YS Jagan Mohan Reddy Birthday Special
-
జనం కష్టాలు నేరుగా తెలుసుకున్న ఏకైక నాయకుడు... జనమే సాక్షి..
-
తండ్రికి తగ్గ తనయుడు
-
మనసున్న మారాజుకు జన్మదిన శుభాకాంక్షలు
-
జగన్ అంటే అలుపెరగని పోరాటం.. పడి లేచే కెరటం.. రాజకీయాల్లో మకుటం
-
టార్చ్ బేరర్
ప్రభుత్వ విద్యావ్యవస్థ బాగు కోసం ఐదేళ్లపాటు జగన్ అహర్నిశలు కృషి చేశారు. పిల్లల్ని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు శ్రమించారు.‘ప్రతి 30 సంవత్సరాలకు బతుకు తాలూకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లో ఆ కొత్త థాట్ను ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడినే టార్చ్ బేరర్ అంటారు.’ ఇది ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలోని ఓ డైలాగ్. నిజ జీవితంలో ఇలాంటివారు అరుదుగా ఉంటారు. 2019 – 24 మధ్య ఏపీలో జరిగిన పాలనను చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్చ్ బేరర్గా చెప్పొచ్చు. ఆ ఐదేళ్లలో ఆయన చేసిన సంస్కరణలు అలాంటివి.ఎంపీగా మొదలైన జగన్ ప్రస్థానం ఏపీ రాజకీయాలను కొత్త దారిలో నడిపించే స్థాయికి చేరుకుంది. ప్రజలకు మంచి చేసిన నాయ కుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. జగన్ మొదటి నుంచీ ప్రజల్లోనే ఉన్నారు. ఆయన పాదయాత్ర చేస్తే పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కాలు కదిపాయి. కోట్ల మంది ఓన్ చేసుకున్న లీడర్!జగన్ దేశంలో ఏ నాయకుడూ సాహసం చేయని పనులకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధి కాగితాలకు పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో కనిపించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ. 2,83,866 కోట్లు అందించారు. ఆయన పాలనే విప్లవాత్మక నిర్ణయాలతో మొదలైంది. సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1.34 లక్షల ఉద్యోగాలిచ్చారు. 58 వేలమంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి రాజకీయ పార్టీలు, కులమతాలకు అతీతంగా పథకాలను అందించారు.చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేశారు. కార్పొరేట్ను పెంచి పోషించారు. కానీ విద్యావ్యవస్థ బాగు కోసం ఐదేళ్లపాటు జగన్ అహర్నిశలు కృషి చేశారు. పిల్లల్ని గ్లోబల్ సిటిజన్లుగా మార్చేందుకు కష్టపడ్డారు. ఏపీలోని పల్లెల బిడ్డలు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడతారని ఏనాడైనా అనుకున్నామా? ‘నాడు – నేడు’తో బడికి కొత్త కళ వచ్చింది. ఏపీలో విద్యారంగ సంస్కరణల కోసం గత ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాలా రూ. 73 వేల కోట్లు. అభివృద్ధి, సంక్షేమాన్ని చంద్రబాబు గ్రాఫిక్స్లో చూపిస్తే జగన్ క్షేత్ర స్థాయిలో కనిపించేలా చేశారు. 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం... ఇలా ఆయన చేపట్టినవి ఎన్నో!దేశ చరిత్రలో ఏ నాయకుడిపై జరగనంత వ్యక్తిత్వ హననం జగన్పై జరుగుతోంది. జగన్ వీటిని చిరునవ్వుతోనే ఎదుర్కొంటున్నారు తప్ప ఎక్కడా మాట తూలలేదు. చంద్రబాబు పెంచి పోషిస్తున్న సోషల్ మీడియా సైకోలు జగన్పై నిత్యం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్లలో దుష్ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. జగన్ కూర్చొన్నా, మాట్లాడినా, నవ్వినా, చూసినా పిచ్చిపిచ్చి రాతలతో పోస్టులు, రీల్స్ పెడుతున్న వారి కుటుంబాల్లో ఎంతోమంది గత ప్రభుత్వంలో లబ్ధి పొంది ఉంటారు!జగన్కు పడటం కొత్త కాదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందు కెళ్లే వ్యక్తికి ఎలా లేచి నిలబడాలో బాగా తెలుసు. ఏదో మేజిక్ వల్ల గెలిచిన కూటమి పెద్దలు ఆయన పని అయిపోయిందని ఇప్పుడు సంబర పడుతూ ఉండొచ్చు. ఏపీలో అధికా రంలోకి వచ్చిన కొన్ని నెలలకే చంద్రబాబు అంతులేని వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఒకప్పటిలా సంక్షేమం అందకపోవడంతో జనం నిరాశలో కూరుకుపోతున్నారు. ప్రజల బాగు కోసం పనిచేసే నాయకుడు ఎప్పటికీ ఫెయిల్ కాడు. ఎందుకంటే వారి సంకల్ప బలం చాలా గొప్పది. నిజమైన జననేతకు జన్మదిన శుభాకాంక్షలు!– వెంకట్ -
లక్షల గళాల గర్జన
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : పెత్తందార్లపై పోరుకు తామంతా సిద్ధమంటూ ఎమ్మిగనూరు వేదికగా లక్షలాది గొంతుకలు సింహగర్జన చేశాయి. పొత్తులు.. జిత్తులు.. మోసాలు.. కుట్రలను ఎదుర్కొని పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా? అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుఇవ్వడంతో లక్షల మంది పిడికిళ్లు బిగించి మేమంతా సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. చంద్రబాబు లాంటి మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను సిద్ధం... మీరంతా సిద్ధమైతే సెల్ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేయాలని సీఎం జగన్ కోరడంతో ఒక్కసారిగా లక్షల మంది సెల్ఫోన్లలో టార్చ్ లైట్ వెలిగించడంతో సభా ప్రాంగణం ఆకాశంలో చుక్కలను తలపించింది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్లో నిర్వహించిన సభలో కనిపించిన దృశ్యాలివీ.. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని ఎమ్మిగనూరు సభ మరోసారి చాటిచెప్పిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన విశ్వాసానికి ఇది ప్రతీకగా నిలిచిందని అభివర్ణిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర మూడో రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లాలో బస్సుయాత్ర జైత్రయాత్రను తలపించింది. గురువారం పెంచికలపాడు వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సీఎం జగన్ రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం కర్నూలు సిటీ, పాణ్యం, కోడుమూరు సహా పలు నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు సీఎం వైఎస్ జగన్ను కలిశారు. ఎన్నికల్లో విజయానికి చేపట్టాల్సిన చర్యలపై వారికి సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్రను ప్రారంభించి రామచంద్రాపురం మీదుగా కోడుమూరుకు చేరుకున్న సీఎం జగన్కు భారీ గజమాలతో అభిమానులు ఘనస్వాగతం పలికారు. కోడుమూరులో సీఎం జగన్ రోడ్ షోకు జనం బ్రహ్మరథం పట్టారు. రోడ్ షో సాగుతున్నంత దూరం బస్సు ముందు చిన్నారులు కోలాటమాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది బారులుతీరి సీఎం జగన్పై బంతి పూలవర్షం కురిపించారు. చేనేత కార్మికులు చీరను, మగ్గాన్ని బహూకరించి సీఎం జగన్కు మద్దతు పలికారు. బుడగ జంగం సామాజికవర్గ ప్రజలు సీఎం జగన్ను కలిసిసంఘీభావం తెలిపారు. కురుబ సామాజికవర్గానికి చెందినవారు సీఎం జగన్కు మేకను బహూకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కోడుమూరు నుంచి హంద్రీ కైరవాడి చేరుకునే సమయానికి ఎండ తీవ్రత పెరిగింది. ఎండను లెక్క చేయకుండా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, చిన్నారులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి సీఎం జగన్పై పూలవర్షం కురిపిస్తూ వైఎస్సార్సీపీని గెలిపించేందుకు మేమంతా సిద్ధమంటూ... నినదించారు. గోనెగండ్లలోనూ సీఎం జగన్ బస్సు యాత్రకు జనం నీరాజనాలు పలికారు. అనంతరం సీఎం జగన్ భోజన విరామం తీసుకున్నారు. ఎమ్మిగనూరులో జన సునామీ.. భోజన విరామం అనంతరం రాళ్లదొడ్డి నుంచి బయలుదేరిన సీఎం జగన్ బస్సు యాత్రకు ఎర్రకోటలో జనం బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ బస్సుపై బంతిపూలవర్షం కురిపించారు. షెడ్యూలు ప్రకారం బస్సు యాత్ర ఎమ్మిగనూరుకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా, ప్రజలు అడుగడుగునా నీరాజనాలుపలకడంతో రెండుగంటలు ఆలస్యంగా 5.30 గంటలకు చేరుకుంది. సీఎం జగన్ ఎమ్మిగనూరుకు చేరుకునేసరికి కర్నూలు జిల్లా నలుమూల నుంచి లక్షల సంఖ్యలో జనవాహిని తరలిరావడంతో జనసంద్రాన్ని తలపించింది. ఉదయం 11 గంటల నుంచి ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి మొదలైన జనప్రవాహం సాయంత్రం 4.30 గంటలకు సునామీని తలపించింది. 30 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. పక్కనే పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కు, ఇరువైపులా రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఎమ్మిగనూరు చరిత్రలో సీఎం జగన్ సభ సువర్ణాక్షరాలతో లిఖించేలా నిలిచిపోతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జననేత కోసం నిరీక్షణ.. ఎమ్మిగనూరు సభ రాత్రి 7.20 గంటలకు ముగిసింది. అనంతరం బస్సుయాత్ర హనుమాపురం చేరుకుంది. సీఎం జగన్ను చూసేందుకు అవ్వతాతలు, మహిళలు, చిన్నారులు భారీ ఎత్తున రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డారు. సీఎం జగన్ రాగానే బంతిపూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హనుమాపురం నుంచి ఆస్పరి చేరుకునే సరికి రాత్రి 8.30 గంటలైంది. బస్సు యాత్ర అక్కడికి చేరుకోగానే హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. జన నీరాజనాల మధ్య చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా రాతన వద్ద ఏర్పాటు చేసిన బస శిబిరానికి రాత్రి 9.47 గంటలకు సీఎం జగన్ చేరుకున్నారు. కర్నూలు జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ నియోజక వర్గాల్లో సాగిన బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బస్సు యాత్ర శనివారం నాలుగో రోజు ఉదయం కర్నూలు జిల్లా పత్తికొండ బైపాస్ నుంచి ప్రారంభమై మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఉప్పొంగిన భావోద్వేగం ఐదేళ్ల పాలనలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేయడంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు తెచ్చి పేదరికాన్ని రూపుమాపడం, రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు చేపట్టిన చర్యలను వివరిస్తూ సీఎం జగన్ ప్రసంగించారు. 2014 ఎన్నికల్లో ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, తన ఫొటోతోపాటు సంతకం చేసిన లేఖను ఇంటింటికీ పంపిన చంద్రబాబు రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోభృతిగా ఇస్తానని, చేనేత, పవర్లూమ్స్ రుణాలు మాఫీ చేస్తానని, అర్హులందరికీ మూడు సెంట్ల భూమి ఇచ్చి పక్కా ఇళ్లు కట్టిస్తాననే ముఖ్యమైన హామీలతోపాటు 650 హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చకుండా వంచించటాన్ని ప్రస్తావించినప్పుడు లక్షల మంది ప్రజలు ఔనంటూ.. చేతులు ఎత్తి ఏకీభవించారు. ఇప్పుడు మళ్లీ అదే పొత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలతో సూపర్ సిక్స్ అంటూ మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని, వాటిని ఎదుర్కొని పేదల భవిష్యత్తును మరింతగా గొప్ప మార్చేందుకు వైఎస్సార్సీపీని గెలిపిచేందుకు సిద్ధమా? అంటూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపుతో మేమంతా సిద్ధమే.. అంటూ లక్షల గొంతుకలు ప్రతిస్పందించాయి. శింగనమలలో ఎస్సీ (మాదిగ) సామాజికవర్గానికి చెందిన టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు వైఎస్సార్సీపీ టికెట్ ఇస్తే చంద్రబాబు ఎద్దేవా చేసి తన పెత్తందారీ పోకడలను రుజువు చేసుకున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. పేదవాడు పైకి ఎదిగితే ఎందుకంత మంట? అని నిలదీశారు. మడకశిరలో ఈర లక్కప్ప అనే ఉపాధి కూలీకి టికెట్ ఇచ్చామని, దాన్ని కూడా ఎద్దేవా చేస్తావా బాబూ? అని ప్రశ్నించారు. ‘‘నా...’’ అంటూ అక్కున చేర్చుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 200 శాసనసభ, లోక్సభ స్థానాల్లో వంద సీట్లు ఇచ్చామని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ పేదల పార్టీ కాబట్టే సగం సీట్లు ఇచ్చామన్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని అవహేళన చేయడంతోపాటు తోకలు కత్తిరిస్తానంటూ బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి, మైనార్టీలను అణగదొక్కిన చంద్రబాబు తోకను కత్తిరించేలా తీర్పు ఇవ్వాలని సీఎం జగన్ పిలుపునిచ్చి నప్పుడు మేమంతా సిద్ధమే అంటూ లక్షల గొంతుకలు నినదించాయి. -
క్రికెట్ అంటే చిన్ననాటి నుంచే మక్కువ! ఆంధ్ర క్రికెటర్ల కోసం రాష్ట్రంలో..
పాఠశాల స్థాయి నుంచే జగన్కు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ.. ముఖ్యంగా క్రికెట్ అంటే మరీ ఇష్టం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నిహితులు చెప్పే మాట ఇది! హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించిన వైఎస్ జగన్.. క్రికెట్తో పాటు బాస్కెల్ బాల్ వంటి ఇతర క్రీడల్లోనూ భాగమయ్యే వారు. ఆ సమయంలో వైఎస్ కుటుంబం బంజారాహిల్స్లో నివాసం ఉండేవారు. కేవలం పాఠశాలలోనే కాకుండా.. ఇంటి దగ్గర కూడా స్నేహ బృందం ఏర్పాటు చేసుకున్న జగన్.. వారితో కలిసి క్రికెట్ ఆడుతూ ఉండేవారు. స్కూలైనా.. బయట అయినా ఫ్రెండ్స్ గ్యాంగ్లో నాయకుడిగా ఉండేందుకే ఇష్టపడే జగన్.. హెచ్పీఎస్లో హౌజ్ కెప్టెన్గా అరుదైన ఘనత దక్కించుకున్నారు. పన్నెండవ తరగతిలో ఉన్నపుడు.. మిగితా మూడు హౌజ్ల జట్లను ఓడించి రెడ్ హౌజ్కు ఆల్రౌండర్ చాంపియన్షిప్ అందించారు జగన్. కేవలం ఆటలే కాకుండా వ్యాసరచన వంటి పోటీలలోనూ తమ టీమ్ ముందుండేలా చేసి తన నాయకత్వ పటిమతో టైటిల్ సాధించారు. ఈ విషయాలను యువకెరటం పుస్తకంలో ఎఎస్ఆర్ మూర్తి, బుర్రా విజయశేఖర్ వెల్లడించారు. ఏపీఎల్తో ఆంధ్ర క్రికెటర్లకు మరింత ప్రోత్సాహం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడా రంగంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న క్రికెట్లో ఆంధ్ర క్రీడాకారుల సంఖ్య పెరిగేలా చొరవ తీసుకుంటోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. సీఎస్కే ముందుకు వచ్చేలా చర్యలు ఇందులో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు కావాల్సినంత ప్రోత్సాహం అందిస్తోంది. అంతేకాదు.. విశాఖపట్నంలో మరో అత్యాధునిక క్రికెట్ స్టేడియం నిర్మించే దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. విశాఖలో ఉన్న వైఎస్సార్ స్టేడియంను క్రీడలకు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉంది. అంతేకాదు రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చేలా చర్యలు చేపట్టింది. ఇక వైఎస్ జగన్ హయాంలోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరిట ఏసీఏ సరికొత్త క్రికెట్ టోర్నీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2022లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ టీ20 లీగ్లో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగాయి. విజయవంతంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు సీజన్లు అరంగేట్ర ఎడిషన్ను విజయవంతంగా పూర్తి చేసిన ఏసీఏ.. తాజాగా రెండో సీజన్ను కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసింది. ఏపీఎల్ తొలి సీజన్లో కోస్టల్ రైడర్స్ విజేతగా నిలవగా.. ఈ ఏడాది రాయలసీమ కింగ్స్ టైటిల్ సాధించింది. కాగా దేశవాళీ క్రికెట్తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ రాణించిన ఆటగాళ్లకే ఇటీవలి కాలంలో బీసీసీఐ సెలక్టర్లు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఔత్సాహిక ఆంధ్ర క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడేలా ఏసీఏ ఇలా ఏపీఎల్ పేరిట తమ వంతు ప్రయత్నం చేస్తోంది. క్రికెట్ దిగ్గజాలను ఆహ్వానిస్తూ 1983 వరల్డ్కప్ విజేత క్రిష్ణమాచారి శ్రీకాంత్ సహా టీమిండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ తదితరులను ఈ ఈవెంట్లకు ఆహ్వానించడం ద్వారా జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక.. కొత్త ప్రభుత్వ హయాంలో ఏపీ క్రీడల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందంటూ బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా పనిచేసిన ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం విశేషం. ఏపీ సీఎం కప్, ఆడుదాం ఆంధ్రా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ ప్రభుత్వం.. ఏపీ సీఎం కప్ పేరిట క్రికెట్తో పాటు క్రికెటేతర క్రీడల్ని కూడా ప్రోత్సహిస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల క్రీడా ఆణిముత్యాలను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్రా పేరిట క్రీడా సంబరానికి శ్రీకారం చుట్టింది. అంబాసిడర్గా అంబటి రాయుడు ఈ ఈవెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్లో అరుదైన ఘనతలు సాధించిన అంబటి రాయుడిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి ఖ్యాతి తీసుకువచ్చిన పీవీ సింధు(బ్యాడ్మింటన్), జ్యోతి సురేఖ వెన్నం(ఆర్చరీ), కేఎస్ భరత్(క్రికెటర్) తదితరులను సమున్నతరీతిలో సత్కరించింది. -
రూ.13.11 లక్షల కోట్ల ఒప్పందాలు.. 1.47 లక్షల మందికి ఉపాధి
సంక్షేమం కోసం అభివృద్ధిని పక్కనబెట్టినా, అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని విస్మరించినా కష్టమే. ‘నాలుగు బిల్డింగ్లు కట్టినంత మాత్రాన అభివృద్ధికాదు, నిన్నటి కంటే ఈ రోజు బాగుండటం, ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే నమ్మకం కలిగించగలిగితే దాన్నే అభివృద్ధి అంటారు’ అనే కొత్త నిర్వచనంతో జగన్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. అరకొర విమర్శలు చేయడం పారిపాటిగా పెట్టుకున్న కొంతమందికి ఈ కింది గణాంకాలు చూసైనా అర్థం అవుతుందేమో చూడాలి.అభివృద్ది అంటే ఒక్కరోజులో సాధ్యపడేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాల అభివృధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడం, పారిశ్రామిక పాలసీలను సులభతరం చేస్తూ.. రాష్ట్ర అభివృధికి అనుగుణంగా ఆ చట్టాను మారుస్తూ.. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. మార్చి నెలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు(జీఐఎస్)లో భాగంగా ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన 111 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిలో 24 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభించాయి. అవి రూ.5,530 కోట్ల విలువైన పెట్టుబడులతో దాదాపు 16,908 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఆ యూనిట్లలో ప్రధానంగా గ్రీన్ల్యామ్, డీపీ చాక్లెట్స్, అగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరిజెస్, గోద్రెజ్ అగ్రోవెట్, ఆర్ఎస్బీ ట్రాన్స్ మిషన్స్, సూక్మా గామా, ఎల్ఎల్పీ వంటి సంస్థలు ఉన్నాయి.ఇవే కాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లకు భూ కేటాయింపు పూర్తయి నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా మరో 1,31,816 మందికి ఉపాధి లభించనుంది. అదనంగా 194 యూనిట్లు డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దశలో ఉన్నాయి. జీఐఎస్లో భాగంగా త్వరలో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది.స్థానికంగా పరిశ్రమల అభివృద్ధి..పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 5వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్ను ఏర్పాటు చేయనుంది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్ను ఆవిష్కరించనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్గా ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పెట్టుబడులు సమకూర్చడంలో మేటి..ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ అక్టోబర్ నెలలో గుజరాత్ (రూ.25,685 కోట్లు) తర్వాత అధిక పెట్టుబడులు సమకూర్చిన రాష్ట్రాల్లో ఏపీ(రూ.19,187 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. దేశంలో విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో (రూ.72,622 కోట్లు) 56 శాతం ఖర్చుచేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అభివృద్ధి వ్యయంలో 54 శాతం ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. బాబు హయాంలో వచ్చిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం రూ.60 వేల కోట్లు. జగన్ హయాంలో రెండేళ్లు కరోనా ఉన్నా ఇప్పటికే దాదాపు రూ.90 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బాబు ప్రభుత్వంలో పారిశ్రామిక వృద్ధిరేటు 3.2 శాతంతో దేశంలో 22వ స్థానంలో ఉంటే, జగన్ ప్రభుత్వంలో 12.8 శాతం వృద్ధి రేటుతో దేశంలో మూడో స్థానంలో నిలిచింది.గతంలో కంటే భారీగా పెరిగిన ఎంఎస్ఎంఈలు..అధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా 18 ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రోత్సహకాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకు కేవలం ఎంఎస్ఎంఈలకే రూ.1,706 కోట్లు ప్రోత్సాహక రాయితీలను అందజేసింది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 3.87 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే, జగన్ పాలన వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి వాటి సంఖ్య ఏకంగా 5,81,152కు చేరింది. సత్యసాయి జిల్లాలో రూ.700 కోట్లతో హెచ్పీసీఎల్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఎన్టీఆర్ జిల్లా నున్నలో అవేరా సంస్థ రూ.100 కోట్లతో స్కూటర్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణ పనులను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది.జీఎస్డీసీ సూచీలో బాబు దిగిపోయిన 2019లో ఏపీ 22వ స్థానంలో ఉంటే , 2021-22 నాటికి మొదటి స్థానానికి చేరుకుంది. రాష్ట్ర తలసరి ఆదాయంలో ఎల్లో ప్రభుత్వం నిష్క్రమించే నాటికి 17వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 9వ స్థానానికి వచ్చింది. గత ప్రభుత్వ ఒప్పందాల్లో వ్యాజ్యాల పరిష్కారంజగన్ ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ పాండ్లు ఏర్పాటు చేస్తుంది. 750 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను గతంలో బాబు అదానీకు కట్టబెట్టాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) వాటి టెండర్లు, ఒప్పందాలన్నీ పర్యవేక్షించింది. ఈ తంతు 2018, 2019ల్లో జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద ఒక్కోటీ 250 మెగావాట్ల సామర్థ్యం గల 3 సోలార్ ప్రాజెక్టులకు సెకీ 2018లో టెండర్లు పూర్తి చేసింది. డిస్కంలతో ఒప్పందాలు కూడా 2018 జూలై 27నే పూర్తి చేశారు. వీటిలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్ 250 మెగావాట్ల ప్రాజెక్టు ఒక సోలార్ప్రాజెక్ట్కు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.1,250 కోట్లు. మిగతా రెండు ప్రాజెక్టులను మరో రెండు కంపెనీలు పొందాయి. ఎస్బీ ఎనర్జీ సెవెన్ కంపెనీను అదానీ సంస్థ టేకోవర్ చేసింది. ఇందులో అదానీకి ప్రత్యేకంగా కలిగిన లబ్ధి ఏమీ లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఈ టెండర్లు, ఒప్పందాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించక తప్పదు. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఆ సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కోర్టుల్లో ఆ కంపెనీలపై ఉన్న వ్యాజ్యాలను పరిష్కరించి జగన్ సర్కారు ప్రాజెక్టులను అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ చొరవతో చౌకైన విద్యుత్తుసెకీ ఒప్పందం వల్ల వ్యవసాయానికి కరెంటు లభిస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 ఉంటే ఒప్పందాల ప్రకారం రూ.8.90 వెచ్చించారు. దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల వివిధ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. వచ్చే 25 ఏళ్ల వరకు ఈ భారాన్ని విద్యుత్ సంస్థలు భరించాలి. ఈ వ్యవహారంపై అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తీవ్రంగా విమర్శించారు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను ప్రస్తుతం సగటు ధర యూనిట్కు రూ.5.10 ఉన్నప్పటికీ, యూనిట్ రూ.2.49కే ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతుంది. -
CM Jagan: ఏపీకి జలాభిషేకం
సాక్షి, గుంటూరు: కడలి పాలవుతున్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత వైఎస్సార్ జలయజ్ఞం చేపట్టగా ఆయన తనయుడు సీఎం జగన్ ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నారు. ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా జలయజ్ఞం ఫలాలను రైతులకు అందిస్తున్నారు. కోవిడ్, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సాగునీటి పనులను పరుగులెత్తించారు.రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 2019, 2020, 2021, 2022 ఖరీఫ్, రబీతో కలిపి ఏటా కోటి ఎకరాలకు సీఎం జగన్ నీళ్లందించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రాష్ట్రంలో ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడంతో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేశారు. రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులతో ఏపీని మళ్లీ దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా సీఎం జగన్ నిలిపారు.♦ వైఎస్సార్ చేపట్టిన సంగం, నెల్లూరు బ్యారేజ్లలో మిగిలిన పనులను సీఎం జగన్ పూర్తి చేసి 2022లో జాతికి అంకితమిచ్చారు.♦ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చెరువులను నింపడం ద్వారా లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్ పూర్తి చేసి సెప్టెంబరు 18న జాతికి అంకితం చేశారు.♦ గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు వద్ద రెండో టన్నెల్ను పూర్తి చేసి నవంబర్ 30న జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమం చేశారు.♦ వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ. పనులను 2021 జనవరి 13 నాటికే సీఎం జగన్ పూర్తి చేశారు. రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ.లో 7.506 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మిగిలిన 192 మీటర్ల పనులు పూర్తి చేసి సొరంగాలను జాతికి అంకితం చేయనున్నారు. ♦విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల దాహంతో పోలవరాన్ని నీరుగార్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్, ఫైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేసి 2021లో గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించారు. బాబు అవినీతితో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగా«దాలను పూడ్చి యధాస్థితికి తెచ్చే పనులను వేగవంతం చేశారు. నీటి పారుదలలో రికార్డు♦ కృష్ణా డెల్టా వరదాయిని పులిచింతల ప్రాజెక్టును దివంగత వైఎస్సార్ సాకారం చేశారు. గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకూ పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది. నిర్వాసితులకు వేగంగా పునరావాసం కల్పించిన సీఎం జగన్ 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించేందుకు మార్గం సుగమం చేశారు.♦ గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులో కూడా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్ గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లతో పునరావాసం కల్పించారు. దీంతో గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో పది టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.♦ తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్ కెనాల్కు రూ.500 కోట్లతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్ను నింపడానికి సీఎం జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ♦ గత నాలుగున్నరేళ్లలో ఆరు రిజర్వాయర్లలో గరిష్ట స్థాయిలో నీటి నిల్వకు మార్గం సుగమం చేయడం ద్వారా నీటి పారుదల రంగ చరిత్రలో సీఎం జగన్ రికార్డు సృష్టించారు. -
CM Jagan: అన్నదాతకు అభయం
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) అన్నదాతకు అభయమిస్తున్నాయి. రాత్రనకా, పగలనకా సేద్యం చేసి ఉత్పత్తి చేసిన పంటలకు గిట్టుబడి లేక సతమతమయ్యే రైతన్న పాలిట భరోసా కల్పిస్తున్నాయి. విత్తు నుంచి పంట విక్రయం వరకు ప్రతీ రైతును గ్రామస్థాయిలో చేయి పట్టి నడిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎండనక, వాననక సొసైటీల వద్ద పడిగాపులు పడితే తప్ప విత్తనాలు దొరికేవి కావు.కానీ ప్రస్తుతం ఆర్బీకేల రాకతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎరువుల కోసం అర్రులు చాస్తూ క్యూలైన్లలో నిలబడే దృశ్యాలు మచ్చుకైనా కన్పించడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి న తర్వాత వ్యవసాయానికి పెద్ద పీట వేసి వాటి స్వరూపాన్ని మార్చేసింది. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది. ఆర్బీకేల్లో రాయితీలో అందించిన విత్తనాల వివరాలు ♦ రైతుల సంఖ్య: 54.34 లక్షలు♦ లబ్ధి: రూ. 881.47 కోట్లు ♦ పంపిణీ చేసిన విత్తనాలు: 31.16 లక్షలు (క్వింటాళ్లలో)♦ ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కలెక్షన్ సెంటర్లు – 421వాటికైన ఖర్చు–రూ.63.15 కోట్లు ♦ ఈ సెంటర్లలో సేవలు పొందిన రైతులు–4 లక్షల మంది♦ రూ.5.37 కోట్లతో ఏర్పాటైన శీతల గిడ్డంగుల సంఖ్య: 43 ♦ 30.99 లక్షల మంది రైతులకు రూ.1,289.52 కోట్ల విలువైన 11.66 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ రైతన్నకు భరోసా ఇలా.. ♦ రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలు 6.19 లక్షల మందికి రూ.715.84 కోట్లు ♦ క్లైయిమ్లు, సెటిల్మెంట్లు, చెల్లింపుల్లో తొలి ఏడాది రైతుల వాటాతో కలిపి ప్రభుత్వం చెల్లించిన బకాయిలు – రూ.971 కోట్లు♦ ఏటా సగటున 13.62 లక్షల మందికి రూ.1,950.51 కోట్ల చొప్పున నాలుగేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు చేకూరిన లబ్ధి – రూ.7,802.05 కోట్లు ♦ 2023–24 రూపాయి ప్రీమియంతో బీమా కల్పిస్తూ ఏపీ మోడల్లో నడిచే రాష్ట్రాలు– మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ ఏపీ మాదిరిగా ఈ పంట నమోదు చేస్తున్న రాష్ట్రాలు – తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ♦ భూముల్లేని కౌలుదారులకు ఈ–క్రాప్ ప్రామాణికంగా రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ ♦ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ♦ రూ.లక్ష లోపు రుణాలు తీసుకుని చెల్లించిన రైతుకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ జమ ♦ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం ♦ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకు సీజన్ చివరలో ఇన్పుట్ సబ్సిడీ ♦ సీజన్కు ముందుగానే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం ♦ యూనివర్సల్ కవరేజ్కు కేంద్రం అంగీకరించకపోవడంతో మొత్తం బీమా పరిహారం ప్రభుత్వమే చెల్లింపు ♦ 2022–23 నుంచి ఫసల్ బీమాతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు ♦ ప్రతి ఎకరాకు ఈ క్రాప్ ఆధారంగా యూనివర్శల్ బీమా కవరేజ్ను కల్పిస్తోన్న ఏకైక రాష్ట్రం ఏపీయే ♦ ఏటా లబ్దిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తూ అభ్యంతరాలు పరిష్కారం ♦ ఎన్నికల హామీ మేరకు 2019 ఖరీఫ్ సీజన్లో రూపాయి ప్రీమియంతో పథకం ♦ ఈ– పంట నమోదే అర్హతగా ఉచితంగా బీమా కవరేజ్ కల్పిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం. ఆదర్శం.. ‘ఫిష్ ఆంధ్ర’ ♦ రాష్ట్రంలో ఏటా 50 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులతో దేశంలోనే మొదటి స్థానం. ♦ ఏటా 4.36 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని 2025 నాటికి కనీసం 15 లక్షల టన్నులకు పెంచాలన్న సంకల్పానికి పదును. ♦రూ.కోటి అంచనాతో జిల్లాకో ఆక్వా హబ్.. ♦జిల్లాకొకటి చొప్పున 26 ఆక్వా హబ్లు. 4,007 ఫిష్ ఆంధ్రా మినీ అవుట్లెñట్స్♦ 351 డెయిలీ, 149 సూపర్, 62 లాంజ్ యూనిట్లు ఏర్పాటు లక్ష్యం ♦ వీటికి అనుబంధంగా రిటైల్ మినీ అవుట్లెట్స్, ఈ మొబైల్ త్రీ వీలర్, 4 వీలర్ ఫిష్ వెండింగ్ డెయిలీ యూనిట్లు, ఏర్పాటు. ‘ఫిష్ ఆంధ్ర’లో ఏమేమి దొరుకుతాయి... మెత్తళ్లు, పండుగప్పలు, కాలువ రొయ్యలు, సముద్ర పీతలు, టూనా, కోనాం చేపలు ఇలా ఏది కావాలన్నా తాజాగా బతికున్నవి లభ్యం. రాయలసీమ ప్రాంతంలో సముద్ర మత్స్య ఉత్పత్తులకు డిమాండ్ క్రమేపీ పెరుగుదల. ఆక్వా రైతు ఆనందంఈ–ఫిష్ సర్వే ఆధారంగారాష్ట్రంలో ఆక్వా సాగు పరిస్థితి సాగు విస్తీర్ణం:4,65,877.54 ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలోని భూమి:4,22,309.63 ఎకరాలు పదెకరాల లోపు విస్తీర్ణం:3,56,278 ఎకరాలు పదెకరాల పైబడి విస్తీర్ణం:6,60,321.63 ఎకరాలు నాన్ ఆక్వాజోన్ పరిధిలోని భూమి: 43,567.91 ఎకరాలు పదెకరాల లోపు విస్తీర్ణం: 23,042.02 ఎకరాలు పదెకరాలకు పైబడి విస్తీర్ణం:20,524.89 ఎకరాలు మొత్తం విద్యుత్ కనెక్షన్లు: 64,645సబ్సిడీ పరిధిలోని కనెక్షన్లు: 50,659 -
CM Jagan: ఏపీ ‘క్లిక్’ అయిందిలా..
సుమతి రోడ్డుమీద వెళుతుండగా ఆకతాయిలు ఫాలో అవుతున్నారు. భయం వేసింది. చేతిలోని ఫోన్లో ఓ బటన్ నొక్కింది. ఐదు నిమిషాలు గడవకముందే పోలీసులొచ్చారు. ఆకతాయిల్ని పట్టుకుని బుద్ధి చెప్పారు. ఇదంతా.. ‘దిశ’ టెక్నాలజీతోనే సాధ్యమయింది. సుమతి దిశ యాప్లోని బటన్ను ప్రెస్ చేయటంతో అది పోలీస్ కమాండ్ కంట్రోల్కు సమాచారం పంపింది. అక్కడి నుంచి దగ్గర్లోని పెట్రోలింగ్ బృందానికి మెసేజ్ వెళ్లింది. అంతా క్షణాల్లో జరిగిపోవటంతో.. సుమతికి ఆపద తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్ను.. 1.46 కోట్ల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిద్వారా అలెర్ట్ రావటంతో... 31,541 ఘటనల్లో పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ!. ఐటీ. హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చింది తానేనంటారు చంద్రబాబు. ఈ క్లెయిమ్పై ఉన్న విభిన్న వాదనలనిక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మరి 2014 నుంచీ ఏపీ ముఖ్యమంత్రిగాఉన్నపుడు ఐటీని ఏం చేశారు? ప్రపంచమంతా కొత్త ఆవిష్కరణలతో పరుగులు తీస్తున్నపుడు ఇక్కడ మాత్రం అన్నీ మాటలే తప్ప చేతల్లో ఎందుకు కనిపించలేదు? ఐటీకి పితామహుడినని చెప్పారే తప్ప... కొత్తగా టెక్నాలజీని వినియోగించిందెక్కడ? సువిశాల తీరం ఉందని... దాన్నే అడ్వాంటేజ్గా తీసుకోవాలని పదే పదే చెప్పారు తప్ప ఒక్క పోర్టును గానీ, హార్బర్ను గానీ తేలేదెందుకు? మరి వైఎస్ జగన్ మాత్రం మాటలు చెప్పకుండా ప్రతి విభాగంలోనూ టెక్నాలజీని సమర్థంగా అమలు చేస్తున్నారు కదా? కొత్త పోర్టులు, హార్బర్లను తెచ్చారు కదా? మనకు కావాల్సింది హోరెత్తించే మాటలా..? కళ్లముందు కనిపించే నిజాలా?రాష్ట్రంలో గత ఖరీఫ్లో 93,29,128 ఎకరాల్లో పంటలు వేశారు. దీన్లో వరి 32,83,593 ఎకరాల్లోను... వేరు శనక 5,93166 ఎకరాల్లోను వేశారు. ఈ లెక్కల్లో ఒక్క ఎకరా కూడా తేడా లేదు. ఎందుకంటే ‘ఈ–క్రాప్’ టెక్నాలజీ ఉందిప్పుడు. ప్రతి రైతూ తన పంటను నమోదు చేసుకునే ఈ పటిష్ఠమైన డిజిటల్ వ్యవస్థతో... రాష్ట్రంలోని 27,800 గ్రామాల్లో ఉన్న ప్రతి ఎకరాకూ లెక్క ఉంది. అది బీమాకైనా... పంట నష్టానికైనా.. దిగుబడికైనా.ఈ ఉదాహరణలన్నీ చూస్తే... రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలోనూ టెక్నాలజీని ఎంత సమర్థంగా వినియోగిస్తోందో అర్థమవుతుంది. భారీ ఎత్తున ఐటీ కాంట్రాక్టులివ్వకుండా, ఉన్న వనరులను... నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సేవలను సమర్థంగా వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విభాగంలోనూ పూర్తిస్థాయిలో టెక్నాలజీని వాడుతోంది. అందుకనే... మునుపెన్నడూ చూడని పారదర్శకత, జవాబుదారీతనం ఇపుడు కనిపిస్తోంది. చేసిన పని పావలాదే అయినా... పదిరూపాయల ప్రచారం చేసుకోవటమనేది ఈ ప్రభుత్వ విధానం కాదు కాబట్టే.. పెద్దపెద్ద ఆరంభాలు, ఆర్భాటాలు లేకుండానే ప్రజలకు సమర్థమైన ఐటీ సేవలు అందుతున్నాయి.ఏఎన్ఎం యాప్లో 15 మాడ్యూల్స్...2020లో ప్రభుత్వం రూపొందించిన ఏఎన్ఎం యాప్ ద్వారా... క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యక్రమాన్నీ వారు రిపోర్ట్ చేస్తుంటారు. ఎన్సీడీ–సీడీ సర్వే, ఫీవర్ సర్వే, గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, పాఠశాల విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్, ఆరోగ్యశ్రీ ఫీడ్ బ్యాక్ ఇలా అన్నిటినీ నమోదు చేస్తారు. ఆశా వర్కర్లకు తెచ్చిన ‘ఈ–ఆశా’ యాప్ ద్వారా గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యాన్ని వైద్యశాఖ నిరంతరం పర్యవేక్షిస్తుంది. పీహెచ్సీల్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకూ యాప్లున్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయి.స్కూళ్లకు పక్కా సమాచార వ్యవస్థ...ఈ ప్రభుత్వం తెచ్చిన స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం(సిమ్స్)లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఉన్న 82 లక్షల విద్యార్థుల వివరాలు అప్ టు డేట్గా ఉన్నాయి. విద్యార్థుల ఆధార్ను లింక్ చేస్తూ... ప్రత్యేక ఐడీ నెంబర్ కేటాయించారు. దీంతో స్టూడెంట్ హాజరు యాప్ ద్వారా ట్రాక్ చెయ్యటం... గ్రామ/వార్డు కార్యదర్శుల ద్వారా వారిని తిరిగి బడికి రప్పించటం సులువవుతోంది. ఇక టీచర్ల అటెండెన్స్కూ యాప్ ఉంది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్తో అనుసంధానించిన ఈ యాప్... టీచర్ తమ స్కూల్ పరిసరాలకు 10 మీటర్ల దూరంలో ఉంటేనే హాజరును తీసుకుంటుంది. జగనన్న గోరుముద్ద అమలును పర్యవేక్షించడానికి ‘ఇంటిగ్రేటెడ్ మోనిటరింగ్ సిస్టం ఫర్ మిడ్డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) వచ్చింది. వారంలో ఆరు రోజులు.. రోజుకు సగటున దాదాపు 37,63,698 మంది విద్యార్థులకు ఆహారం తీసుకుంటున్నారు. టీచర్ల ఫోన్లోని ఈ యాప్ ద్వారా... హాజరుతో పాటు ఎంతమంది పిల్లలు ఆహారం తీసుకుంటున్నారు? ఏరోజు ఏం వడ్డించారు, ఇచ్చిన సరుకు ఎంత? ఎంత స్టాక్ ఉంది? వంటి వివరాలన్నీ తెలుస్తాయి. ప్రతిరోజు టాయిలెట్ల పరిస్థితులూ అప్డేట్ అవుతాయి. ఎంప్లాయి ఇన్ఫర్మేషన్ సిస్టంలో టీచర్ల çహాజరుతో పాటు ఎన్ఓసీ, సెలవులు, మెడికల్ రీయింబర్స్మెంట్, గ్రీవెన్స్ సహా సర్వీసు రికార్డు మొత్తం ఉంటోంది.♦ చైల్డ్ ఇన్ఫో సిస్టంలో విద్యార్థులు ఏ స్కూల్ నుంచి ఏ స్కూల్కు మారారు. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా లింకేజ్ వంటివన్నీ ఉంటాయి. ♦ జేవీకే యాప్ ద్వారా ప్రతి స్కూల్లో అవసరమైన జగనన్న విద్యాకానుక కిట్లు ఎన్ని? ఎన్ని అందించారు? ఎన్ని మిగిలాయి? వంటివన్నీ తెలుస్తాయి. పైపెచ్చు ఈ వ్యవస్థలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున నియమించి ఇబ్రహీంపట్నం, విశాఖపట్నంలో రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లున్నాయి. బడుల్లో టీచర్లు, పిల్లల అటెండెన్స్ వేశాక అది ఈ సెంటర్లకు వెళుతుంది.టెక్నాలజీతో రైతుకు దన్ను...‘ఈ–కర్షక్’ యాప్తో ఆర్బీకేలో రైతులు సీజన్లో తాము సాగు చేసే పంటల వివరాలను నమోదు చేసుకుంటారు. తర్వాత ఆర్బీకే సిబ్బంది పొలాలకు వెళ్లి స్వయంగా జియో కో ఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్ ద్వారా రైతుసాగు చేసే పంట పొలం విస్తీర్ణం, సర్వే నెంబర్తో పాటు పంట వివరాలనూ ధ్రువీకరిస్తారు. పొలం ఫోటో డిజిటైజ్ చేస్తారు. ♦ఆర్బీకేల్లోని వెటర్నరీ సహాయకుల పనితీరును పర్యవేక్షించడానికి ‘పశు సంరక్షక్’ యాప్ ఉంది. ♦రోజువారీ వ్యవసాయ పంటల హెచ్చుతగ్గులను పర్యవేక్షించడానికి మార్కెటింగ్ శాఖ ‘కంటిన్యూస్ మోనిటరింగ్ ఆఫ్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ అండ్ పేమెంట్స్’ (సీఎంయాప్)ను తీసుకొచ్చింది. ♦‘ఈ–మత్స్యకార’ పోర్టల్ను వివిధ యాప్లతో అనుసంధానించారు. అప్సడా రిజిస్ట్రేషన్లు, ఆర్బీకే ఇన్పుట్ సప్లయి, ఈక్రాప్, మత్స్య సాగుబడి, కేసీసీ, పీఎంఎంఎస్వై వంటివన్నీ దీని ద్వారానే నిర్వహిస్తున్నారు. ♦‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ యాప్తో 55607 అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు.అర చేతిలో ఆరోగ్యశ్రీ...ఆరోగ్య శ్రీ యాప్లో లాగిన్ అయితే... తాము గతంలో ఏ చికిత్స పొందామన్నది లబ్ధిదారులు తెలుసుకోవచ్చు. పథకం కింద ఏ ఆస్పత్రుల్లో ఏ వైద్య సేవలు అందుతాయి? దగ్గర్లో నెట్వర్క్ ఆసుపత్రులు ఏమేం ఉన్నాయి? తెలుసుకోవచ్చు. వాటి లొకేషన్నూ ట్రాక్ చేయొచ్చు. ‘ఈహెచ్ఆర్– డాక్టర్ కేర్’ ఆన్లైన్ వేదికతో యూపీహెచ్సీలు, పీహెచ్సీల్లో డిజిటల్ వైద్య సేవలందుతున్నాయి. ఈ పోర్టల్ నుంచి రోగులకు అందించిన వైద్యం వివరాలను వారి ఆయుష్మాన్ భారత హెల్త్ ఖాతాలో అప్లోడ్ చేస్తున్నారు. ల్యాబ్ టెస్ట్ల ఫలితాలు ఈహెచ్ఆర్ నుంచి నేరుగా రోగుల మొబైల్కే ఎస్సెమ్మెస్ ద్వారా వెళుతున్నాయి. క్రొంగొత్తగా... రిజిస్ట్రేషన్ల వ్యవస్థదేశంలో దస్తావేజులు రాయటానికి కొన్ని స్టార్టప్లు ఆన్లైన్ రైటర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇక్కడ ప్రభుత్వమే ఆ పనిచేసింది. ‘కార్డ్ ప్రైమ్’ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తిగా డిజిటలైజ్ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం... వినియోగదారులు ఎవరిపైనా ఆధారపడకుండా నేరుగా ఆన్లైన్లో డాక్యుమెంట్లు తయారు చేసుకునే వీలు కల్పించింది. ఆన్లైన్లోనే చలానాలు కట్టి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ టైమ్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళితే అరగంటలో పని పూర్తవుతుంది. గతంలోలా డాక్యుమెంట్ల స్కానింగ్ అక్కర్లేదు కూడా. డిజిటల్ సిగ్నేచర్ ఒక్కటీ చాలు. ♦ఇక వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆటో మ్యుటేషన్ జరిగే కొత్త విధానాన్ని తెచ్చిందీ ప్రభుత్వం. గతంలో రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులకిస్తే వాళ్లు మ్యుటేషన్ చేసేవారు. దీనికి సమయం పట్టేది. ఇప్పుడా అవసరం లేదు. ♦స్టాంపు పేపర్ల స్థానంలో ఈ స్టాంపింగ్ను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. గతంలో భౌతికంగా స్టాంపులు కొని, వాటి ద్వారా అగ్రిమెంట్లు చేసుకునేవారు. ఇప్పుడు స్టాంపు పేపర్లతో పని లేదు. కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద కూడా ఈ–స్టాంపింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్టాంపు పేపర్ల అవకతవకలకు చెక్ పడింది.♦భూముల రీ సర్వే ద్వారా ఏ రాష్ట్రంలో లేని విధంగా డిజిటల్ రెవెన్యూ రికార్డులు తయారవుతున్నాయి. డ్రోన్లతో సర్వే చేసి శాటిలైట్ లింకు ద్వారా జియో కోఆర్డినేట్స్తో రైతుల భూముల హద్దులు నిర్ధారిస్తున్నారు. ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో యునిక్ ఐడీ ఉంటోంది. -
ఇదీ.. జగన్ కమిట్మెంట్
ఒకపక్క.. రోజుకు వంద రూపాయల సంపాదన కూడా లేక.. కనీస అవసరాలని చెప్పే తిండి, ఇల్లు, దుస్తులకు కూడా నోచుకోని జనం లెక్కించలేనంత మంది. మరోపక్క.. రోజుకు లక్ష రూపాయలు సైతం గ్యాంబ్లింగ్లో పోగొట్టుకుని చింతలేకుండా గడిపేసే శ్రీమంతులూ లెక్క లేనంతమంది. ఇదీ.. మన సమాజంలో ఉన్న విభజన. నానాటికీ పెద్దదవుతున్న ఈ రేఖ చెరిగేంతవరకూ అభివృద్ధి చెందిన దేశంగానో, రాష్ట్రంగానో మారటం అసాధ్యం. కనీస అవసరాలు తీర్చుకోలేని కోట్లాది మందిని విడిచిపెట్టేస్తే ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. ఆ అభివృద్ధిలో వాళ్లకూ వాటా ఉండాలి. ఆ స్థాయికి వాళ్లను తీసుకురావాలి. వాస్తవానికి సంక్షేమ పథకాల పరమార్థం ఇదే. ఇపుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నది ఆ అభివృద్ధే. చదువుతోనే తలరాత మారుతుంది దీన్ని మనసావాచా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కాబట్టే తన పిల్లలిద్దరినీ టాపర్లుగా నిలబెట్టగలిగారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకూ సరైన విద్యనందించాలన్న ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో ‘అమ్మ ఒడి’ని ప్రతిపాదించారు. చేతిలో డబ్బుల్లేక చిన్న పిల్లల్ని సైతం కూలికి పంపే పరిస్థితిని మార్చాలన్నదే దీనివెనకున్న ఆలోచన. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దీన్ని ఆచరణలోకి తెచ్చారు. ఆశించినట్టే ‘అమ్మ ఒడి’ ఊతంతో పిల్లలు బడి బాట పట్టారు. మరి ఇది సరిపోతుందా? ఇదిగో.. ఈ ఆలోచనే విద్యారంగంలో పెను సంస్కరణలకు బీజం వేసింది. స్కూళ్లకొచ్చే పిల్లల కడుపు నిండితేనే చదువు ఒంట బడుతుందన్న ఆలోచన.. పౌష్టికాహారంతో కూడిన ‘గోరుముద్ద’కు ప్రాణం పోసింది. బళ్లు తెరిచిన ఆరు నెలలకు కూడా పుస్తకాలు అందకపోతే పిల్లలెలా చదువుతారు? ఎవరి స్థాయిని బట్టి వారు దుస్తులు, బ్యాగులతో వస్తే.. ఒకరు షూ వేసుకుని, మరొకరు చెప్పులు లేకుండా వస్తే అంతా ఒక్కటేనన్న భావన ఎందుకొస్తుంది? వీటన్నిటికీ సమాధానమే.. స్కూళ్లు తెరవటానికి ముందే ప్రతి విద్యార్థికీ అందుతున్న ‘విద్యా కానుక’. సరే! మరి స్కూళ్లో? తమ వారి ప్రయివేటు ప్రయోజనాల కోసం గత ప్రభుత్వాలు వాటిని చిత్రవధ చేసి చంపేశాయిగా? ఆడపిల్లలు టాయిలెట్ కోసం ఇంటికెళ్లాలి. సరైన గదుల్లేవు. బెంచీలు, బ్లాక్ బోర్డులు అన్నీ అంతంతే! ఎందుకెళ్లాలి?... అనిపించేలా ఉన్నాయి మన బడులు. వీటిని మార్చాలనుకున్నారు జగన్. అందుకే.. ‘నాడు–నేడు’ పేరిట ఓ యజ్ఞాన్ని ఆరంభించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ కార్పొరేట్ స్కూలుకు దీటుగా సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావటంతో.. దశల వారీగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నారు. స్కూళ్లకు వస్తున్నారు. భోజనం, దుస్తులు ఓకే. స్కూళ్లూ మారాయి. మరి చదువో! మన పిల్లలు పోటీ పడాలంటే ఇంగ్లిష్ రావాలి. వస్తేనే రాణించగలరు. అంతర్జాతీయంగానూ పోటీ పడగలరు. అందుకే ప్రయివేటు స్కూళ్లకు మల్లే ప్రీప్రయిమరీ–1,2 తరగతులు వచ్చాయి. ఆది నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలయింది. ఇలాగైతే ప్రయివేటు స్కూళ్లకు ఎవరూ రారు కనక.. మాతృభాషపై మమకారం లేదంటూ, ఇంగ్లీషు చదువులు వద్దంటూ మాఫియా గాళ్లంతా కలిసి మాయా యుద్ధానికి దిగారు. కేసులు వేశారు. అయినా సరే.. జగన్ సంకల్పం గట్టిది కావటంతో ఇంగ్లీషు మీడియం వచ్చింది. ఇప్పుడు చాలా మంది పిల్లలు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుండటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడితో ఆగలేదు జగన్.అగ్రశ్రేణి కార్పొరేట్ స్కూళ్లలోనే దొరికే ఎడ్యుటెక్ కంటెంట్ను దిగ్గజ సంస్థ ‘బైజూస్’ ద్వారా మన పిల్లలకూ అందుబాటులోకి తెచ్చారు. ఏటా 8వ తరగతి పిల్లలకు శాంసంగ్ ట్యాబ్లనూ అందజేస్తున్నారు. మిగిలిన తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ను (ఐఎఫ్పీ) ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ క్లాస్రూమ్లనూ అందుబాటులోకి తెస్తున్నారు. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే. పిల్లల చదువుపై సీఎం జగన్కు అంతులేని నిబద్ధత ఉంది. చదివించటం ద్వారా వారి రాతలను మార్చాలన్న తపనతో.. యావత్తు విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించటం మొదలెట్టారు. ఇదంతా చేసింది జస్ట్ నాలుగున్నరేళ్ల వ్యవధిలోనే! వైద్యం.. ప్రతి ఒక్కరి హక్కు.. చదువుకైనా.. సరైన వైద్యం చేయించుకోవటానికైనా పేదరికం అడ్డు కాకూడదని, వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని జగన్ భావించారు. అందుకే.. వెయ్యి రూపాయలు దాటిన ఏ వైద్యానికైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దాన్ని అమల్లోకి తెచ్చారు. ఆరోగ్య సేవలకు అదొక బీజం మాత్రమే. అక్కడి నుంచి మొదలుపెడితే.. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ పోయింది. ఆసుపత్రులన్నీ స్కూళ్ల మాదిరే ‘నాడు–నేడు’ కింద కొత్త రూపాన్ని, కొత్త సౌకర్యాలను సంతరించుకున్నాయి. ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు... ఇలా ప్రతి పోస్టూ భర్తీ చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల భర్తీతో పాటు.. అత్యాధునిక పరికరాలనూ తీసుకొచ్చారు.యావత్తు ప్రపంచంతో పాటు రాష్ట్రాన్ని కూడా కోవిడ్ వణికించినపుడు వీళ్లంతా కలిసి వలంటీర్ల సాయంతో ఎంత అద్భుతం చేశారన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి, సంరక్షణ కేంద్రాల్లో ఉచితంగా చికిత్స తీసుకుని వెళ్లారంటే.. అది రాష్ట్రంలో వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చిన పక్కా వ్యవస్థ వల్లేనన్నది కాదనలేని నిజం. అంతేకాదు.. గ్రామ స్థాయి నుంచీ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తూ వచ్చారు. ఏకంగా 1,405 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పడ్డాయి. ప్రతి చోటా వైద్యులొచ్చారు. ఉచిత మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటికీ తోడు విదేశాల్లోనే కనిపించే ‘ఫ్యామిలీ డాక్టర్’... మన ఊళ్లలో ప్రతి ఇంటికీ అందుబాటులోకి వచ్చారు.రాష్ట్రంలో ఇపుడు నిరుపేదలందరికీ కావాలనుకున్న వెంటనే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అపాయింట్మెంట్.. అదీ ఉచితంగా దొరుకుతోందంటే.. అదే వైఎస్ జగన్ విజన్. పరిస్థితులు మారి... కొన్ని చికిత్సలకు వ్యయం ఎక్కువవుతోందని గ్రహించటంతో ఇపుడు ఆరోగ్య శ్రీ చికిత్సకయ్యే ఖర్చును ఏకంగా రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి చికిత్సా ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేలా చికిత్స ప్రకిరయలను సైతం 1,059 నుంచి 3,257కి పెంచారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 820 నుంచి 2,513కి పెంచారు. నాలుగున్నరేళ్లలో ఇవన్నీ చేయాలంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి మరి! ఇదీ వ్యవ‘సాయం’ అంటే.. దేశానికి రైతే వెన్నెముక. వైఎస్సార్ వారసుడిగా దీన్ని బలంగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఏడాదికి రెండుసార్లు పంట వేసే ముందు రైతుకు పెట్టుబడిగా రూ.12,500 చొప్పున ఇస్తామని భరోసా ఇచ్చారు. దాన్ని మరో రూ.వెయ్యి పెంచి కోవిడ్ కష్టకాలంలోనూ ఆపకుండా మరీ అమల్లోకి తెచ్చారు. నిజానికి రైతుకు ఏం చేసినా తక్కువే. ఎంత చేసినా తక్కువే. అందుకే గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలూ అందించే ఓ బలమైన వ్యవస్థను సృష్టించాలని సంకల్పించారు. రైతు భరోసా కేంద్రాలకు ప్రాణం పోశారు. రైతు ఎదుర్కొంటున్న కష్టాలన్నిటికీ ఇది వన్స్టాప్ పరిష్కారంగా ఉండాలని భావించారు.నకిలీ విత్తనాల బారిన పడకుండా ఇక్కడే సర్టిఫైడ్ విత్తనాలు, పురుగు మందులు దొరుకుతాయి. భూసార పరీక్ష కేంద్రాల నుంచి పండిన పంటను నిల్వ చేసుకునే గిడ్డంగులు, ఆఖరికి ఖాతాలో పడ్డ నగదును డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు కూడా కొన్నిచోట్ల ఆర్బీకేలలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు ఆర్బీకే అనేది ఓ బలమైన ప్రభుత్వ వ్యవస్థ. రైతును విత్తు నుంచి పండిన పంటను విక్రయించుకునేదాకా చేయిపట్టి నడిపించే అమ్మ, నాన్న.. అన్నీ. మనసు మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుందనేది ఎంత నిజమో ఈ నాలుగున్నరేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రస్ఫుటమైంది. సువిశాల కోస్తా తీరం కారణంగా కొన్నిసార్లు తుపాన్లు దెబ్బతీసినా.. తట్టుకుని రోజుల వ్యవధిలోనే బయటపడే వ్యవస్థను ఏర్పాటు చేశారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికీ అతివేగంగా సాయం అందించటంతో పాటు ప్రతి ఎకరాకూ ఉచితంగా ప్రభుత్వమే బీమా చేయించటం, ఒక సీజన్లో జరిగిన నష్టానికి మళ్లీ ఆ సీజన్ రాకముందే పరిహారాన్ని అందించటం.. ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని అందించటం.. ఇలా ప్రతిదీ నెరవేర్చేలా ‘ఈ–క్రాప్’ ద్వారా ఆర్బీకేల చుట్టూ ఓ బలమైన వ్యవస్థను సృష్టించారు. ఇదీ విజన్ అంటే. వికేంద్రీకరణకు కొత్త అర్థం వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వమిచ్చే పింఛన్లంటే ఇదివరకు ఓ మహా ప్రహసనం. పట్టణాల్లోనైతే బ్యాంకుల ముందు పడిగాపులు. పల్లెల్లోనైతే ఇచ్చే వ్యక్తి ఏ రోజున వస్తాడో తెలియని దైన్యం. అసలే వాళ్లు వృద్ధులు, దివ్యాంగులు. అలాంటి వారికిచ్చే సాయమేదైనా వారికి సాంత్వన కలిగించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు కదా? ఇదిగో.. ఈ ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సైన్యాన్ని సృష్టించారు. ప్రతినెలా ఒకటవ తేదీన ఠంచనుగా ఇళ్లకు వెళ్లి సామాజిక పింఛన్లు అందజేయటం ఈ సైన్యం బాధ్యత. ఆ తరవాత..! ఆ వలంటీర్లు మరిన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమయ్యారు.పథకాలను లబ్ధిదారులకు చేరువ చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీరు. ప్రభుత్వానికి – ఆ గడపలకు తనే సంధానకర్త. సూక్ష్మ స్థాయిలో వికేంద్రీకరణ ఫలితాలను కళ్లకు కట్టిన వలంటీర్ల మాదిరే... గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చేరువ చేయడానికి వలంటీర్లయితే... ప్రభుత్వాన్ని గ్రామ స్థాయికి చేర్చేది గ్రామ సచివాలయాలు. అవసరమైన సర్టిఫికెట్ల నుంచి స్థానికంగా కావాల్సిన సేవలూ అక్కడే. ఈ వ్యవస్థ ఆలోచనతో ఏకంగా లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా యువత ఉన్న ఊళ్లోనే ఉద్యోగాలు తెచ్చుకుని కొలువుల్లో స్థిరపడింది. అక్కడితో ఆగకుండా గ్రామాల్లో రైతుల కోసం ఆర్బీకేలు, వైద్య సేవల కోసం పీహెచ్సీలు నిర్మించి, యావత్తు గ్రామ వ్యవస్థను బలోపేతం చేశారు జగన్. అందుకే ఇపుడు పల్లెల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. పల్లెల నుంచి వలసలు తగ్గాయి. ఒక బలమైన ఆలోచన... దాని ద్వారా మరింత మంచి చేయాలన్న తపన... ఈ రెండూ ఉంటే ఎంతటి అద్భుతమైన వ్యవస్థలను నిర్మించవచ్చో చేసి చూపించారు జగన్. అందుకే ప్రతి రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తోంది. ♦ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.2,43,958.04 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 8,29,81,601♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.4,11,488.99 కోట్లు♦ నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.1,67,530.95 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 4,44,04,251♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి 2, 3 పథకాల ద్వారా లబ్ధి) 12,73,85,852-రమణమూర్తి మంథా -
CM Jagan: ఎన్ని అడ్డంకులొచ్చినా ప్రగతిపథంలోనే..
ఆంధ్రప్రదేశ్ విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, కార్మికరంగం.. ఇలా ఏ రంగంలో చూసిన గతంతోపోలిస్తే అభివృద్ధి చెందింది. కొవిడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నా..ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా దేశంలోని కొన్ని రాష్ట్రాలు తిరిగి వాటి పూర్వస్థితి కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో రంగాల్లో ముందుంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించాలంటే వివిధ శాఖల అనుమతులు అవసరం అవుతాయి. అవి పొందాలంటే యాజమాన్యాలకు కొంత శ్రమతో కూడుకున్న వ్యవహరం. అయితే వీటన్నిటినీ కేంద్రీకృతం చేసి ఇండస్ట్రీయల్ సింగిల్ విండో క్లియరెన్స్ను అమలులోకి తెచ్చిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రం. సోలార్ పవర్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రత్యేక చట్టాలను చేసింది. 2023-24 సంవత్సరానికిగాను స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ.14,49,501 కోట్లుగా ఉంది. ఇది చంద్రబాబు పాలన ముగిసిన 2018-19కి గాను రూ.8,70,849 కోట్లుగా ఉండేది. గడిచిన ఈ కొన్నేళ్లలో ఇది దాదాపు 65 శాతం ఎక్కువ. 2021-22లో స్థూల విలువ ఆధారిత (జీవీఏ)వృద్ధి 18.47%గా ఉంది. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా నాణ్యమైన మౌలిక సదుపాయాలను సృష్టించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2023 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.6వేల కోట్లు. 2023లో రాష్ట్ర సరుకుల ఎగుమతులు రూ.1.58లక్షల కోట్లు. ఇందులో గరిష్ఠంగా సముద్ర ఉత్పత్తుల వల్ల దాదాపు 13.62% వాటా చేకూరింది. కొత్త పారిశ్రామిక విధానం ద్వారా రూ.22,282.16 కోట్లతో భారీ, మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు స్థాపించేలా ప్రభుత్వం కృషిచేసింది. టీడీపీ హయాంలో పరిశ్రమల అభివృద్ధిలో 27వ స్థానానికి దిగజారిన రాష్ట్రం.. ప్రస్తుతం జగన్ పాలనలో మూడో స్థానానికి ఎగబాకింది. ఏప్రిల్ 2023 నాటికి, ఆంధ్రప్రదేశ్ మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 26,675.73 మెగావాట్లు. తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో 17 స్థానంలో నిలిచిన రాష్ట్రం ప్రస్తుతం 9వ స్థానానికి ఎదిగింది. చంద్రబాబు ప్రభుత్వకాలంలో కేవలం 34000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4.93లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. అందులో 2.13లక్షల శాశ్వత కొలువులు ఉన్నాయి. వ్యవసాయంలో రాష్ట్రం టీడీపీ కాలంలో మైనస్ 6.5శాతంతో అధ్వానంగా మారింది. అదే 2021-22కు గాను 8.2 శాతం వృద్ధి చెందింది. దాంతో వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2022-23కుగాను వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు రూ.13,640 కోట్లు కేటాయించారు. ఇదీ చదవండి: రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వం.. -
భారత జట్టులోనూ ‘వై నాట్ ఏపీ’.. సీఎం జగన్ విజన్!
‘‘పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి చదువే’’... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరచూ చెప్పే మాట. ఓట్లు వేసిన ‘పెద్దోళ్ల’కు ఇచ్చిన హామీలే నెరవేర్చని నాయకులు ఉన్న ఈరోజుల్లో.. ఓటు హక్కులేని పిల్లల గురించే ఎక్కువగా ఆలోచించడం ఆయనకే చెల్లింది. నేటి బాలలే.. రేపటి పౌరులు కదా.. అందుకే చిన్ననాటి నుంచే వారిని మెరికల్లా తీర్చిదిద్దడంతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించేలా ఇప్పటికే విద్యా వ్యవస్థలో ఆంగ్ల మాధ్యమం వంటి పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. బాలల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నారు. అంతేకాదు.. నాడు- నేడు పేరిట పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి ఉన్న యువత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఉన్నారు సీఎం జగన్. అందుకు అనుగుణంగా ‘‘ఆడుదాం ఆంధ్రా’’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కీలకమైన ప్రతీ క్రీడాంశంలో భాగమైన భారత జట్టులో ‘వై నాట్ ఏపీ’ అనే స్థాయికి ఎదగాలంటే క్షేత్రస్థాయి నుంచే బలమైన పునాదులు పడాలన్న తలంపుతో ముందుకు సాగుతున్నారు. అంబటి రాయుడు, పీవీ సింధు, జ్యోతి సురేఖ, హనుమ విహారి, జ్యోతి యర్రాజీ, కోన శ్రీకర్ భరత్, సాత్విక్ సాయిరాజ్లా తాము తమకిష్టమైన స్పోర్ట్లో రాణించాలనుకునే వాళ్ల కోసమే ఈ క్రీడా సంబరాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా.. క్రికెట్, ఖో ఖో, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ వంటి ఐదు క్రీడాంశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోటీలు నిర్వహించనుంది. కనీవినీ ఎరుగని రీతిలో క్రీడా సంబరానికి నాంది ఇందుకోసం ఇప్పటికే ముప్పై లక్షలకు పైగా మంది ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నడిచే మెగా ఈవెంట్లో మండల, మున్సిపల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం.. క్రీడాకారులకు రూ. 41.43 కోట్ల విలువైన ఐదు లక్షల స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది కూడా! క్రీడల్లో రాణిస్తున్న వాళ్లకు పెద్దపీట వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి గుర్తింపు తీసుకువస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించడంలో సీఎం జగన్ ముందు వరుసలో ఉంటారు. ఆర్చరీలో ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించిన విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతికి సురేఖకు డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ప్రభుత్వం. గత సర్కారు పాలనలో జ్యోతి సురేఖ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కలేదన్న విషయాన్ని గుర్తించి.. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చింది. అదే విధంగా రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సముచిత రీతిలో గౌరవించింది. అదే విధంగా.. వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని విధాలా అండగా ఉంటోంది. -
పేదల కళ్లల్లో కాంతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ఇందుకోసం వైద్య రంగంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టారు. వైద్యాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్తున్నారు. గ్రామాల్లోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చి దిద్దుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజల్లో కంటి సమస్యలతో బాధ పడుతున్నవారి కోసం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారు. మూడు విడతల్లో కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు ఇచ్చారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి ఇప్పుడు నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ వైద్య శిబిరాల్లో కంటి పరీక్షలు చేస్తున్నారు. గత నెల 30వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాల్లో మంగళవారం వరకు 35 లక్షల మందికిపైగా వైద్య సేవలు పొందారు. వీరిలో 5,26,045 మంది వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. వీరిలో 1,57,614 మందికి మందులతో నయమయ్యే సమస్యలేనని తేల్చారు. వారందరికీ అవసరమైన మందులు ఇచ్చారు. మరో 3,12,478 మందికి కళ్లద్దాలను సూచించారు. వీరందరికీ కళ్లద్దాలను వైద్య శాఖ అందిస్తోంది. 55,953 మందిని తదుపరి వైద్యం కోసం ఆస్పత్రులకు పంపించారు. 48,507మందికి కాటరాక్ట్ శస్త్ర చికిత్సలు అవసరమని నిర్ధారించారు. తదుపరి వైద్యం, కాటరాక్ట్ సర్జరీలు అవసరమున్న వారిని స్థానిక పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్,సీహెచ్వో, ఏఎన్ఎంలకు మ్యాప్ చేశారు. వీరందరికీ వైద్యం అందిస్తున్నారు. వీరంతా కంటి సమస్యలు తొలగి పూర్తిస్థాయి చూపుతో తిరిగి ఇళ్లకు చేరుకోనున్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల మండలం బెలుం గ్రామానికి చెందిన బాలసంటి వయసు 90 ఏళ్లు పైనే. చూపు మందగించడంతో గతంలో కంటి పరీక్ష చేయించుకుని అద్దాలు కొనుక్కున్నాడు. మళ్లీ కొన్నాళ్లుగా కళ్లు సరిగా కనిపించక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల గ్రామంలోనే ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి వెళ్లాడు. వైద్యులకు తన సమస్య వివరించాడు. కంటి పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఇప్పుడు బాలసంటి ఉల్లాసంగా ఉన్నాడు. బాలసంటిలానే కంటి సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల వరకూ వెళ్లలేని వారికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఓ వరంగా మారింది. ఈ కార్యక్రమంలో తాము ఉంటున్న ఊరిలోనే కంటితో పాటు, ఇతర వైద్య సేవలు అందుబాటులోకి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వైద్యుల సేవలు కూడా... రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 800 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కంటి వైద్యులు అవసరం. మన రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వైద్యులను పిలిపించాం. కంటి సమస్యల బాధితులకు అవసరమైన మందులను శిబిరాల్లోనే అందిస్తున్నాం. అద్దాలు అవసరమైన వారికి స్థానిక విక్రేతల ద్వారా అందజేస్తున్నాం. క్యాటరాక్టర్ సర్జరీలు అవసరమున్న వారిని ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీవో ఆస్పత్రులకు తరలించి ఉచితంగా సర్జరీలు చేయిస్తున్నాం. – డాక్టర్ వెంకటేశ్వర్, డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్విసెస్ -
మీ ఆప్యాయతకు పొంగిపోయా: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: తనకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ మేరకు గురువారం ఓ ట్వీట్ చేశారు. తనపై చూపిన అభిమానానికి, అప్యాయతకు నిజంగా పొంగిపోయానంటూ ట్వీట్ చేసిన సీఎం జగన్.. వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. I thank you all for your kind wishes. I am truly overwhelmed by the affection shown by my @YSRCParty family. — YS Jagan Mohan Reddy (@ysjagan) December 22, 2022 ఇదిలా ఉంటే.. బుధవారం(డిసెంబర్ 21)న సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా మిగతా చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
ప్రజా నాయకా వర్థిల్లు వెయ్యేళ్లు
సాక్షి,అమరావతి: నవరత్నాల విప్లవ సారధి, విలువలు, విశ్వసనీయతలో శిఖర సమానం ఆలోచన, ఆచరణలో అభ్యుదయ మార్గం, సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో నడిపిస్తున్న గొప్ప అభ్యుదయ మూర్తి, సంస్కరణల సమ్మేళనంలో సృజనాత్మక నైపుణ్యం, పాలన, పరిశ్రమలో దార్శనిక సంకల్పం, కుట్రలు, కుతంత్రాలను ఛేదిస్తూ కుదేలైన వ్యవస్థలను గాడిన పెట్టిన గొప్ప నేర్పరితనం అన్ని కలగలపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రపంచ వ్యాప్తంగా నలుమూలల ఉన్న ప్రవాసాంధ్రుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. ఆయన పుట్టినరోజు పురష్కరించుకుని గురువారం ఖండాంతరాల్లో ఉన్న ప్రతి గుండె, ప్రతి గొంతు ఆయనకు మనసారా శుభాకాంక్షలు తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సీటెల్లో ప్రవాసాంధ్రులు తయారు చేయించిన కేక్ జీవించు వందేళ్లు.. వర్థిల్లు వెయ్యేళ్లు అంటూ మనసారా ప్రవాసాంధ్రులు దీవించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రవాసాంధ్రులు ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ పరిశ్రమల నిర్వాహకులు రెండోరోజు సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్లు కట్ చేసి, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించి జననేత జగనన్న పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. యూఎస్ఏలోని సీటెల్, డల్లాస్, అట్లాంటా, కువైట్, సింగపూర్ కత్తర్(డోహ), దుబాయ్(యూఏఈ) దేశాల్లో సీఎం జగన్ పుట్టిన రోజు సంబరాలను కన్నుపండుగా నిర్వహించారు. డల్లాస్(యూఎస్ఏ) యూకేలోని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ విభాగం ఇన్ఛార్జ్ శివారెడ్డి, మనోహర్ నక్కా, విజయ్ వైకుంఠం, మైరెడ్డి వాసుదేవరెడ్డి, మలిరెడ్డి కిషోర్ రెడ్డి, అనంత రాజు పరదేసి, సురేందర్ రెడ్డి నేతృత్వంలో తెలుగువారు, వైఎస్సార్, జగనన్న అభిమానులు, కార్యకర్తలు జగనన్న పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా కలర్స్ ఉన్న బెలూన్లను ఎగురవేశారు. పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి స్వీట్లు పంచారు. యూకే యూరప్ వింగ్ వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ విభాగం ఇన్ఛార్జ్ శివారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో జగనన్నకు తామంతా అండగా నిలబడతామన్నారు. ఏపీ నుంచి దుష్టచతుష్టయాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 175 స్థానాలు సాధించేందుకు తమ వంతు సహకారం వైఎస్ జగనకి అందిస్తామన్నారు. సీఎం జగన్ తిరిగి 2024లో ఏసీ సీఎం కావడం చారిత్రక అవసరం అని ఏపీఎన్ఆర్టీఎస్ ప్రసిడెంట్ మేడపాటి వెంకట్ అన్నారు. కువైట్ కువైట్ సింగపూర్ అట్లాంటా(యూఎస్ఏ) లండన్ -
CM YS Jagan Birthday Celebrations: అంబరాన్నంటిన సంబరం
సాక్షి, నెట్వర్క్: సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజుని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. కేవలం రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు, సీఎం వైఎస్ జగన్ అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు అన్నిచోట్లా పేదలకు, అనాథలకు వస్త్రదానం చేశారు. భారీ ఎత్తున అన్నదానాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటారు. వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. రోగులకు పండ్లు అందజేశారు. భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రజాప్రతినిధులను బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను పంపిణీ చేశారు. ముఖ్యంగా తమ వర్గాల్లో ఆర్థిక, విద్య, రాజకీయ, సామాజిక, మహిళా సాధికారత తీసుకొచ్చేందుకు మహత్తర కృషి చేస్తున్న సీఎం పుట్టిన రోజు వేడుకలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలూ నిర్వహించారు. తద్వారా సీఎం జగన్పై తమ ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఇందుకోసం పోటీలు పడి వేడుకలు నిర్వహించారు. తమ కుటుంబ సభ్యుడిగా సీఎం వైఎస్ జగన్ను భావించి.. ప్రతి ఇంటా పండుగలా నిర్వహించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్లు కట్ చేసి.. మిఠాయిలు పంచిపెట్టారు. వివిధ రాష్ట్రాలతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తదితర దేశాల్లోనూ సీఎం జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 15 మంది వైద్యులతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి రక్తదానం చేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, పలువురు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు, నంద్యాల, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మెగా రక్తదాన, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో పది వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలోని భారత్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న ఏపీ విద్యార్థులు కేక్ కట్ చేశారు. విశాఖలో హ్యాపీ బర్త్డే సీఎం జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న స్థానికులు సీఎం పుట్టిన రోజున 49 ఎకరాల భూ పంపిణీ సీతంపేట: సీఎం జగన్ జన్మదినం సందర్భంగా విశాఖపట్నంకు చెందిన సుబ్రహ్మణ్యంరాజు కుమారుడు వెంకటపతిరాజు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో 49 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. బిల్లమడ, మోహన్ కాలనీకి చెందిన గిరిజనులకు గిఫ్డ్డీడ్ కింద జిరాయితీ సాగుభూమి రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను సీతంపేట ఐటీడీఏ పీవో బి.నవ్య, పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్కమర్ చేతుల మీదుగా అందజేశారు. బిల్లుమడలో 30 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఎకరా 33 సెంట్లు చొప్పున మొత్తం 40 ఎకరాలు, రెండు ఎకరాలు గ్రామకంఠానికి, మరో ఎకరా కమ్యూనిటీ హాల్కు ఇచ్చారు. మోహన్ కాలనీలో 6 కుటుంబాలకు ఎకరా చొప్పున 6 ఎకరాలు పంపిణీ చేశారు. డెహ్రాడూన్లో వేడుకలు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో సీఎం పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మూడో జాతీయస్థాయి మహిళా కమిషన్ల సదస్సులో పాల్గొనేందుకు డెహ్రాడూన్ వెళ్లిన ఏపీ మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీరెడ్డి, గజ్జల లక్ష్మిరెడ్డి, బూసి వినీత అక్కడ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్, తెలంగాణ, కర్ణాటక, అసోం, గుజరాత్ రాష్ట్రాల మహిళా కమిషన్ చైర్పర్సన్లు, సభ్యులు పాల్గొన్నారు. సంగమూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యాభివృద్ధి కోసం సీఎం జగన్ చేస్తున్న కృషికి కృతజ్ఞతగా ‘‘హ్యాపీ బర్త్ డే జగన్ మామ’’ అంటూ అక్షర రూపంలో కూర్చుని ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. – కృత్తివెన్ను 16 కిలోమీటర్ల వెంబడి రహదారి పక్కన మొక్కలు ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సుమారు మూడు వేల మొక్కలను ఎనిమిది కిలోమీటర్ల పొడవునా రహదారికి ఇరువైపులా మొత్తం 16 కిలోమీటర్ల మేర నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు కొట్టు విశాల్, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి. తాడేపల్లిగూడెం పట్టణంలోని కనకదుర్గ ఆలయం నుంచి వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వరకు నాలుగు లైన్లుగా విస్తరిస్తున్న రోడ్డుకు ఇరువైపులా వీటిని నాటారు. విజయవాడ నుంచి ప్రత్యేకంగా వాహనాలలో తీసుకొచ్చిన రోజీ ట్రంపెట్ ట్రీ, సపాటేసి మొక్కలను పెట్టారు. దాదాపు రూ.26 లక్షల విలువ చేసే మొక్కలను నాటారు. -
CM YS Jagan Birthday: ట్విట్టర్లో సీఎం జగన్ ట్రెండింగ్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సీఎం జగన్ అభిమానులు తమ అభిమాన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ #HBDYSJagan అనే హ్యాష్ టాగ్తో 5 లక్షల 50 వేలకు పైగా ట్వీట్స్తో, మూడు వందల మిలియన్స్కి పైగా రీచ్తో ట్రెండ్ చేశారు. డిసెంబర్ 20 సాయంత్రం ఐదు గంటలకు ఈ ట్రెండ్ మొదలవగా.. సీఎం జగన్ అభిమానుల ట్వీట్ల సునామీతో దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ప్రథమ స్థానంలో, ఆసియా ఖండంలో నాలుగో స్థానంలో, ప్రపంచ వ్యాప్తంగా ఐదో స్థానంలో నిలవడం విశేషం. ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్ అభిమానుల జన్మదిన శుభాకాంక్షల ట్వీట్ల ప్రవాహం నిరాటంకంగా కొనసాగడం దేశంలో మరే ఇతర నాయకుడికీ జరగలేదు. ప్రధాని నరేంద్ర మోదీ సీఎం జగన్కు ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం జీవించాలంటూ పేర్కొన్నారు. దానిపై సీఎం జగన్ స్పందిస్తూ ‘శ్రీ మోదీ గారు.. మీ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా’.. అంటూ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, నితిన్ గడ్కరీ, గజేంద్రసింగ్ షెకావత్, నారాయణ రాణే, భూపేందర్సింగ్, అర్జున్ ముండా, పశుపతి కుమార్పరాస్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలు అభినందనలు తెలపగా.. ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం బొమ్మై, మేఘాలయ సీఎం కన్రడ్ సంగ్మా, అసోం సీఎం హిమాంత్ బిశ్వశర్మలు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాలో ఆస్ట్రేలియా హై కమిషనర్ బారి వో ఫారెల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారియత్ వైన్ ఓవెన్లు సీఎంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, మోహన్బాబు, విశాల్, అల్లు అర్జున్, మంచు విష్ణు, డైరెక్టర్ మారుతీ, బీవీఎస్ రవి తదితరులు ట్వీట్ ద్వారా సీఎంకు శుభాకాంక్షలు చెప్పారు. సోదరి వైఎస్ షర్మిల అన్నాచెల్లెలు కలిసి ఉన్న చిన్ననాటి ఫొటోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే అన్నయ్యా.. అంటూ ట్వీట్ చేశారు. -
CM Jagan Birthday: సందడే.. సందడి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు బుధవారం కనులపండువగా జరిగాయి. తాడేపల్లిలోని నివాసంలో సీఎం జగన్తో పలువురు మంత్రులు, సీఎంవో అధికారులు కేక్ కట్ చేయించారు. ఇదే సమయంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు ఫోన్ చేసి సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనం అందించగా.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. పాస్టర్ జాన్ వెస్లీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తానేటి వనిత, ఆర్కే రోజా, విడదల రజిని, జోగి రమేష్, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, బాలశౌరి, సీఎస్ డాక్టర్ జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ప్రభుత్వ సలహాదారు(సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు, సీఎం సలహాదారు(గ్రామ, వార్డు సచివాలయాలు) ఆర్.దనుంజయ్రెడ్డి, సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదిగేకొద్దీ ఒదిగి ఉండటమే సీఎం నైజం.. ప్రజల్లో ఉండటం, ప్రజలకు సేవ చేయడంపైనే సీఎం వైఎస్ జగన్ దృష్టి పెట్టారని.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్నదే ఆయన నైజమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం సీఎం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలు భారీగా తరలివచ్చి.. సీఎం జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 500 కిలోల భారీ కేక్ను సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ మూడున్నరేళ్లలోనే పల్లెల రూపురేఖలను మార్చారని.. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని వివరించారు. మేనిఫెస్టోలోని 98 శాతం హామీలను నెరవేర్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కొందరు నాయకుల్లాగా సీఎం జగన్ ప్రజల్ని బెదిరించట్లేదని.. పాలన నచ్చితేనే వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరుతున్నారని.. ఇది నిజమైన రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణమన్నారు.అనంతరం పేదలకు దుస్తుల పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, అధికార భాషా సంఘం చైర్మన్ విజయబాబు, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, నాయకులు చల్లా మధు, మర్రి రాజశేఖర్, పుత్తా ప్రతాప్రెడ్డి, కావటి మనోహర్నాయుడు, ‘నవరత్నాల’ మూర్తి, రవిచంద్రారెడ్డి, కాకుమాను రాజశేఖర్, బత్తుల బ్రహ్మానందరెడ్డి, నారమల్లి పద్మజ, జియాఉద్దీన్, అడపా శేషు, మేడపాటి వెంకట్, పానుగంటి చైతన్య, కిరణ్రాజ్, దేవళ్ల రేవతి, శివశంకర్, ఈద రాజశేఖర్, మిమిక్రీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. తల్లి విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులతో సీఎం జగన్ హస్తినలోనూ ఘనంగా.. సాక్షి, న్యూఢిల్లీ: సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఏపీ భవన్ అధికారులు, ఉద్యోగులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని.. కేక్ కట్ చేసి సీఎం పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. భారత రాజకీయ వ్యవస్థలోనే జగన్కు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రజా సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యమని.. పేదల అభివృద్ధే ఆయన ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు మిథున్రెడ్డి, మార్గాని భరత్, వంగా గీత, తలారి రంగయ్య, రెడ్డప్ప, మాధవ్, గురుమూర్తి, సంజీవ్, లావు కృష్ణదేవరాయులు, శ్రీధర్, ఆర్.కృష్ణయ్య, కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పరశురామ్, జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ పాల్గొన్నారు. -
Happy Birthday CM YS Jagan: ‘రక్తదానం’లో గిన్నిస్, జీనియస్ రికార్డులు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు రక్తదానం చేసేందుకు అంగీకారం తెలియజేసి(టేక్ ది ప్లెడ్జ్.. సేవ్ ఏ లైఫ్) రికార్డు సృష్టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లోని ఆయన అభిమానులు రక్తదానం చేసేందుకు సిద్ధమంటూ WWW. ysrcpblooddonation.com ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు 1,28,534 మంది, ఆఫ్లైన్ ద్వారా 26,503 మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. అలాగే బుధవారం నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో 13,039 మంది రక్తదానం చేశారు. ఈ మేరకు మొత్తం 1,68,076 మందితో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో, అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇది వరకు(దక్షిణాఫ్రికా పేర్న) ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధి వీరేంద్ర.. ప్రపంచ రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం, మెడల్ను పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డికి అందించారు. 24 గంటల్లోనే రికార్డులు బద్దలు అత్యవసర సమయాల్లో రక్తం ఇచ్చేందుకు ఆసక్తి చూపే దాతల నుంచి అక్టోబర్ 24న దక్షిణాఫ్రికాలో సౌతాఫ్రికా నేషనల్ బ్లడ్ సర్వీస్ అనే సంస్థ ఆన్లైన్ ద్వారా ఫ్లెడ్జ్ ఫామ్స్ సేకరించింది. అప్పుడు 24 గంటల్లో 71,121 మంది ఫ్లెడ్జ్ ఫామ్స్ను అందజేసి సరికొత్త రికార్డును సృష్టించారు. అప్పటిదాకా మన దేశంలో కేవలం ఎనిమిది గంటల్లో 10,217 మంది ప్లెడ్జ్ ఫామ్స్ ఇచ్చిందే ప్రపంచ రికార్డుగా ఉండేది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు రెడ్క్రాస్ సొసైటీతో కలిసి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో భారీ ఎత్తున రక్తదానం చేశారు. కేవలం 24 గంటల్లోనే 1,68,076 ఈ రికార్డు సృష్టించి.. దక్షిణాఫ్రికా రికార్డును బద్దలు కొట్టారని రెడ్క్రాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్రెడ్డి వెల్లడించారు. రక్తదాన ఉద్యమం మరింత ముందుకు.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ వెంట మనం నడుస్తున్నందునే మనం ఎక్కడికెళ్లినా ప్రజలు ఆప్యాయత, అభిమానం చూపుతున్నారని చెప్పారు. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ సీఎం జగన్ దార్శనికుడిగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమం ఇంత భారీ ఎత్తున విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రభుత్వ సలహాదారు(నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ) చల్లా మధుసూదనరెడ్డిని, వారికి సహకరించిన ఐటీ వింగ్ ప్రతినిధులు, సోషల్ మీడియా, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, విద్యార్థి సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అభినందనలు తెలిపారు. రక్తదాన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సజ్జల పిలుపు నిచ్చారు. -
CM YS Jagan Birthday: " పండుగలా దిగివచ్చాడు " సీఎం వైఎస్ జగన్
-
దటీజ్ సీఎం.. మరోమారు మానవత్వం చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
హ్యాపీ బర్త్ డే సీఎం సార్: ప్రతి పాట సీఎం జగన్ వ్యక్తిత్వం పట్టి చూపేదే
-
హ్యాపీ బర్త్ డే సీఎం సార్: ప్రతి ఒక్కరూ అభివందనం చేయాల్సిందే..
-
Happy Birthday CM YS Jagan: ఎవరైనా జేజేలు కొట్టాల్సిందే..
-
CM YS Jagan Birthday: చిన్నారులకు ట్యాబ్స్ అందజేసిన సీఎం జగన్
-
CM YS Jagan Birthday Special: వైఎస్సార్సీపీ ప్రపంచ రికార్డ్
-
CM Jagan Birthday: శ్రీకాళహస్తి పట్టణం వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పండగల జననేత జగనన్న జన్మదిన వేడుకలు
-
CM YS Jagan Birthday: క్యాంప్ కార్యాలయంలో బర్త్డే వేడుకలు.. కేక్ కట్ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ను వేద పండితులు ఆశీర్వదించారు. సీఎంతో కేక్ కట్ చేయించిన మంత్రులు.. శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్కు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు బర్త్డే విషెస్ చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. చదవండి: మేనమామ సీఎం జగన్కు చిన్నారుల ప్రత్యేక శుభాకాంక్షలు -
CM YS Jagan Birthday: జగన్ మామకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న విద్యార్థులు
-
CM YS Jagan Birthday: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బర్త్డే వేడుకలు
-
CM YS Jagan Birthday: రక్తదాన రిజిస్ట్రేషన్లలో వైఎస్సార్సీపీ ప్రపంచ రికార్డ్
సాక్షి, తాడేపల్లి: రక్తదాన రిజిస్ట్రేషన్లలో వైఎస్సార్సీపీ ప్రపంచ రికార్డ్సాధించింది. లక్షా 30 వేల మంది రిజిస్ట్రేషన్లతో వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 72 వేల నిల్వలతో దక్షిణాఫ్రికా పేరిట గతంలో రికార్డు ఉండగా, దక్షిణాఫ్రికా రికార్డును వైఎస్సార్సీపీ బద్దలుకొట్టింది. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలోనూ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చల్లా మధుసూదన్రెడ్డి, సిబ్బందిని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభినందించారు. చదవండి: ట్విటర్ టాప్ ట్రెండింగ్గా #HBDYSJagan -
CM Jagan Birthday: ట్విటర్ టాప్ ట్రెండింగ్గా #HBDYSJagan
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ట్విటర్లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్గా వైఎస్ జగన్ బర్త్డే ఉంది. #HBDYSJagan అనే హ్యాష్ ట్యాగ్తో అభిమానులు దేశ, విదేశాల నుంచి ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 4లక్షల ట్వీట్లు దాటాయి. Happy birthday to a truly magnificent leader @ysjagan anna. Your approach and passion to achieve what you set out to do for the people of Andhra Pradesh are so remarkable. you will be our forever inspiration and we stand by u till our last breath.#HBDYSJagan pic.twitter.com/nDAXudwGvm — Dr.Anil Kumar Yadav (@AKYOnline) December 21, 2022 ఇందులో భాగంగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. రెడ్క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ట్విటర్లో సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజుకు సంబంధించి మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని ఇంతకుముందే వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 100K Tweets 🔥#HBDYSJagan pic.twitter.com/Mga1mdzrgP — Kodali Nani (@IamKodaliNani) December 20, 2022 కృతజ్ఞత చాటుకుంటున్న ప్రజలు.. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే నెరవేర్చారు. మూడున్నరేళ్లుగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ (డీబీటీ) రూపంలో రూ.1,77,585.51 కోట్లను జమ చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ తదితర పథకాల ద్వారా నాన్ డీబీటీ రూపంలో రూ.1,41,642.35 కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి ఇప్పటివరకు రూ.3,19,227.86 కోట్లను అందించారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! My heartiest birthday wishes to the young & dynamic @AndhraPradeshCM Sh Y.S. Jaganmohan Reddy. May blessings of Lord Venkateshwara always be upon you, and may you continue to take #AndhraPradesh to new heights of growth & development.#HBDYSJagan pic.twitter.com/9oFhE5yJCN — Parimal Nathwani (@mpparimal) December 21, 2022 వివిధ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సగటున 89 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు. దీంతో లబ్ధిదారులు గత రెండు రోజులుగా జరుగుతున్న సీఎం జన్మదిన వేడుకల్లో భారీగా పాల్గొంటున్నారు. తద్వారా సీఎం వైఎస్ జగన్కు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సోమవారం నిర్వహించిన క్రీడల పోటీల్లోనూ.. మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమంలోనూ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: (సీఎం జగన్కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు) -
CM Jagan Birthday: ఏపీ సీఎం వైఎస్ జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న విద్యార్థులు
-
CM YS Jagan Birthday: హ్యాపీ బర్త్డే జగన్ మామయ్య
-
CM Jagan Birthday: సీఎం వైఎస్ జగన్కు నాగార్జున, విశాల్ బర్త్డే విషెస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు నేడు(డిసెంబర్ 21). ఈ సందర్భంగా పలువురు సీనీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’అంటూ సీఎం జగన్కు టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Wishing dear @ysjagan garu a very happy birthday!!May you be blessed with health and happiness always!!💐 #HBDYSJagan — Nagarjuna Akkineni (@iamnagarjuna) December 21, 2022 కోలీవుడ్ హీరో విశాల్, టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా సీఎం జగన్కు బర్త్డే విషెస్ చెప్పారు. భగవంతుని ఆశిస్సులు వైఎస్ జగన్ గారికి ఉండాలని విశాల్, బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. Wishing AP CM Mr Jagan Mohan Reddy a Very Happy Birthday, God Bless #HBDYSJagan pic.twitter.com/2gym8Mr2EH — Vishal (@VishalKOfficial) December 21, 2022 Andhra Pradesh chief minister @ysjagan garu a very happy birthday!!May you be blessed with health and happiness always!!💐 #HBDYSJagan pic.twitter.com/q88XIbOZtN — BANDLA GANESH. (@ganeshbandla) December 21, 2022 సీఎం జగన్కు మోహన్ బాబు శుభాకాంక్షలు ఏపీ సీఎం జగన్కు ప్రముఖ నటుడు మోహన్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘షిర్డీ సాయి బాబా ఆశీర్వాదం తో జగన్ కు మంచి ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. Wishing Sri. @ysjagan many returns of the day May Shirdi Sai Baba’s blessing give him good health and happiness. — Mohan Babu M (@themohanbabu) December 21, 2022 -
CM Jagan Birthday: ఊరూవాడా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
Updates: అనంతపురం: రాప్తాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మెగా రక్తదాన శిబిరం ప్రారంభించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, అహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా: మాడుగుల మండలం ఎ.కోడూరులో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మొక్కలు నాటారు. సీఎం జగన్ ప్రజా నాయకుడు అని, ప్రజల ఆకాంక్ష మేరకు పాలన అందిస్తున్నారన్నారు. నెల్లూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో.. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం ధన లక్ష్మీపురంలో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా : పెడన నియోజకవర్గం వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మంత్రి జోగి రమేష్ రక్త దానం చేశారు. ప్రకాశం జిల్లా: సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను ఒంగోలు నగరంలోని 34 వార్డులో కార్పొరేటర్ డాకా సుజాత, హనుమారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నెల్లూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. చెముడుగుంటలో కేక్ కట్ చేసిన మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి.. సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్ని వర్గాల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. ఆయన శాశ్వత సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లా దాచేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కోట కృష్ణ, ఎంపీపీ బ్రహ్మనాయుడు, జెడ్పీటీసీ ప్రకాష్రెడ్డి, రమేష్రెడ్డి, కొణతం సూర్య నారాయణ రెడ్డి పాల్గొన్నారు. గోదావరి జిల్లాల్లో.. గోదావరి జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం జన్మదిన సందర్భంగా అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో మహిళలకు ఇప్పటికీ ముగ్గులు పోటీలు నిర్వహించామని విజేతలకు బహుమతులు అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని జగ్గిరెడ్డి అన్నారు. విశాఖపట్నంలో.. విశాఖ నగర వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ నేతలు కేక్ కట్ చేసి సీఎం జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తిరుపతిలో.. వైఎస్సార్ విగ్రహం సర్కిల్ వద్ద సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కేక్ కట్ చేశారు. మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు, భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో.. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు అనంతపురం జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. అనంతపురం కేఎస్ఆర్ కళాశాలలో విద్యార్థులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ మామయ్య అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అమ్మ ఒడి, నాడు- నేడు వంటి పథకాలతో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న వైఎస్ జగన్కు అంతా మంచే జరగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. సాక్షి, నెట్వర్క్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. రెడ్క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజుకు సంబంధించి మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని ఇంతకుముందే వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కృతజ్ఞత చాటుకుంటున్న ప్రజలు.. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే నెరవేర్చారు. మూడున్నరేళ్లుగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ (డీబీటీ) రూపంలో రూ.1,77,585.51 కోట్లను జమ చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ తదితర పథకాల ద్వారా నాన్ డీబీటీ రూపంలో రూ.1,41,642.35 కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి ఇప్పటివరకు రూ.3,19,227.86 కోట్లను అందించారు. వివిధ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సగటున 89 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు. దీంతో లబ్ధిదారులు గత రెండు రోజులుగా జరుగుతున్న సీఎం జన్మదిన వేడుకల్లో భారీగా పాల్గొంటున్నారు. తద్వారా సీఎం వైఎస్ జగన్కు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సోమవారం నిర్వహించిన క్రీడల పోటీల్లోనూ.. మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమంలోనూ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
CM Jagan Birthday: ప్రజా యోధుడు..
సాక్షి, అమరావతి: సంక్షేమ స్ఫూర్తిదాత.. హరితాంధ్ర రూపశిల్పి.. జలయజ్ఞంతో అపర భగీరధుడిగా తెలుగు ప్రజల హదయాల్లో సుస్థిరంగా నిలిచిపోయిన దివంగత వైఎస్సార్ ఆశయాలను కొనసాగించాలనే దృఢ సంకల్పంతో ముందడుగు వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేళ్ల పాటు తీవ్ర ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి వైఎస్సార్ సీపీని తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు. ఎందరో ముఖ్యమంత్రులున్నా వారి కుమారులెవరూ రాజకీయంగా బలమైన ముద్ర వేయలేకపోయారు. దేశంలోనే కాదు.. ప్రపంచ చరిత్రలోనే మరణించిన ప్రముఖుల వారసులెవరూ తీవ్రమైన అణచివేత, వ్యక్తిత్వ హననాన్ని ఎదుర్కొంటూ లక్ష్యాన్ని సాధించిన దాఖలాలు లేవు. సీఎం జగన్ ప్రజల్లోనే ఉంటూ స్థిర సంకల్పంతో తన లక్ష్యాన్ని సాధించారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి దివంగత వైఎస్సార్కు మించి మరో రెండడుగులు ముందుకు వేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. పరిపాలనలో తండ్రిని మించిన తనయుడుగా రాజకీయ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్నారు. నిర్బంధాలను లెక్క చేయకుండా.. ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థుల తరఫున ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ జగన్ను విచారణ కోసమని పిలిచిన సీబీఐ అక్రమంగా అరెస్టు చేసింది. తమ కోసం ఢిల్లీతో తలపడిన వైఎస్ జగన్ను అన్యాయంగా అరెస్టు చేసినా ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను 17 శాసనసభ, ఒక లోక్సభ స్థానంలో రికార్డు మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్, టీడీపీ కుట్రలను జనం చిత్తు చేశారు. వైఎస్ జగన్ను సీబీఐ అక్రమంగా నిర్బంధించటాన్ని నిరసిస్తూ ‘జగన్ కోసం జనం’ ద్వారా కోటి సంతకాలను సేకరించారు. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందటాన్ని తట్టుకోలేక వందల మంది గుండె పగిలి అసువులు బాశారు. ఆ కుటుంబాలను వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఓదార్చుతానని వైఎస్ జగన్ మాట ఇచ్చారు. అందుకు కట్టుబడి ఓదార్పు యాత్ర తలపెట్టిన ఆయన్ను నాడు కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. వైఎస్ జగన్ను అణగదొక్కేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ అధిష్టానం చేతులు కలిపి తప్పుడు కేసులు బనాయించింది. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు నైతిక విలువలకు కట్టుబడి కాంగ్రెస్కు, ఆ పార్టీ నుంచి సంక్రమించిన కడప ఎంపీ పదవికి, పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్ జగన్ ఉద్యమబాట పట్టారు. ప్రతిపక్షంలోనూ ప్రజల పక్షమే.. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేయగా వైఎస్సార్సీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఓట్ల కోసం టీడీపీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వగా.. సాధ్యమయ్యే హామీలను మాత్రమే జగన్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో 67 శాసనసభ, 8 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. కేవలం 5లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది. రైతులు, డ్వాక్రా మహి ళలను రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసగించటాన్ని నిరసిస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఉద్యమించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమబాట పట్టారు. నైతిక విలువకు తిలోదకాలిచ్చి 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ఫిరాయింపులకు ప్రోత్సహించటాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సమావేశాలను వైఎస్ జగన్ బహిష్కరించారు. నేనున్నానంటూ ఆయన చేపట్టిన 3,648 కి.మీ. ప్రజాసంకల్ప పాదయాత్ర 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2,516 గ్రామాలను తాకుతూ 341 రోజులపాటు కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీసింది. ప్రజాభ్యుదయమే ఆశగా.. శ్వాసగా ప్రజాభ్యుదయమే పరమావధిగా వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీని వైఎస్ జగన్ స్థాపించారు. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ జగన్, పులివెందుల శాసనసభ స్థానం వైఎస్ విజయమ్మ వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. తమ కోసం నిలబడిన వారిద్దరినీ ప్రజలు రికార్డు మెజార్టీతో జనం గెలిపించారు. వైఎస్సార్సీపీలో చేరేందుకు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే కాంగ్రెస్ నుంచి సంక్రమించిన పదవులకు రాజీనామా చేశాకే పార్టీలోకి రావాలని షరతు విధించి రాజకీయాల్లో మాయమవుతున్న నైతిక విలువలను పరిరక్షించేందుకు వైఎస్ జగన్ నడుం బిగించారు. నాడు 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ పోరాటం.. దాదాపు 16 నెలల అక్రమ నిర్భందం నుంచి బయటకొచ్చిన వైఎస్ జగన్ ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను గౌరవిస్తూ రాష్ట్ర విభజనలో కేంద్రం తీరును నిరసిస్తూ ఉద్యమబాట పట్టారు. ఆమరణ దీక్ష చేశారు. లోక్సభలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. చారిత్రక విజయంతో.. 2019 సాధారణ ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాలను గెలుచుకుని వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించింది. దేశ చరిత్రలో సాధారణ ఎన్నికల్లో ఈ స్థాయిలో విజయం సాధించిన రాజకీయ పార్టీ మరొకటి లేదు. 2019 మే 30న అధికారం చేపట్టిన తొలి రోజే సంక్షేమాభివృద్ధి పథకాలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. మూడున్నరేళ్లుగా సుపరిపాలనతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. హామీల్లో ఇప్పటికే 98% అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు అసలైన నిర్వచనం చెప్పి రాజకీయాల్లో నవశకానికి తెరతీశారు. వరుసగా పంచాయతీ, మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలతోపాటు తిరుపతి లోక్సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తిరుగులేని విజయం సాధించడం సీఎం జగన్కు ప్రజల్లో ఉన్న మద్దతుకు నిదర్శనం. -
CM YS Jagan Birthday Special: జన హృదయనేత జగనన్న
-
CM YS Jagan Birthday Special: నడిపించే జన నాయకుడతడే!
-
CM Jagan Birthday Special Photos: సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు.. ప్రత్యేకం( ఫొటోలు )
-
HBDYSJagan: నేటి రాజకీయాల్లో ఓ సంచలనం వైఎస్ జగన్
ఓ సాహసి.. ఓ స్వాప్నికుడు.. ఓ దార్శనికుడు రాజకీయాల్లో కొత్త ఒరవడి వైఎస్ జగన్.. తెలుగు వారి ఆత్మబంధువు ప్రతి పల్లెగడపా కళకళలాడాలి. చదువులమ్మ ప్రాంగణాలు వెలగాలి. అందరికీ ఆరోగ్యశ్రీ.. అందాలి ప్రజాసంక్షేమం.. రాష్ట్రాభివృద్ధే శ్వాసగా.. ధ్యాసగా.. ముందడుగులేస్తున్న పీపుల్స్ లీడర్పై ప్రత్యేక కథనం.. జగన్...జగన్...జగన్ ఈ రోజు ఇటు ప్రతిపక్షల్లోనూ, అటు ప్రజల్లోనూ ప్రతి రోజూ ప్రతిధ్వనిస్తున్న పేరు. ఆ పేరంటేనే ఓ సంచలనం. ఆ పిలుపంటేనే ఓ ప్రభంజనం. సకల వర్గాల ప్రజలతో మమేకమవుతున్న వై.ఎస్. జగన్.. ది యూత్ ఐకాన్. రాజకీయాల్లో ట్రూ లీడర్. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి. డాక్టర్గారి ముద్దుల కొడుకు. రాజారెడ్డిగారి ముద్దుల మనవడు. ఆ తర్వాత ఎమ్మెల్యే కొడుకు. తర్వాత మంత్రి కొడుకు. చాలాకాలం ప్రతిపక్షనాయకుడి కొడుకు. వ్యాపారరంగంలో సాధించిన విజయాలను ముఖ్యమంత్రి వారసుడనే మబ్బు కమ్మేసింది. నడుస్తున్న రాజకీయచరిత్రలో తిరుగులేని శక్తిగా ఎదిగిన వై.ఎస్.జగన్ తనకు తానే సాటి. ఆయనకు ఎవరూ సరిలేరు. సరికారు. 1972 డిసెంబర్ 21. వైయస్ జగన్ పుట్టిన సంవత్సరం. సరిగ్గా యాభైఏళ్ల క్రితం కడపజిల్లా జమ్మలమడుగు మిషన్ ఆస్పత్రిలో ఆయన జన్మించారు. పులివెందుల నియోజకవర్గంలో వైయస్ కుటుంబం నివాసం. ప్రాథమికపాఠశాల విద్య వరకు అక్కడే చదువుకున్న జగన్మోహన్రెడ్డి తాత రాజారెడ్డికి ముద్దుల మనవడయ్యారు. తాత సాహసం, ధైర్యం, నమ్ముకున్న వారికోసం గట్టిగా నిలబడ్డడం చిన్ననాడే అలవాటయ్యాయి. జనంలో కలిసిపోవడం.. వారి కష్టనష్టాల గురించి, మంచిచెడుల గురించి మాట్లాడటం మామూలైపోయింది.. జనం మనిషిగా ఎదగడానికి ఆ పులివెందులలోనే బీజం పడింది. చిన్ననాడే నలుగురిని ఆకర్షించే శక్తి వచ్చింది. అది వ్యక్తిత్వబలం. తండ్రి రాజశేఖరరెడ్డి ఒక సంవత్సరం డాక్టర్గా పనిచేశారు. ఒకరూపాయి డాక్టర్గా ప్రజల మన్ననలు అందుకున్నారు. వైద్యసేవలు అందించడంలో అంకితభావంతో పనిచేశారు. ఉన్నట్టుండి రాజకీయాలవైపు అడుగులు వేయాల్సివచ్చింది. మొదటిసారి నిలబడ్డ ఎన్నికల్లోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఓటమన్నది తెలియకుండా పోయింది. కొంతకాలం మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్యేగానే కాకుండా ఎంపీగా కూడా చేశారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా విలక్షణమైన పాత్ర పోషించారు. తండ్రి రాజకీయజీవితం కూడా వైఎస్జగన్పై ప్రభావం చూపడం మొదలైంది. రాజకీయనాయకుడు కావాలన్న పెద్ద లక్ష్యం ఏర్పడకున్నా, ప్రజాసంబంధాలు నెరపడంలో తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఆ తర్వాత డిగ్రీ ప్రగతి మహావిద్యాలయలో డిగ్రీ చేసిన జగన్ ఎన్సీసీలోనూ ఉన్నారు. వై.ఎస్ జగన్. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఐదేళ్ల తర్వాత, కాంగ్రెస్పార్టీని రెండోసారి అధికారంలోకి తెచ్చి, అనితరసాధ్యుడైన రాజకీయనాయకుడిగా ఎదిగిపోయారు వైయస్సార్. కానీ దురదృష్టవశాత్తు ఆకస్మికమరణంతో ఆయన దూరమైపోయారు. వైయస్జగన్ ఒంటరిగా మిగిలిపోయారు. ఇంటి పెద్ద ఆయనే అయ్యారు. తండ్రి రాజకీయాల్లో వున్నప్పుడే కుమారుడిని ప్రజలకు పరిచయం చేశారు. స్వంతపార్టీలో ఇబ్బందులు, తండ్రి మరణం తర్వాత ఆగిన గుండెలు, పోయిన ప్రాణాల కుటుంబాలకోసం తలపెట్టిన ఓదార్పు యాత్రకు సైతం ఆటంకాలు ఎదురవడం జగన్ను కలవరపెట్టాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇచ్చిన మాట తప్పని నైజం...వెనుకడుగువేయడానికి ససేమిరా అంది. ఇక రాజకీయాల్లో జగన్ ప్రస్థానం మొదలైంది. అలా ఓ అనితరసాధ్యుడి జీవితం ఊహించని మలుపుతో ముందుకు సాగుతూ పోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకేఒక్కడుగా జగన్ చరిత్రకు శ్రీకారం చుట్టుకుంది. బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలున్నవాడు అన్నది మిత్రుల అభిప్రాయం. వైఎస్సార్ కొడుకుగా ఎదుగుదల. అప్పట్నుంచే పరిచయమైన ప్రజాజీవితం. ప్రజాభిమానం పొందడమే గొప్ప వరమన్న సత్యం నాడే తెలుసుకున్నారు. నాన్నాలానే ప్రజాభిమానం పొందాలి. నాన్నలానే ప్రజాసేవలో మునిగిపోవాలి. నాన్నలానే ప్రజానాయకుడిగా ఎదగాలన్న లక్ష్యం ఆయన పరిసరాల ప్రభావమే. నిరంతరం ప్రజల మనిషిగా వున్న వైఎస్సార్ స్ఫూర్తి బలమే. ఒకటా రెండా. తండ్రి నుంచి చాలా లక్షణాలు జగన్ స్వంతమయ్యాయి. ఆయన వారసుడిగా.. వైఎస్సార్ వ్యక్తిత్వబలం కూడా జగన్పై ప్రభావం చూపింది. మరీ ముఖ్యంగా మాటతప్పని.. మడమ తిప్పని నైజం అలవడింది. రాజకీయమంటే ప్రజాజీవితంతో మమేకం కావడమే అన్న వైయస్సార్ లక్షణం జగన్కు పూర్తిగా అబ్బింది. సమకాలీన రాజకీయాలకు పూర్తి భిన్నమైన, విలువలు, విశ్వసనీయత ప్రాతిపదికగా తండ్రీకొడుకులు కొత్తరాజకీయానికి నిర్వచనం చెప్పడం మొదలుపెట్టారు. దాంతో ప్రజాసంక్షేమమే వారికి పరమావధిగా మారింది. కేవలం మనకోసం బతకడమే కాదు, అవతలివాళ్లకోసం కూడా బతకాలి. వాళ్ల జీవితాల్లో కూడా మంచి మార్పు తేగలగాలి. అప్పుడే జీవితానికి అర్థం వుంటుంది అన్నది జగన్ లైఫ్ ఫిలాసఫీ. ఇలాంటి మాటలు వైయస్ నోట తరచూ వినివుండటం వల్లో, నాన్ననడవడికను చూసీచూసీనో, జగన్కు చిన్నప్పటి నుంచి ప్రజలతో ఉండిపోవాలన్న ఉండేది. ఈ లక్షణం వాళ్ల నాన్న వల్లే అబ్బింది అంటుంది జగన్ తల్లి విజయమ్మ. తను రాజకీయాలు తనకు వద్దని చెప్పినా, ఆ మాటలు జగన్ను మార్చలేకపోయాయన్నది విజయమ్మ మాట. ఓ వైపు తండ్రి మాటలు, మరోవైపు తల్లి నేర్పిన విలువల పాఠాలు జగన్ వ్యక్తిగా ప్రత్యేకంగా మార్చాయి. మొత్తం మీద జగన్ రాజకీయాల్లోకి రావాలన్ననిర్ణయం మీద తండ్రి ప్రభావం ఎక్కువేనంటారు విజయమ్మ. రాజశేఖరరెడ్డి మాటలు, ఆయన వ్యవహారశైలి కారణంగా జగన్కు ప్రజాసేవమీద ఆసక్తి పెరిగిందన్నది తల్లి విజయమ్మ అభిప్రాయం. మొత్తానికి తనను తాను జనం మనిషిగా మార్చుకున్నాడు వై.యస్జగన్. అసలు సిసలు ప్రజానాయకుడిగా ఎదిగేందుకు ముందడుగులు వేశాడు. పదేళ్ల రాజకీయపోరాటం. అలుపన్నది తెలీదు. భయమన్నది లేదు. ప్రజలకోసం నడిచారు. నిలిచారు. ప్రజలమధ్య నుంచే ఎదిగారు. విశాలాంధ్రప్రదేశ్ అనుపానులన్నీ అర్థం చేసుకున్నారు. అన్నివర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకు అండగా నిలవాలనుకున్న వైఎస్ జగన్.... చిన్నవయసులోనే ప్రజాక్షేత్రంలో అంకితభావంతో నడుస్తూ పోయారు. విజేతగా నిలిచి.. అనితరసాధ్యమైన ప్రజాసంక్షేమపాలనను అందిస్తున్నారు వైఎస్ జగన్. జగన్ రాజకీయప్రవేశం సులువుగా జరిగిపోయివుండవచ్చేమోగానీ, ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం అంత సులువుగా ఏమీ సాగలేదు. తండ్రి మరణం తర్వాత జగన్ ఎదుర్కొన్న అగ్ని పరీక్షలు అన్నీ ఇన్నీ కావు. ఒక దశలో జగన్నే ముఖ్యమంత్రి చేయాలని, కాంగ్రెస్కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కానీ అధిష్టానం ఎందుకో ఒప్పుకోలేకపోయింది. అక్కడే కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది పడింది మరి!. తండ్రి మరణం తర్వాత పావురాలగుట్టకు వెళ్లిన జగన్కు అక్కడి అశేషజనాన్ని చూడగానే భావోద్వేగం పొంగింది. వారంతా నాన్న తనకిచ్చిన పెద్ద కుటుంబం అనిపించింది. ఆ ప్రజల సమక్షంలోనే వైయస్ మరణానికి తట్టుకోలేక చనిపోయిన వారి ప్రతి కుటుంబాన్ని ఓదారుస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటపై ముందుకు సాగారు. కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం కాదుకూడదు అంది. జగన్ వెనక్కు తగ్గలేదు. ఓదార్పు కొనసాగింది. జగన్పై అన్ని రకాల రాజకీయ కుట్రలు, కుతంత్రాలు మొదలయ్యాయి. ఆరోజుల్లో ఓదార్పు యాత్ర దేశ చరిత్రలోనే నభూతో న భవిష్యతి. జగన్ పట్ల జనానికి ఉన్న అభిమానానికి ఆ ఓదార్పు యాత్ర అద్దం పట్టింది. జగన్ యాత్రలకు జనం అంతగా రావటం వెనుక వైఎస్ పథకాలు ఒక కారణం కావచ్చు. తమకు అంతటి మేలుచేసిన వైఎస్ తనయుడి పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరు నచ్చకపోవడంతో వైయస్ కుటుంబం పట్ట జనంలో సానుభూతి పెరుగుతూ పోయింది. ఇది కాదనలేని సత్యం. జగన్ పట్టుదల కూడా ఆయన్ను జనంలో తిరుగులేని నేతగా మార్చడంలో ముఖ్యపాత్ర పోషించింది. దేశరాజకీయాల్లోనే వైఎస్ జగన్ పాలన విప్లవాత్మకమైనది అని చెప్పకతప్పదు. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ తుచ తప్పకుండా నెరవేర్చాలని కంకణం కట్టుకున్న ఏకైక రాజకీయనాయకుడు వైఎస్ జగన్. కలలోనైనా ప్రజలకిచ్చిన మాట తప్పకూడదన్నది ఆయన సిద్ధాంతం. పారదర్శకపాలన అందించాలన్నదే తపన. చిత్తశుద్దితో సంక్షేమ పథకాల అమలు, దూరదృష్టితో అభివృద్ది ప్రణాళికలు అమలు చేస్తు ముందుకు సాగుతున్న వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు దొరికిన ఆణిముత్యం స్వంత పార్టీ పెట్టిన తర్వాత వైయస్ జగన్ దేశచరిత్రలోనే అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పార్టీని ముందుకు నడపడమే ఏకైక దీక్షగా సాగారు. అదే సమయంలో ఆయన జైలు జీవితం కూడా చూడాల్సి వచ్చింది. జైలునుంచి రాగానే 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ వైఎస్సార్ సీపీ బరిలో నిలిచింది. ఒంటరిగానే ముందుకు సాగింది. కేవలం ఐదులక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది. తర్వాత నవ్వాంధ్ర ప్రదేశ్లో వైఎస్ జగన్ శాసనసభలో ప్రతిపక్షనేతగా వున్నారు. ప్రతిపక్షనేతగా ప్రతిరోజూ ప్రజాసమస్యలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేవారు. ఆయన మాటలు పట్టించుకునే వారే కరువయ్యారు. చివరాఖరుకు అసెంబ్లీలో మైకు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు అధికారపక్షం. ఇలా కాదనుకున్న వైఎస్జగన్ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలనుకున్నారు. గెలిచిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగుపెడతానని శపథం చేశారు. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. చరిత్రలో నిలిచిపోయిన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్రే నవ్యాంధ్ర చరిత్రను మార్చింది. ఇలా సాగిన ఈ పాదయాత్రే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ పాదయాత్రే వైయస్ జగన్లో మరింతగా రాజకీయ పరిణతి పెరిగేలా చేసింది. ఈ పాదయాత్ర కాలంలోనే వేలకిలోమీటర్లు నడిచిన జగన్ లక్షలాది మంది హృదయాలను సృజించారు. గుండెగుండెను తట్టారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆత్మీయసమ్మేళనాలతో అన్ని వర్గాల, కులాల, మతాల వారి సమస్యలు తెలుసుకున్నారు. తనపై వారికున్న నమ్మకాన్ని గమనించారు. రుతువులు మారినా, వర్షాలు కుమ్మరించినా, ఎండలు మండినా, చలి వణికించినా చలించని జగన్ పాదయాత్ర అనుభవాలతోనే తన పార్టీ మేనిఫెస్టోను రూపొందించుకున్నారు. అందులో ఇచ్చే ప్రతి హామీ నెరవేర్చి తీరాలని తపించారు. ఈ మేనిఫెస్టోనే నేడు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తోంది. విద్య,వైద్యం ఇలా అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. సరికొత్తపాలను చవిచూపిస్తోంది. కులమత, వర్గ, ప్రాంత, పార్టీల కతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగే పాలనకు అసలుసిసలు అర్థం చెబుతోంది. ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల అపార నమ్మకం వున్నవారు ఏపీ సీఎం. వ్యవస్థలను స్వేచ్ఛగా ముందుకు నడిపించగలిగితే.. ప్రజలందరికీ సుపరిపాలన అందుతుంది అన్నది ఆయన విశ్వాసం. విలువలు, విశ్వసనీయతలే నాయకుడిగా వేసే ప్రతి అడుగుకూ సార్ధకత చేకూరుస్తాయని వైఎస్ జగన్ బలంగా విశ్వసిస్తారు. కుల, మత, పార్టీ, ప్రాంతాల కతీతంగా సాగుతున్న వైఎస్ జగన్ పాలన .. దార్శనికుడైన పాలకుడి సమర్ధతను పట్టిచూపుతోంది. అటు మేధావుల్ని, ఇటు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. 2019 ఎన్నికల్లో జగన్పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కనివిని ఎరుగని రీతిలో మెజారిటీ సీట్లలో గెలిపించారు. మొత్తం 175 స్థానాల్లో వైఎస్సార్సీపి 151 సీట్లలో విజయకేతనం ఎగరేసింది. 25 పార్లమెంటు స్థానాల్లో 22 ఎంపీ సీట్లు వైఎస్సార్సీపీవి అయ్యాయి. ఇంతకన్నా విజయముండునా? ఇంతకన్నా ప్రజవిశ్వాసం గెలుచుకున్న పార్టీ ఉండునా. ఇదంతా ఒకే ఒకడుగా జగన్రెడ్డి సాధించిన విజయం. పొత్తుల్లేవు. ఒకటే గుర్తు.. ఒకటే జెండా.. ఒకడే నాయకుడు అన్నట్టుగా సాగిన 2019 ఎన్నికల్లో ఆ ఒకే ఒక్కడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి. నవ్యాంధ్రలో అన్ని ఎన్నికల్లోనూ రికార్డులు బద్దలు కొట్టిన జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఆరోజు నుంచి ప్రతిరోజు ఆయనకు మేనిఫెస్టోనే ఖురాన్, బైబిల్, భగవద్గీత అయ్యాయి. కలనైనా మరవకూడదన్న ఆలోచన కళ్లెదుటే కనిపించేలా మేనిఫెస్టోను అతికించుకున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆయన ఐదు సంతకాల ప్రాధాన్యత ప్రజల్లో ఆసక్తిని రేపింది. ఒక సగటు కుటుంబం మీద వాటి ప్రభావమెంత, రాష్ర్టప్రగతి దిశలో ఈ కీలక నిర్ణయాలతో ఒనగూరే నిజమైన ఉపయోగం ఏమిటి అన్నదానిపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అమ్మ ఒడి, సామాజిక పెన్షన్ల పెంపు, ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాల మాఫీ, ఊరూరా జనసేవాల కేంద్రాలు ఇవీ ఆయన వాగ్దానాలు. చెప్పినవే కాకుండా చెప్పనవి కూడా ప్రజలకు ఉపయోగపడితే అమలు చేసే జగన్...అటు విద్యారంగంలోనూ ఇటు వైద్యరంగంలోనూ నాడు-నేడును ప్రకటించారు. ఆ వ్యవస్థల రూపురేఖలు పూర్తిగా మార్చేయాలన్న ప్రయత్నాలు శీఘ్రంగా సాగుతున్నాయిప్పుడు. వైఎస్ సంక్షేమ పథకాలన్నింటినీ మళ్లీ సంతృప్త స్థాయిలో నెరవేర్చాలని, వాటిని పటిష్టపరచి, వాస్తవ స్పూర్తితో తు.చ తప్పకుండా అమలు చేయాలనే భావన ముఖ్యమంత్రి వైయస్ జగన్ది. దీంతో పాటు అదనంగా మరికొన్ని పథకాలనూ ప్రవేశపెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. అంటే.. వైఎస్ స్ఫూర్తికి కొనసాగింపు అన్నమాట. మరింత విస్తరణ అన్నమాట. ప్రజాసేవలో నాన్నకన్నా రెండడుగులు ముందుకే వేస్తానన్న మాటలకు అర్థమన్నమాట. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులే తన బలం అని గట్టిగా నమ్మిన వైఎస్జగన్, ఆ విశ్వాసబలంతోనే ముందుకు సాగుతున్నారు. ఎక్కడా తగ్గేదేలా అన్న అపార ఆత్మవిశ్వాసం ఆయనకు మాత్రమే స్వంతం. తన పనితీరే తనకు శ్రీరామరక్ష అని గట్టిగా విశ్వసిస్తున్నారు. తన పాలనను, గత పాలకుడి పాలనను బేరీజు వేసి చూడాలని, తన సంక్షేమపథకాల లబ్ది ఏ మేరకు, ఎంతమందికి, ఎన్ని జీవితాల్లో వెలుగులు నింపుతోందో ఆలోచించమని ఆయన నేరుగా ప్రజలనే కోరుతున్నారు. నిరంతరం ప్రజలకు మేలు చేయడం మినహా మరో లక్ష్యం తనకు లేదని స్పష్టంగా ప్రకటిస్తున్న జగన్ నేటి రాజకీయాల్లో ఓ సంచలనం. -
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
ఆస్ట్రేలియాలో జననేత వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో కృష్ణా రెడ్డి, భరత్,బ్రహ్మారెడ్డి ,రామాంజిలు మెల్బోర్న్ నగరంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు -
బాపట్ల: జగనన్న 175/175.. ఆకట్టుకున్న వరి కోత
సాక్షి, బాపట్ల: జననేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా అభిమానం వెల్లువెత్తుతోంది. ఇదిలా ఉంటే.. గత మూడేళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజుకి తన అభిమానాన్ని డిఫరెంట్గా కనబరిచే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి.. మరోసారి ప్రత్యేకతను చూపించారు. చుండూరు మండలం వలివేరు పంట పొలాలలో వైఎస్ జగన్ 175/175 సీట్లు లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ.. వరి కోత ప్రదర్శించారు. ఇదిలా ఉంటే.. మొదటి సంవత్సరం బాపట్ల బీచ్ లో ఇసుకతో జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని చేయించారు తర్వాత సంవత్సరం జై జగనన్న వరికొత్తతో కోయించారు తర్వాత సంవత్సరం రావిఆకు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో గియించారు. ఇక ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి 175/175 సీట్ల లక్ష్యం సాధించాలని 175/175 జగనన్న అని వరి కోతతో కోయించి తన అభిమానాన్ని మరో సారి చాటుకున్నారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మేరుగు నాగార్జున, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని కేక్ నీ కట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటూ వెంకటరెడ్డికి అభినందనలు తెలిపారు మంత్రి మేరుగు. -
మంచి చేస్తుంటే ఈనాడు ఓర్వలేకపోతోంది: మంత్రి రోజా ఫైర్
సాక్షి, విజయవాడ: సంక్షేమ సామ్రాట్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఏపీ మంత్రి ఆర్కే రోజా కొనియాడారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా.. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు జరిగాయి. ఈ సంబరాలు ముగింపు కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఏపీ మీడియా సలహాదారు అలీ, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి అధ్యక్షురాలు వంగపండు ఉష హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. తప్పుడు రాతలు రాస్తున్న ఈనాడు దినపత్రికపై మండిపడ్డారు. ఇది కళాకారులను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంబరాలని, కానీ, ఈనాడుకి కళ్లు కనిపించడం లేదంటూ ఆమె విమర్శించారు. ‘‘రూ. 2.6 కోట్లు కేటాయించారంటూ కడుపు మంటతో వార్తలు రాస్తున్నారు. జీవో ఎక్కడ విడుదల చేసామో ఓసారి చూపించాలని ప్రశ్నిస్తున్నా. మంచి చేస్తుంటే ఓర్వలేకపోతున్న ఇలాంటోళ్లకు జెలెసిల్ బాటిల్స్ పంపించాల్సిందే’’ అని రోజా వ్యాఖ్యానించారు. ఇక నెలరోజుల పాటు నిర్వహించిన సంబరాల్లో 12 వేల మంది పోటీ పడ్డారని, 300 మంది విజేతలుగా నిలిచారని, విజేతలందరికీ ప్రత్యేక ఆకర్షితులుగా హాజరైన జబర్దస్త్ నటుల చేతుల మీదుగా బహుమతులు అందజేయిస్తున్నామని రోజా తెలిపారు. ప్రత్యేక ఆకర్షితులుగా హైపర్ ఆది, రాం ప్రసాద్, రోహిణి, అభి, చంటి, మహేష్,రాకేష్, ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు. రోజా ఒకప్పటి అగ్రశ్రేణి నటి. నేడు అగ్రశ్రేణి రాజకీయనాయకురాలు . సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు . జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా సంబరాలు నిర్వహించిన మంత్రి రోజాకు అభినందనలు. విజేతలకు శుభాకాంక్షలు అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మరుగున పడిపోతున్న కళలను వెలికి తీసే ప్రయత్నం చేయడం గొప్ప విషయం. మారుమూల ఉన్న కళాకారులను గుర్తించడం అభినందనీయమని మంత్రి కారుమూరి తెలిపారు. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా సంబరాలు నిర్వహించిన మంత్రి రోజాకు అభినందనలు తెలియజేశారు. ఆపై ఈనాడు పేపర్, రామోజీరావు పై మంత్రి కారుమూరి మండిపడ్డారు. కళాకారులను వెలికితీస్తుంటే ఈనాడు పేపర్ కు కడుపు మండిపోతుందని, రోజా సొంత ఖర్చుతో చేస్తుంటే జీవోలో రెండు కోట్లు కేటాయించినట్లు కథనాలు రాశారని, ఇలా రాయడానికి సిగ్గుందా? అని రామోజీరావును నిలదీశారు మంత్రి కారుమూరి. కళాకారులకు తన వంతు సహకారం అందిస్తానని ప్రకటించారు మంత్రి కారుమూరి. బియ్యపు గింజలపై జగనన్న సంక్షేమం ఈ కార్యక్రమంలో.. జగనన్న సంక్షేమ పథకాలు ,26 జిల్లాల వివరాలు బియ్యపు గింజలపై చిత్రీకరించారు కారుమూరి మౌల్య పద్మావతి. పద్మావతి రూపొందించిన ఆర్ట్ ను మంత్రి ఆర్కే రోజా ఆవిష్కరించారు. -
YS Jagan:కెప్టెన్గా.. అరుదైన ఘనత సొంతం
రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్న నాయకుడు వైఎస్ జగన్.. చదువుకునే రోజుల్లోనూ ఎంతో చరుకుగా ఉండేవాడు. ఆ సమయం నుంచే ఆయనలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కనిపించాయి. అదే ఆయన చేత అరుదైన ఘనతను సాధించి పెట్టాయి. తండ్రి కంటే తాత దగ్గరే జగన్కు చనువెక్కువ. అందుకే స్కూల్లో చదువుతున్న రోజుల్లో కూడా సెలవులొస్తే చాలు పులివెందుల రావడం, తాత వాడే జీపులో ఊరంతా తిరగడం అలవాటుగా ఉండేది. హైదరాబాద్లో ఉన్న తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసేది కాదు. పైగా పులివెందులలోనూ ఒక మిత్రబృందం ఉండేది. వాళ్లందరినీ గుమికూడ్చి క్రికెట్ ఆడడం కూడా ఒక అలవాటుగా మారిపోయింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఐసిఎస్ఐ సిలబస్ కావడంతో.. అక్కడే 12వ తరగతి వరకూ చదివే వెసులుబాటు ఉండేది. అక్కడ చదివినంత కాలం ఏ ఒక్క ఆటకూ పరిమితం కాకుండా క్రికెట్, బాస్కెట్ బాల్ లాంటి రకరకాల ఆటల మీద ఆసక్తికనబరిచేవాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండే శ్రీబాగ్ ఇంటి దగ్గర కూడా స్నేహితుల బృందంతో కలిసి క్రికెట్ ఆడేవాడు. చదవులో సగటు విద్యార్థి కంటే కాస్త ఎక్కువ అనిపించుకున్నా, అందరితో బాగా కలిసి మెలసి ఉండటంలో మాత్రం చురుగ్గా ఉండేవాడని స్కూల్ టీచర్లు, సిబ్బంది చెబుతారు. డాక్టర్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న సూరీడు, రోజూ మారుతీ కారులో జగన్మోహన్రెడ్డిన డ్రాప్ చేసి పికప్ చేసుకునేవాడు. నిజానికి మధ్యాహ్నం మూడు గంటలకే క్లాసులు పూర్తయినా, సాయంత్రం దాకా స్కూల్లోనే మిత్రులతో ఉండిపోయేవాడు. అలా హాస్టల్లో ఉండే మిత్రులతో కలిసి ఎక్కువసేపు గడపటానికి జగన్ ఇష్టపడేవాడు. మళ్లీ ఇంటికి వెళ్లగానే చదువు మామూలే. అలా అందరినీ కలుపుకుపోయే నాయకత్వ లక్షణాలుండటం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హౌజ్ కెప్టెన్ అయ్యేందుకు కారణమైంది. స్కూల్లో ఉన్న విద్యార్థులందరినీ నాలుగు హౌజ్లుగా విభజించడం అక్కడ ఆనవాయితీ. వాటికి రెడ్ హౌజ్, బ్లూ హౌజ్, గ్రీన్ హౌజ్, ఎల్లో హౌజ్ అని పేర్లు. ఏ పోటీలు జరిగినా.. ఆ నాలుగు హౌజ్ల మధ్యే జరుగుతాయి. అంటే క్రికెట్ అనగానే ఈ నాలుగు జట్ల మధ్య జరిగే పోటీలో విజేతను నిర్ణయిస్తారు. అదే విధంగా ఖో ఖో, బాస్కెట్ బాల్.. ఏదైనా అంతే. ఆటలతో పాటు వక్తృత్వం, వ్యాసరచన లాంటి పోటీలూ జరుగుతాయి. ఏటా జరిగే ఈ పోటీల్లో ఆల్ రౌండ్ చాంపియన్షిప్ సాధించడం ఒక ప్రతిష్టాత్మకమైన విషయం. 12వ తరగతిలో ఉన్నవాళ్లకి మాత్రమే హౌజ్ కెప్టెన్సీ దక్కుతుంది. అలా.. జగన్ 12వ తరగతిలో ఉన్నప్పుడు రెడ్ హౌజ్కు కెప్టెన్ అయ్యాడు. పైగా ఆ సంవత్సరం తన హౌస్కు ఆల్ రౌండ్ ఛాంపియన్షిప్ సాధించిన ఘనత కూడా దక్కించుకున్నాడు. అంతకు ముందుగా పదేళ్లుగా రెడ్ హౌజ్కు దక్కని గౌరవం.. జగన్ ఉన్నప్పుడే దక్కిందని మిత్రులు చెప్తుంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. జగన్మోహన్రెడ్డి కంటే ముందు రెడ్ హౌస్ కెప్టెన్గా వ్యవహరించింది చెన్నారెడ్డి మనవడు ఆదిత్యరెడ్డి(శశిధర్ రెడ్డి కుమారుడు). హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆదిత్యరెడ్డి 12వ తరగతి చదువు, రెడ్ హౌస్ కెప్టెన్సీ ముగిసిన సంవత్సరమే చెన్నారెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోయారు. ఆ సంవత్సరం ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అవుతారనుకున్న రాజశేఖర్రెడ్డి కాలేకపోయారుగానీ, ఆదిత్యరెడ్డి స్థానంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రెడ్ హౌస్ కెప్టెన్ పదవి మాత్రం జగన్మోహన్రెడ్డిని వరించింది. :::సీఎం జగన్ పుట్టినరోజు ప్రత్యేకం సంగ్రహణ: యువకెరటం(ఎ.ఎస్.ఆర్.మూర్తి, బుర్రా విజయశేఖర్) -
AP CM YS Jagan: ఒకే ఒక్కడై విజేతగా.. జగన్ అంటే సాహసం..
పువ్వుపుట్టగానే పరిమళిస్తుంది అన్నది ఓ నానుడి. మనిషి జీవితంలోనూ బాల్యంలోనే అతని భవిష్యత్తు కనిపిస్తుందన్నది ఒక నమ్మకం. ఒక నిజం. వైయస్ జగన్ విషయంలో ఈ విషయం సుస్పష్టం. ఆయనలో నాయకత్వ లక్షణాలు చిన్ననాడే, విద్యార్థిదశలోనే కనిపించాయి. విలువలు, ఆదర్శాలతో కూడిన జీవితాన్ని గడపాలన్న లక్ష్యంగా ఎదిగారు జగన్. అనుకున్నది సాధించే క్రమంలో చూపే పట్టుదల రాజకీయాల్లోనూ చూపారు. ఒకే ఒక్కడై విజేతగా నిలిచారు. ప్రాథమిక విద్య ఒకటిరెండు తరగతుల తర్వాత పులివెందుల నుంచి వైయస్ జగన్ చదువు హైదరాబాద్కు మారింది. హైదరాబాద్ పబ్లిక్స్కూల్లో ఆయన ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నారు. ఆ రోజుల్ని, ఆయనతో గడిపిన క్షణాల్ని ఇప్పటికీ గర్వంగా గుర్తుచేసుకుంటూ వుంటారు మిత్రులు. జగన్ అన్నివేళలా ఇన్స్ఫయిరింగ్ క్యారెక్టర్ అని చెబుతుంటారు. జగన్ అంటే ధైర్యం. జగన్ అంటే సాహసం. జగన్ అంటే ఒక విశ్వాసం. జగన్ అంటే స్నేహస్వభావం. జగన్ అంటే సాయపడే తత్వం. ఇది ఆయనపై మిత్రుల అభిప్రాయం. - వరప్రసాద్, జగన్ క్లాస్మేట్ - వెంకటన్న, జగన్ సహవిద్యార్థి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జగన్లోని నాయకత్వ లక్షణాలను పెంచింది. అక్కడ ఆయన ఎన్సీసీలోనూ ఉన్నారు. క్రమశిక్షణకు మారుపేరయిన ఆ స్కూలు, వైఎస్ జగన్పై చాలా ప్రభావాన్నే చూపింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూలు చదువు తర్వాత వైయస్ జగన్మోహన్రెడ్డి కోటీలోని ప్రగతి మహావిద్యాలయంలో బికాం డిగ్రీ చదివారు. ఈ మూడేళ్ల డిగ్రీ చదువులో ఆయనకు స్నేహితులుగా వున్నవారు, నేటికీ జగన్రెడ్డిని గుర్తు చేసుకుంటూనే వున్నారు. నాడు ప్రగతి మహావిద్యాలయలో పనిచేసిన లెక్కరర్లు కూడా జగన్ కాలేజీలో గడిపిన నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటుంటారు. విద్యార్థిగా ఆయన నడక, నడత బావుండేవని అంటున్నారు. - రమేష్, స్కూల్మేట్ - ప్రవీణ్, క్లాస్మేట్ - చంద్రకాంత్ నాయక్, క్లాస్మేట్ ఆ తర్వాత వైఎస్ జగన్ ఎంబీఏ నిమిత్తం లండన్ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చిన అనంతరం బెంగళూరులో వ్యాపారాలు మొదలుపెట్టారు. సూక్ష్మగ్రాహి కావడం, ప్రతి విషయాన్ని డిటైల్డ్గా తెలుసుకోవడం, అనుకున్నది సాధించేంతవరకు శ్రమించడం అనే లక్షణాలు ఆయనను బిజినెస్లో సక్సెస్ అయ్యేలా చేశాయి.బ్రిలియెంట్, డేరింగ్, వాల్యూబేస్డ్ పర్శనాలిటీ వున్న స్టూడెంట్ అని నాటి నుంచి జగన్కు మంచి పేరుంది. - కృష్ణమోహన్ నాయుడు -
బిజినెస్లో ఆయనో సక్సెస్ పాఠం.. దార్శనికుడిగా పరిశ్రమలకు ఊతం
చదువు పూర్తవగానే బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాజకీయాల కన్నా చాలా ముందే ఆయన వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. అక్కడా అదే పట్టుదల, ప్రతి విషయం తెలుసుకోవాలనే శ్రద్ధ, ఏకాగ్రత, సక్సెస్ కావడమే లక్ష్యం. లక్ష్యసాధన దిశలో ఆయన ఎంత కష్టానికైనా సిద్ధమయిపోయారు. కష్టపడ్డారు. విద్యుత్, సిమెంట్, మీడియా రంగాల్లో అనితర సాధ్యమైన విజయాలు సాధించారు. ఆ క్రమంలో ఆయన దార్శనికత బాగా ఉపయోగపడింది. ముందుచూపుతో కూడిన నిర్ణయాలు కార్పొరేట్ రంగంలో ఆయననొక ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. ఆయన్ను సన్నిహితంగా గమనించిన కార్పొరేట్ రంగ నిపుణులు, కంపెనీల యజమానులు అదే విషయాన్ని పదేపదే చెబుతుంటారు. ఆషామాషీగా వ్యాపార రంగంలోకి దిగలేదు.. వైఎస్ జగన్ ఏదో ఆషామాషీగా వ్యాపార రంగంలోకి రాలేదు. అప్పుడాయనకు రాజకీయాలు ప్రయారిటీ కూడా కాదు. డీప్ స్టడీతో, లోతైన అవగాహనతోనే ఆయన బిజినెస్ రంగంలోకి దిగారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనించారు. ప్రశ్నలు వేసి మరీ తెలుసుకున్నారు. ఆయన ప్రతి విషయాన్ని డీప్గా తెలుసుకుని నిపుణుల్ని అడిగేవారు. బిజినెస్ రంగంలో ఆయనకున్న అపారజ్ఞానం వల్లే ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ నేడు ఏపీ ముందంజలో వుంది. ఏ పరిశ్రమలు ఎక్కడ అవసరం, ఎక్కడి పరిస్థితులు అనుకూలం, ఏ ప్రాంతానికి ఉపయోగం అన్న విషయాలను గమనింపులోకి తీసుకునే సీఎంగా పారిశ్రామిక విధానం తెచ్చారు. - చావా సత్యనారాయణ, ల్యారస్ ల్యాబ్ సీఇవో భారతి సిమెంట్స్ బెస్ట్ ఎగ్జాంఫుల్ జగన్గారు గొప్ప విజనరీ అని చెప్పడానికి భారతి సిమెంట్స్ బెస్ట్ ఎగ్జాంఫుల్. ఆ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు మేము ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొన్నాం. సాంకేతికత విషయంలో జగన్ది రాజీలేని ధోరణి. రీసెర్చ్ ఓరియెంటెడ్ మెంటాలిటీ. ఉపాధి అవకాశాల కల్పన జగన్గారి ప్రయారిటీ అంశం. భారతీ సిమెంట్స్ ఈరోజు సక్సెస్పుల్ వెంచర్ కావడానికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగన్ గారే అంటారు -రవీందర్రెడ్డి, భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ లోతుగా తెలుసుకుంటారు.. జగన్ గారు సిమెంట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేముందు వైఎస్సార్ గారి ద్వారా నాకు పరిచయమయ్యారు. తనకు ఏమీ తెలీదన్న జగన్.. చెప్పిందంతా ఎంతో శ్రద్దగా విన్నారు. మరోసారి చెప్పించుకున్నారు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఏ విషయాన్నయినా ఎంత లోతుగా తెలుసుకుంటే అంత మేలన్నది జగన్ స్వభావమని. పరిశ్రమల విషయంలో ఆయనకు అన్ని విషయాలు తెలుసు. అందుకే నేడు ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాల విషయంలో గొప్ప పేరు తెచ్చుకుంటూనే, దార్శనికుడిగా పరిశ్రమలకు ఊతమిస్తున్నారు. జగన్ హయాంలో కచ్చితంగా పారిశ్రామిక రంగం అభివృద్ది శిఖరాలు చేరుకుంటుందని నాకు గట్టి నమ్మకం. ప్రసాదరెడ్డి, బిజినెస్ వ్యవహారాల నిపుణుడు అది సామాన్యమైన విషయం కాదు ఆంధ్రప్రదేశ్లో పారదర్శకంగా, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. కరోనా మహమ్మారి సవాళ్లను అధిగమించి, పారిశ్రామికాభివృద్ధి సాధించడమన్నది సామాన్యమైన విషయం కాదు. అది ఏపీలో సీఎం జగన్ సాధించి చూపారని సాగర్ సిమెంట్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. 2019 జూన్ నుండి 2022 జూన్ వరకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. మూడేళ్లలో 30వేల 645 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మూడేళ్లలో రూ.47వేల కోట్ల 662కోట్ల పెట్టుబడుల సమీకరణ జరిగింది. (YS Jagan పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం) -
తొలి రోజు ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
సాక్షి, విశాఖపట్నం/రేణిగుంట/సూళ్లూరుపేట: ఈ నెల 21న సీఎం వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మూడురోజులపాటు నిర్వహిస్తున్న వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలిరోజు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహింరు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్బాబు ప్రారంభించారు. అలాగే వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కోకో, త్రోబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. గాజువాక, భీమిలి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తిప్పలనాగిరెడ్డి, ముత్తంశెట్టి శ్రీనివాస్ క్రికెట్ పోటీలను నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అడారి ఆనంద్కుమార్ నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని పంచకర్ల రమేష్బాబు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ‘నవరత్నాలు– సంక్షేమపథకాలు’ పేరిట విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాల్లో కబడ్డీ, హాకీ పోటీలను ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో పలుచోట్ల క్రీడా పోటీలు జరిగాయి. వీటిని ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కె.భాగ్యలక్ష్మి, నాగులాపల్లి ధనలక్ష్మి ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎంపీ మార్గాని భరత్రామ్ మధురపూడి విమానాశ్రయంలో కేక్ కట్ చేశారు. అనపర్తి, గోపాలపురం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు క్రీడా పోటీలను నిర్వహించారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి వందమంది చిరు వ్యాపారులకు తోపుడుబండ్లను అందజేశారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ముగ్గులతో సీఎం జగన్ చిత్రాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. నేడు, రేపు పలు కార్యక్రమాలు సాక్షి, అమరావతి: ఈ నెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 20న మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందులో భాగంగా స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, కుల సంఘాల ప్రతినిధులతో ‘జగనన్న పరిపాలన.. రాష్ట్ర సంక్షేమం–అభివృద్ధి’పై చర్చ ఉంటుంది. ఇదే రోజు ముందస్తు జన్మదిన వేడుకలు కూడా నిర్వహిస్తారు. అలాగే ఈ నెల 21న రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో రెడ్క్రాస్ సంస్థతో కలిసి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను పార్టీ నిర్వహించనుంది. అనాథ, వృద్ధాశ్రమాల్లో పండ్లు, దుస్తుల పంపిణీ, అన్నదానం వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టనుంది. అలాగే మహిళలకు పలు అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. పుట్టినరోజు వేడుకల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ముఖ్యంగా మహిళలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయనున్నారు. ఇప్పటికే సీఎం జన్మదిన వేడుకలు సోమవారం ప్రతి నియోజకవర్గ పరిధిలో ప్రారంభమయ్యాయి. గతేడాది సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా 38 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు సృష్టించారు. ఇది ఎందరినో అత్యవసర సమయాల్లో ఆదుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించనున్నారు. ఇలా సేకరించిన రక్తాన్ని భద్రపరిచి అవసరమైన రోగులకు అందిస్తారు. అలాగే రక్తదాతల నుంచి ప్లెడ్జ్ ఫామ్స్ సేకరించి రోగులకు అత్యవసరమైన సందర్భాల్లో రక్తం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ‘టేక్ ద ప్లెడ్జ్.. సేవ్ ఏ లైఫ్’ అనే నినాదంతో.. రక్తదానం చేయడానికి సుముఖంగా ఉన్నవారిని ysrcpblooddonation.comలో నమోదు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు పేర్లు నమోదు చేసుకోవచ్చు. డ్వాక్రా, మహిళా, కుల, ప్రజాసంఘాలు, మేధావులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులను భాగస్వాములను చేస్తూ సీఎం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. -
Cm YS Jagan: పేదోడి కోసం ఓ సీఎం ఇంతలా పరితపిస్తారా?
సాక్షి, ప్రత్యేకం: ఈ మూడున్నరేళ్ల కాలంలో ఏపీ ప్రజలు, ప్రత్యేకించి పేదల బతుకు చిత్రాన్ని మార్చేసేందుకే సీఎం వైఎస్ జగన్ అహర్నిశలు కృషి చేశారు.. చేస్తున్నారు. అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు ఆపదలో ఉన్నవాళ్లెందరినో సత్వరమే ఆదుకున్న మంచి మనసు ఆయనది. ఈ మాట స్వయంగా సాయం అందుకున్న వాళ్ల నోటి నుంచే వెలువడుతోంది మరి!. అయితే.. ఆ తల్లిదండ్రులు సీఎం జగన్ మనసున్న మారాజు అని కృతజ్ఞతలు చెబుతున్నారు. ఎందుకో తెలుసా? ఆడిపాడే వయసులో ఆ చిట్టితల్లికి పెద్ద కష్టమే వచ్చింది. అది ఆమె తల్లిదండ్రులు కూడా మోయలేనంతది!. హనీకి వచ్చిన పెద్దజబ్బుకు చికిత్స చేయడం తమకు చేతకాదనుకున్న ఆ అమ్మానాన్న.. దేవుడిపై భారం వేశారు. కానీ, ఆ దేవుడు ఎప్పటిలాగే మనిషి రూపేణా వచ్చాడు. కష్టం గురించి తెలియగానే.. సీఎం జగన్ శరవేగంగా స్పందించారు. ఆ చిట్టితల్లికి బతుకు భరోసా కల్పించారు. ఆ కుటుంబంలో వెలుగులు నింపారు. పశ్చిమగోదావరి జిల్లా అచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన రాంబాబు, నాగలక్ష్మి దంపతులు కుమార్తె హనీ. పుట్టుకతోనే ఈ పాపకు గౌచర్ అనే వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వచ్చిన వారిలో కాలేయం పనిచేయదు. చికిత్స కోసం లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అత్యంత అరుదైన ఈ వ్యాధితో దేశంలో 14 మంది బాధితులు బాధపడుతుండగా.. రాష్ట్రంలో చిన్నారి హనీ తొలి బాధితురాలు. ఏమి చెయ్యాలో ఈ తల్లిదండ్రులకు పాలుపోలేదు. గోదావరి వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా, సీఎం జగన్ కోనసీమకు వెళ్లారు. అక్కడ కిక్కిరిసిన జనం మధ్య పాపను ఎత్తుకుని తనను కలవడానికి ప్రయత్నిస్తున్న ఈ అమ్మానాన్నలు ఆయన కంటపడ్డారు. కాన్వాయ్ని ఆపించి, తల్లి వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. చిన్నారికొచ్చిన కష్టం గురించి ఈ అమ్మానాన్నలు ఆయనకు వివరించారు. దీంతో చలించిపోయిన సీఎం జగన్..ఆ పాప వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అలా పసిబిడ్డ హనికి ప్రాణం పోశారు. ‘‘సీఎంగారి ఆదేశాల మేరకు చిన్నారిని చదివించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంది. అలాగే బాలిక కుటుంబానికి నెలకు రూ.10వేల చొప్పున పెన్షన్ కూడా మంజారు చేసింది. హనీ గౌచర్ వ్యాధికి సంబంధించిన 52 ఇంజక్షన్లను మంజూరు చేశారు. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు రూ.1,25,000 కాగా, కంపెనీతో సంప్రదింపులు జరిపి, వాటిని తెప్పించారు. ప్రతి 15 రోజులకు ఒక ఇంజక్షన్ క్రమం తప్పకుండా చిన్నారికి ఇస్తున్నారిప్పుడు. తాము జన్మనిచ్చినా.. బతకదనుకున్న తమ బిడ్డకు సీఎం జగన్ పునర్జన్మనిచ్చారు. ఆయన బాగుండాలని తిరుమలకు పాదయాత్ర సైతం చేశారు. హనీ.. ఇప్పుడు హ్యాపీ.. హ్యాపీ.. పేదోడి కోసం ఓ ముఖ్యమంత్రి ఇంతలా పరితపిస్తారా.. మా పాపకు ప్రాణం దానం చేసిన సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆ రోజు కాన్వాయ్లో సీఎం జగనన్న మమ్మల్ని చూసి ఆగడం.. మా పాప అనారోగ్యం గురించి తక్షణమే స్పందించి కలెక్టర్కు చెప్పడం, ఇప్పుడు రూ.లక్షల విలువైన వైద్యం అందించడం చూస్తుంటే.. ఓ సీఎం ఇంతలా ఓ పేదవాడి కోసం తపిస్తారా.. అని ఆశ్చర్యమేస్తోంది. మా బిడ్డను ఆదుకుని మాపాలిట దైవంలా నిలిచిన జగనన్నకు చేతులెత్తి దండాలు పెడుతున్నాం. – తొలి ఇంజెక్షన్ అందుకున్న వేళ తల్లిదండ్రులు రాంబాబు, నాగలక్ష్మి భావోద్వేగం :::YS Jagan పుట్టినరోజుపై ప్రత్యేక కథనం -
CM YS Jagan: సంక్షేమ సారథికి అదే శ్రీరామరక్ష
రాజకీయ ప్రయాణంలో ఊహించని మలుపు.. ఎదురొచ్చిన అడ్డంకులు.. ఆటంకాలు. రాజకీయ కుట్రల, కుతంత్రాలు దుర్మార్గాలపై ఎదురు పోరాటం. వాటన్నింటిని ప్రజాభిమానమనే ఆయుధంతో పక్కకు తోసేసిన వైనం.. అనితరసాధ్యమైన రాజకీయ ప్రస్థానం ఆయన సొంతం. ఆ ఒకే ఒక్కడు వైఎస్ జగన్.. ఆ సంక్షేమ సారథికి జన్మదిన శుభాకాంక్షలు(డిసెంబర్ 21వ తేదీ).. తండ్రిని చూశాడు. ఆ మహానేత అడుగుజాడలు గమనించాడు. ఆ పెద్దాయన పేరుకే పొలిటీషియన్. కానీ, నిరంతరం ప్రజల మనిషి. అదే జీవితానికి సార్థకత అనుకున్న మంచి మనిషి. అలాంటి తండ్రిని గమనించిన తనయుడు.. మరోలా ఎందుకు అవుతాడు!. ప్రజలతో మమేకం కావడం, వారు చెప్పింది వినడం, వారి సమస్యలు తీర్చడం కోసం ఎలా పాటుపడాలనేది నేర్చాడు. ప్రజలతోనే ఉంటూ.. వారి జీవితాల్లో మేలు కోసం ఈ మూడున్నరేళ్లు కృషి చేశాడు.. ఇంకా చేస్తూనే ఉన్నాడు. తిరుగులేని నేత కాలం పరీక్షలు పెడుతుంది. ఏడిపించేంత పనిచేస్తుంది. ఈ క్రమంలో ధీరోదాత్తుడు కూడా చలించాడు. కానీ, పరీక్షకు భయపడలేదు. సాహసికంగా ఎదుర్కొన్నాడు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా.. కుతంత్రాలు అడ్డుపడినా తన అడుగులు తడపడకుండా చూసుకున్నాడు. గుండెను సడలనివ్వకుండా.. ధైర్యాన్ని వీడకుండా ముందుకుసాగాడు. వైయస్ జగన్ రాజకీయ ప్రయాణం.. ఆయన్ని తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది. మానవీయ రాజకీయాలు ఆయన మార్క్గా మారిపోయింది. తండ్రి బాటలో.. రాజకీయాల్లో వైయస్ కూడా ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నారు. ఆయన్ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి, వేధించడానికి కూడా అప్పటి హస్తం నేతలు ఎంతో ప్రయత్నించారు. సీనియర్ల దృష్టిలో అయితే వైఎస్ ఒక కొరకరానికొయ్య. చివరికి.. ఆయన ఆర్థికమూలాలను దెబ్బతీశారు. అయినా ఆయన తోణకలేదు. ప్రజా జీవితంతో పెనకేసుకుపోయిన.. పాదయాత్రతో ఆయన కీర్తి శిఖరాగ్రానికి చేరింది. ముఖ్యమంత్రిగా ఆ మహానేత ఐదేళ్ల పాలన సువర్ణయుగం. ఆయన తలపెట్టిన సంక్షేమపథకాలు, అభివృద్ధి పథకాలు నభూతో న భవిష్యతి. అలా.. ఆ తండ్రి అడుగుజాడల్లోనే జగన్ తన రాజకీయప్రయాణాన్ని మొదలుపెట్టారు. అందరు వారసుల్లాగే తన రాజకీయ వారసుడు హస్తినలో జాతీయ నేతల వారసుల మధ్య తిరగాలని కోరుకున్నారు వైఎస్ఆర్. కానీ, విధి మరోలా తలిచింది. వైఎస్సార్ హఠాన్మరణం రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేసింది. అప్పటిదాకా తండ్రి ఆలోచనలు, సలహాలు. కానీ, అప్పటి నుంచి తనే ఆలోచించాలి.. తనే ఆచరించాలి అనుకున్నాడు. ఒక్కడిగానే తనదైన కొత్త చరిత్రను సృష్టించడానికి జగన్ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. వారసత్వంగా వచ్చిన బలమే కాదు.. వ్యక్తిత్వం బలం కూడా తోడయ్యింది. రాజకీయాలకు అతీతమైన వాదం. కులమతాల ఊసే లేని మానవత్వం. ప్రజాసేవ పరమావధిగా భావించిన ఆదర్శం వైఎస్ జగన్ది. అన్నీ స్వంత ఆలోచనలే. చివరకు.. తన రెక్కల కష్టంపై ఏర్పాటు చేసుకున్న సొంత పార్టీ. తన ఆలోచనలు, సిద్ధాంతాలే పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాలుగా మలుచుకున్నాడు. అందుకే.. జగన్ రాజకీయప్రస్థానం అసామాన్యమైనది. యువతకు స్ఫూర్తిదాయకమైనది. సమస్యలతో నడుస్తూ.. పరిష్కరించే దాకా.. బహుశా .. భారత దేశ చరిత్రలో వైయస్సార్సీపీ ఆవిర్భావం..ఆ తర్వాతి ప్రస్థానం చారిత్రాత్మకమైనవేమో. ఆ చరిత్రకు సృష్టి కర్త, కర్మ, క్రియ అన్నీ జననేతనే. పార్టీ 2014 నుంచి ప్రతిపక్షంలో వున్న కాలంలోనూ ఆయన ప్రతిపక్షనేతగా సమర్ధవంతంగా పనిచేశారు. వైఎస్ జగన్.. ప్రజలకోసం అనేక దీక్షలు చేశారు. రైతుల తరఫున, చేనేతల తరఫున, మత్స్యకారుల తరఫున, విద్యార్థుల తరఫున ఇలా ఆయన.. లక్షలాది మంది సమక్షంలో దీక్షలకు పూనారు. వాటిని విజయవంతం చేశారు. నాటి ప్రభుత్వాల కళ్లు తెరిపించే పనులు చేశారు. ప్రజల కోసమే జగన్ రాజకీయాలు నడిచాయి పూర్తిగా. ఆపై పాదయాత్ర.. ఆయన ఆలోచల్నే కాదు.. రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. కోట్ల మందికి వైఎస్ జగన్ అభిమాన నాయకుడయ్యాడు. తానొక సాహసి అనే విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేశాడాయన. తనేంటో తనకు తెలుసు. తన బలమేంటో తనకు తెలుసు. అదే పార్టీ సహచరులకు ధైర్యం అయ్యింది. ప్రజలకు నమ్మకమయింది. పాదయాత్ర విజయవంతమైంది. 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర ఆయన్ను ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అద్దంగా నిలిపింది. జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ బలంగా ప్రజా హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. ఫ్యాన్ దెబ్బకు సైకిల్ తుక్కుతుక్కు అయ్యింది. పాదయాత్ర నుంచే మేనిఫెస్టో పుట్టింది. దానికంటూ ఓ పవిత్రతను ఇచ్చిన ఆయన.. అధికారంలోనూ దాని అమలును అంతే చిత్తశుద్ధితో చేస్తున్నారు. మూడున్నర ఏళ్లు పూర్తి అయ్యింది. ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయనలో కనిపించిన సంకల్పం.. ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతోంది. సీఎం జగన్ పాలనలో విప్లవాత్మక మార్పులకు ఏపీ వేదికయ్యింది. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలనే తపన.. ఆయనపై అభిమానాన్ని ప్రజల్లో మరింత పెంచుతూ వస్తోంది. మంత్రులు, తోటి నేతలు, ఉన్నతాధికారులు.. ఎవరినీ ఉపేక్షించలేదాయన. సంక్షేమం కోసం తనతో పాటు వాళ్లందరినీ పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సచివాలయం, ఆర్బీకే.. లాంటి వ్యవస్థలను దేశం ఆదర్శంగా తీసుకుంది. పారదర్శకపాలన.. పైగా గడపకే సంక్షేమ పథకాలు. ప్రతి సామాన్యుడికి ప్రతి పనీ సులువుగా అయిపోయింది. ఇంతకంటే సమర్థవంతమైన వ్యవస్థలను ఎవరు నడిపించగలరు?!.. ఒక్క వైఎస్ జగన్ తప్ప. సంక్షేమమే శ్రీరామరక్ష సామాజిక పెన్షన్లు, అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యార్థుల పథకాలు, నాడు - నేడు పేరిట విద్యారంగంలో పెనుమార్పులకు శ్రీకారం అన్ని పటిష్టంగా అమలయ్యేలా చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి. నభూతో న భవిష్యతి అన్నట్టుగా తన పాలన ఉండాలని ఆదర్శంగా పెట్టుకున్నారు. ఆ దిశగానే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఈ విలక్షణ నాయకుడు. ఇంతగా ప్రజలతో మమేకమైన ఆ వయసు నాయకుడు గానీ, ప్రజా జీవితంతో పెనవేసుకుపోయిన నాయకుడు గానీ మరొకరు లేరు. చిన్నవయసులోనే పెద్ద బాధ్యతను ఎత్తుకున్న జగన్ నిజంగా ఓ రకంగా శిఖరాగ్రానికే చేరాడు. అక్కడే చాలినంత కాలం వుండటానికి ఆయనకు తనవైన కృష్టి, పట్టుదలలు తోడు నీడగా వుంటాయి. ఆయన సంకల్పబలమే ఆయన్ను విజేతగా నిలుపుతుంటుంది కూడా. అలాగే తనను తాను ఆల్రెడీ సీఎంగా ప్రూవ్ చేసుకున్న ది ట్రూ లీడర్ ఆయన. అయినప్పటికీ నిజాయితీ ఆయన అదనపు పొలిటికల్ క్వాలిఫికేషన్. అందుకే తన పాలనను గత పాలనతో బేరీజు వేసుకోమని, మంచి జరిగిందని భావిస్తే, ఒక బిడ్డగా ఆశీర్వదించమని ప్రజలను కోరుతున్నారు జగన్. YSJagan పుట్టినరోజుపై ప్రత్యేక కథనం -
175 నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు.. వెబ్సైట్ ప్రారంభించిన సజ్జల
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన రక్తదానంకు సంబంధించి ప్రత్యేక వెబ్ సైట్ (www.ysrcpblooddonation.com)ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 19న క్రీడా పోటీలు, మహిళలకు సంబంధించిన పోటీలు, 20న మొక్కలు నాటడం, 21న రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారని తెలిపారు. అదే రోజు కేక్ కటింగ్, సర్వమత ప్రార్థనలు,సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వేడుకలలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. సుస్ధిరమైన అభివృధ్ది సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని మూడున్నరేళ్ల కాలంలోనే తీసుకువెళ్లి చరిత్రలో నిలిచిన ఘనత సీఎం జగన్ది అని సజ్జల అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మూడున్నరేళ్ళలోనే 99 శాతం పూర్తి చేశారన్నారు. ఇచ్చిన హామీలకంటే వంద రెట్లు ఎక్కువగా పథకాలు అమలు చేశారన్నారు. రాష్ట్రంలో అట్టడుగున ఉన్న బలహీనవర్గాలు ఆర్థికంగా బలపడేలా చేయడంతోపాటు వారికి విద్య, వైద్యపరంగాను, ఉపాధి మెరుగైన సేవలు అందించారన్నారు. వీటన్నింటికి మించి పొలిటికల్ ఎంపవర్మెంట్ చేసి చూపించారన్నారు. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవాలని భావించామన్నారు. ప్రతిసారి పార్టీ తరఫున చేస్తుంటాం. ఈసారి కోట్లాది మంది అభిమానులతోపాటు సంక్షేమ పథకాల లబ్ధిదాదారులు వారి కుటుంబసభ్యులు కూడా పాల్గొంటారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళాపక్షపాత ప్రభుత్వం, వారికి పెద్దపీట వేశారన్నారు. అప్పుడు 38వేల యూనిట్లు.. 2020లో రికార్డుస్ధాయిలో 38 వేల యూనిట్లు రక్తదానం చేసినట్లు సజ్జల తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు,ప్రజలు అందరూ శిబిరాలకు వచ్చి రక్తదానం చేశారు. తమ నాయకుడైన సీఎం జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ మరోవైపు తమ భాధ్యతగా అవసరమైనవారికి రక్తం ఇవ్వాలనే మహోన్నత ఆశయంతో ఆనాడు రక్తదానం చేశారన్నారు. అప్పుడు కూడా రెడ్ క్రాస్, వైఎస్సార్సీపీ కలిసి రక్తదాన కార్యక్రమం నిర్వహించాయన్నారు. ఆ రోజున బ్లడ్ ఎక్కువ కాలం స్టోర్ చేశారు. నిజంగా అవసరమైనప్పుడు ఇస్తే బాగుంటుందనే భావించామన్నారు. అందుకే ఈసారి ఫిజికల్గా రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు వెబ్ సైట్ కూడా లాంచ్ చేశాం అన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ, విదేశాలలోను ఎవరికైతే రక్తం అవసరం ఉంటుందో వారికి అది అందేలా చేయడం ఈ వెబ్ సైట్(www.ysrcpblooddonation.com) వల్ల వీలు కలుగుతుంది. కార్యకర్తలు, అభిమానులు తమ నాయకుడికి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయడంతోపాటు సామాజిక బాధ్యత నెరవేర్చినట్లు అవుతుందన్నారు. వివిధ కాలేజీలు, సంస్ధలు అందరూ కూడా ప్రమోట్ చేయాలని కోరుతున్నామన్నారు. తలసేమియా లాంటి వ్యాధిగ్రస్తులకు రక్తం ఎంతో అవసరం అన్నారు. రెడ్ క్రాస్ స్టేట్ కోఆర్డినేటర్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ జన్మదినాన్నిపురస్కరించుకుని విదేశాలలో, ఇతర రాష్ట్రాల్లో కూడా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రెడ్ క్రాస్ మన రాష్ట్రంలో మాత్రమే ఇలాంటి కార్యక్రమం నిర్వహించిందన్నారు. 2020లో కూడా రెడ్ క్రాస్ ద్వారా రక్తదానశిబిరాల ద్వారా 38 వేల యూనిట్లు రక్తాన్ని సేకరించామన్నారు. ఇప్పుడు బ్లడ్ కలెక్ట్ చేయడమే కాకుండా ప్లెడ్జ్ ఫామ్స్ కూడా తీసుకుంటున్నాం. ఆన్ లైన్ లో కూడా ఇవ్వచ్చు లేదా రక్తదానశిబిరాల వద్దకు వచ్చి ఈ ఫామ్స్ ఇవ్వచ్చని తెలియచేశారు. అత్యవసర పరిస్దితులలో రక్తం అవసరమైనప్పుడు మేము సేకరించే డేటా ద్వారా రక్తదాతల ద్వారా అవసరమైనవారికి సహాయం అందిస్తామన్నారు. 175 నియోజకవర్గాల వారీగా సేకరిస్తున్నామని తద్వారా ఆయా ప్రాంతాలలో రక్తదాతలు అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో సాంఘికసంక్షేమశాఖమంత్రి మేరుగ నాగార్జున, శాసనమండలి సభ్యులు, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు లేళ్ళఅప్పిరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్రెడ్డి, నారమల్లి పద్మజ, పార్టీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు సజ్జల భార్గవ్, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. చదవండి: మద్యం బ్రాండ్లు..అసలు నిజాలు.. రాష్ట్రానికి లిక్కర్ కింగ్ చంద్రబాబే..! -
CM YS Jagan Birthday Special: ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించిన సజ్జల
తాడేపల్లి: ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా(డిసెంబర్ 21) ప్రత్యేక వెబ్సైట్ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో కోట్లాది మంది అభిమానులు పాల్గొంటారని, సంక్షేమ పథకాలతో లబ్దిపొందిన వారంతా పాల్గొంటారన్నారు. గతంలో పార్టీ కార్యకర్తలు 38వేల యూనిట్ల రక్తదానం చేశారని, ఈసారి వైఎస్సార్సీపీ బ్లడ్ డొనేషన్. కామ్ పేరిట వెబ్సైట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్లడ్ డొనేషన్కు పేర్లు నమోదు చేసుకుంటే అవసరమైనప్పుడు రక్తదానం చేసే అవకాశం ఉందన్నారు. ఈనెల 19న రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని, 20న మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు సజ్జల తెలిపారు. 21వ తేదీన పేదలకు అన్నదానం వంటి సేవాకార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.