Vaikunta Ekadasi
-
వైకుంఠ ఏకాదశి.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభా
-
తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ రోజుతో 7 రోజుగా కొనసాగనుంది. నిన్న వైకుంఠ ద్వార దర్శనంలో 58,415 మంది భక్తులు దర్శించుకున్నారు.18,557 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.55 కోట్లు ఆదాయం వచ్చింది. ఆరు రోజుల్లో 3,95,983 మంది తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఆరు రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం 25.82 కోట్లు. ఈ వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 1 వరకు పది రోజులపాటు కొనసాగనున్నాయి. -
Vaikunta Ekadasi: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (ఫొటోలు)
-
Vaikunta Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి.. అశేష భక్త జనం నడుమ స్వర్ణరథంపై తిరుమలేశుడు (ఫొటోలు)
-
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. భక్త జనసందోహం (ఫొటోలు)
-
Tirumala Vaikunta Ekadasi Pics: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారి దర్శనం కోసం భక్త జనసందోహం (ఫొటోలు)
-
వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
తిరుపతి/హైదరాబాద్, సాక్షి: వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి నేడు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. ఏపీలో వైష్ణవ ఆలయాలకు వేకువ ఝామునే భక్తులు క్యూ కట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. గోవిందా నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక.. వీఐపీల తాకిడి వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో.. తిరుమలకు వీఐపీల తాకిడి నెలకొంది. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎస్.ఎల్. భట్టి, జస్టిస్ శ్యామ్ సుందర్, జస్టిస్ తారాల రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్లు విచ్చేశారు. అలాగే.. ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. ఇవాళ ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణలో.. మరోవైపు తెలంగాణలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. -
డిసెంబరు 22 నుండి వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డిసెంబరు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు మంజూరు చేస్తామని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. కౌంటర్లను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్పి హైస్కూల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కౌంటర్లలో 4 లక్షలకు పైగా సర్వదర్శనం టోకెన్ల కోటా పూర్తయ్యేవరకు మంజూరు చేస్తామని వెల్లడించారు. కౌంటర్ల వద్ద ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారం, టీ, కాఫీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటలు ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామన్నారు. దర్శన టోకెన్లు ఉన్నవారిని మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లవచ్చు గానీ దర్శనానికి అనుమతించబడరని, ఈ విషయాలను కౌంటర్ల వద్ద అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు. తిరుపతిలోని అన్ని కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని, త్వద్వారా భక్తులు ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లకు సులువుగా చేరుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల సమాచారం తెలుసుకుని ప్రణాళిక ప్రకారం తిరుమలకు వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రులుకావాలని కోరారు. జేఈవో వెంట ఎస్ఈలు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ సుబ్రమణ్యం, ఐటి జిఎం శ్రీ సందీప్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్కుమార్, ఎవిఎస్వో శ్రీ నారాయణ తదితరులు ఉన్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ కట్టడికి టీటీడీ కొత్త ఆలోచన
-
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేసిన టీటీడీ
-
తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్లు పంపిణీ
-
వైకుంఠ ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శనాలు
-
గుంటూరు: మంగళగిరి పట్టణంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
ఉత్తరద్వార దర్శనం చేసుకుంటున్న ఉత్తరాంధ్ర జిల్లావాసులు
-
ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
-
భద్రాచలం సీతారాముల సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు (ఫొటోలు)
-
తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి తిరుమల ముస్తాబు
తిరుమల: భూలోక వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రంలో పది రోజులపాటు జరగనున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వైకుంఠ ద్వార దర్శనం నిమిత్తం భక్తులకు టీటీడీ సకల ఏర్పాట్లూ పూర్తిచేసింది. సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకున్నట్లు టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. \ వైకుంఠ ద్వార దర్శనం పురస్కరించుకుని తిరుమలలో 10 రోజుల ఉత్సవాల గురించి ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సర్వం సిద్ధమయ్యాయి. సోమవారం వేకువజామున ఒంటి గంట 45 నిమిషాల నుంచి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభిస్తాం. అనంతరం ఉ.6 గంటల నుంచి సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయి. ఈనెల 11వరకు 10 రోజుల పాటు జరిగే ఈ దర్శనాలు కొనసాగుతాయి. సామాన్య భక్తులకే ప్రాధాన్యత.. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో దాదాపు 94 కౌంటర్లను ఏర్పాటుచేసి టికెట్లు జారీచేస్తున్నాం. భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించడం కోసమే ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాం. టికెట్ కలిగిన భక్తులు నిర్దేశిత సమయం ప్రకారం తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్ట్ చేసుకోవాలి. రెండు లక్షలకు పైగా రూ.300ల ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేశాం. మహాలఘు దర్శనం కోసం రోజూ 2,000 శ్రీవాణి టికెట్లను కూడా మంజూరు చేశాం. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో సిఫారసు లేఖలు రద్దుచేశాం. తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. రెండు మూడు తేదీల్లో కూడా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ప్రముఖులకు మాత్రమే దర్శనం కేటాయిస్తాం. ఇక తిరుమలలో వసతి గృహాలు పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు కూడా తిరుపతిలో ఉండి దర్శనానికి కేటాయించిన సమయం ప్రకారమే తిరుమలకి రావాలి. మూడు లక్షల 50 వేల లడ్డూల బఫర్ స్టాక్ ఉంచాం. అలాగే, రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పేదలు, గిరిజనులకు రోజూ వెయ్యి మందికి దర్శనం చేయిస్తాం. నిరంతరం అన్నప్రసాదం ఇక భక్తుల సౌకర్యార్థం అన్నదాన భవనంలో 10 రోజులు పాటు ఉ.6 నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు నిరంతరం అన్నప్రసాద వితరణ చేస్తాం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లలో ఇతర ప్రాంతాల్లో వేచి ఉన్న భక్తులకు కూడా టీ, కాఫీ, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తాం. ఏకాదశి సందర్భంగా రేపటి నుంచి పీఎస్సీ–4లో అన్నప్రసాద వితరణ ప్రారంభిస్తాం. ఇక వైకుంఠ ఏకాదశి రోజున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా రెండువేల మందితో భద్రత కల్పిస్తున్నాం. శ్రీవారి సేవకులు 3,500 మంది కూడా సేవలందిస్తారు. మాస్క్ తప్పనిసరి కోవిడ్ మళ్లీ వ్యాప్తిచెందుతుందన్న భయాందోళన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. తిరుమలలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సప్తగిరులను దాదా 12టన్నుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాం. ఆలయం వెలుపల వైకుంఠ ద్వారాలతో శ్రీవారి నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటుచేశాం. -
వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు
-
వైభవంగా వైకుంఠ ఏకాదశి
తిరుమల/చంద్రగిరి: ఇల వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముక్కోటి దేవతలు వెంటరాగా మలయప్ప దివి నుంచి భూవైకుంఠానికి వేంచేయడంతో సప్తగిరులు పులకించాయి. వైకుంఠం నుంచి వచ్చిన స్వామి దర్శనానికి ఉత్తరద్వారం స్వాగతం పలికింది. సుప్రీంకోర్టు సీజే దంపతులు, వివిధ రాష్ట్రాల హైకోర్టు సీజేలు, సుమారు 40 మంది జడ్జీలు, వీఐపీలు వేంకటేశ్వరుడిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. తిరుమలేశుని దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధన అనంతరం అర్చకులు వైకుంఠ ఏకాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైకుంఠ ద్వారాలను తెరిచి పూజలు చేశారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే ఈ ద్వారాలను తెరవడం ఆనవాయితీ. అయితే వరుసగా రెండోసారి కూడా పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నారు. సామాన్య భక్తులకు సైతం గంట ముందుగానే 7.35 గంటలకే సర్వదర్శనం ప్రారంభించారు. సామాన్యులు సైతం దేవదేవుడిని కనులారా వీక్షించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా దేవదేవుడు స్వర్ణరథాన్ని అధిరోహించి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులందరూ దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం తిరుమలలో శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగుతున్న సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వర్ణ రథం లాగిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముక్కోటి ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్.జవహర్రెడ్డి, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. జస్టిస్ రమణ దంపతులు వైకుంఠ ద్వారం నుంచి వెళ్లి శ్రీవారి మూల మూర్తిని దర్శించుకున్నారు. అర్చకుల ఆశీర్వాదం అనంతరం టీటీడీ చైర్మన్ తీర్థప్రసాదాలను అందించారు. సీజేతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్, ఈవో స్వాగతం పలికి వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వదించగా టీటీడీ చైర్మన్, ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు శ్రీవారి స్వర్ణరథ సేవలో పాల్గొని కొంతసేపు రథాన్ని లాగారు. ఆ తర్వాత వారు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతురాజ్ అవస్థి దంపతులు కూడా అమ్మ వారిని దర్శించుకున్నారు. తిరుమలకు తరలివచ్చిన వీఐపీలు తిరుమల శ్రీవారిని ఆలయ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు గౌతమ్రెడ్డి, గుమ్మనూరి జయరామ్, వెలంపల్లి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణు, ఆదిమూలపు సురేష్, బాలినేని, రంగనాథరాజు, ఎంపీలు భరత్, కొత్త ప్రభాకర్, వెంకటేష్, సత్యవతి, గురుమూర్తి, ఎం.వి.వి.సత్యనారాయణ, శ్రీకృష్ణదేవరాయలు, గోరంట్ల మాధవ్, వేమిరెడ్డి, ఎమ్మెల్యే రోజా, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీటీడీ చెన్నై, న్యూఢిల్లీ స్థానిక సలహా మండళ్ల అధ్యక్షులు శేఖర్రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, బోర్డు సభ్యులు పోకల అశోక్కుమార్, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి దర్శించుకున్నారు. నేడు చక్రస్నానం వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య చక్రస్నాన మహోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, కర్ణాటక హైకోర్టు సీజేలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా దంపతులు, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతురాజ్ అవస్థి దంపతులు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ రమేష్, జస్టిస్ ప్రవీణ్కుమార్, జస్టిస్ విజయలక్ష్మి, త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్, తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోవిందరాజన్, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు సీజే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ గురువారం ఉదయం వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం హైకోర్టు సీజే, మంత్రి తలసాని కుటుంబ సభ్యులు వేర్వేరుగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి హరీష్రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, భాజపా నాయకురాలు డీకే అరుణలు శ్రీవారిని దర్శించుకున్నారు. -
Vaikunta Ekadasi 2022 : శ్రీవారి సేవలో పెద్దఎత్తున ప్రముఖులు
-
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి.. శ్రీవారి సేవలో ప్రముఖులు
-
నల్గొండలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
స్వర్గాన్ని తలపిస్తోన్న తిరుమల
-
వైకుంఠవాసా.. నమో తిరుమలేశా!
ఉదయం: 4 గంటలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా, కర్ణాటక సీజే రితురాజ్ అవస్థి, త్రిపురా హైకోర్టు సీజే జస్టిస్ అమర్నాథ్ గౌడ్, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాధ్ రాజు, మంత్రి గౌతమ్ రెడ్డి, కార్మిక శాఖమంత్రి గుమ్మనూరి జయరామ్, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, అప్పల్ రాజు, అనీల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్యేలు రోజా, సంజీవయ్య, ఎంపీలు మార్గాని భారత్, కొత్త ప్రభాకర్, వెంకటేష్, సత్యవతి, గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ మంత్రి సునీత లక్ష్మా రెడ్డి, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ఉమేష్ లలిత్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్చంద్రశర్మ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం బుధవారం రాత్రి తిరుమల చేరుకున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. తిరుమల/సాక్షి, అమరావతి: వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినానికి తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దాదాపు 12 టన్నుల పుష్ప తోరణాలు, వివిధ రకాల పండ్లతో శ్రీవారి ఆలయం, అనుబంధ ఆలయాలు, పరిసరాలను శోభాయమానంగా అలంకరించారు. వైకుంఠాన్ని తలపించేలా విద్యుద్దీప కాంతులతో తిరుమల ప్రకాశిస్తోంది. వైకుంఠద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ఉమేష్ లలిత్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్చంద్రశర్మ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి తిరుమల చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి తరువాత 1.45 గంటల నుంచి.. బుధవారం అర్ధరాత్రి తరువాత 1.45 గంటల నుంచి ఆలయంలోని వైకుంఠద్వారాలు (ఉత్తర ద్వారాలు) తెరుచుకోనున్నాయి. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ 10 రోజులపాటు భక్తులకు ఉత్తరద్వారం నుంచి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం వేకువన తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాన్ని నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు సహస్ర దీపాలంకరణ సేవ జరగనుంది. అనంతరం స్వామి ఉభయ దేవేరులతో కలిసి తిరుచ్చిపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. శుక్రవారం ద్వాదశి రోజున ఏకాంతంగా చక్రస్నానం నిర్వహిస్తారు. ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీచక్రత్తాళ్వారును మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం వద్ద కొలువుదీర్చి విశేష పూజలు చేస్తారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. కోవిడ్ నిబంధనల మేరకు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించడం లేదని టీటీడీ ప్రకటించింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పుష్పాలతో అలంకరించిన శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం శ్రీవారి ఏకాంతసేవలో సుప్రీంకోర్టు సీజే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బుధవారం రాత్రి తిరుమల శ్రీవారిని ఏకాంతసేవలో దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమలకు చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద పుష్పగుచ్ఛంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి తదితరులు స్వాగతం పలికారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా తదితరులున్నారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో జస్టిస్ ఎన్వీ రమణకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, కలెక్టర్ హరినారాయణన్, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి స్వాగతం పలికారు. పద్మావతి అతిథి గృహంలో జస్టిస్ ఎన్వీ రమణతో మాట్లాడుతున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ,ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వైష్ణవాలయాలు ముస్తాబు ముక్కోటి ఏకాదశి వేడుకలకు రాష్ట్రంలోని వైష్ణవాలయాలన్నీ ముస్తాబయ్యాయి. శ్రీవేంకటేశ్వరస్వామి, లక్ష్మీనరసింహస్వామి తదితర వైష్ణవ సంప్రదాయ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశిని పెద్ద పండుగగా నిర్వహించడం సంప్రదాయం. అన్ని వైష్ణవ ఆలయాల్లోను గురువారం వేకువజాము నుంచి ఉత్తరద్వార దర్శనాలకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుమలతోపాటు ద్వారకా తిరుమల, సింహాచలం, వేదాద్రి, అంతర్వేది, అప్పనపల్లి, నరసాపురంలోని జగన్నాథస్వామి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
స్వర్గంలో నడిచినట్టు ఉంది: ఎమ్మెల్యే రోజా
సాక్షి, తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరి ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ద్వారంలో నడవటం స్వర్గంలో నడిచిన అనుభూతి కలిగిందని అన్నారు. రాబోయే 2021లో అందరి కష్టాలు తీరి శుభం కలగాలని కోరుకున్నాని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, సీఎం వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో ఉండి 30 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా దీవెనలు ఇవ్వాలని ప్రార్ధించామని రోజా చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపైన ఆమె విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు చిన్న మెదడు చిట్లినట్టు ఉందని, అందుకే అర్థం లేని వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. భక్తులపై లాఠీ చార్జీ టీటీడీ ఎన్నడూ చేయలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. టీటీడీ ఏర్పాట్లు చాలా బాగున్నాయని, కోవిడ్ నిబంధనలు పాటిస్లూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తోందని ప్రశంసించారు. -
25న యాదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వా మి ఆలయంతో పాటు అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి (పాతగుట్ట) లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 25న వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి వేడుకను కోవిడ్–19 నిబంధనలతో నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి మంగళవారం తెలిపారు. బాలాలయాన్ని ముక్కోటి ఏకాదశిన ఉదయం 3గంటలకు తెరిచి, ఉదయం 6.43 గంటలకు వైకుంఠద్వార దర్శనం కల్పిస్తామన్నారు. ఉదయం 6.43 నుంచి 9.30 గంటల వరకు వైకుంఠద్వార దర్శనంతోపాటు ఉదయ దర్శనాలు కల్పించనున్నట్లు ఈవో వెల్లడించారు. పాతగుట్ట ఆలయాన్ని ఉదయం 4 గంటలకు తెరిచి, 6.43 గంటలకు ఉత్తర ద్వారదర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. అదేరోజు నుంచి బాలాలయంలో 30వ తేదీ వరకు అధ్యయనోత్సవాలను నిర్వహిస్తామన్నారు. బలరాముడిగా భద్రాద్రి రామయ్య భద్రాచలంటౌన్: భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు మంగళవారం బలరామావతారంలో దర్శనమిచ్చారు. స్వామివారిని అందంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలతో స్వామివారిని చిత్రకూట మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక వేదికపై ఆసీనున్ని చేసి పూజలు నిర్వహించారు. బలరామ అవతారంలో ఉన్న రామచంద్రున్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముక్కోటి అలంకరణ: ముక్కోటి ఏకాదశి వేడుకలకు భద్రాద్రి రామాలయం ముస్తాబైంది. వైకుంఠ అధ్యయనోత్సవాల్లో భాగం గా నిత్య పూజలతోపాటు రామయ్యను వివి ధ రూపాల్లో అలంకరిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రామాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. -
ముక్కోటి ఏకాదశి.. భక్తకోటి పరవశించి!
తిరుమల/ సింహాచలం (విశాఖపట్నం)/ శ్రీశైలం(కర్నూలు)/ కదిరి(అనంతపురం)/ నెల్లిమర్ల రూరల్ (విజయనగరం)/ మంగళగిరి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని భక్తకోటి పరవశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తుల కోలాహలం మొదలైంది. తిరుమలలో వైకుంఠ మహాద్వార దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమాడ వీధుల్లో, నారాయణగిరి తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేనివిధంగా క్యూల్లోనూ, తాత్కాలిక షెడ్లలోనూ చలి తీవ్రత తట్టుకొనేందు దుప్పట్లను పంపిణీ చేశారు. ఒకసారి 80 వేల మందికిపైగా అన్న పానీయాలు వితరణ చేసేలా టీటీడీ అన్నదాన విభాగం కృషి చేసింది. వీఐపీలు తరలి వచ్చారు. అదనపు ఈవో ధర్మారెడ్డి ఆదేశాలతో భారీగా వచ్చిన దరఖాస్తులను కుదించి 3,500 టికెట్లు జారీ చేశారు. వారికి 1.30 గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పించి ముగించేసి సామాన్య భక్తులకు దర్శనం కల్పించారు. సప్తగిరీశుడు స్వర్ణ రథంపై ఊరేగింపు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణకాంతులతో భక్తులకు అభయ ప్రదానం చేశారు. కలియుగంలో రాజాధిరాజులకు కూడా రాజును తానే అంటూ భక్తులకు తెలియచెప్పడానికి స్వర్ణరథంపై అధిరోహించి తిరువీధుల్లో ఊరేగారు. ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన మల్లన్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైలంలో సోమవారం మల్లికార్జునస్వామి దేవేరి భ్రామరితో కలిసి ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. ప్రాతఃకాల పూజలనంతరం స్వామివార్ల గర్భాలయ ఉత్తరద్వారంలో ఉత్సవమూర్తులను వేంచేయింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. మల్లన్న ఆర్జిత కల్యాణాలు రద్దు కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 12 నుంచి 18 వరకు జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్ల ఆర్జిత, శాశ్వత కల్యాణాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. పోటెత్తిన కదిరి అనంతపురం జిల్లా కదిరిలో కొలువైన ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సోమవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు తమ ఇలవేల్పు దేవుడు లక్ష్మీ నారసింహుని ఉత్తర గోపురం ద్వారా దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక సిరి.. రామగిరి విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి ఉత్తర ద్వారదర్శనం, గిరి ప్రదక్షిణలకు ఉత్తరాంధ్ర జిల్లాల భక్తులు పోటెత్తారు. మంగళగిరిలో పోటెత్తిన భక్తులు మంగళగిరిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని సోమవారం దాదాపు లక్ష మందికి పైగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామి వారు బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, శివక్షేత్ర శివస్వామి తదితరులు స్వామిని దర్శించుకున్నారు. సింహగిరిపై ముక్కోటి ఏకాదశి సింహాచలంలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఘనంగా జరిగింది. సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడై ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠవాసుడిగా శేషతల్పంపై భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4.45 గంటల నుంచి ఉదయం 11.15 గంటల వరకు ఉత్తరద్వారంలో స్వామివారి దర్శనం కల్పించారు. సింహాచలం క్షేత్రం మహా పుణ్యక్షేత్రమని, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఉత్తరద్వారంలో దర్శించుకోవడం ఆనందంగా ఉందని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే.మహేశ్వరి తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన శ్రీకాళహస్తి చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ శ్యాంప్రసాద్, జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ వెంకటరమణలు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. చెంగాళమ్మ సేవలో హైకోర్టు చీఫ్ జస్టిస్ సూళ్లూరుపేట: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి దంపతులు, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జీవీ కృష్ణయ్య, హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ ఎస్వీఎస్ఆర్ మూర్తి సోమవారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి శోభ
-
శ్రీవారి సన్నిధిలో ప్రముఖులు
-
వైకుంఠ ఏకదశిపై టీటీడీ ఏర్పాట్లు బాగున్నాయి: వెల్లంపల్లి
-
వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు
కలియుగ వైకుంఠం తిరుమల వైకుంఠ ఏకాదశికి సిద్ధమైంది. సోమవారం వైకుంఠ ఏకాదశి, మంగళవారం ద్వాదశి దర్శనాలకు లక్షలాదిగా విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సోమవారం వేకువజామున శ్రీవారికి ఏకాంతంగా పూజాది కైంకర్యాలు నిర్వహించిన అనంతరం 2 గంటలకే దర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏటా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్యులు, వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వైకుంఠ ఏకాదశికి టీటీడీ భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు, వసతులపై ప్రత్యేక కథనం.. సాక్షి, తిరుమల: భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడు వెలసి ఉన్న పుణ్యక్షేత్రం తిరుమల కొండ. ఇలవైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. వైకుంఠ ద్వారం ద్వారా వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహావిష్ణువుకు ఏకాదశి, ద్వాదశి అతి ముఖ్యమైనవి. ధనుర్మాస నెలలో వచ్చే ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో దేవతల ద్వారంగా పేర్కొనే ఉత్తర ద్వారాన్ని వైష్ణవ ఆలయాల్లో తెరిచి ఉంచుతారు. ఆ రోజున స్వామివారు ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా వెలుపలికి వచ్చి భక్తులకు దర్శమిస్తారు. ఇదే సమయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో వైకుంఠ ద్వారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. వైకుంఠద్వార ప్రవేశంతో పాటు స్వామివారి గర్భాలయ ప్రాకారాన్ని స్పృశించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమిస్తారు. ద్వాదశి పర్వదినాన వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశి నాడు ముల్లోకాలలో ఉన్న పుణ్య నదులన్నీ స్వామివారి పుష్కరిణిలో కలుస్తాయని వరాహ పురాణం చెబుతోంది. ఆరోజు పుష్కరిణిలో స్నానమాచరిస్తే పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. సర్వాంగ సుందరం.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దాదాపు 12టన్నుల పుష్పాలతో ఆలయం, అనుబంధ ఆలయాలను పరిమళభరిత పుష్పతోరణాలు, పలు రకాల పండ్ల తోరణాలతో శోభాయమానంగా అలంకరిస్తున్నారు. ఇల వైకుంఠాన్ని తలపించేలా విద్యుద్దీపాలంకరణలతో కొండ ప్రకాశిస్తోంది. ప్రధాన రహదారులన్నీ విద్యుత్ వెలుగులతో దేదీప్యమానంగా దర్శనమిస్తున్నాయి. వైకుంఠ ద్వారాలతో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గోవిందమాల భక్తులు ఇరుముడులను చెల్లించేందుకు ఆలయం వెలుపల హుండీలను ఏర్పాటు చేశారు. వాహన మండపంలో శ్రీదేవి,భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. పటిష్ట బందోబస్తు వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2500 మంది సిబ్బందితో బందోబస్తుకు నియమించారు.మరో 200మంది స్పెషల్ పార్టీ పోలీసులతో ప్రముఖులకు బందోబస్తును కల్పిస్తున్నారు. ఘాట్ రోడ్లలో నిరంతరాయంగా కూంబింగ్ నిర్వహించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. దొంగతనాలను ఆరికట్టడానికి ప్రత్యేకంగా స్పెషల్ క్రైం టీంలను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిరంతరం సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేయనున్నారు. 4 రోజులు ఆర్జిత సేవలు రద్దు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు, టైమ్స్లాట్, దివ్యదర్శనాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. ద్వాదశి నాడు మాత్రం 2,500 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఇప్పటికే ఆన్లైన్లో భక్తులకు కేటాయించింది. ఈ రెండు రోజుల్లో కేవలం సర్వదర్శనం ద్వారానే భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. పూజాది కార్యక్రమాలు, నైవేద్యం, విశ్రాంతి, ప్రముఖుల దర్శనాలను మినహాయిస్తే దాదాపు 43గంటల పాటు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తుడికి దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వీఐపీలు నేరుగా వస్తేనే పాసులు వీఐపీల కోసం ప్రత్యేకంగా పద్మావతి అతిథి గృహం ప్రాంతంలోని రామరాజు, సీతా నిలయం వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడే వసతి, దర్శన పాసులను జారీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తేనే 6 టిక్కెట్లు, అధికారులకు 4టిక్కెట్లను జారీ చేయనున్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఇప్పటికే దాదాపు 20 మందికి పైగా న్యాయమూర్తులతో పాటు 20మంది మంత్రులు, దాదాపు 150మందికి పైగా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నట్లు టీటీడీకి సమాచారం అందింది. సర్వదర్శనం ఇలా.. సర్వదర్శనం క్యూకు సంబంధించి ఎంబీసీ 26 వద్ద నుంచి ప్రవేశించే భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వదులుతారు. క్యూ కాంప్లెక్స్ 1,2లోని 60 కంపార్ట్మెంట్లలో దాదాపు 30 వేల మంది భక్తులు వేచి ఉండే అవకాశం ఉంది. నారాయణగిరి ఉద్యానవనం, కల్యాణవేదిక కలిపి మొత్తం 85వేలమంది భక్తులు కూర్చునేలా షెడ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శనానికి ముందు రోజు నుంచే భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. 5వ తేదీ ఉదయం నుంచే వీరిని కంపార్ట్మెంట్లలోకి వదులుతారు. వీరికి శ్రీవారి దర్శనం భాగ్యం 6 తేదీ ఉదయం 5గంటల నుంచి ప్రారంభం అవుతుంది. -
కమనీయం.. రమణీయం!
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అన్ని ఆలయాల్లోనూ అంగరంగ వైభవంగా జరిగాయి. భద్రగిరిలో శ్రీసీతారామచంద్రస్వామి వారు మంగళవారం ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మనోహర దృశ్యాన్ని చూసిన భక్తులు పులకించిపోయారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఉత్తర ద్వారం వద్ద స్వామివారిని భక్తులు దర్శించుకోవడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోటిలింగాల వద్ద ప్రత్యేక ప్రాకారం ఏర్పాటు చేశారు. అలాగే.. జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని వైకుంఠ ద్వారం ఎదురుగా పుష్పవేదికపై శ్రీలక్ష్మీనృసింహస్వాములైన యోగా, ఉగ్ర, వెంకటేశ్వరస్వాములను ఆసీనులను చేశారు. అటు ఏపీలోని తిరుమలలో ఉదయం శ్రీదేవి,భూదేవి సమేత మలయప్పస్వామి సువర్ణకాంతులతో భక్తులకు అభయ ప్రధానం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మాజీ ప్రధాని దేవెగౌడ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ.రమణ, జస్టిస్ శాంతన్ గండర్, జస్టిస్ ఇందూ మల్హోత్ర, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీతారామమూర్తి, çహ్యూమన్ రైట్స్ కమిషనర్ జస్టిస్ మీనా కుమారి, ఇస్రో చైర్మన్ శివన్, కర్ణాటక సీఎం కుమార స్వామి, ఆయన సోదరుడు రేవన్న, తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభారావు, టీఆర్ఎస్ ఎమ్మె ల్యే హరీష్రావు తదితరులు మంగళవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకున్నారు. -
రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనం
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తిరుమలలో విపరీతంగా భక్తుల రద్దీ పెరిగిందని, భక్తులందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించామని తిరుమల జేఈఓ కేఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో గల క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం జేఈఓ మీడియాతో మాట్లాడారు. ఏకాదశిలో విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఏకాదశి, వైకుంఠద్వార దర్శనానికి తమ అంచనాలకు మించి 40 వేల మంది భక్తులు అదనంగా క్యూలో వేచి ఉన్నారని తెలిపారు. క్యూలు 4 కిలోమీటర్ల మేర విస్తరించాయని, ఔటర్ రింగ్రోడ్డులో మరో 2 కిలోమీటర్ల క్యూ పెరిగిందని వివరించారు. సాధారణంగా తిరుమలలో ఈనెల సంవత్సరాంతపు రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈసారి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల వల్ల రద్దీ రెండింతలైందని తెలిపారు. వైకుంఠ ఏకాదశిరోజు 74,012 మంది, ద్వాదశిరోజు సాయంత్రం 7 గంటల వరకు 75,658 మంది కిలిపి రెండు రోజుల్లో దాదాపు 1.5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. మరికొన్ని గంటలో వైకుంఠ ద్వార దర్శనం ముగియనుందని, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో రికార్డు స్థాయిలో 20 వేల మందికి అదనంగా దర్శనం చేయిం చామని వెల్లడించారు. భక్తుల రద్దీకి తగ్గట్టు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది విశేషంగా సేవలందించారని జేఈఓ కొనియాడారు. బయటి క్యూలను క్రమబద్ధీకరించేందుకు తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతి, ఇతర పోలీసు సిబ్బంది బాగా కష్టపడ్డారని వారిని అభినందించారు. నూతన ఆంగ్ల సంవత్సరం ఏర్పాట్లపై మాట్లాడుతూ జనవరి 1న ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేవన్నారు. జనవరి 1న సోమవారం వేకువజామున 2 గంటలకు ధనుర్మాస కైంకర్యాలు, తిరుప్పావై అనంతరం 2.30 నుంచి 5.30 గంటలకు వరకు సర్వదర్శనం ఉంటుం దని తెలిపారు. నైవేద్య విరామం అనంతరం ఉదయం 6 గంటల నుంచి పరిమిత సంఖ్యలో ప్రోటోకాల్ ప్రముఖులకు బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. ఆ తర్వాత ఎలాంటి అంతరాయం లేకుండా సర్వదర్శనం కొనసాగుతుందని తెలిపారు. జనవరి 1వ తేదీ వరకు దివ్యదర్శనం టోకెన్లు, ఆర్జితసేవలు రద్దు చేసినట్టు జేఈవో తెలిపారు. -
తిరుమలలో కిటకిట
-
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
-
నేడు వైకుంఠ ఏకాదశి
-
వైకుంఠ దర్శనం: తిరుమల కొండ కిటకిట
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలకు భక్తులు పోటెత్తారు. కంపార్ట్మెంట్లతో పాటు, టీటీడీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు భక్తులతో నిండిపోయాయి. రేపటి వైకుంఠ ద్వార దర్శనానికి ఇప్పటికే లక్షమంది భక్తులు నిరీక్షిస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీల తాకిడి పెరిగింది. రేపటికి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అందేకాకుండా కాలిబాటలో గోవిందమాల భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాగా ఏకాదశి పర్వదినాన భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సామాన్య భక్తులు, ప్రముఖులకు వేర్వేరుగా బస, దర్శన ఏర్పాట్లు చేశారు. బుధవారం అర్థరాత్రి నుంచి దివ్యదర్శనం టికెట్ల జారీని నిలిపివేశారు. సర్వదర్శనం మినహా ఐదు రోజుల పాటు దివ్యదర్శనం సహా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. కనుమ రహదారులను 24 గంటల పాటు తెరిచే ఉంచుతారు. ధనుర్మాస పూజల తర్వాత వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఏకాదశి, ద్వాదశి రెండు రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనంను కల్పించనున్నారు. రేపు ఉదయం 5 గంటల తర్వాత వీఐపీ దర్శనాలను అనుమతిస్తారు. ఉదయం 7.30 గంటల తర్వాత సర్వదర్శనం ప్రారంభం కానుంది. రెండు రోజులు పాటు 40 గంటలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కలిగేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు 30 మంది కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు 200 మందికిపైగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు రానున్నట్టు సమాచారం. ప్రముఖుల బస, దర్శన ఏర్పాట్లు మంత్రులు, రాజ్యాంగపరమైన హోదాల్లో ఉన్న వారు తిరుమలలోని పద్మావతి విచారణ కార్యాలయ పరిధిలోని వెంకటకళా నిలయానికి వెళ్లాల్సి ఉంది. ఇక్కడ ఆరుగురికి మించకుండా దర్శన టికెట్లు, 2కు మించకుండా గదులు కేటాయిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రామరాజు నిలయం, సీతా నిలయానికి వెళ్లాలి. ఆరుగురికి మించకుండా దర్శన టికెట్లు, ఒక గది మంజూరు చేస్తారు. అఖిల భారత సర్వీసు అధికారులు సన్నిధానానికి, ఇతర ఉన్నతాధికారులకు గంబుల్ విశ్రాంతి గృహానికి వెళ్లాలి. నలుగురికి మించకుండా దర్శన టికెట్లు, ఒక గదిని కేటాయిస్తారు. సామాన్య భక్తులకు బస, దర్శన ఏర్పాట్లు ఏకాదశి సందర్భంగా వచ్చే సామాన్య భక్తుల కోసం కేంద్రియ విచారణ కార్యాలయంలోని అన్ని కౌంటర్లలో గదులు కేటాయించనున్నారు. ఇక్కడ ఎలాంటి సిఫారసులు స్వీకరించరు. స్వామి దర్శనం కోసం లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. ఇందులో భాగంగానే కాలిబాట దర్శనం కూడా నిలిపివేశారు. ఒకే క్యూలైనులోనే భక్తులను అనుమతించనున్నారు. సామాన్య భక్తులకు ఎండ, వాన, చలి, మంచుకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. 42 వేల మందికి సరిపడేలా నారాయణగిరి ఉద్యాన వనాల్లో 20 తాత్కాలిక షెడ్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్–2లో 16 వేల మంది, వైకుంఠం క్యూకాంప్లెక్స్–1లో 16 వేల మంది భక్తులు ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ సారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2 నుంచి కల్యాణవేదిక వరకు 2.3 కిలోమీటర్ల నిడివిలో కొత్తక్యూలైను నిర్మించారు. తొలుత కంపార్ట్మెంట్లలోకి భక్తులను అనుమతిస్తారు. అవి నిండిన తర్వాత ఆళ్వార్ట్యాంక్, నారాయణగిరి ఉద్యానవనాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్–2, కర్ణాటక సత్రాలు, అహోబిల మఠం, ఉత్తర మాడ వీధి మీదుగా ఎ టైప్ క్వార్టర్స్, బాట గంగమ్మ గుడి వద్ద రింగ్రోడ్డు నుంచి కల్యాణవేదిక వరకు నిర్మించిన క్యూలైన్లోకి అనుమతిస్తారు. భక్తులు 24 నుంచి 30 గంటలు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది. ఇక్కడ భక్తులకు మరుగుదొడ్లతోపాటు తాగునీటి సౌకర్యం కల్పించారు. సుమారు 2 లక్షల మందికి సరిపడేలా అన్నప్రసాదాలు, మజ్జిగ, కాఫీ, టీ తదితరాలు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో అనీల్కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు ఆదేశించారు. -
వైకుంఠ ఏకాదశికి టీటీడీ భారీ ఏర్పాట్లు
-
భక్తజన వైకుంఠం
-
భక్తుల రద్దీతో తిరుమల కిటకిట
-
భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల
తిరుమల: రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల కొండ శనివారం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ లక్షమందికి పైగా భక్తులు తిరుమల చేరుకున్నారు. సాయంత్రం మరో లక్షమంది భక్తులు చేరుకునే అవకాశం ఉంది. కాగా ఉత్తర ద్వార దర్శనం కోసం వైకుంఠం-2లో ఏర్పాటు చేసిన 31 కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి బయట కిలోమీటర్ల మేర క్యూ ఏర్పడింది. చదవండి...(తిరుమల.. దివ్య దర్శనం టోకెన్ల రద్దు) దీంతో తాత్కాలికంగా మరో ఐదు కంపార్ట్మెంట్లను టీటీడీ ఏర్పాటు చేసింది. అలాగే ఏకాదశి నాడు స్వర్ణరథం, ద్వాదశి రోజున చక్రస్నానం సందర్భంగా నారాయణగిరి పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 8,9 తేదీల్లో ఆర్జిత, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. నేటి నుంచి రెండురోజుల పాటు దివ్యదర్శనం అమల్లో ఉంటుంది. అలాగే ముందస్తు గదుల బుకింగ్ను కూడా నిలిపివేసింది. -
‘వైకుంఠ’ దర్శన టికెట్ల కోసం ఒత్తిడి
టీటీడీకీ భారీగా అందుతున్న లేఖలు సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శన టికెట్ల కోసం టీటీడీపై ఒత్తిడి పెరిగింది. అతిముఖ్యమైన ఆ పర్వదినాన స్వామిని దర్శించుకునేందు కు ప్రముఖులు పోటెత్తనున్నారు. ఆ మేరకు లేఖలు అందుతున్నా పరిమిత సంఖ్యలోనే టికెట్లు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. ఈనెల 8న వైకుంఠ ఏకాదశి, 9న ద్వాదశి ఘడియల్లో మాత్రమే తిరుమల ఆలయంలోని వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారం) తెరిచి భక్తులను అనుమతిస్తారు. ప్రదక్షిణ చేసేందుకు వీఐపీ భక్తులు మరింత పోటెత్తే అవకాశం ఉందని ఇప్పటికే టీటీడీ అధికారులు అంచనాకు వచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే వందల సంఖ్యలో లేఖలు, ఫ్యాక్స్ సమాచారం, సెల్ఫోన్ సందేశాలు అందుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణకు చెందిన సుమారు 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరో 20 మంది ఎంపీలు, 200 మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, మరో 100 దాకా న్యాయవిభాగం ప్రముఖులు రానున్నారు. ఆ మేరకు వారి నుంచి వైకుంఠ దర్శనం కోసం టీటీడీకి సిఫారసు లేఖలు అందాయి. వీఐపీలు, వారి బం«ధువులు కలిపి వేల సంఖ్యలోనే తిరుమలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. టికెట్లలో భారీగా కోత రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాల్లో భారీగా కోత వేసి, ఒకరికి 6 టికెట్లు మించకుండా కేటాయింపులు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు భావిస్తున్నారు. 2014లో ఏకాదశి రోజున 2,700 టికెట్లు, 2015లో 2,800 టికెట్లు మాత్రమే కేటాయించి, వారికి వేకువజామున 3.30లోపే దర్శనం పూర్తి చేశారు. అదే విధానాన్ని ఈసారి కూడా అమలు చేయా లని యోచిస్తున్నారు. ఏకాదశిన తరలివచ్చే ప్రముఖులకు బస, దర్శనం కల్పించే విషయంలో టీటీడీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. గదుల కేటాయింపును రెవెన్యూ, రిసెప్షన్ విభాగా««ధిపతులకు అప్పగించింది. వీటిని సజావుగా నిర్వ హించేందుకు 60 మందికిపైగా సిబ్బందిని నియమించారు. 7వ తేదీ నుంచే సుమారు 3 నుంచి 4 వేల వరకు గదులు ముందస్తుగా బ్లాక్ చేయనున్నారు. -
వైకుంఠ ఏకాదశి: ఆలయాలలో భక్తుల రద్దీ
-
తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలు సోమవారం భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామి వార్లను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు క్యూ కట్టారు. ఆలయాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్: జంట నగరాల్లోని ఆలయాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. వైష్ణవాలయాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కుషాయిగూడ శ్రీ వెంకటేశ్వరస్వామి, వనస్థలిపురం శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల: కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమల భక్తులతో కిక్కిరిసింది. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తకోటి పోటెత్తింది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 62 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాయంత్రం శ్రీవారు స్వర్ణరథంపై ఊరేగనున్నారు. గుంటూరు జిల్లా: మంగళగిరిలోని శ్రీపానకాల లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. ఉదయం ఏడు గంటల సమయానికే సుమారు 40వేల మంది స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది. ద్వారక తిరుమల: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమలలో వెంకటేశ్వరస్వామి నిజరూప అవతారంలో దర్శనమిస్తున్నారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయానికి పోటెత్తారు. వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులోని శ్రీ వాసవీ కన్యాకపరమేశ్వరీ అమ్మవారిని సోమవారం 108 దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని అమ్మవారికి వజ్రపుచీర, వజ్రపు కిరీటం ధరింపజేశారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు మహాలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి, బొల్లవరం ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ నెలకొంది. నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని వైష్ణవాలయాలు భక్తజనసందోహంతో కలకలలాడుతున్నాయి. శ్రీకల్పగిరి రంగనాథస్వామి, మూలాపేటలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయాల్లో స్వామి వార్లను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. సింహాచలం: సింహాచలం కొండపై అప్పన్న శ్రీమన్నారాయణుని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు దర్శనం కోసం భారీగా క్యూ కట్టారు. కరీంనగర్ జిల్లా: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాలకు భక్తులు రద్దీ కొనసాగుతుంది. భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పవిత్ర గోదావరిలో స్నానాలు ఆచారించి స్వామి దర్శనానికి బారులు తీరారు. ఉత్తర ద్వారాన్ని అందంగా అలంకరించారు. గరుడవాహనరూడుడైన స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి: నల్లగొండ జిల్లాలోని యాదాద్రి భక్తసంద్రమైంది. క్యూలైన్లు నిండిపోగా, వెలుపల కూడా భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. -
తిరుమలకు విఐపీల తాకిడి!
-
గేట్లు విరిచి.. క్యూలైన్లోకి దూసుకెళ్లారు..
తిరుమల : ఏకాదశి దర్శనం కోసం తిరుమలలో భక్తులు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. టీటీడీ సామాన్య భక్తులను పట్టించుకోకుండా వీఐపీలకు పెద్దపీట వేస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు గురువారం ఉదయం లేపాక్షి సర్కిల్ వద్ద వీఐపీలను అడ్డుకుని నిరసన తెలిపారు. మరోవైపు వెంకన్నను ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులతో కొండ కిక్కిరిసిపోయింది. గత రాత్రి 8 గంటలకే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని లైన్లు నిండిపోయాయి. టీటీడీ అధికారులు ముందు జాగ్రత్తగా క్యూల్లోకి భక్తులను అనుమతించలేదు. దీంతో సహనం కోల్పోయిన భక్తులు శంకుమిట్ట కాటేజ్ వద్ద క్యూ గేట్లను విరిచారు. మరికొందరు రాళ్లతో తాళాలను పగుల గొట్టి, క్యూలోకి దూసుకెళ్లారు. క్యూ కట్టిన ఇనుప కంచె కూడా విరిగి కిందపడ్డాయి.క్యూలోకి దూసుకెళ్లారు. పోలీసు, భద్రతా సిబ్బంది అడ్డుచెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదు. -
2468మందికి మాత్రమే వీఐపీ దర్శనం
తిరుమల : వైకుంఠ ఏకాదశి పర్వదినం, నూతన సంవత్సరం ఒకేసారి రావడంతో... తిరుమలకు వీఐపీలు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు... ఇరు రాష్ట్ర రాజకీయవేత్తలు, ప్రముఖలు పోటీపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ రోహిణి, వైఎస్ఆర్ సీపీ నేతలు బుట్టా రేణుక, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్, డీకే అరుణ, మహేందర్ రెడ్డి, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తదితరులు వెంకన్నను దర్శించుకున్నారు. 2468మందికి మాత్రమే టీటీడీ వీఐపీ దర్శనం కల్పించింది. అనంతరం రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
తిరుమలలో భక్తుల ఆందోళన
-
వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం.. తిరుమలలో ఆందోళన
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తులు బుధవారం నుంచే పోటెత్తారు. గురువారం.. కొత్త సంవత్సరం.. జనవరి ఒకటో తేదీ.. వైకుంఠ ఏకాదశి అన్నీ కలిసి రావడంతో సామాన్య భక్తులు, వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. తమను బుధవారం ఉదయం నుంచే వైకుంఠ ఏకాదశి దర్శనానికి అనుమతించాలని భక్తులు తిరుమలలోని సీజీసీ వద్ద ఆందోళనకు దిగారు. అయితే.. బుధవారం సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే భక్తులను వైకుంఠ ఏకాదశి దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. దాంతో అధికారులకు, భక్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. -
రేపటి దర్శనం కోసం.. తిరుమలలోఆందోళన
-
ముందు వచ్చిన ఎమ్మెల్యేలకే వెంకన్న దర్శనం
తిరుమల: వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు బుధవారం తిరుమలలో వెల్లడించారు. ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే మంత్రులు, ఎంపీలు, ఇతర వీఐపీలకు గదులు కేటాయించినట్లు తెలిపారు. అయితే వెంకన్నను దర్శించుకునేందుకు మొదట వచ్చే ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎంబీసీ, కౌస్తభం, టీబీ సెంటర్ కేంద్రాలను మూసివేస్తన్నట్లు చెప్పారు. కానీ సామాన్య భక్తుల కోసం సీఆర్ఓ కేంద్రం మాత్రం తెరచి ఉంటుందన్నారు. వారికి అక్కడ గదులు దొరకకపోతే షెల్టర్స్లో సదుపాయం కల్పిస్తామన్నారు. జనవరి 2వ తేదీ ద్వాదశి రోజు దర్శనం కోసం ఆన్లైన్లో 10 వేల టికెట్లు విక్రయానికి పెట్టినట్లు శ్రీనివాసరాజు పేర్కొన్నారు. జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం వచ్చింది. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ నేపథ్యంలో భక్తులు,వీఐపీలు శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తిరుమలకు వస్తారు. దాంతో వారికి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. -
వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 5 నుంచి సర్వదర్శనం
* ఆన్లైన్లో 10 వేల టికెట్ల కేటాయింపు: టీటీడీ ఈవో తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శ నం భక్తులను స్వామి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. జనవరి 1న వచ్చిన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఈవో వివిధ విభాగాల అధికారులతో శుక్రవారం సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 1న వేకువజామున 1.45 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. నేరుగా వచ్చిన వీఐపీతో పాటు మరో ముగ్గురికే దర్శనం కల్పిస్తామని, సిఫార్సు లేఖ లకు దర్శనాలు ఉండవన్నారు. అనుకున్నదాని కంటే ముందే సర్వదర్శనం భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తామన్నారు. ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న 10 వేల మంది భక్తులకు ద్వాదశి రోజున దర్శనం ఉంటుందన్నారు. ఈ టికెట్లను ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఆన్లైన్లో కేటాయిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున 9 గంటలకు బంగారు రథం ఊరేగింపు, ద్వాదశి రోజున ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య చక్రస్నానం నిర్వహిస్తామన్నారు. రెండు పర్వదినాల సం దర్భంగా నాలుగు లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. -
వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరాలకు తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. వీఐపీలకు తెల్లవారుజామున ఒంటిగంట నుంచి 5గంటల వరకు దర్శనం కల్పిస్తామని టీటీడీ తెలిపింది. ఉదయం 5 గంటల తర్వాత సర్వదర్శనం ప్రారంభం అవుతుంది. సిఫార్సు లేఖలను ఆ రోజుకు పూర్తిగా రద్దు చేశారు. సర్వదర్శనంలో వెళ్లే భక్తులకు ఏటీసీ ప్రాంతంలో ప్రవేశమార్గాన్ని ఏర్పాటుచేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో 1.35 లక్షల మంది భక్తుల దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. వీఐపీల ఒక్కరి టికెట్టుతో ముగ్గురు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి తిరుమలకు వచ్చే భక్తుల కోసం అదనంగా 2 లక్షల లడ్డూలను సిద్ధం చేయిస్తున్నారు. ద్వాదశి నాటి కోసం 12 వేల ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఈనెల 24వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులో ఉంచుతామని టీటీడీ తెలిపింది. -
టీటీడీ ఛైర్మన్, ఈవోలపై కేసులు!
వైకుంఠ ఏకదశి రోజున ఆందోళనకు దిగిన శ్రీవారి భక్తులపై టీటీడీ అధికారులు కేసులు నమోదు చేయడంపై బీజేపీ మండిపడింది. శ్రీవారి భక్తులపై టీటీడీ అధికారులు వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు బీజేపీ నేతలు సమాయత్తమైయ్యారు. అందులో భాగంగా టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవోలపై ప్రైవేట్ కేసును దాఖలు చేయనున్నట్లు బీజేపీ నాయకులు వెల్లడించారు. వైకుంఠ ఏకదశి పర్వదినం పురస్కరించుకుని శనివారం తిరుమల భక్తులతో పోటెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీవారిని దర్శించుకునేందుకు మంత్రులు, ప్రముఖులు తదితర వీవీఐపీలకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. దాంతో శ్రీవారి దర్శనం ఆలస్యం అవుతుందంటూ సామాన్య భక్తులు ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో టీటీడీ ఛైర్మన్ కార్యాలయం వద్ద భక్తులు ఆందోళన చేపట్టారు. అయితే తిరుమలలో ఆందోళనలు నిషేధం కావటంతో ధర్నా చేసిన భక్తుల (గుర్తుతెలియని వ్యక్తుల)పై ఏవీఎస్వో గోవిందరెడ్డి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోడ్డుపై బైఠాయించి సిబ్బంది విధులకు ఆటంకం కలిగించటం, ఇతర వాహనదారులకు అసౌకర్యం కలిగించటం వంటి అభియోగాలతో తిరుమలలోని టూ టౌన్ పోలీసులు సెక్షన్-341 ప్రకారం కేసు నమోదు చేశారు. అందుకోసం ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలో ఉన్న వ్యక్తులు, టీటీడీ విజిలెన్స్ తీసిన వీడియో, ఫొటోల ఆధారంగా ఆందోళన చేసిన భక్తులను గుర్తించనున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా, హైదరాబాద్కు చెందిన పలువురిని గుర్తించినట్టు సమాచారం. -
వైకుంఠాన్ని తాకిన ఆగ్రహం
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏడుగేట్లు విరగ్గొట్టిన భక్తులు దర్శనం ఆలస్యంపై టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు సర్వదర్శనం క్యూల్లో కిక్కిరిసిన భక్తులు సాక్షి, తిరుమల : వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం, బస కోసం తిరుమలలో అష్టకష్టాలు పడిన సామాన్య భక్తులు ద్వాదశి రోజు ఏకంగా కంపార్ట్మెంట్ల గేట్లను విరిచి టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు దర్శనం ఆలస్యమవుతోందని అరుపులు కేకలు వేస్తూ రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని ఏడు కంపార్ట్మెంట్ల గేట్లను విరిచేశారు. శనివారం పోటెత్తిన భక్తుల రద్దీతో ఏకాదశి నాటి వైఫల్యాలను సవరించుకున్న టీటీడీ అధికారులు ఆదివారం ద్వాదశి రోజున సామాన్య భక్తుల దర్శనానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. కాలిబాటలో నడచివచ్చిన భక్తులు, సర్వదర్శనంలో వేచి ఉండే భక్తుల క్యూలు వేగంగా కదిలేలా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ, తమకు దర్శనం ఆలస్యమవుతోందని రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మూకుమ్మడిగా గేట్లను నెట్టివేయటంతో పాట్లాక్లు, గడియలు ఊడిపోయాయి. తొలుత 9వ నంబర్ కంపార్ట్మెంట్లో పరిస్థితి అదుపు తప్పింది. భక్తులు ఆ కంపార్ట్మెంట్ గేట్ను విరగ్గొట్టారు. ఆ తర్వాత 10, 14, 15, 22, 23, 24 .. ఇలా ఏడు కంపార్ట్మెంట్ల గేట్లను విరగ్గొట్టి తలుపులు పక్కకు తొలగించి దర్శనం కోసం పరుగులు తీశారు. దీనివల్ల పక్కనే ఉన్న ఇతర కంపార్ట్మెంట్లలోని భక్తులు కూడా అరుపులు కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని భక్తులను వారించారు. వరుస క్రమంలో కంపార్ట్మెంట్లను అనుమతిస్తున్నప్పటికీ భక్తులు కొందరు గేట్లు విరిచి ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించారని అక్కడి టీటీడీ సిబ్బంది తెలిపారు. తర్వాత విరిగిన ఏడు కంపార్ట్మెంట్ల గేట్లకు అప్పటికప్పుడే వెల్డింగ్ చేశారు. శాస్త్రోక్తంగా శ్రీవారి చక్రస్నానం వైకుంఠ ద్వాదశి పర్వదినం పురస్కరించుకుని ఆదివారం శ్రీవారి చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏడాదిలో బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు, అనంత పద్మనాభస్వామి వ్రతం, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి రోజున పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా వేకువజామున 4.30 గంటలకు సుదర్శన చక్రతాళ్వారు ఆలయం నుంచి ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ పుష్కరిణికి తరలివచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి సుదర్శన చక్రతాళ్వారుకు పవిత్ర స్నానం చేశారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. -
మంచుతెరల్లో మహిమాన్వితుడు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం ముస్తాబయ్యే తిరుమల పరిసరాలను చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. సుగంధభరిత పుష్పాలు, విద్యుద్దీపాలతో ఇలవైకుంఠాన్ని తలపించే ఆ పరిసరాలకు ఆదివారం తెల్లవారుజామున ప్రకృతి మంచు తెరలతో మరిన్ని వన్నెలద్దింది. దీంతో ఆ మంచు తెరల్లోనుంచి దేదీప్యమానంగా వెలుగుతున్న శ్రీవారి ఆలయం భక్తులను ఆనందపారవ శ్యంలో ఓలలాడించింది. శ్రీవారి పుష్కరిణి సైతం కొత్త శోభను సంతరించుకుంది. చక్రస్నానం సందర్భంగా పుష్కరిణి వద్దకు వచ్చిన భక్తులు మహదానందంతో పుణ్యస్నానాలు ఆచరించారు. -సాక్షి, తిరుమల -
శ్రీవారిసేవలో ప్రముఖులు
-
‘ఏకాదశి’ వైభవం
చెన్నై, సాక్షి ప్రతినిధి : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాష్ట్రంలో ని వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయూయి. ఉత్తర ద్వారం నుంచి వెలుపలికి వచ్చిన ఉత్సవమూర్తులను దర్శిం చుకున్న భక్తులు తరించారు. దేశంలోని 108 ప్రసిద్ధ వైష్ణవాలయాల్లో ప్రథమం గా భావించే తిరుచ్చిరాపల్లి శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. విష్ణుమూర్తి స్వరూపం నుంచి వివిధ దేవతామూర్తులుగా అవతరించిన అన్ని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వైభవంగా సాగింది. ఈ ఆలయాల్లో డిసెంబరు, జనవరి మాసాల్లో పగల్పత్తు, రాపత్తు ఉత్సవాలను 21 రోజుల పాటూ నిర్వహిస్తుం టారు. ఈఉత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశి అత్యంత ప్రాధాన్యమైనది. గత నెల 31వ తేదీన తిరునెడు దండకం ఆ తరువాత ఈనెల 1వ తేదీన పగల్పత్తు ఉత్సవాలు వైష్ణవాలయాల్లో ప్రారంభమైనాయి. పగల్పత్తు ఉత్సవాల్లో పదోరోజు, వైకుంఠ ఏకాదశి ముందురోజైన శుక్రవారం నాడు రంగనాధుడు మోహినీఅవతారంలో దర్శనమిచ్చారు. ఉత్తర ద్వారం గుండా భక్తుల కోసం రంగనాధుడు బయటకు వచ్చేటపుడు వైకుంఠ ద్వార దర్శనం కోసం శుక్రవారం రాత్రి 11 గంటలకే వేలాది భక్తులు చేరిపోయారు. శనివారం తెల్లవారుజామున సరిగ్గా 4.30 గంటలకు స్వామివారు వైకుంఠద్వారం నుంచి వెలుపలికి రాగానే రంగ...రంగా అనే భక్తుల నినాదాలతో శ్రీరంగంలోని ఆలయం మార్మోగిపోయింది. శ్రీరంగం ఆలయ జీయర్, రాష్ట్ర మంత్రులు కామరాజ్, ఆనందన్, సుబ్రమ ణి, పలువులు అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులను అదుపుచేసేందుకు సుమారు 3వేల మంది పోలీసులు బందోబస్తు లో నిమగ్నమయ్యూరు. వైకుంఠ ఏకాదశి దాటిపోగా రాపత్తు ఉత్సవాలు ప్రారంభమై ఈనెల 20వ తేదీ వరకు సాగుతాయి. చెన్నై ట్రిప్లికేన్లోని పార్థసారథి ఆలయంలో సైతం తిరుమొళి తిరునాళ్ పేరుతో ఈనెల 1వ తేదీన పగల్పత్తు ఉత్సవాలను ప్రారంభించారు. నగరంలోనే ఏకైక ప్రాచీన, అతి పెద్ద వైష్ణవాలయం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మూలవిరాట్ వద్ద విశేష అలంకరణలో ఉన్న ఉత్సవమూర్తి సరిగ్గా 4.15 గంటలకు ఉత్తర ద్వారం గుండా వెలుపపలకు వచ్చారు. అర్ధరాత్రి నుంచే అక్కడ వేచి ఉన్న భక్తులు స్వామిని చూడగానే ఒక్కసారిగా గోవిందా...గోవిందా అనే నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. వేలాదిగా వచ్చిన భక్తులను అదుపుచేయడం పోలీసులకు కష్టసాధ్యమైంది. గర్భగుడి నుంచి వెలుపలకు వచ్చిన ఉత్సవమూర్తి 5.45 గంటల వరకు ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశారు. టీటీడీలో శ్రీవారి సందడి చెన్నై టీ నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ స్థానిక సలహామండలి అధ్యక్షడు ఆనందకుమార్ రెడ్డి నేతృత్వంలో సభ్యులు ప్రత్యేక దర్శన ఏర్పా ట్లు చేశారు. రాత్రి 10 గంటల నుంచే శ్రీవారి దర్శనానికి భక్తులు బారులుతీరారు. రాత్రి 1.45 గంటలకు పూజలు ప్రారంభించి తెల్లవారుజామున మండలి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం వైకుంఠద్వార దర్శనం ప్రారంభమైంది. శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారి మూలవిరాట్తోపాటూ వెనుక భాగంలో ఉన్న శేషశయనుడి రూపంలో ఉన్న శ్రీవారిని అబ్బురపరిచే విధంగా అలంకరించారు. శనివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు సుమారు 80 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. -
మురిసిన ముక్కోటి
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయమే పెద్దఎత్తున భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. ఉత్తరద్వారం గుండా భగవంతుడిని దర్శించుకుని పునీతులయ్యారు. ఆలయాలను నిర్వాహకులు అందంగా అలంకరించారు. ముక్కోటి ఏకాదశిని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఆలయాలను విద్యుద్దీపాలు, రంగురంగుల పూలతో తీర్చిదిద్దారు. ప్రధానంగా నల్లగొండలోని రామాలయంతోపాటు యాదగిరిగుట్ట , మట్టపల్లిలలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఆయా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్తరద్వార దర్శనం యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలు, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అలాగే స్వామిఅమ్మవారిని గులాబీ, మందారం, జాజిమల్లి, విరజాజి , మల్లె మొదలైన పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఉదయం 6.50 గంటలకు స్వామి అమ్మవారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామి అమ్మవారి ముగ్ధ మనోహరమైన రూపాన్ని తిలకించడానికి చలినిసైతం లెక్కచేయకుండా భక్తులు ఉదయం 4 గంటల నుంచే కొండపై బారులు తీరారు. ఆలయ తిరు వీధులన్నీ అశేష భక్త జనంతో నిండిపోయాయి. స్వామి అమ్మవారిని గర్భాలయం ఎదుట సుమారు అరగంట పాటు భక్తుల దర్శనార్థం ప్రత్యేక పీఠంపై అధిష్టింప జేశారు. వేద పండితులు చతుర్వేద పారాయణం, పంచోపనిషత్తులు, పంచసూక్తాల పఠనం చేశారు. అనంతరం స్వామి అమ్మవారిని ఆలయ తిరువీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ , దేవస్థానం చైర్మన్ బి. నర్సింహమూర్తి, ఈఓ కృష్ణవేణి, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు గజ్వెల్ రమేశ్ బాబు, సురేందర్ రెడ్డి, రామారావు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో గేట్లకు తాళాలు వేయడంతో స్వామి వారి సేవకు అంతరాయం కలిగింది. స్వామి వారి ఊరేగింపు సేవలో భక్తుల మధ్య తోపులాటలు జరగడంతో ఇబ్బందులు పడ్డారు. వైకుంఠ ద్వారం ద్వారా.. మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో శనివారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాత:కాలార్చన, సుప్రభాతం, పంచామృతాభిషేకంతో శ్రీ స్వామి వారిని వైకుంఠ ద్వారదర్శనం గావించారు. ఈ సందర్భంగా సంస్కృత సోదరులు శ్రీనాథశర్మ, మహదేవశర్మల ఆధ్వర్యంలో లక్ష ఆరెపత్రి పూజను చేశారు. శ్రీగోదాదేవి అమ్మవారికి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గరుడ వాహనంపై శ్రీలక్ష్మీనృసింహస్వామిని ఊరేగించారు. ఆలయంలో వేదమంత్రపఠనం, నాదస్వర కచేరీ, పురాణకాలక్షేపం, సప్తస్వర నాట్యకళామండలివారిచే భక్తి గానలహరి, ద్రౌపదీ స్వయంవరం హరిక థ, శ్రీమట్టపల్లి క్షేత్రమహత్యం బుర్రకథ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. స్థానిక ఎన్సీఎల్ సిమెంట్ పరిశ్రమ ఆధ్వర్యంలో అన్నదానం చేయడమేగాక మంచినీటిని సరఫరా చేశారు. జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. సాయంత్రం నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చెన్నూరు నర్సింహారావు, ఈఓ లక్ష్మణ్రావు పాల్గొన్నారు. స్వామిని దర్శించుకున్న వారిలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ చిరంజీవులు, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, నాగన్నగౌడ్, అరుణ్కుమార్దేశ్ముఖ్, మంజీనాయక్, అరుణాసైదులు, శ్రీను, మట్టపల్లి రావు, విజయ్ కుమార్, వెంకటాచార్యులు, కృ ష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరి, ఫణి,నర్సింహమూర్తి, అధికసంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా కుడారై ఉత్సవం నల్లగొండ కల్చరల్ : ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శనివారం రామగిరిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయరుస్వామి ఆధ్వర్యంలో కుడారై ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 108 గంగాళాలలో పాయసాన్ని ఉంచి శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టారు. అంతకుముందు తెల్లవారుజామున 5.30 గంటలకు స్వామివారిని ఆలయం వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దెపై ఉంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని గావించారు. ఉదయం 10 గంటలకు నీరాటోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు సముద్రాల యాదగిరాచార్య, కృష్ణమాచార్య, శఠగోపాలాచార్య చేపట్టారు. ఏఐసీసీ పరిశీలకులు రఫీఖ్అహ్మద్, ఎస్పీ డాక్టర్ ప్రభాకర్రావు, డీఎస్పీ రామ్మోహన్, డీసీసీ అధ్యక్షులు తూడి దేవేందర్రెడ్డి, టి.కుమార్రావు పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి, ఈఓ మనోహర్రెడ్డి, సభ్యులు జడల సువర్ణ, వంగరి సునీత, వేదాంతం శ్రీనివాసాచార్యులు, చకిలం వేణుగోపాల్రావు, వికాస తరంగిణి అధ్యక్షుడు రాజేశ్వరరావు, కార్యదర్శి సుజాత, రంగారావు, ఈశ్వరరెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మెరుగుగోపి, వంగాల అనిల్రెడ్డి, అంబటి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు -
ఏడు కొండల వాడా.. ఎక్కడున్నావయ్యూ!
వీఐపీలకు భలే మంచి దర్శనం సామాన్యులకు అడుగడుగునా నరకం పట్టించుకునే వారే లేరు బస, దర్శనానికి నానా తిప్పలు బంధుగణం, కార్పొరేట్ సేవల్లో తరించిన ధర్మకర్తల మండలి భక్తులకు అరచేతిలో వైకుంఠం చూపిన టీటీడీ సాక్షి,తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులు పడరాని పా ట్లు పడ్డారు. స్వామివారిని దర్శించుకునేందు కు లక్షన్నర మంది భక్తులు తరలివచ్చారు. సు లభ దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ అధికారులు ప్రకటించినా, వాస్తవ పరి స్థితులు అందుకు భిన్నంగా మారారుు. వీఐపీలకు మాత్రం అరగంట నుంచి గంట లోపే దర్శనం లభించింది. సామాన్య భక్తులకు మా త్రం అరచేతిలోనే వైకుంఠం కనిపిచింది. అడుగడుగునా నరకం అనుభవించారు. ఎక్కడికక్కడ ధర్నాలు, ఆందోళనలు, బైఠాయిం పుల పర్వం కొనసాగింది. శుక్రవారం మొదలైన డౌన్డౌన్ల పర్వం శనివారం కూడా కొనసాగిం ది. రద్దు చేసిన రూ.300 టికె ట్లను బోర్డు కోటా కింద కొందరికే కేటాయించడం ఎంత వరకు సబబు?అని భక్తులు మండిపడ్డారు. ఏకంగా చైర్మన్ కార్యాలయం వద్ద భక్తులు బైఠారుుం చారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. శనివారం ఉదయం క్యూ లైన్లలో కూడా సామాన్య భక్తులు ఆందోళన చేశారు. తమను దర్శనానికి త్వరగా అనుమతించాలని డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల క్యూ నుంచి దాటి వచ్చేందుకు ప్ర యత్నించారు. ఏటా వీఐపీ భక్తులకు దర్శనం, బస చాలా సులువవుతోంది. టీటీడీ ధర్మకర్తల మండలి, ఉన్నతాధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో వీఐపీలకు తిరుమలలో బస, దర్శనం హక్కుగా మారిపోతోంది. శని వారం ఏకంగా 8వేల వీఐపీ టికెట్లు కేటాయిం చారు. ఏడుగంటలపాటు దర్శనం చేయించి సాగనంపారు. సామాన్య భక్తులకు తిప్పలు త ప్పలేదు. కిక్కిరిసి క్యూలలో నరకయాతన అనుభవించారు. అయినా టీటీడీ అధికారుల్లో మాత్రం స్పందన అంతంతమాత్రమే. రాత్రంతా చలిలోనే భక్తుల కష్టాలు సామాన్య భక్తులను కదలిస్తే కష్టాల కన్నీళ్లు వస్తున్నాయి. శనివారం దర్శనం కోసం శుక్రవారం మధ్యాహ్నం నుంచే భక్తులు క్యూ లైన్లనలో పడిగాపులు కాచారు. వారిని ఎక్కడి క క్కడ టీటీడీ సిబ్బంది, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆ తర్వాత తమకు కేటాయించిన సమయానికి భక్తులు క్యూలోకి వెళ్లారు. తీవ్రమైన చలిలో, మంచులో భక్తులు తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. గదులు లభించని భక్తులు ఆరుబయటే చలిలో అవస్థ పడ్డారు. చంటి బిడ్డలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సొమ్మసిల్లి కింద పడిన భక్తుడు శనివారం ఉదయం శ్రీవారి స్వర్ణరోథత్సం నే త్రపర్వంగా సాగింది. రథాన్ని లాగేందుకు జనం తోపులాడుకున్నారు. పడమర మాడ వీధిలోని చినజీయర్మఠం వద్ద ఓ భక్తుడు రథాన్ని లాగుతూ సొమ్మసిల్లి కింద పడిపోయారు. అ ప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని లేపడంతో ప్రమాదం తప్పింది. ఇదిమినహా రథోత్సవం వైభవంగా జరిగింది. -
దేవుడి ఆర్చిల వద్ద టీడీపీ రగడ
కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆర్చిలకు అడ్డంగా టీడీపీ ఫ్లెక్సీలు వాహన సేవ ఉండడంతో వద్దని వారించిన గ్రామస్తులు, భక్తులు వెనుదిరిగి గంట తర్వాత ధర్నాకు దిగిన టీడీపీ తిరుపతి రూరల్, న్యూస్లైన్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాటు చేసిన దేవుని ఆర్చిలు, కటౌట్లకు అడ్డంగా టీడీపీ నాయకులు పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. తుమ్మలగుంట తెలుగుతల్లి కూడలి వద్ద టీడీపీ నాయకులు రాత్రి 7గంటల సమయంలో ఆ పార్టీ నాయకులకు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, భక్తులు దేవుని కటౌట్లకు అడ్డంగా ఫ్లెక్సీలు తొలగించాలని టీడీపీ నాయకులను కోరారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు కూడా టీడీపీ నాయకులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మరోగంటలో గరుడవాహన సేవ ఉందని, రాత్రి పదిగంటల తర్వాత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోండని గ్రామస్తులు చెప్పారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం నిర్వహణ కోసం రెండు రోజుల క్రితమే అన్ని పార్టీల ఫ్లెక్సీలు తొలగించామని చెప్పారు. అడ్డంగా వచ్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మంచిది కాదని గ్రామస్తులు పేర్కొన్నారు. వెనుదిరిగిన టీడీపీ నేతలు అరగంటపాటు సర్దిచెప్పడంతో ఫ్లెక్సీలను తొలగించేందుకు టీడీపీ నాయకులు ఒప్పుకున్నారు. గ్రామస్తులు, టీడీపీ నాయకులు కలసి ఫ్లెక్సీలను తొలగించారు. ఆటోలో తీసుకెళ్లిన టీడీపీ నాయకులు గంట తర్వాత తిరిగివచ్చి శ్రీచాముండేశ్వరి ఆలయం కూడలి వద్ద ధర్నాకు దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఫ్లెక్సీలు తొలగించారని ధర్నా చేశారు. గంట తర్వాత తిరిగి వచ్చి ధర్నా చేయడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి ఉత్సవాన్ని కూడా రాజకీయం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతి కాదని, ఫ్లెక్సీల తొలగింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని గ్రామపెద్దలు పేర్కొన్నారు. గంటతర్వాత ఎందుకొచ్చారు ఫ్లెక్సీలు తొలగించాలని సర్దిచెప్పడంతో వెనుదిరిగిన టీడీపీ నాయకులు గంట తర్వాత తిరి గివచ్చి ధర్నా చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై రాజకీయ ఆరోపణలు చేస్తుండడంతో ఈ పని కూడా ఆ నాయకుడిదేనని గ్రామస్తులు మండిపడ్డారు. టీడీపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి గ్రామంలో దేవుడి ఉత్సవం జరిగేటప్పుడు టీడీపీ నాయకులు కావాలనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గొడవకు లాగే ప్రయత్నం చేశారు. దేవుడితో పెట్టుకుంటే ఎలాంటి వారైనా ఫలితం అనుభవిస్తారు. గ్రామంలో దేవుడి ఉత్సవం జరుగుతుంటే అడ్డంగా పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మంచిది కాదు. లక్షల రూపాయలు వెచ్చించి దేవుడి ఆర్చిలు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశాం. వాటికి అడ్డంగా పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయూలనుకున్నవారికి పాపం చుట్టుకుంటుంది. రాజకీయ కారణాలతో ముద్డుకృష్ణమనాయుడు టీడీపీవారిని గొడవలకు పంపుతున్నారు. అన్నీ దేవుడే చూస్తున్నాడు. కచ్చితంగా ఫలితం అనుభవిస్తారు. -గోవిందరెడ్డి, ఉప సర్పంచ్, తుమ్మలగుంట -
వైకుంఠవాసా.. గోవిందా
వైకుంఠ ఏకాదశిని జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతోజరుపుకున్నారు.. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.. దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామిని వేలాది భక్తులు దర్శించుకున్నారు.. ఉదయం 2-30 గంటల నుంచే స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు.. 5 గంటల నుంచి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు. కడప కల్చరల్, న్యూస్లైన్ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని శనివారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని వైష్ణవాలయాలలో నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వారాన్ని ప్రత్యేకంగా అలంకరించి అక్కడి నుంచి స్వామిని దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వేచివున్నారు. దేవుని కడప శ్రీలక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరద్వారాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. ద్వారం వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను పూలతో కన్నులపండువగా అలంకరించి కొలువుతీర్చారు. ఉదయం 4గంటల నుంచి మూలమూర్తులను దర్శించుకునేందుకు భక్తులను అనుమతించారు. 5గంటల నుంచి వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. ఉదయం 2.30గంటల నుంచే భక్తులు స్వామి దర్శనం కోసం వచ్చారు. రూ.10లు, రూ.25లతో కూడా వైకుంఠ ద్వారం నుంచి దర్శనం కల్పించారు. మూలమూర్తుల దర్శనానికి కూడా ఉచిత దర్శనంతోపాటు రూ.10, రూ.25ల టికెట్పై దర్శనాలు ఏర్పాటు చేశారు. ఉత్తరద్వారం వద్ద భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. కాగా, తిరుమల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన లడ్డులు కొద్దిసేపటికే అయిపోయాయి. భక్తజన సందోహం.. సాధారణంగా దేవునికడపలో శ్రీలక్ష్మి వేంకటేశ్వరస్వా మి బ్రహ్మోత్సవాలను మినహాయిస్తే జనవరి 1న నూ తన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి రోజుల్లో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. కానీ ఈ సంవత్సరం ప్రారంభం రోజున అమావాస్య కావడంతో స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య చాలా తగ్గింది. వైకుంఠ ఏకాదశి శని వారం నాడు రావడం, అది రెండవ శనివారం కావడం, పిల్లలకు ఆరు నెలల పరీక్షలు ముగిసి సెలవులు ఉండడంతో శనివారం భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ నిర్మల, స్టెప్ సీఈఓ మమత, ఇంకా పలువురు నగర ప్రముఖులు, అధికారులు, న్యాయశాఖ అధికారులు స్వామిని దర్శించుకున్నారు. -
వైకుంఠ ఏకాదశి వైభవం
-
స్వర్ణరథంపై ఊరేగిన శ్రీనివాసుడు
తిరుమల : కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడు శనివారం స్వర్ణరథంపై ఊరేగారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవేకంటేశ్వరస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్థరథంపై ఊరేగారు. తిరువీధుల్లో భక్తులకు కటాక్షిస్తూ స్వామివారు విహరించారు. వేలాది మంది భక్తులు స్వామివారి రథాన్ని లాగుతూ శ్రీవారి సేవలో తరించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం శనివారం రావడంతో భక్తులు విశేషంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. కర్పూర హారతులతో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటా టీటీడీ ఈ ఉత్సవాన్ని ముక్కోటి ఏకాదశి రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రథోత్సవంలో టీటీడీ అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు , ఈవో ఎంజీ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
నిమ్మకూరులో హీరో బాలకృష్ణ ప్రత్యేక పూజలు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సినీహీరో బాలకృష్ణ స్వగ్రామమైన నిమ్మకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామీ వారి తీర్థప్రసాదాలను పండితులు బాలకృష్ణకు అందజేశారు. ఎన్టీఆర్ ట్రస్ ఏర్పాటు చేసిన మంచినీటి పథకాన్ని నిమ్మకూరులో ఆయన ప్రారంభించనున్నారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీగా నిమ్మకూరు తరలివచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు కూడా బాలకృష్ణకు కలిసేందుకు ఇప్పటికే నిమ్మకూరు చేరుకున్నారు. -
స్వర్ణ రధం పై ఊరేగుతున్న శ్రీవారు
-
తిరుమలలో ఆడుగడుగునా ఆక్రమాలు
-
రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమలలో శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కిలోమీటర్ల మేర నిలిచి ఉన్నారు. తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 6 గంటల వరకు వీఐపీ దర్శనం కొనసాగింది. శ్రీవారి 5 వేల మంది వీఐపీలు దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 18గంటలు, కాలినడక భక్తులకు 10 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రద్దు చేశారు. భద్రాచలంలో ఉత్తర ద్వారం నుంచి సీతారామ చంద్రస్వామి దర్శనమిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమించుకుంటున్నారు. ద్వారకా తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదాశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వార నుంచి స్వామివారిని భక్తులు దర్శనం ఇస్తున్నారు. ఇక శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉత్తర ద్వారం నుంచి మల్లన్న దర్శనమిస్తున్నారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలోనూ భక్తులు బారులు తీరారు. కరీంనగర్ జిల్లా వేములవాడకు భక్తులు పోటెత్తారు. అన్నవరం సత్యనారాయణస్వామి దర్శనానికి వేలాది భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేకువజాము నుంచి వేచి ఉన్నారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం భక్తులు వేలాది తరలివచ్చారు.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్లో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. వేకువ జామున మూడు గంటల నుంచే దేవాలయాల వద్ద భక్తులు క్యూలు కట్టారు. బంజారా హిల్స్ లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తుల భారీ సంఖ్యలో ఆలయాలకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జియా గూడలోని రంగనాథస్వామి ఆలయంలో వేలాది భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం వేచి ఉన్నారు. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. -
వెంకన్న దర్శనానికి క్యూ కట్టిన వీఐపీలు
తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వీఐపీల తాకిడి పెరిగింది. స్వామి వారి దర్శనానికి రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రముఖులు, సినీనటులు క్యూ కట్టారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డికే అరుణ, పార్దసారది, దానం నాగేందర్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ప్రసాద్ కుమార్, బొత్స సత్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్, కొండ్రుమురళి ఉన్నారు. వీరితోపాటు చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి తిరుమలకు విచ్చేశారు. అలాగే 32 మంది ఎమ్మెల్యేలు, 8మంది ఎంపీలు తిరుమలలోనే ఉన్నారు. వీళ్లే కాకుండా 12 మంది ఐపీఎస్లు,10 మంది ఐఏఎస్లు దర్శనానికి వచ్చారు. ఇంకా తమిళనాడు,కర్నాటకా, మహారాష్ట్రా,పాండిచ్చేరికి చెందిన ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో వచ్చారు. వారికి ఏర్పాట్లు చేయడంలో టీటీడి అధికారులు తలమునకలయ్యారు. టీటీడీ అధికారులు వీఐపీల సేవలో తరిస్తుంటే మరోవైపు సామాన్య భక్తులు వెంకన్న దర్శనానికి పడిగాపులు పడుతున్నారు. -
వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
సింహాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం
-
అలయాల్లో బారులు తీరిన భక్తులు
-
దృశ్య మనోహరం
భద్రాచలం, న్యూస్లైన్: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలో శుక్రవారం సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో శ్రీరామునికి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయటంతో భక్తులు ఈ వేడుకను కనులారా వీక్షించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీసీతారామచంద్రస్వామి వారికి గర్భగుడిలో దర్బారు సేవ నిర్వహించి, ఉత్సవ మూర్తులకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. ఉదయం సేవాకాలం, శ్రీ తిరుమంగై అళ్వార్ పరమపదోత్సవం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం రాజభోగం, శాత్తుమురై, పూర్ణ శరణాగతితో పగల్ పత్తు ముగిసింది. అనంతరం వేదపండితులు మంత్రాలు చదువుతుండగా..., మంగ ళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ ఆలయం నుంచి స్వామి వారిని ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకు వెళ్లారు. గోదావరి నదిలో విహరించేందుకు రాజాధిరాజ వాహనంపై బయలుదేరిన శ్రీ సీతారామచంద్ర స్వామివారిని చూసి తరించేందుకు దారి పొడవునా భక్తులు బారులు తీరారు. గోదావరి తీరానికి చేరిన తరువాత అర్చకులు ముందుగా పుణ్యజలాలతో హంసవాహనాన్ని సంప్రోక్షణ చేశారు. ఊరేగింపుగా వచ్చిన స్వామివారికి ఆలయ ఈఓ రఘునాథ్ గుమ్మడికాయతో దిష్టి తీసిన అనంతరం హంసవాహనంపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి మాతకు కూడా పూజలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేదాలు, నాలాయిర దివ్యప్రబంధం, పంచసూత్రాలు, స్తోత్ర పాఠాలు చదివారు. అనంతరం మంగళహారతి ఇచ్చి, ప్రసాద నివేదన చేశారు. తరువాత రామనామ సంకీర్తనలు, భక్తుల కోలాహలం మధ్య స్వామి వారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. గోదావరి నదిలో ఐదు సార్లు స్వామి వారు హంసవాహనంపై విహరించారు. విహారం మొదలైనప్పటి నుంచి ఉత్సవం పూర్తి అయ్యేంత వరకూ బాణాసంచాను పెద్ద ఎత్తున కాల్చారు. మిరిమిట్లు గొలిపే వె లుగులతో గోదావరి తీరం పున్నమి కాంతులీనింది. తెప్పోత్సవం సమయానికి గోదావరి తీరం భక్తులతో నిండిపోయింది. బాణసంచా వెలుగులు, విద్యుత్ దీపాల కాంతుల నుడుమ హంసవాహనంపై స్వామి వారు గోదావరి నదిలో విహరిస్తున్నంత సేపు నదీతీరం రామనామ జయ జయ ధ్వానాలతో మార్మోగింది. ఆకట్టుకున్న కోలాటాలు... రాజాధిరాజ వాహనంపై తెప్పోత్సవానికి స్వామి వారు వెళ్లే సమయంలో పల్లకి ముందు వివిధ కోలాట సంస్థల ఆధ్వర్యంలో మహిళలు చేసిన కోలాట ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కీర్తనలు ఆలపిస్తూ వేద విద్యార్థులు.., వికాస తరంగణి, శ్రీ కృష్ణ కోలాట భజన మండలి, శ్రీ సాయి వాసవీ మహిళా కోలాట సమితి, గోవిందరాజ స్వామి కోలాట సమితికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీ పూజలు.. స్వామివారిని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీ నరేష్, ఎస్పీ రంగనాథ్, భద్రాచలం ఆర్డీవో కాసా వెంకటేశ్వర్లు సతీ సమేతంగా దర్శించుకొని పూజలు చేశారు. అదే విధంగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పాల్వంచ ఆర్డీవో శ్యాంప్రసాద్తో పాటు పలువురు ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు. తెప్పోత్సవం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్రెడ్డి, ట్రైనీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భద్రాచలం పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు పోలీసులు పర్యవేక్షించారు. ఉత్సవ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, ఏఈవో శ్రావణ్ కుమార్, ఆలయ పీఆర్వో సాయిబాబా, ఇరిగేషన్ ఈఈ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. -
స్వామిసేవకు అంతా రెడీ
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు బస, దర్శనం ఏర్పాట్లను టీటీడీ సిద్ధం చేసింది. సర్వదర్శనం, కాలిబాట భక్తుల దివ్యదర్శనం, వీఐపీ దర్శనం, నిర్దేశిత దర్శన సమయాలు, భక్తులను అనుమతించే వేళలను టీటీడీ ప్రకటించింది. అవసరాన్ని బట్టి అరగంట అటుఇటుగా దర్శనానికి అనుమతిస్తామని ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. అందరికీ లఘుదర్శనమే.. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మంత్రులు, న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తదితర ప్రముఖులను వేకువజామున 1.30 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. అందరికీ లఘు దర్శనం మాత్రమే. ఎటువంటి హారతి ఇవ్వరు. ఒక్కో వీఐపీ తరఫున ఆరుగురిని మాత్రమే అనుమతి స్తారు. టికెట్టు ధర రూ.1000గా నిర్ణయించారు. ప్రతి భక్తుడికి ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి. సిఫారసులను అనుమతించరు. వ్యక్తిగతంగా వస్తేనే అనుమతిస్తారు. అం దరూ సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. కాలిబాటల్లో నడిచి వచ్చే భక్తులకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు అలిపిరి మార్గంలోని గాలిగోపురం వద్ద, శ్రీవారి మెట్టు మార్గాల్లో రెండు రోజులకు కలిపి మొత్తం 40 వేల టికెట్లు ఇస్తారు. వీరిని శుక్రవారం అర్ధరాత్రి తర్వాతే నారాయణగిరి ఉద్యావనంలో ఏర్పాటు చేసిన క్యూ లోకి అనుమతిస్తారు. శనివారం ఉదయం 7 గంటల తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం భక్తులను శుక్రవారం సా యంత్రం 5 గంటల నుంచి ఎంబీసీ 26 వద్ద గల క్యూలోకి అనుమతిస్తారు. వీరికి శనివారం ఉదయం 7 గంటల నుంచి దర్శనం ప్రారంభమవుతుంది. ఈ క్యూలో 22 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ-దర్శన్లో రూ.300 దర్శనం కోసం ఇప్పటికే 5వేలు వరకు టికెట్ల ఇచ్చారు. వీరిని మాత్రమే శుక్రవారం ఉదయం నుం చి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమలలో కరెంట్ బుకింగ్లో రూ.300 టికెట్ల దర్శనాన్ని పూర్తిగా రద్దు చేశారు. 12వ తేదీ ద్వాదశి రోజున ఐదువేల వరకు రూ.300 టికెట్లు తిరుమలలో కేటాయించనున్నారు. రూ.50 సుదర్శనం, వృద్ధులు, వికలాం గులు, చంటిబిడ్డల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేశారు. అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేశారు. గదుల కోసం సిఫారసులను స్వీకరించడం లేదు. ప్రముఖులైనా తిరుమలలోని సం బంధిత కార్యాలయాలకు వ్యక్తిగతంగా వస్తేనే కేటాయిస్తున్నారు. వీరి సిఫారసులను స్వీకరించడం లేదు. కేంద్రీయ విచారణా కార్యాలయంలో మాత్రమే సామాన్య భక్తులను గదులు కేటాయించనున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు నుంచి కాలిబాటల్లో నడిచివచ్చే భక్తులకు ఒక్కో ఉచిత లడ్డూ అందజేయనున్నారు. తిరుపతిలోని శ్రీని వాసం, మాధవం టీటీడీ వసతి సముదాయాల్లో రెండు పూటలా భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల్లోపు స్వర్ణ రథోత్సవం, ద్వాదశి రోజు తిరుమల పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశి సందర్భంగా తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా చక్రస్నానం నిర్వహించనున్నారు. -
పరశు‘రాముడు’
‘‘ ధరలో క్షత్రియులను దండించిన ‘పరశురాముడు’-మనపాలిట నుండగ... తక్కువేమి మనకు.. ‘రాముండొక్కడుండు’ వరకు...’’ తన తండ్రి జమదగ్నిని చంపిన వేయి చేతులు గల కార్యవీర్యార్జునుని సంహరించి.. ఇరువది ఒక్క పర్యాయములు భూమినంతా గాలించి దుష్టులైన వారిని సంహరించుటకు శ్రీ మహావిష్ణువు పరశురామావతారం ఎత్తారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సోమవారం భార్గవరామునిగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారంలో ఉన్న స్వామివారిని తిలకించి శుభఫలితాలు పొందినట్లు అర్చకులు తెలిపారు. భద్రాచలం టౌన్, న్యూస్లైన్: ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామాలయంలో నిర్వహిస్తున్న పగల్పత్తు ఉత్సవాల్లో రాజాధిరాజు అయిన శ్రీరాముడు సోమవారం పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు కొలువై ఉన్న ఆళ్వార్లుకు వేదపండితులు 200 పాశురాల దివ్యప్రబంధనాన్ని వినిపించారు. ఉత్సవమూర్తులను ఆలయంలోకి తీసుకెళ్లి పరశురామావతరంలో అలంకరించారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వామివారిని ప్రత్యేక పల్లకిలో ఉంచి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. భక్తుల కోలాహలం, మేళతాళాలు, మహిళల కోలాటాల నడుమ స్వామివారిని గోదావరి ఒడ్డు వరకు తీసుకు వెళ్లారు. అక్కడి నుంచి మిథిలాస్టేడియంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదిక మీదకు తీసుకువచ్చి భక్తుల దర్శనం కోసం ఉంచారు. స్వామివారికి ప్రత్యేక హారతి, నైవేద్యాన్ని సమర్పించారు. పరశురామావతార విశిష్టతను ఆలయ అర్చకులు అమరవాది మదనమోహానాచార్యులు రాగయుక్తంగా వినిపించారు. స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు పంపిణీ చేశారు. వేదపండితుల వేదఘోష నడుమ తాతగుడిసెంటర్లోని గోవిందరాజస్వామి ఆలయం వరకు తిరువీధి సేవ నిర్వహించటం ఆనవాయితీ. స్టేడియం నుంచి తిరువీధి సేవకు బయలుదేరిన స్వామివారికి రాజవీధి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గంమధ్యలోని విశ్రాంతి మండపంలో కొద్దిసేపు స్వామివారు సేద తీరారు. అనంతరం స్వామివారిని ఆలయానికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎం. రఘునాథ్, ఏఈవో శ్రవణ్కుమార్, వేద పండితులు మురళీ కృష్ణమాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, సన్యాసిశర్మ, ఆలయ అర్చకులు విజయరాఘవన్, ఓఎస్డీ సుదర్శన్, పీఆర్వో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. నేడు శ్రీరామునిగా.. లోకకంఠకులైన రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికి దశరథుని కుమారునిగా శ్రీ మన్నారాయణుడు ధరించిన శ్రీరామావతారంలో వైకుంఠ రాముడు మంగళవారం దర్శనమివ్వనున్నారు. వ్యక్తిగత సౌఖ్యాలకన్నా ధర్మాచరణయే ఉత్తమమైనదని, అదే శాశ్వతమైనదని శ్రీరాముడు లోకానికి చాటిచెప్పారు. పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు, ధర్మ స్వరూపుడు శ్రీరామచంద్రుడు. సూర్యగ్రహ బాధలున్న వారు రామావతారాన్ని దర్శించటం వల్ల ఆ బాధల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు.