women reservation bill
-
తరాల నిరీక్షణకు తెర
పలు కీలకాంశాలపై దశాబ్దాల నిరీక్షణకు 17వ లోక్సభ తెర దించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతించారు. ఆర్టీకల్ 370 రద్దు చేయడంతోపాటు చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఈ సభలోనే ఆమోదం లభించిందని గుర్తు చేశారు. ‘‘ఈ ఐదేళ్లూ రిఫార్మ్ (సంస్కరణలు), పెర్ఫామ్ (పనితీరు), ట్రాన్స్ఫార్మ్ (మార్పు) కాలంగా సాగాయి. దేశమంతటికీ ఒకే రాజ్యాంగం ఉండాలన్న ప్రజల కలను నిజం చేశాం. మరెన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొని అధిగమించాం. దేశానికి సరైన దిశానిర్దేశం చేశాం. ఫలితంగా భారీ మార్పుల దిశగా అమిత వేగంతో భారత్ దూసుకుపోతోంది. ఈ ప్రయాణంలో సభ్యులంతా భాగస్వాములయ్యారు’’ అంటూ కొనియాడారు. ఈ ఐదేళ్లలో పలు కీలక సంస్కరణలతో బలోపేతమైన భారత్కు పునాదులు వేశామని పేర్కొన్నారు. న్యూఢిల్లీ: పలు కీలకాంశాలపై దశాబ్దాల నిరీక్షణకు 17వ లోక్సభ తెర దించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతించారు. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు. ‘‘ఈ ఐదేళ్లూ రిఫార్మ్ (సంస్కరణలు), పెర్ఫామ్ (పనితీరు), ట్రాన్స్ఫార్మ్ (మార్పు) కాలంగా సాగాయి. దేశమంతటికీ ఒకే రాజ్యాంగముండాలన్న ప్రజల కలను నిజం చేశాం. మరెన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొని అధిగమించాం. దేశానికి సరైన దిశానిర్దేశం చేశాం. ఫలితంగా భారీ మార్పుల దిశగా అమిత వేగంతో భారత్ దూసుకుపోతోంది. ఈ ప్రయాణంలో సభ్యులంతా భాగస్వాములయ్యారు’’ అంటూ కొనియాడారు. పలు కీలక సంస్కరణలతో బలోపేతమైన భారత్కు ఈ ఐదేళ్లలో పునాదులు వేశామని పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని అభినందిస్తూ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శనివారం లోక్సభలో స్పీకర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో ఆయన పాల్గొన్నారు. ‘‘17వ లోక్సభకు ఇది చివరి పని దినం. గొప్ప మార్పులకు, నిర్ణయాలకు వేదికగా నిలిచిన 17వ సభను దేశం ఎప్పటికీ ఆశీర్వదిస్తూనే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డారు. రామాలయ అంశంపై బీజేపీపై విపక్షాలు పదేపదే విమర్శలు చేస్తూ వచ్చాయంటూ మోదీ మండిపడ్డారు. ‘‘వాస్తవమేమిటంటే ఇలాంటి గొప్ప బాధ్యతలను తలకెత్తుకుని పూర్తి చేసే సామర్థ్యం అందరికీ ఉండదు. చేతులెత్తేసి పారిపోతారు’’ అంటూ చురకలు వేశారు. ‘‘ఆలయ నిర్మాణంపై ఈ రోజు సభలో జరిగిన చర్చలు మన సహానుభూతికి, సున్నితత్వానికి, ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అన్న మా ప్రభుత్వ దీక్షకు అద్దం పట్టాయి’’ అన్నారు. దేశ ఘనత పెంచనున్న ఎన్నికలు రానున్న లోక్సభ ఎన్నికలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఘనతను మరింత పెంచుతాయని తనకు పూర్తి నమ్మకముందన్నారు. ‘‘బ్రిటిష్ కాలం నాటి ‘శిక్షాత్మక’ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ చట్టాలను తెచ్చాం. కరోనా సవాలును అధిగమించడంలో ప్రపంచ దేశాలకే భారత్ బాసటగా నిలిచింది. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని వీలైనంతగా తగ్గించడమే ప్రజాస్వామ్య ప్రభుత్వ సామర్థ్యానికి గీటురాయి. ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’ మన మూలమంత్రం’’ అన్నారు. -
జన గణన తరువాత మహిళా బిల్లు అమలు
శివాజీనగర(బెంగళూరు): 2024లో జన గణన పూర్తయ్యాక మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కర్ణాటకలోని మూడుబిద్రిలో రాణి అబ్బక్క స్మారక తపాలా స్టాంపును శనివారం ఆమె విడుదల చేసి మాట్లాడారు. ప్రధాని మోదీకి దేశ నిర్మాణంలో మహిళల పాత్రపై ఉన్న ఎంతో విశ్వాసం వల్లనే మహిళా బిల్లు వాస్తవ రూపం దాలి్చందని చెప్పారు. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉళ్ళాల రాణి అబ్బక్క ధైర్యం, ధీరత్వం గొప్పదన్నారు. సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన అనేక మంది గుర్తు తెలియని పోరాటయోధుల సేవలను స్మరించుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ప్రభుత్వం 14,500 మంది స్వాతంత్య్ర సమరవీరుల కథలతో డిజిటల్ భాండాగారాన్ని రూపొందిస్తోందని చెప్పారు. -
రెండు సీట్లు రాని బీజేపీ బీసీని సీఎంను చేస్తుందా?
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో రెండు సీట్లు కూడా గెలవని బీజేపీ.. ఇప్పుడు బీసీలకు సీఎం పదవి అనడం హాస్యాస్పదమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఎద్దేవా చేశారు. ఏదైనా చెప్పేముందు దానిలో వాస్తవికత ఉండాలని అన్నారు. సీఎం కేసీఆర్పై పోటీ చేస్తామన డం కొందరికి ఫ్యాషన్గా మారిందని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము ఏ పార్టీకీ బీ టీమ్ కాదని తలసాని స్పష్టం చేశారు. తమది ఏ టీమ్ అని, సింగిల్ గానే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందన్నారు. బీఆర్ఎస్కు తగినన్ని సీట్లు రావనే ప్రశ్నే ఉత్పన్నం కాదని, 78 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని చెప్పారు. కేంద్రంలోనూ కీలక భూమిక పోషిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు! పోటీ చేసేందుకు తగిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి లేరని తలసాని విమర్శించారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన 27 మందికి సీట్లివ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన వారికి వెంటనే సీట్లు ఇస్తోందన్నారు. బల్దియా ఎన్నికల్లో ఎక్కువ మంది బీజేపీ కార్పొరేటర్లు గెలిచినప్పటికీ ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును తెరపైకి తేవడం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆడిన డ్రామా అని విమర్శించారు. తాము అమలు చేస్తు న్న పథకాలను దేశమే కాపీ కొడుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు ఓటువేసే హక్కును ఉపయోగించుకోవాలని, ఓట్లు వేయరనే అపప్రదను చెరిపి వేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడం, చంద్రబాబు అరెస్టు, తదితర పరిణామాల ప్రభావం ఇక్కడ ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యల్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే పరిష్కరిస్తుందంటూ, తమ(ఎమ్మెల్యేల)ఇళ్ల స్థలా లు కూడా ఆగిపోయాయని వ్యాఖ్యానించారు. -
స్పష్టమైన విజన్ లేదు.. మోదీ సంక్షేమ పథకాలన్నీ ఉత్త డొల్ల: ప్రియాంక గాంధీ
జైపూర్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఉత్త డొల్ల అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. మోదీ పాలనలో సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించే నాథుడే లేకుండాపోయాడని అన్నారు. కేవలం కొద్దిమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ లేదని, ఉపాధి అవకాశాలను కల్పించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఆమె బుధవారం రాజస్తాన్లోని ఝన్ఝున్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కుల గణనపై బీజేపీ నాయకులు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ‘ఖాళీ లిఫాఫా' మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా మోదీ ఖాళీ లిఫాఫా (కవరు) అంటూ మోదీని ఎద్దేశా చేశారు. 10 ఏళ్ల తరువాత మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందంటూ మండిపడ్డారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. . ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడానికి బీజేపీ మతాలు, కులాల గురించి మాట్లాడుతోందని ఆక్షేపించారు. అధికారం కాపాడుకోవడానికి ప్రజలను అణచివేసే చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి సొంత లాభం కోసం పాకులాడే నాయకులను ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లకు ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార సభలో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మాట్లాడారు. రాష్ట్రంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రెండు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500కు వంట గ్యాస్ సిలిండర్ అంద జేస్తామని చెప్పారు. అలాగే అర్హులైన మహిళలకు సంవత్సరానికి రూ.10,000 చొప్పున గౌరవ భృతి ఇస్తామని వెల్లడించారు. ఇంటి పెద్ద అయిన మహిళలకు ఈ గౌరవ భృతి అందుతుందని పేర్కొన్నారు. -
ఇండియా కూటమి రాకతో
సాక్షి, చెన్నై: రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం చేపట్టి పార్లమెంట్ ఆమోదం పొందిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకు రావడం తథ్యం అని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆ పార్టీ మహిళా విభాగం నేతృత్వంలో చెన్నై వైఎంసీఏ మైదానంలో మహిళా హక్కు మహానాడు శనివారం రాత్రి జరిగింది. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన, డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలో జరిగిన ఈ మహానాడుకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తూ, దేశంలో మహిళలు వివిధ రంగాలలో పురోగమిస్తున్నారని అన్నారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం కావాలనే కాంక్షతో ఆది నుంచి కాంగ్రెస్ పొరాడుతున్నట్లు పేర్కొన్నారు. ఒక మహిళ చదువుకుంటే, ఆ కుటుంబమే చదువుకున్నట్లని వ్యాఖ్యానించారు. మహిళా నాయకత్వం విస్తృతం, మహిళ చేతికి అధికారంలోకి వస్తే దేశం బలోపేతం అవుతుందన్న కాంక్షతో గతంలోనే 33 శాతం రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టామన్నారు. యూపీఏ హయాంలోనే ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినా, ఏకాభిప్రాయం కుదరక పార్లమెంట్లో చట్టం ఆమోదం పొందలేక పోయినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు ఆ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిందని గుర్తు చేస్తూ, దీనిని ఎప్పుడు అమలు చేస్తారో అన్నది స్పష్టం చేయడం లేదన్నారు. రేపు చేస్తారా..? ఎల్లుండి చేస్తారా..? ఏడాది తర్వాత చేస్తారా..? రెండేళ్ల తర్వాత చేస్తారా...? అని ప్రశి్నస్తూ, ఈ బిల్లు అమలు అన్నది రానున్న ఇండియా కూటమి ద్వారానే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ చట్టం కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసిందని గుర్తుచేస్తూ, ఇండియా కూటమి రాకతో ఈ చట్టం అమల్లోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాం«ధీ, జమ్మూకశీ్మర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, బిహార్ ఆహార శాఖ మంత్రి లేషి సింగ్, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుష్మితా దేవ్, ఢిల్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ తదితరులు పాల్గొన్నారు. -
తాత్సారంలో ఆంతర్యమేమిటి?
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నూతన పార్లమెంట్ భవనంలో అట్టహాసంగా తెచ్చిన తొలి బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో చట్టరూపం దాల్చింది. ‘నారీ శక్తి వందన్ యాక్ట్–2023’గా పిలుస్తున్న దీన్ని సెప్టెంబర్ 19న లోక్సభ, సెప్టెంబర్ 21న రాజ్యసభ ఆమోదించాయి. అయితే దీన్ని నియోజక వర్గాల పునర్విభజన తర్వాత, అంటే 2029 ఎన్నికల వరకు గానీ అమలుచేయకపోవడం గమనార్హం. కాబట్టి, ఈ రిజర్వేషన్లను జాప్యం చేయాలన్న ఉద్దేశం ఇందులో కనబడుతోంది. స్త్రీలు పార్లమెంట్లోకి వెళ్తే సమాజ భవితవ్యమే మారిపోతుంది. వీరు కుటుంబాన్ని తీర్చిదిద్దినట్లే సమాజాన్ని తీర్చిదిద్దగలరు. స్త్రీలనూ, బీసీలనూ, దళితులనూ నిర్లక్ష్యం చేసినంతకాలం ఆ పార్లమెంటుకు అర్థంలేదు. నూతన పార్లమెంటు భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం ఒక చారిత్రా త్మకమైన విషయంగా చెప్పవచ్చు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లును కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన రోజున తొలి బిల్లుగా ప్రవేశపెట్టడం విశేషం. ఈ బిల్లు ప్రకారం రాజ్యసభ, పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటాను అమలు చేస్తారు. 33 శాతంలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు వారి రిజర్వేషన్ల కోటా ఆధారంగా కేటాయిస్తారు. 15 ఏళ్ల పాటు అమల్లో ఉండే ఈ రిజర్వేషన్లను వెంటనే కాకుండా నియో జకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) తర్వాత అమల్లోకి తేవాలని నిర్ణయించడం గమనార్హం. 2026లో డీలిమిటేషన్ చేపట్టాల్సి ఉంది. అది పూర్తయ్యి రిజర్వేషన్లు అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టడం ఖాయం. అంటే 2024 ఎన్నికల నాటికి రిజర్వేషన్లు అమల్లోకి రావు. 2029 లోనే ఈ కోటా అమలయ్యే అవకాశముంది. ఆశ్చర్యకరమైన బిల్లు ఈ రిజర్వేషన్ల బిల్లు చాలాసార్లు సభల ముందుకు వచ్చింది. ప్రతిసారీ ఏకాభిప్రాయం కుదరక ఆమోదం పొందలేదు. దాదాపుగా 27 ఏళ్లుగా అది పెండింగ్లోనే ఉండిపోయింది. కనీసం 50 శాతం రాష్ట్రాలు ఈ బిల్లును ర్యాటిఫై చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ బిల్లులో చాలా లొసుగులు వున్నాయి. ఆవ్ు ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఆతిషి మహిళా రిజర్వేషన్ బిల్లును 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మహిళలను మోసం చేసేందుకు తెచ్చిన బిల్లు అని ఆరోపించారు. నిజానికి ఈ బిల్లులో పితృస్వామిక ఆధిపత్యం ఉంది. దళిత బహుజన వివక్ష ఉంది. ముఖ్యంగా బీసీలను అధికారం లోనికి రాకుండా చేసే కుట్ర దాగి ఉంది. డీలిమిటేషన్ అయిన తర్వాత ఎప్పుడో 2029లో రిజర్వేషన్లు అమలు చేయబడతాయి అనడంలోనే వీటిని జాప్యం చేయాలనే ఆలోచన వుంది. నిజానికి హిందుత్వవాదులు మనుస్మృతి అనుచరులు. మనుçస్మృతిని క్రీ.పూ. రెండవ శతాబ్దంలో రాసివుంటారని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పేర్కొన్నారు. బౌద్ధయుగం అంతరించి హిందూ రాజ్యాలు ఆవిర్భవించే క్రమములో పుష్యమిత్రులు ఈ మనుస్మృని బ్రాహ్మణ రాజ్య నిర్మాణానికి సాధనంగా వాడుకున్నారు. వర్ణవ్యవస్థ పున రుద్ధరణ, స్త్రీ అణచివేత యిందులో ప్రధానమైన అంశాలుగా ముందుకు వచ్చాయి. ‘పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే రక్షంతి స్థావిరే పుత్రాన స్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అని చెబుతుంది మనుస్మృతి. బాల్యమున తండ్రి స్త్రీలను రక్షించును. యౌవనమున మగడు రక్షించును. ముసలితనమున పుత్రుడు రక్షించును. కావున స్త్రీ స్వతంత్రురాలిగా నుండటానికి వీల్లేదు. (భర్త, కుమారులు లేనప్పుడు బంధువులు రక్షింతురు). దీన్నిబట్టి మనకేమి అర్థమౌతుందంటే హిందూ పురుషుడు స్త్రీకి భయపడ్డాడు. ఈ భావజాలానికి ప్రతీకగా వున్న పార్టీ మహిళా బిల్లు ప్రవేశపెట్టిందంటే, నమ్మశక్యంగా లేదు. రాజకీయాల్లోకి స్త్రీలను అసలు రాకుండా అడ్డుకోవడం జరుగు తూనే ఉంది. ఆయా పార్టీలు స్త్రీలకు సీట్లు ఇవ్వడమే తక్కువ. ఆ రాజకీయ ప్రాతినిధ్యం కూడా అగ్రకులాల స్త్రీలకే లభ్యం అయ్యింది. భారతదేశంలో ఇప్పుడు 5 శాతం కంటే తక్కువ స్త్రీలు పార్లమెంట్లో ఉన్నారు. జెకోస్లేవేకియా, సోవియట్ రష్యాల చట్టసభలలో 27 నుండి 28 శాతం వరకు స్త్రీలకు ప్రాతినిధ్యం ఉంది. పశ్చిమ యూరప్లో, యూఎస్ఏలో 3 నుండి 4 శాతం స్త్రీల ప్రాతినిధ్యం మాత్రమే చట్ట సభలలో ఉంది. పార్టీలు 10 నుండి 15 శాతం సీట్లు కేటాయించినట్లు ప్రకటించినా, భారతదేశంలో స్త్రీలకు 7 శాతం కంటే సీట్లు మించలేదు. వారిలోనూ ఎన్నికైన స్త్రీల అభ్యర్థుల సంఖ్య ఇంకా తక్కువగా ఉంటోంది. నామమాత్ర రిజర్వేషన్లు పట్టణీకరణ ప్రభావం స్త్రీల రాజకీయ ప్రవేశానికి ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. స్టేటస్ ఆఫ్ వుమెన్ కమిటీ 1977లో చేసిన సర్వే ప్రకారం, గ్రామీణ స్త్రీలే ఎక్కువ రాజకీయ చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. స్త్రీల రిజర్వేషన్కు సంబంధించిన విషయాలే ఇలా ఉంటే, ఇక స్త్రీలు ఓపెన్ కాంపిటిషన్లో సీట్లు గెలవడం కష్టంగా ఉంది. గ్రామ పంచాయితీల్లో పురుషుల ప్రాతి నిధ్యం ఎక్కువ ఉండడం వలన ఎన్నికైన స్త్రీలు కూడా నామమాత్రంగానే తమ ప్రాతినిధ్య విలువను వ్యక్తీకరించగలుగుతున్నారు. మొత్తం రాజకీయ పెత్తనం అగ్రకులాల పురుషులదైనపుడు దళితులకు, స్త్రీలకు ఇస్తున్న రాజకీయ రిజర్వేషన్లు నామమాత్రం అవుతున్నాయి. దళిత స్త్రీలకు దాదాపు రాజకీయాధికారంలో భాగస్వామ్యం లేదు. భారత ఉపఖండంలో ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న ఎన్నికలు కూడా ఒక పెద్ద ఫార్సుగా తయారయ్యాయి. డబ్బు, మత్తు మందులు, హైటెక్ ప్రచారం, గూండాయిజం ఉన్నవాళ్ళకే పార్టీలు సీట్లు ఇస్తున్నాయి. ఎవరికైనా స్త్రీలకు సీట్లు ఇస్తే పితృస్వామ్యాన్ని పోషించగలిగిన స్త్రీలకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పెక్కు సంవత్సరాలు భారతదేశాన్ని పరిపా లించారు. ఆమె కాలంలో కాంగ్రెస్ పార్టీలో స్త్రీలకు ఎక్కువ ప్రాతి నిధ్యం కల్పించడం కానీ, ఏ విధమైన స్త్రీల సంస్కరణలు కానీ జరగలేదు. కొందరు స్త్రీలు పురుష పెత్తందారితనాన్ని అనుకరించ డమే స్త్రీవాదం అనుకుంటారు. దళితులు, స్త్రీలు రాజకీయ భాగస్వామ్యాన్ని పొందకపోవడంతో సమంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని చెబుతూ డాక్టర్ మణి పి. కమేర్కర్ ఇలా అన్నారు: ‘స్త్రీలను ఒక అల్ప సంఖ్యాక వర్గంగా లెక్కించి, దళితులను నిర్లక్ష్యం చేసినట్లే రాజకీయాల్లో స్త్రీలను కూడా నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వం తన ప్రచార సాధనాల ద్వారా స్త్రీలను వస్తువులు, అలంకారాలు, ఫ్యాషన్ల మోజులో పడేలా చేసి, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల పట్ల వారి చైతన్యాన్ని దిగజార్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. పురుష సమాజం చేస్తున్న కుట్రలతో స్త్రీలలో కూడా రాజకీయేతర జీవనం ఎక్కువైంది. భారతదేశంలోనే కాదు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా స్త్రీల రాజకీయ చైతన్యం చాలా తక్కువ స్థాయిలో ఉంది.’ నాయకత్వ స్థానంలోకి వచ్చినప్పుడే... రాజకీయ చైతన్యానికి ముందు భారత ఉపఖండంలో స్త్రీలలో ఇంకా బలంగా, సామాజిక ఆర్థిక, సాంస్కృతిక పోరాటాలు జరగాలి. ఉద్యమాల నుండి వచ్చిన కార్యకర్తలు గ్రామస్థాయిలో రాజకీయ నాయకులుగా ఎదగాలి. సమాజ పునర్నిర్మాణానికి, పితృస్వామ్యానికి భిన్నంగా వారు కృషి చేయాలి. ఇతర దేశాలలో కూడా సమాజ ఉపరి తలానికి సంబంధించిన స్త్రీలే నాయకత్వ స్థానాలలో ఉన్నారు. సమాజ పునాదిని నిర్మించిన దళిత స్త్రీలు రాజకీయ చైతన్యాన్ని, నాయ కత్వాన్ని పొందగలిగినపుడే స్త్రీ స్వామ్యం సాధ్యమౌతుంది. జనాభా నిష్పత్తిని బట్టి అందరికీ సమాన అవకాశాలు వచ్చినప్పుడే భారతదేశంలో నూత్న విప్లవం వస్తుందని అంబేడ్కర్ చెప్పారు. స్త్రీ ఒక ఉజ్వల శక్తి. వీరు పార్లమెట్లోకి వెళ్తే సమాజ భవితవ్యమే మారి పోతుంది. కుటుంబాన్ని తీర్చిదిద్దినట్లే సమాజాన్ని తీర్చిదిద్దగలరు. స్త్రీలను, బీసీలను, దళితులను నిర్లక్ష్యం చేసినంతకాలం ఆ పార్లమెంటుకు అర్థంలేదు. శ్రామిక శక్తులు, ఉత్పత్తి శక్తులు, దళిత బహుజన స్త్రీ నారీ మణులు, ఈ పార్లమెంట్ను అలంకరించే రోజు రావాలి. డా. కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమనేత ‘ 98497 41695 -
లిప్స్టిక్ పెట్టుకునే ఆడవాళ్ల హంగామా మొదలు.. ఆర్జేడీ నేత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సెషన్లలో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బిల్లు అంశాన్ని ప్రస్తావిస్తూ ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్దిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిప్స్టిక్లు బాబ్ కట్ చేసుకున్న మహిళలంతా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో ముందుకొస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఇండియా కూటమిలోని నేతలు కూడా విభేదించారు. బీహార్లోని ముజాఫర్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్దిఖీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది కాబట్టి ఇకపై లిప్స్టిక్లు పెట్టుకునే ఆడవాళ్లు బాబ్ కట్ చేసుకునే ఆడవాళ్లు మహిళా రిజర్వేషన్ పేరు చెప్పి హంగామా చేయడం మొదలు పెడతారు చూడండని వ్యాఖ్యానించారు. తర్వాత ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ గ్రామస్తులకు అర్ధమయ్యే విధంగా చెప్పడం కోసం తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. మొదటి నుంచి ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతిస్తూనే ఉందన్నారు. ఇటీవల జరిగిన ప్రత్యేక సమావేశాల్లో కూడా ఆర్జేడీ బిల్లుకు మద్దతిచ్చిందని బిల్లులో ఓబీసీలను చేర్చకపోవడంపై మాత్రం తమ పార్టీ తీవ్రస్థాయిలో విభేదించిందని గుర్తుచేశారు. అబ్దుల్ బారీ సిద్దిఖీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కౌశల్ కిషోర్ స్పందిస్తూ.. దీనినిబట్టి ఆయన ఆలోచనలు ఎంత కింది స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతున్నాయన్నారు. మహిళలు చట్టాలను, రాజ్యాంగాన్ని బాగా అధ్యయనం చేసి ప్రజల గొంతును చట్టసభల్లో వినిపించేందుకు వస్తున్నారు. ఒక కారుకు చక్రాలు ఉన్నట్టుగానే పార్లమెంటులో కూడా పురుషులు మహిళలు చట్టాలు చేయడంలో భాగస్వాములవుతారని.. ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. సిద్దిఖీ చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వారు కూడా ఖండించారు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ మహువా మాజి మాట్లాడుతూ.. మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు. ఓబీసీల తోపాటు ఎస్సీ,ఎస్టీ వంటి వెనుకబడిన వర్గాల వారు కూడా రిజర్వేషన్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో అంశాన్ని ఆర్జేడీ తోపాటు మిగతా పార్టీలు కూడా విభేదించాయి. సమాజ్వాది పార్టీ ఎంపీలు శరద్ యాదవ్ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇక స్వర్గీయ సమాజ్వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ అయితే ఇదే అంశంపై మాట్లాడుతూ ఈ బిల్లు వలన సంపన్న కుటుంబాల్లోని ఆడవాళ్లకు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది తప్ప గ్రామస్థాయిలో మహిళలకు ఎటువంటి ప్రయోజనం ఉండదని 2012 లోనే అన్నారు. ఇది కూడా చదవండి: ‘కేసీఆర్ ఇంకా 90 రోజులే ప్రగతి భవన్లో ఉంటారు’ -
బిల్లుకు అయిష్టంగానే విపక్షాల ఆమోదం
భోపాల్/జైపూర్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లుకు పార్లమెంట్లో ప్రతిపక్షాలు మరో గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే మద్దతు ఇచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నారీశక్తిని అర్థం చేసుకొని, సంకోచిస్తూనే బిల్లుకు ఆమోదం తెలిపాయని అన్నారు. తమ పట్టుదల వల్లే బిల్లు పార్లమెంట్లో నెగ్గిందని వివరించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లు పరిస్థితి ఏమిటో మనకు తెలిసిందేనని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అహంకార కూట మికి అధికారం అప్పగిస్తే ఈ బిల్లు విషయంలో వెనక్కి మళ్లుతాయంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. బిల్లు పరిస్థితి వెనక్కి వెళ్లిపోతుందని పరోక్షంగా స్పష్టం చేశారు. జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్లో సోమవారం నిర్వహించిన ‘కార్యకర్త మహాకుంభ్’లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీని తుప్పు పట్టిన ఇనుముతో పోల్చారు. బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్కు అలవాటేనని ఆక్షేపించారు. కాంగ్రెస్ను రాజకీయ నాయకులు నడిపించడం లేదని, పార్టీని అర్బన్ నక్సలైట్లకు ఔట్సోర్సింగ్కు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలను, నినాదాలను ఈ లీజుదారులే నిర్ణయిస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గనుక గెలిపిస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ దివాలా తీసింది కాంగ్రెస్ దేశంలో ప్రతికూలతను వ్యాప్తి చేస్తోందని, దేశం సాధించిన ఘనతలను ఆ పార్టీ ఇష్టపడడం లేదని ప్రధానమంత్రి మోదీ ధ్వజమెత్తారు. దేశాన్ని 20వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థను కాంగ్రెస్ వ్యతిరేకించిందని, కానీ, ప్రపంచ దేశాలు ఈ వ్యవస్థను ప్రశంసించాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ మనోబలం కోల్పోయిందని, దివాలా తీసిందని చెప్పారు. అందుకే అర్బన్ నక్సలైట్లకు పార్టీని లీజుకు ఇచ్చారని తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు ప్రజాబలం లేదన్నారు. మహిళలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే వారంతా అప్రమత్తంగా ఉండాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పేదలు ఎప్పటికీ పేదలుగా ఉండాలన్నదే కాంగ్రెస్ విధానమని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజస్తాన్లో కాంగ్రెస్ను గద్దె దించాలి రాజస్తాన్లో సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువత జీవితాల్లో ఐదేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలి్పంచలేదని అన్నారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం రాజస్తాన్ రాజధాని జైపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో ‘పరివర్తన్ సంకల్ప్ మహాసభ’లో మాట్లాడారు. పరిపాలన పరంగా కాంగ్రెస్ సర్కారుకు సున్నా మార్కులే వస్తాయన్నారు. కాంగ్రెస్ పాలనలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. మహిళల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక కాంగ్రెస్ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచి్చందని చెప్పారు. -
ఈ టైంలో యూరప్ ట్రిప్పు అవసరమా?.. దీదీపై ఫైర్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐరోపా పర్యటనపై లోక్సభ ఎంపీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌద్రీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక పక్క రాష్ట్రంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే వారి నొప్పిని పట్టించుకోకుండా విలాసవంతమైన పర్యటనలకు వెళతారా అని ప్రశ్నించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం విధానాలపైనా ప్రధానిపైనా విమర్శలతో చౌదరి విరుచుకుపడ్డారు. అర్ధం చేసుకోలేరా? కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆగస్టు సెప్టెంబర్ వ్యవధిలో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని మేము ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని అయినా కూడా వారు దాన్ని పట్టించుకోలేదని సామాన్యులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి ప్రజలు బాధను అర్ధం చేసుకునే తీరిక లేదు గానీ స్పెయి పర్యటనకు మాత్రం వీలు కుదురుతుందని ఎద్దేవా చేశారు. విలాసాలకు డబ్బెక్కడిది? ముఖ్యమంత్రి ఐరోపా పర్యటనలో విలాసవంతమైన హోటల్లో బస చేయడంపై స్పందిస్తూ.. ముఖ్యామంత్రి జీతం తీసుకోకుండా కేవలం ఆమె రచనలు, పెయింటింగులు అమ్ముకుని సంపాదిస్తూ ఉంటారు. అలాంటిది రోజుకు రూ. 3 లక్షలు ఖర్చుతో మాడ్రిడ్ హోటల్లో బస చేయడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ఈ విలాసవంతమైన ట్రిప్లో ఖర్చులు ఎవరు భరించారని ఏ పారిశ్రామికవేత్త మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్లారని ప్రశ్నిస్తూ ప్రజలను మోసం చేయాలని చూడొద్దని అన్నారు. ఇటీవల బిశ్వ బంగ్లా పారిశ్రామిక సమావేశంలో మీరు ఖర్చు చేసిన దానిలో పది శతం వెచ్చించి ఉంటే లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి ఉండేవని అన్నారు. మామూలు రైలే.. ఇక ప్రధాని కొత్తగా ప్రారంభించిన తొమ్మిది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల గురించి ప్రస్తావిస్తూ.. ప్రజలకు బులెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చి 'వందేభారత్' పేరుతో డొల్ల ట్రైన్లు తీసుకొస్తున్నారని ఇవి వాటి సహజ వేగంతో కాకుండా సాధారణ వేగంతోనే ప్రయాణిస్తున్నాయని దీని టికెట్టు ధర మాత్రం సామాన్యుడికి కన్నీరు తెప్పిస్తోందని అన్నారు. యునెస్కో శాంతినికేతన్కు వారసత్వగుర్తింపు కల్పించడంపైన కూడా మాట్లాడుతూ శాంతినికేతన్కు ఎటువంటి ప్రత్యేక గుర్తింపులు అవసరం లేదని దాని ప్రత్యేకత దానికుందని అలాగే ఒక ప్రాచీన ఆలయం తప్ప ఏమీ లేని ముర్షిదాబాద్ కృతేశ్వరి గ్రామానికి ఉత్తమ్ పర్యాటక గ్రామంగా గుర్తింపు కల్పించడం సరైనది కాదని చేతనైతే అక్కడి నవాబుల కాలం నాటి నిర్మాణాలను పరిరక్షించాలని అన్నారు. దృష్టి మళ్లించడానికే.. ప్రజా సమస్యలపై స్పందించకుండా వాటి నుంచి దృష్టి మళ్లించడానికి మోదీ ప్రభుత్వం ఇలాంటి అనేక అంశాలను తెరమీదకు తీసుకొస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు వంటి కొత్త కొత్త అంశాలను తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని అన్నారు. బీజేపీ ఆలోచనా విధానం ప్రజాస్వామ్య విలువలను తుంగలోకి తొక్కుతూ పార్లమెంటును అగౌరవపరిచే విధంగా ఉందని అన్నారు. #WATCH | Murshidabad, West Bengal: West Bengal Congress President Adhir Ranjan Chowdhury says, "PM Modi's government keeps on making excuses before elections... Be on the Women's Reservation Bill or the One Nation, One Election... To do anything, it is necessary to come to… pic.twitter.com/LSi9Ehi1Ew — ANI (@ANI) September 24, 2023 ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో గెలుపు పక్కా -
కులగణన అంటే మోదీకి భయమెందుకు?
జైపూర్: దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కుల గణనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే మహిళా రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలని పునద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు కోటా కల్సించాలని అన్నారు. రాహుల్ శనివారం రాజస్తాన్లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. మహిళా రిజర్వేషన్లను ఇప్పటికిప్పుడు అమలు చేయడం సాధ్యమేనని రాహుల్ స్పష్టం చేశారు. జనగణన, నియోజకవర్గాల పునరి్వభజన ముసుగులో ఈ రిజర్వేషన్లను వాయిదా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడ్డారు. ఓబీసీల గురించి నిత్యం మాట్లాడే ప్రధానమంత్రి కుల గణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియడం లేదని చెప్పారు. దయచేసి ఓబీసీలను మోసం చేయకండి అని కోరారు. కుల గణన గురించి పార్లమెంట్లో మాట్లాడేందుకు ప్రయతి్నస్తే బీజేపీ సభ్యులు తన గొంతుకను అణచివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను రాహుల్ బబ్బర్ షేర్స్ (సింహాలు)గా అభివరి్ణంచారు. అదానీతో ప్రధాని మోదీ సంబంధాలను రాహుల్ మరోసారి ప్రస్తావించారు. -
ఇక మగాళ్ళ పని అయిపోయినట్లే..
-
మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవ ఆమోదం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నారీశక్తి వందన్ అధినియమ్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన రాజ్యసభ
-
Womens Reservation Bill 2023: ఓబీసీలపై కాంగ్రెస్ సవతి ప్రేమ
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ఓబీసీ కోటా కూడా కలి్పంచాలన్న కాంగ్రెస్ పార్టిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దుమ్మెత్తిపోశారు. వారిపై కాంగ్రెస్ ప్రేమ మాటలకే పరిమితమన్నారు. అధికారంలో ఉండగా ఓబీసీలకు కాంగ్రెస్ చేసిందేమీ లేకపోగా కనీసం వారి గురించి ఆలోచించను కూడా లేదని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ రూపంలో దేశానికి తొలి ఓబీసీ పీఎంను ఇచ్చింది బీజేపీయేనని గుర్తు చేశారు. మహిళా బిల్లుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతివ్వాలని అన్ని పార్టిల ఎంపీలను కోరారు. బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించడం తెలిసిందే. రాహుల్ ది ట్యూటర్ తెలివిడి 2004 నుంచి పదేళ్ల పాటు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి పాలనలో కేంద్రంలో ఎందరు ఓబీసీ కార్యదర్శులున్నారో చెప్పాలని నడ్డా ప్రశ్నించారు. సరీ్వసుల్లో ఉన్న అధికారులకు సంబంధించి ఓబీసీ రిజర్వేషన్లను కేవలం 1992లో సుప్రీంకోర్టు సూచన అనంతరం మాత్రమే అమలు చేశారని గుర్తు చేశారు. 90 మంది కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల్లో ఓబీసీలు కేవలం ముగ్గురే ఉన్నారన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘ట్యూటర్లను పెట్టుకుంటే చాలదు. నాయకుడు కావాలంటే చిత్తశుద్ధితో అందుకోసం ప్రయతి్నంచాలి‘ అంటూ ఎద్దేవా చేశారు. ‘303 మంది బీజేపీ లోక్ సభ సభ్యుల్లో 85 మంది ఓబీసీలే. ఇది కాంగ్రెస్ మొత్తం సభ్యుల కంటే కూడా చాలా ఎక్కువ! దేశవ్యాప్తంగా మా పార్టికి ఉన్న ఎమ్మెల్యేల్లో 27 శాతం, ఎమ్మెల్సీల్లో ఏకంగా 40 శాతం ఓబీసీలే. మహిళా సాధికారత కోసం మోదీ సర్కారు ఎన్నో చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ మాత్రం కేవలం మైనారిటీల సంతుష్టికరణ, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ట్రిపుల్ తలాక్ వంటి అంశాలను లేవనెత్తుతూ ఉంటుంది‘ అని నడ్డా అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాదు మహిళా బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్ను నడ్డా తోసిపుచ్చారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడచుకుంటుందన్నారు. మహిళా బిల్లు ద్వారా లబ్ధి పొందడం బీజేపీ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఈ బిల్లు విషయంలో ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్నదే సరైన, అత్యంత దగ్గర విధానమని చెప్పారు. అంతకుముందు కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ మహిళా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దానికి సభ ఆమోదం లాంఛనమేమని భావి స్తున్నారు. అనంతరం మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జన గణన గణాంకాల ఆధారంగా జరిపే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. వాగ్వాదం రాజ్యసభలో మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, జేపీ నడ్డా మధ్య వా గ్వాదం వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. బిల్లు అమలు కాలావధిపై విపక్షాల విమర్శలను నడ్డా విమర్శించడం ఇందుకు దారితీసింది. ఖర్గే జోక్యం చేసుకుంటూ, బీజేపీకి దమ్ముంటే రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలని సవాలు చేశారు. -
మహిళా బిల్లులో ఓబీసీ సబ్ కోటా చేర్చాలి : R. కృష్ణయ్య
-
మహిళా బిల్లు ఆమోదంపై ప్రధాని మోదీ హర్షం ఇదే
-
మహిళా రిజర్వేషన్ బిల్లుకు YSRCP సంపూర్ణ మద్దతు ఇస్తుంది
-
రాజ్యసభ, మండలిలోనూ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండలిలో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు విస్పష్టంగా మద్దతు తెలుపుతోందని ఆయన ప్రకటించారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు రాజ్యసభ, రాష్ట్రాల శాసనమండలిలో మహిళల రిజర్వేషన్ను విస్మరించడం తగదని అన్నారు. రాజ్యసభ, మండలిలో సభ్యులు తమ టర్మ్ పూర్తవగానే రిటైర్ అవుతుంటారు. అందువలన రెండేళ్ళకు ఒకసారి ఖాళీలు ఏర్పడుతుంటాయని అన్నారు. కాబట్టి రాజ్యసభ, మండళ్ళలో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 80, 171లను సవరించాలని ఆయన న్యాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే చారిత్రాత్మకమైన బిల్లును ఈరోజున సభలో ప్రవేశపెట్టినందున ప్రతి ఏటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మాదిరిగానే చరిత్రలో మహిళల ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా సెప్టెంబర్ మాసాన్ని చారిత్రక మహిళా మాసంగా జరుపుకునేలా ప్రకటించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీలో మహిళలకు 50 శాతానికి మించే రిజర్వేషన్... 1992లో రాజ్యాంగంలోని 73, 74 ఆర్టికల్స్ను సవరించడం ద్వారా పంచాయతీలు, మునిసిపాలిటీలలో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు విజయసాయిరెడ్డి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చట్టబద్దంగా నిర్దేశించిన 33 శాతానికి మించే పంచాయతీలు, స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం కల్పించి మహిళా అభ్యున్నతి పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళకు ఏ విధంగా పెద్ద పీట వేసిందో గణాంకాలతో సహా ఆయన వివరించారు. స్థానిక సంస్థల్లో 1,356 ఖాళీలు ఉండగా అందులో 688 స్థానాలను అంటే 51 శాతం స్థానాలను మహిళలతో భర్తీ చేసినట్లు తెలిపారు. 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో ఏడింటిని మహిళలకు (54 శాతం) కేటాయించడం జరిగింది. అలాగే 26 జిల్లా పరిషత్ వైఎస్ చైర్మన్ పోస్టులు ఉంటే 15 పోస్టులను (58 శాతం) మహిళలే అలంకరించారు. మునిసిపల్ కార్పొరేషన్లలో మొత్తం 36 మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులలో 50 శాతం...అంటే 18 పోస్టుల్లో మహిళల నియామకం జరిగింది. 671 మునిసిపల్ కార్పొరేషన్, వార్డు సభ్యుల పదవుల్లో 53.8 శాతం పదవులు మహిళలకే దక్కాయి. రాష్ట్రంలోని 73 మునిసిపల్ చైర్మన్ పదవుల్లో 45 మంది మహిళలు (62 శాతం) చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. 2,124 మునిసిపల్ వార్డు సభ్యుల పదవుల్లో 1,061 పదవులకు మహిళలే ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్లలో 57 శాతం, ఎంపీటీసీలలో 54 శాతం, మండల అధ్యక్షుల్లో 53 శాతం, జడ్పీటీసీలలో 53 శాతం మహిళా సభ్యులే ఉన్నారు. అలాగే వార్డు, విలేజ్ వలంటీర్లలో 53 శాతం, వార్డు, గ్రామ సచివాలయ అధికారుల్లో 51 శాతం మంది మహిళలే ఉన్నారని ఆయన తెలిపారు. ప్రతి కార్యక్రమంలో మహిళలకు సగభాగం అవకాశం కల్పిస్తూ మహిళా సాధికారికత కోసం సీఎం జగన్ ప్రభుత్వం చేపడుతున్నచర్యలు తమ చిత్తశుద్ధికి నిదర్శనమని విజయసాయి రెడ్డి వివరించారు. -
Live: మహిళా బిల్లుకు రాజ్యసభ ఆమోదం
Updates.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు అనుకూలంగా 171 మంది ఓట్లు వేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. చరిత్రాత్మకమైన ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో 10 గంటలకు పైగా చర్చ జరిగింది. అనంతరం ఓటింగ్ చేపట్టగా అనుకూలంగా 171 మంది ఓట్లు వేశారు. కాగా ఈ బిల్లు ఇప్పటికే లోక్సభలో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడమే తరువాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన వెంటనే చట్టంగా మారనుంది. ► డిజిటల్ డివైజ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ ► మహిళా బిల్లుపై రాజ్యసభలో ప్రారంభమైన ఓటింగ్. ► మహిళా బిల్లుపై రాజ్యసభలో చర్చ నడుస్తోంది. మరికాసేపట్లో ఓటింగ్ జరగనుంది. ► మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్య సభలో కేంద్రంలో నిప్పులు చెరిగారు తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రెయన్. బెంగాల్లో ఆర్ధిక, ఆరోగ్య, పరిశ్రమలు, వాణిజ్య, భూ సంబంధిత శాఖలను మహిళలకు కేటాయించారు. మరి 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీయే ఒక్క రాష్ట్రంలోనైనా మహిళా అభ్యర్థిని సీఎంగా చేసిందా? అని ప్రశ్నించారు. ►2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయలేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఎంపీ కపిల్ సిబల్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లపై చర్చలో ఆర్ కృష్ణయ్య ►మహిళా రిజర్వేషన్లపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ సాయంత్రం ఓటింగ్ జరగనుంది. ► వైఎస్సార్సీపీ తరఫున చర్చలో పాల్గొన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య ►మహిళా రిజర్వేషన్లు ఓబీసీలకు సబ్ కోటా కేటాయించాలి ►అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా ఇవ్వాలి ►56 శాతం ఉన్న జనాభా ఉన్న బీసీలకు రాజకీయాలలో 15 శాతం మాత్రమే వాటా ఉంది ►బీసీలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం చేయాలి ►బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలి చంద్రయాన్-3 సక్సెస్ పై లోక్సభలో చర్చ ►ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 సక్సెస్ పై లోక్సభలో చర్చ జరిగింది. ►వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ లావు కృష్ణదేవరాయలు చర్చలో పాల్గొన్నారు ►ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రయాన్ లాంచ్ చేశారు ►చంద్రయాన్-3 సక్సెస్ కావడం ఆనందంగా ఉంది ►శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధన కోసం కేటాయిస్తున్న నిధులను ఖర్చు చేయడం లేదు ►నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కోసం నిధులు కేటాయిస్తామని చెప్పినప్పటికీ విడుదల చేయలేదు ►రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మహిళా బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ఉంటుంది. రాజ్యసభ, శాసన మండలిలో కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలి అని అన్నారు. ► నూతన పార్లమెంట్ వద్దకు వెళ్లిన సినీ నటి తమన్నా భాటియా. #WATCH | Actor Tamannaah Bhatia arrives at the Parliament in Delhi. pic.twitter.com/sDHceDI1do — ANI (@ANI) September 21, 2023 ► మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. బిల్లుకు మేము పూర్తి స్థాయిలో మద్దతిచ్చాం. కానీ, అది తక్షణమే అమలులోకి రావాల్సిన అవసరముంది. ఇది అమలులోకి వచ్చే ముందు నెరవేర్చాల్సిన రెండు షరతులు ముందుగా ఉన్నాయి. ఒకటి జనాభా గణన, డీలిమిటేషన్. ఎందుకంటే జనాభా ప్రకారం సీట్లను కేటాయించడం ప్రారంభిస్తే జనాభా నియంత్రణను అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. అది ఆమోదయోగ్యం కాదు. #WATCH | On the women's Reservation Bill Congress MP Karti P Chidambaram says, "It's a symbolic gesture. We have supported it wholeheartedly but that's not going to come into effect immediately. There are two conditions in precedence which need to be fulfilled before it becomes… pic.twitter.com/X0oTwDu6Sj — ANI (@ANI) September 21, 2023 ► మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్లో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించింది. ఎలాంటి అడ్డంకులు లేకుండా రాజ్యసభలో కూడా బిల్లుకు ఆమోదం లభిస్తుందనే నమ్మకం ఉంది. #WATCH | Women's Reservation Bill | In Rajya Sabha, BJP president and MP JP Nadda says, "...We all know that the proceedings in this new Parliament began from Ganesh Utsav and yesterday in Lok Sabha, the Women's Reservation Bill - Nari Shakti Vandan Adhiniyam - was passed without… pic.twitter.com/XtZIcuKMhf — ANI (@ANI) September 21, 2023 ► మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ వద్ద ఎంపీ పీటీ ఉష మాట్లాడుతూ.. మహిళలకు ఇది నిజంగా అమృత్కాల్. ఇది మాకు ఎంతో గౌరవం. #WATCH | On Women's Reservation Bill, Member of Rajya Sabha PT Usha says, "It's a real 'Amrit Kaal' for women, and we are honoured. pic.twitter.com/fcp31mfvTE — ANI (@ANI) September 21, 2023 ► మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన అర్జున్రామ్ మేఘ్వాల్. Union Law Minister Arjun Ram Meghwal moves the Women's Reservation Bill in Rajya Sabha. pic.twitter.com/UqukFCjIEc — ANI (@ANI) September 21, 2023 ► బీజేపీ ఎంపీ హేమా మాలిని మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి ఒక విజన్ ఉంది. మహిళా బిల్లు విషయంలో మోదీకి ధన్యవాదాలు. బిల్లు విషయంలో అంతకుముందు ఏం జరిగిందన్నది కాదు. ప్రధాని మోదీ బిల్లును తీసుకువచ్చి పాస్ చేశారు. #WATCH | On Women's Reservation Bill, BJP MP Hema Malini says, "The people who question will only question. But PM Narendra Modi has done it. He has done what has never happened before. We all should thank him, and congratulate him. He has a vision..." pic.twitter.com/Fo0tHSXBCT — ANI (@ANI) September 21, 2023 ►పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు సమావేశాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ లోక్సభలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు భారతీయ మహిళల్లో ఉత్సాహం నింపింది. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసవ్వడం చారిత్రక ఘట్టం. బిల్లు పాసయ్యేందుకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు. #WATCH | Women's Reservation Bill | Prime Minister Narendra Modi says, "Yesterday was a golden moment of India's Parliamentary journey. All the members of this House deserve that golden moment...Yesterday's decision and today when we cross the last mile after Rajya Sabha (passing… pic.twitter.com/s6mRNxPB2G — ANI (@ANI) September 21, 2023 ► పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ మాట్లాడుతూ.. ఈరోజు రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతామన్నారు. #WATCH | Women's Reservation Bill | Union Law Minister Arjun Ram Meghwal says, "In Rajya Sabha, it will be brought through Supplementary Business as we were late in Lok Sabha yesterday. Lok Sabha Secretariat knows better about it. But I can tell you that discussion will be held… pic.twitter.com/dQKFL4iBWE — ANI (@ANI) September 21, 2023 ► రాజ్యసభలో మహిళా బిల్లుపై సీపీఐ ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఈరోజు రాజ్యసభలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందుతుంది. లోక్సభలో ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేసినా రాజ్యసభలో మాత్రం అందరూ మద్దతిస్తారు. కానీ విషయం ఏంటంటే, ప్రతి పక్షానికి ఒక్కో ఆలోచన ఉంటుంది. రాజ్యసభ, శాసనసభల్లో కూడా ఈ బిల్లు అమలు జరగాలని నేను చెప్పాలనుకుంటున్నాను. బిల్లులో పుదుచ్చేరి గురించి ఏమీ చెప్పలేదు, ఢిల్లీ గురించి, పుదుచ్చేరి గురించి కూడా ఉండాలి. బిల్లు ఎప్పుడు అమలులోకి వస్తుందనేది అతి పెద్ద విషయం. 2021లో జనాభా గణన జరగలేదు. దీంతో బిల్లుపై అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశ్యం వారికి లేదు. ఎన్నికల కోసం బిల్లును ప్రవేశపెడుతున్నారు. కానీ, సీపీఐ ఎప్పుడూ రిజర్వేషన్కు మద్దతు ఇస్తోంది. #WATCH | Women's Reservation Bill | CPI MP P Santhosh Kumar says, "The Bill will be unanimously passed in the Rajya Sabha today. It was opposed by two MPs in Lok Sabha but everyone will support it in Rajya Sabha. But the thing is, every party has their own ideas. I would like to… pic.twitter.com/EdVm6EswsZ — ANI (@ANI) September 21, 2023 ► లోక్సభలో ప్రతిష్టాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించింది. భారీ మెజార్టీతో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యింది. ► నేడు రాజ్యసభకు మహిళా రిజర్వేషన్ బిల్లు. ► రాజ్యసభలో బిల్లును ప్రవేశపేటనున్న కేంద్ర ప్రభుత్వం. ►మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ జరుగనుంది. -
తొమిదేళ్ళు పట్టిందా? అమిత్ షా వ్యాఖ్యలపై ఎంపీ సీరియస్
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశ్యంతో లోక్సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చ సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కపటమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది. 2014 ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలోనే మహిళా రిజర్వేషన్ సాధిస్తామని హామీ ఇచ్చారని, అది జరిగిన తొమ్మిదేళ్లకు వారిలో చలనం వచ్చిందని అన్నారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు భారీ మెజారిటీతో ఆమోదం పొందిన తర్వాత ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు కపటమైనవని తొమ్మిదేళ్ల క్రితం 2014లోనే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకోస్తామని ఎన్నికల సందర్బంగా హామీ ఇచ్చారని అన్నారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు అనేక మార్లు ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇన్నాళ్లకు ఈ బిల్లుకు లోక్సభలో మోక్షం కలిగించారన్నారు. ఇక ఈ బిల్లు విషయంలో కూడా వారు కపట మాటలనే చెబుతున్నారు. ఈ బిల్లు చట్టంగా మారడమనేది జనగణన, డీలిమిటేషన్ వ్యవహారంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే వారు 2021 నుంచి జనగణన కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. నాకు తెలిసి 2029 కంటే ముందు డీలిమిటేషన్ ప్రక్రియ కూడా జరిగే అవకాశం లేదు. దాని తర్వాత జనగణన 2031లో చేయాల్సి ఉంటుంది. మొత్తంగా వారు మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టె ప్రయత్నం చేస్తున్నారని వచ్చే ఎన్నికల్లోనే మహిళలు వారికి గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. అంతకుముందు బిల్లుపై చర్చలు జరుగుతున్నసమయంలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 2024 ఎన్నికలకు మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని ఎన్నికలు జరిగిన వెంటనే జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెడతామన్నారు. దానికోసం అవసరాన్ని బట్టి చట్టంలో కొన్ని మార్పులు చేస్తామన్నారు. పారదర్శకత కోసమే డీలిమిటేషన్ చేయనున్నట్లు అమిత్ షా తెలిపారు. ఏయే స్థానాలు మహిళలకు కేటాయించాలనే దానిపై డిలిమిటేషన్ కమిషన్ మాత్రమే నిర్ణయిస్తుందని, దానికి జనాభా లెక్కల సమాచారం మూలాధారమని అన్నారు. అందుకే 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. #WATCH | Delhi: On Union Home Minister Amit Shah's statement in parliament, Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi says, "His (HM Amit Shah) statement is hypocritical because a commitment made to the women of the country 9 and a half years ago in the 2014 manifesto and coming and… pic.twitter.com/LV61OqKV5N — ANI (@ANI) September 20, 2023 ఇది కూడా చదవండి : Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి -
Womens Reservation Bill 2023: మహిళా బిల్లుకు జై
న్యూఢిల్లీ: లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 368(2) ప్రకారం ఈ బిల్లు ఆమోదం పొందింది. దీనిప్రకారం సభలోని మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది. పార్టీలకు అతీతంగా సభ్యులు బిల్లుకు జై కొట్టారు. పార్లమెంట్ నూతన భవనంలో ఆమోదం పొందిన మొట్టమొదటి బిల్లు ఇదే కావడం విశేషం. ‘నారీశక్తి వందన్ అధినియమ్’ పేరిట కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ ఈ నెల 19న లోక్సభలో ప్రవేశపెట్టిన ‘రాజ్యాంగ(128వ సవరణ) బిల్లు–2023’పై బుధవారం దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ సహా వివిధ పార్టీలకు చెందిన దాదాపు 60 మంది సభ్యులు మాట్లాడారు. కొందరు బిల్లుకు మద్దతుగా ప్రసంగించారు. మరికొందరు మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళా కోటా గురించి ప్రశ్నించారు. ఈ రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలన్న డిమాండ్లు సైతం వినిపించాయి. చర్చ అనంతరం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 454 మంది సభ్యులు ఓటు వేయగా, ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటింగ్ ప్రక్రియలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. చర్చ అనంతరం అదే రోజు ఓటింగ్ నిర్వహిస్తారు. ఎగువ సభలోనూ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. అనంతరం రాష్ట్రపతి సంతకంతో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చనుంది. జన గణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత 2029 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఓటింగ్ జరిగిందిలా.. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉండటంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్లిప్ల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. ఎరుపు, ఆకుపచ్చ రంగు స్లిప్లను సభ్యులకు అందజేశారు. ఓటు ఎలా వేయాలో లోక్సభ సెక్రెటరీ జనరల్ వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపితే ఆకుపచ్చ స్లిప్పై ‘ఎస్’ అని రాయాలని, వ్యతిరేకిస్తే ఎరుపు రంగు స్లిప్పై ‘నో’ అని రాయాలని చెప్పారు. ఆ ప్రకారమే ఓటింగ్ జరిగింది. బిల్లుకు మద్దతుగా 454 ఓట్లు, వ్యతిరేకంగా కేవలం 2 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ఏఐఎంఐంఎ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఆ పార్టీకి లోక్సభలో ఓవైసీతోపాటు మరో ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్(ఔరంగాబాద్) ఉన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా వారిద్దరూ ఓటేసినట్లు తెలుస్తోంది. చాలా సంతోషంగా ఉంది: ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో భారీ మెజార్టీతో ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. నారీశక్తి వందన్ అధినియమ్ ఒక చరిత్రాత్మక చట్టం అవుతుందన్నారు. ఈ చట్టంతో మహిళా సాధికారతకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, మన రాజకీయ వ్యవస్థలో మహిళామణుల భాగస్వామ్యం ఎన్నో రెట్లు పెరుగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు చట్టరూపం దాల్చాకే ఆయన కల నెరవేరుతుంది. నాదో ప్రశ్న. మహిళలు తమ రాజకీయ బాధ్యతలు నెరవేర్చుకునేందుకు గత 13 ఏళ్లుగా వేచిచూస్తున్నారు. ఇంకా మనం వాళ్లని రెండేళ్లు, నాలుగేళ్లు, ఆరేళ్లు, ఎనిమిదేళ్లు వేచి ఉండండని చెబుదామా? భారతీయ మహిళల పట్ల ఇలా ప్రవర్తించడం సముచితం కాదు. ఈ బిల్లు వెంటనే అమల్లోకి రావాల్సిందే. కుల గణన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో ప్రాతినిధ్యం దక్కాలి. – సోనియా మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్ సరికాదు. ఒకవేళ రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్, అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్ అధినేత) ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్సభా స్థానాలు మహిళలకు రిజర్వ్ అయితే మా ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందంటూ అందుకు మళ్లీ మోదీ సర్కారునే నిందిస్తారు. అందుకే నియోజకవర్గాల పునరి్వభజనను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలోని కమిషన్ పూర్తి పారదర్శకంగా చేపడుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చే నూతన ప్రభుత్వం వెంటనే జన గణన, నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంది. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ల కలను సాకారం చేస్తుంది. – అమిత్ షా ఈ బిల్లుతో సవర్ణ మహిళలకే మేలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుతో అగ్ర వర్ణాల మహిళలకే మేలు జరుగుతుంది. పార్లమెంట్లో అతి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ఓబీసీ, మైనార్టీ మహిళలకు ఈ రిజర్వేషన్లలో ప్రత్యేకంగా కోటా కలి్పంచకపోవడం దారుణం. దేశ జనాభాలో ముస్లిం మహిళలు 7 శాతం ఉన్నారు. లోక్సభలో వారి సంఖ్య కేవలం 0.7 శాతమే ఉంది. లోక్సభలో సవర్ణ మహిళల సంఖ్య పెంచాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. ఓబీసీ, మైనార్టీ మహిళలు ఈ సభలో ఉండడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఆయా వర్గాల మహిళలను మోదీ సర్కారు దగా చేస్తోంది – అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా పారీ్టలకతీతంగా మహిళా ఎంపీలు బిల్లుకు ఏకగ్రీవంగా జై కొట్టారు. లోక్సభలో 82 మంది మహిళా ఎంపీలుండగా బుధవారం చర్చలో 27 మంది మహిళా ఎంపీలు మాట్లాడారు. అందరూ బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. అయితే, బిల్లు ఆలస్యంగా అమలయ్యే అంశాన్ని ప్రధానంగా తప్పుబట్టారు. -
2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు వర్తించవు..
-
మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించింది వీళ్లే!
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్లో చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించింది. బంపర్ మెజార్టీతో మహిళా రిజర్వేషన్ బిల్లు ‘నారీ శక్తి వందన్ అధినియమ్’కు లోక్సభ ఎంపీలు ఆమోద ముద్ర వేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. మూడవ రోజు బుధవారం ఎనిమిది గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది మహిళా రిజర్వేషన్ బిల్లుపై. ఆపై ఓటింగ్ ద్వారా బిల్లు ఆమోదం పొందగా.. కొత్త పార్లమెంట్లో పాసైన తొలి బిల్లుగా రికార్డు సృష్టించింది. ఓటింగ్ సమయంలో సభలో 456 మంది సభ్యులు ఉండగా.. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు.. వ్యతిరేకంగా రెండు ఓట్లు పడ్డాయి. ఇద్దరు మజ్లిస్ ఎంపీలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించారు. ఎంఐఎం చీఫ్.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మరో ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్(ఔరంగాబాద్, మహారాష్ట్ర) బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించడం ఇదే తొలిసారి. గతంలో యూపీఏ హయాంలో రాజ్యసభలో (108వ రాజ్యాంగ సవరణ) బిల్లు పాస్ అయినప్పటికీ లోక్సభలో ఆమోదం పొందలేదు. ఇక ఇప్పుడు లోక్సభ ఆమోదంతో రిజర్వేషన్ బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. అక్కడ కూడా బిల్లుకు ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇక డీలిమిటేషన్ తర్వాత 2029 ఎన్నికల సమయంలో మహిళా రిజర్వేషన్ కోటా అమలుకానుంది. Lok Sabha passes Women's Reservation Bill granting 33% seats to women in Lok Sabha and state legislative assemblies 454 MPs vote in favour of the bill, 2 MPs vote against it pic.twitter.com/NTJz449MRX — ANI (@ANI) September 20, 2023 కాగా టీ కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ మీటింగ్తో ముగ్గురు ఎంపీలు ఓటింగ్కు హాజరుకాలేకపోయారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మహిళా బిల్లు ఓటింగ్లో పాల్గొనలేకపోయారు. లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రేపు (సెప్టెంబర్ 21)న రాజ్యసభ ముందుకు రానుంది. విపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలుపుతుండటంతో అక్కడ సైతం ఇది ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే.. మూడు దశాబ్దాల ప్రయత్నం చివరకు ఫలించినట్లు అవుతుంది. చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు -
2029 ఎన్నికల్లోనే రిజర్వేషన్లు అమలు: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించబోదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో ఓటింగ్ తీర్మానం ప్రవేశపెట్టి ఆయన మాట్లాడారు. ఓటింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలకు ఈ బిల్లు వర్తించదు. 2024 ఎన్నికలు జరిగిన వెంటనే జనాభా లెక్కలు, డీ లిమిటేషన్ చేపడతాం. ఆ తర్వాతే మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తిస్తుంది అని వ్యాఖ్యానించారాయన. ఇక బిల్లుపై చర్చ సందర్భంగా 60 మంది ఎంపీలు మాట్లాడారని.. ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారని మంత్రి అర్జున్ రామ్ తెలిపారు.మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా ఈ అభివృద్ధి యాత్ర అసంపూర్ణమని సుష్మా స్వరాజ్ చెప్పిన మాటల్ని ఈ సందర్భంలో మంత్రి లోక్సభలో ప్రస్తావించారు. బిల్లుపై లొల్లి ఇదిలా ఉంటే.. అంతకు ముందు బిల్లుపై హోం మంత్రి అమిత్ షా సైతం ఇదే సమాధానం ఇచ్చారు. వచ్చే ఎన్నికలకు మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని.. ఎన్నికల తర్వాత జనాభా లెక్కుల, డీ లిమిటేషన్ ప్రక్రియ చేపడతామని తెలిపారు. 2029 ఎన్నికల సమయంలోనే రిజర్వేషన్లు వర్తిస్తాయని స్పష్టం చేశారాయన. ఆ సమయంలో.. బిల్లు అసంపూర్తిగా ఉందంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అమిత్ షా మాట్లాడుతుండగానే.. రాహుల్ గాంధీ లేచి వెళ్లిపోగా.. ఓటింగ్ కంటే ముందు కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. #WATCH | "Some people on social media are saying that this bill should not be supported as there is no reservation of OBC, Muslims. If you don’t support this bill, will reservation happen sooner? If you support this bill, then will at least be guarantee..." Union Home Minister… pic.twitter.com/q5CSeWaZI1 — ANI (@ANI) September 20, 2023 ఓబీసీ, ముస్లింల రిజర్వేషన్లు లేనందున ఈ బిల్లుకు మద్దతివ్వకూడదని కొందరు సోషల్ మీడియాలో చెబుతున్నారు. మీరు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే, రిజర్వేషన్లు త్వరగా జరుగుతాయా? మీరు ఈ బిల్లుకు మద్దతు ఇస్తే, కనీసం హామీ అయినా ఉంటుంది అని అమిత్ షా విపక్షాలను ఉద్దేశించి పేర్కొన్నారు.అయినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. -
ఇది నాకు ఉద్విగ్నభరిత క్షణం: సోనియా
-
2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి..!
-
మహిళా బిల్లును వ్యతిరేకించిన MIM
-
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
-
మహిళా రిజర్వేషన్ బిలుపై బీజేపీ నాయకురాలు అసంతృప్తి
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనంలో మొదటి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టిన బీజేపీ ప్రభుత్వం ఈసారి బిల్లు ఆమోదం పొందుతుందన్న ఆశాభావంతో ఉండగా సీనియర్ బీజేపీ నేత ఉమాభారతి బిల్లుపై అసంతృప్తిని వ్యక్తం చేసారు. బిల్లులో ఓబీసీ మహిళల ప్రస్తావన లేకవడం నిరాశ కలిగించిందన్నారు. ప్రధానికి లేఖ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహళలకు ముస్లిం మైనారిటీ మహిళలకు చోటు కల్పించకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు సీనియర్ బీజేపీ నేత ఉమాభారతి. ఈ సందర్బంగా ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎట్టకేలకు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది. కానీ బిల్లులో ఓబీసీల ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. నమ్మకం కోల్పోతాం.. మొత్తం 33 శాతం రిజర్వేషన్లలో సగం ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, వెనుకబడిన ముస్లిం మహిళలకు కేటాయించాలని కోరారు. లేదంటే వెనుకబడిన బీసీ ముస్లిం మహిళలలోనూ ఓబీసీ మహిళలలోనూ పార్టీ నమ్మకాన్ని కోల్పోతుందని అన్నారు. గతంలో హెచ్డి దేవెగౌడ ప్రభుత్వం ఇలాంటి బిల్లునే ప్రవేశ పెట్టగా అందులో కూడా తాను కొన్ని మార్పులు సూచించానని అటుపై ఆ బిల్లు స్టాండింగ్ కమిటీకి పంపించారని గుర్తు చేశారు. బిల్లు ఆమోదం పొందాలంటే.. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు సాకారం కావాలంటే రాజ్యాంగంలోని 239-ఏఏ, 330, 332, 334 అధికరణల సవరణ అవసరమని బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే జనగణన, డీలిమిటేషన్ తర్వాతే మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చాక పదిహేనేళ్ల పాటు అమలవుతుందని, తర్వాత ప్రత్యేక చట్టం ద్వారా చట్టాన్ని కొనసాగించాల్సి ఉంటుందని ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. ఇది కూడా చదవండి: రాజ్యాంగంలో ఆ 'రెండు' పదాలు మిస్సింగ్: అధిర్ రంజన్ చౌదరి -
మహిళా బిల్లును తెచ్చినందుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు: వంగా గీత
-
ఇది రాజీవ్ గాంధీ కలల బిల్లు: సోనియా గాంధీ
-
మహిళా బిల్లుపై సోనియా గాంధీ భావోద్వేగం
సాక్షి, ఢిల్లీ: నూతన పార్లమెంట్ భవన్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. బిల్లుపై చర్యలో భాగంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ చర్చను ప్రారంభించారు. ఈ సందర్బంగా లోక్సభలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. ఇది నా జీవితంలో కూడా భావోద్వేగంతో ముడిపడిన క్షణాలు. వంటింటి నుంచి ప్రపంచ వేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉంది. మహిళలు వారి స్వార్థం గురించి ఏనాడు ఆలోచించరు. స్త్రీల త్యాగాలు ఎనలేనివి. ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి స్త్రీలు పోరాడారు. సరోజినీ నాయుడు, సుచేత కృపాలనీ, ఆరుణాసఫ్ అలీ, విజయలక్ష్మీ పండిట్ వంటి వారెందరో దేశం కోసం పోరాడారు. #WATCH | Women's Reservation Bill | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "This is an emotional moment of my own life as well. For the first time, Constitutional amendment to decide women's representation in local body election was brought by my life partner… pic.twitter.com/stm2Sggnor — ANI (@ANI) September 20, 2023 ఈ బిల్లు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేందుకు తొలిసారిగా రాజ్యాంగ సవరణ చేస్తూ రాజీవ్ గాంధీ బిల్లును తీసుకొచ్చారు. రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత పీఎం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించింది. ఫలితంగా స్థానిక సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మహిళా నేతలు ఎన్నికయ్యారు. దీంతో, రాజీవ్ గాంధీ కల పాక్షికంగా మాత్రమే పూర్తయింది. ఈ బిల్లు ఆమోదంతో అది పూర్తవుతుంది. #WATCH | Women's Reservation Bill | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "Congress party supports this Bill. We are happy regarding the passing of the Bill but we are also concerned. I would like to ask a question. Indian women have been waiting for their… pic.twitter.com/H3VDbcG6ki — ANI (@ANI) September 20, 2023 గతంలో బీజేపీ సభ్యులు మహిళా బిల్లును అడ్డుకున్నారు. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. కానీ, బీజేపీ తెస్తున్న బిల్లులో కొన్ని భయాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 13 ఏళ్లుగా మహిళలు బిల్లు అమలు కోసం వేచిచూస్తున్నారు. ఇంకెన్నాళ్లు మహిళలు వేచిచూడాలి. వెంటనే కులగణన చేసి మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలి. SC, ST మరియు OBC రిజర్వేషన్లపై కూడా నిర్ణయం తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: జనగణన లేకుండా బిల్లు పెట్టి ఏం చేస్తారు? -
మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం
Updates.. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో పాస్ అయ్యింది ► మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. దీంతో.. ఇది ఇక రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. అయితే.. ఇది పెద్దల సభలోనూ ఆమోదం పొందినా.. రిజర్వేషన్ కోటా అమలు అయ్యేది మాత్రం 2029 ఎన్నికల సమయంలోనేనని కేంద్రం స్పష్టం చేసింది. అంతకు ముందు జనాభా లెక్కలు, డీ లిమిటేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. ► మహిళా రిజర్వేషన్ బిల్లుకు..ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఆమోదం లభించింది. బిల్లుకు మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఓటింగ్ సమయంలో 456 మంది సభ్యులు సభలో ఉన్నారు. అనుకూలంగా 454 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. Lok Sabha passes Women's Reservation Bill granting 33% seats to women in Lok Sabha and state legislative assemblies 454 MPs vote in favour of the bill, 2 MPs vote against it pic.twitter.com/NTJz449MRX — ANI (@ANI) September 20, 2023 ► మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ ► ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో సాంకేతిక సమస్య. స్లిప్పుల ద్వారా కొనసాగుతున్న ఓటింగ్. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పుల ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ► మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో ఓటింగ్ ప్రారంభమైంది. బిల్లుపై 60 మంది ఎంపీలు మాట్లాడారు. ఎనిమిది గంటలపాటు సుధీర్ఘంగా చర్చ సాగింది. ► 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల తర్వాత జనాభా లెక్కలు, డీలిమిటేషన్ చేపడతామని పేర్కొన్నారు. కావాలంటే బిల్లులో కొన్ని మార్పులు కూడా చేపడతామని పేర్కొన్నారు. అమిత్ షా మాట్లాడుతుండగానే సభ నుంచి రాహుల్ గాంధీ బయటకు వెళ్లిపోయారు. ►కొత్త పార్లమెంటులో లోక్సభ స్పీకర్ స్థానంలో కూర్చున్న తొలి తెలుగు ఎంపీగా మిథున్ రెడ్డి రికార్డు. ►లోక్ సభలో సభాపతి స్థానంలో రెండు గంటల పాటు సభా కార్యక్రమాలను నిర్వహించిన ప్యానెల్ స్పీకర్ మిథున్ రెడ్డి ►చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చను నిర్వహించిన మిథున్ రెడ్డి మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో చర్చ ►వైఎస్సార్సీపీ తరపున ఎంపీ సత్యవతి చర్చలో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీల కోటా పెట్టాలని సీఎం జగన్ కోరారని ఎంపీ సత్యవతి తెలిపారు. మహిళ రిజర్వేషన్లను కేవలం 15 ఏళ్ల వరకే అని పరిమితం చేయవద్దని, రిజర్వేషన్లను సమయానుకూలంగా సమీక్షించేలా, పొడిగించేలా బిల్లులో రాయాలని సూచించారు. మహిళలకు నిజమైన ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ►రిజర్వేషన్లను రాజ్యసభ, శాసన మండలిలో కూడా అమలు చేయాలని ఎంపీ సత్యవతి తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థలలో 50% కోటాను అమలు చేస్తున్నారని ప్రస్తావించారు. దేశం మొత్తం దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని.. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశా చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ►లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపి వంగా గీత మాట్లాడుతూ.. ‘మహిళలను గౌరవించడంలో ఏపీ ముందుంది. నామినేటెడ్ పదవుల్లో మహిలలకు 50 శాతం మించి పదవులు. మహిళల పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేసింది. మహిళలు తప్పనిసరిగా చట్టసభల్లో ఉండాలి’ అని స్పష్టం చేశారు. ►డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. మహిళా బిల్లును బీజేపీ రాజకీయంగా వాడుకుంటోంది. దేశంలోనే తొలిసారిగా 1921లో తమిళనాడు మహిళ ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నాం. వందేళ్ల తర్వాత ఇప్పటికీ మహిళలకు రిజర్వేషన్లు అమలు కాలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో మహిళా బిల్లును ఆమోదించారు. ► మహిళా బిల్లుపై లోక్సభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ► సోనియా గాంధీ వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. కాంగ్రెస్ నిర్ణయాలను తప్పుబడుతూ బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు. ► లోక్సభలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేం మద్దతు ఇస్తాం. వంటింటి నుంచి ప్రపంచ వేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉంది. మహిళలు వారి స్వార్థం గురించి ఏనాడు ఆలోచించరు. స్త్రీల త్యాగాలు ఎనలేనివి. ► ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి స్త్రీలు పోరాడారు. సరోజినీ నాయుడు, సుచేత కృపాలనీ, ఆరుణాసఫ్ అలీ, విజయలక్ష్మీ పండిట్ వంటి వారెందరో దేశం కోసం పోరాడారు. ►ఈ బిల్లు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేందుకు తొలిసారిగా రాజ్యాంగ సవరణ చేస్తూ రాజీవ్ గాంధీ బిల్లును తీసుకొచ్చారు. #WATCH | Women's Reservation Bill | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "Congress party supports this Bill. We are happy regarding the passing of the Bill but we are also concerned. I would like to ask a question. Indian women have been waiting for their… pic.twitter.com/H3VDbcG6ki — ANI (@ANI) September 20, 2023 ►పీఎం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించింది. ఫలితంగా స్థానిక సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మహిళా నేతలు ఎన్నికయ్యారు. దీంతో, రాజీవ్ గాంధీ కల పాక్షికంగా మాత్రమే పూర్తయింది. ఈ బిల్లు ఆమోదంతో అది పూర్తవుతుంది. ► గతంలో బీజేపీ సభ్యులు మహిళా బిల్లును అడ్డుకున్నారు. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. కానీ, మాకు ఒక భయం ఉంది. ఇప్పటి వరకు 13 ఏళ్లుగా మహిళలు బిల్లు అమలు కోసం వేచిచూస్తున్నారు. ఇంకెన్నాళ్లు మహిళలు వేచిచూడాలి. వెంటనే కులగణన చేసి మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు. #WATCH | Women's Reservation Bill | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "...On behalf of Indian National Congress, I stand in support of Nari Shakti Vandan Adhiniyam 2023..." pic.twitter.com/BrzkEkba8G — ANI (@ANI) September 20, 2023 ► లోక్సభలో అర్జున్ మేఘ్వాల్ మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. పార్లమెంట్తో పాటు అసెంబ్లీలోనూ మహిళలకు రిజర్వేషన్లు లభిస్తాయి. ఈ చట్టంతో మహిళల సాధికారత సాధ్యమవుతుంది. మహిళా రిజర్వేషన్ల కోసం వాజ్పేయి చాలా కృషి చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో బిల్లు తెస్తే రాజ్యసభలో బీజేపీ మద్దతు ఇచ్చింది. ఏకాభిప్రాయంతో బిల్లును ఆమోదించాలి. #WATCH | Women's Reservation Bill | Union Law & Justice Minister Arjun Ram Meghwal says, "...This Bill will enhance the dignity of women as well as equality of opportunities. Women will get representation. There are four important clauses..." pic.twitter.com/BDamDXOZdq — ANI (@ANI) September 20, 2023 ► మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో చర్చ జరుగుతోంది. ► మూడో రోజు పార్లమెంట్ స్పెషల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ► మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల.. సోనియా గాంధీ. #WATCH | On Women's Reservation Bill, Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "It was Rajiv ji's (Gandhi's) dream (Bill)." pic.twitter.com/mZQphniuEZ — ANI (@ANI) September 20, 2023 ► పార్లమెంట్ సమావేశాల హాజరుకు ముందు ఇండియా కూటమి సభ్యులు సమావేమయ్యారు. #WATCH | Delhi | Leaders of INDIA alliance hold a meeting at the office of LoP in Rajya Sabha, Mallikarjun Kharge ahead of the commencement of the Parliament proceedings today. pic.twitter.com/zs6X1HsXDl — ANI (@ANI) September 20, 2023 ►మహిళా రిజర్వేషన్ బిల్లుపై మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ.. బిల్లుపై సభలో ఉదయం 11 గంటలకు చర్చ ప్రారంభమవుతుంది. సాయంత్రం ఆరు గంటల వరకు చర్చ జరుగుతుంది. ఈ బిల్లు విషయంలో రాజకీయాలు చేయదలచుకోలేదు. #WATCH | On Women's Reservation Bill, MoS Parliamentary Affairs Arjun Ram Meghwal says, "... Discussion will be done through the day. It will begin at 11 and it has been scheduled to continue till 6 pm...This has nothing to do with politics..." pic.twitter.com/Flq1DIBsu0 — ANI (@ANI) September 20, 2023 నేడు మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ ►కాసేపట్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మూడో రోజు ప్రారంభం కానున్నాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతుంది. కాగా, మహిళా బిల్లుపై చర్చకు ఆరు గంటల సమయం కేటాయించారు. ►ఇక, మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చను కాంగ్రెస్ తరఫున సోనియా గాంధీ ప్రారంభించనున్నారు. #WATCH | Delhi: On being asked whether the Congress will be part of the debate on the Women's Reservation Bill, Leader of Congress in Lok Sabha, Adhir Ranjan Chowdhury says, "Yes, Sonia Gandhi will take part in it. Sonia Gandhi will start (discussion) from our party, it has been… pic.twitter.com/kFoete0SmB — ANI (@ANI) September 20, 2023 ►మరోవైపు.. మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని మోదీ కోరుతుండటం విశేషం. ► మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ..2010లో మేము బిల్లును రాజ్యసభలో ఆమోదించాము. కానీ లోక్సభ ఆమోదించడంలో విఫలమైంది. అందుకే, ఇది కొత్త బిల్లు కాదు. ఆ బిల్లును ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ రోజుకి త్వరగా పూర్తయ్యేది. బీజేపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. కానీ, నిజానికి డీలిమిటేషన్ లేదా జనాభా లెక్కలు జరిగితే తప్ప బిల్లు సాధ్యం కాదు. ఈ బిల్లుకు మేము పూర్తిగా సహకరిస్తాం. ఈ బిల్లులో లొసుగులు మరియు లోపాలను సరిదిద్దాలి. #WATCH | On Women's Reservation Bill, Congress president and LoP in Rajya Sabha, Mallikarjun Kharge says, "In 2010, we had passed the Bill in Rajya Sabha. But it failed to be passed by the Lok Sabha. That is why, this is not a new Bill. Had they taken that Bill forward, it would… pic.twitter.com/CbcPBfLifH — ANI (@ANI) September 20, 2023 -
మహిళా బిల్లు..క్రెడిట్ ఎవరిది..?
-
పొలిటికల్ మైలేజి కోసమే బిల్లు పెట్టారు: కపిల్ సిబాల్
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశ్యంతో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పార్లమెంటులో చర్చ కంటే ముందే బిల్లుపై కాంగ్రెస్ బీజేపీ నేతలు పరస్పర విమర్శలకు తెరతీశారు. దీనిపై కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ స్పందిస్తూ.. ఎన్నికలు సమీపిస్తున్నందునే బీజేపీ ఈ స్టంట్ చేసిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీ హయాంలో ఏంచేశారని అన్నారు. ఈసారైనా.. చాలా కాలంగా మరుగునపడిపోయిన బిల్లుకు మోక్షం కలిగిస్తూ బీజేపీ ప్రభుత్వ కేబినెట్ సోమవారమే బిల్లును ఆమోదించి మంగళవారం కొత్త పార్లమెంటు భవనంలో బిల్లును ప్రవేశపెట్టింది. గతంలో కూడా అనేక సార్లు ఈ బిల్లు తెరపైకి వచ్చినప్పటికీ బిల్లుకు మాత్రం ఆమోదం పొందలేదు. ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి సంఖ్యాబలం కూడా బాగానే ఉన్న నేపథ్యంలో ఈ బిల్లు ఈసారి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు. కొత్త పార్లమెంట్ భవనంలో ఈ బిల్లుపై బుధవారం చర్చలు జరగనున్నాయి. ఎన్నికల వేళ.. ఇదిలా ఉండగా బిల్లుపై చర్చ జరగక ముందే పాలక ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి తెర తీశారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ బిల్లును ప్రవేశపెట్టి పొలిటికల్ మైలేజీ పొందాలని చూస్తోందంటూ కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు. మేము చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పి ప్రజలను ఓట్లు అడగాలన్నది వారి ఆలోచన అన్నారు. వారికి ఏ బిల్లుపై అంట చిత్తశుద్ధే ఉంటే బిల్లును 2014లోనే ప్రవేశ పెట్టి ఉండాల్సిందన్నారు. ఈ బిల్లుకంటే ముందే వారు జనగణన చేపట్టాల్సి ఉందని అన్నారు. మీరు చేసిందేంటి.. కపిల్ సిబాల్ వ్యాఖ్యలకు అనురాగ్ ఠాకూర్ బదులిస్తూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2008లో మొట్టమొదటిసారి ఈ బిల్లును ప్రవేశ పెట్టినప్పుడు మీరు న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు మీరు చేసిందేంటి? ఆ తర్వాత ఏడాది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ బిల్లుని ప్రవేశపెట్టినట్టు నటిస్తోందన్న విషయం మీకు కూడా తెలుసు కదా అని ప్రశ్నించారు. ఏదైతేనేం అప్పట్లో బిల్లును ఆమోదించకుండా ముసాయిదా చట్టాన్ని స్టాండింగ్ కమిటీకి పంపించారు. అసలు కాంగ్రెస్ పార్టీకి అప్పుడు, ఇప్పుడు ఈ బిల్లు పాస్ అవ్వాలన్న ఉద్దేశ్యమే లేదని అన్నారు. నేహరూ పరిపాలనలో గాని, ఇందిరా గాంధీ హయాంలో గాని, రాజీవ్ గాంధీ పాలనలో గానీ చివరికి సోనియా గాంధీ హయాంలో కూడా మహిళలకు వారు ప్రాధాన్యతనిచ్చిందే లేదని అన్నారు. ఇది కూడా చదవండి: వారిది 'జన ఆశీర్వాద యాత్ర'.. వీరిది 'జన ఆక్రోశ యాత్ర'.. -
2027 తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలు!
న్యూఢిల్లీ: దేశంలో మహిళల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, వారి ఆకాంక్షను నెరవేరుస్తూ, లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీశక్తి వందన్ అధినియమ్’బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రెండో రోజు, పార్లమెంట్ నూతన భవనంలో ఉభయసభలు కొలువుదీరిన తొలిరోజు మంగళవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ‘రాజ్యాంగ(128వ సవరణ) బిల్లు–2023’ను దిగువ సభలో ప్రవేశపెట్టారు. ముందు రోజే.. అంటే సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆమోదముద్ర వేశారు. బిల్లుపై బుధవారం లోక్సభలో కీలక చర్చ జరుగనుంది. గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ నూతన భవనంలో లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు రికార్డుకెక్కింది. ఉభయసభల ఆమోదం, ఆ తర్వాత రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టంగా మారనుంది. మహిళా కోటా ఇప్పుడే కాదు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి రానుంది. అంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం లేదు. 2029 లోక్సభ ఎన్నికల్లో అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 2027 తర్వాతే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలిచ్చారు. మహిళల కోటా బిల్లు చట్టంగా మారిన తర్వాత 15 సంవత్సరాలపాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కాల వ్యవధిని పొడిగించవచ్చు. 1996 నుంచి.. గత 27 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభిస్తుండడం పట్ల ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికార ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతోపాటు పలు విపక్షాలు సైతం ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. పార్లమెంట్లో బిల్లు సునాయాసంగా ఆమోదం పొందడం ఖాయమేనని చెప్పొచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లు ముమ్మాటికీ తమదేనని కాంగ్రెస్ పార్టీ ఎంపీ సోనియా గాంధీ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుత లోక్సభలో 82 మంది మహిళలున్నారు. రిజర్వేషన్ల చట్టంతో ఈ సంఖ్య 181కి చేరుతుందని మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ చెప్పారు. ఉభయ సభలు వాయిదా పార్లమెంట్ నూతన భవనంలో మంగళవారం ఉభయ సభల కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో కేంద్రమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అదేవిధంగా, రాజ్యసభలో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రసగించారు. సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాలకు జీఎస్టీటీకి సంబంధించిన చెల్లింపులపై ఖర్గే లేవనెత్తిన అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది. బిల్లులో ఏముంది? ► మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఆరు పేజీల బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ► లోక్సభలో, శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఈ సీట్లను భర్తీ చేస్తారు. రాజ్యసభలో, రాష్ట్రాల శాసన మండలిలో ఈ రిజర్వేషన్లు వర్తించవు. ► మహిళల కోటాలో మూడో వంతు సీట్లను ఎస్సీలు, ఎస్టీలకు కేటాయిస్తారు. ► నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారి మహిళల రిజర్వ్డ్ సీట్లు రొటేషన్ అవుతుంటాయి. అంటే మహిళకు కేటాయించిన నియోజకవర్గాలు స్థిరంగా ఉండవు. ► బిల్లులో ఓబీసీ(ఇతర వెనుకబడిన తరగతులు)లను చేర్చడంపై ఎలాంటి ప్రస్తావన లేదు. ఓబీసీ మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండవు. ► ఆంగ్లో–ఇండియన్ మహిళలకు కూడా ప్రత్యేకంగా రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండవు. ► ప్రస్తుతం లోక్సభలో, రాష్ట్రాల శాసనసభల్లో మహిళా సభ్యుల సంఖ్య కేవలం 14 శాతం ఉంది. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇలా చాలా తక్కువ. ► రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం.. రాజ్యాంగ సవరణ బిల్లును కనీసం 50 శాతం రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం జగన్ స్పందన
సాక్షి, గుంటూరు: లోక్సభలో కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన వేళ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించడంపై తనకెంతో గర్వకారణంగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారాయన. మహిళలకు సాధికారత కల్పించడం చాలా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్లో గత 4 సంవత్సరాలలో ప్రవేశపెట్టిన పథకాలు, వివిధ కార్యక్రమాల ద్వారా మాత్రమే కాకుండా, సమాన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం ద్వారా కూడా దీనిని సాధించాము. కలిసికట్టుగా.. ప్రకాశవంతమైన, మరింత సమానమైన భవిష్యత్తును సృష్టిద్దాం! అని తన సందేశంలో పేర్కొన్నారాయన. I am proud to extend @YSRCParty’s support to the #WomenReservationBill. Empowering our women is of utmost importance to us. We achieved this in Andhra Pradesh not only through the schemes and initiatives introduced in the past 4 years, but also by ensuring equitable… — YS Jagan Mohan Reddy (@ysjagan) September 19, 2023 అంతకు ముందు.. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడాన్ని వైఎస్సార్సీపీ స్వాగతించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ప్రకటించారు. ఈ బిల్లు త్వరగా అమలు చేయాలని కోరారాయన. అంతేకాదు.. ఏపీలో సీఎం జగన్ మహిళా పక్షపాతిగా ఉన్నారని, అన్ని పథకాలను మహిళల పేరు మీదే అమలు చేస్తున్నారని, ప్రజా ప్రతినిధుల్లో సైతం మహిళలకు పెద్దపీట వేశారని ఎంపీ మిథున్రెడ్డి గుర్తు చేశారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఆరేళ్లు ఆగాల్సిందే!
న్యూఢిల్లీ: మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు తొలి అడుగుపడింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన తొలిరేజే (సోమవారం) మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త పార్లమెంట్ భవనంలో మంగళవారం కేంద్ర న్యాయశాఖమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. . నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లు..కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు కావడం విశేషం. బుధవారం రోజు లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది, ఏడు గంటలపాటు లోక్సభ సభ్యులు చర్చించనున్నారు. సెప్టెంబర్ 21న రాజ్యసభకు బిల్లు వెళ్లనుంది.విధాన నిర్ణయాల్లో మహిళా భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా తీసుకువచ్చినఈ బిల్లు ఆమోదానికి ఉభయసభల సభ్యులు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని మోదీ కోరారు. అయితే ఈ బిల్లుకు విపక్ష పార్టీలు కూడా మద్దతివ్వడంతో త్వరలోనే చట్టరూపం దాల్చే సూచనలు కనిపిస్తాన్నాయి. బిల్లు పాసైతే పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు లభించనున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లులో కీలక అంశాలు మహిళా బిల్లు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొంది చట్టంగా మారితే.. లోక్సభ, అసెంబ్లీలలో మూడో వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్ కల్పించనున్నారు. ఢిల్లీ అసెంబ్లీకీ ఇది వర్తిస్తుంది.ఈ కోటాలోనే మూడో వంతు సీట్లు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ కేటాయించారు. అయితే ఈ బిల్లులో ఓబీసీలకు రిజర్వేషన్ లేదు. ఎందుకంటే చట్టసభలకు అలాంటి నిబంధన లేదు. అందుకే దశాబ్ధాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లును సమాజ్వాదీపార్టీ, ఆర్జేడీ వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతోపాటు ఈ బిల్లు రాజ్యసభ, శాసనమండలికి వర్తించదు. ► అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినప్పటికీ.. 2029 నాటికి అమల్లోకి రానుంది. నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తైన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి రానుంది. డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలంటే ముందుగా జనగణన జరగాలి. జనాభా జనాభా గణనను 2021లో నిర్వహించాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. ► తాజా జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన తరువాతే ఈ బిల్లు అమల్లోకి వస్తుంది.. అంటే 2027 తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. 2029 లోక్సభ ఎన్నికలకు ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. 15 ఏళ్ల పాటు ఈ మహిళా రిజర్వేషన్లు బిల్లు అమల్లో ఉండనుంది. వీలైతే దీనిని పొడిగించే అవకాశం కూడా ఉంది. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన ప్రతిసారీ రొటేషన్ ప్రక్రియలో మహిళా రిజర్వు సీట్ల కేటాయింపు ఉంటుంది. ► ఈ బిల్లు 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లును పోలి ఉంటుంది. కానీ అప్పుడు ఆ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినా లోక్సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో ఆ లోక్సభ రద్దు కావడంతో అక్కడ బిల్లు కథ ముగిసిపోయింది. ఈ కొత్త బిల్లులో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీని తొలగిస్తూ రెండు సవరణలు మాత్రమే చేశారు. అయితే ఈ కొత్త బిల్లు 2010 నాటిది కాదని.. మహిళా రిజర్వేషన్ల కోసం కొత్తగా మరో రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో తాజా బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. -
బిల్లు ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి రామ్ మెఘ్వాల్
-
మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే..?
తొలిరోజు పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ప్రధాన నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు(డబ్ల్యూఆర్బీ) ఆమోదిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీపై ఒక్కసారిగా ప్రశంసలు వెల్లువెత్తాయి. మహిళా రిజర్వేషన్ డిమాండ్ను నెరవేర్చే నైతిక ధైర్యం మోదీ ప్రభుత్వానికి మాత్రమే ఉందంటూ అభినందనల జల్లు వెల్లువెత్తింది. ఇవాళే లోక్సభలో న్యాయశాఖ మంత్రి రామ్ మెగ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. రేపే లోక్సభలో ఆమెదం పొందనుంది. తదనంతరం రాజ్యసభ ముందుకు వెళ్తుంది. ఈ సందర్భంగా "మహిళా రిజర్వేషన్ బిల్లు" అంటే ఏమిటి? దీన్ని ఎప్పుడూ తీసుకొచ్చారు. ఇన్నేళ్ల నిరీక్షణకు గల కారణం తదితరాల గురించే ఈ కథనం. మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే.. దేశంలో లింగ విబేధం లేకుండా అందరికి సమాన హక్కులు ఉండాలని.. అన్ని మతాలు, వర్గాలు, సంస్కృతులు సమానంగా ఉండాలన్న ఆంక్షతో స్వాతంత్య్రం సాధించుకున్నాం. కానీ... పురుషుల ఆధిపత్యం ఎక్కువై.. మహిళల ప్రాధాన్యత తగ్గుతూ ఉండటంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రాధాన్యత పెరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే... రాజ్యంగం 108వ సవరణ బిల్లు, 2008 లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు(33%) మహిళలకు రిజర్వ్ చేయాలని కోరింది. 33 శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్ల సబ్ రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదిస్తుంది. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్డ్ సీట్లను మార్చాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. Union MoS Prahlad Patel deletes his post on 'Women's Reservation Bill'. pic.twitter.com/N8PeEvg5kV — Press Trust of India (@PTI_News) September 18, 2023 ఈ బిల్లు చరిత్ర... మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మే 1989లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టడం ద్వారా పార్లమెంట్లో మహిళ రిజర్వేషన్ బిల్లుకి బీజం పడిందని చెప్పాలి. ఆయన ప్రవేశ పెట్టిన బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది కానీ 1989 సెప్టెంబర్లో రాజ్యసభలో ఆమోదం పొందడంలో విఫలమైంది. 1992, 1993లో అప్పటి ప్రధాని పీ వీ నరసింహరావు రాజ్యాంగ సవరణ బిల్లు 72, 73లను తిరిగి ప్రవేశ పెట్టారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో మహిళలకు 33% రిజర్వ్ చేశారు. బిల్లులు ఉభయ సభలు ఆమోదించాయి. చట్టంగా మారాయి. దీంతో దేశ వ్యాప్తంగా పంచాయితీలు, నగరాల్లో దాదాపు 15 లక్షల మంది మహిళా ప్రతినిధులు ఎంపికయ్యారు. తొలిసారిగా ఎప్పడూ ప్రవేశపెట్టారంటే.. సెప్టెంబర్ 12, 1996 అప్పటి దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలిసారిగా పార్లమెంట్లో మహిళ రిజర్వేషన్ కోసం 81వ రాజ్యంగా సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశ పెట్టింది. ఐతే లోక్సభలో ఆమోదం పొందలేకపోవడంతో గీతా ముఖర్జీ అధ్యక్షతన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశారు. డిసెంబర్ 1996లో ముఖర్జీ కమిటీ తన నివేదికను సమర్పించింది. అయితే లోక్సభ రద్దు కారణంగా బిల్లు రద్దయింది. ఇక రెండు సంవత్సరాల తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 1998లో 12వ లోక్సభలో ఈ మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ సారి కూడా బిల్లుకు మద్దతు లభించలేదు. పైగా రద్దైపోయింది. మళ్లీ వాజ్పేయి ప్రభుత్వంలో 1999,2002, 2003లో తిరిగి ప్రవేశ పెట్టారు, కానీ విజయవంతం కాలేదు. ఐదేళ్ల తర్వాత మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కొంత పట్టు సాధించింది. 2004లో ప్రభుత్వం తన సాధారణ కార్యక్రమంలో ఈ బిల్లుని భాగస్వామ్యం చేసింది. చివరకు మే 6, 2008న రాజ్యసభలోకి ప్రవేశపెట్టింది. ఈసారి రద్దవ్వకుండా నిరోధించేలా 1996 గీతా ముఖర్జీ కమిటీ చేసిన ఏడు సిఫార్సులలో ఐదింటిని ఈ బిల్లు సంస్కరణలో చేర్చడం జరిగింది. ఆ చట్టం మే 9, 2009న స్థాండింగ్ కమిటీకి పంపించారు. స్టాండింగ్ కమిటీ తన నివేదికను డిసెంబర్ 17, 2009న సమర్పించింది. దీనికి ఫిబ్రవరి 2010లో కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోద ముద్ర పొందింది. చివరికి ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదించబడింది. మార్చి 9, 2010న 186-1 మోజార్టీ ఓట్లు పడ్డాయి. అయితే ఈ బిల్లు లోక్సభలో పరిశీలనకు తీసుకోలేదు. చివరికి 2014లో లోక్సభ రద్దుతో ముగిసిపోయింది. నిజానికి రాజ్యసభలో ప్రవేశపెట్టిన లేదా ఆమోదించన ఏ బిల్లు అంత తేలిగ్గా ముగియదు. అందువల్లే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా వీగిపోలేదు. కాగా, ఇప్పుడూ కొత్త పార్లెమంట్ భవనంలో మూడు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళ రిజర్వేషన్ బిల్లుతో అధికార, ప్రతిపక్ష పార్టీలు సమావేశం కావడం విశేషం. ఇక ప్రధాని సైతం ఈ చారిత్రత్మక నిర్ణయానికి దేవుడు తనను ఎంచుక్నున్నాడంటూ భావోద్వేగం చెందారు. ఈ బిల్లుకు నారీశక్తి వందన్ అనే పేరు కూడా పెట్టారు. ఈ బిల్లు కోసం కేంద్రం 128వ రాజ్యంగ సవరణ చేయనుంది కేంద్రం. అంతా అనుకూలంగా జరిగి ఈ బిల్లు పాసైతే మహిళలకు 33 శాతం సీట్లు లభిస్తాయి. 15 ఏళ్ల పాటు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లో ఉంటుంది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ చారిత్రాత్మక బిల్లుకి మోక్షం కలగాలాని ఎందరో మహళలు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. It’s been a long-standing demand of the Congress party to implement women’s reservation. We welcome the reported decision of the Union Cabinet and await the details of the Bill. This could have very well been discussed in the all-party meeting before the Special Session, and… https://t.co/lVI9RLHVY6 — Jairam Ramesh (@Jairam_Ramesh) September 18, 2023 (చదవండి: దేవదూతలందరికీ రెక్కలు ఉండవ్!... ! కొందరికి స్టెతస్కోప్లే ఉంటాయ్!!) -
ఈ మహిళా బిల్లులో ఓబీసీ, ఎస్సీ రిజర్వేషన్లు చేర్చాలి: ఖర్గే
-
ఎల్లుండి రాజ్యసభకు మహిళా రిజర్వేషన్ బిల్లు
-
లోక్సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళశారం ప్రవేశపెట్టారు.రేపు (బుధవారం) లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఎల్లుండి రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించనున్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. Modi government introduces new Women's Reservation bill in Lok Sabha Read @ANI Story | https://t.co/iJkqOu0fI4#Modigovernment #WomenReservationBill #LokSabha pic.twitter.com/xzdutRpVxK — ANI Digital (@ani_digital) September 19, 2023 కాగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లు కాపీలను తమకు ఎందుకు ఇవ్వలేదని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అయితే డిజిటల్ ఫార్మాట్లో అప్మలోడ్ చేశామని కేంద్రం బదులిచ్చింది. ఇక ఈమహిళా రిజర్వేషన్ బిల్లుకు ‘నారీశక్తి వందన్’ పేరు పెట్టింది. ఈ బిల్లు కోసం 128 రాజ్యంగ సవరణ చేయనుంది కేంద్రం. బిల్లు పాసైతే పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు లభించనున్నాయి. 15 ఏళ్ల పాటు ఈ మహిళా రిజర్వేషన్లు బిల్లు అమల్లో ఉండనుంది. ఇదిలా ఉండగా లోక్సభ రేపటికి వాయిదా పడింది. బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించనున్నారు సభ్యులు. కాగా బిల్లు గురించి మోదీ మాట్లాడుతూ.. ‘నారీ శక్తి వందన్ అధినియం' మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. సెప్టెంబర్ 19 చరిత్రలో నిలిచిపోయే రోజని పేర్కొన్నారు. ముప్పై ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఈ బిల్లుకు విపక్షాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని ప్రధాని కోరారు. కొత్త పార్లమెంట్ భవనంలో ఇదొక చారిత్రాత్మక సందర్బమని తెలిపారు. తమ ప్రభుత్వం ముఖ్యమైన రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువస్తోందని, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి తమ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. చదవండి: కెనడా విషయంలో ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు -
'ఆ క్రెడిట్ మాదే..' మహిళా రిజర్వేషన్ బిలుపై సోనియా గాంధీ
న్యూఢిల్లీ: తొలిరోజు పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కేంద్ర కేబినెట్ సమావేశమై చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లు ఏ క్షణాన్నైనా ప్రవేశపెట్టే అవకాశముంది. దీనిపై కాంగ్రెస్ పార్లమెంటరీ నేత సోనియా గాంధీని ప్రశ్నించగా 'ఈ బిల్లు మాదే'నని సమాధానమిచ్చారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రెండోరోజు కొత్త పార్లమెంట్ భవనంలో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఉదయాన్నే పాత పార్లమెంట్ భవనం వద్ద ఫోటో సెషన్ కొనసాగింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఫోటో సెషన్లో పాల్గొన్నారు. పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన ఎంపీలు ఇవాళ ఉదయమే పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పార్లమెంటు భవనం వద్దకు వస్తూనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై విలేఖరులు ఆమె స్పందన కోరగా ఈ బిల్లు మాదేనని అన్నారు. 2010లో కాంగ్రెస్ అదిఆకారంలో ఉన్నపుడు ఈ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టగా రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని బిల్లులోని అంశాలను పరిశీలించాల్సి ఉందని అన్నారు. ఒకవేళ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందితే ఆ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ భాగస్వామ్య పార్టీలకే దక్కుతుందని అన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం. "It is ours, अपना है" 🔥#WomenReservationBill पर CPP अध्यक्ष श्रीमती सोनिया गांधी जी। pic.twitter.com/2LDIHhrIGN — Srinivas BV (@srinivasiyc) September 19, 2023 If the government introduces the Women's Reservation Bill tomorrow, it will be a victory for the Congress and its allies in the UPA government Remember, it was during the UPA government that the Bill was passed in the Rajya Sabha on 9-3-2010 In its 10th year, the BJP is… — P. Chidambaram (@PChidambaram_IN) September 18, 2023 ఇది కూడా చదవండి: దేవెగౌడ మనవడు ఎంపీ రేవణ్ణకు ఉపశమనం -
కొన్నేళ్లుగా మహిళా బిల్లు కోసం పోరాడుతున్నాం: కవిత
-
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు తొలిరోజు ముగిశాక కేంద్ర కేబినెట్ సమావేశమై పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయమై సంచలన నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని కేబినెట్ చారిత్రాత్మక ప్రకటన చేసింది. చట్టసభల్లో రిజర్వేషన్.. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడో వంతు సీట్లు మహిళా అభ్యర్థులకు కేటాయించబడతాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈ రిజర్వ్డ్ సీట్లలో మార్పులు చేయాలని కేబినెట్ ప్రతిపాదించింది. 33 శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్లకు సబ్-రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదించింది. ప్రస్తుతం, లోక్సభలో మొత్తం 542 మంది సభ్యులు ఉండగా, అందులో 78 మంది మహిళా సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో మొత్తం 224 మంది సభ్యులు ఉండగా, అందులో 24 మంది మహిళా సభ్యులు. ఈసారి అంతా సానుకూలమే.. మహిళా రిజర్వేషన్ బిల్లు మూడు దశాబ్దాలుగా ఆమోదానికి నోచుకో లేదు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును గతంలో పలుమార్లు ప్రవేశపెట్టినప్పటికీ పూర్తిస్థాయి మెజార్టీ మద్దతు లభించకపోవడంతో బిల్లు వీగిపోయేది. అన్ని పార్టీలు ఈ బిల్లుపై సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. అంతా సజావుగా సాగితే ఈ సమావేశాల్లోనే బిల్లుకు మోక్షం కలిగే అవకాశం ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటనుంచి ఇప్పటివరకూ లోక్సభ ఎన్నికల్లో పోటీపడ్డ మహిళలు ఎన్నికల్లో గెలిచి లోక్సభలో అడుగుపెట్టిన మహిళలు ఇప్పటిది కాదు.. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు ఇప్పటిది కాదు. ఈ బిల్లును 1996లో హెచ్డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొట్టమొదటిసారి లోక్సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో కూడా బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభలో ఆమోదం పొందలేదు. 2010లో ఎట్టకేలకు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినప్పటికీ లోక్సభలో మాత్రం ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో మోదీ సారథ్యంలోని కేబినెట్ బిల్లుపై నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు ఇంకే నిర్ణయాలు తీసుకున్నారో తెలియాల్సి ఉంది. ప్రధానికి మాత్రమే సాధ్యం.. కేబినెట్ సమావేశం ముగిశాక మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ స్పందిస్తూ మహిళా రిజర్వేషన్ డిమాండ్ను నెరవేర్చే ధైర్యం ఒక్క మోదీ ప్రభుత్వానికే ఉందన్నారు. కేబినెట్ ఆమోదంతో ఇది మరోసారి రుజువైందన్నారు. ఈ సందర్భంగా ఈ బిల్లును ఆమోదించిన మోదీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు. The Women's Reservation Bill is the brainchild of the Indian National Congress and UPA. We gave 50% reservation to women in local bodies. If they (Centre) have any sincerity in their mind, they should pass the Women's Reservation Bill in this session. : Shri @kcvenugopalmp,… pic.twitter.com/J3jTvEjEjo — Congress (@INCIndia) September 18, 2023 #WATCH | On Women’s Reservation Bill, BRS MLC K Kavitha says, "Happy we get to hear we are hearing from the sources that Cabinet has cleared the introduction of Women's Reservation Bill in the Parliament. And I hope the bill will be introduced very soon. The only, objection or… pic.twitter.com/fN2dGZbj3S — ANI (@ANI) September 19, 2023 ఇది కూడా చదవండి: ఆదిత్య ఎల్1.. అసలు కథ షురూ -
ప్రధానికి లేఖ.. మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు?
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి 9 అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం లేకపోవడాన్ని కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు. ప్రధానికి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని సోనియా గాంధీని కవిత సూటిగా ప్రశ్నించారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశం కాదా? అని అడిగారు. మహిళా బిల్లును కాంగ్రెస్ పూర్తిగా విస్మరిస్తున్నట్టు తేటతెల్లమైందని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ముఖ్యమైన మహిళ బిల్లు పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని నిరూపితమైందని స్పష్టం చేశారు. ఈమేరకు బుధవారం రోజున ఎక్స్ (ట్విట్టర్)లో కవిత పోస్ట్ చేశారు. చదవండి: ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి వెట్ రన్ ప్రారంభించనున్న సీఎం Saddened to see that the urgency for discussing Women's Reservation Bill was completely ignored in Congress Parliamentary Party Chairperson and MP Smt. Sonia Gandhi Ji's letter to the Prime Minister. Mrs. Gandhi Ji, the nation awaits your powerful advocacy for gender equality.… https://t.co/RHlQAbLPz8 — Kavitha Kalvakuntla (@RaoKavitha) September 6, 2023 -
పార్లమెంట్ 'ప్రత్యేక' భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజల్లో ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 18 నుంచి 22 దాకా ఈ సమావేశాలు (17వ లోక్సభకు 13వ సెషన్, రాజ్యసభకు 261వ సెషన్) జరుగుతాయని అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రస్తుత అమృతకాలంలో పార్లమెంట్లో అర్థవంతమైన, ఫలప్రదమైన చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అయితే, పార్లమెంట్ ప్రత్యేక భేటీల ఎజెండా ఏమిటన్నది ప్రభుత్వం బయట పెట్టలేదు. దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10న జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. కూటమి దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. జీ20 సదస్సు తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం తలపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెపె్టంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం. ఆ మరుసటి రోజే ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానుండడం విశేషం. కొత్త భవనంలోనే సమావేశాలు ప్రత్యేక సమావేశాలు పార్లమెంట్ నూతన భవనంలోనే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మే 28న ఈ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ప్రతిఏటా మూడుసార్లు (బడ్జెట్, వర్షాకాల, శీతాకాల) పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈసారి ప్రత్యేక సమావేశాల వెనుక కారణంగా ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 ప్రకారం.. ఏడాదిలో కనీసం రెండుసార్లు పార్లమెంట్ను సమావేశపరచాల్సి ఉంటుంది. రెండు భేటీల మధ్య వ్యవధి 6 నెలలకు మించరాదు. దానికి అనుగుణంగానే ప్రతిఏటా ఫిబ్రవరి–మే నెలల మధ్యలో బడ్జెట్, జూలై–ఆగస్టు మధ్య వర్షాకాల, నవంబర్–డిసెంబర్ల మధ్య శీతాకాల సమావేశాలను నిర్వహిస్తారు. ఈసారి ఏకంగా ఐదు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండడం పట్ల దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగిపోయింది. పెండింగ్లో ఉన్న బిల్లుకు మోక్షం! మరోవైపు సార్వత్రిక ఎన్నికల కంటే ముందే దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పార్లమెంట్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అయితే, రాజకీయ అవసరాల కోసమే బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని తెరపైకి తీసుకొస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కూడా ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు గత రెండు దశాబ్దాలుగా పెండింగ్లోనే ఉండిపోయింది. వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చంద్రయాన్–3 మిషన్ చరిత్ర సృష్టించడం, ‘అమృతకాలం’లో భారతదేశ లక్ష్యాలతోపాటు ఇతర ముఖ్యమైన అంశాలపైనా ప్రత్యేక సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజల దృష్టిని మళ్లించడానికే: జైరామ్ రమేశ్ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశాలు, అదానీ గ్రూప్లో అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల పేరిట మోదీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెర తీసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ విమర్శించారు. ‘ఇండియా’ కూటమి సమావేశాల వార్తలకు మీడియాలో ప్రాధాన్యం లేకుండా చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు వారాల క్రితమే ముగిశాయని, ఇంతలోనే మళ్లీ భేటీ కావడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలంటూ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని జైరామ్ రమేశ్ చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలు జరిగే సమయంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం సరైంది కాదని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. ఆ బిల్లుల ఆమోదానికేనా? వన్ నేషన్–వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్, ఉమ్మ డి పౌరస్మృతి(యూసీసీ) బిల్లులను మోదీ ప్రభు త్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుందని ఢిల్లీలో చర్చ జరుగుతోంది. ఇందులో వన్ నేషన్–వన్ ఎలక్షన్ బిల్లు అత్యంత ముఖ్యమైనది. దీన్ని ప్రవేశపెట్టడం వెనుక అసలు ఉద్దేశం వచ్చే ఏడాది జరిగే సార్వ త్రిక ఎన్నికలను ముందుకు జరపడమేనని రాజకీ య పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లో తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాలన్న ప్రతిపాదనపై బలమైన చర్చ జరుగుతోంది. కేంద్రం ముందస్తుకు వెళ్లే యత్నాల్లో ఉందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మరోవైపు దేశంలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ విధానమే మార్గమని బీజే పీ నాయకులు అంటున్నారు. దేశమంతటా లోక్సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తున్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ అమలుకు కనీసం 5 కీలక రాజ్యాంగ సవరణలు చేయాలి. అందుకు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కావాలి. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అంశం జాతీయ లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర న్యా య శాఖ మంత్రి మేఘ్వాల్ గతంలోనే చెప్పారు. ప్రత్యేక సమావేశాలు కొత్తేమీ కాదు పార్లమెంట్ బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు కాకుండా, ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం అసాధారణమేమీ కాదు. 2017 జూన్ 30న అర్ధరాత్రి పార్లమెంట్ను ప్రత్యేకంగా సమావేశపర్చారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. కానీ, ఇది లోక్సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశం. 50వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 1997 ఆగస్టులో ఆరు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. క్విట్ ఇండియా ఉద్యమానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1992 ఆగస్టు 9న, స్వాతంత్య్ర దినోత్సవ సిల్వర్ జూబ్లీ సందర్భంగా 1972 ఆగస్టు 14–15న అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఎన్నికల ఎఫెక్ట్.. AICC కీలక నిర్ణయం -
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో ఎమ్మెల్సీ కవిత కరచాలనం
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా బిల్లుపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేంద్రంలో మెజారిటీ ఉన్న బీజేపీకి మహిళా బిల్లును ఆమోదించాలనుకుంటే ఒక్క నిమిషం చాలు అని.. అయితే ఆ దిశగా ఆలోచించడం లేదని కవిత వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల పేర్లను మార్చి కొత్త చట్టాలు తీసుకురావడానికి మూడు బిల్లులను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును మాత్రం ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం జాతీయస్థాయి జర్నలిస్టు నిధి శర్మ రాసిన ‘షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్‘అనే పుస్తక ఆవిష్కరణ సభలో కవిత పాల్గొని మాట్లాడారు. దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని కవిత ఆకాంక్షించారు. ఆ సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి పెంచబోయే పార్లమెంటు సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, ఇదే తమ నాయకుడు సీఎం కేసీఆర్ విధానమని స్పష్టం చేశారు. కార్పొరేట్ రంగంలో కూడా మహిళా వివక్ష కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ప్రారంభిస్తున్న 80% స్టార్టప్ సంస్థలకు బ్యాంకుల మద్దతివ్వడం లేదన్నారు. ఏటేటా ఉద్యోగ రంగంలో మహిళల శాతం తగ్గుతోందని, చదువుకున్న మహిళలు ఎక్కడికి వెళ్తున్నారని ఆమె ప్రశ్నించారు. దేశంలో 29% మహిళలే ఉద్యోగాల్లో ఉన్నారని ఇలాగైతే దేశం వృద్ధి చెందలేదన్నారు. న్యాయస్థానాల్లో ఎంత మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని ప్రశ్నించారు. కాగా భారత్లో కంపల్సరీ ఓటింగ్ రావాలని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. నగరాల్లో చదువుకున్న వారు చాలా మంది ఓటేయడానికి రాకపోవడం బాధాకరమన్నారు. -
మహిళా రిజర్వేషన్ కోసం పోరాటాన్ని కొనసాగిస్తాం : కవిత
-
ఆమోదించే వరకు 'పోరాటం'
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేవరకు పోరాటాన్ని ఆపబోమని భారత్ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం మెడలు వంచే వరకు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని చెప్పారు. మహిళలకు ధరణిలో సగం, ఆకాశంలో సగం, అవకాశాల్లోనూ సగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించేందుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించారు. కాగా సాయంత్రం 4 గంటలకు సీపీఐ కార్యదర్శి నారాయణ, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావులు కవితకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. బిల్లుతో దేశ ప్రజాస్వామ్యం బలోపేతం మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది కేవలం తన సమస్యో, తన రాష్ట్రం సమస్యో కాదని, మొత్తం దేశానికి సంబంధించిన సమస్య అని కవిత చెప్పారు. ఇది రాజకీయ పరమైన అంశం కూడా కాదని స్పష్టం చేశారు. ఈ బిల్లుపై ప్రతిపక్షం సహా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయని, కానీ పార్లమెంటులో ఆమోదం పొందేలా ఏ పార్టీ కూడా కృషి చేయడం లేదని విమర్శించారు. దేశం అభివృద్ధి చెందాలంటే పురుషులు, మహిళలు ఇద్దరికీ సమాన ప్రాతినిధ్యం అవసరమని అన్నారు. ఈ బిల్లు చారిత్రక అవసరమని, మహిళలకు 33% రిజర్వేషన్లు అందించడం వల్ల దేశ ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. తలుచుకుంటే రెండు గంటల్లో ఆమోదించొచ్చు పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకురావాలని, ఆ పార్టీ తలుచుకుంటే రెండు గంటల్లో ఈ బిల్లును ఆమోదించవచ్చని కవిత చెప్పారు. పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతు ఇవ్వడానికి అనేక పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, తాము కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. 1992లో స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఫలితంగా నేడు 21 రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా మహిళా ప్రాతినిధ్యం ఉందని వివరించారు. చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్లు కల్పిస్తే.. 10–20 ఏళ్ల తర్వాత పార్లమెంటు, అసెంబ్లీల్లో సైతం మహిళల ప్రాతినిధ్యం 50 శాతానికి పైగా పెరుగుతుందని తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు తెచ్చేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని పార్టీలను కోరారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీక్షకు వచ్చిన మహిళల సంతకాలతో కూడిన లేఖను రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపిస్తామని వెల్లడించారు. మహిళా భాగస్వామ్యంతోనే అభివృద్ధి: ఏచూరి రాజకీయ రంగంలో మహిళా రిజర్వేషన్లు చాలా అవసరమని ఏచూరి అన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలకు సమానత్వం ఎప్పటివరకు రాదో అప్పటివరకు అభివృద్ధి జరగదని తెలిపారు. మహిళా భాగస్వామ్యం లేని ఏ దేశం కూడా ఆర్థికంగా పురోగతి సాధించలేదని స్పష్టం చేశారు. ఈ విషయమై ప్రధాని మోదీ హామీ ఇచ్చి 9 ఏళ్లు గడిచినా ఇప్పటికీ బిల్లు తీసుకురాలేదని విమర్శించారు. భారత్ జాగృతి, బీఆర్ఎస్తో కలిసి నడుస్తామని, ఈ పోరాటానికి తమ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. మోదీ జవాబు చెప్పాలి: ఆప్ ఎంపీ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నప్పుడు.. మహిళా బిల్లు ఎందుకు ఆమోదం పొందడం లేదో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ పోరాడినా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. మరోమంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, సంతోష్ కుమార్, వెంకటేశ్ నేత, మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, రేఖా నాయక్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, భారత్ జాగృతి నాయకులు దీక్షలో పాల్గొన్నారు. వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. -
ఆమె నిరీక్షణకు పాతికేళ్లు!
-
ఆమె నిరీక్షణకు పాతికేళ్లు!
భారత పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి పాతికేళ్లయింది. పార్లమెంటులో, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు మూడింట ఒకవంతు లేక 33 శాతం సీట్లను ప్రత్యేకించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును మొట్టమొదటగా 1996 సెప్టెంబర్ 12న ప్రవేశపెట్టారు. కానీ దాని భవిష్యత్తు మాత్రం ఇప్పటికీ ఊగిసలాటతోనే ఉంది. ఎప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు వచ్చినా, మళ్లీ ప్రవేశపెట్టినా సరే, పార్లమెంటులో అది రభసకు, నాటకీయ పరిణామాలకు దారితీస్తూ వచ్చింది. ప్రస్తుతం చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం కాస్త మెరుగుపడింది కానీ, రాజకీయ నేతలతో పోలిస్తే భారత మహిళా నేతల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. చట్టసభల్లో మహిళల సంఖ్యను పెంచే విషయంలో చేయవలసింది ఎంతో ఉందని గుర్తించాలి. చాలా దేశాలు జెండర్ ఆధారిత కోటాను పూరించడంలో ఏదోరకమైన పురోగతి సాధించాయి కానీ భారత పార్లమెంటు మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లును రెండు దశాబ్దాలకు పైగా పదే పదే అడ్డుకోవడం అత్యంత శోచనీయమైన విషయం. పార్లమెంటులో చాలా బిల్లులు శాసన రూపం దాల్చకుండా ఆగి పోయి ఉండవచ్చు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు పట్టిన గతి మరే బిల్లుకూ పట్టలేదంటే అతిశయోక్తి కాదు. ఆ బిల్లును ప్రవేశపెట్టి పాతికేళ్లయింది, ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పోయాయి కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రం సభ ఆమోదానికి వేచి చూస్తూనే ఉంది. పార్లమెం టులో, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు మూడింట ఒకవంతు లేక 33 శాతం సీట్లను ప్రత్యేకించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును మొట్టమొదటగా 1996 సెప్టెంబర్ 12న ప్రవేశపెట్టారు. ఇటీవలి సంవత్సరాల్లో చట్టసభల్లో, అధికార పీఠాల్లో మహిళల ప్రాతి నిధ్యం కాస్త మెరుగుపడింది కానీ ఎన్నికైన రాజకీయ నాయకులతో పోలిస్తే భారతీయ మహిళానేతల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 1996 తర్వాత ఎప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు వచ్చినా, మళ్లీ ప్రవేశపెట్టినా సరే, పార్లమెంటులో అది రభసకు, నాటకీయ పరిణామాలకు, బిల్లు కాగి తాలను విసిరేయడానికి దారితీస్తూ వచ్చింది. ఇంకా ముఖ్యంగా దానికి వ్యతిరేకంగా అన్ని రకాల అడ్డంకులను సృష్టిస్తూ వచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లును ఎప్పుడు చట్టసభలో చర్చకు పెట్టినా అది పేలడానికి సిద్ధంగా ఉన్న కాలాతీత బాంబును తలపిస్తూ వచ్చింది. కాలంతో పనిలేని బాంబు అని ఎందుకనాల్సి వచ్చిందంటే అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టినా సరే, మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ కల్లోలాన్ని సృష్టించింది. రాజ్యసభను దాటని బిల్లు పాతికేళ్లుగా మహిళా బిల్లును ఏదోవిధంగా రాజకీయ పార్టీలు అడ్డుకుని, పార్లమెంటులో దానికి ఆమోదం లభించకుండా తమదైన పాత్ర పోషిస్తూ వచ్చాయి. 1998, 1999లలో చివరకు 2008లో కూడా ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ అప్పటి కేంద్ర ప్రభుత్వాలు రద్దయిన రోజున మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వీగిపోతూ వచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు ‘కోటాలో కోటా’ను కల్పించాలని కొత్త సవరణను చేర్చిన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందింది కానీ ఈరోజుకీ అది పార్లమెంటులో పెండింగులో ఉంటూ వస్తోంది. ఈ పాతికేళ్లలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవాలనే ఆకాంక్ష విషయంలో, రాజకీయ నాయకులను పార్టీలకు అతీతంగా ఐక్యపరిచిన ఘటన మరే బిల్లు విషయంలోనూ జరగలేదు. ఈ బిల్లుకు సంబంధించి సాంకేతిక సమస్యలను ఇప్పటికీ పరిష్కరించాల్సిన అవసరముందని చట్టసభలపై నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్ ప్రాతిపదిక హేతుబద్ధతను నిర్ణయించే విధానాలపై నిశితంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని కాదనలేం. వరుసగా మూడు సాధారణ ఎన్నికల తర్వాత ఒక సీటును మహిళలకు రిజర్వు చేయాలని మొదటిసారిగా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపాదించారు. ఇది కూడా చర్చనీయాంశమైంది. కానీ ఇవేవీ బిల్లు ఉనికినే తోసిపుచ్చేటంత స్థాయిలో లేవు. బిల్లుకు ఆమోదం లభించినప్పుడు ఇలాంటి అంశాలను సులభంగా పరిష్కరించవచ్చు. లైంగిక సమానత్వం సాధ్యమేనా? చట్టసభల్లో లింగ వైవిధ్యతను మెరుగుపర్చడం గురించి ప్రపంచవ్యాప్తంగా అరుపులు, పెడబొబ్బలు వినపడుతూనే ఉన్నాయి. కానీ అంతర్జాతీయంగా చూస్తే ఇంతవరకు 14 దేశాల్లో మాత్రమే మహిళలు మంత్రివర్గాల్లో 50 శాతం సీట్లను కైవసం చేసుకున్నారు. యూఎన్ విమెన్ సంస్థ చెప్పినదాని ప్రకారం ప్రస్తుతం 24 దేశాల్లో దేశాధినేతలుగా లేక ప్రభుత్వాధినేతలుగా 26 మంది మహిళలు మాత్రమే అధికారంలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుత వేగంతోనే సాగితే ప్రపంచంలో లైంగిక సమానత్వం ఏర్పడాలంటే మరొక 130 సంవత్సరాల సమయం పట్టేటట్లుంది. ఆయా దేశాల పార్లమెంట్లలో మహిళలు 25 శాతం మాత్రమే చోటు సంపాదించుకున్నారు. నాలుగు దేశాల పార్లమెంట్లలో మాత్రమే 50 శాతం మహిళలు కనబడుతున్నారు. ఇక 19 దేశాల్లో మాత్రమే 40 శాతం మంది మహిళలు పార్లమెంటుకు వెళ్లగలిగారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని మూడింట రెండొంతుల కంటే ఎక్కువ దేశాలు లింగపరమైన కోటాను పూరించడంలో ఏదోరకమైన పురోగతి సాధించాయి కానీ భారత పార్లమెంటు మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లును పదే పదే అడ్డుకోవడం అత్యంత శోచనీయమైన విషయం. నిజంగానే ప్రస్తుతం భారత పార్లమెంటులో మహిళల ప్రాతి నిధ్యం మెరుగైంది. మొట్టమొదటి లోక్సభలో 24 మంది మహిళా ఎంపీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలు ఉండటం విశేషమని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ పేర్కొంది. 1996లో లోక్సభలో మహిళలు 7.7 శాతం మంది, రాష్ట్రాల శాసనసభల్లో 4 శాతం మంది మహిళా ప్రతినిధులు ఉండగా, వీరితో పోలిస్తే ఇప్పుడు పార్లమెంటులో 14.4 శాతం మంది, రాష్ట్రాల శాసనసభల్లో 8 శాతం మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు. అయితే మహిళా ప్రాతినిధ్యం విషయంలో రాజకీయ పార్టీలు తగినంత కృషి చేస్తున్నాయా అనేది ప్రశ్న. దేశం మొత్తంలో ఒక తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే 40 శాతం మహిళలను ఎంపీలుగా గెలిపించుకుంది. అలాగే గత 17 సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 11 మంది మహిళలకు మంత్రి పదవులిచ్చింది. అయితే 2021 జూన్ వరకు ఎన్నికైన మహిళా నేతల విషయంలో మొత్తం 193 దేశాల్లో భారత్ 148వ స్థానంలో ఉంటూ కనిష్ట స్థాయిలో ఉండటం విచారకరం. ఎన్నికైన రాజకీయ ప్రతినిధులుగా మహిళల సంఖ్యను పెంచడానికి సంబంధించి ఇంకా చేయవలసింది ఎంతో ఉందని గుర్తించాలి. బిల్లుపై వ్యతిరేకతకు కారణాలు ఇవా? మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తే తోలుబొమ్మ అభ్యర్థులు, నకిలీ అభ్యర్థులు గెలవడానికి దారితీస్తుందంటూ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న వారు వాదిస్తున్నారు. భారతీయ జనాభాలో దాదాపు సగంమంది మహిళలే ఉంటున్నారు. కానీ మన కోసం మాట్లాడే మహిళా నేతలు ఇప్పటికీ తగినంతమంది లేరు. ఈరోజుల్లో ఇది ఎంతవరకు న్యాయం? ఇది సమర్థనీయమేనా, కనీసం ఆచరణాత్మకమైనదేనా? పైగా ఇప్పుడు చట్టసభల్లోనూ, అధికార స్థానాల్లో ఉన్న మహిళలు తమ సమర్థతను ఎంతగానో మెరుగుపర్చుకుంటున్నట్లు బలమైన ఆధారాలు కూడా ఉంటున్నాయి. యూఎన్ విమెన్ సంస్థ దీనికి సమర్థనగా రెండు ఉదాహరణలు చూపించింది. భారత్లో, మహిళ నాయకత్వంలోని పంచాయతీల్లో నిర్వహిస్తున్న తాగునీటి ప్రాజెక్టులు, పురుషుల నాయకత్వంలోని పంచాయతీల్లో కంటే 62 శాతం అధికంగా ఉంటున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాలు పంచాయతీ రాజ్ సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ని మహిళలకు కేటాయించడమే దీనికి కారణమని గుర్తించాలి. మరొక ఉదాహరణను నార్వేలో చూడవచ్చు. మునిసిపల్ కౌన్సిళ్లలో మహిళల ఉనికికి, శిశు సంరక్షణ కవరేజీకి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఆ దేశంలో కనుగొన్నారు. మహిళలు నిజంగానే పాలనను, నాయకత్వాన్ని పరివర్తన చెందించగలరు. ఒక మహిళగా నాకు ఈ విషయం ముందుగానే తెలుసు కానీ, మహిళలంటే ద్వేషించే, బద్ధవ్యతిరేకత ప్రదర్శించే వారికోసమే ఈ రెండు ఉదాహరణలను ఇక్కడ చూపిస్తున్నాను. – సుథపా పాల్ రచయిత్రి, మీడియా ఎంట్రప్రెన్యూర్ (మిలీనియం సౌజన్యంతో) -
రాజకీయ రంగంలో 'ఆమె'కు అన్యాయమే!
అవనిలో సగభాగమైన అతివలకు రాజకీయ రంగంలో ప్రధాన పార్టీలు మొండి చేయి చూపిస్తున్నాయి.మగవారితో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. స్థానిక సంస్థల్లో మాత్రం రిజర్వేషన్ ఉంటుంది కనుక కచ్చితంగా మహిళలకు 50శాతం స్థానాలు కేటాయిస్తారు. తప్పని పరిస్థితుల్లో భర్తలు తమ భార్యలను రంగంలోకి దింపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రధాన పార్టీలు మహిళలను నిర్లక్ష్యం చేశాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 202మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈ నియోజకవర్గాల్లో కేవలం 13 మంది మహిళలు మాత్రమే పోటీలో ఉన్నారు. సాక్షి, ఆలేరు : ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరఫున గొంగిడి సునీత, ఇండిపెండెంట్ అభ్యర్థిగా జన్నె సరిత పోటీ చేస్తుండగా కోదాడ నుంచి నల్లమాద పద్మావతి కాంగ్రెస్ తరఫున, నాగార్జునసాగర్లో నివేదితారెడ్డి (బీజేపీ), సౌజన్య బీఎల్ఎఫ్ తరఫున పోటీల్లో ఉన్నారు. అలాగే నల్లగొండ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పర్వీన్, సూర్యాపేటలో ప్రజాబంధు పార్టీ తరఫున పాల్వయి వనజ, హుజూర్నగర్లో ఇండిపెండెంట్గా బానోతు పద్మ, నకిరేకల్లో ఎన్సీపీ అభ్యర్థిగా స్వరూపరాణి, తుంగతుర్తిలో టీపీపీఐ అభ్యర్థిగా ఇందిరా, ఎన్జేపీఐ అభ్యర్థిగా పాల్వయి పద్మ, ఇండిపెండెంట్లుగా సృజన, శిల్పలు ఎన్నికల బరిలో నిలిచారు. ఓటర్లుగా మహిళలే అధికం ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళల ఓట్లే అధికంగా ఉన్నాయి. పురుషులు 12,80,959 స్త్రీలు 12,85,194 ఇతరులు 112 మంది ఉన్నారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, మునుగోడు, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో పురుషుల కన్న మహిళలే అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొ త్తం ఓట్లు 25,66,265 ఓట్లు ఉన్నాయి. నాటినుంచి ఎనిమిది మంది మహిళలే .. 1952 నుంచి 2014 వరకు ఉమ్మడి జిల్లాలో 8 మంది మహిళలు మాత్రమే శాసన సభకు ఎన్నికయ్యారు. వీరిలో ఆలేరు నుంచి ఆరుట్ల కమలాదేవి, నకిరేకల్ నుంచి మూసాపేట కమలమ్మ, తుంగతుర్తి నుంచి మల్లుస్వరాజ్యం, నల్లగొండ నుంచి గడ్డం రుద్రమాదేవి, భువనగిరి నుంచి ఉమామాధవరెడ్డి, దేవరకొండ నుంచి భారతిరాగ్యానాయక్, ఆలేరు నుంచి గొంగిడి సునీత, కోదాడ నుంచి పద్మావతిలు ఎన్నికయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదమేదీ..? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి ప్రశ్న : మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: చంద్రబాబునా యుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేస్తున్న తన భర్త ఎలిమినేటి మాధవరెడ్డి 2000 సంవత్సరంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద నక్సల్స్ మందుపాతర పేల్చిన సంఘటనలో మృ తిచెందారు. దీంతో రాజకీయంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. ప్రశ్న : ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఎలా వచ్చింది? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: 2000 సంవత్సరంలో తన భర్త మాధవరెడ్డి మృతి అనంతరం ప్రజల కోరిక మేరకు భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ప్రశ్న : మీ పదవీ కాలంలో ఏయే కార్యక్రమాలు నిర్వహించారు? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: తాను మూడుసార్లు భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాను. నా పదవీకాలంలో నియోజకవర్గంలోని చౌటుప్పల్, బీబీనగర్ మండల పరిషత్ కార్యాలయాలను నిర్మించబడింది. మూసీ పరీవాహక ప్రాంతంలోని శివారెడ్డిగూడెం, గోసుకొండ గ్రామాలకు మూసీ నీటి కాల్వను నిర్మించబడింది. బునాదిగాని, పిలాయిపల్లి కాల్వ నిర్మాణానికి సర్వే చేసి ప్రభుత్వ అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. వేలిమినేడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంతోపాటు మరి రెండు ప్రాంతాల్లో విద్యుత్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేశాం. రోడ్లు, పాఠశాల భవనాలను నిర్మించాం. ప్రశ్న : అప్పటి పరిస్థితుల్లో మహిళలకు ఎలాంటి అవకాశాలు లభించాయి? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: అప్పటి పరిస్థితుల్లో రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించారు. మహిళలకు పెద్దపీట వేశారు. ప్రశ్న : ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా యి, మహిళలకు అవకాశాలు ఉన్నాయా లేవా? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: ప్రస్తుతం రాజకీయాల్లో అలాగే ఉన్నాయి. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. కానీ ఇంత వరకు అది జరగడం లేదు. జనాభాలో 50శాతం ఉన్న మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలి. ప్రస్తుతం మాత్రం ఫర్వాలేదు. ప్రశ్న : అప్పటికి ఇప్పటికీ ప్రచార శైలి తేడా ఎలా ఉంది? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: అప్పటికి ఇప్పటికీ ప్రచార శైలిలో చాలా తేడా ఉంది. అప్పట్లో కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చేవారు. రాజకీయాల్లో మనస్ఫూర్తిగా పని చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మరిన్ని వార్తాలు... -
ఏకాభిప్రాయంతోనే మహిళా రిజర్వేషన్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఏకాభిప్రాయంతోనే చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు సాధ్యమవుతాయని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి స్పష్టం చేశారు. శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం మూలనపడేయడానికి కారణాలు ఏమిటని, అసలు ఈ బిల్లు పట్ల ప్రభుత్వ దృక్పథం ఏమిటని, రాజ్య సభలోఇప్పటికీ ఆమోదం పొందిన ఈ బిల్లును లోక్ సభ ఆమోదం పొందడానికి ఉన్న ఆటంకం ఏమిటని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. చట్ట సభల్లో 33 శాతం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేసే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన 108వ రాజ్యాంగ బిల్లును 2010 మార్చి 9న రాజ్యసభ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. ఆ బిల్లు 15వ లోక్ సభ ఆమోదం పొందకుండా పెండింగ్లో ఉండిపోయిందని.15వ లోక్ సభ రద్దు కావడంతో బిల్లు కాలపరిమితి కూడా దాటిపోయిందని వివరించారు. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే అన్ని రాజకీయ పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చి ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతే ఈ బిల్లు ఆమోదం చేపట్టే రాజ్యాంగ సవరణను పార్లమెంట్ ముందుకు తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు. -
‘ఆయన మంత్రి కాదు..డీలర్’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. మహిళా సాధికారతను సాధించే క్రమంలో ట్రిపుల్ తలాఖ్, నిఖా హలాలా, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందేలా కాంగ్రెస్ సహకరించాలని కోరిన మంత్రి రవిశంకర్ ప్రసాద్ను డీలర్గా అభివర్ణించింది. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన మేరకు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని కోరుతూ రాహుల్ గాంధీ ప్రధానికి రాసిన లేఖపై మంత్రి స్పందిస్తూ ఈ బిల్లుల ఆమోదానికి తమతో కలిసి రావాలని కాంగ్రెస్ను కోరారు. అయితే మంత్రి స్పందనపై కాంగ్రెస్ విరుచుకుపడింది. రవిశంకర్ ప్రసాద్ లేఖతో మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టరూపం దాల్చేలా ప్రధాని మోదీ ఎలాంటి చొరవ చూపడం లేదని తేటతెల్లమైందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళా బిల్లును పార్లమెంట్ ఆమోదం పొందేలా వ్యవహరించాల్సిన న్యాయ శాఖా మంత్రి డీలర్గా మారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ప్రధాని మహిళా రిజర్వేషన్ల బిలుపై హామీ ఇచ్చినప్పుడు ఇది షరతులతో కూడిన హామీగా పేర్కొన్నారా అంటూ ఎంపీ, అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టకముందే మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు చేపట్టలేదో ప్రధాని మోదీ ఇంతవరకూ వివరణ ఇవ్వలేదని అన్నారు. -
‘ఆ విషయంలో మోదీకి బేషరతుగా మద్దతు’
సాక్షి, న్యూఢిల్లీ : మహిళ రిజర్వేషన్ బిల్లు అంశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. పార్లమెంటులో మహిళ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే తమ పార్టీ బేషరతుగా మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విటర్లో స్పందించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానికి రాసిన లేఖను పోస్ట్ చేశారు. ‘మహిళ రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఉంటుంది. 2010 మార్చి 9వ తేదీన మహిళ రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో పాస్ అయిందనే విషయం మీకు తెలిసిందే. కానీ ఎనిమిదేళ్లయినప్పటికీ లోక్సభలో ఆమోదం పొందలేదు. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ దీనిని చరిత్రాత్మక బిల్లుగా పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ దృఢ నిశ్చయంతో ఉంది. బీజేపీ కూడా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి పేర్కొంది. మోదీ తన ప్రసంగాల్లో మహిళ సాధికారత గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. మీ ఆశయాన్ని నేరవేర్చుకోవడానికి ఇంతకన్నా మంచి సమయం ఉండదు. మేము బేషరతుగా బిల్లుకు మద్దతు ఇస్తున్నాం. బిల్లు ప్రవేశపెట్టడానికి వచ్చే పార్లమెంట్ వర్షకాల సమావేశాల కన్నా మంచి సమయం ఉండదు. దీనిలో జాప్యం జరిగితే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు బిల్లు ఆమోదం పొందడం అసాధ్యమవుతోంది. లోక్సభలో బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. కాంగ్రెస్ కూడా మద్దతు తెలుపుతోంది. ఈ చరిత్రాత్మక బిల్లును సాకారం చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్గించేలా కాంగ్రెస్ పార్టీ 32 లక్షల మందితో ఈ బిల్లుకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టింది. మేము వీటిని మీకు అందజేస్తాం. ఈ బిల్లు చట్టంగా మారితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలు పోటీ చేయడానికి అవకాశం దక్కుతోంది. మహిళ సాధికారత విషయంలో అందరం కలసి భారత ప్రజలకు గొప్ప సందేశాన్ని ఇద్దాం. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పిద్దాం’ అని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. శనివారం ఉత్తరప్రదేశ్లో జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లింల పక్షానే నిలుస్తుందని, ట్రిపుల్ తలాక్పై వీరు అనుసరిస్తున్న ధోరణే ఇందుకు నిదర్శనమని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఒకవైపు ప్రధాని విమర్శలు, మరోవైపు జూలై 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మహిళ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతూ రాహుల్ గాంధీ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. Our PM says he’s a crusader for women’s empowerment? Time for him to rise above party politics, walk-his-talk & have the Women’s Reservation Bill passed by Parliament. The Congress offers him its unconditional support. Attached is my letter to the PM. #MahilaAakrosh pic.twitter.com/IretXFFvvK — Rahul Gandhi (@RahulGandhi) 16 July 2018 -
మహిళా బిల్లు గట్టెక్కేనా?
విశ్లేషణ జనాభాలో సగమైన మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం లభించకపోతే దాన్ని నిజమైన ప్రజాస్వామ్యం అనలేం. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో మానవాభివృద్ధి, సామాజికాభివృద్ధి మెరుగ్గా ఉంటున్నాయి. మహిళా ప్రతినిధు లున్న గ్రామాల్లో మరుగుదొడ్లు, ఆరోగ్య కేంద్రాలు, బాలికా విద్య, అంగన్వాడీలు మొదలైనవి మెరుగ్గా పనిచేస్తున్నట్లు రుజువైంది. ఈ మార్పు జాతీయ స్థాయిలో ప్రతిఫలించాలంటే.. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం నిర్ణయాత్మక స్థాయికి పెరగడం అవసరం. ఎన్నికలు సమీపిస్తే చాలు, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న అంశాలు తెరపైకి వస్తుంటాయి. ఈసారి సార్వత్రిక ఎన్నికలు ముందుగానే, 2018 నవంబర్లో జరుగవచ్చని బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో, మహిళా రిజర్వేషన్ బిల్లు మరోసారి రానున్న పార్లమెంటు సమావేశాలను కుదిపివేసేలా ఉంది. ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇప్పటికే ఆ పార్టీ మహిళా బిల్లుకు మద్దతుగా దేశవ్యాప్తంగా లక్షలాదిమంది మహిళల సంతకాలను సేకరించే పనిలో ఉంది. పంచాయతీలు, పురపాలక సంఘాల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పించామని చాటుకుం టున్న కాంగ్రెస్... మహిళా బిల్లు ఆమోదం పొందితే అది కూడా తమ ఘన తేనని చెప్పుకోవచ్చని తాపత్రయపడుతున్నది. అధికార బీజేపీ గత మూడేళ్లుగా ఈ బిల్లుపై నాన్చుడు ధోరణిని అవలంబిస్తోంది. బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకాలు లేకున్నా, దాన్ని పట్టాలకెక్కించాలన్న సంకల్పం ఆ పార్టీలో కనపడటం లేదు. ఏ పార్టీకి లబ్ధి చేకూరుతుందనే దాన్ని పక్కన పెడితే ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ లభి స్తుంది. అంటే పార్లమెంట్లో వారి ప్రాతినిధ్యం ఇప్పుడున్న దానికి (12%) దాదాపు 3 రెట్లు పెరుగుతుంది. అయితే, ఈ బిల్లు చట్టంగా రూపొందడం అంత సులువేమీ కాదు. లేకపోతే రెండు దశాబ్దాల క్రితమే అది జరిగి ఉండేది. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని అనిపించుకోవడం కోసమే కొన్ని పార్టీలు మహిళల హక్కులు, వారి సమానత్వం గురించి ఉపన్యాసాలు, మొక్కుబడి ప్రకటనలు చేస్తున్నాయి. ఆచరణలో అందుకు ఎలాంటి చొరవనూ చూపటం లేదు. మహిళా బిల్లుపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మధ్య, ప్రధానంగా పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న ప్రధాన పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలి. రెండు దశాబ్దాలైనా ఎక్కడి గొంగళి అక్కడే రెండు దశాబ్దాలకు పైబడిన చరిత్ర ఉన్న ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసాయిదాను 1996లో దేవేగౌడ ప్రధానిగా ఏర్పడ్డ యునైటెడ్ ఫ్రండ్ ప్రభుత్వం లోక్సభలో చర్చకు పెట్టింది. ఆ సందర్భంగా సభలోని వివిధ రాజకీయ పక్షాల మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరిగాయి. ఏకాభిప్రాయం కుదరక, అది వీగిపోయింది. తదుపరి, ఈ బిల్లును చర్చకు పెట్టిన ప్రతి సందర్భంలోనూ సభలో యుద్ధ వాతావరణం నెలకొనడం ఆనవాయితీగా మారింది. 1998లో వాజ్పేయి ప్రభుత్వం సభలో బిల్లును ప్రవేశపెట్టారు. కానీ, ఆర్జేడీకి చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు బిల్లు కాపీలను స్పీకర్ వద్ద నుంచి లాక్కొని చించివేశారు. ఆ తదుపరి 1999, 2002, 2003లలో బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం మొండి చెయ్యి చూపడం సాగింది. చివరకు 2010 మార్చి, 9న కేంద్ర, రాష్ట్రాల చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. 15 ఏళ్ల పాటూ ఈ చట్టం అమలులో ఉన్న తర్వాత మహిళా రిజర్వేషన్లను ఎత్తివేయాలన్న నిబంధనను బిల్లు ముసాయిదాలో చేర్చారు. అయినా, రాజ్యసభ ఆమోదం పొంది 17 ఏళ్లు గడిచినా లోక్సభ ఆమోదానికి అది నోచుకోవడం లేదు. మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల మద్దతున్నా మహిళా బిల్లు గట్టెక్కక పోవడానికి కారణం లోక్సభలో పురుషాధిక్య భావజాలంలో కొట్టుమిట్టాడుతున్న కొన్ని పార్టీల వైఖరి అనేది విస్తృత జనాభిప్రాయం. ఈ రిజర్వేషన్లలో ఉపకోటా ఉండాలని ఓబీసీలు, ముస్లిం మైనార్టీ వర్గాలు పట్టుబడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకున్న రిజర్వేషన్ల దామాషా ప్రకా రమే ఆ వర్గాల మహిళలకు ఈ 33 శాతంలో 22.5 శాతం రిజర్వేషన్లు లభి స్తాయి. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు 27%, ముస్లిం మైనార్టీలకు 10% రిజర్వేషన్లను కల్పించాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండు చేస్తున్నాయి. అందుకు మరి కొన్ని పార్టీలు అంగీకరించడం లేదు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. ఇక, దేశంలోని ఓబీసీల జనాభా లెక్కల వివరాలు 1935 నాటివే తప్ప, మరెలాంటి ఆధారపడదగిన సమాచారం లేదు. పైగా ఓబీసీలకు అన్ని రాష్ట్రాల్లో ఒకే సాంఘిక హోదా లేదు. పలు రాష్ట్రాలు.. బీసీ కులాల జనాభా లెక్కలను నేటికీ తయారు చేయలేకపోయాయి. మహిళలకు ఇచ్చే 33% రిజర్వేషన్లు ఉన్నత రాజకీయ వర్గాల కుటుంబాల నుంచి వచ్చే మహిళలకే ఉపయోగపడుతుందని కొందరి అభ్యంతరం. ఉప కోటా సాధ్య పడకపోయినా, మహిళా రిజర్వేషన్లను ఉన్నత వర్గాల వారే మొదట ఉపయోగించుకోగలిగినా, ఆ పరిస్థితి కొనసాగదు. కనుక, ఉప కోటా సాకుతో మహిళా బిల్లునే అడ్డగించడంలో ఔచిత్యం కనపడదు. సంకీర్ణ ధర్మం కాంగ్రెస్ మార్కు సాకు 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ–1, యూపీఏ–2 ప్రభుత్వాలు పదేళ్లు అధికారాన్ని చెలాయించాయి. పలు తర్జన భర్జనల తదుపరి యూపీఏ–2 ఈ బిల్లును 2010లో రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదాన్ని సంపాదించింది. అయినా అది లోక్సభ ఆమోదాన్ని పొందలేకపోవడం కాంగ్రెస్ వైఫల్యమేనని చెప్పాలి. తమది సంకీర్ణ ప్రభుత్వం కనుక, భాగస్వామ్య పార్టీల మద్దతును కూడగట్టలేకపోయామని కాంగ్రెస్ సాకును వెతుక్కొంది. ప్రభుత్వం పడిపోయినా ఫరవాలేదని అదే ప్రభుత్వం వివాదాస్ప దమైన 123 నిబంధనతో సహా అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదుర్చు కుంది. ఆ పట్టుదలను మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో అది చూపలేకపోయింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్వాదీ అధినేత ములాయంసింగ్ యాదవ్ల బెదిరింపులకు లొంగి కాంగ్రెస్ దాన్ని అటకెక్కించింది. భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకొంటున్న ప్రస్తుత తరుణంలో కూడా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 12.15%కు పరిమితం కావడం.. మహిళల పట్ల చూపుతున్న వివక్షకు అద్దం పడుతున్నది. 1957లో లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం 4.45% కాగా, దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత 2014 నాటికి లోక్సభలో వారి ప్రాతినిధ్యం కేవలం 12.15%కు (543 సభ్యుల సభలో 66 మంది) పెరిగింది. చట్టసభల్లో మహిళా ప్రాతి నిధ్యం విషయంలో 193 దేశాల జాబితాలో మన దేశం 148వ స్థానంలో ఉన్నదని చెప్పుకోవడం సిగ్గుచేటు. 18 ఆసియా దేశాలనే చూసినా ఈ విషయంలో మనది 13వ స్థానం, 8 సార్క్ దేశాల్లో 5వ స్థానంలో ఉన్నాం. మన కంటే ఎంతో వెనుకబడ్డ ఆఫ్రికన్ దేశం రూవాండా చట్టసభల్లో మహిళా ప్రాతి నిధ్యం 64%, నేపాల్లో 29%, చివరకు ఆఫ్ఘనిస్థాన్లో సైతం 28% ఉండటం విశేషం. ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నదని భావించే పాకిస్తాన్ 20%తో మన కంటే ముందుండటం గమనార్హం. పాక్ తన జాతీయ అసెంబ్లీలో మహిళలకు రిజర్వేషన్లను కల్పించడం వల్లే ఇది సాధ్యమైంది. పాలనా స్వభావమే మార్చగల మహిళా ప్రాతినిధ్యం జనాభాలో సగమైన మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం లేకపోతే దాన్ని నిజమైన ప్రజాస్వామ్యం అనలేం. అన్ని స్థాయిల చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో మానవాభివృద్ధి సూచిక, సామాజికాభివృద్ధి మెరుగ్గా ఉన్నదని యునెస్కో నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) తాజా గణాంకాల ప్రకారం మానవాభివృద్ధి సూచికలో భారత్ 131వ స్థానంలో నిలిచింది. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, తాగునీరు, పౌష్టికాహార లోపం తదితర సమస్యల పీడి తులలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగడం మానవ, సామాజికాభివృద్ధి పెంపొందడానికి దారి తీస్తుంది. మహిళా ప్రతినిధులున్న గ్రామాల్లో మరుగుదొడ్లు, ఆరోగ్య కేంద్రాలు, బాలికా విద్య, అంగన్వాడీలు, పొదుపు సంఘాలు, డ్వాక్రా సంస్థలు మొదలైనవి మెరుగ్గా పనిచేస్తున్నట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. గ్రామీణ భారతంలో కనపడుతున్న ఈ మార్పు అన్ని స్థాయిల్లో ప్రతిఫలించాలంటే.. పరిపాలనా బాధ్యతల్లో మహిళా ప్రాతి నిధ్యాన్ని జాతీయ స్థాయికి విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమస్యలను పరిష్కరించడంలో, ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడంలో మహిళలు మగవారికి తీసిపోరని కార్పొరేట్ కంపెనీల అనుభవం చెబుతోంది. బాధ్యతగా పనిచేయడంలో పురుషుల కంటే మహిళలే ముందుంటున్నారు. రాజకీయ పార్టీల వైఖరి మారాలి చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటే రాజకీయ పార్టీల వైఖ రిలో మార్పు రావాల్సిందే. ప్రధాన రాజకీయ పక్షాలు, పార్టీ కమిటీలలో, శాసనసభ, లోక్సభ టిక్కెట్ల కేటాయింపులో మహిళలకు 33% వాటాను అందించగలిగితే, అదే గొప్ప సామాజిక, ఆర్థిక మార్పునకు నాంది కాగలుగుతుంది. కానీ, మహిళలకు 20% పార్టీ టిక్కెట్లు ఇచ్చేందుకు కూడా ఏ పార్టీ ముందుకు రావడం లేదు. 2014 ఎన్నికల్లో ఆరు ప్రధాన రాజకీయ పార్టీలు మహిళలకు 9% సీట్లు మాత్రమే కేటాయించాయి. ఈ పరిస్థితి మారడానికి ప్రతి రాజకీయపార్టీ మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించడాన్ని తప్పనిసరి చేయాలని ఇటీవల పౌర సమాజం డిమాండు చేస్తోంది. దీన్ని చట్ట రూపంగా తేవాలంటే పార్లమెంటు ఆమోదం అవసరం. కాబట్టి రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా మహిళలకు నిర్దిష్ట కోటాను ప్రకటించి మహిళా సాధికారత పట్ల తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలన్నది చాలా కాలంగా మేధావులు, పౌర సమాజం చేస్తున్న సూచన. 2010లో లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టాలని ఒత్తిడి తెచ్చి.. కాంగ్రెస్పార్టీని ఇరుకున పెట్టి రాజకీయ లబ్ధి పొందిన బీజేపీకి నేడు లోక్సభలో తగిన సంఖ్యాబలం ఉంది. కాంగ్రెస్పార్టీ, వామపక్ష పార్టీలు కలిసి వస్తామంటున్నాయి. మహిళా బిల్లును ఆమోదిస్తామన్న తమ ఎన్నికల హామీని నిలబెట్టుకొనే అవకాశం నేడు బీజేపీకి ఉంది. 2004లో, 2009లో, 2014 ఎన్నికల్లో బీజేపీ చెబుతూ వచ్చింది. ఆ మాటల్లోని చిత్తశుద్ధిని, నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అనువైన పరిస్థితీ ఉంది, సమయమూ ఆసన్న మైంది. మాట నిలుపుకోవాల్సినది బీజేపీ, ఆ పార్టీ ప్రధాని మోదీలే. డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మొబైల్ : 99890 24579 -
ఒక్క మహిళ కూడా లేని క్యాబినెట్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ మహిళను చిన్న చూపు చూస్తోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్లో శనివారం మహిళా కాంగ్రెస్ నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. దేశంలో ఒక్క మహిళ కూడా లేని క్యాబినెట్ తెలంగాణలోనే ఉందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ద్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ బతుకమ్మ పండుగ కోసం మహిళలకు అందజేసిన చీరలు నాసిరకమైనవని విమర్శించారు. చేనేత చీరలను ఇస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు నాసిరకం చీరలు ఇచ్చి మహిళలను కించపరిచారన్నారు. కేసీఆర్ కుటుంబ ప్రమోషన్ కోసమే బతుకమ్మ పండుగ సంబరాలను వాడుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు అన్నిరంగాల్లో మరింత మెరుగైన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2019లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని తెలిపారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేదో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో 33 శాతం రిజర్వేషన్ కోసం మూడు లక్షల సంతకాల సేకరణ చేయడం అభినందనీయమన్నారు. కేంద్రం ఇప్పటికైనా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేలా చూడాలని కోరారు. -
మహిళా బిల్లుకు మద్ధతిస్తాం: బూర నర్సయ్య గౌడ్
ఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీఆర్ఎస్ పార్టీ తమ మద్ధతు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీఆర్ఎస్ ప్రభుత్వం మద్ధతిస్తుందని ఆ పార్టీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. అయితే మహిళా బిల్లులోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల మహిళలకు స్థానం దక్కాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ తమ ప్రతిపాదనను వెల్లడించినట్లు తెలుస్తోంది. -
ఓబీసీ మహిళలకు సబ్కోటా ఇవ్వండి
* ఓబీసీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జంతర్మంతర్ వద్ద ధర్నా సాక్షి, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని కోరుతూ ఆలిండియా ఓబీసీ మహిళా సమాఖ్య సభ్యులు సోమవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. 545 మంది పార్లమెంట్ సభ్యుల్లో మహిళా ఎంపీలు పదుల సంఖ్యలో ఉండడం బాధాకరమని సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి అన్నారు. ఓబీసీ మహిళా ఎంపీల సంఖ్య మరింత పెరిగేలా అవకాశాలు కల్పించాలని కోరారు. ధర్నాకు టీఆర్ఎస్ ఎంపీ వినోద్కుమార్ సంఘీభావం తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిలుపై గతంలో తమ పార్టీ తరఫున పార్లమెంట్లో ప్రస్తావించామని చెప్పారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ, జ్యోతిరావ్ఫూలే, సావిత్రీబాయి ఫూలేకు భారత రత్న ఇవ్వాలని కోరారు. -
పెద్దపీట.. ఉత్తమాట!
తమిళనాడులో మహిళలను విస్మరించిన పార్టీలు ఒక్క మహిళకూ టికెట్టివ్వని బీజేపీ మూడు సీట్లతో సరిపెట్టిన కాంగ్రెస్ సి.నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘‘మహిళాభ్యుదయం.. ఆకాశంలో సగం.. మహిళా సాధికారత...’’ అంటూ ఓట్ల కోసం ఉపన్యాసాలు దంచేసే రాజకీయ నేతలకు టికెట్ల ద గ్గరికి వచ్చే సరికి మాత్రం ఆ మహిళలు కనిపించడం లేదు! మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామంటూ తమిళనాట నానా హంగామా చేసే పార్టీలన్నీ మహిళలకు మొండిచేయి చూపాయి. రాష్ట్రంలో పదికిపైగా ఉన్న పార్టీలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తమ్మీద 12 మంది మహిళలకు మాత్రమే టికెట్లిచ్చాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీ అయితే కనీసం ఒక్క మహిళనైనా బరిలోకి దించలేదు. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే తదితర పార్టీలతో పొత్తుపెట్టుకుని కూటమిని ఏర్పరచుకున్న బీజేపీ... ఈ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీచేస్తోంది. బీజేపీతోపాటు ఈ కూటమిలోని ఏ పార్టీ కూడా మహిళలకు టికెట్ ఇవ్వలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు గట్టి మద్దతుదారైన సుష్మాస్వరాజ్ పార్టీలోనే మహిళకు ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. ఇక మిగిలిన పార్టీల విషయానికి వస్తే అన్నాడీఎంకే 4, కాంగ్రె స్ 3, డీఎంకే 2, సీపీఎం 2, సీపీఐ ఒకరికి చొప్పున మహిళలకు అవకాశం కల్పించాయి. జయలలిత నేతృత్వంలోని అధికార అన్నాడీఎంకే సైతం మహిళలకు కేవలం నాలుగు సీట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. తమిళనాడులో 39, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలోని ఒకటి కలుపుకుని మొత్తం 40 లోక్సభ స్థానాలున్నాయి. పార్టీల వారీగా మహిళా అభ్యర్థులు... 4.అన్నాడీఎంకే: మరగతం కుమారవేల్ (కాంచీ పురం), వనరోజా (తిరువన్నామలై), సత్యభామ (తిరుపూర్), వాసంతి మురుగేశన్ (దక్షిణ కాశీ) 3. కాంగ్రెస్: చారుబాల తొండైమాన్ (తిరుచ్చీ), రాణీ (విళుపురం), జ్యోతిమణి (కరూర్) 3. వామపక్షాలు: వాసుకి (ఉత్తర చెన్నై) సీపీఎం, తమిళ్సెల్వి (తంజావూరు) సీపీఎం, మహేశ్వరీ (రామనాధపురం) సీపీఐ 2. డీఎంకే: ఉమా రమణి (సేలం), పవిత్ర వల్లి (ఈరోడ్) 0 బీజేపీ