smruthi mandhana
-
WPL 2024: అలుపెరుగక దూసుకుపోయిన.. సూపర్ 'స్మృతి' మందాన
సాంగ్లీ.. మహారాష్ట్రలో ఒక చిన్న పట్టణం.. శ్రవణ్ అనే కుర్రాడు క్రికెట్ నెట్స్లో తీవ్రంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. రాష్ట్ర జట్టులోకి ఎంపికయ్యేందుకు ఆ అబ్బాయి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. అతని చెల్లెలు తన తండ్రితో కలిసి అక్కడే అన్న ఆటను చూస్తోంది. అప్పటి వరకు క్రికెట్ అంటే ఏమిటో కూడా ఆ అమ్మాయికి తెలీదు. అయితే అప్పటికే కొన్నిసార్లు అన్న పేరు, అతను సాధించిన స్కోర్లతో న్యూస్పేపర్లలో వచ్చింది. ఇంటికి వెళ్లిన తర్వాత కూతురి ఆసక్తి చూసిన నాన్న ‘నువ్వు కూడా ఆడతావా’ అని అడిగాడు. ఆ వెంటనే అమ్మాయి నా పేరు కూడా పేపర్లో వస్తుందా అని నాన్నను అడిగేసింది. వెంటనే కల్పించుకున్న తల్లి.. ‘పదో తరగతి పరీక్షల్లో 96 శాతం వస్తే నీ పేరు కచ్చితంగా వస్తుంది’ అని సర్దిచెప్పింది. కానీ ఆ అమ్మాయి మనసులో మాత్రం ఒక మాట ఉండిపోయింది. పదో తరగతి పరీక్షా ఫలితాల కంటే క్రికెట్ ద్వారా పేరు తెచ్చుకోవడమే బాగుంటుందనిపించింది. అంతే.. తన మనసులో మాట చెప్పగానే తండ్రి అభ్యంతరం చెప్పలేదు. నాన్న అండగా ఉంటే తిరుగేముంది.. ఆ అమ్మాయి తర్వాతి రోజుల్లో అన్నీ పక్కన పెట్టి పూర్తిగా క్రికెట్ పైనే దృష్టి పెట్టింది. 16 ఏళ్ల వయసు తిరిగే సరికే భారత సీనియర్ జట్టులో చోటు సంపాదించి తానేంటో రుజువు చేసుకుంది. అండర్–19 స్థాయి తర్వాత అన్న ఆటకు గుడ్బై చెప్పిన ఉద్యోగ వేటలో పడిపోగా.. చెల్లెలు మాత్రం కుటుంబం ప్రోత్సాహంతో దూసుకుపోయింది. ఆ ప్లేయరే భారత ఓపెనర్ స్మృతి మంధానా. ప్రస్తుతం మన మహిళల టీమ్లో టాప్ బ్యాటర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్లో కెప్టెన్ హోదాలో బెంగళూరు టీమ్ను విజేతగా నిలిపి తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించింది. స్మృతి విజయప్రస్థానంలో కీలకమైన అంశం ఆమెకు కుటుంబసభ్యుల నుంచి లభించిన ప్రోత్సాహం. వస్త్రవ్యాపారి అయిన తండ్రి మొదటి రోజు నుంచే క్రికెట్లో ప్రోత్సహించగా, ఒక టీనేజ్ అమ్మాయి అవసరాలను దగ్గరి నుంచి చూసుకుంటూ తల్లి అన్ని రకాలుగా వెంట నిలిచింది. ఇక క్రికెట్ మానేసి బ్యాంక్ ఉద్యోగంలో చేరిన అన్న శ్రవణ్ ఆమెకు మార్గదర్శిగా వ్యవహరించడమే కాకుండా స్మృతి ప్రాక్టీస్లో అన్ని సమయాల్లో తానే వెంట ఉంటూ ఆమెకు నెట్స్లో బౌలింగ్ చేస్తూ తన వంతు సహకారం అందించాడు. సరిగ్గా చెప్పాలంటే ఒక్కసారి కెరీర్ను ఎంచుకున్న తర్వాత ఏ దశలోనూ ఆమె ప్రయాణానికి అడ్డంకులు రాలేదు. మధ్యలో ఒక్కసారి మాత్రం అన్నలాగే ఆటను మానేసి తనకిష్టమైన సైన్స్ చదువుకుందామనే ఆలోచన వచ్చినా, అప్పటికే ఆమె ఎదుగుతున్న తీరు ఆ ఆలోచనకు ఫుల్స్టాప్ పెట్టేశాయి. ఎందుకంటే 11 ఏళ్ల వయసుకే మహారాష్ట్ర అండర్–19 టీమ్లో చోటు దక్కించుకున్న స్మృతికి మున్ముందు దూసుకుపోవడమే మిగిలింది. నాలుగేళ్ల తర్వాత మహారాష్ట్ర సీనియర్ టీమ్లో అవకాశం లభించింది. తొలి మ్యాచ్లోనే సౌరాష్ట్రపై 155 పరుగులు బాది ఆమె వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర జట్టుకు వరుస విజయాలు అందించిన తర్వాత మహిళల టీమ్ల కోసం ప్రత్యేకంగా బీసీసీఐ నిర్వహించిన చాలెంజర్ టోర్నీలో టాప్స్కోరర్గా సత్తా చాటడంతో స్మృతి ఆట పదును ఏమిటో అందరికీ తెలిసింది. అంచెలంచెలుగా దూసుకుపోయి.. భారత టి–20 జట్టు తరఫున తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన స్మృతి మరో ఐదు రోజులకే వన్డేల్లోనూ అరంగేట్రం చేసింది. అంతర్జాతీయ వేదికపై ఆడటానికి కొద్ది రోజుల ముందే భారత దేశవాళీ వన్డేలో డబుల్ సెంచరీ (224) బాదిన స్మృతి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా నిలిచింది. ఒక్కసారి టీమిండియాలోకి వచ్చిన తర్వాత ఆమె ఏ దశలోనూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఓపెనర్గా జట్టు వరుస విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించింది. వరుసగా నాలుగేళ్ల పాటు వన్డేలు, టి–20ల్లో రెగ్యులర్ మెంబర్గా తనకు పోటీ లేకుండా జట్టులో స్మృతి కొనసాగింది. 2014లో ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ నుంచి ఏకంగా ఎనిమిది మంది అరంగేట్రం చేయగా, వారిలో స్మృతి కూడా ఉంది. రెండో ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీతో జట్టు విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఇదే జోరులో విదేశీ లీగ్ టీమ్లను కూడా ఆకర్షించడంతో ఆస్ట్రేలియా విమెన్ బిగ్బాష్ లీగ్లో తొలిసారి ఆడే అవకాశం దక్కింది. అయితే అనూహ్యంగా అది స్మృతికి కొంత సమస్యగా కూడా మారింది. కాలికి తీవ్ర గాయం కారణంగా టోర్నీనుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో పాటు భారత జట్టుకు కూడా ఐదేళ్లు దూరం కావాల్సి వచ్చింది. కొత్తగా బరిలోకి దిగి.. ఇంగ్లండ్ వేదికగా 2017 జూన్లో వన్డే వరల్డ్ కప్.. భారత్, ఆతిథ్య ఇంగ్లండ్ మధ్య లీగ్ మ్యాచ్. ఓపెనర్గా బరిలోకి దిగిన స్మృతి 72 బంతుల్లోనే 90 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా భారత్ను గెలిపించింది. అయితే ఆట కంటే ఆమె మరో రకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. నాలుగేళ్ల కెరీర్ తర్వాత తొలిసారి స్మృతి కంటి అద్దాలు లేకుండా మైదానంలోకి దిగింది. అప్పటి వరకు ఆమెను గ్రౌండ్లో కంటి అద్దాలతోనే అందరూ చూశారు. గాయం కారణంగా వచ్చిన విరామంలో ఆమె తన శస్త్ర చికిత్సతో తన లుక్ను కూడా మార్చుకుంది. ఈ సమయం తన కెరీర్లో కొత్త మార్పుకు సూచికగా భావించానని, ఇకపై కొత్త స్మృతిని చూస్తారని ఆమె స్వయంగా చెప్పుకుంది. నిజంగానే కెరీర్ పరంగా కూడా స్మృతికి సంబంధించి అదో మరో మలుపు. తర్వాతి మ్యాచ్లోనే వెస్టిండీస్పై సెంచరీ కూడా సాధించి వరల్డ్ కప్లో ఆమె తన జోరు కొనసాగించింది. వరల్డ్ కప్ తర్వాత వెంటనే జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలోనూ శతకంతో చెలరేగింది. ఏడాది తిరిగే లోపే న్యూజిలాండ్ వేదికగా మరో సెంచరీ కొట్టేసింది. ఈ రెండేళ్ల కాలం ఆమె కెరీర్లో అత్యద్భుతంగా సాగింది. రికార్డులే రికార్డులు.. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘకాలం పాటు భారత మహిళల క్రికెట్ను మిథాలీ రాజ్ శాసించింది. మన జట్టుకు సంబంధించి అన్ని ఘనతలనూ ఆమెనే సాధించింది. అయితే తర్వాతి తరంలో స్మృతి అలాంటి ఫామ్ను చూపించింది. పైగా వన్డేలతో పాటు ఈతరం ప్రతినిధిగా టి–20 క్రికెట్లో కూడా స్మృతి తన స్థాయిని చూపించింది. క్రికెట్కు సంబంధించి నాలుగు విదేశీ పర్యటనలను కఠినమైనవిగా భావిస్తారు. ‘సేన’ అంటూ పిలుచుకునే (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఇందులో ఉన్నాయి. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ నాలుగు దేశాల్లోనూ వన్డేల్లో సెంచరీ చేసిన అత్యంత అరుదైన రికార్డు స్మృతి పేరిట ఉంది. అంతర్జాతీయ టి–20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (24 బంతుల్లో) ఆమెనే సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో రజతం, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో ఆమె సభ్యురాలు. అద్భుతమైన ఆటతో విదేశీ లీగ్లను కూడా ఆకట్టుకున్న స్మృతి బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్, సదరన్ బ్రేవ్, వెస్టర్న్ స్టార్మ్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించింది. అయితే బీసీసీఐ నిర్వహించే విమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో బెంగళూరు టీమ్ను విజేతగా నిలపడం ఆమె స్థాయిని మరింత పెంచింది. పురుషుల విభాగంలో ఐపీఎల్లో 16 సీజన్లు ఆడినా బెంగళూరుకు ఇప్పటి వరకు ట్రోఫీ దక్కలేదు. కానీ రెండో ప్రయత్నంలోనే మహిళల టీమ్ దానిని సాధించడంలో అటు ప్లేయర్గా, ఇటు కెప్టెన్గా స్మృతికే ఘనత దక్కుతుంది. గత ఏడాది తొలి సీజన్లో 2 మ్యాచ్లే గెలిచి నాలుగో స్థానానికి పరిమితమైన టీమ్ను ఈ సారి విజేతగా మలచడం అసాధారణం. మున్ముందు భారత మహిళల క్రికెట్కు చుక్కానిలా ముందుండి నడిపించగల సామర్థ్యం స్మృతికి ఉందనేది వాస్తవం. 2018లో అంతర్జాతీయ క్రికెట్ మండలి వార్షిక అవార్డుల్లో అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డును స్మృతి సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ఆమె ఆటకు అర్జున పురస్కారంతో గౌరవించింది. దీనికి తోడు బ్రాండింగ్ ప్రపంచంలో కూడా ఆమె ఇప్పుడు పెద్ద సెన్సేషన్. సహజంగానే ఆటకు అందం తోడవడంతో పలు కంపెనీలు స్మృతితో ఒప్పందాలు చేసుకున్నాయి. గల్ఫ్ ఆయిల్, హావెల్స్, పవర్ షూస్, హెర్బలైఫ్, రెడ్బుల్, ఈక్విటాస్, హీరో, బూస్ట్, హ్యుందాయ్ మోటార్స్, మాస్టర్కార్డ్, గార్నియర్, పీఎన్బీ మెట్లైఫ్ తదితర సంస్థల కోసం స్మృతి పని చేసింది. — మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, నేర్పించింది ఆమె! -
మథ్యూస్ ఆల్రౌండ్ షో.. ఆర్సీబీని చిత్తు చేసిన ముంబై
మథ్యూస్ ఆల్రౌండ్ షో.. ముంబై ఘన విజయం మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ముంబై విజయభేరి మోగించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. కేవలం 14.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి చేధించింది. ముంబై విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మాథ్యూస్ కీలక పాత్ర పోషించింది. తొలుత బౌలింగ్లో మూడు వికెట్లు పడగొట్టిన మాథ్యూస్, బ్యాటింగ్లో 77 పరుగులతో ఆజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మాథ్యూస్తో పాటు నాట్ స్కివర్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. 29 బంతులు ఎదుర్కొన్న స్కివర్ 9 ఫోర్లు, ఒక సిక్సర్తో 55 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. ఆర్సీబీ 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. అమీలియా కేర్, ఇషాక్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో రిచా ఘోష్ 28 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. ఆమెతో పాటు మంధాన(23), కనికా అహుజా(22) పరుగులతో రాణించారు. ►10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూస్(50), నాట్ స్కివర్(22) పరుగులతో ఉన్నారు. ►6 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూస్(31), నాట్ స్కివర్(0) పరుగులతో ఉన్నారు. ►156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 2 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూస్,యస్తికా భాటియా ఉన్నారు. ►టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. అమీలియా కేర్, ఇషాక్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో రిచా ఘోష్ 28 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. ఆమెతో పాటు మంధాన(23), కనికా అహుజా(22) పరుగులతో రాణించారు. ►18 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. క్రీజులో స్కాట్(14), రేణుకా సింగ్ ఉన్నారు. ►71 పరుగులు వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన పెర్రీ రనౌట్ రూపంలో వెనుదిరిగింది. 9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. క్రీజులో రిచాఘోష్, కనికా ఉన్నారు. 43 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ కేవలం 43 పరుగులుకే నాలుగు వికెట్లు కోల్పోయింది. స్మృతి మంధాన(11), డివైన్(6),దిశా కసత్(0), నైట్(0) పెవిలియన్కు చేరారు. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్, సైకా ఇషాక్ చెరో రెండు వికెట్లు సాధించారు. ►2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. క్రీజులో స్మృతి మంధాన(11), డివైన్(6) పరుగులతో ఉన్నారు. మహిళల ప్రీమియర్ లీగ్-2023 తొలి మ్యాచ్లోనే ఓటమి చవిచూసిన ఆర్సీబీ.. ఇప్పుడు బ్రబౌర్న్ వేదికగా ముంబై ఇండియన్స్తో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. బెంగళూరు మాత్రం ఒక మార్పు చేసింది. తుది జట్లు: ముంబై ఇండియన్స్ : యస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలిత, సైకా ఇషాక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, దిశా కసత్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హీథర్ నైట్, కనికా అహుజా, మేగన్ షుట్, శ్రేయాంక పాటిల్, ప్రీతీ బోస్, రేణుకా ఠాకూర్ సింగ్ -
మహిళల టీ20 ఛాలెంజ్.. జట్టులను ప్రకటించిన బీసీసీఐ
మహిళల టీ20 ఛాలెంజ్-2022 కోసం బీసీసీఐ జట్టులను సోమవారం ప్రకటించింది. టీ20 ఛాలెంజ్ కప్ మే 23న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ట్రైల్బ్లేజర్స్తో సూపర్నోవాస్ తలపడనుంది. ఫైనల్ మే 28న జరుగుతుంది. కాగా మ్యాచ్లు అన్నీ పూణెలోని ఎంసీఎ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ట్రైల్బ్లేజర్స్కు స్మృతి మందాన సారథ్యం వహిస్తుండగా.. సూపర్నోవాస్కు హర్మన్ప్రీత్ కౌర్, వెలాసిటీకు దీప్తి శర్మ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక మహిళ టీ20 ఛాలెంజ్ చివరగా 2020లో జరిగింది. గతేడాది కరోనా కారణంగా బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహించలేదు. ట్రైల్బ్లేజర్స్ స్మృతి మంధాన (కెప్టెన్), పూనమ్ యాదవ్ (వైస్ కెప్టెన్), అరుంధతి రెడ్డి, హేలీ మాథ్యూస్, జెమీమా రోడ్రిగ్స్, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్, రిచా ఘోష్, ఎస్. మేఘన, సైకా ఇషాక్, సల్మా ఖాతున్, షర్మిన్ అక్టర్, సోఫియా బ్రౌన్, సోఫియా బ్రౌన్, మల్లిక్, ఎస్.బి.పోఖార్కర్ వెలాసిటీ: దీప్తి శర్మ (కెప్టెన్), స్నో రానా (వైస్ కెప్టెన్), షఫాలి వర్మ, అయాబొంగా ఖాకా, కె.పి. నవ్గిరే, కాథరిన్ క్రాస్, కీర్తి జేమ్స్, లారా వోల్వార్డ్, మాయా సోనావానే, నత్తకాన్ చంతమ్, రాధా యాదవ్, ఆర్తీ కేదార్, సిమ్రాన్ షిండే, సిమ్రాన్ షిండే యాస్తిక భాటియా, ప్రణవి చంద్ర సూపర్నోవాస్: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), తానియా భాటియా (వైస్ కెప్టెన్), అలనా కింగ్, ఆయుష్ సోని, చందు వి, డియాండ్రా డోటిన్, హర్లీన్ డియోల్, మేఘనా సింగ్, మోనికా పటేల్ ముస్కాన్ మాలిక్, పూజా వస్త్రాకర్, ప్రియా పునియా, రాశి కనోజియా, సోఫీ ఎక్లెస్టోన్, సునే లూస్, మాన్సీ జోషి చదవండి: IPL 2022: కోల్కతా నైట్ రైడర్స్కు భారీ షాక్.. సీనియర్ ఆటగాడు దూరం..! -
డివిలియర్స్ను గుర్తు చేస్తూ.. అద్భుతమైన షాట్ ఆడిన భారత ఓపెనర్!
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న కీలక మ్యాచ్లో భారత యువ సంచలనం షఫాలీ వర్మ అదరగగొట్టింది. 46 బంతుల్లో 53 పరుగులు చేసిన షఫాలీ వర్మ భారత్కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్లో షఫాలీ వర్మ అద్భుతమైన షాట్లుతో అలరించింది. కాగా ఈ మ్యాచ్లో షఫాలీ... దక్షిణాఫ్రికా దిగ్గజం డివిలియర్స్ను తలపించేలా స్కూప్ షాట్ ఆడింది. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఇస్మాయిల్ బౌలింగ్లో.. షఫాలీ వికెట్లు విడిచి పెట్టి ఆఫ్ సైడ్ వచ్చి అద్భుతమైన స్కూప్ షాట్ ఆడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(71), షఫాలీవర్మ(53) కెప్టెన్ మిథాలీ రాజ్(68), హర్మన్ ప్రీత్కౌర్ (48) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్, మసబాట క్లాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అయబోంగా ఖాకా,ట్రాయన్ ఒక్కో వికెట్ సాధించారు. చదవండి: World Cup 2022 Ind W Vs SA W: కీలక మ్యాచ్.. అదరగొట్టిన స్మృతి, షఫాలీ, మిథాలీ.. హర్మన్ సైతం. View this post on Instagram A post shared by ICC (@icc) -
క్రీడా స్ఫూర్తి చాటుకున్న మంధాన.. తనకు దక్కిన అవార్డును!
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 155 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో భారత బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్ సెంచరీలు సాధించి కీలక పాత్ర పోషించారు. మంధాన 119 బంతుల్లో 123 పరుగులు చేయగా, హర్మన్ప్రీత్ 107 బంతుల్లో 109పరుగులు సాధించింది. ఈ నేపథ్యంలో 119 పరగులు చేసిన స్మృతి మంధాన ఎంపికైంది. అయితే ఇక్కడే మంధాన తన క్రీడా స్పూర్తిను చాటుకుంది. తనకు దక్కిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును హర్మన్ప్రీత్ కౌర్తో పంచుకుంది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో మంధాన మాట్లాడుతూ.. "నేను సెంచరీ సాధించాను, కాబట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపిక అవ్వాలని ఒక క్రికెటర్గా నేను ఎప్పుడూ కోరుకోను. మా జట్టు 300 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో మేమిద్దరం సమానంగా సహకరించామని నేను భావిస్తున్నాను. కాబట్టి, ట్రోఫీని హర్మన్తో పంచుకోవాలి అనుకున్నాను. అదే విధంగా అవార్డు పొందడానికి మేమిద్దరం అర్హులమని నేను అనుకుంటున్నాను. మేము న్యూజిలాండ్, పాక్తో జరిగిన మ్యాచ్లో మా తప్పులను మేము గ్రహించాం. ఇకపై వాటిని మేము పునరావృతం చేయబోమని భావిస్తున్నాను" అని మంధాన పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగల భారీ స్కోర్ సాధించింది. ఇక 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 162 పరుగులకే కుప్ప కూలింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టగా.. ఝులన్ గోస్వామి ఒకటి, మేఘన సింగ్ 2, రాజేశ్వరీ గైక్వాడ్ ఒకటి, పూజా వస్త్రాకర్ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: Ind Vs Sl 2nd Test: అప్పుడు సెహ్వాగ్ .. ఇప్పుడు మయాంక్ అగర్వాల్.. తొమ్మిదేళ్ల తర్వాత! -
ప్రపంచకప్కు ముందు భారత్కు షాక్.. స్టార్ ఓపెనర్ తలకు గాయం!
ICC Women's World Cup: ఐసీసీ మహిళల ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తలకు గాయమైంది. భారత ఇన్నింగ్స్ 2 ఓవర్లో దక్షిణాఫ్రికా బౌలర్ ఇస్మాయిల్ బౌన్సర్ వేసింది. బౌన్సర్ బంతిని పుల్ షాట్ ఆడటానికి మంధాన ప్రయత్నించగా.. అది మిస్ అయ్యి మంధాన హెల్మెట్కు బలంగా తగిలింది. అయితే వెంటనే ఫీల్డ్లోకి ఫిజియో వచ్చి మంధానను పరిశీలించాడు. అయితే ఆమెకు ఎలాంటి కంకషన్ లక్షణాలు కనిపించలేదు. దీంతో ఆమెకు తగిలిన గాయం అంత తీవ్రమైనది కాదని ఫిజియో నిర్ధారించాడు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా మంధాన ఫీల్డ్ను విడిచి వెళ్లింది. 12 పరుగులు చేసిన ఆమె రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు సాధించి. భారత బ్యాటర్లలో హర్మాన్ ప్రీత్ కౌర్ సెంచరీతో మెరిసింది. భారత ఇన్నింగ్స్లో హర్మాన్ ప్రీత్ కౌర్(103), యస్తికా భాటియా(58) పరుగులతో రాణించారు. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటిస్ జట్టు 242 పరుగులకే పరిమితమైంది. చదవండి: Rohit Sharma: రోహిత్కు షేక్హ్యాండ్ ఇచ్చేటపుడు జాగ్రత్త.. పట్టిందల్లా బంగారమే: టీమిండియా మాజీ క్రికెటర్ -
హమ్మయ్య.. మొత్తానికి భారత్ గెలిచింది
న్యూజిలాండ్ పర్యటనలో వరుస నాలుగు ఓటమిల తర్వాత.. ఐదో వన్డే గెలిచి భారత మహిళల జట్టు వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. ఓవల్ వేదికగా జరగిన అఖరి వన్డేలో న్యూజిలాండ్పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత విజయంలో స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీ కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీలియా కేర్(66), సోఫియా డివైన్(34),లారెన్ డౌన్(30) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గైక్వాడ్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(71), హర్మన్ ప్రీత్ కౌర్(63), మిథాలీ(57) పరగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కాగా ఐదు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ 4-0తేడాతో కైవసం చేసుకుంది. ఇక వన్డే సిరీస్లో అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమీలియా కేర్కి మ్యాన్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కింది. చదవండి: Bhanuka Rajapaksa: అభిమాన క్రికెటర్ కోసం రోడ్డెక్కిన లంకేయులు -
వన్డేల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ.. తొలి భారత క్రికెటర్గా!
భారత మహిళా క్రికెటర్ రిచా ఘోష్ వన్డే క్రికెట్లో అరుదైన రికార్డును సాధించింది. వన్డేల్లో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ సాధించిన తొలి భారత మహిళా బ్యాటర్గా ఘోష్ రికార్డులకెక్కింది. న్యూజిలాండ్లో జరిగిన నాలుగో వన్డేలో 26 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన రిచా.. ఈ అరుదైన ఘనత సాధించింది. అంతకుమందు 2018లో దక్షిణాఫ్రికాపై వేదా కృష్ణమూర్తి 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించింది. అదే విధంగా న్యూజిలాండ్లో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ కూడా రిచాదే కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత జట్టుపై 63 పరుగుల తేడాతో ఘన విజయం న్యూజిలాండ్ సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ను 20 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 128 పరగులకే ఆలౌటైంది. చదవండి: ICC World Cup 2023: టీమిండియా బౌలింగ్ కోచ్గా అజిత్ అగార్కర్!? Richa Ghosh brings up the fastest fifty by an Indian batter in Women's ODI 🔥 She needed just 26 balls to reach the milestone 👏 Watch all the #NZvIND action LIVE or on-demand on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 pic.twitter.com/ad34maGg4A — ICC (@ICC) February 22, 2022 -
స్మృతి మంధాన కళ్లు చెదిరే క్యాచ్.. సూపర్ రీ ఎంట్రీ కదా!
Smriti Mandhana Catch: న్యూజిలాండ్ మహిళలతో జరిగిన నాలుగో వన్డేలో భారత ఓసెనర్ స్మృతి మంధాన అద్భుతమైన క్యాచ్తో మెరిసింది. క్వారంటైన్ నిభందనల కారణంగా తొలి మూడు వన్డేలకు దూరమైన స్మృతి నాలుగో వన్డేకు తిరిగి జట్టులోకి వచ్చింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన రేణుకా సింగ్ బౌలింగ్లో.. సోఫియా డివైన్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించింది. అయితే పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న మంధాన డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకుంది. కాగా మంధాన క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మ్యాచ్ను 20 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీలియా కేర్(68), బేట్స్(41),డివైన్(32) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 2 వికెట్లు పడగొట్టగా, మేఘనా సింగ్,దీప్తి శర్మ చెరో వికెట్ సాధించారు. ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 128 పరగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్(52), మిథాలీ రాజ్(30) పరుగలతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కివీస్ బౌలర్లలో కేర్, జానేసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, జేస్ కేర్ చెరో రెండు వికెట్లు సాధించారు. Oh YAAAS! Smriti Mandhana!!#NZvIND #CricketTwitter pic.twitter.com/0fy0JJ60BE — Krithika (@krithika0808) February 22, 2022 -
న్యూజిలాండ్తో ఏకైక టీ20.. భారత జట్టు ఓటమి
క్వీన్స్టౌన్ వేదికగా జరిగిన ఏకైక టీ20లో భారత్పై న్యూజిలాండ్ మహిళల జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బ్యాటర్లలో సబ్భినేని మేఘన(37), యస్తికా భాటియా(26) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కేర్, అమేలియా కెర్, జాన్సన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో సుజీ బేట్స్(36), డివైన్( 31) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్కు బారత జట్టు సీనియర్ ఓపెనర్ స్మృతి మంధాన దూరమైంది. ఇక న్యూజిలాండ్తో భారత మహిళల జట్టు 5 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇరు జట్లు మధ్య తొలి వన్డే శనివారం జరగనుంది. చదవండి: MS Dhoni Gym Video: అదీ ధోని భాయ్ అంటే.. ఎంతో ఓపికగా జిమ్లో.. వీడియో వైరల్ -
మిథాలీ రాజ్ ర్యాంక్ యథాతథం..
ICC ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్లో భారత ప్లేయర్లు మిథాలీ రాజ్, స్మృతి మంధాన స్థానాల్లో ఎటువంటి మార్పు లేదు. 738 రేటింగ్స్తో మిథాలీ మూడో స్థానంలో కొనసాగుతుండగా... 710 రేటింగ్స్తో స్మృతి ఆరో ర్యాంక్లో నిలిచింది. వీరిద్దరు మినహా మరో భారత బ్యాటర్ టాప్–10లో చోటు దక్కించుకోలేదు. బౌలింగ్ విభాగంలో టీమిండియా వెటరన్ పేసర్ జులన్ గోస్వామి రెండో స్థానంలో ఉంది. చదవండి: Trent Boult: బస్ డ్రైవర్ను హగ్ చేసుకున్న కివీస్ స్టార్ బౌలర్ -
మెరిసిన స్మృతి మంధాన .. సిడ్నీ థండర్స్ ఘన విజయం
మెక్కే (ఆ్రస్టేలియా): భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (39 బంతుల్లో 45; 6 ఫోర్లు) మహిళల బిగ్బాష్ లీగ్లో మెరిసింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో చక్కని ప్రదర్శనతో పాటు జట్టుకు ఉపయోగపడే భాగస్వామ్యంతో డిఫెండింగ్ చాంపియన్ సిడ్నీ థండర్స్ను గెలిపించింది. మొదట సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. సిక్సర్స్ జట్టుకు ఆడుతున్న భారత ప్లేయర్ షఫాలీ వర్మ (8) నిరాశపరిచింది. సిడ్నీ థండర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో భారతీయ క్రికెటర్ దీప్తి శర్మ వికెట్లను నేరుగా గిరాటేయడంతో షఫాలీ రనౌటైంది. తర్వాత 15.2 ఓవర్లలోనే సిడ్నీ థండర్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కొరినె హాల్ (19)తో కలిసి తొలి వికెట్కు స్మృతి 53 పరుగులు జోడించడం విశేషం. చదవండి: T20 World Cup: మార్టిన్ క్రో ఆత్మ శాంతించేదెప్పుడు? -
డ్యాన్స్తో అదరగొట్టిన స్మృతి మంధాన... నెటిజన్లు ఫిదా
Smriti Mandhana Dance Video Viral: ఎప్పుడూ మ్యాచ్లు, టూర్లతో బిజీగా ఉండే క్రికెటర్లు అప్పుడప్పుడు వాళ్ల ఆటతోనే కాదు డ్యాన్స్లతోనూ సరదగా అభిమానులను అలరిస్తుంటారు. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఆమె సహచరులతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఆమె సహచరులు హర్మన్ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ , రాధా యాదవ్తో కలిసి 'ఇన్ డా ఘెట్టో' అనే పాటకు డ్యాన్స్ వేసింది. ఈ వీడియోను మంధాన తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. స్మృతి డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఈ వీడియో షేర్ చేసిన మంధాన.. వీడియో చేయాలనే ఆలోచన తనది కాదంటూ క్యాప్షన్ పెట్టింది. దీనిపై స్పందించిన ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హీథర్ నైట్... ఇది కచ్చితంగా స్మృతి మంధాన పనేని ఫన్నీగా కామెంట్ చేసింది. ప్రస్తుతం వీరింతా మహిళల బిగ్ బాష్ లీగ్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నారు. చదవండి: భారత్తో తలపడే పాక్ జట్టు ఇదే: ఆకాష్ చోప్రా View this post on Instagram A post shared by Smriti Mandhana (@smriti_mandhana) -
భారత మహిళా జట్టు కెప్టెన్గా స్మృతి మంధాన..!
Powar Foresees A New Captain Smriti Mandhana: గోల్డ్కోస్ట్ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా మహిళల చేతిలో ఓటమి పాలైన భారత్ సిరీస్ను చేజార్చుకుంది. అంతక ముందు జరిగిన వన్డే సిరీస్లో కూడా ఓటమి పాలై ఘోర పరాభవాన్ని భారత్ మూటకట్టుకుంది. ఈ క్రమంలో జట్టు హెడ్ కోచ్ రమేశ్ పవార్ కీలక వాఖ్యలు చేశారు. భారత జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన త్వరలోనే కెప్టెన్గా బాధ్యతలు తీసుకుంటుందని పవార్ తెలిపారు. టెస్టులో స్మృతి మంధాన బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉందని, ఏదో ఒకరోజు ఆమె జట్టును నడిపిస్తుందని ఆయన అన్నారు. "మేము ఆమెను భారత జట్టు సారధిగా చూడాలని అనుకుంటున్నాము. ‘ఆమె ప్రస్తుతం జట్టు వైస్ కెప్టెన్గా ఉంది. ఏదో ఒక సమయంలో ఆమె ఈ జట్టుకు నాయకత్వం వహిస్తుంది. ఏ ఫార్మాట్కు స్మృతి కెప్టెన్గా ఎంపిక అవుతోందో నాకు తెలియదు. బీసీసీఐ, సెలెక్టర్లు, నేను తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తాము’ అని పవార్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగినన రెండో వన్డే మ్యాచ్లో 86 పరుగులు చేసిన స్మృతి మంధాన, పింక్ బాల్ టెస్టు మ్యాచ్లో 127 పరుగులు చేసి డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించింది. ఆఖరి టీ20 మ్యాచ్లోను 52 పరుగులు చేసి రాణించింది. చదవండి: IPL 2021: ఎలిమినేటర్ మ్యాచ్కు ముందు ఆర్సీబీ కీలక ప్రకటన -
మూడో టీ20లో భారత్ ఓటమి.. సిరీస్ ఆస్ట్రేలియాదే
Australia seal the T20I series Against India: గోల్డ్కోస్ట్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టుపై 14 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 2-0తో ఆస్ట్రేలియా సీరీస్ను కైవసం చేసుకుంది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే షఫాలీ వర్మ వికెట్ కోల్పోయినప్పటకీ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఈ క్రమంలో స్మృతి మంధాన ఆర్ధసెంచరీనీ పూర్తి చేసుకుంది. మంధాన 49 బంతుల్లో 8 ఫోర్లుతో 52 పరుగులు సాధించింది. మంధాన ఔటయ్యక సారథి హర్మన్ప్రీత్ కౌర్, పూజా వస్త్రకర్, హార్లీన్ డియోల్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. రిచా ఘోష్ (11 బంతుల్లో 22 నాటౌట్ 2 ఫోర్లు, 2 సిక్స్లు) చివరలో దూకుడుగా ఆడినా భారత్ను విజయతీరాలకు చేర్చలేకపోయింది. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో నికోలా క్యారీ రెండు వికెట్లు పడగొట్టగా, సదర్లాండ్, యాష్లే గార్డనర్, జార్జియా వారహమ్ చెరో వికెట్ సాధించారు. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 5వికెట్లకు 149 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్స్లో మెక్గ్రాత్(61), బెత్ మూనీ(44) పరుగలుతో రాణించారు. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టగా, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్,రేణుకా సింగ్ చెరో వికెట్ సాధించారు. -
పింక్ బాల్ టెస్టుకు వరుణుడి అడ్డంకి..సెంచరీకి చేరువలో స్మృతి మంధాన
Pink Ball Test: భారత్, ఆస్ట్రేలియా మహిళల మధ్య జరుగుతున్నచరిత్రత్మాక డే అండ్ నైట్ టెస్టు మొదటి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. క్వీన్స్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 44.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 132 పరుగులు చేసింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన , షెఫాలి వర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 93 పరుగల బాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా 64 బంతుల్లో 31 పరగులు చేసిన షెఫాలి తొలి వికెట్గా వెనుదిరిగింది. స్మృతి మంధాన 144 బంతుల్లో 80 పరగులు చేసి సెంచరీకు చేరువలో ఉంది. ప్రస్తుతం మంధాన, పూనమ్ రౌత్ క్రీజులో ఉన్నారు. చదవండి: IPL 2021 2nd Phase RCB Vs RR: ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ బౌలర్ సరికొత్త రికార్డు.. -
బిగ్బాష్ టి20 లీగ్లో తొలిసారిగా ఆడనున్న భారత స్టార్ ఆల్రౌండర్..
Smriti Mandhana And Deepti Sharma Play In Women's Big Bash League: మహిళల బిగ్బాష్ టి20 లీగ్లో భారత క్రికెటర్లు స్మృతి మంధాన, ఆల్రౌండర్ దీప్తి శర్మ డిఫెండింగ్ చాంపియన్ ‘సిడ్నీ థండర్’ తరఫున ఆడతారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న ఇంగ్లండ్ ప్లేయర్లు హీతర్ నైట్, టామీ బీమండ్ స్థానాల్లో వీరికి చోటు దక్కింది. బిగ్బాష్ లీగ్లో స్మృతికి ఇది మూడో జట్టు. గతంలో ఆమె బ్రిస్బేన్ హీట్, హోబర్ట్ హరికేన్స్ జట్ల తరఫున ఆడింది. దీప్తి శర్మ ఈ టోర్నీలోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. చదవండి: Indw vs Ausw: తమ వన్డేల చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా -
భారత మహిళల రికార్డు ఛేజింగ్.... ఆసీస్ విజయాలకు బ్రేక్
Australia Women vs India Women: ఆస్ట్రేలియాతో జరిగన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా వైట్వాష్ పరాభవాన్ని తప్పించుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం 265పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇన్నింగ్స్ 10 ఓవర్లో ఫామ్లో ఉన్న మంధాన వికెట్ను భారత్ కోల్పోయింది. ఆనంతరం క్రీజులోకి వచ్చిన యస్తిక భాటియా, షఫాలీ వర్మ కలిసి 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యస్తిక భాటియా(69 బంతుల్లో 9 ఫోర్లతో 64), షెఫాలీ వర్మ(91 బంతుల్లో 7 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో చేలరేగారు. ఈ భాగస్వామ్యం భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. చివర్లో స్నేహ్ రాణా కాసేపు అలరించడంతో టీమిండియా లక్ష్యాన్ని సూనయాసంగా చేధించింది. కాగా భారత మహిళలకు వన్డేల్లో ఇదే అత్యధిక చేజింగ్ కావడం విశేషం. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్ ఉమెన్లో ఆశ్లే గార్డ్నర్(67), బెత్ మూనీ (52) హాఫ్ సెంచరీలతో చేలరేగగా.. తహిలా మెక్గ్రాత్ (47), అలిసా హీలీ( 35) రాణించారు. భారత బౌలర్లలో జూలన్ గోస్వామి, పూజా వస్త్రాకర్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. స్నేహ్ రాణా ఒక వికెట్ సాధించింది. చదవండి: Mohammad Hafeez: పాకిస్తాన్ స్టార్ ఆల్రౌండర్కు అస్వస్థత.. -
అదరగొట్టిన షఫాలీ
బ్రిస్టల్: ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు భారత మహిళల క్రికెట్లో కొత్త కెరటాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇప్పటి వరకు కెరీర్లో టి20లు మాత్రమే ఆడిన షఫాలీ వర్మ టెస్టుల్లో కూడా తాను సత్తా చాటగలనంటూ తొలి మ్యాచ్లోనే నిరూపించింది. మ్యాచ్ రెండో రోజు అద్భుత ప్రదర్శన కనబర్చిన షఫాలీ (152 బంతుల్లో 96; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకుంది. అయితే తొలి మ్యాచ్లోనే అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్గా ఈ టీనేజర్ నిలిచింది. షఫాలీకి తోడుగా స్మృతి మంధాన (155 బంతుల్లో 78; 14 ఫోర్లు) కూడా ఆకట్టుకోవడంతో గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. షఫాలీ, స్మృతి తొలి వికెట్కు ఏకంగా 167 పరుగులు జోడించడం విశేషం. అయితే ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి 20 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు పడగొట్టారు. ఓపెనర్లతో పాటు శిఖా పాండే (0), కెప్టెన్ మిథాలీ రాజ్ (2), పూనమ్ రౌత్ (2) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజ్లో ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ (4 బ్యాటింగ్), దీప్తి శర్మ (0 బ్యాటింగ్) జట్టును ఆదుకోవాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులు వెనుకబడి ఉన్న భారత్ ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 59 పరుగులు చేయా ల్సి ఉంది. అంతకు ముందు 269/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 396 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. -
చెలరేగిన స్మృతి మంధాన.. దక్షిణాఫ్రికా చిత్తు
లక్నో: తొలి వన్డేలో ఎదురైన పరాజయం నుంచి భారత మహిళల క్రికెట్ జట్టు వెంటనే తేరుకుంది. రెండో వన్డేలో దక్షిణాఫ్రికాను ఆల్రౌండ్ ప్రదర్శన తో దెబ్బకొట్టి సిరీస్లో సమంగా నిలిచింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించింది. బౌలింగ్లో వెటరన్ సీమర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జులన్ గోస్వామి (4/42) దక్షిణాఫ్రికాను వణికించగా... తర్వాత బ్యాటింగ్లో స్మృతి మంధాన (64 బంతుల్లో 80 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగింది. స్మృతికి పూనమ్ రౌత్ (89 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు) తోడుగా నిలిచింది. దాంతో భారత్ 28.4 ఓవర్లలో కేవలం వికెట్ నష్టపోయి 160 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. ఛేజింగ్లో వరుసగా పది అర్ధ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్గా స్మృతి గుర్తింపు పొందింది. అంతకుముందు టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 41 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు లిజెల్లి లీ (4), వోల్వర్డ్ (9) జట్టు స్కోరు 20 పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో లారా గుడ్ఆల్ (49; 2 ఫోర్లు), సునే లూస్ (36; 5 ఫోర్లు) ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. మూడో వికెట్కు 60 పరుగులు జోడించాక కెప్టెన్ లూస్ను మాన్సీ జోషి అవుట్ చేసింది. అక్కడి నుంచి భారత బౌలర్లు పట్టుబిగించారు. కేవలం 58 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లను పడేశారు. లూస్, గుడ్ఆల్ తర్వాత ఇంకెవరూ భారత బౌలింగ్కు అసలు క్రీజులో నిలిచే సాహసం చేయలేకపోయారు. స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ 3, మాన్సి జోషి 2 వికెట్లు తీశారు. ఛేజింగ్లో ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ (9) తక్కువ స్కోరుకే వెనుదిరగగా... స్మృతి, పూనమ్ రౌత్తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్కు 138 పరుగులు జోడించడంతో భారత్ విజయం ఖాయమైంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే షబ్నిమ్ బౌలింగ్లో స్మృతి రెండు వరుస సిక్సర్లతో ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో స్మృతి 46 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆమెకు అండగా నిలిచిన పూనమ్ రౌత్ 79 బంతుల్లో ఫిఫ్టీని అధిగమించింది. ఐదు వన్డేల సిరీస్ 1–1తో సమంగా ఉండగా... మూడో వన్డే శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో ఆడటం ద్వారా అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా మిథాలీ రాజ్ గుర్తింపు పొందింది. 1999లో అరంగేట్రం చేసిన మిథాలీ ఇప్పటివరకు 310 మ్యాచ్లు (10 టెస్టులు+211 వన్డేలు+82 టి20లు) ఆడింది. 309 మ్యాచ్లతో (23 టెస్టులు+191 వన్డేలు+95 టి20లు) చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) పేరిట ఉన్న రికార్డును మిథాలీ అధిగమించింది. -
‘అర్జున’కు బుమ్రా, ధావన్!
న్యూఢిల్లీ: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి ‘అర్జున’ అవార్డు బరిలో నిలవనున్నాడు. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు బుమ్రా పేరును బీసీసీఐ నామినేట్ చేయనున్నట్లు సమాచారం. 2018లోనే బుమ్రా ఈ అవార్డు బరిలో నిలిచినా... సీనియారిటీ ప్రాతిపదికన రవీంద్ర జడేజా ‘అర్జున’ను కైవసం చేసుకున్నాడు. పురుషుల విభాగంలో ఒకరికంటే ఎక్కువ మంది పేర్లను నామినేట్ చేయాలని బీసీసీఐ అధికారులు భావిస్తే బుమ్రాతో పాటు సీనియర్ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్కు ఈ జాబితాలో చోటు దక్కే అవకాశముంది. రెండేళ్ల క్రితమే శిఖర్ ధావన్ పేరును బీసీసీఐ సిఫారసు చేసినప్పటికీ అవార్డుల కమిటీ మహిళల విభాగంలో స్మృతి మంధానకు మాత్రమే ఈ గౌరవాన్ని అందించింది. భారత్ తరఫున నాలుగేళ్లుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న 26 ఏళ్ల బుమ్రా 14 టెస్టుల్లో 68 వికెట్లు, 64 వన్డేల్లో 104 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు. ‘బుమ్రా కచ్చితంగా ఈ అవార్డుకు అర్హుడు. అతను ఐసీసీ నంబర్వన్ బౌలర్గానూ నిలిచాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ గడ్డలపై ఇన్నింగ్స్లో 5 వికెట్లు దక్కించుకున్న ఏకైక ఆసియా బౌలర్’ అని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మహిళల విభాగానికొస్తే ఆల్రౌండర్ దీప్తి శర్మ, పేసర్ శిఖా పాండే పేర్లను బోర్డు పరిశీలించే అవకాశముంది. -
మ...మ... మాస్క్... టీమిండియా ఫోర్స్!
ఇప్పుడు కరోనా చైన్ను తెంచే పనిలో మాస్క్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. భారత్లోనూ వేలల్లో వైరస్ బారిన పడుతున్న తరుణంలో బీసీసీఐ భారత క్రికెటర్ల ద్వారా మాస్క్లు ధరించేలా ప్రోత్సహిస్తోంది. స్టార్ క్రికెటర్లు కోహ్లి, సచిన్, స్మృతి మంధాన, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తదితరులతో రూపొందించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. బయటికి వెళ్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలనే స్పృహ కల్పించేలా ‘టీమ్ మాస్క్ ఫోర్స్’ పేరిట ఈ వీడియో సందేశం ఉంది. ‘మాతో చేతులు కలపండి. కరోనాపై పోరాడండి. ఆరోగ్యసేతు మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సురక్షితంగా ఉండండి’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది. -
‘లూడో కలిపింది అందరినీ’
ముంబై: కరోనా నేపథ్యంలో అసలు ఆటలన్నీ ఆగిపోవడంతో ప్లేయర్లంతా ఇతర వ్యాపకాల్లో బిజీగా మారుతున్నారు. ఇంటి డ్రాయింగ్ రూమ్లో ఆర్చరీ రేంజ్లు, వర్చువల్ షూటింగ్ రేంజ్లలో తమ సామర్థ్యం మెరుగుపర్చుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా, సరదాగా ఆన్లైన్ క్రీడలతో సమయం గడుపుతున్నవారు మరికొందరు. భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యులు కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. వీరంతా ఆన్లైన్లో కలిసికట్టుగా లూడో గేమ్ను ఆడుతున్నారు. బ్యాట్, బంతి పక్కకు వెళ్లిపోగా పాచికలే ఇప్పుడు వారికి పరమపూజ్యంగా మారిపోయాయి. జట్టు ఓపెనర్ స్మృతి మంధాన ఈ విషయాన్ని వెల్లడించింది. ‘మేం ఫ్రెండ్స్ అంతా కలిసి ఆన్లైన్లో లూడో గేమ్ను ఆడుతున్నాం. ఇందులో జట్టు సభ్యులంతా పాల్గొంటున్నారు. మైదానంలో అందరితో కలిసి ఉండే తరహాలోనే ఇప్పుడు దీని ద్వారా కూడా అదే బంధం, సాన్నిహిత్యం కొనసాగిస్తున్నట్లుగా ఉంది. దీంతో పాటు ఫిట్గా ఉండటం కూడా కీలకం. మా ట్రైనర్ మాకందరికీ విడివిడిగా పంపించిన ట్రైనింగ్ షెడ్యూల్ను అనుసరిస్తూ మేమంతా ఫిట్నెస్ను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాం’ అని స్మృతి వెల్లడించింది. బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఎడంచేతి వాటం బ్యాటర్ లాక్డౌన్లో తాను ఎలా సమయం గడుపుతున్నానో చెప్పింది. ‘కుటుంబసభ్యులందరం సరదాగా గడుపుతున్నాం. పేకాట, ఇంటి పని, వంట పని, సోదరుడితో అల్లరి ఎలాగూ ఉన్నాయి. సినిమాలంటే బాగా ఇష్టం కాబట్టి వారానికి రెండు, మూడు సినిమాలు చూస్తున్నాను. అన్నింటికి మించి నాకు ఇష్టమైన వ్యాపకం నిద్ర. రోజుకు కనీసం 10 గంటలు పడుకుంటున్నాను. దాని వల్ల మిగిలిన రోజంతా హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తోంది’ అని స్మృతి చెప్పింది. ఇంటి పని చేస్తూ స్మృతి -
వచ్చేదంతా వాళ్ల నుంచే...
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి వచ్చే ఆదాయమంతా పురుషుల క్రికెట్ నుంచే వస్తుందని, అలాంటపుడు వారితో పాటు సమాన చెల్లింపులు మహిళలకు ఇవ్వాలంటే ఎలా వీలవుతుందని భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వ్యాఖ్యానించింది. భారత క్రికెట్లో పురుషులతో పోల్చుకుంటే తక్కువ ఫీజులు, పారితో షికాలు పొందడంపై తనకు ఎలాంటి బాధలేదని ఆమె స్పష్టం చేసింది. ఐసీసీ ‘మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన ఆమె ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచి్చంది. పురుష క్రికెటర్లకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు గరిష్టంగా రూ. 7 కోట్లు ఉంటే... అదే మహిళలకైతే గరిష్టంగా రూ. 50 లక్షలు మాత్రమే ఉంది. ‘ఒక్క విషయం అందరూ అర్థం చేసుకోవాలి... బీసీసీఐకి ఎప్పుడైతే మహిళల క్రికెట్ నుంచి కూడా భారీగా రాబడి వస్తే... అప్పుడు సమాన ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేయొచ్చు. అలా అడిగేవారిలో నేనే ముందుంటాను. కానీ ఇప్పుడైతే అలా అడగడం సమంజసం కాదు. నా తోటి క్రికెటర్లకు ఈ వ్యత్యాసంపై ఆలోచన లేదు’ అని పేర్కొంది. -
ఐసీసీ వన్డే, టి20 జట్లలో స్మృతి మంధాన
దుబాయ్: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన వార్షిక వన్డే, టి20 జట్లలో చోటు దక్కింది. ఈ ఏడాది కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఐసీసీ వార్షిక అవార్డులు, వుమెన్ టీమ్స్ ఆఫ్ ఇయర్ను ఎంపిక చేస్తారు. 23 ఏళ్ల ఈ భారత ఓపెనర్ రెండు టెస్టులతోపాటు 51 వన్డేలు, 66 టి20లు ఆడింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఆమె 3476 పరుగులు చేసింది. ఈ సీజన్లో స్మృతి అద్భుతంగా రాణించింది. ఐసీసీ మహిళల వన్డే జట్టులో భారత్ నుంచి ఆమెతో పాటు బౌలర్లు జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్, శిఖా పాండేలకు చోటు దక్కగా... టి20 జట్టులో ఆల్రౌండర్ దీప్తి శర్మ, స్పిన్నర్ రాధా యాదవ్ కూడా ఎంపికయ్యారు. ఐసీసీ ఇరు జట్లకు మెగ్ లానింగ్ (ఆ్రస్టేలియా) కెపె్టన్గా వ్యవహరిస్తుంది. కాగా... ఆ్రస్టేలియాకే చెందిన ఎలీస్ పెర్రీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’... ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికైంది. ఎలిస్ పెర్రీ వన్డేల్లో ఈ సీజన్లో 73.50 సగటుతో 441 పరుగులు చేయడంతోపాటు 21 వికెట్లు తీసింది. ఈ ఏడాది ఆమె మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణించింది. మహిళల టి20 క్రికెట్లో 1000 పరుగులు చేయడంతోపాటు 100 వికెట్లు తీసిన తొలి క్రికెటర్గా గుర్తింపు పొందింది. టి20 ఫార్మాట్లో ఆసీస్కే చెందిన అలీసా హీలీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు సొంతం చేసుకుంది. -
ప్రతిభను మించిన అందం ఉందా!
ఒక మహిళ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తారు. ఆమె అందంగా ఉందా అని చూస్తాం! ఒక మహిళ అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. అందంగా ఉందా అని చూస్తాం!! మహిళ అంటేనే అందం అనీ, అందంగా ఉంటేనే మహిళ అనీ.. ఒక అభిప్రాయం స్థిరపడిపోయింది మనలో. క్రికెటర్ స్మృతి మంధాన తన ఆటలో ఎన్నో విజయాలు సాధించారు. అత్యుత్తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. బి.సి.సి.ఐ. ఆమెను ‘బెస్ట్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్’గా గుర్తించింది. కీర్తించింది. అంతటి ప్లేయర్లోనూ మనం అందమే చూస్తున్నట్లున్నాం! నెట్లో అజ్ఞాత వ్యక్తులెవరో స్మృతి మంధాన నీలిరంగు క్రికెట్ షర్ట్, క్రికెట్ క్యాప్తో ఉన్న ఫొటోను ‘అందంగా’ మలిచి ఆన్లైన్లో విడుదల చేశారు. ఫొటోషాప్లో మంధాన పెదవులకు లిప్స్టిక్ అద్ది, కళ్లకు కాటుక రాసిన ఆ ఫేక్ ఫొటోపై ఇప్పుడు ఆమె ఆటను అభిమానించే వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతన అనే ట్విట్టర్ యూజర్ ఆన్లైన్లో స్మృతి ఫొటోలు వెదుకుతుండగా ఈ లిప్స్టిక్, కాటుక ఉన్న ఫొటో బయటపడింది. ఈ నకిలీ ఫొటోను, ఆ అసలు ఫొటోను ఆమె తన ట్విట్టర్లో పోస్ట్ చేసి.. ‘క్రికెటర్ను క్రికెటర్లా చూడండి.. అందమైన క్రికెటర్గా కాదు’ అని అర్థం వచ్చేలా ఒక కామెంట్ పెట్టారు. ‘‘ఇదే పని విరాట్ కొహ్లీకి, ఎం.ఎస్.ధోనీకి చెయ్యగలరా?’’ అని మరొక నెటిజన్ ప్రశ్నించారు. నిజమే కదా! -
స్మృతి... టాప్ ర్యాంక్ చేజారె
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్స్లో భారత్కు నిరాశ ఎదురైంది. ‘టాప్’లో ఉన్న స్మృతి మంధాన రెండో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాతో సోమవారం ముగిసిన వన్డే సిరీస్కు గాయం కారణంగా దూరమవ్వడం ఆమె వ్యక్తిగత ర్యాంకింగ్పై ప్రభావం చూపింది. ప్రస్తుతం స్మృతి 755 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... 759 పాయింట్లతో న్యూజిలాండ్ ప్లేయర్ అమీ సాటర్త్వెయిట్ మొదటి ర్యాంక్కు ఎగబాకింది. క్రికెట్ కెరీర్లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సారథి మిథాలీ రాజ్ ఒక స్థానాన్ని కోల్పోయి ఏడో ర్యాంక్కు పరిమితం కాగా... టి20 కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 17వ స్థానంలో నిలిచింది. -
వెలాసిటీదే విజయం
జైపూర్: పురుషుల ఐపీఎల్ తరహాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో ఉత్కంఠకు మాత్రం కొదవ ఉండటం లేదు. స్కోర్లు తక్కువైనా సోమవారం ట్రయల్ బ్లేజర్స్–సూపర్ నోవాస్ జట్ల మ్యాచ్ చివరి బంతి వరకు సాగి ఆసక్తి రేపగా... బుధవారం ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ మధ్య జరిగిన రెండో మ్యాచ్లో అనూహ్య ఫలితం వచ్చేలా కనిపించింది. వెలాసిటీ విజయానికి 20 బంతుల్లో 2 పరుగులు మాత్రమే అవసరమైన స్థితిలో... ఏడు బంతుల్లో ఒక్క పరుగూ రాకుండా ఐదు వికెట్లు పడటంతో ఏం జరుగుతుందోనన్న ఉత్సుకత నెలకొంది. అయితే, సుశ్రీ ప్రధాన్ (2) అందుకు అవకాశం ఇవ్వకుండా లాంఛనాన్ని పూర్తి చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. వెలాసిటీ 18 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. హర్లీన్... మళ్లీ గత మ్యాచ్లో చెలరేగిన కెప్టెన్ స్మృతి మంధాన (10) ఈసారి త్వరగానే వెనుదిరగడంతో బ్లేజర్స్కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సుజీ బేట్స్ (22 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్), వన్ డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (40 బంతుల్లో 43; 5 ఫోర్లు) రెండో వికెట్కు 35 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. సుజీ ఔటవడం, హర్లీన్కు ఎక్కువగా స్ట్రయికింగ్ రాకపోవడంతో స్కోరు వేగం పుంజుకోలేదు. స్టెఫానీ టేలర్ (18 బంతుల్లో 5) బంతులు వృథా చేసింది. 18వ ఓవర్లో హర్లీన్, దీప్తి శర్మ (16) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. దీంతో మెరుగైన స్కోరుకు అవకాశం లేకపోయింది. వెలాసిటీ బౌలర్లలో ఏక్తా బిష్త్ (2/13), అమేలీ కెర్ (2/21) రెండేసి వికెట్లు పడగొట్టారు. శిఖా పాండే (1/18) పొదుపుగా బౌలింగ్ చేసింది. అనంతరం టీనేజ్ ఓపెనర్ షఫాలీ వర్మ (31 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), వన్డౌన్ బ్యాటర్ డానియల్ వ్యాట్ (35 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్) మెరుపులతో వెలాసిటీ ఛేదన సులువుగానే సాగింది. రెండో వికెట్కు వీరు 38 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 63 పరుగుల వద్ద షఫాలీ ఔటయ్యాక వ్యాట్, కెప్టెన్ మిథాలీ రాజ్ (22 బంతుల్లో 17; 1 ఫోర్) ఇన్నింగ్స్ను నడిపించారు. మూడో వికెట్కు 48 పరుగులు జోడించారు. గెలుపునకు 25 బంతుల్లో 2 పరుగులే కావాల్సిన దశలో దీప్తి శర్మ (4/14) మాయాజాలానికి వ్యాట్, వేద కృష్ణమూర్తి (0), మిథాలీ, శిఖా పాండే (0), కెర్ (0) ఒకరివెంట ఒకరు వెనుదిరిగారు. దీంతో జట్టు 111/2 నుంచి 111/7కు పడిపోయింది. చేతిలో మూడు వికెట్లుండగా సమీకరణం 13 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఒత్తిడిని తట్టుకున్న ప్రధాన్... దీప్తి వేసిన బంతిని షార్ట్ థర్డ్మ్యాన్ దిశగా పంపి వెలాసిటీని గెలిపించింది. నేడు వెలాసిటీ, సూపర్ నోవాస్ మ్యాచ్ ఫైనల్ సహా మొత్తం నాలుగు మ్యాచ్ల మహిళల టి20 లీగ్లో గురువారం వెలాసిటీ, సూపర్నోవాస్ మధ్య మూడో లీగ్ మ్యాచ్ జరుగనుంది. ప్రస్తుతం ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ చెరో మ్యాచ్ నెగ్గి ఉన్నాయి. మూడింటిలో బ్లేజర్స్ (–0.305), నోవాస్ (–0.1) కంటే వెలాసిటీ (0.678) రన్రేట్ చాలా మెరుగ్గా ఉంది. గురువారం వెలాసిటీ గెలిచినా, ఓడినా ఫైనల్కు వెళ్లే చాన్స్ ఉంది. నోవాస్కు మాత్రం విజయం, మంచి రన్రేట్ సాధించడం కూడా ముఖ్యమే. 15 ఏళ్ల సంచలనం... బ్లేజర్స్, వెలాసిటీ మ్యాచ్లో బరిలో దిగిన షఫాలీ వర్మ వయసు కేవలం 15 ఏళ్లు. హరియాణాకు చెందిన ఈ టీనేజర్ అండర్–19 స్థాయిలో అదరగొట్టే ప్రదర్శన కనబరుస్తోంది. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఈమె ఇటీవల జరిగిన బీసీసీఐ అండర్–19 మహిళల క్రికెట్ లీగ్లో విశేషంగా రాణించింది. బెంగాల్పై 57 బంతుల్లో సెంచరీ బాది వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్పై 58 బంతుల్లో 98 పరుగులు చేసింది. ఇక హైదరాబాద్పై అయితే 77 బంతుల్లోనే 125 పరుగులు చేసింది. ఈ మూడుసార్లూ జట్టు గెలవగా ఈమెనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’. ఈ టోర్నీలో 5 ఇన్నింగ్స్ల్లో 376 పరుగులు చేసింది. ఆఫ్బ్రేక్ బౌలింగ్తో వికెట్ కీపింగ్ కూడా చేయగలగడం షఫాలీ ప్రత్యేకత. షఫాలీ ఇదే జోరును కొనసాగిస్తే మహిళల జాతీయ జట్టులోకి రావడానికి మరెంతో కాలం పట్టకపోవచ్చు. -
లీడింగ్ క్రికెటర్గా విరాట్ కోహ్లి
లండన్: ప్రతిష్టాత్మక ‘విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్’ అవార్డుల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఉత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు. వరుసగా మూడో ఏడాది అతనికి ‘లీడింగ్ క్రికెటర్’ అవార్డు దక్కింది. ఈ అవార్డును మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు డాన్ బ్రాడ్మన్ (10 సార్లు), జాక్ హాబ్స్ (8 సార్లు) మాత్రమే గెలుచుకోగా...ఇప్పుడు ఆ జాబితాలో కోహ్లి చేరడం విశేషం. 2018లో మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లి ఏకంగా 2735 పరుగులు సాధించాడు. విజ్డన్ ఐదుగురు అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా కోహ్లి ఉండగా... ఇంగ్లండ్కు చెందిన ట్యామీ బీమాంట్, జాస్ బట్లర్, స్యామ్ కరన్, రోరీ బర్న్స్లు మిగతావారు. గత ఏడాది ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో కోహ్లి 59.3 సగటుతో 593 పరుగులు చేశాడు. మహిళల విభాగంలో స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ‘లీడింగ్ క్రికెటర్’గా ఎంపికైంది. గత ఏడాది స్మృతి వన్డేల్లో 669, టి20ల్లో 662 పరుగులు చేసింది. ఇంగ్లండ్లో జరిగిన మహిళల సూపర్ లీగ్ టోర్నీలో ఆమె అద్భుతంగా ఆడి 174.68 స్ట్రైక్రేట్తో 421 పరుగులు సాధించింది. అప్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వరుసగా రెండో ఏడాది ‘లీడింగ్ టి20 క్రికెటర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. విజ్డన్ సంస్థ 1889నుంచి ప్రతి ఏటా అత్యుత్తమ క్రికెటర్ అవార్డులను ప్రకటిస్తోంది. క్రికెట్ ప్రపంచంలో ఈ గుర్తింపును ప్రత్యేకంగా పరిగణిస్తారు. -
ప్రపంచ కప్ గెలవాలి!
గువాహటి: వరల్డ్ ర్యాంకింగ్స్లో నంబర్వన్గా నిలవాలన్న తన కోరిక నెరవేరిందని, ఇక వరల్డ్ కప్ గెలవాలన్నదే తన ఆశ అని భారత స్టార్ బ్యాటర్, ఐసీసీ నంబర్వన్ స్మృతి మంధాన వ్యాఖ్యానించింది. ‘క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడే వరల్డ్ కప్ గురించి ఆలోచిస్తాం. నేనూ అదే చేశాను. ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్వన్ కావాలనే స్వల్ప లక్ష్యాలు ఎలాగూ ఉన్నాయి. అది ఇప్పుడు నెరవేరింది. ఇక మరింతగా కష్టపడి దీనిని నిలబెట్టుకోవడం ముఖ్యం. ఒక బ్యాటర్గా నంబర్వన్ స్థానానికి చేరుకోవడం సంతోషకరం. అయితే అది చిన్నదే. అసలు లక్ష్యం మాత్రం వరల్డ్ కప్ సాధించడమే’ అని స్మృతి చెప్పింది. మరోవైపు ఇంగ్లండ్తో టి20 సిరీస్ను గెలుచుకునే సత్తా తమ జట్టుకు ఉందని ఆమె పేర్కొంది. ‘కొత్తవారితో ప్రయోగాలు చేయడంకంటే సిరీస్ గెలుచుకోవడమే మాకు అన్నింటికంటే ముఖ్యం. ఒక వేళ సిరీస్ గెలిస్తే సహజంగానే కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది’ అని ఆమె చెప్పింది. 2020 ఫిబ్రవరిలో జరిగే టి20 ప్రపంచ కప్ కోసం కోచ్ రామన్తో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్మృతి వెల్లడించింది. వైస్ కెప్టెన్గా చేసినందుకు తాజాగా కెప్టెన్సీ బాధ్యత కొత్తగా అనిపించడం లేదని తెలిపింది. -
మహిళలు చేజేతులా...
భారత మహిళల విజయలక్ష్యం 160 పరుగులు... స్మృతి మంధాన జోరు మీదుండగా ఒక దశలో స్కోరు 102/1... మరో 52 బంతుల్లో 58 పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి పటిష్ట స్థితిలో ఉండి కూడా మన జట్టు కుప్పకూలింది. 34 పరుగులకే చివరి 9 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ ముందు తలవంచింది. ఈ పోరుకు ముందు భారత్ తమ చివరి టి20 మ్యాచ్ను దాదాపు రెండున్నర నెలల క్రితం ప్రపంచ కప్ సెమీస్లో ఆడింది. నాడు 23 పరుగులకే చివరి 8 వికెట్లు కోల్పోయిన తీరును తాజా ఫలితం మళ్లీ గుర్తు చేసింది. సరిగ్గా అప్పటిలాగే స్మృతి, జెమీమా మినహా అంతా విఫలం కావడంతో హర్మన్ బృందం కుదేలైంది. వెల్లింగ్టన్: స్మృతి మంధాన సూపర్ హిట్... భారత్ అట్టర్ ఫ్లాప్... న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన తొలి టి20 మ్యాచ్ ఫలితంపై సంక్షిప్త వ్యాఖ్య ఇది! అద్భుతమైన ఆరంభం లభించినా దానిని కొనసాగించలేక మన అమ్మాయిలు చతికిల పడ్డారు. చివరకు 23 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. స్మృతి భారత్ తరఫున టి20ల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ (24 బంతుల్లో) నమోదు చేసినా జట్టును మాత్రం గెలిపించలేకపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. సోఫీ డెవిన్ (62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్ సాటర్వైట్ (33; 4 ఫోర్లు) అండగా నిలిచింది. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన (34 బంతుల్లో 58; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో పాటు జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 39; 6 ఫోర్లు) కూడా రాణించింది. వీరిద్దరు రెండో వికెట్కు 98 పరుగులు జత చేశారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (17) విఫలం కాగా... మిగతా ఎనిమిది మంది ఒక్కో అంకె స్కోరుకే పరిమితయ్యారు. లీ మేరీ తహుహు (3/30) భారత్ను దెబ్బ తీసింది. రెండో టి20 మ్యాచ్ రేపు ఆక్లాండ్లో జరుగుతుంది. కీలక భాగస్వామ్యం... ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే సుజీ బేట్స్ (7)ను ఔట్ చేసి పూనమ్ యాదవ్ భారత్కు శుభారంభం అందించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే గర్రీ (15)ని కూడా పూనమ్ బౌల్డ్ చేసింది. ఈ దశలో డెవిన్, సాటర్వైట్ కలిసి జట్టును ఆదుకున్నారు. 69 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యాన్ని హైదరాబాద్ బౌలర్ అరుంధతి రెడ్డి విడగొట్టింది. అరుంధతి ఓవర్లో తొలి రెండు బంతులను బౌండరీ దాటించిన డెవిన్ తర్వాతి బంతికి వెనుదిరిగింది. తర్వాతి ఓవర్లోనే సాటర్వైట్ను దీప్తి ఔట్ చేసింది. పూనమ్ వేసిన ఆఖరి ఓవర్లో మార్టిన్ రెండు సిక్సర్లు బాదడంతో కివీస్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. టపటపా... వన్డేల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన స్మృతి అదే ఫామ్ను టి20ల్లోనూ కొనసాగించింది. అయితే కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడిన మరో ఓపెనర్ ప్రియా పూనియా (4) మొదటి ఓవర్లోనే వెనుదిరిగింది. ఆ తర్వాత స్మృతి, జెమీమా కలిసి అలవోకగా పరుగులు సాధించారు. రోజ్మేరీ వేసిన ఆరో ఓవర్లో స్మృతి 2 సిక్సర్లు, ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. కాస్పరెక్ వేసిన తర్వాతి ఓవర్లో జెమీమా వరుసగా 3 ఫోర్లు కొట్టింది. డెవిన్ బౌలింగ్లో భారీ సిక్స్తో స్మృతి రికార్డు అర్ధసెంచరీ నమోదైంది. వీరిద్దరు జట్టును గెలుపు దిశగా నడిపిస్తున్న తరుణంలో ఒక్కసారిగా మ్యాచ్ మలుపు తిరిగింది. కెర్ బౌలింగ్లో డీప్ ఎక్స్ట్రా కవర్లో రోవ్ అద్భుత క్యాచ్ పట్టడంతో స్మృతి ఇన్నింగ్స్ ముగిసింది. మరో నాలుగు బంతులకే జెమీమాను తహుహు ఔట్ చేసింది. ఆమె తర్వాతి ఓవర్లో భారత్ 2 వికెట్లు కోల్పోయింది. గెలుపు కోసం 17 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన స్థితిలో భారీ సిక్సర్ కొట్టిన హర్మన్...తర్వాతి బంతికే ఔటవ్వడంతో భారత్ ఆశలు కోల్పోయింది. మిథాలీకి చోటు లేదు... ఊహించినట్లుగానే తుది జట్టులో వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్కు అవకాశం దక్కలేదు. వరల్డ్ కప్ సెమీస్ వివాదం తర్వాత ఆమె టి20 టీమ్లో కొనసాగినా... పొట్టి ఫార్మాట్ నుంచి మిథాలీ రిటైర్మెంట్పై వార్తలు వస్తున్న నేపథ్యంలో మ్యాచ్లో ఆడించడం సందేహంగానే కనిపించింది. చివరకు అదే జరిగింది. కొత్త అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మిథాలీని ఆడించలేదని ఈసారి కెప్టెన్ హర్మన్ ముక్తసరి సమాధానంతో ముగించింది. నాతో పాటు జెమీమా కూడా వెంట వెంటనే ఔట్ కావడం ఫలితాన్ని మార్చింది. ఇలా జరిగినప్పుడు కోలుకోవడం చాలా కష్టం. ఈ రోజు మా ప్రణాళిక ఫలించలేదు. వచ్చే సారి మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంటుంది. మేం మ్యాచ్ గెలవాలంటే నేను 20వ ఓవర్ వరకు కూడా బ్యాటింగ్ చేయాలి. మిడిలార్డర్ కుప్పకూలిపోకుండా ఉండాలంటే అదొక్కటే సరైన మార్గం. కనీసం 18వ ఓవర్ వరకైనా క్రీజ్లో ఉంటే మిగతా వారికి సమస్య ఉండదు. తర్వాతి మ్యాచ్లో అలా చేసేందుకు ప్రయత్నిస్తాను. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. నిజానికి మేం లక్ష్యాన్ని ఛేదించాల్సింది. –స్మృతి మంధాన, భారత వైస్ కెప్టెన్ -
స్మృతి... వన్డే నంబర్ వన్
న్యూఢిల్లీ: తాజాగా ముగిసిన న్యూజిలాండ్ సిరీస్లో 196 పరుగులతో అదరగొట్టిన భారత డాషింగ్ బ్యాటర్ స్మృతి మంధాన... ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నంబర్ వన్గా నిలిచింది. శనివారం విడుదల చేసిన జాబితాలో ఆమె మూడు స్థానాలు ఎగబాకి 751 పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలిస్ పెర్రీ (681 పాయింట్లు), మెగ్ లానింగ్ (675 పాయింట్లు) వరుసగా తర్వాతి ర్యాంకుల్లో ఉన్నారు. భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ (669 పాయిం ట్లు) ఐదో స్థానానికి పడిపోయింది. కాగా, పురుషుల విభాగం బ్యాట్స్మన్ ర్యాకింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. -
పాక్తో మ్యాచ్ : టాస్ గెలిచిన భారత్
గయనా : విమెన్స్ టీ-20 ప్రపంచ కప్లో భాగంగా పాకిస్తాన్తో జరగునున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్లో అద్బుతమైన విజయంతో ఊపుమీద ఉన్న భారత్.. దాయది దేశమైన పాకిస్తాన్పై కూడా అదే దూకుడు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. పాక్ కూడా పటిష్టమైన జట్టే కావడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. గత మ్యాచ్లో దూకుడైన ఆటతో చెలరేగిన హర్మన్ అదే ఫామ్ను కొనసాగించాలని భారత టీం భావిస్తోంది. భారత జట్టు : హర్మత్ ప్రీత్కౌర్ (కెప్టెన్), భాటియా, మంధనా, రోడ్రిగ్సి, హేమలత, వేధా కృష్ణమూర్తి, మిథాల్ రాజ్, దీప్తి శర్మ, రాధ యాదవ్, అరుంధతి రాయ్, పూనయ్ యాదవ్ పాకిస్తాన్ జట్టు : జవారియా ఖాన్ (కెప్టెన్), నిధా ఖాన్, ఉస్మానియా సోహేల్, అయేషా జాఫర్, బీస్మాన్ మారూఫ్, నిదా డార్, అలియా రిజా, డయానా, నవాజ్, అనాయ్ అమీ కౌర్ పవర్! -
మిథాలీ సెంచరీ వృథా
గాలె: కెప్టెన్ మిథాలీ రాజ్ (143 బంతుల్లో 125 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుతో అజేయ శతకం సాధించినా... బౌలర్ల వైఫల్యంతో ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టుకు ఓటమి ఎదురైంది. దాంతో మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేయలేకపోయినా 2–1తో దక్కించుకుంది. తొలుత భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఖాతా తెరవకుండానే యువ ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ (0) పెవిలియన్ చేరడంతో తొలి ఓవర్లోనే క్రీజులోకొచ్చిన మిథాలీ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు మంచి స్కోరు అందించింది. స్మృతి మంధాన (51; 6 ఫోర్లు)తో కలిసి రెండో వికెట్కు 102 పరుగులు... హర్మన్ ప్రీత్ కౌర్ (17)తో మూడో వికెట్కు 45 పరుగులు... దీప్తి శర్మతో ఐదో వికెట్కు 92 పరుగులు జత చేసింది. ఈ క్రమంలో మిథాలీ 126 బంతుల్లో ఏడో వన్డే సెంచరీ పూర్తి చేసుకుంది. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.5 ఓవర్లలో 7 వికెట్లకు 257 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన లంక జట్టుకు చివరి మ్యాచ్లో గెలుపు కాస్త ఊరటనిచ్చింది. కెప్టెన్ జయాంగని ఆటపట్టు (133 బంతుల్లో 115; 13 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీ సాధించగా... హాసిని పెరీరా (45; 4 పోర్లు, 2 సిక్స్లు) ఆకట్టుకుంది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, మాన్సి జోషి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. -
వన్డే సిరీస్ భారత్దే
నాగ్పూర్: భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-1తేడాతో గెలుచుకుంది. గురువారం విదర్భ స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని 45.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించిన భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ను భారీ స్కోర్ చేయకుండా భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జేమ్స్(94; 119 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్) రాణించడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. భారత బౌలర్లలో గోస్వామి, రాజేశ్వరీ గైక్వాడ్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ తలో రెండు వికెట్లు సాధించారు. ఆ తర్వాత 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 23 పరుగులకే రోడ్రిగ్స్, వేదా కృష్ణమూర్తి వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో నిలిచింది. ఈ సమయంలో మరో ఓపెనర్ స్మృతి మంధన (53 రిటైర్డ్ హర్ట్;67 బంతుల్లో 6ఫోర్లు) తో కలిసి కెప్టెన్ మిథాలీ రాజ్(74నాటౌట్; 124 బంతుల్లో 9ఫోర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దింది. మంధన ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(54నాటౌట్; 61 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్స్) మెరుపు బ్యాటింగ్ చేసి భారత్ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్ ష్రబ్సోల్ రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన దీప్తిశర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్లో నిలకడగా రాణించిన స్మృతి మంధన ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నారు. -
భారత్ ఘోర పరాజయం
నాగ్పూర్ : ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో చతికిలపడింది. ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా సోమవారం విదర్భ క్రికెట్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను ఇంగ్లండ్ జట్టు 1-1తో సమం చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు.. ఇంగ్లండ్ బౌలర్లు సోఫీ ఎక్లెస్టోన్(4/14), హాజెల్(4/32) ధాటికి 37.2 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. టీమిండియాలో స్మృతి మంధాన (42; 57బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సర్), దీప్తి శర్మ (26), దేవికా (11) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయకపోవడం గమనార్హం. ముగ్గురు ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఆపై 114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంతో 29 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో డానియెల్ వ్యాట్ (47;43బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు), బీమౌంట్ (39; 85 బంతుల్లో 3ఫోర్లు), కెప్టెన్ హీథర్ నైట్(26నాటౌట్; 42బంతుల్లో 3ఫోర్లు) రాణించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ రెండు వికెట్లు సాధించింది. -
భారత జట్టుకు ఆసీస్ షాక్
వడోదరా : దక్షిణాఫ్రికాపై విజయాలతో ఉత్సాహంగా కనిపించిన భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ను చేజార్చుకుంది. మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో ఆసీస్కు కోల్పోయింది. తొలి వన్డేలో ఓటమి చవిచూసిన మహిళా జట్టు తాజాగా గురువారం జరిగిన రెండో వన్డేలో 60పరుగుల తేడాతో ఓడిపోయింది. 288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత మహిళా జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. స్మృతి మంధాన( 67; 53 బంతుల్లో 12ఫోర్లు, 1సిక్సర్) జోరుతో తొలి వికెట్కు 88పరుగుల భాగస్వామ్యం నమోదయింది. ఆ తరువాత మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు పరుగులు చేయడంలో విఫలమవడంతో ఓటమి తప్పలేదు. 227 పరుగులకు ఆలౌటై పరాజయం చవిచూసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జోనస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా, వెల్లింగ్టన్, పెర్రీ తలో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నికోల్ బోల్టన్ (84; 88 బంతుల్లో 12 ఫోర్లు), ఎలైస్ పెర్రీ (70; 70 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), బెత్ మూనీ (56; 40 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేయడంతో భారత్కు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు సాధించగా, పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీశారు. ఏక్తా బిస్త్, హర్మన్ ప్రీత్ కౌర్లకు తలో వికెట్ వికెట్ దక్కింది. -
నవ కెరటం!
► మహిళల క్రికెట్లో దూసుకెళుతున్న స్మృతి మంధన ► దూకుడైన ఆటతో అదరగొడుతున్న వైనం స్మృతి మంధన కిట్ బ్యాగ్లో దాదాపు భారీ సైజ్ బ్యాట్ ఒకటి ఉంటుంది. ప్రాక్టీస్ సమయంలో ఆమె దాన్ని కూడా తప్పనిసరిగా తీసుకొస్తుంది కానీ దాంతో బ్యాటింగ్ మాత్రం చేయదు. అది రాహుల్ ద్రవిడ్ సంతకం చేసి ఆమె అన్నకు బహుమతిగా ఇచ్చిన బ్యాట్. స్మృతి క్రికెట్ మొదలు పెట్టినప్పుడు ద్రవిడ్ అంత గొప్ప ప్లేయర్ కావాలని దీవిస్తూ సోదరుడు ఇచ్చిన ఆ బ్యాట్ ఆమెకు ఎప్పటికప్పుడు స్ఫూర్తినిస్తూ ఉంటుంది. ఒకప్పుడు స్మృతి, మ్యాథ్యూ హేడెన్లా ఆడేందుకు ప్రయత్నించింది. అలాంటి ఆటతీరు నీకు నప్పదంటూ కోచ్ చెప్పడంతో బలంకంటే టైమింగ్నే నమ్ముకుంటూ కుమార సంగక్కర శైలిని అనుకరించింది. ఆసీస్ గడ్డపై టి20 సిరీస్ గెలిచినప్పుడు స్వయంగా ప్రశంసించిన హేడెన్, సొంత శైలిని అలవర్చుకోమని చెప్పడం ఆమె ఆటను మార్చింది. బ్యాటింగ్లో యువరాజ్ను అభిమానించినా... తనదైన ప్రత్యేకత కోసం శ్రమిస్తున్న స్మృతి మంధన ఇప్పుడు భారత మహిళల క్రికెట్లో కొత్త కెరటం. సాక్షి క్రీడా విభాగం ‘పురుషుల క్రికెట్లో ఇప్పుడు 18వ నంబర్ జెర్సీకి చాలా ప్రత్యేకత ఉంది. చూస్తూ ఉండండి కొద్ది రోజుల్లోనే మహిళల 18వ నంబర్ కూడా సంచలనానికి కేంద్రంగా మారుతుంది’... ప్రపంచ కప్లో ఇంగ్లండ్తో తొలి మ్యాచ్ జరిగినప్పుడు విరాట్ కోహ్లితో పోలుస్తూ కామెంటేటర్లు చేసిన వ్యాఖ్య స్మృతికి లభిస్తున్న గుర్తింపునకు అద్దం పడుతుంది. దాదాపు ఐదు నెలల క్రితం ఆస్ట్రేలియాలోని బిగ్బాష్ లీగ్లో ఫీల్డింగ్ చేస్తూ స్మృతి మోకాలికి తీవ్ర గాయమైంది. దాంతో ఆమె వరల్డ్ కప్ క్వాలిఫయర్, దక్షిణాఫ్రికాలో నాలుగు దేశాల టోర్నీకి దూరమైంది. ఈ గాయం కెరీర్ను ముగిస్తుందేమోనని కూడా ఆమె భయపడింది. అయితే దీనినుంచి కోలుకొని మళ్లీ బరిలోకి దిగేందుకు మంధన తీవ్రంగా కష్టపడింది. బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహ్యాబిలిటేషన్ ప్రోగ్రాంలో ఆటతో పాటు ఫిట్నెస్ కోసం కూడా అదనంగా శ్రమించింది. స్వయంగా కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఆమె కోలుకోవడంపై సందేహాలు వ్యక్తం చేసినా... పట్టుదలగా తిరిగొచ్చిన స్మృతి ప్రపంచ కప్కు తన ఎంపిక సరైందేనని నిరూపించింది. నాన్న, అన్న అండగా..: మహారాష్ట్రలోని సాంగ్లి పట్టణం స్మృతి స్వస్థలం. స్మృతి సోదరుడు శ్రవణ్ మహారాష్ట్ర తరఫున అండర్–19 స్థాయి వరకు ఆడాడు. వర్ధమాన ఆటగాడిగా రాణిస్తున్న సమయంలో అతని పేరు, స్కోర్లు పదే పదే స్థానిక పత్రికల్లో రావడం ఆమెను ఆకర్షించింది. దాంతో తాను కూడా క్రికెట్ ఆడతానన్న ఆమె కోరికను తండ్రి శ్రీనివాస్ కాదనలేదు. అయితే సాధారణంగా కుడి చేతి వాటమే అయినా... తండ్రికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్పై మక్కువ ఉండటంతో అలా ఆమె ఎడమచేతి వాటంగా మారింది. స్థానిక కోచ్ అనంత్ వద్ద ఆటను మెరుగుపర్చుకున్న స్మృతి 9 ఏళ్ల వయసులో మహారాష్ట్ర అండర్–15 జట్టులో, 11 ఏళ్ల వయసులో అండర్–19 జట్టులోకి ఎంపిక కావడం విశేషం. సైన్స్ చదవడం తనకు ఇష్టమని చెప్పినా... ఆటపైనే దృష్టి పెట్టమంటూ తల్లి స్మిత ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె దూసుకుపోయింది. దేశవాళీ అండర్–19 వన్డేల్లో గుజరాత్పై 224 నాటౌట్తో పాటు మరో మూడు సెంచరీలు చేయడం స్మృతి సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. అనంతరం చాలెంజర్ టోర్నీకి, ఆపై భారత సీనియర్ జట్టుకు ఎంపిక కావడం చకచకా జరిగిపోయాయి. మెరుపు బ్యాటింగ్..: 16 ఏళ్ల వయసులో స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో స్మృతి తొలిసారి భారత్కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తర్వాతి సంవత్సరం వార్మ్స్లీలో ఇంగ్లండ్పై చారిత్రక టెస్టు విజయం సాధించిన భారత జట్టులో స్మృతి సభ్యురాలు. ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన ఎనిమిది మందిలో ఈమె కూడా ఉంది. రెండో ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీ సాధించి గెలుపులో కీలక పాత్ర కూడా పోషించింది. ఏడాదిన్నర క్రితం హోబర్ట్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 109 బంతుల్లో 102 పరుగులు సాధించిన మ్యాచ్ ఆమె కెరీర్లో చెప్పుకోదగ్గ క్షణం. ఈ మ్యాచ్లో ఆసీస్ బౌలర్లపై చెలరేగిన తీరు ఆమెకు ఉమెన్ బిగ్బాష్ లీగ్లో అవకాశాన్ని కల్పించింది. ‘స్మృతిలో నేను గమనించిన లక్షణం ఆమె దూకుడు. ఒక్కసారి తాను గట్టిగా నిర్ణయించుకుంటే ఏ సవాల్కైనా సిద్ధంగా ఉంటుంది. అది ఎలాంటిదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా వంద శాతం శ్రమిస్తూ ఏటికి ఎదురీది వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. లేదంటే హోబర్ట్లాంటి ఇన్నింగ్స్ అందరికీ సాధ్యం కాదు’ అని ఆమెపై భారత జట్టు మాజీ కోచ్ పూర్ణిమా రావు ప్రశంసలు కురిపించారు. రెండు ఇన్నింగ్స్లతోనే ఆగిపోను, ప్రపంచకప్ గెలవడమే లక్ష్యం అంటున్న స్మృతి మంధన మున్ముందు బ్యాట్స్మన్గా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అది మాత్రమే మారింది... ఈ నెల 18తో 21 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న స్మృతి, సాంగ్లిలోనే కామర్స్లో రెండో ఏడాది డిగ్రీ చదువుతోంది. ప్రపంచ కప్కు ముందు వరకు ఆమె కంటి సమస్యతో బాధ పడింది. ఫలితంగా కెరీర్ ఆరంభం నుంచి కళ్లద్దాలు ధరించే ఆమె బ్యాటింగ్ చేస్తూ వచ్చింది. అది ఆటకు అడ్డుగా మారకున్నా... దీనికి ఫుల్స్టాప్ పెట్టాలని స్మృతి భావించింది. మోకాలి గాయంతో కోలుకుంటున్న సమయంలోనే కంటికి శస్త్రచికిత్స చేయించుకొని ఇప్పుడు కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగింది. ‘వేటాడే పులి తరహాలో బ్యాటింగ్ సమయంలో ఆమె కళ్లలో అప్పుడూ, ఇప్పుడూ కూడా అదే తీవ్రత, ఏకాగ్రత ఉంది. కళ్ల జోడు లేకపోవడం ఒక్కటే మార్పు. మిగతాదంతా సేమ్ టు సేమ్’ అని ఆమె సహచరులు స్మృతి గురించి ఇప్పుడు చెబుతున్నారు.