని లోటుగా అభివర్ణించారు. ఇక చక్రి, కౌసల్య కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా నిలిచిపోతాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అతి తక్కువ మంది సంగీతదర్శకుల్లో చక్రి ఒకరు. చిన్నవయస్సులోనే సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసి... మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దర్శకుడు ఎన్. శంకర్ , జగపతిబాబు కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం జైబోలో తెలంగాణ సినిమాకి చక్రికే సంగీతమందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ప్రధానంశంగా తెరకెక్కిన ఈ సినిమాలో...చక్రి సమకూర్చిన పాటలు హైలెట్గా నిలిచాయి. -
నేనూ ఖమ్మం కుర్రాణ్నే
‘మన కుర్రాళ్లు’ మ్యూజిక్ డెరైక్టర్ భీమ్స్ ఖమ్మం : ‘విప్లవాల పురటి గడ్డ, కవులు, గాయకులు, కళాకారులకు జన్మనిచ్చిన ఖమ్మంలో పుట్టినందుకు గర్వపడుతున్నా’ అంటున్నారు ‘మన కుర్రాళ్లు’ చిత్రం సంగీత దర్శకుడు, సినీ పాటల రచయిత భీమ్స్. తానూ ఖమ్మం కుర్రాణ్నేనని తెలిపారు. నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరుగుతున్న ఇంప్యాక్ట్ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బయ్యారం మండల కేంద్రానికి చెందిన తానకు చిన్నతనం నుంచే పాటలు పాడటం, రాయడం ఇష్టమన్నారు. ఇదే తనను కళాకారులు, సాహితీవేత్తలకు దగ్గర చేసిందని తెలిపారు. హాస్టల్ వార్డెన్ సీతారాములు ప్రోత్సాహంతో పాటలు రాయడం మొదలెట్టానన్నారు. ‘శ్రావణ మాసం’ చిత్రంలో ‘నీ కంచెర జుంపాలు చూసి సైదులు....’ ‘ఆయుధం’లో ‘ఓయ్ రాజూ..’ ‘సీమ టపాకాయలు’లో ‘దీరే ధీరే.. దిల్లే..’ పాటలు మంచి గుర్తింపునిచ్చాయని అన్నారు. త్వరలో విడుదల కానున్న సినిమాలు ‘మన కుర్రాళ్లు’, ‘అలా..ఎలా..?’ సినిమాలకు పాటలు రాసి మ్యూజిక్ డెరైక్టర్గా పనిచేశానని అన్నారు. ఇప్పటి వరకు సినిమాల్లో అవకాశం ఇచ్చిన ఆయుధం సినిమా డెరైక్టర్ శంకర్, కరెంట్ తీగల డెరైక్టర్ నాగేశ్వరరెడ్డి, మన కుర్రాళ్ళు డెరైక్టర్ వీరశంకర్కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. -
సింగ్ర్స్తో సాక్షి స్పెషల్ చిట్చాట్
-
పాటాభిషేకం-part1
-
సంగీతం... ఎప్పుడూ... చెవులకు ఇంపుగా ఉండాలి!
రావు బాల సరస్వతి... తొలి తరం సినీ నేపథ్య గాయని. పాట అంటే చెవులకు ఇంపుగా ఉండాలంటారామె. గాయకులు ప్రతి ఒక్కరూ తాము పాడే పాటలో సాహిత్యపు విలువలను గమనించుకోవాలని చెప్తున్నారు. విలువలు లోపించిన పాట గానం చేయకూడదనే నిబంధనను పాటించాలంటారు. మీరు ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు ? 1928వ సంవత్సరం ఆగస్టు 28న మద్రాసులో పుట్టాను. తొలి పాట... నా ఆరవ యేట. ఏ సినిమాకి ?... సినిమాకి కాదు, ప్రైవేట్ ఆల్బమ్ కోసం ‘పరమ పురుషా పరంధామా...’ అనే పాట పాడాను. గాయని కావడానికి ప్రోత్సహించింది ఎవరు ? మా నాన్నగారు పార్థసారథి రావు. ఆయనకు సంగీతం అంటే చాలా ఇష్టం. గుంటూరులో మా థియేటర్లో డ్రామాలు వేయించేవారు. నేను మూడేళ్ల వయసులోనే స్థానం నరసింహరావు లాంటి ప్రముఖుల పాటలు విన్నాను. అలా ఆసక్తి పెరిగింది. అప్పట్లో సంగీత సాధన ఎలా చేసేవారు ? గ్రామఫోన్ రికార్డుల్లో విని అలాగే పాడేదాన్ని. అలా నాకిది స్వతహాగా అబ్బిన కళ. బాంబేలో హిందూస్తానీ సంగీతం నేర్చుకున్నాను. సాటి గాయకుల్లో ఎవరి గొంతు ఇష్టం ? ... సుశీల గొంతు ఇష్టం. మీరు ఏయే భాషల్లో పాడారు? ... మళయాళం, కన్నడం, తమిళం, తెలుగు, సింహళీ భాషల్లో పాడాను. మీరు పాటించిన నియమాలేమైనా ఉన్నాయా? డబ్బు కోసమే అన్నట్లు పాడలేదు. పాట నచ్చితేనే పాడేదాన్ని. సాహిత్యపు విలువల్లో అప్పుడు - ఇప్పుడు తేడా? కొన్ని పాటలనైతే వినలేక పోతున్నాను. అప్పట్లో శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి లాంటి వాళ్లు స్వయంగా రికార్డింగుకు వచ్చే వాళ్లు. ఎవరైనా ఒక పదం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తే వారు ఆ పదాన్ని అక్కడే మార్చేసేవారు. నాటి గాయకులకు - నేటి గాయకులకు మధ్య మీరు గమనించిన తేడా? ఘంటసాలలో తొలిపాట సమయంలో ఉన్న వినయం ఆయన చచ్చిపోయే వరకు అలాగే ఉండింది. ఇప్పుడు కొందరిని చూస్తే వారిలో వినయం సహజం అనిపించకపోగా, వినయాన్ని నటిస్తున్నట్లు ఉంటోంది. బాల గాయకులకు సూచన? ఏం పాడుతున్నామో తెలుసుకుని హాయిగా పాడాలి. కష్టపడుతూ కాదు. గాయకుల తల్లిదండ్రులకు... పిల్లలు బాగా పాడితే మెచ్చుకోండి. అతిగా పొగడకండి. ప్రశంస మితిమీరిన ఆత్మవిశ్వాసానికి కారణం కాకూడదు. మీరు పాడడం ఎందుకు మానేశారు? మా వారు ‘రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు’ అభిప్రాయం మేరకు 1958 నుంచి మానేశాను. పరిశ్రమను చూస్తే ఏమనిపిస్తుంది? బాగా పాడే పిల్లల్ని పాడనివ్వకపోతే వారిలో ఆ కళ అంతరిస్తుంది. సంగీత జ్ఞానం తెలిసిన వారు ఆ పాపం చేయకూడదు. అత్యంత సంతృప్తినిచ్చిన పాట? ... ప్రతిదీ నచ్చిన తర్వాతనే పాడాను. కుటుంబం, పిల్లలు... ఇద్దరు కొడుకులు. రావు వెంకట రాజగోపాల కృష్ణ సూర్యారావు, రావు వెంకట కుమార కృష్ణ మహీపతి సూర్యారావు. రాజా గారి శ్రీమతి అంటే రాణిగారి హోదా ఉండేదా? మా ఎస్టేట్లో ఉండేది. ‘రాణీ రావు బాల సరస్వతీదేవి’ అని రాసేవారు. ఒక సినిమాకి కూడా పేరు అలాగే వేస్తే నేను తీయించేశాను. ఎందుకలా? సినిమాలో పాట పాడినందుకు డబ్బు తీసుకుంటున్నప్పుడు అక్కడ నా రాణి హోదా ప్రదర్శించకూడదు. అక్కడ నేను నేపథ్యగాయనిని మాత్రమే. మిమ్మల్ని నొప్పించే విషయం? నాకు మనుమళ్లు, మనుమరాళ్లు, ముని మనుమళ్లు, ముని మనుమరాళ్లు ఉన్నారు. వారికెవరికీ సంగీత జ్ఞానం అబ్బలేదు. మీకు సంతోషం కలిగించే విషయం... నన్నింకా కొంతమంది జ్ఞాపకం ఉంచుకున్నారు. దేవుడు వరమిస్తానంటే... సంగీత కుటుంబంలో పుట్టించమని అడుగుతాను. జగ్జీత్సింగ్ వంటి వారింట్లో పుట్టాలని కోరిక. - వాకా మంజులారెడ్డి -
కృష్ణాష్టమి ప్రత్యేకం : పాటల్లో కృష్ణుడు!
-
ఆర్పీ పట్నయక్,గోరటి వెంకన్నతో చిట్ చాట్
-
స్నేహగీతం.. మెలోడి ఆఫ్ లైఫ్
డ్యాన్స్ బేబీ డ్యాన్స్.. లిటిల్ చాంప్స్.. ఢీ.. పాడుతా తీయగా... రియాలిటీ షో ఏదైతేనేం టాలెంట్తో పాటు ఫ్రెండ్షిప్నూ పెంపొందించే ఆధునిక అడ్డాలు ఇవి! ఈ షోలన్నీ ఆన్స్క్రీన్లో పోటీని పెంచితే ఆఫ్ స్క్రీన్లో స్నేహాన్ని పంచుతున్నాయి! పోటీల ప్రారంభంలో అపరచితులుగా ఉన్న కాంపిటీటర్స్.. ముగింపు వచ్చేసరికి ప్రాణస్నేహితులుగా మారుతున్నారు. అలాంటి స్నేహ వీచికలకు వేదికగా నిలిచిన షోల్లో బోల్ బేబీ బోల్ ఒకటి ! స్నేహానికి సంబంధించి ఆ టీమ్ సభ్యులది ఒక్కొక్కరిది ఒక్కో జ్ఞాపకం.. సీరియస్ మ్యుజీషియన్లోని జోవియల్ యాంగిల్ గిటార్తో చెలిమి తప్ప ప్రపంచంతో పరిచయంలేని సీనియర్.. సీరియస్ మ్యుజీషియన్గానే కోటిని గుర్తిస్తారు చాలామంది! కానీ ఆయన్ను పిల్లల్లో పిల్లాడిగా... పెద్దల్లో పెద్దవాడిగా... మొత్తంగా అందరికీ కావాల్సిన ఆప్తుడుగా.. భరోసాగా నిలిచే సన్నిహితుడిగా చూపింది ఈ రియాలిటీ షోనే! ఈ షోలో గళం విప్పిన చిన్నారులు రాహత్, శ్రీలలిత.. సోలోగా ఎంట్రీ ఇచ్చి జంటగా మారిన హేమచంద్ర, శ్రావణ భార్గవి.. బోల్ బేబీ బోల్ ప్రొడ్యూసర్ సాయివంశీ మైత్రీ బంధాన్ని ‘సిటీప్లస్’ పలకరించింది. వీరంతా కోటితో పంచుకున్న కులాసా కబుర్లు స్నేహగీతమై పల్లవించింది.. లొకేషన్.. రామానాయుడు స్టూడియోస్లోని లాన్ బ్లూజీన్స్.. బ్లూ షర్ట్.. గాగుల్స్తో ఎంట్రీ ఇచ్చిన కోటిని చూసి ‘సూపర్ సర్’ అంటూ హేమచంద్ర, శ్రావణ భార్గవి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ‘నిజంగా బాగుందా?’ కోటి. ‘బాగుందా ఏంటీ సర్.. యంగ్గా కనపడుతుంటే’ అన్నాడు హేమచంద్ర. ‘ఇది మా అబ్బాయి షర్ట్. అందుకే యంగ్గా కనిపిస్తున్నట్టున్నాను’ అని హేమచంద్ర చెవిలో జోకేశాడు కోటి! ‘సర్ మీరు మరీ..’ అంటూ నవ్వేశాడు హేమచంద్ర! గంభీరంగా కనిపించే కోటిలో సరదా కోణం అది. సినిమా ఇండస్ట్రీ అంటే యాటిట్యూడ్ ర్యాంప్ అనే భావనలో ఉండేవారికి ఆయన ప్రవర్తన ఆశ్చర్యం. ‘నాలాంటి సీనియర్ మ్యుజీషియన్.. ఇలాంటి పిల్లల (తన పక్కనే ఉన్న రాహత్, శ్రీలలితను చూపిస్తూ) దగ్గర ‘ఏం పాడావు? ఆ శ్రుతేంటి?’ అని సీరియస్గా అంటే పిల్లలు బిగుసుకుపోతారు. అసలా టెన్షన్లో లేని తప్పులు పాడేస్తారు. అలాంటి వాతావరణం ఉండకూడదనే పిల్లలతో కలిసిపోయి అదేదో యుద్ధరంగం కాదు చక్కగా ఆడుతూపాడుతూ పనిచేసుకునే ప్లేస్ అనే ఫీల్ కల్పిస్తా! ఈ పిల్లలు మహా పిడుగులు. వీళ్లు మమ్మల్ని ఆటపట్టిస్తారు. నేర్చుకునేటప్పుడు గురువుగా చూస్తారు.. తప్పులు సరిదిద్దుతున్నప్పుడు పేరెంట్గా అనుకుంటారు.. అల్లరి చేస్తున్నప్పుడు స్నేహితులుగా భావిస్తారు. ఇంత కంఫర్ట్నెస్కి ఫుల్స్పేస్ ఇస్తాను’ అంటాడు కోటి! కోతిచేష్టలు.. కుచేలుడి స్నేహాలు చిలిపి పనులు.. కోతిచేష్టల కూనలు పిల్లలు. అలా ఇల్లు పీకి పందిరేసే ఆ వేషాలే కొత్తాపాతాలేక అందరితో కలిసేలా చేస్తాయి.. విడిపోని మిత్రులుగా మారుస్తాయి! దానికి ఈ సంభాషణే నిదర్శనం... శ్రీలలిత (రియాలిటీ షోలో ఓ చిన్నారి)కు మనం పెట్టిన పేరేంటీ?’ శ్రీలలితను టీజ్ చేస్తూ కోటి.‘ఈలరాణి’ అని ఆన్సర్ చేశాడు రాహత్ అదే రియాలిటీ షోలో ఇంకో లిటిల్ పార్టిసిపెంట్.‘నీకూ ఓ పేరుంది తమ్ముడూ మర్చిపోయావా?’ రాహత్ను టీజ్ చేస్తూ శ్రావణ భార్గవి ‘హాలిడే బాయ్’ చెప్పింది శ్రీలలిత ‘ఎప్పుడూ హాలిడే మూడ్లో ఉంటాడు.. ఈవెన్ డ్రెస్సింగ్ కూడా!’ రాహత్ వెసుకున్న త్రీఫోర్త్ ప్యాంట్ వైపు చూపిస్తూ హేమచంద్ర. ‘ఆల్కలర్స్లో ఈ ప్యాంట్లు వీడి దగ్గర ఉంటాయి’ శ్రావణ భార్గవి యాడ్ చేసింది. ‘ఎవరి పాటైనా తనకు నచ్చితే సెట్ అదిరిపోయేలా ఈల వేసేది. అందుకే ఈ పిడుగుని ఈలరాణి అని పిల్చుకుంటాం. అంతేకాదు ఈమెకు ఇంకో విద్య కూడా వచ్చు. ఎవరినైనా ఇట్టే ఇమిటేట్ చేస్తుంది. ఉషా ఉతుప్లాంటి వాళ్లతో సహా!’ చెప్పాడు కోటి శ్రీలలితను చూపిస్తూ! స్నేహం.. పరిణయం కొన్ని సమయాలు మైత్రిని కల్పిస్తే ఇంకొన్ని సందర్భాలు దాన్ని ప్రణయంగా మార్చి పరిణయంగా ముడివేస్తాయి. హేమచంద్ర, శ్రావణ భార్గవిల పెళ్లి అలాంటిదే! దానికి పీటవేసింది ఈ రియాలిటీ షోనే! ‘సాయిగారూ.. (సాయివంశీ బోల్ బేబీ బోల్ ప్రొడ్యూసర్) ఈ ప్రోగ్రామ్కి మా ఇద్దరినే యాంకర్స్గా సెలక్ట్ చేసుకోవడానికి కారణమేంటండి? మా ప్రేమ గురించి మీకు ముందే తెలుసా ఏంటి?’ అని అడిగింది శ్రావణ భార్గవి. ‘అలాంటిదేమీ లేదు.. మీరిద్దరూ కలిసి అప్పటికి యాంకరింగ్ చేయలేదు కాబట్టి కలిపి చేయిస్తే కొత్తదనం ఉంటుందని సెలక్ట్ చేసుకున్నానంతే!’ చెప్పాడు సాయివంశీ. ‘ఏమైతేనేం ఆ షో చేస్తున్నప్పుడే మీరిద్దరూ ఓ ఇంటివారయ్యారు కదా...!’ అన్నాడు కోటి. ‘అదొక్కటే కాదు సార్.. బిజీగా ఉన్న మా ఇద్దరికీ కలసి కొంత టైమ్ స్పెండ్ చేసే చాన్సూ ఇచ్చింది. అందరూ చూస్తారనే భయంతో అసలు బయట కలుసుకోలేకపోయేవాళ్లం. ఆ మిస్సింగ్ ఈ షోతో తీరిపోయింద’ని చెప్పింది భార్గవి! ఫ్యామిలీ షోలు ఈ షోలు పార్టిసిపెంట్లు.. జడ్జీలు.. యాంకర్స్ మధ్య అనుబంధాలనే కాదు కూడా వచ్చిన పెద్దలనూ ఒక్కటి చేస్తున్నాయి. రెండురోజుల షూట్ కోసం జరిగే పదిరోజుల రిహార్సల్స్ కూడా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కొత్త స్నేహాలను చిగురింపచేస్తున్నాయి. ఈ మాట నిజమే అనిపిస్తుంది సాయివంశీ చెప్పింది వింటే... ‘ఆఫ్ సెట్స్ రిలేషన్స్ చూస్తే రియాలిటీ షోను ఓ ఫ్యామిలీ షో అనుకుంటారు. ఈ పిల్లల పేరెంట్స్ మధ్య ఫ్రెండ్షిప్ డెవలప్ అవడం నాకెంత ఆశ్చర్యమో అంతకు మించిన ఆనందం! పిల్లల మధ్య పోటీ స్టేజ్ మీదే.. మా పిల్లలే గెలవాలన్న కాంక్ష పేరెంట్స్లో ఆ కొద్దిసేపే! సెట్స్: దిగారంటే చాలు అందరూ కలిసిపోతారు.. ఎవరు గెలిచినా అందరూ సంతోషిస్తారు. వండర్ఫుల్ మూమెంట్స్! ఒక్క షో ఎంతమందిని అసలైన స్నేహితులుగా మారుస్తోంది! రియల్లీ గ్రేట్!’ ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ ఇవి రియాలిటీ షోల్లోని రియల్ అనుభూతులు.. మంచి జ్ఞాపకాలు! కాలం మారుతుంది.. కొత్తద్వారాలు తెరుచుకుంటాయి.. అదే స్నేహం ఇంకాస్త కొత్తగా ఆయువు నింపుకుంటుంది! - సరస్వతి రమ -
గోల్డెన్ వాయిస్
పల్లె జానపదాలు.. అలనాటి ఆణిముత్యాలు.. ప్రజెంట్ మెలొడీస్... శుక్రవారం వెస్లీ కళాశాల భిన్నమైన పాటల సంద్రమైంది. బిగ్ ఎఫ్ఎం ఆధ్వర్యంలో జరిగిన ‘బిగ్ గోల్డెన్ వాయిస్ సీజన్-2’ ఫైనల్లో ఆరుగురు గాయకులు తవు సత్తా చాటారు. వరంగల్కు చెందిన సుహిత విజేతగా నిలిచింది. ప్రముఖ గాయని సునీత న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. బిగ్ ఎఫ్ఎం దేశవ్యాప్తంగా 44 రేడియో స్టేషన్లలో నిర్వహించిన ఈ పోటీల్లో 37 మంది విజేతల్ని ఎంపిక చేసింది. ముంబాయిలో జరిగే ఫైనల్స్లో పాల్గొనే 37 మందిలో సుహిత ఒకరు. ఇక అందులో గెలుపొందినవారికి బాలీవుడ్లో సింగర్గా అవకాశం దక్కుతుంది. ‘గాయకులుగా నిలదొక్కుకోవాలనే ఔత్సాహికులకు ఇది మంచి అవకాశం. ముంబైలో హైదరాబాద్ సత్తాను చాటి బాలీవుడ్లోనూ అవకాశం దక్కించుకోవాలని కోరుకుంటున్నా. ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి, మనసుకు సంగీతం ఎంతో హాయినిస్తుంది. అదే సంగీతం గొప్పదనం. అలాంటి సంగీతాన్ని పదికాలాలపాటు బతికించేందుకు బిగ్ ఎఫ్ఎం చేస్తున్న కృషి అభినందనీయం’ అని సునీత అన్నారు. - దార్ల వెంకటేశ్వరరావు -
మన గొంతులో పాటలా...మనతోటే ఉన్నట్టుగా..!
1937 ప్రాంతంలో... ‘లాహోర్’లో కె.ఎల్. సైగల్గారి సంగీత కార్యక్రమం జరపడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. సరిగ్గా ప్రోగ్రాం మొదలు కాబోతుండగా కరెంటు పోయింది. కరెంటు వస్తేగాని పాడనని కె.ఎల్. సైగల్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అప్పుడో కుర్రవాడు నిర్వాహకుల్ని కలిసి, ‘‘అయ్యా నా తమ్ముడికి ఒక్క ఛాన్సు ఇస్తే కరెంటు వచ్చే వరకూ... ప్రేక్షకుల్ని ఆనందపరుస్తాడు...’’ అని వినయంగా అన్నాడు. అప్పటికే ప్రేక్షకులు నానా గోలా చేస్తుండటంతో నిర్వాహకులు ఒప్పుకోక తప్పలేదు. ఆ బుడత గాయకుడే మహమ్మద్ రఫీ. హాలు మొత్తం 13 సంవత్సరాల ఈ బుడతడి ప్రజ్ఞకు ఊగిపోయింది. అక్కడున్న సంగీత దర్శకుడు శ్యామ్ సుందర్ ‘రఫీ’ని దగ్గరికి పిలిచి ‘‘నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. బొంబాయి వచ్చెయ్’’... అని ఆహ్వానం పలికాడు.రఫీ పుట్టింది అమృత్సర్ దగ్గరున్న ‘కోట్లా సుల్తాన్సింగ్’ అనే ఊళ్లో (అవిభక్త పంజాబ్లో ఉండేదది). చిన్నతనం నుంచీ రఫీకి సంగీతం అంటే ప్రాణం. హిందుస్తానీ, శాస్త్రీయ సంగీతాల్లో మహామహుల దగ్గర శిక్షణ పొంది అద్భుతమైన స్వర సంపద మూటగట్టుకున్నారు రఫీ.1944లో అంటే తన ఇరవయ్యవ ఏట రఫీ తన మొదటి పాటని ‘గుల్బలోచ్’ అనే పంజాబ్ సినిమా కోసం శ్యామ్సుందర్ సంగీత దర్శకత్వంలో పాడారు. ఆ తరవాత నౌషాద్ ‘పెహలేఆప్’, ఆ తరువాత లైలా మజ్ఞు, జుగ్ను, అన్మోల్ఘడీ... ఇలా ఏ సినిమాలో పాడినా రఫీ తన స్వరమంత్రజాలంతో ప్రేక్షకుల్ని సమ్మోహనపరిచేవారు. హుషారు పాటైనా, విషాదమైనా, తత్వమైనా, ఏదైనా సరే రఫీ స్వరంలో ప్రాణం పోసుకునేది. గాయకుడు తలత్ మహమూద్ ధూమపానం అలవాటు రఫీకి వరమైంది. అదెలా అంటే... నౌషాద్కి సిగరెట్టన్నా, దాని వాసనన్నా మహా చికాకు. స్టూడియోలో తలత్ సిగరెట్ తాగడం చూసిన నౌషాద్ ఆ చికాకులోనే, అర్జంటుగా రమ్మని రఫీకి కబురెట్టారు. అసలు సంగతేమంటే, ‘బైజొబావ్రా’ పాటలన్నీ తలత్ పాడాల్సింది. ‘సిగరెట్’ పెట్టిన చికాకుతో నౌషాద్గారు మొత్తం పాటలన్నీ రఫీతో పాడించారు. ఆ సినిమా ఓ మైలురాయిగా సినీ చరిత్రలో మిగిలిపోతే, మహమ్మద్ రఫీ స్వరం దేశమంతా మారుమోగి పోయింది. అంతే! సంగీత ప్రపంచంలో ఓ ‘విజేత’ అవతరించాడు. ఓ అమర గాయకుడు అవతరించాడు. ‘మన్ తర్పత్’ పాట విన్న ఆనందంలో కన్నీరు కార్చని శ్రోతలేడు. హీరో భరత్ భూషణ్కి శాశ్వత కీర్తినిచ్చిందా సినిమా. రఫీ వెనుతిరిగి చూడలేదు. విజయపరంపర.. ప్రవాహం. ‘చాహే కోయీ ముఝే జంగ్లీ కహే’ అని రఫీ పాడుతుంటే ‘యా... హూ...’’ అంటూ కుర్రకారు వెర్రెత్తి అరిచారు. ‘ఏ మేరా ప్రేమ్ పఢ్కర్’ అని రఫీ సుమధురంగా ఆలపిస్తే ప్రేమని ద్వేషించే వాళ్లు కూడా ప్రేమలేఖలకు తలవొంచారు.‘‘ఓ దేఖో ముఝ్సే రూఠ్కర్... మేరీ జాన్ జారిహ హై’ అని ‘అలక’ మీదున్న ‘చిలకని’ రఫీసాబ్ తన స్వరంతో సవరిస్తుంటే కుర్రకారు ప్రియురాళ్లని అదే పాట పాడి అనునయించారు. రఫీ లేకపోతే ఖచ్చితంగా షమ్మీ ‘షమ్మి’ కాడు. దేవానంద్, దిలీప్, రాజ్కపూర్, షమ్మికపూర్, శశికపూర్, జాయ్ముఖర్జీ, రాజేంద్రకుమార్, మనోజ్ కుమార్, ధర్మేంద్ర.. ఇలా తరాలు గడిచిపోయినా రఫీ ‘స్వరం మాత్రం మారలేదు. ఒక్కసారి మాత్రం కిశోర్ కుమార్ సృష్టించిన సంగీత ప్రభంజనానికి కాస్త పలచబడ్డా... ‘హ్కిసీసే కమ్నహీ’ అని అన్నట్టుగా మళ్లీ అద్భుతంగా పుంజుకుంది. చిట్టచివరి క్షణం వరకూ అదే ఊపు! ఎన్ని పాటలో!! అందుకే ఆయన్ని మ్యూజిక్ ‘మెజీషియన్’ అనేవారు. రఫీని స్మరించుకోవడం అంటే... భారతీయ సంగీతాన్ని స్మరించుకోవడమే. రఫీకి అంజలి ఘటించడమంటే... చలనచిత్ర సంగీతానికి సాష్టాంగ నమస్కారం చెయ్యడమే!మహమ్మద్ రఫీ పరమపదించిన రోజున (31 జూలై 1980) బాంబే మొత్తం మూగబోయింది. వేలాది మంది అభిమానులు రఫీ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మన గొంతులో పాటలా... మన కళ్లల్లో కలగా... మన జీవితంలో భాగంలా... మనతోటే ఉన్నట్టుగా...! అభీనా జావో ఛోడ్ కర్... ఏ దిల్ అభీ భరా నహీ’’ అని పాడుకుంటే, ఆయనే మరలి వస్తారు... మధుర స్మృతిగా. -
నాటాలో..ఆట..పాట..
-
సింగర్స్ తో ఉగాది స్పెషల్
-
అలరించిన గానామృతం
నెల్లూరు (బృందావనం), న్యూస్లైన్: నగరంలోని పురమందిరం ప్రాంగణంలో 49వ శ్రీత్యాగరాజ స్మరణోత్సవాల్లో ఆదివారం వర్థమాన గాయనీగాయకులు తమ గానామృతంతో అలరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గాయకులు తమ గాత్రాన్ని, వాయిద్య నైపుణ్యంతో వీనులవిందు చేశారు . మధ్యాహ్నం ప్రముఖ గాయని ఎస్పి శైలజ ఆలపించిన కీర్తనలు ఆకట్టుకున్నాయి. రాత్రి జరిగిన వాయిద్య సమ్మేళనంలో తిరుమరుగల్ గణేష్ కుమార్, రుద్రాక్షం-చెన్నై బృందం కీర్తనలు రక్తికట్టించాయి. -
సింగర్లుగా మారిన హీరోయిన్లు
-
సన్నీ మనసును గాయపర్చిన సింగర్స్
-
ఆటపాటలతో ఉత్తేజపరుస్తున్న కళాకారులు
సమైక్య శంఖారావానికి తరలి వస్తున్నవారిలో అనేకమంది కవులు, కళాకారులు, గాయకులు అందరూ ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఓ కవి గాయకుడు తన బృందంతో సహా కలిసి వచ్చి సభా ప్రాంగణం సమీపంలో కంజీర పట్టుకుని కదలి రా అన్నయ్యా అంటూ పాట పాడి అందరినీ ఉత్సాహపరిచారు. కదలిరా అన్నయ్యా.. కదలిరా అక్కయ్యా.. కదలిరా తమ్ముడా.. కదలిరా చెల్లెలా కసికసిగా రాష్ట్రాన్ని విడదీయాలని.. ఉసిగొల్పే దుర్నీతిని మసిచేయడానికి.. కదలిరా అన్నయ్యా (2) కుళ్లుగొట్టి కంపుగొట్టు రాజకీయ మలినము.. కదంతొక్కి కదలి సాగి చేయాలి ప్రక్షాళనము.. అంటూ ఈ పాట సాగింది. -
గాయని గాయత్రి,జయశ్రీ తో స్పెషల్ ఎడిషన్
-
సమైక్యాంధ్రకు మద్దుతుగా కళాకారుల గేయాలు
-
కీరవాణిని విలన్గా చేయమంటున్న రాజమౌళి!
సింగర్స్, మ్యూజిక్ డెరైక్టర్స్ వెండితెరపై యాక్ట్ చేయడమనేది అరుదైన విషయమే. కానీ కొన్ని కొన్ని సందర్భాలను బట్టి వాళ్లు కూడా తెరపై కనపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివి కీరవాణి లైఫ్లో చాలా ఎక్కువున్నాయి. కీరవాణి పైకి సీరియస్గా కనిపిస్తారు కానీ, ఆయనలో చమత్కారం పాళ్లు చాలా ఎక్కువ. మ్యూజిక్ సిట్టింగ్స్లో హుషారుగా కనిపిస్తారు. అందుకే కొంతమంది దర్శకులు కీరవాణిని నటించమని అడగడం, ఈయనేమో సున్నితంగా తిరస్కరించడం జరిగాయి. కానీ కొంతమంది మరీ మొహమాట పెట్టేయడంతో, కీరవాణి తన మొహానికి మేకప్ వేసుకోక తప్పలేదు. ఆయన మొదట తెరపై కనిపించింది ‘జీవితమే ఒక సినిమా’ అనే సినిమాలో. అందులో ఓ చిన్న వేషంలో కనిపిస్తారాయన. జగపతిబాబు హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడుగారు వచ్చారు’లో ఓ సంగీత విద్వాంసునిగా నటించారు. ‘రక్షణ’లో ‘ఘల్లుమంది బాసూ... గలాసూ’ పాటలో నాగార్జున, రోజాతో పాటు నిర్మాత వెంకట్ అక్కినేని, కెమెరామేన్ తేజ, నృత్యదర్శకుడు ప్రభుదేవాతో పాటు కీరవాణి కూడా కనిపిస్తారు. ‘సమర్పణ’ సినిమాలో ముష్టివాడు పాత్రలో ఆయన నటించారు. హీరో అర్జున్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతాప్’ అనే తమిళ సినిమాలో ఓ అరనిమిషం పాత్ర చేశారు. ‘మగధీర’లో ‘శుభం కార్డు’ తర్వాత వచ్చే పాటలో యూనిట్ సభ్యులతో పాటు కీరవాణి కూడా కనిపిస్తారు. సరిగ్గా ఆ పాట చిత్రీకరణ సమయానికి ఆయన అమెరికాలో ఉండడంతో, అక్కడ నుంచే వీడియో షూట్ చేసి పంపించారు. ఇక కీరవాణి వద్దనుకున్నవి, వదిలేసుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. కీరవాణి సతీమణి వల్లీకి పోలీసు వృత్తి అంటే ఇష్టం. అందుకేనేమో ఓసారి కీరవాణితో పోలీస్ డ్రెస్ వేయించి తన ముచ్చట తీర్చుకున్నారు. అలా పోలీస్ డ్రెస్తోనే కె.రాఘవేంద్రరావు ఆఫీసుకి వెళ్లారు కీరవాణి. రాఘవేంద్రరావు ఆశ్చర్యపోయి ‘‘ఈ డ్రెస్ నీకు బాగుంది. ఇప్పుడు తీస్తున్న ‘ఘరానా బుల్లోడు’ సినిమాలో ఒక పోలీసు పాత్ర ఉంది. నువ్వే చెయ్యాలి’’ అన్నారు. కీరవాణి మొహమాటంగా చూద్దాం...లెండి’’ అన్నారు. ఆ విషయం కీరవాణి మరిచిపోయారు కానీ, రాఘవేంద్రరావు మరిచిపోలేదు. రాజమండ్రిలో షూటింగ్ ఉంది. రమ్మని కబురుపెట్టారు. కానీ కుదరక కీరవాణి వెళ్లలేకపోయారు. అలా ఆ పాత్ర మిస్సయ్యింది. ‘శ్రీరామదాసు’లో రాళ్లపల్లి వేసిన పడవవాడి వేషం కీరవాణినే వేయమన్నారు. కానీ తనకు నీళ్లంటే భయమని చేయననేశారు కీరవాణి. ‘సొంతవూరు’లో ఎల్బీ శ్రీరామ్ చేసిన పాత్రకు మొదట కీరవాణినే అడిగారు. ‘వేదం’లో కీరవాణి ఓ పాత్ర చేస్తారని మొదట్లో వార్తలొచ్చాయి.ఇవన్నీ ఒకెత్తు అయితే... రాజమౌళికి తన అన్నయ్య కీరవాణితో విలన్ పాత్ర చేయించాలని కోరిక. ‘‘నన్ను విలన్గా చేయమని రాజమౌళి ఎప్పుడూ అడుగుతుంటాడు. నాకే ఆసక్తి లేదు’’ అని కీరవాణి చెప్పారు.