YSR Kapu Nestham
-
అక్కచెల్లెమ్మలకు మరింత స్థిర ఆదాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య ఉన్న పేద అక్కచెల్లెమ్మల సంక్షేమమే లక్ష్యంగా, వారు ప్రతి నెలా మరింత స్థిర ఆదాయం పొందడానికి గత ఐదేళ్లు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాలను అమలు చేసింది. వచ్చే ఐదేళ్లు కూడా ఈ పథకాలను అమలు చేస్తామని తాజాగా ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ ప్రకటించింది.ఈ మూడు పథకాల ద్వారానే రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య వయసు ఉన్న అన్ని సామాజికవర్గాలకు చెందిన దాదాపు 43 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ప్రయోజనం పొందారు. వీరిలో 18.37 లక్షల మంది ప్రభుత్వ సాయాన్ని ఉపయోగించుకుంటూ కొత్తగా వివిధ రకాల వ్యాపారాలు ఏర్పాటుకు ముందుకొచ్చారు.మరికొంతమంది తమకు వచ్చిన శాశ్వత జీవనోపాధులను ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా ఇప్పటికే ప్రతి నెలా రూ. 10 వేల దాకా స్థిర ఆదాయం పొందుతున్నారు. ఆయా పథకాలను మరో ఐదేళ్ల పాటు కొనసాగించడం ద్వారా ఇంకా లక్షలాది పేద కుటుంబాలు ప్రతి నెలా స్థిర ఆదాయం పొందుతాయని అధికార వర్గాలు, ఆర్థిక నిఫుణులు పేర్కొంటున్నారు.వైఎస్సార్ చేయూత (తమ కాళ్లపై తాము నిలబడేలా ఇకపై రూ.1.50 లక్షల వరకు) ఈ ఐదేళ్లు 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.75 వేలు ఇచ్చింది. ఇలా ఇప్పటికే రూ.19,189 కోట్లు అందజేసింది. వచ్చే ఐదేళ్లూ ఇలా.. 45–60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అది పెన్షన్ లేదా చేయూత కావచ్చు.. ఇలా ఉండేలా చేయూత పథకాన్ని కొనసాగిస్తారు. ♦ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.18,750 చొప్పన మరో రూ.75 వేలు ప్రభుత్వం అందిస్తుంది. మొత్తంగా 8 విడతల్లో రూ.1.50 లక్షల లబ్ధి చేకూరినట్టవుతుంది. ♦ అలాగే బ్యాంకులతో, ప్రఖ్యాత సంస్థలతో టై అప్ కోసం సూచనలు, సలహాలు ఇస్తూ లేదా వారి సొంత వ్యాపారం ద్వారా వారు నిలదొక్కుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. వైఎస్సార్ కాపు నేస్తం(కాపు అక్కచెల్లెమ్మలకు భరోసా.. ఇకపై రూ.1.20 లక్షల వరకు)♦ 4.63 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15,000 చొప్పున నాలుగు విడతల్లో రూ.60 వేలు ప్రభుత్వం అందజేసింది. ఇలా ఇప్పటికే రూ.2,030 కోట్లు ఇచ్చింది. ♦ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.15,000 చొప్పున మరో రూ. 60 వేలు అందజేస్తుంది. మొత్తంగా 8 విడతల్లో రూ.1.20 లక్షల లబ్ధి.♦ కాపు, బలిజ, తెలగ ఒంటరి కులాల అక్కచెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అది పెన్షన్ లేదా కాపు నేస్తం కావొచ్చు.. ఇలా ఉండేలా వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని కొనసాగిస్తూ 45 నుంచి 60 ఏళ్ల లోపు ఆ వర్గాల నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున నాలుగు విడతల్లో వచ్చే ఐదేళ్లలో రూ.60 వేలు అందజేస్తారు.వైఎస్సార్ ఈబీసీ నేస్తం(అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు చేదోడు.. ఇకపై రూ.1.05 లక్షల వరకు)♦ ఈ ఐదేళ్లలో ఇప్పటికే 4.95 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.1,877 కోట్లు ప్రభుత్వం అందజేసింది. ♦ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.15,000 చొప్పున మరో రూ.60 వేలు అందిస్తుంది. మొత్తం ఏడు విడతల్లో రూ.1.05 లక్షల లబ్ధి♦రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజికవర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అది పెన్షన్ లేదా ఈబీసీ నేస్తం కావొచ్చు. ఇలా ఉండేలా వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని కొనసాగిస్తూ 45 నుంచి 60 ఏళ్ల లోపు ఆ వర్గాల నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున నాలుగు విడతల్లో వచ్చే ఐదేళ్లలో మరో రూ. 60 వేలు అందిస్తారు.ఆర్థిక తోడ్పాటుకు అదనంగా..♦ కేవలం ఆర్థికసాయం అందజేయడానికే ప్రభుత్వం పరిమితం కాలేదు. వైఎస్సార్ చేయూత తదితర పథకాల ద్వారా అందుకున్న నగదును ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చింది. గత ఐదేళ్లలో చిన్న, మధ్యతరహా వ్యాపారాలతో ముందుకొచ్చిన లబ్ధిదారులకు అదనపు తోడ్పాటును కూడా అందించింది. ఇందులో భాగంగా నాలుగేళ్ల క్రితమే హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ, ప్రాక్టర్ – గాంబుల్, రిలయన్స్ రిటైల్, అమూల్, అజియో బిజినెస్ వంటి అంతర్జాతీయ వ్యాపార సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ♦ ప్రభుత్వం అందజేసిన లబ్ధితో కొత్తగా శాశ్వత జీవనోపాధిని పొందడానికి ముందుకొచ్చిన వారికి ఆయా వ్యాపార సంస్థల ద్వారా తగిన శిక్షణ అందజేశారు. మిగిలిన రిటైల్ వ్యాపారుల కంటే తక్కువ ధరలకే ఆయా దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. లేదంటే అక్కచెల్లెమ్మలు తయారు చేసే ఉత్పత్తులను నేరుగా ఆయా సంస్థలే కొనుగోలు చేస్తూ తోడ్పాటును అందిస్తున్నాయి. ♦ శాశ్వత జీవనోపాధిని పొందే క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయానికి అదనంగా ఇంకా నిధుల అవసరం పడితే.. ఆ మొత్తాన్ని కూడా బ్యాంకుల నుంచి రుణాల రూపంలో తక్కువ వడ్డీకే అందేలా ప్రభుత్వం సహకారం అందించింది. -
జగనన్న వచ్చాకే మా కాపులను గుర్తించారు
-
‘వైయస్ఆర్ కాపు నేస్తం’తో మా జీవితాల్లో వెలుగులు నింపారు జగనన్న
-
వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా వచ్చిన డబ్బులతోనే నేను ఈ వ్యాపారం చేయగలుగుతున్నాను
-
కాపు నేస్తం 4వ విడత నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
-
అందరికంటే మిన్నగా ‘కాపు’కాశాం
నిడదవోలు నుంచి సాక్షి ప్రతినిధి: ‘మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే మిన్నగా మన ప్రభుత్వంలో కాపుల సంక్షేమానికి అన్ని విధాలా కాపు కాశాం. కాపు నేస్తంతో పేదలైన కాపు అక్కచెల్లెమ్మలను ఆర్ధికంగా ఆదుకున్నాం. నాతో పాటు కేబినెట్లో కాపులను పక్కన కూర్చోబెట్టుకున్నా. నామినేటెడ్ పదవుల్లోనూ మిగిలిన వర్గాల పక్కనే కూర్చోబెట్టాం. కాపు కుటుంబాల్లోని అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబన కోసం మన ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పరితపిస్తోంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శనివారం ఆయన కాపు నేస్తం నాలుగో విడత సొమ్ము విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, ఒంటరి, బలిజ, తెలగ కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్ధేశించి మాట్లాడారు. ‘కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన నా అక్క చెల్లెమ్మల్లో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న పేదలకు ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తున్నాం. వరుసగా ఐదేళ్ల పాటు, మొత్తంగా రూ.75 వేల ఆర్ధిక సాయం అందించే పథకాన్ని అమలు చేస్తున్నాం. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా సాయం అందజేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారు రూ.2029 కోట్ల ఆర్ధిక సాయం చేసినట్టయింది. ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపు 4 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు ఈ నాలుగేళ్లలో ఒక్కొక్కరికి రూ.60 వేలు చొప్పున అందజేశాం. అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలని, ఆర్ధిక స్వావలంబన సాధించాలని అడుగులు ముందుకు వేస్తున్నాం’ అని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఈ డబ్బు వారికి ఎంతో ఉపయోగం ► నా అక్కచెల్లెమ్మల్లో పేదవాళ్లు ఎక్కడున్నా, వారికి మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో నాలుగేళ్లుగా అడుగులు వేస్తున్నాం. 45–60 ఏళ్ల మధ్య వయసు ఉన్న అక్కచెల్లెమ్మల చేతిలో ఈ డబ్బు పెడితే అది వారి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న నమ్మకంతో వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టాం. ► నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటిదాకా 26,39,703 మందికి రూ.14,129 కోట్లు అందజేశాం. ► ఓసీల్లో పేదరికంలో ఉన్న అక్కచెల్లెమ్మలకు కూడా అండగా నిలబడాలని 45–60 ఏళ్ల మధ్య ఉన్న వారి కోసం వైఎస్సార్ ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. ఈ పథకం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున వరసగా మూడేళ్లలో మొత్తం రూ.45 వేలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటి వరకు 4,39,068 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 1,257 కోట్లు ఇచ్చాం. నా కాపు అక్కచెల్లెమ్మలకు కూడా అదే తరహాలో మద్దతు ఇవ్వాలన్న మంచి ఆలోచనతో మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్సార్ కాపునేస్తం పథకాన్ని ప్రారంభించాం. ఇది రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం ఎప్పుడూ అమలు చేయని కార్యక్రమం. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కాపునేస్తం.. ఈ మూడు పథకాల ద్వారానే 34.37 లక్షల మందికి తోడుగా ఉన్నాం. ► రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చాక, వివిధ పథకాల ద్వారా 2.06 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. సచివాలయాల్లో మన కళ్లెదుటే దాదాపు 1.30 లక్షల మంది పిల్లలు వైద్య, ఆరోగ్య, ఇతర రంగాల్లోనూ కనిపిస్తారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంత వరకు దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు ఉంటే, ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో మరో 2.06 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఈ 2.06 లక్షల ఉద్యోగాలలో కాపు చెల్లెమ్మలు, తమ్ముళ్లకు లభించిన ఉద్యోగాలు దాదాపు 9.5 శాతం. సామాజిక న్యాయం మన విధానం ► సామాజిక న్యాయాన్ని ఒక నినాదంగా కాకుండా, ఒక విధానంగా మార్చుకున్న ప్రభుత్వం ఇది. కాపు సోదరులకు రెండు కేబినెట్లలో సముచిత స్థానం కల్పించాం. ఒక్కో కేబినెట్లో నలుగురు మంత్రులతో పాటు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చి నా పక్కనే కూర్చొబెట్టుకున్నాను. మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఐదుగురు మంత్రులు కనిపిస్తారు. ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీతో పాటు నా కాపుసోదరుడు కనిపిస్తాడు. కారణం ఇది మీ అందరి ప్రభుత్వం కాబట్టి. ► మొత్తంగా నామినేటెడ్ పోస్టుల్లో ఏకంగా 12 శాతం కాపు సోదరులకు, అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. ఇప్పటి వరకు నవరత్నాల్లోని వివిధ పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసిన రూ.2.31 లక్షల కోట్లలో కాపులకు అందిన మొత్తం రూ.22,333 కోట్లు. ► నాన్ డీబీటీ పథకాలలో జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ల పంపిణీ, అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇలా ఎన్నో చేశాం. ప్రాంతాన్ని బట్టి ఇంటి స్థలం విలువ మారుతుంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్కో ఇంటి స్థలం విలువ కనీసం రూ.5 లక్షలు ఉంటుంది. ఇలా నాన్ డీబీటీ పథకాల ద్వారా నా కాపు అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలకు కలిగిన లబ్ధి మరో రూ.16,914 కోట్లు. 2.46 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇలా డీబీటీ, నాన్ డీబీటీ పథకాలను కలిపి చూస్తే కాపు అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలకు ఈ నాలుగేళ్లలో రూ.39,247 కోట్లు లబ్ధి కల్పించాం. 10 శాతం కూడా మేలు చేయని చంద్రబాబు ► మనం ఖర్చు చేసిన రూ.39,247 కోట్లలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం కనీసం 10 శాతం కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. గత ప్రభుత్వం కాపుల్ని మంజునాథ కమిషన్ పేరిట చేసింది ఒక మోసమైతే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో భాగాన్ని పంచడం సాధ్యం కాదని తెలిసి కూడా మరో మోసం చేసింది. అలాంటి మోసాలు మన ప్రభుత్వం చేయలేదు. ► మనం మేనిఫెస్టోలో చేసిన వాగ్దానం మేరకు ఏటా రూ.2 వేల కోట్లు కాపుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పాం. ఇలా ఐదేళ్లలో కాపులకు రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పాం. కానీ, నాలుగేళ్లలోనే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.39,247 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు తన జీవితమంతా సామాజిక వర్గాలన్నింటినీ వంచించారు. ► మీ బిడ్డ ప్రభుత్వం 2019లో ఏర్పడింది. గత ప్రభుత్వంలో ఎంత బడ్జెట్ ఉందో మీ బిడ్డ ప్రభుత్వంలో కూడా దాదాపు అదే బడ్జెట్. అప్పుడు ఎంత ఆదాయం ఉందో ఇప్పుడూ కూడా అంతే. పైగా మీ బిడ్డ ప్రభుత్వంలో అనుకోకుండా కోవిడ్ వచ్చి ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగాయి. అయినప్పటికీ మీ బిడ్డ రూ.2.35 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ఎలా జమ చేశాడు. ఇలా చంద్రబాబు ఎందుకు చేయలేదు? మీరే గమనించాలి. మా కుటుంబానికి రూ.4,45,000 లబ్ధి అన్నా.. మీలాగ ఏ రాజకీయ నాయకుడు కూడా మా కాపులను గుర్తించలేదు. మీరు వచ్చాక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తున్నారు. నేను గత ఏడాది, ఈ ఏడాది సాయం పొందాను. నేను చదువుకోకపోయినా, మీ పథకాల ద్వారా నా పిల్లలు ముగ్గురినీ చదివిస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. మా డ్వాక్రా గ్రూప్కు రుణమాఫీ జరిగింది. సొంతింటి కల నెరవేరుతోంది. మొత్తంగా మా కుటుంబానికి ఈ ప్రభుత్వంలో రూ.4,45,000 లబ్ధి కలిగింది. నాలాగ లబ్ధి పొందిన వారంతా మీకు రుణపడి ఉంటాం. – సుబ్రమణ్యేశ్వరి, లబ్ధిదారు, వేమగిరి, కడియం మండలం -
కాపునేస్తం నిధులతో వ్యాపారం చేసుకుంటున్నాం: మహిళలు
-
కాపు నేస్తం నిధులు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
-
ప్రశ్నిస్తా అన్నవాడు బాబును ఎందుకు ప్రశ్నించడు: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు కాపులను అడుగడుగునా మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా బాబు మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు గతంలో 10 శాతం కూడా హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి రూ. 39,247కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువగా చేశామన్నారు. గత ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. చట్టం ఎవరికైనా ఒక్కటే ఈ మేరకు సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో లబ్ధిదారులకు ‘వైఎస్సార్ కాపు నేస్తం’ నాలుగో విడత ఆర్థిక సాయాన్ని అందిచే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఇటీవలే అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అరెస్టయ్యారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇన్ని అక్రమాలు, దోపిడీలు చేసిన బాబును రక్షించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్సిగ్గుగా కొందరు చంద్రబాబుకు సపోర్టు చేస్తున్నారని మండిపడ్డారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన బాబు 45 ఏళ్లుగా దోపిడీని చంద్రబాబు రాజకీయంగా మార్చుకున్నారని సీఎం జగన్ విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ బాబు అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. కేసులో ఆడియో టేపుల్లో బ్లాక్మనీ పంచుతూ పట్టుబడ్డారని ప్రస్తావించారు. ఆ ఆడియో బాబుదే అని ఫోరెన్సిక్ కూడా నిర్ధారించిందని.. కానీ బాబు మాత్రం అది తనది కాదని బుకాయించారని గుర్తుచేశారు. తానేం తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారని అన్నారు. ‘ఫేక్ అగ్రిమెంట్తో లేని కంపెనీని ఉన్నట్లుగా సృష్టించి బాబు స్కాం చేశారు. ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచేశారు. స్కిల్ స్కాం సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని సీఐడీ నిర్ధారించింది. డబ్బును డొల్ల కెంపీలకు ఎలా మళ్లీంచారన్నది ఈడీనే బయటపెట్టింది. చంద్రబాబు పీఏ చాటింగ్లను ఐటీశాఖ బయటపెట్టింది. ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే అరెస్ట్ చేసింది. సాక్ష్యాలు, ఆధారాలు చూసిన తర్వాత కోర్టు బాబును రిమాండ్కు పంపింది. ఇంత అడ్డగోలుగా దొరికిపోయినా కూడా ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అని బాబు అంటున్నారు. చదవండి: కాపు నేస్తంతో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది: సీఎం జగన్ ఎల్లో మీడియా నిజాలను చూపించదు, వినిపించదు ఈడీ అరెస్ట్ చేసినా, ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తున్నారు. కోర్టు రిమాండ్కు పంపితే ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అన్న పవన్ ప్రశ్నించడు. ఎల్లో మీడియా నిజాలను చూపించదు, వినిపించదు. చంద్రబాబు అవినీతిపై మాట్లాడదు. వాటాలు పంచుతాడు కాబట్టే వీరెవ్వరూ ప్రశ్నించారు. లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకులు రాసేది ఒకడు, ములాఖత్లో మిలాఖత్ చేసుకొని పొత్తు పెట్టుకునేది ఇంకొకడు. 371 కోట్ల రూపాయల జనం సొమ్ము ఎటుపోయింది? చంద్రబాబు నడిపిన కథలో ఆయన్ను కాకుండా ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలి?. 371 కోట్ల రూపాయల జనం సొమ్ము ఎక్కడికిపోయింది. ఎవరి జేబుల్లోకి ఈ సొమ్మంతా పోయింది. ప్రజలంతా ఆలోచన చేయాలి. మీ బిడ్డ హయాంలో మీకు మంచి జరిగిందా లేదా చూడండి’ అని సీఎం జగన్ నిడదవోలు సభలో వ్యాఖ్యానించారు. చదవండి: స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే: సీఎం జగన్ -
మహిళ స్పీచ్ కు సీఎం వైఎస్ జగన్ ఫిదా
-
కాపు నేస్తంతో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ‘కాపు నేస్తం’ పథకం ద్వారాం ఒంటరి మహిళలకు మేలు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అందచేసే సాయంతో ఇప్పటివరకు (నాలుగేళ్లలో) ఈ పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయం అదించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. నిడదవోలులో ‘వైఎస్సార్ కాపు నేస్తం’ నాలుగో విడత ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. పేద కాపు మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే లక్ష్యమని అన్నారు. నాలుగు లక్షల మంది కాపు నేస్తం పథకం ద్వారా లబ్ధిపొందినట్లు తెలిపారు. లంచాలకు అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని చెప్పారు. కేబినెట్లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత గతంలో ఏ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేయలేదని సీఎం చెప్పారు. కులం, మతం రాజకీయాలు చూడకుండా పథకాలు అమలు చేస్తున్నామ్నారు. అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2.30 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించామని చెప్పారు. నాన్ డీబీటీ ద్వారా కాపు వర్గానికి రూ. 16,914 కోట్ల లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. కేబినెట్లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం జగన్.. ఇది ప్రజలందరీ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ కాపు సామాజిక వర్గానికి ప్రధాన్యత కల్పించామన్నారు. చదవండి: పొత్తులో సీటు ఫట్!.. జనసేన, టీడీపీ నేతల్లో ఆందోళన -
స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే: సీఎం జగన్
Updates.. ములాఖత్లో మిలాకత్లా? చంద్రబాబు-పవన్లపై సీఎం జగన్ విమర్శలు - 45 ఏళ్ల నుంచి బాబు దోపిడీ నే రాజకీయంగా మార్చుకున్నారు - ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు - ఆడియో టేపుల్లో బ్లాక్ మనీ పంచుతూ అడ్డంగా దొరికారు - సాక్ష్యాదారాలతో సహా దొరికినా బుకాయిస్తున్నారు - బాబు దొంగతనాల్లో వీరంతా వాటాదారులే - ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు - ఎల్లో మీడియా నిజాలను చూపించరు - ఎల్లో మీడియా చంద్రబాబు అవినీతి పై మాట్లాడదు - నిస్సిగ్గుగా చంద్రబాబుకు వీరంతా సపోర్ట్ చేస్తున్నారు - లేని కంపెనీని ఉన్నట్టుగా ఫేక్ అగ్రిమెంట్ సృష్టించారు - స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే - ఫేక్ అగ్రిమెంట్ తో ప్రభుత్వ ఖజానా దోచేశారు - ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారు - సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదని చెప్పింది - ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది - ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచేశారు - డొల్ల సూట్ కేసు కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ తేల్చింది - ఈడీ అరెస్ట్ చేసినా, ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తున్నారు - కోర్టు రిమాండ్ కు పంపితే ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు - ఎల్లో మీడియా ఈ నిజాలు చూపించదు , వినిపించదు - చంద్రబాబు పీఏకు ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది - రూ. 371 కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయింది ? - ప్రజాధనం దోచుకున్న బాబును కాకుంటే ఎవరిని అరెస్ట్ చేయాలి ? - వాటాలు పంచుతాడు కాబట్టే వీరెవ్వరూ ప్రశ్నించరు - లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకులు రాసేది ఒకడు - ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకునేది ఇంకొకడు - ప్రజలంతా ఆలోచన చేయాలి - మీ బిడ్డ హయాంలో మీకు మంచి జరిగిందా లేదా చూడండి - మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు అండగా నిలబడండి - మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లోనూ మంచి పాలన అందిస్తాం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు లో నాలుగో విడత కాపు నేస్తం నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగం - మీ అందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నాం - మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతఙ్ఞతలు చెబుతున్నా - కాపు నేస్తంతో ఒంటరి మహిళలకు మేలు చేస్తున్నాం - వరుసగా ఐదేళ్ల పాటు రూ. 75 వేలు ఆర్ధిక సాయం అందిస్తున్నాం - 3,57,844 మందికి రూ. 536.77 కోట్లు జమ చేస్తున్నాం - లంచాలు, అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం - కాపు నేస్తం తో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది చేకూరింది - ఒంటరి మహిళలకు ఆర్ధిక స్వాలంబన చేకూర్చడమే లక్ష్యం - 45 నుంచి 60 ఏళ్ల అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం - నాలుగేళ్లలో రూ. 2,029 కోట్ల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం - గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం అమలు చేయలేదు - ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు - కాపు పేద మహిళలకు అండగా ఉండాలనే ఈ పథకం - కేబినెట్ లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చాం - ఇది మీ అందరి ప్రభుత్వం - నామినేటెడ్ పోస్టుల్లోనూ కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చాం - కులం, మతం, రాజకీయాలు చూడకుండా పథకాలు అమలు చేస్తున్నాం - అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం - రూ. 2.30 లక్షల కోట్ల రూపాయలను డీబీటీ ద్వారా అందించాం - నాన్ డీబీటీ ద్వారా కాపు వర్గానికి రూ. 16,914 కోట్ల లబ్ది చేకూరింది - గత ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఎందుకు చేయలేదు ? - చంద్రబాబు గతంలో 10 శాతం కూడా హామీలు నెరవేర్చలేదు - చంద్రబాబు కాపులను అడుగడుగునా మోసం చేశారు - రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు మోసం చేశారు - 4 ఏళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి రూ. 39,247 కోట్లు ఇచ్చాం - మేనిఫెస్టో లో చెప్పిన దాని కంటే మిన్నగా చేశాం - గత ప్రభుత్వం మంజునాథ కమిషన్ పేరుతో మోసం చేసింది - అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అరెస్ట్ అయ్యారు - అక్రమాలు చేసిన వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు - చట్టం ఎవరికైనా ఒక్కటే : సీఎం జగన్ ►నాలుగో విడతలో వైఎస్సార్ కాపునేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్. ► సీఎం జగన్ మాట్లాడుతూ.. మీ అందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా. కాపునేస్తంతో ఒంటిరి మహిళలకు మేలు చేస్తున్నాం. వరుసగా ఐదేళ్ల పాటు రూ.75వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. 3,57,844 మందికి రూ.536.77 కోట్లు జమ చేస్తున్నాం. లంచాలు, అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. కాపు నేస్తంతో 4లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్దిచేకూరింది. 45 నుంచి 60 ఏళ్ల అక్క చెలమ్మలకు అండగా నిలిచాం. ► ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ.. సీఎం జగన్ సంక్షేమ సారథి. సీఎం జగన్కు నిడదవోలు ప్రజల తరఫున స్వాగతం. వైఎస్సార్ కాపునేస్తంతో ఒంటరి మహిళలకు ఎంతో లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వం హామీల పేరుతో ప్రజలను మోసం చేసింది. ► ముఖ్యమంత్రి జగన్ నిడదవోలు చేరుకున్నారు. ► నిడదవోలు బయలుదేరిన సీఎం జగన్. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు నిడదవోలులో పర్యటించనున్నారు. ► ఈ సందర్బంగా ‘వైఎస్సార్ కాపు నేస్తం’ నాలుగో విడతలో భాగంగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ► అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. నేడు అందచేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లవుతోంది. ► 9:40 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం జగన్ ► 10:10 నిడదవోలు టౌన్ సుబ్బరాజుపేటలోని హెలిపాడ్ ప్రాంగణానికి చేరుకోనున్నారు. ► 10:20 సభా వేదిక వరకూ రోడ్ షో ► 10:35 సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాలలోనీ సభాస్థలి వద్దకు చేరుకుని నిధులు విడుదల చేస్తారు. ► 12:10 ఎలిఫెంట్ ప్రాంగణానికి చేరుకుని స్థానిక నాయకులతో మాట్లాడతారు. ► 12:45 హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరుతారు. -
నేడు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
నేడు ‘కాపు నేస్తం’ నాలుగో విడత
సాక్షి, అమరావతి: పార్టీ మేనిఫెస్టోలో లేకున్నా.. ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ కాపు సామాజిక వర్గానికి అండగా నిలుస్తూ వరుసగా నాలుగో ఏడాదీ ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శనివారం జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా నగదు జమ చేయనున్నారు. అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. నేడు అందచేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లవుతోంది. కాపులను దగా చేసిన టీడీపీ సర్కారు టీడీపీ సర్కారు కాపులను అన్ని రకాలుగా దగా చేసింది. కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేసింది. సంవత్సరానికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకుండా వంచించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 52 నెలల్లో 77,00,628 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు డీబీటీ, నాన్–డీబీటీతో రూ.39,247 కోట్ల మేర లబ్ధి చేకూర్చడం గమనార్హం. కాపు కార్పొరేషన్ ద్వారా ఏడాదికి రూ.2 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనగా అంతకంటే మిన్నగా మేలు చేయడం గమనార్హం. నేడు నిడదవోలుకు సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నిడదవోలు చేరుకుంటారు. అక్కడ సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వైఎస్సార్ కాపునేస్తం ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
మా కాపులకు ఇంత మేలు చేసిన జగనన్నను ఎప్పటికీ మర్చిపోము
-
ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కాపు నేస్తం సభలో చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ స్పందిస్తారా?లేదా? అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూసి ఉంటారు. కానీ ప్రతిపక్షం వైపు నుంచి ఎలాంటి ప్రతి స్పందన రాలేదంటేనే జగన్ ఈ విషయంలో సఫలం అయ్యారని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి నిత్యం ఏదో ఒక విమర్శ చేస్తూ వార్తలలో ఉండడానికి ఇష్టపడే చంద్రబాబు నాయుడు ఈ విషయాలపై ఎందుకు మాట్లాడలేదు. ప్రభుత్వం చేసే కార్యక్రమానికి పోటీగా ఏదో ఒకటి చేసే టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది? అంటే దాని అర్థం అనవసరంగా కెలుక్కుని నష్టపోవడం ఎందుకు అని అయినా అనుకుని ఉండాలి? లేదా వారి దగ్గర సమాధానం అయినా ఉండి ఉండకపోవాలి. చదవండి: ‘ఈనాడు’ ఎందుకు ఈ లాజిక్ మిస్ అవుతోంది? 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కాపు సామాజికవర్గం కూడా బాగానే ఉపయోగపడిందని అంగీకరించాలి. దానికి కారణం జనసేన పార్టీని స్థాపించిన ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చారు. ఆయనపై ఉన్న ఆ వర్గంలో ఉన్న అభిమానం చంద్రబాబు కాష్ చేసుకోగలిగారు. దీనికి తోడు కాపులను బీసీలలో చేర్చి రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ కూడా ఉండనే ఉంది. తీరా అధికారంలోకి వచ్చాక కాపుల పట్ల చంద్రబాబు అనుసరించిన వైఖరి వారిలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల అంశంపై చేసిన ఉద్యమాన్ని ఎలా అణచాలా అన్నదానిపైనే ఆయన దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినా , కాపులను బీసీలలో చేర్చేలా కేంద్రాన్ని ఒప్పించడంలో ఆయన విఫలం అయ్యారు. పైగా కేంద్రం తీసుకు వచ్చిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లో ఐదు శాతం కాపులకు ఇస్తామని కొత్త ఆలోచన చేశారు. అది చెల్లదని తెలిసినా ఆయన ప్రయత్నం చేసి చివరికి భంగపడ్డారు. కాపు సామాజికవర్గం అధికంగా ఉండే గోదావరి జిల్లాలలో కూడా తెలుగుదేశం ఘోరంగా దెబ్బతినిపోయింది. కేవలం ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి. వామపక్షాలతో కలిసి పోటీచేసిన జనసేనకు ఒక సీటు మాత్రమే దక్కింది. మిగిలిన సీట్లన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలో జమ అయ్యాయి. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 2014-19 మధ్య ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ కాపు రిజర్వేషన్ ఇష్యూలో తాను హామీ ఇవ్వలేనని చెప్పడం ద్వారా అటు కాపు వర్గాన్ని, ఇటు బీసీ వర్గాన్ని ఆకట్టుకోగలిగారు. కాపులకు ఏటా రెండు వేల కోట్ల రూపాయల ప్రయోజనం చేకూర్చుతానని ఆయన హామీ ఇచ్చారు. అదే ప్రకారం ఆయన అడుగులు వేశారు. చంద్రబాబు మాత్రం తాను అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఏటా వెయ్యి కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి, దానిని నెరవేర్చలేకపోయారు. మూడువేల కోట్ల వరకే ఇవ్వగలిగారు. మరి జగన్ ఆ విషయంలో వివిధ స్కీముల కింద మూడేళ్లలోనే 32 వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చానని గొల్లప్రోలులో జరిగిన సభలో ప్రకటించారు. దీనిని పూర్వ పక్షం చేయడానికి టీడీపీ ఎంతవరకు ప్రయత్నించింది తెలియదు. కానీ ఆ సభలో ముఖ్యమంత్రి జగన్కు వచ్చిన స్పందన చూస్తే కాపు పేద మహిళలలో కూడా జగన్ నమ్మకం సాధించారన్న అభిప్రాయం కలుగుతుంది. 45 ఏళ్ల నుంచి అరవై ఏళ్ల మధ్యలో ఉన్న ప్రతి పేద కాపు మహిళకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వడం ద్వారా వారిలో ఒక నమ్మకం పెంచగలిగారు. పలువురు ఈ డబ్బును స్వయం ఉపాధికి కూడా వినియోగిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు టైమ్లో ఈ రకంగా నిర్మాణాత్మక ప్రయత్నం జరిగినట్లు అనిపించదు. కాపు కార్పొరేషన్ ద్వారా కొంతమందికి రుణాలు ఇచ్చినట్లు టీడీపీ చెబుతుంది. కానీ జగన్ ఏకంగా ఆ వర్గం మహిళలకు భారీ ఎత్తున ఉచిత ఆర్థిక సాయం చేయడంతో రుణాలకు విలువ లేకుండా పోయింది. ఇంకో పోలిక కూడా గమనించాలి. కాపులకు ఒక భవనం నిర్మిస్తామని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. అది ఏ దశలో ఉందో తెలియదు కాని, దానికి చంద్రన్న కాపు భవన్ అని పేరు పెట్టే యోచన చేయడంతో ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో ఆయన వెనక్కి తగ్గవలసి వచ్చింది. అదే కాపు నేస్తం స్కీంకు జగనన్న కాపు నేస్తం అని పేరు పెట్టినా వారెవ్వరూ వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఇది నేస్తం పథకం కనుక. ఈ విషయంలో జగన్ వ్యూహాత్మకంగా వెళితే చంద్రబాబు వ్యూహలోపంతో నష్టపోయారని అనుకోవచ్చు. ఈ జిల్లాలలో తన పరపతి మళ్లీ పెంచుకోవడానికి పవన్ కల్యాణ్ చేస్తున్న కృషికి గండి కొట్టేలా జగన్ తన వంతు ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. చంద్రబాబు ఇప్పటికీ నేరుగా పవన్తో రాజకీయ సంబంధాలు పెట్టుకోకపోయినా, పరోక్షంగా వారిద్దరూ కలిసే ఉన్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఎవరూ ఆశ్చర్యపోరు. దానివల్ల కాపుల ఓట్లు గణనీయంగా వచ్చి రాజకీయంగా లబ్ధి పొందవచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఈ వ్యూహానికి ప్రతిగా జగన్ నేరుగా పవన్ కల్యాణ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాపు వర్గంలో ఆలోచనకు ఆస్కారం ఇవ్వవచ్చు. కాపుల ఓట్లను కొంతమేర అయినా కూడగట్టి వాటన్నిటిని హోల్ సేల్గా చంద్రబాబుకు అమ్మేసే దత్తపుత్రుడి రాజకీయాలు ఇవాళ చూస్తున్నాం అని జగన్ వ్యాఖ్యానించారు. దీనిని కూడా టీడీపీ, జనసేనలు ఖండించలేకపోతున్నట్లు అనిపిస్తుంది. భవిష్యత్తులో టీడీపీ, జనసేనలు కలిసే అవకాశం ఉండడంతో దానిని తోసిపుచ్చలేకపోతున్నారు. ఈ పాటికే ఈ రెండు పార్టీలు కలిసి ఉంటే తమ నేత అమ్ముడుపోలేదని, కాపుల పక్షాన పవన్ నిలబడతారని చెప్పుకునేవారేమో! కొద్ది రోజుల క్రితం ఆయా సభలలో పవన్ మాట్లాడుతూ కాపులకు కూడా ఆ భావన లేకుండా పోయిందని, వారు కూడా జగన్కే మద్దతు ఇస్తున్నారని బాధపడ్డారు. గతంలో ఆయన అసలు కాపులేమిటి? రిజర్వేషన్ ఏమిటి అని ప్రశ్నించిన సందర్భమూ ఉంది. దీంతో ఆయన నిలకడ లేని వ్యక్తి అన్న భావన ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన హామీలను విశ్వసించిన ఆ వర్గంలో మెజార్టీ మద్దతు లభించింది. ఇప్పటికే పలు బలహీనవర్గాలు జగన్కు మద్దతు ఇస్తున్నాయి. కాపులు కూడా అదే ప్రకారం తమ సపోర్టును కొనసాగిస్తే టీడీపీ, జనసేనలకు భవిష్యత్తు ఉండడం కష్టం అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కాపులను హోల్ సేల్ గా అమ్మేయడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జగన్ ఆరంభించారు. ఇదే టైమ్లో ఆయా అంశాలను ప్రస్తావించి తాను నిజాయితీగా మాట్లాడతానని, చెప్పినవాటిని అమలు చేస్తున్నానని, అలాంటి పాలన కావాలా? చంద్రబాబు చేసే అబద్దాల పాలన కావాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఏఏ అబద్దాలు ఆడింది సోదాహరణంగా ప్రజలకు చెబుతున్నారు. కానీ చంద్రబాబు వాటికి ప్రత్యక్షంగా సమాధానాలు చెప్పకుండా జగన్పై ఏవేవో ఆరోపణలు చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలో కాపులకు తాను కాపు కాస్తానని జగన్ ప్రకటించి వారిని ఆకట్టుకునే యత్నం చేశారు. కాపులలోని పేద వర్గాలవారు కూడా జగన్ తమను కాచుకుంటున్నారనే భావిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను బట్టి అర్ధం అవుతుంది. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్లు ఎలాంటి వ్యూహం అమలు చేసి తామే కాపులను ఉద్దరించగలుగుతామని చెప్పగలుగుతారో చూడాలి. కాకపోతే ఐదేళ్లపాటు చేయలేని వ్యక్తి ఇప్పుడు చేస్తారా అన్న ప్రశ్న వస్తుంది. జగన్ తాను చెప్పిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నందున ధైర్యంగా కాపు కాస్తానని చెప్పగలుగుతున్నారా! -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
CM YS Jagan: ఇచ్చిన మాటకు మించి మేలు
గొల్లప్రోలు నుంచి సాక్షి ప్రతినిధి: ‘కాపులకు మేలు చేస్తామని చెప్పినట్టుగానే చేసి చూపించాం. మేనిఫెస్టోలో పెట్టకున్నా మనసున్న ప్రభుత్వం కాబట్టే వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్నాం. మూడేళ్లుగా నిరాటంకంగా కాపు మహిళలకు అండగా నిలుస్తున్నాం. చంద్రబాబు ఏటా రూ.1,000 కోట్ల వంతున ఐదేళ్లలో రూ.5,000 కోట్లు ఇస్తామని చెప్పి.. కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చి కాపులను మోసం చేశారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. మనం చెప్పిన మాటకు మించి మేలు చేశామన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం ఆయన కంప్యూటర్లో బటన్ నొక్కి వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద 3,38,792 మంది కాపు మహిళల ఖాతాల్లో రూ.508 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. ఇది మనసుతో స్పందించే ప్రభుత్వం అన్నారు. అక్క చెల్లెమ్మలు, రైతులు, పేదల ప్రభుత్వం అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలతో పాటు ప్రతి కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన అక్కచెల్లెమ్మలకూ తోడుగా నిలిచామన్నారు. కాపు నేస్తం పథకం కింద ఈ మూడేళ్లలో రూ.1,492 కోట్లు అందించామని చెప్పారు. అర్హత ఉండి కూడా పథకాన్ని పొందలేకపోయిన వారికి ఈ నెల 19న రూ.1.8 కోట్లకు పైగానే జమ చేశామన్నారు. నవరత్న పథకాల ద్వారా ఈ మూడేళ్లలో ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందిన అక్కచెల్లెమ్మలకు, కుటుంబాలకు డీబీటీ, కాపు కార్పొరేషన్ ద్వారా ఏకంగా రూ.16,256 కోట్లు అందించామని వివరించారు. ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టే పథకాలు, నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.16 వేల కోట్ల లబ్ధి కలిగించామని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ కాపు నేస్తం లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేలు చేసినందుకే మీ ఆశీర్వాదాలు ►2.46 లక్షల మంది కాపు అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి పట్టాల విలువే రూ.12 వేల కోట్లు. 1.2 లక్షల మందికి ఇళ్లు కట్టే కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. మనం మేనిఫెస్టోలో చేసిన వాగ్దానం మేరకు రూ.2 వేల కోట్లు ఇస్తామన్నాం. ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పాం. మూడేళ్లు కూడా తిరక్క ముందే రూ.32,296 కోట్లు ఇవ్వగలిగాం. ►నవరత్నాల పథకాల ద్వారా అన్ని వర్గాల వారినీ ఆదుకున్నాం. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 95 శాతం అమలు చేశాం. అందువల్లే ఇవాళ ధైర్యంగా గడప గడపకూ వెళుతున్నాం. మీ ఆశీర్వాదం అందుకుంటున్నాం. ►మెట్ట ప్రాంత రైతుల స్వీయ ప్రయోజనాల దృష్ట్యా నాన్న (రాజశేఖరరెడ్డి) గారి హయాంలోనే ఏలేరు ప్రాజెక్టును చేపట్టి మొదటి విడతలో 60 శాతం పనులు చేశారు. ఆ తర్వాత పట్టించుకున్న వారు లేరు. ఆ అంచనాలు ఇప్పుడు తడిసి మోపెడయ్యాయి. ►ఎమ్మెల్యే దొరబాబు అన్న అభ్యర్థన మేరకు ఏలేరు ఫేజ్–1 ఆధునికీకరణకు రూ.142 కోట్లు, ఏలేరు ఫేజ్–2కు మరో రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నా. ఇది కాకుండా పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాల్టీలకు రూ.20 కోట్లు చొప్పున రూ.40 కోట్లు మంజూరు చేస్తున్నా. జన స్పందన అనూహ్యం సభకు జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. సీఎం జగన్ వేదిక వద్దకు రాక మునుపే సభా స్థలి మహిళలతో నిండిపోయింది. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో బయట వాహనాలలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కోలకతా–చెన్నై జాతీయ రహదారిలో గొల్లప్రోలు వద్ద అటు, ఇటు నాలుగు కిలోమీటర్లు మేర జన సముద్రాన్ని తలపించింది. జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసుల అంచనాలకు మించి జనం రావడంతో ట్రాఫిక్ను నియంత్రించడం కొంత సేపు కష్టతరంగా మారింది. సభలో సీఎం ప్రసంగం సాగిన 30 నిమిషాల పాటు మహిళలు, యువత జై జగన్.. థ్యాంక్యూ సీఎం సార్.. అంటూ నినదించారు. -
CM Jagan: చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు
ఇవాళ సహాయ కార్యక్రమాల్లో మొత్తం అధికార యంత్రాంగాన్నంతటినీ మోహరించాం. మానవత్వంతో సహాయం చేస్తున్నాం. ఆరుగురు జిల్లా కలెక్టర్లు, ఆరుగురు జాయింట్ కలెక్టర్లు బాధితుల వెన్నంటి ఉన్నారు. రేషన్, రూ.2 వేల సాయం అందలేదని ఏ ఒక్కరూ అనలేదు. ఈ పెద్దమనిషి (చంద్రబాబు) మాత్రం నిన్న (గురువారం) చేతిలో కాగితాలు పట్టుకుని అబద్ధాలు చెప్పారు. ఎలాగైనాసరే ప్రజలను నమ్మించగలమని అనుకుంటున్నారు. ఎందుకంటే పత్రికలు నడిపేది వాళ్లే, టీవీలు వాళ్లవే, చర్చ నడిపించేది, చర్చించేది వాళ్లే కాబట్టి. – సీఎం వైఎస్ జగన్ గొల్లప్రోలు నుంచి సాక్షి ప్రతినిధి: ‘చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు. ఆ పెద్ద మనిషిది అదో మార్కు రాజకీయం. ఒకటే అహంకారం. ఆయనకు డబ్బా కొట్టే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఉన్నాయని, ఏ అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్ముతారనే ధీమా. వీటికి తోడుగా దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. కనీసం 10 హామీలు కూడా అమలు చేయకుండా చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి, ఇప్పుడేమో సంక్షేమ పథకాలు రద్దు చేయాలంటున్నారు. డీబీటీ అమలుతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వెటకారం చేస్తున్నారు. చంద్రబాబుతో కూడిన ఈ దుష్టచతుష్టయం గతంలో అమలు చేసిన డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో) కావాలో, మనం అమలు చేస్తోన్న డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) కావాలో ఒకసారి ఆలోచించండి’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలను కోరారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం ఆయన కంప్యూటర్లో బటన్ నొక్కి వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. చంద్రబాబు గత పాలన, ప్రతిపక్ష నేతగా అతని తీరును తూర్పారపట్టారు. గడచిన మూడేళ్ల సంక్షేమ పాలనకు, గత ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరించారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన సభకు భారీగా హాజరైన మహిళలు. దిగజారిన రాజకీయాలు ►కాపుల ఓట్లను కొంతమేర అయినా కూడగట్టి, వాటన్నింటినీ హోల్సేల్గా చంద్రబాబుకు అమ్మేసే దత్తపుత్రుడి రాజకీయాలు ఇవాళ కనిపిస్తున్నాయి. రాజకీయాలు దిగజారిపోయాయి. గతంలో ఒక కులానికి కానీ, ఒక సామాజిక వర్గానికి కానీ.. ఆ ప్రభుత్వం ఏం మేలు చేసింది.. అని అడిగితే లెక్కలు మాత్రమే చూపించేవారు. బడ్జెట్లో వందల కోట్లు చూపించినా, అదే కులానికి చెందిన నాకు ఎందుకు మేలు జరగ లేదని, ఆ లెక్కలన్నీ మాయాజాలమే అనుకునేవారు. ముఖ్యమంత్రి జగన్కు సాదర స్వాగతం పలుకుతున్న విద్యార్థినులు ►ఇవాళ మనం ఇంటింటికీ వెళ్లి.. మీకు ఇన్ని పథకాలు అందాయి అని చెప్పగలుగుతున్నాం. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకుంటున్నాం. పారదర్శకంగా ఇంత మంచి చేశాం. ఇలాంటి పాలన దేశంలో ఎక్కడైనా ఉందా? ఆలోచించండి. ►బాబు పాలనలో అధికార పార్టీకి చెందిన జన్మభూమి కమిటీలు చెబితేనే కొద్ది మందికి మాత్రమే అరకొరగా మేలు జరిగేది. అదీ లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. లంచాలు, వివక్ష అనేవి ఇవాళ ఎక్కడా కనిపించవు. ఇవాళ మనం కులం, మతం, ప్రాంతం, రాజకీయం, వర్గం, ఇవేమీ చూడకుండా మేలు చేస్తున్నాం. మనకు ఓటు వేసినా, వేయకపోయినా ఇస్తున్నాం. కాపునేస్తం లబ్ధిదారులైన మహిళలతో సీఎం జగన్. చిత్రంలో ఎంపీ వంగా గీత మీరే ఆలోచించండి.. ►వందకుపైగా సామాజిక వర్గాల బాగుకోరే మన పాలన కావాలా? లేక గత ప్రభుత్వం మాదిరి చంద్రబాబు, వారి దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు బాగు మాత్రమే కావాలా.. ఆలోచించండి. మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేసిన, నిజాయితీతో కూడిన రాజకీయాలు కావాలా? లేక మోసం, వెన్నుపోటు, వంచనతో కూడిన.. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పచ్చి అబద్ధాల మార్కు చంద్రబాబు రాజకీయం కావాలా? ఈ విషయాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ►హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు ప్రతి ఇంటికీ రూ.4 వేలు ఇచ్చానని, ఇవాళ జగన్ రూ.2వేలు ఇచ్చారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు నేను ఉత్తరాంధ్ర జిల్లాలో తిరుగుతున్నా. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు అప్పట్లో 11 రోజులు తిరిగాను. అప్పుడు వారు ఇచ్చింది పాచిపోయిన పులిహోర ప్యాకెట్లు, అక్కడకక్కడా 10 కేజీలు బియ్యం మాత్రమే. తిత్లీ తుపాను సమయంలోనూ అంతే. ►గతంలో కూడా ఇదే బడ్జెట్. ఇప్పటి కంటే అప్పుడే అప్పులు ఎక్కువ. మరి అప్పుడు పేదలకు ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇవాళ మీ బిడ్డ ఇన్ని పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నాడు? కేవలం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేకపోవడమే తేడా. నాకు ఉన్నది మీ దీవెనలు. ఆ దేవుడి ఆశీస్సులు. – సీఎం వైఎస్ జగన్ గత పాలకులు బూటు కాళ్లతో తన్నించారు గత చంద్రబాబు పాలనలో కాపులను బూటు కాళ్లతో తన్నించారు. మహిళలతో అసభ్యంగా మాట్లాడారు. ఈ ప్రభుత్వం మాత్రమే మా సంక్షేమం పట్ల శ్రద్ధ చూపుతోంది. కాపు నేస్తం, ఇతర పథకాల ద్వారా అన్ని విధాలా ఆదుకుంటున్నారు. మీ సాయంతో నేను టీ దుకాణం పెట్టుకుని, సొంత కాళ్లపై నిలబడ్డాను. 35 ఏళ్ల క్రితం నాకు పెళ్లయింది. అద్దె ఇంటిలోనే కాలం వెళ్లదీస్తున్నాం. మీరు పెద్ద కొడుకుగా మా సొంత ఇంటి కల నెరవేరుస్తున్నారు. కొమరగిరిలో స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణం జరుగుతోంది. పూర్తయ్యాక మీరు (సీఎం) మా గృహ ప్రవేశానికి తప్పకుండా రావాలి. – బండారు సుజాత, కాకినాడ అర్బన్ మళ్లీ మీరే సీఎం కావాలి గత ప్రభుత్వం కాపుల్ని అగ్రవర్ణాలుగా చూసింది తప్ప చేసిందేమీ లేదు. కాపు మహిళలు డబ్బులు లేకపోయినా ఇల్లు దాటి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితిలో మీరు అన్ని విధాలా ఆదుకుంటున్నారు. ఎంతో మంది మహిళలు మీ సాయం అందుకుని సొంత కాళ్లపై నిలబడ్డారు. నేను గేదెలను కొనుక్కుని పాల వ్యాపారం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాను. కుటుంబ పోషణకు నా భర్తకు నెలకు రూ.4 వేలు ఇస్తున్నాను. నా భర్త ఆటో డ్రైవర్. వాహనమిత్ర ద్వారా అతనికి రూ.10 వేల సాయం అందింది. ఇటీవల ఆరోగ్యశ్రీ ద్వారా నా భర్తకు ప్రాణ భిక్ష పెట్టారు. నా కుమారుడికి ఫీజు రీయింబర్స్మెంట్, మా అత్తకు పింఛన్ అందుతోంది. ఇంటి స్థలం ఇచ్చారు. ఇంత మేలు చేసిన మీరే ఎప్పటికీ సీఎంగా ఉండాలి. – చిక్కాల రాణి, కొవ్వాడ, కాకినాడ రూరల్ -
వైఎస్సార్ కాపు నేస్తం: సీఎం జగన్ కాకినాడ జిల్లా పర్యటన (ఫొటోలు)
-
వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్
-
సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ పథకాలు అందిస్తున్నాం: రోజా
-
వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులు విడుదల
-
వరుసగా మూడో ఏడాది కాపు అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం
-
‘కాపు మహిళలం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం’
గొల్లప్రోలు(కాకినాడ జిల్లా): వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత నిధులను జమ చేశారు సీఎం వైఎస్ జగన్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ కాపు నేస్తం నిధులను సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు. ఫలితంగా అర్హులైన 3,38, 792 మందికి రూ. 508 కోట్ల ఆర్థికసాయం చేకూరనుంది. కాగా, వైఎస్సార్ కాపు నేస్తం కార్యక్రమంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులు మాట్లాడుతూ.. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమంపై ప్రశంసలు కురిపించారు. కాపుల్ని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం జగనే అంటూ వారు కొనియాడారు. మళ్లీ మళ్లీ మీరే అధికారంలోకి రావాలి ‘నేను ప్రతీసారి కాపు నేస్తం అందుకున్నాను. ఇప్పుడు కూడా అందుకుంటున్నాను. మా భర్త ఆదాయం సరిపోక, టీ షాపు పెట్టుకున్నాను. దానికి వైఎస్సార్ కాపు నేస్తం మరింత ఆసరా అయ్యింది. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. అసలు మా కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయలేదు. మీరొచ్చాక కాపు నేస్త అనే పథకాన్ని పెట్టి ఎంతోమందిని ఆదుకున్నారు. ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదు. మళ్లీ మళ్లీ మీరే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. ఒక ఇంటికి అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా మనవడిగా అన్నీ చేస్తున్నారు. మా కాపుల్ని గుర్తించిన ఏకైక నాయకుడు మీరే. ఒక పెద్ద కొడుకుగా మీరు చాలా సాయం చేశారు. మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా మిమ్మల్నే చూడాలనుకుంటున్నాను. -బండారు సుజాత, కాపు నేస్తం లబ్ధిదారు కాపు మహిళలం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం ఈ ప్రభుత్వ హయాంలో కాపు మహిళలం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. ఆడపడుచులం అందరి తరపున మీకు(సీఎం జగన్ను ఉద్దేశించి..) కృతజ్ఞతలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మా లాంటి కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరింది. నేను, నా భర్త, పిల్లలు, పెద్దలు.. అందరం ప్రభుత్వ సహకారంతో పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం అంటూ రాణి అనే మరో లబ్ధిదారు చాలా భావోద్వేగంగా మాట్లాడారు. పదికాలాల పాటు చల్లగా ఉండాలని, సీఎంగా కొనసాగాలని కోరుకున్నారు ఆమె. ఆమె ప్రసంగానికి సీఎం జగన్ స్పందించి.. ఆమెను పలకరించారు కూడా. -
స్టేజ్ మీద ఎమోషనల్ అయిన కాపు మహిళ
-
చంద్రబాబు పాలనలో జరిగింది డీపీటీ: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: డీబీటీ అంటే.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డీబీటీ ద్వారా అవినీతికి తావులేకుండా నేరుగా సంక్షేమ పథకాల నిధుల్ని.. లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా కాకినాడ గొల్లప్రోలు సభ నుంచి లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అదే సమయంలో చంద్రబాబు పాలనలో డీపీటీ సమర్థవంతంగా అమలు అయ్యిందని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ‘డీపీటీ’ అంటే.. దోచుకో.. పంచుకో.. తినుకో అని సీఎం జగన్ నిర్వచించారు. డీపీటీ ద్వారా దుష్టచతుష్టయం అంటే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5.. వీరికి తోడు దత్తపుత్రుడు అంతా కలిసి సామాజిక న్యాయం పాటించారని ఎద్దేవా చేశారు. కాపుల ఓట్లను మూటగట్టి చంద్రబాబుకు అమ్మడానికి దత్త పుత్రుడు ప్రయత్నిస్తున్నాడు. మన ప్రభుత్వం డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం కావాలా? చంద్రబాబు హయాంలో ఉన్న దోచుకో, పంచుకో, తినుకో కావాలా?..అని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారాయన. చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియాకు తెలిసింది అవినీతి మాత్రమే. చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. హుద్హుద్ వచ్చినప్పుడు 11 రోజుల పాటు నేనే స్వయంగా ఉత్తరాంధ్రలో తిరిగా. ఆ సమయంలో పాచిపోయిన పులిహోర ప్యాకెట్లను బాధితులకు పంచాడు ఆయన. కానీ, మా హయాంలో విపత్తు వస్తే బాధితులను సక్రమంగా ఆదుకుంటున్నాం. వరద బాధితులు ఏ ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా రేషన్తో పాటు ప్రతీ ఇంటికి రూ.2 వేలు ఇస్తున్నాం. చంద్రబాబు తన పాలనలో ఒక్క రూపాయి ఇవ్వలేకపోయారు. అలాగే.. జగనన్న పాలనలో లబ్ధి జరగలేదని చంద్రబాబు ఏ ఒక్కరినీ చూపలేకపోయారు. అబద్దాల మార్క్ చంద్రబాబు కావాలా? ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ ప్రభుత్వం కావాలా?.. ఎవరి పాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. ఇది కూడా చదవండి: ఇది అన్నివర్గాల సంక్షేమ ప్రభుత్వం.. కాపు నేస్తం అందులో భాగమే!: సీఎం జగన్ -
జగనన్నా మా గృహప్రవేశానికి మీరు రావాలి
-
గొల్లప్రోలు సభా వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం వైఎస్ జగన్
-
ఇది అన్నివర్గాల సంక్షేమ ప్రభుత్వం: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: కాపులతో పాటు ప్రతీ సామాజికవర్గ సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం తమదని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మూడు లక్షల మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ నేరుగా డబ్బు జమ చేయడం దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా అని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన వైఎస్సార్ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘మనది అక్కచెల్లెమ్మల ప్రభుత్వం. మనది రైతు ప్రభుత్వం. మనది పేదలకు మంచి చేసే ప్రభుత్వం. మనది.. అన్నివర్గాల ప్రభుత్వం.. మనసున్న ప్రభుత్వం అని సగర్వంగా ప్రకటించుకున్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా వైఎస్సార్ కాపు నేస్తం అందిస్తున్నామని, అన్ని వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ ఉద్ఘాటించారు. వరుసగా మూడో ఏడాది కాపు అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం. వరుసగా ఈ ఏడాది కూడా రూ.15వేలు వాళ్ల అకౌంట్లలో నేరుగా జమ చేస్తున్నాం. ఇప్పటివరకు 1,492 కోట్ల రూపాయల సాయం అందించాం. ఈ ఏడాది 3లక్షల 38 వేల 792 మంది కాపు మహిళలకు లబ్ధి చేకూర్చేలా చేశాం. నవరత్నాల ద్వారా మూడేళ్లలోనే కాపు సామాజిక వర్గానికి రూ.16,256 కోట్ల లబ్ధి చేకూరింది. మొత్తంగా కాపు సామాజిక వర్గానికి ఈ మూడేళ్లలో సంక్షేమపథకాల ద్వారా రూ.32,296 కోట్లు లబ్ధి చేకూరిందని సీఎం జగన్ తెలిపారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్నామని, క్రమం తప్పకుండా ఈ పథకం అమలు చేస్తున్నామని, ప్రతీ పేదవాడికి అండగా ఉండడమే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఉద్దేశం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. -
కాపు మహిళల సమస్యలను దగ్గరుండి అడిగి తెలుసుకుంటున్న సీఎం జగన్
-
వైఎస్సార్ కాపు నేస్తం: మూడో విడత నగదు విడుదల
కాపు నేస్తం మూడో విడత కార్యక్రమం.. అప్డేట్స్ 12:27PM ►వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత నిధుల జమ ►లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసిన సీఎం జగన్ ►అర్హులైన 3,38, 792 మందికి రూ. 508.18 కోట్ల ఆర్థికసాయం 11: 55AM ►వైఎస్సార్ కాపు నేస్త పథకం వరుసగా మూడో ఏడాది అమలు చేస్తున్నాం: సీఎం జగన్ ►మూడేళ్లలో ఇప్పటివరకూ ఒక్కొక్కరికీ రూ. 45 వేలు ఇచ్చాం: సీఎం జగన్ ►ఇప్పటివరకూ వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ.1,492 కోట్లు సాయం అందించాం: సీఎం జగన్ ►నవరత్నాల ద్వారా మూడేళ్లలో కాపు సామాజిక వర్గానికి 16,256 కోట్ల లబ్ధి: సీఎం జగన్ ►నాన్ డీబీటీ ద్వారా కాపు సామాజిక వర్గానికి మరో 16 వేల కోట్ల లబ్ధి: సీఎం జగన్ ►మొత్తంగా కాపు సామాజిక వర్గానికి మూడేళ్లలో 32,296 కోట్ల లబ్ధి: సీఎం జగన్ ►కాపు నేస్తం కింద అర్హులైన 3,38,792 మందికి రూ. 508.18 కోట్ల లబ్ధి: సీఎం జగన్ 11:49AM ►మహిళా సాధికారత పట్ల సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని ఎంపీ వంగా గీత స్పష్టం చేశారు. మహిళల కోసం దిశ చట్టం తీసుకొచ్చారని, లంచాలు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ అని వంగా గీత తెలిపారు. 11:46AM ► ఈ ప్రభుత్వ హయాంలో కాపు మహిళలం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. ఆడపడుచులం అందరి తరపున మీకు(సీఎం జగన్ను ఉద్దేశించి..) కృతజ్ఞతలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మా లాంటి కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరింది. నేను, నా భర్త, పిల్లలు, పెద్దలు.. అందరం ప్రభుత్వ సహకారంతో పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం అంటూ రాణి అని లబ్ధిదారు చాలా భావోద్వేగంగా మాట్లాడారు. పదికాలాల పాటు చల్లగా ఉండాలని, సీఎంగా కొనసాగాలని కోరుకున్నారు ఆమె. ఆమె ప్రసంగానికి సీఎం జగన్ స్పందించి.. ఆమెను పలకరించారు కూడా. 11:43 AM ► కాపులను చంద్రబాబు మోసం చేశాడు. చాలా హింసించాడు. కాపుల సంక్షేమం కోసం ఆలోచించిన గొప్పమనసు సీఎం జగన్ది. మీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో చాలా లబ్ధి పొందుతున్నాం. మా అందరికీ మీరు పెద్ద కొడుకుగా భావిస్తున్నాం. ::బండారు సుజాత, కాకినాడ అర్బన్ 11:38 AM కాపులు.. పవన్ను నమ్మొద్దు: మంత్రి దాడిశెట్టి రాజా ► కాపుల కోసం గత ప్రభుత్వాలు ఎన్నో రకాల మాటలు చెప్పాయి. చేతల్లో చూపించింది శూన్యం. అధికార మదంతో కాపుల మీద కేసులు కూడా పెట్టారు. కానీ, ఈ మూడు సంవత్సరాల్లో కాపుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన ఘనత వైఎస్ జగన్ది. అంతేకాదు కేసుల్ని కూడా ఎత్తేయించారు. పవన్ కల్యాణ్ మోసపు మాటలను నమ్మొద్దని.. చంద్రబాబుతో చేతులు కలుపుతున్నాడని.. ఎల్లోమీడియా, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఇలా ఎందరు కలిసొచ్చినా.. కాపు సంక్షేమం కోసం వైఎస్ జగన్నే మనం మళ్లీ సీఎంగా చేసుకోవాలని పిలుపు ఇచ్చారు మంత్రి దాడిశెట్టి రాజా 11:33 AM ► కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పాలన అందిస్తున్న ఘనత సీఎం జగన్ది. రూ. 422 కోట్ల రూపాయలతో హార్బర్ ఇచ్చారు. అలాగే సాగరమాల రోడ్డు ప్రకటించారు. గతంలో మహానేత వైఎస్సార్ కూడా ఇలాగే పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి గురించి ఆలోచించారు. అలాగే ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి ఉపయోగపడే మరికొన్ని పనులను పూర్తి చేయించాలని సీఎం జగన్ను వేదిక నుంచే కోరారు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ► వైఎస్సార్ కాపు నేస్తం మీద స్పెషల్ ఏవీ ప్రదర్శన 11:27 AM ► వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడత కార్యక్రమంలో.. కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభోత్సవ ఉపన్యాసం ఇచ్చారు. సంక్షేమ పథకాలు ప్రజలకు సజావుగా అందడానికి.. పాలనా సౌలభ్యం కోసం కాకినాడ జిల్లా ఏర్పాటు చేసినందుకు ఆమె సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు మహిళా పక్షపాతిగా ఉన్న ఆయనకు ధన్యవాదాలు చెబుతూ.. ప్రజాసంక్షేమ ఆశయానికి తగట్లుగా పని చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. 11:25 AM ► మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి.. స్థానిక నేతలు, అధికారులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు సీఎం జగన్. 11:19 AM ► కాపు నేస్తం మూడో విడతలో.. అర్హులైన మూడు లక్షల మందికి పైగా రూ.500కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించనుంది ఏపీ ప్రభుత్వం. ► ఇప్పటివరకు వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ.1,491 కోట్ల రూపాయల సాయం అందించింది సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. 11:15 AM ► గొల్లప్రోలు సభా వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్. ఆడపడుచులతో ఫొటోలు దిగి.. ఆప్యాయంగా పలకరించిన జగనన్న. కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం. 11:00 AM ► హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు రోడ్షో. వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడుత సాయం విడుదల కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్. 10:58 AM ► సీఎం జగన్కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సీఎం వెంట మంత్రులు బొత్స, అప్పలరాజు, ఎంపీ మిథున్రెడ్డి. 10:47 AM ► కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకు చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. 10:00 AM ► వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడుత నిధుల పంపిణీ కార్యక్రమం కోసం.. తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. ఆయన వెంట మంత్రులు బొత్స, అప్పలరాజు, ఎంపీ మిథున్రెడ్డి ఉన్నారు. ► వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం అమలుకు సర్వత్రా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ► కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగే కార్యక్రమంలో.. సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్లో బటన్ నొక్కి నిధులు జమ చేయనున్నారు. ► రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది పేద అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.508.18 కోట్ల ఆర్థిక సాయం జమ చేయనున్నారు. ► మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్నారు. పర్యటన ఇలా.. ► శుక్రవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి, కాకినాడ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు చేరుకుంటారు. ► లబ్ధిదారులను ఉద్దేశించి.. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ► అనంతరం వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద సాయం జమ చేస్తారు. ► కార్యక్రమ అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్ కాపు నేస్తం: 3,38,792 మందికి లబ్ధి
సాక్షి, అమరావతి: వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం అమలుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్లో బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది పేద అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.508.18 కోట్ల ఆర్థిక సాయం జమ చేయనున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేకుండా అర్హత ఉంటే చాలు.. మంజూరు చేస్తున్నారు. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడము అని సీఎం వైఎస్ జగన్ ప్రతి సమావేశంలో చెబుతూ.. అదే ఆచరిస్తున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అరకొర సాయం ► శుక్రవారం అందించే రూ.508.18 కోట్లతో కలిపి ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.1,491.93 కోట్ల మేర లబ్ధి కలిగించారు. తద్వారా ఒక్కో పేద కాపు అక్క,చెల్లెమ్మకు ఈ మూడేళ్లలో రూ.45,000 లబ్ధి కలిగింది. ► గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో ఇచ్చింది ఏటా సగటున రూ.400 కోట్లు కూడా లేని దుస్థితి. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం మూడేళ్లలోనే వివిధ పథకాల ద్వారా 70,94,881 మంది కాపు కులాల అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు దాదాపు 27 రెట్లు ఎక్కువగా అంటే మొత్తం రూ.32,296.37 కోట్ల లబ్ధి చేకూర్చింది. ► ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కాపుల బలోపేతం కోసం ఈ ప్రభుత్వం విశేష కృషి చేసింది. సామాజిక సమతుల్యత పాటిస్తూ కాపులకు ఒక డిప్యూటీ సీఎం సహా, ఏకంగా నాలుగు మంత్రి పదవులు కేటాయించింది. అన్ని నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో కాపు వర్గాలకు తగు ప్రాధాన్యత కల్పించింది. ► గత టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అనేక పథకాలు అమలు చేయలేదు. అమలు చేసినవి కూడా అరకొరే. వివిధ పేర్లతో కొర్రీలు, కోతలతో వీలైనంతమందికి సాయం ఎగ్గొట్టారు. నేడు సీఎం పర్యటన ఇలా.. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి, 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకుంటారు. 10.45 గంటల నుంచి 12.15 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద సాయం జమ చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటకు అక్కడి నుంచి బయలుదేరి 1.30 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. -
కాకినాడ: గొల్లప్రోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
వైఎస్సార్ కాపు నేస్తం; సీఎం జగన్ కాకినాడ జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శుక్రవారం) కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకోనున్నారు. 10.45-12.15 గంటల వరకు బహిరంగ సభా ప్రాంగణంలో ప్రసంగించి.. వైఎస్సార్ కాపు నేస్తం పథకం సహాయం విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటకు అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. 1.30 గంటలకు తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు. చదవండి: అక్కా.. సాయం అందిందా? -
జగనన్న మూడేళ్ల పాలన: పేదలకు ‘చేయూత’.. సంక్షేమ ‘బావుటా’
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి మూడేళ్లవుతోంది.. మనది హామీలను నెరవేర్చే ప్రభుత్వమని ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ మూడేళ్లలో 95 శాతం హామీలను నెరవేర్చి తనది ప్రజా ప్రభుత్వమని చాటారు. పాదయాత్ర అనుభవాలే పునాదిగా, ప్రజల ఆశలు ఆకాంక్షల్ని నెరవేర్చడమే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించిన వైఎస్ జగన్.. దాన్ని అమలు చేయాలనే దృఢ సంకల్పంతో పక్కాగా అడుగులు వేశారు. దాంతో ఆయా పథకాలు అందుకుంటున్న లబ్ధిదారుల్లో సంతోషం కనిపిస్తోంది. వారి జీవితాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వమందించే ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు గతానికి ఇప్పటికి వున్న తేడాను స్పష్టంగా చెబుతున్నారు. చదవండి: మూడేళ్ల సుపరిపాలనకు సాక్ష్యాలెన్నో! పేద కుటుంబాలను పేదరికాన్నించి బైట పడేయాలనేది అసలైన లక్ష్యం.. అందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక పథకాలను రూపొందించి అమల్లోకి తీసుకొచ్చారు. దాదాపుగా ఈ పథకాలన్నీ ప్రజాసంకల్ప పాదయాత్ర అనుభవాలతో రూపొందినవే.. వాటిలో చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం పథకాలున్నాయి. నలభై ఐదునుంచి అరవై సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలకు ప్రతి ఏడాది ఆర్థిక సాయం చేస్తే వారు ఆ డబ్బుతో కుటుంబ ఆదాయాలను పెంచుకుంటారని తద్వారా వారు పేదరికాన్నించి బైటపడాలని ఈ పథకాలను తయారు చేశారు. కాకినాడ రూరల్ తిమ్మాపురంలో చెరుకు రసం విక్రయిస్తు కుటుంబాన్ని నడిపిస్తోంది అనసూరి వెంకటలక్ష్మీ. వెంకటలక్ష్మీ, అప్పారావు దంపతులకు నలుగురు పిల్లలున్నప్పటికీ వారు ఉపాధి కోసం ఇతర ఊళ్ళకు వెళ్లిపోయారు. కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా కష్టాలు పడ్డామని అలాంటి పరిస్థితుల్లో చేయూత పథకం ఆదుకున్నదని వీరు అంటున్నారు. చేయూత ద్వారా ప్రతి సంవత్సరం అందుతున్న 18,750 రూపాయలతో వీరు ఈ చిరు వ్యాపారం చేసుకుంటున్నారు. వెంకటలక్ష్మి దంపతులకు సొంత ఇళ్లు లేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు వీరికి ఇళ్ల స్థలం లభించేలా చూశారు. చేయూతతోపాటు పలు పథకాలు వెంకటలక్ష్మి అప్పారావులాంటివారికి అందుబాటులోకి వచ్చి వీరి కష్టాలను తీరుస్తున్నాయి. నలభై ఐదు సంవత్సరాలు దాటిన పేద కుటుంబాల మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తే వారు నిలదొక్కుకుంటారనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన. అందుకోసం తయారు చేసిన పథకాలే చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం. వీటిలో చేయూతను ఉపయోగించుకున్నవారిలో కాకినాడ జిల్లా గైగోలపాడుకు చెందిన మల్లేశ్వరి కూడా వున్నారు. ఈమె భర్త చాలా కాలం క్రితమే చనిపోయారు. నలుగురు పిల్లలుంటే వారికి వివాహాలైపోయి ఇతర ప్రాంతాల్లో సెటిలైపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చేయూత పథకం ద్వారా లభిస్తున్న డబ్బుతో పచ్చళ్ల వ్యాపారం చేసి కొంతమేరకు ఆదాయం పొందుతున్నట్టు మల్లేశ్వరి అంటున్నారు. చదవండి: మూడేళ్లు.. ఎన్నో మేళ్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన పేద మహిళలకు చేయూత ఉపయోగపడుతోంది. అయితే అదే సమయంలో అగ్రవర్ణ పేద కుటుంబాల మాటేమిటి? వారిని కూడా ఆదుకోవాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నలు తలెత్తాయి.. దీనికి సమాధానంగా కాపునేస్తం, ఈబీసీ నేస్తం పథకాలను తీసుకొచ్చారు.. వీటిలో కాపునేస్తాన్ని ఉపయోగించుకొని కొంతమేరకు ఉపశమనం పొందిన వారిలో జగత జ్యోతి వున్నారు. ఈమె రెండు దశాబ్దాల క్రితమే భర్తను కోల్పోయారు. ఒక కుమార్తె వుంటే ఆమెకు వివాహమై వెళ్లిపోయిందని.. తాను మాత్రం నాలుగైదు ఇళ్లలో ఇంటి పనులు చేసుకొని బతుకుతున్నానని జ్యోతి చెబుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈమె కాపులు పేరుకే అగ్రవర్ణమని కాపుల్లో తనలాంటి పేదలు చాలా మంది వున్నారని అంటున్నారు. అగ్రవర్ణాల పేద కుటుంబాల్లో కాపులనే కాకుండా ఇతర అగ్రవర్ణాల పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఈబీసీ నేస్తం రూపొందించి అమల్లోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందినవారిలో మనం చూస్తున్న ఈ బ్రాహ్మణ కులానికి చెందిని శివరామజోగి శర్మ దంపతులున్నారు. కాకినాడ గైగోలపాడుకు చెందిన శివరామజోగిశర్మ డ్రైవర్గా పని చేస్తున్నారు. కరోనా సమయంలో ఆర్థికంగా చితికిపోయామని ఈ మధ్యనే ఈబీసీ పథకం అందిందని వీరు చెబుతున్నారు. చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం...ఈ మూడు పథకాలు నలభై ఐదునుంచి అరవై సంవత్సరాల మధ్యన వయస్సున్న పేద కుటుంబాల మహిళలకు వర్తించే పథకాలు. అరవై సంవత్సరాలు దాటిన మహిళలకు పింఛను వస్తుంది కాబట్టి అంతకంటే తక్కువ వయస్సు వున్న పేద కుటుంబాల మహిళల్ని ఆదుకుంటే అది వారి కుటుంబాల కష్టాలను తగ్గించడానికి ఉపయోగపడుతుందనేది వైఎస్ జగన్ ఆలోచన. పాదయాత్రలో ఆయనకు వచ్చిన ఈ ఆలోచన మూడు మానవీయ పథకాలుగా రూపొంది ఈ మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తోంది. ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలోని శనగపప్పు బజార్లో దాసరి కిషోర్.. కుటుంబం నివసిస్తోంది. భార్య సత్య భారతి గృహిణి.. వీరికి పూజిత అనే కూతురు.. గతంలో లారీ యజమాని అయిన దాసరి కిషోర్ వ్యాపారంలో నష్టం రావడంతో దానిని అమ్మేసి ఆటో కొనుక్కున్నారు. ప్రతి రోజూ ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దాసరి కిషోర్ కుటుంబానికి మొత్తం నాలుగు పథకాలు అందుతున్నాయి. తనకు వాహనమిత్ర, కూతురుకు అమ్మ ఒడి, తండ్రికి వైఎస్సార్ పింఛన్ కానుక, భార్యకు కాపునేస్తం పథకాలు వస్తున్నాయని.. ఇలా అందించే ప్రభుత్వం లభించడం సంతోషంగా వుందని అంటున్నాడు. కరోనా మహమ్మారితో దాదాపు రెండు సంవత్సరాలపాటు భారతదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని దాసరి కిషోర్ స్పందిస్తున్నారు. అర్హత వుంటే చాలు పథకాలు అందించాలనేది ప్రభుత్వ సంకల్పం. అంతే తప్ప ఒక కుటుంబానికి ఒక పథకం అందిస్తే సరిపోతుందిలే అని చేతులు దులుపుకోవడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ విధానపరమైన నిర్ణయం కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సామాన్య కుటుంబాలు తగిన విధంగా ఆర్ధిక అండదండలు పొందుతున్నాయి. ఇక ఇదే ఏలూరులో మరో ఆటో డ్రైవర్ కుటుంబాన్ని సాక్షి టీవీ పలకరించింది.. ఈమె చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. అన్నయ్య దివ్యాంగుడు.. తల్లికేమో వయస్సు మీద పడి తన పని చేసుకుంటే చాలు అన్నట్టుగా వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఈ కష్టాలను తలుచుకొని ఈమె కన్నీళ్లు పెట్టుకొని కుంగిపోలేదు. జీవితం.. తాను అనుకున్నట్టుగా, ఆశించినట్టుగా లేదని అదే పనిగా ఆందోళన చెందలేదు. కష్టమైన పనయినా సరే ఎలాంటి అదురు బెదురు లేకుండా ఆటో డ్రైవర్ పని చేపట్టింది. ఏలూరు నగరంలోని 43వ డివిజన్ ఏకే సెంటర్లో ఆటో డ్రైవర్ ఊట అంబిక కుటుంబం నివసిస్తోంది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ ఆటో డ్రైవర్ గా మారి ఇంటికి అండగా నిలిచింది.. ఈ పని కష్టమైనదైనప్పటికీ... తప్పనిసరి పరిస్థితుల్లో తన బిడ్డ ఈ పని చేస్తోందని..డిగ్రవీరకూ చదువుకుంది కాబట్టి ఏదైనా ఉద్యోగం వస్తే బాగుంటుందని ఈ పెద్దామె భావిస్తోంది. ప్రస్తుతం అంబికకు వాహనమిత్ర పథకం, అంబిక తల్లి ఊట నూకరత్నానికి వృద్ధాప్య పింఛన్, అంబిక అన్నయ్యకు దివ్యాంగుల పింఛన్ పథకాలు అందుతున్నాయి ఇలాంటి లక్షలాది మంది ఆటో డ్రైవర్లందరిదీ దాదాపుగా ఒకటే పరిస్థితి...బండి తిరిగితేనే బతుకు బండి నడుస్తుంది. ఆటో మీటరు తిరిగితేనే...ఇంటిల్లిపాదీ భోజనం చేయగలుగుతారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల గాధలగురించి పాదయాత్రలో తెలుసుకున్న వైఎస్ జగన్ అదే సమయంలోనే వాహనమిత్ర పథకాన్ని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ పాలన వచ్చిన తర్వాత ఆటో , ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు అండగా వుంటానని భరోసానిచ్చారు. అలా చెప్పిన మాటకు కట్టుబడి తన పాలన ప్రారంభమైన తర్వాత వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తూ ఈ సామాన్య కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. -
YSR Kapu Nestham : అక్క చెల్లెమ్మలకు ఆర్థిక దన్ను
బరువు మోస్తున్న త్యాగమూర్తులు.. అత్యంత బాధ్యతాయుతంగా ఉండే 45–60 ఏళ్ల వయసు అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే అది నేరుగా కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఈ వయసులో ఉన్నవారంతా త్యాగమూర్తులు, కుటుంబ బరువు బాధ్యతలను మోస్తున్నవారు. వారికి మేలు చేయాలనే సంకల్పంతో.. వారి చేతికే నేరుగా డబ్బులు అందించే గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతూ వరుసగా రెండో సంవత్సరం కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మా అన్నయ్య ఉన్నారనే ధైర్యం.. చాలామంది రాజకీయ నాయకులు మాటలు మాత్రమే చెప్పారు. మీరు కాపులను గుర్తించి ఒక స్ధాయిని ఇచ్చారు. గత ఏడాది లాక్డౌన్తో వ్యాపారంలో పూర్తిగా నష్టపోయా. నాకు కాపు నేస్తం వర్తిస్తుందని వలంటీర్ చెప్పడంతో ఆ పథకం ద్వారా లబ్ధి పొందా. ఒంటరి మహిళ పెన్షన్ కూడా అందుతోంది. ఇప్పుడు వ్యాపారం కూడా పుంజుకుంది. అన్నలా మీరు మాకు అండగా ఉన్నారు. పిల్లలను బాగా చదివిస్తున్నా. ఇంటి అద్దె కట్టలేక ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు నాకు ఇంటి స్థలం కూడా వచ్చింది. నాకు పుట్టింటివారు, అత్తింటివారు లేకపోయినా మా అన్నయ్య ఉన్నారన్న ధైర్యంతో ముందుకెళుతున్నాం. మేం ఏ కష్టం లేకుండా బతుకుతున్నాం అంటే మీరే కారణం. నేను పొదుపు సంఘంలో సభ్యురాలిని. చాలావరకు లబ్ధి పొందాం. నాకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ బాగా చూసుకున్నారు. నాలా ఎంతోమంది అక్కచెల్లెమ్మలు మీరు ఉన్నారని ధైర్యంగా బతుకుతున్నారు. – రుక్మిణీదేవి, లబ్ధిదారురాలు, సత్రంపాడు, ఏలూరు సాక్షి, అమరావతి: నిరుపేద కాపు అక్క చెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబనే లక్ష్యంగా వైఎస్సార్ చేయూత తరహాలో ‘వైఎస్సార్ కాపునేస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది అక్కచెల్లెమ్మలకు రూ.490.86 కోట్ల ఆర్ధిక సాయాన్ని సీఎం గురువారం తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలకు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. వరుసగా రెండో ఏడాది.. వరుసగా రెండో ఏడాది ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం రూ.15 వేలు చొప్పున ఐదేళ్లు క్రమం తప్పకుండా ఇవ్వడం ద్వారా రూ.75 వేలు వారి చేతిలో ఉంటాయి. మహిళలకు ఆర్థిక తోడ్పాటు కల్పించి వారి కాళ్ల మీద వారిని నిలబెట్టాలనే గొప్ప ఆలోచనతో ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. ఇందులో మొట్టమొదటిగా వైఎస్సార్ చేయూత ద్వారా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాం. ఏటా రూ.18,750 చొప్పున 45 నుంచి 60 ఏళ్ల వయసు అక్కచెల్లెమ్మలకు వరుసగా నాలుగేళ్ల పాటు ఇస్తున్నాం. 60 ఏళ్లు దాటితే పెన్షన్ వర్తిస్తుంది. కాబట్టి వారికి ఆ రూపంలో మేలు జరుగుతుంది. ముందుగానే చెప్పి ఇస్తున్నాం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు తోడుగా నిలుస్తూ చేయూత పథకం ద్వారా మల్టీ నేషనల్ కంపెనీలతో అనుసంధానించేలా చర్యలు చేపట్టాం. వ్యాపార అవకాశాలను మరింత మెరుగుపరచి వారికి మేలు చేయాలన్న తపనతో రిలయన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, హిందుస్తాన్ లీవర్, అమూల్ లాంటి కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఈ పెద్ద కంపెనీలు తమ వంతు ప్రయత్నం చేయగా మిగిలిన వాళ్లందరికీ కూడా కాపు నేస్తం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున ఐదేళ్ల పాటు ఇస్తూ వెళితే వ్యాపార దృక్పథంతో అడుగులు వేసే పరిస్ధితి వస్తుంది. తద్వారా వారు ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుని వ్యాపారాలు నిర్వహించాలన్న ఆలోచన కలుగుతుంది. ఏ నెలలో డబ్బులు ఇస్తున్నామో ముందుగానే చెప్పి భరోసా కల్పిస్తున్నాం. ప్రభుత్వం మాట చెబితే కచ్చితంగా ఇస్తుందనే నమ్మకం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోగలుగుతారు. వివిధ జిల్లాలకు చెందిన వైఎస్సార్ కాపు నేస్తం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న సీఎం మేనిఫెస్టోలో చెప్పకపోయినా.... వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 – 60 ఏళ్ల వయసున్న ప్రతి అక్క, చెల్లెమ్మకు ఏటా రూ.15 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు నేరుగా వాళ్ల చేతుల్లోనే పెడతాం. ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పకపోయినా కూడా ఇది చేస్తే బాగుంటుందని అమలు చేస్తున్నాం. నిండు మనసుతో కాపు అక్క,చెల్లెమ్మలకు మంచి జరగాలని చేపట్టిన కార్యక్రమమిది. ఒక్క కాపు నేస్తం ద్వారానే రూ.982 కోట్లు కాపు నేస్తం అనే ఒక్క కార్యక్రమం ద్వారా గత ఏడాది 3,27,349 మందికి రూ.491.02 కోట్ల మేర లబ్ధి చేకూరింది. రెండేళ్లలో మొత్తంగా దాదాపుగా రూ.982 కోట్లు వారి చేతుల్లో పెట్టడం జరిగింది. అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ప్రతి అడుగూ ముందుకు వేస్తున్నాం. మంచి చేసే విషయంలో ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు, మోసాలు చేయలేదు. త్వరితగతిన అడుగులు వేస్తూనే మంచి చేస్తున్నాం. మీ బిడ్డకు మీ అందరి చల్లని దీవెనలు ఉండాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మళ్లీ దరఖాస్తుకు అవకాశం.. మరో ముఖ్యమైన విషయం.. అర్హులందరికీ మేలు చేకూర్చాలనే తపన పడుతున్నాం. ఈ పథకం ఎక్కడైనా, ఎవరికైనా రాకపోతే ఆందోళన చెందొద్దు. గ్రామ సచివాలయానికి వెళ్లి మళ్లీ దరఖాస్తు చేసుకుంటే వెరిఫికేషన్ చేసి నెల రోజుల్లో అర్హులకి పథకాన్ని వర్తింపజేస్తాం. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు. మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పేర్ని వెంకట్రామయ్య (నాని), కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఆడపా శేషగిరి, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, జక్కంపూడి రాజా, జంగాలపల్లి శ్రీనివాసులు, బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ జి. అనంతరాములు, కాపు వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస శ్రీనరేష్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలనలో.. ఈ సందర్భంగా మీకు మరో విషయాన్ని చెప్పాలి. గత ప్రభుత్వ పాలనలో కాపుల సంక్షేమం కోసం సంవత్సరానికి రూ.1000 కోట్లు చొప్పున ఇస్తామని చెప్పి కనీసం రూ.400 కోట్లు కూడా ఇవ్వని పరిస్ధితిని ఒక్కసారి గుర్తు చేసుకోమని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు 15 రెట్లు అధికంగా.. ఈ రెండు సంవత్సరాల కాలంలో మీ అందరి చల్లని దీవెనలతో ఏర్పడిన మీ అందరి ప్రభుత్వం, మీ అన్న, తమ్ముడి ప్రభుత్వం దాదాపు రూ.12,125 కోట్లను నేరుగా కాపు అక్కచెల్లెమ్మలు, కాపు సోదరుల చేతుల్లో పెట్టగలిగింది. రెండేళ్లలో వివిధ పథకాల ద్వారా 59,63,408 మందికి గత ప్రభుత్వం కన్నా 15 రెట్లు అధికంగా సహాయం చేశాం. ఈ డబ్బులను పాత అప్పులు, బకాయిలకు జమ చేసుకోవద్దని బ్యాంకులతో ఇప్పటికే మాట్లాడాం. కాపులకు రెండేళ్లలో రూ.12,125 కోట్లు.. వివిధ పథకాల కింద ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రత్యక్ష నగదు బదిలీ, నగదేతర బదిలీల ద్వారా 59,63,408 మందికి మేలు జరిగేలా రూ.12,124.57 కోట్లను కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేశామని సగర్వంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ ఒక్క రూపాయి కూడా అవినీతి, వివక్షకు తావు లేకుండా నేరుగా బటన్ నొక్కి పారదర్శకంగా అందచేస్తున్నాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు జరగాలనే లక్ష్యంతో పనిచేశాం. 47,88,763 మందికి నేరుగా దాదాపు రూ.9,359 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాం. రెండేళ్లలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసిన సాయం వివరాలు ఇవీ.. నగదేతర బదిలీ (నాన్ డీబీటీ)... ► నాన్ డీబీటీ స్కీంలు తీసుకుంటే వైఎస్సార్ జగనన్న ఇళ్ల పట్టాల కార్యక్రమం ద్వారా 2,56,424 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,160 కోట్ల విలువైన ఇళ్లపట్టాలు ఇవ్వగలిగాం. ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 1,16,797 మందిని రూ.289 కోట్లతో ఆదుకున్నాం. ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 1,50,800 మంది అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు మంచి జరిగేలా రూ.144 కోట్లు ఖర్చు చేశాం. ► జగనన్న గోరుముద్ద ద్వారా 2,84,024 మంది పిల్లలకు రూ.123 కోట్ల ఖర్చుతో మంచి చేశాం. ► జగనన్న విద్యా కానుక ద్వారా 3,66,600 మందికి రూ.50 కోట్లు ఖర్చు చేశాం. ► మొత్తంగా నాన్ డీబీడీ విధానంలో 11,74,645 మందికి రూ.2766 కోట్లు ఖర్చు చేశాం. ► డీబీటీ, నాన్ డీబీటీ రెండూ కలిపి రెండేళ్లలో 59,63,408 మందికి మేలు చేస్తూ దాదాపు రూ.12,125 కోట్లు వెచ్చించాం. అన్నయ్య రాఖీ కానుక మాకు జిరాక్స్ షాప్ ఉంది. మేం కాపులమని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే మీరే కారణం. మాట ఇచ్చి అమలు చేస్తున్నారు. కాపు నేస్తం ద్వారా వచ్చిన డబ్బులతో శారీ డిజైనింగ్ పెట్టుకున్నా. డ్వాక్రాలో కూడా లబ్ధి పొందా. నా కాళ్లమీద నిలబడి బతకగలననే ధైర్యం వచ్చింది. ఇళ్ల పట్టా కూడా వచ్చింది. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మిమ్మల్ని ఆహ్వానిస్తా. తప్పకుండా రావాలన్నా. మా తమ్ముడికి వాహనమిత్ర వచ్చింది. వారి పిల్లలకు అమ్మ ఒడి అందింది. నాకు ఇప్పుడు ఇస్తున్న డబ్బులను మా అన్నయ్య రాఖీ కానుకగా ముందుగానే ఇస్తున్నారని భావిస్తున్నా. మమ్మల్ని ఇంతగా గుర్తించిన మీకు కాపు మహిళల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. – తలాటం కాళీప్రియ, లబ్ధిదారు, కాకినాడ మీ స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లోనూ.. మాకోసం నవరత్నాలను తెచ్చి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. మీరు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి పొరుగు రాష్ట్రాల వారు కూడా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. మీరు మిగతా నాయకుల్లా కాదు. మాట ఇచ్చారంటే కచ్చితంగా అమలు చేస్తారు. కరోనా కష్టకాలంలోనూ ప్రతీ పథకాన్ని అమలు చేస్తున్నారు. కాపులకు ఒక స్నేహితుడిలా దగ్గరై మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. నాకు రైతు భరోసా అందింది. జలకళ ద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుంది. మీరు సీఎంగా వచ్చిన వేళా విశేషం వర్షాలు బాగా పడుతున్నాయి. రాయలసీమలో అన్ని చెరువులు, బావులు నిండాయి. – అమరావతి, లబ్ధిదారు, పెద్దిశెట్టిపల్లి గ్రామం, చిత్తూరు జిల్లా మనసుతోనే ముఖ్యమంత్రి పాలన.. ‘సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి వైఎస్ జగన్ ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా 59 లక్షల మంది కాపు సోదర, సోదరీమణులకు రూ.12 వేల కోట్ల లబ్ధి కలిగించారు. పేరుకే అగ్రవర్ణాల్లో ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనుకబాటుతనంలో ఉన్న కాపు కులస్తులను జగన్.. ఎన్నికల ముందు ఓట్ల కోసం మాటల ఎర వేయకుండా ప్రేమతో తను చేయగలిగే ప్రతి పనిని తెలియజేశారు. గత ప్రభుత్వం లాగా మోసం చేయకుండా.. చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునేందుకు ఐదేళ్లలో ప్రతి కాపు సోదరీమణికి రూ.75 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. కాపు నేస్తం డబ్బుతో వారు స్వయంశక్తితో ఎదిగేలా సిద్ధమయ్యారు. మీ పాలన మనసుతో చేస్తున్నారని రుజువైంది’ అని మంత్రులు పేర్ని నాని, చెల్లుబోయిన అన్నారు. -
సాక్షి బిగ్ బైట్
-
అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ‘వైఎస్సార్ కాపునేస్తం’ లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. వరుసగా రెండో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లోకి నగదు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ‘వైఎస్సార్ కాపునేస్తం’ లబ్దిదారులు.. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కాపులు బీసీలా? ఓసీలా? అన్న అయోమయానికి గురిచేసిందన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా న్యాయ వివాదాలు సృష్టించిందని తెలిపారు. దాని వల్ల అగ్రవర్ణ పేదలకు ప్రయోజనాలు అందని పరిస్థితి ఏర్పడిందని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్లతో కాపులకు మేలు జరుగుతుందని, విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
సుమారు 12వేల కోట్ల మేర కాపులకు లబ్ధి చేకూరింది: పేర్ని నాని
సాక్షి, అమరావతి: ఇచ్చిన ప్రతిమాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని మంత్రి పేర్నినాని అన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా 59 లక్షల మందికిపైగా కాపులకు లబ్ధి పొందారని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేసింది. అందులో భాగంగా గురువారం అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లో డబ్బు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సుమారు 12వేల కోట్ల మేర కాపులకు వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా లబ్ధి చేకూరిందని తెలిపారు. కరోనా కష్టకాలంనూ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. చెప్పిన ప్రతిమాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారని పేర్నినాని పేర్కొన్నారు. -
కాపుల్లో నిరుపేదల ఉన్నవారికి 'వైఎస్ఆర్ కాపు నేస్తం' అందిస్తున్నాం: సీఎం వైఎస్ జగన్
-
నా కాళ్ల మీద నేను బ్రతకగలను అనే భరోసా వచ్చింది
-
‘జగనన్న ఉన్నాడనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాం’
సాక్షి, అమరావతి: వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు రూ. 490. 86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేసింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ లబ్ధిదారు సీఎం వైఎస్ జగన్ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ప్రభుత్వం తమకు అందిస్తున్న చేయూత గురించి ఆమె మాటల్లోనే.. ‘‘జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పాఠ్యాంశంగా పెడితే పెద్ద పుస్తకం అవుతుంది అంటున్నారు మా పిల్లలు. సీఎం తీసుకొచ్చిన పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి పథకం అందరికి పారదర్శకంగా.. అవినీతికి తావు లేకుండా ప్రతి రూపాయి లబ్ధిదారులకు చేరుతుంది. గతంలో ఎందరో ఎన్నో వాగ్దానాలు చేశారు.. కానీ నిలబెట్టుకోలేదు. కానీ సీఎం జగన్ ఒక్కసారి మాట ఇస్తే.. తప్పకుండా నిలబెట్టుకుంటారు’’ అని ప్రశంసించారు. ‘‘కరోనా వల్ల ప్రపంచ దేశాలన్ని భయపడుతున్నాయి. కానీ ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా ప్రజల కష్టాలను మీరు తీసుకుని.. ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. గతంలో కొందరు కాపుల కోసం అది చేస్తాం.. ఇది చేస్తాం అన్నారు. కానీ ఎవరు ఏం చేయలేదు. కానీ సీఎం జగన్ కాపులకు, ముఖ్యంగా కాపు మహిళలకు చేయూతనిస్తున్నారు. ఇంటికి దీపం ఇల్లాలు. కానీ సీఎం జగన్ అందరి ఇళ్లలో వెలుగు నింపుతున్నారు. రైతు భరోసా పథకాన్ని రెండేళ్ల నుంచి పొందుతున్నాను. ఉచిత బోరు చిన్నకారు రైతులకు ఎంతో మేలు చేస్తుంది. సీమలో నీటి ఎద్దడి గురించి అందరికి తెలుసు. కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక వర్షాలే వర్షాలు. రెండేళ్ల వరకు నీటికి సమస్యలేదు’’ అని తెలిపారు. పశ్చిమగోదావరి ఏలూరు కలెక్టరేట్ నుంచి కాపు నేస్తం మహిళా లబ్దిదారు మాట్లాడుతూ.. ‘‘జగనన్న వచ్చిన తర్వాత మా కోసం నిధులు కేటాయించడం సంతోషం. గతంలో మాకోసం ఎవరూ చేయని ఆలోచన చేశారు. ఎవరూ రూపాయి ఇవ్వలేని టైమ్లో మీరు అమలు చేసిన పథకాలతో ఊపిరి తీసుకున్నాం. ఎలాంటి కష్టలేకుండా బ్రతుకున్నాం. డ్వాక్రా గ్రూప్లో చేరాం.. ఒక అన్నయ్య ఉన్నాడనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాం. కోవిడ్ టైమ్లో కూడా మీరు పథకాలు అమలు చేసి చూపించారు’’ అని ప్రశంసించారు. తూర్పు గోదావరి కలెక్టర్ నుంచి మరో మహిళా లబ్దదారు మాట్లాడుతూ.. ‘‘ఇంతవరకూ కాపుల కోసం ఎవరూ ఆలోచించలేదు. నా కాళ్ల మీద నేను బ్రతకగలను అనే భరోసా వచ్చింది. సీఎం జగన్ అధికారంలోకి రాకముందు ఎలా బ్రతకాలనేది తెలియదు.. కానీ ప్రభుత్వం మా కోసం పథకాలు అమలు చేసిన తర్వాత బ్రతగలననే ధైర్యం వచ్చింది. కాపు నేస్తం ప్రవేశపెట్టడం కరోనా కష్టకాలంలో చాలా ఉపయోగపడింది. నాకు అమ్మ ఒడి పథకం కూడా అందింది. నాకు ఒక అన్నయ్య ఉన్నాడనే అనుకుంటున్నాను. తూర్పు గోదావరి జిల్లా కాపు మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అన్నారు. -
జగనన్న వచ్చిన తర్వాత తమ కోసం నిధులు కేటాయించడం సంతోషం
-
మీరు తీసుకొచ్చిన పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి
-
ఆ విషయంలో చరిత్రలోనే మొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్
-
కాపులకు ఎన్నికల ముందు ఏం చెప్పారో అది చేసి చూపిస్తున్నారు
-
రెండేళ్లలో 'వైఎస్ఆర్ కాపు నేస్తం' కింద రూ.12,126 కోట్లు అందించాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేసింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లో డబ్బు విడుదల చేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్కమ్బర్డ్ ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే... అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబననే లక్ష్యం. ఈ రోజు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నిరుపేదలుగా ఉన్న కాపు అక్కచెల్లెమ్మలకు ఆర్ధికంగా వాళ్ల కాళ్లమీద నిలబడే పరిస్ధితి రావాలి. వాళ్లకు ఆర్ధిక స్వావలంబన రావాలి అని ఈ పథకాన్ని తీసుకువచ్చాం. వైఎస్సార్ చేయూత మాదిరిగానే వైఎస్సార్ కాపునేస్తం తీసుకువచ్చాం. వరుసగా రెండో ఏడాది కాపునేస్తం రెండో ఏడాది ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే.. ప్రతి ఏటా వరుసగా క్రమం తప్పకుండా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం రూ.15 వేలు చొప్పున 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఇస్తే రూ.75 వేలు అక్కచెల్లెమ్మల చేతిలో ఉంటుంది. తన కాలు మీద తను కచ్చితంగా నిలబడగలుగుతారనే గొప్ప ఆలోచనలోంచి ఈ పథకం పుట్టింది. ఇందులో మొట్టమొదటిగా చేయూత ద్వారా ప్రతి ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాం. రూ.18,750 చొప్పున 45 నుంచి 60 సంవత్సరాల వయస్సులో ఉన్న అక్కచెల్లెమ్మలకు వరుసగా నాలుగేళ్లు పాటు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 60 యేళ్లు దాటిపోతే వాళ్లకు పెన్షన్ వర్తిస్తుంది. వారికి ఈ రూపంలో మేలు జరుగుతుంది. 45 నుంచి 60 ఏళ్లు మహిళలు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడగలుగుతారు అనే దృక్పధంతో అడుగులు ముందుకు వేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు తోడుగా చేయూత పథకంలో మల్టీ నేషనల్ కంపెనీలతో టై అప్ చేసే కార్యక్రమం చేశాం. వాళ్లకు మరింత వ్యాపార అవకాశాలు మెరుగుపర్చాలన్న తపనతో రిలయన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, హిందుస్తాన్ లీవర్, అమూల్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం చేశాం.ఈ పెద్ద కంపెనీలు చేయగా మిగిలిన వాళ్లందరికీ కూడా ఏటా రూ.15వేలు ఇస్తూ వెళితే వ్యాపార దృక్పథంతో అడుగులు వేసే పరిస్ధితి వస్తుంది. తద్వారా వారు ప్రణాళిక వేసుకోగలుగుతారు. వ్యాపారాలు చేసుకోవాలన్న ఆలోచన వారికి కలుగుతుంది. ఏ నెల్లో ఇస్తున్నాం అన్నది ముందుగానే చెప్తున్నాం, వారిలో భరోసాను కల్పిస్తున్నాం. ప్రభుత్వం మాట చెపితే కచ్చితంగా ఇస్తుందనే నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో, తద్వారా ఆర్థికంగా వారు ప్రణాళిక వేసుకోగలుగుతారు. కుటుంబ బరువు మోసే త్యాగమూర్తులు అలాంటి కార్యక్రమంలో భాగంగానే 45 నుంచి 60 యేళ్ల వయసులో అత్యంత బాధ్యతాయుతంగా ఉండే అక్క, చెల్లెమ్మల చేతిలో పెడితే అది నేరుగా కుటుంబానికే ఉపయోగపడుతుంది. ఈ వయస్సుల్లో ఉన్నవారు త్యాగమూర్తులు, కుటుంబ బరువు బాధ్యతలను మోస్తున్నవారు. వాళ్లకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే వాళ్ల చేతుల్లో నేరుగా డబ్బులు పెట్టే గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతూ వరుసగా రెండో సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పకపోయినా.... వైయస్సార్ కాపు నేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45–60 సంవత్సరాల వయస్సులో ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మకు ఐదేళ్ల కాలంలో రూ.15వేలు చొప్పున రూ.75వేలు నేరుగా వాళ్ల చేతుల్లోనే పెడుతున్నాం. ఈ కార్యక్రమం మన మేనిఫెస్టోలో చేస్తామని చెప్పకపోయినా కూడా ఇది చేస్తే బాగుంటుందని అమలు చేస్తున్నాం. నిండు మనస్సుతో కాపు అక్క,చెల్లెమ్మలకు మంచి జరగాలని చేపట్టిన కార్యక్రమమిది. గత ప్రభుత్వ పాలనలో ఈ సందర్భంగా మరో విషయం గుర్తు తెచ్చుకోవాలి, మీకు చెప్పాలి. ఇంతకు ముందు గత ప్రభుత్వ పరిపాలనలో ఇదే కాపుల సంక్షేమం కోసం గతంలో సంవత్సరానికి రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పి, కనీసం రూ.400 కోట్లు కూడా ఇవ్వని గత ప్రభుత్వ పరిస్ధితిని ఒక్కసారి గుర్తుచేసుకోమని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రెండేళ్ల కాలంలో ఈ రెండు సంవత్సరాల కాలంలో మీ అందరి చల్లనిదీవెనలతో ఏర్పడిన మీ అందరి ప్రభుత్వం, మీ అన్న, తమ్ముడి ప్రభుత్వం అక్షరాలా రూ.12,126 కోట్లు నేరుగా కాపు అక్కచెల్లెమ్మలు, సోదరుల చేతుల్లో పెట్టగలిగాం. ఈ రోజు 3,27,244 మంది అక్కచెల్లెమ్మలకు వైయస్సార్ కాపునేస్తం కార్యక్రమంలో బటన్ నొక్కిన వెంటనే నేరుగా రూ.490.86 లక్షల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి జమ అవుతాయి. ఈ రెండు సంవత్సరాల్లో అక్షరాల వివిధ పథకాల ద్వారా 59,63,308 మందికి గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా 15 రెట్లు మేర రూ. 12,126.78 కోట్లు సహాయం చేశాం. ఈ డబ్బులను పాత అప్పులకు, బకాయిలకు జమచేసుకోవద్దని బ్యాంకులతో ఇప్పటికే మాట్లాడాం. కాపు నేస్తం అనే ఒక్క కార్యక్రమం ద్వారా ఈ రెండు సంవత్సరాల్లో చూస్తే... గత ఏడాది 3,27,349 మందికి రూ. 491.02 కోట్ల మేర లబ్ధి చేకూరింది. రెండేళ్లలో మొత్తంగా దాదాపుగా రూ. 982కోట్లు వారి చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది. వివిధ పథకాలు–లబ్ధి వివిధ పథకాల కింద ఈ రెండు సంవత్సరాల కాలంలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్( డీబీటీ), నాన్ డీబీటీల ద్వారా 59,63,308 మందికి మేలు జరిగేలా రూ. 12,126.78 కోట్ల మేర కాపులకోసం ఖర్చు చేశాం అని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఈ రెండు సంవత్సరాల కాలంలోనే కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా మన ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నేరుగా వారి అకౌంట్లలోకి పంపించిన కార్యక్రమాల ఖాతాల వివరాలను పరిశీలిస్తే... ►వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా 7,85,700 మంది లబ్ధిదారులకు రూ.2550 కోట్లు ఖర్చు చేశాం. ►వైఎస్సార్ పెన్షన్ కానుక 4,11,331 లబ్దిదారులకు రూ. రూ.2384 కోట్లు. ►జగగన్న అమ్మఒడి 3,81,185 మంది లబ్దిదారులుకు రూ.1143 కోట్లు. ►వైఎస్సార్ కాపునేస్తం ద్వారా 3,27,349 మంది అక్కచెల్లెమ్మలకు రూ.982 కోట్లు. ►వైఎస్సార్ ఆసరా ద్వారా 7,04048 మంది అక్కచెల్లెమ్మలకు రూ.654 కోట్లు ఇవ్వగలిగాం. ►జగనన్న విద్యాదీవెన ద్వారా 1,28,119 మందికి రూ.354 కోట్లు ►వైఎస్సార్ ఉచిత పంటలబీమా ద్వారా 3,04,451 మంది రైతన్నలుకు రూ.371 కోట్లు ►జగనన్న వసతి దీవెన ద్వారా 96,739 మంది అక్కచెల్లెమ్మలకు రూ.189 కోట్లు. ►వైఎస్సార్ సున్నావడ్డీ కింద 8,42,854 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 202 కోట్లు ►రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కింద 1,71,360 మంది రైతన్నలకు రూ.132 కోట్లు ►వైఎస్సార్ బీమా ద్వారా 8151 మంది రైతన్నలకు రూ.132.87 కోట్లు ►వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు ద్వారా 5,42,523 రైతన్నలకు రూ.102 కోట్లు. ►వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా 29957 మంది అన్నదమ్ములకు రూ.84 కోట్లు ►విదేశీ విద్యాదీవెన ద్వారా 533 మందికి రూ.29.45 కోట్లు ►డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యఆసరా కింద 37765 మందికి రూ. 22.85 కోట్లు ►జగనన్న చేదోడు ద్వారా 14,121 మంది రూ.14 కోట్లు ►వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా కూడా 2577 మందికి రూ.12.40 కోట్లు వాళ్ల చేతిలో పెట్టాం. ఒక్క రూపాయి అవినీతి, వివక్ష లేకుండానే నేరుగా బటన్ నొక్కి ఆధార్ నెంబర్తో సహా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా, వివిక్షకు తావులేకుండా పారదర్శకంగా చేశాం. ప్రతి లబ్ధిదారుడికిమేలు జరిగేలా చేశాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు జరగాలి, అనర్హత ఉన్నవారికి వెళ్లకూడదన్న లక్ష్యంతో పనిచేశాం. అక్షరాలా 47,88,663 మందికి నేరుగా రూ.9359 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాం. నాన్ డీబీటీ ♦నాన్ డీబీటీ స్కీంలు తీసుకుంటే... వైఎస్సార్ జగనన్న ఇళ్ల పట్టాల కార్యక్రమం ద్వారా 2,56,424 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2160 కోట్లతో ఇళ్లపట్టాలు ఇవ్వగలిగాం. ♦వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 1,16,797 మందిని రూ.289 కోట్లతో ఆదుకున్నాం. ♦వైఎస్సార్ సంపూర్ణపోషణ ద్వారా 1,50,800 మంది అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు మంచి జరిగేలా రూ.144 కోట్లు ఖర్చు చేశాం. ♦జగనన్న గోరుముద్ద ద్వారా 2,84,024 మంది పిల్లలకు రూ.123 కోట్లు ఖర్చుతో మంచి చేశాం. ♦జగనన్న విద్యా కానుక ద్వారా 3,66,600 మందికి మరో రూ.50 కోట్లు చేశాం. మొత్తంగా చూస్తే నాన్ డీబీడీ విధానంలో 11,74,645 మంది రూ.2766 కోట్లు ఖర్చు చేసాం. ♦రెండూ కలిపి చూస్తే ఈ రెండేళ్లలో 59,63,308 మందికి మేలు చేస్తూ... రూ.12126 కోట్లు రూపాయలు వెచ్చించాం. ♦దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డగా మీకు అందించగలిగాను. ♦అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ప్రతి అడుగూ ముందుకు వేసుకుంటూ వచ్చాం. ♦మంచి చేసే విషయంలో ఎక్కడా అబద్దాలు చెప్పలేదు, మోసాలు చేయలేదు. త్వరితగతిన అడుగులు వేస్తూనే మంచి చేస్తున్నాం. ♦మీ బిడ్డకు మీ అందరకి చల్లని దీవెనులు ఉండాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నెల రోజుల గడువు మరో ముఖ్యమైన విషయం ఈ పథకం ఎవరికైనా, ఎక్కడైనా రాకపోయినా భయపడొద్దు. గ్రామ సచివాలయానికి వెళ్లి మరలా దరఖాస్తు పెట్టుకుంటే వెరిఫికేషన్ చేసి నెలరోజుల్లో మరలా అర్హులకి ఈ పధకాన్ని వర్తింపజేస్తాం అని సీఎం తన ప్రసంగం ముగించారు. అనంతరం కంప్యూటర్లో బటన్ నొక్కి వైఎస్సార్ కాపునేస్తం లబ్ధిదదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రవాణా, ఐ అండ్ పీఆర్ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఆడపా శేషగిరి, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, జక్కంపూడి రాజా, జంగాలపల్లి శ్రీనివాసులు, బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ జి.అనంతరాములు, ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఐ శ్రీనివాస శ్రీనరేష్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. -
వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపునేస్తం అమలు
-
నేడు రెండో ఏడాది కాపునేస్తం
-
కోవిడ్ కష్టాల్లోనూ నేడు రెండో ఏడాది కాపునేస్తం
సాక్షి, అమరావతి: ప్రపంచం యావత్తు కోవిడ్తో తల్లడిల్లిపోతోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గినప్పటికీ, ముందుగా ఇచ్చిన మాట మేరకు మేనిఫెస్టోను నిక్కచ్చిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నవరత్నాల క్యాలెండర్ ప్రకారం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం అమలుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి వారి ఖతాలకు డబ్బు జమ చేయనున్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్కమ్బర్డ్ ఖాతాల్లో నగదు జమ చేయాలని సూచించారు. ఐదేళ్లలో రూ.75,000 ► వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. ► ఈ పథకం ద్వారా గత ఏడాది 3,27,349 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.491.02 కోట్లు జమ చేయగా, నేడు 3,27,244 మంది పేద కాపు అక్కచెల్లెమ్మలకు అందిస్తున్న రూ.490.86 కోట్లతో కలిపి మొత్తం రూ.981.88 కోట్ల లబ్ధి కలుగుతుంది. ఈ కులాల్లోని పేద అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులేస్తోంది. ► గత ప్రభుత్వం ఈ కులాలకు వివిధ రూపాల్లో ఏటా సగటున ఇచ్చింది కేవలం రూ.400 కోట్లు మాత్రమే. కానీ జగన్ ప్రభుత్వం రెండేళ్లలోనే 59,63,308 మందికి 15 రెట్లు ఎక్కువగా రూ.12,126.78 కోట్ల లబ్ధి చేకూర్చింది. ► గత ప్రభుత్వం కాపు కులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దక్కకుండా చేసిన పరిస్థితిని వైఎస్ జగన్ ప్రభుత్వం సరిదిద్దింది. తద్వారా వీరికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు దక్కాయి. -
రేపే కాపు నేస్తం రెండో విడుత.. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 15 వేలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలుకు రంగం సిద్ధమైంది. గతేడాది శ్రీకారం చుట్టుకున్న ఈ పథకం ఈ ఏడాది కూడా అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కాపు, బలిజ, ఒంటరి, తెలగ పేద మహిళలకు ఈ పథకం వరం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి నవెంటనే కాపు పేద మహిళలకు ఆపన్న హస్తం అందించనున్నట్లు ప్రకటించారు. తానిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వెంటనే కసరత్తు చేయించారు. గత ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం పేరిట పథకానికి తొలి అడుగు వేశారు. ఈ సామాజిక వర్గంలోని పేద మహిళల మోమున చిరునవ్వులు పూయించారు. ఈ ఏడాదీ వాస్తవానికి కరోనా పరిస్థితి వీడలేదు. ఆర్థిక పరిస్థితులూ సహకరించకున్నా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమలుపై సీఎం నిబద్ధత ప్రదర్శిస్తున్నారు. పథకాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం మహిళల ఖాతాల్లోకి వైఎస్సార్ కాపునేస్తం సొమ్ములు నేరుగా జమకానున్నాయి. రెండో ఏడాది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 3,27,244 మంది అక్కాచెల్లెమ్మలకు రూ.490.86 కోట్ల ఆర్థికసాయం అందనుంది. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్ఇన్కంబర్డ్ ఖాతాల్లో నగదు జమ కానుంది. ప్రతి ఏటా రూ.15వేల చొప్పున అయిదేళ్లలో రూ.75వేల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందించనుంది. -
అర్హులందరికీ ‘వైఎస్సార్ కాపు నేస్తం’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో భాగంగా కొత్తగా అర్హులైన 95,245 మంది మహిళా లబ్ధిదారులకు రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.142.87 కోట్లను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి నగదును రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ శనివారం విజయవాడలో ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా కొత్తగా గుర్తించిన మహిళా లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశారు. మొదటి విడతలో ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హత ఉండి అనుకోని కారణాల వల్ల దరఖాస్తు చేయని వారికి, అందుబాటులో లేని వారికి, జాబితాలో పేర్లు లేని వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా కొత్తగా 95,245 మంది మహిళా లబ్ధిదారులను గుర్తించి రూ.142.87 కోట్లను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు 2,35,360 మంది కాపు మహిళా లబ్ధిదారులకు రూ.353 కోట్లను విడుదల చేయడం తెలిసిందే. వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా 2019–20 సంవత్సరానికి గాను మొత్తంగా 3,30,605 మంది లబ్ధిదారులకు రూ.495.87 కోట్లను ప్రభుత్వం ఆర్థిక సాయం కింద అందించినట్లైంది. లబ్ధిదారులకు చెక్కు ఇస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి తదితరులు అవినీతికి తావులేని విధంగా పేదలకు ఆర్థిక సాయం ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతికి తావులేని విధంగా పేదలకు ఆర్థిక సాయం అందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శ పాలకుడిగా నిరూపించుకున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ల నుంచి 5% కాపులకు ఇస్తున్నానని చెప్పి వారిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. కాపులు వారి సమస్యలపై ఉద్యమిస్తే.. కేసులు పెట్టి వేలాది మందిని చంద్రబాబు జైళ్లలో పెట్టించారని, ఆ కేసులన్నీ ముఖ్యమంత్రి జగన్ ఎత్తివేశారని తెలిపారు. 16 నెలల కాలంలో కాపులకు రూ.5,542 కోట్లు నేరుగా ఆర్థిక సాయం అందించిన ఘనత జగన్దేనన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రజా మేనిఫెస్టో అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. గుంటూరు జిల్లా నుంచి వచ్చిన కాపు మహిళలు శ్రీనివాసమ్మ, రమాదేవి, పి.లక్ష్మి మాట్లాడుతూ కాపులకు వరాల జల్లు కురిపించింది వైఎస్ జగన్ ఒక్కరేనన్నారు. కాపు కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస శ్రీనరేష్ అధ్యక్షత వహించగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కులాల మధ్య చంద్రబాబు చిచ్చు..
సాక్షి, విజయవాడ: కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టి కాపులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ధ్వజమెత్తారు. శనివారం ‘వైఎస్సార్ కాపు నేస్తం’ రెండో విడత కార్యక్రమాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజాతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ అర్హులను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కాపు నేస్తం పథకం ద్వారా కాపుల్లో వెనుకబడిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. (చదవండి: 56 బీసీ కార్పొరేషన్లకు 672 మంది డైరెక్టర్లు) ‘‘కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే కేసులు పెట్టి కాపు ఉద్యమకారులను చంద్రబాబు జైళ్లలోకి నెట్టారు. పేదలు ఎవరూ పేదరికంలో మగ్గిపోకూడదని సంక్షేమ పథకాల సంస్కరణలను సీఎం జగన్ అమలు చేస్తున్నారు. కాపు నేస్తం పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అమలు అయ్యేలా చర్యలు చేపడుతున్నాం. కాపులను బీసీల్లో చేరుస్తామని సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు కాపులను మోసం చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలను నాడు జగన్ ఇవ్వలేదు. స్వార్థం కోసం పథకాలను చంద్రబాబు అమలు చేశారు. 5548 కోట్లు ప్రత్యక్ష లబ్ధిదారులకు అందేలా కాపు నేస్తం పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. దేవతలు యజ్ఞం తలపెడితే రాక్షసులు అడ్డుపడినట్లు రాష్ట్రంలో చంద్రబాబు అడ్డుపడుతున్నారని’’ వేణుగోపాల్ మండిపడ్డారు. (చదవండి: తూర్పులో వేణునాదం) చంద్రబాబు మోసం చేశారు.. జక్కంపూడి రాజా మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. 5 వేల కోట్లు కాపులకు కేటాయిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు విస్మరించారని, అమలు చేయమంటే కేసులు పెట్టి జైళ్లలో పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు అనుగుణంగా కాపుల సంక్షేమం కోసం సంవత్సరానికి 2 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని ఆయన తెలిపారు. -
‘వైఎస్సార్ కాపు నేస్తం’ రెండో విడత ప్రారంభం
-
‘వారి గురించి మాట్లాడే అర్హత పవన్కు లేదు’
సాక్షి, తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు దుయ్యబట్టారు. ఇంకా టీడీపీ మత్తు నుంచి పవన్ బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘వైఎస్సార్ కాపు నేస్తం’పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. గత ఐదేళ్లలో కాపు సామాజిక వర్గం పట్ల చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ రాక్షసంగా వ్యవహరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఏడాదికి రూ. వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. ఐదు వేల కోట్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని కానీ ఐదేళ్లలో కాపులకు ఖర్చుచేసింది కేవలం రూ. 1800 కోట్లు మాత్రమేనని అంబటి వివరించారు. (పవన్ కల్యాణ్కు ఎందుకీ ఉక్రోషం?) ఆ రోజు పవన్ ఎక్కడున్నారు? ‘కాపులపై శ్వేత పత్రం విడుదల చేయాలంటున్న పవన్ కాపు సామాజిక వర్గాన్ని పచ్చి మోసం చేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదు? రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు మోసం చేసిన విషయం గుర్తులేదా? గత ప్రభుత్వం ముద్రగడ కుటుంబాన్ని వేధించి అరెస్ట్ చేస్తే పవన్ ఎందుకు నోరు మెదపలేదు? దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, పల్లం రాజు మిగతా కాపు పెద్దలు ముద్రగడకు మద్దతుగా సమావేశమైన రోజున పవన్ ఎక్కడున్నారు? కాపులపై తప్పుడు కేసులు పెట్టినప్పుడు పవన్ ఎందుకు నోరు మెదపలేదు? కాపులపై చంద్రబాబు తప్పుడు కేసులు పెడితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కేసులను ఎత్తివేశారు. (అప్పటికి.. ఇప్పటికీ తేడా చూడండి) మోసం చేసిన బాబును భజాన మోశారు కాపులను చంద్రబాబు మోసం చేసిన దాంట్లో పవన్కు కూడా భాగస్వామ్యం ఉంది. కాపుల గురించి మాట్లాడే అర్హత పవన్కు లేదు. వారిని మోసం చేసిన చంద్రబాబును భుజాన మోశారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏమి చెప్పామో అదే చేస్తాము. కాపులను మోసం చేయాలనే ఆలోచన మాకు లేదు. అధికారంలోకి వచ్చిన ఈ 13 నెలల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 4 కోట్ల మందికి రూ.43 వేల కోట్లు ఖర్చు చేసింది. కాపుల్లో వెనకబాటుతనం తొలగించేందుకు రూ. 4770 కోట్లను 13 నెలల్లో వివిధ రూపాల్లో ప్రభుత్వం ఖర్చు చేసింది. ('ఆహా..! లోకేష్ ఏం మాట్లాడుతున్నాడు') మేనిఫెస్టోలో పెట్టలేదు.. అయినా కాపు మహిళలకు చేదోడు వాదాడోగా ఉండటం కోసం సీఎం జగన్ ‘వైఎస్సార్ కాపు నేస్తం’ కార్యక్రమం ప్రారంభించారు. ఈ పథకం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అర్హత కలిగిన ప్రతి కాపు మహిళకు ‘కాపు నేస్తం’ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఈ పథకానికి ఇంకా సమయం ఉంది. ఎవరైనా అర్హత ఉండి దరఖాస్తు చేసుకోకపోతే చేసుకోండి. ‘కాపు నేస్తం’ కోసం ఎవరైన అప్లై చేయకపోతే పవన్, చిన్నరాజప్పలు దగ్గరుండి దరఖాస్తు చేయించాలి’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. (రైతులు రూపాయి కడితేచాలు) -
పవన్ కల్యాణ్కు ఎందుకీ ఉక్రోషం?
సాక్షి, విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురుసాల కన్నబాబు అన్నారు. కాపు నేస్తంపై పవన్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాపులను మోసం చేసిన చంద్రబాబు నాయుడును ఆయన ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. మంత్రి కన్నబాబు శనివారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కుల ప్రస్తావన లేకుండా పవన్ రాజకీయాలు చేయలేకపోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘కాపులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. కాపు నేస్తం పథకం కింద మహిళలకు ఆర్థిక సాయం చేశాం. ఏడాది కాలంలో కాపులకు రూ.4,769 కోట్లు ఆర్ధిక సాయం చేశాం. మంచి చేస్తున్న ప్రభుత్వంపై పవన్కు ఎందుకంత ఉక్రోషం. ఓర్వలేనితనంతోనే అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. గతంలో కాపుల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే చంద్రబాబు అణచివేశారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళలను బూతుల తిట్టడమే కాకుండా వారిపై కేసులు పెట్టారు.కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన ముద్రగడ్డ పద్మనాభం, ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు సర్కార్ అవమానించినప్పుడు పవన్ ఎక్కడున్నారు?. చంద్రబాబు హయాంలో పవన్కు కళ్లు కనిపించలేదు. చంద్రబాబు పట్ల తన ప్రేమను దాచుకోలేకపోతున్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. కాపు సామాజిక వర్గానికి ఎవరు మేలు చేశారో ఇప్పటికైనా పవన్ తెలుసుకోవాలి’ అని హితవు పలికారు. (‘కాపులను చంద్రబాబు గాలికి వదిలేశారు’) కాగా కాపు కార్పొరేషన్కు ఇప్పటివరకూ ఏ బడ్జెట్లో ఎంత కేటాయించారు..ఎంత ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మరోవైపు కాపులకు ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ పవన్ విమర్శలకు దిగారు. అయితే ఆయన విమర్శలను మంత్రి కన్నబాబు తిప్పికొట్టారు. ఇప్పటికైనా పవన్ తన తీరు మార్చుకోవాలని సూచించారు. కాపు నేస్తం అద్భుతమైన పథకమని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. (‘కాపు’ కాసిన దేవుడు ! ) -
‘కాపులను చంద్రబాబు గాలికి వదిలేశారు’
సాక్షి, తాడేపల్లిగూడెం: కాపు సామాజికవర్గానికి అన్ని విధాలుగా చేయూత నిచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ప్రశంసించారు. గత ప్రభుత్వ హయాంలో కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గురువారం స్థానిక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు రూ.4,770 కోట్లు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కిందన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా కాపు సామాజికవర్గానికి ఎంతో మేలు జరిగిందన్నారు. (అప్పటికి.. ఇప్పటికీ తేడా చూడండి) 2014లో కాపులను బీసీలో చేరుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను గాలికి వదిలేసిన వ్యక్తి చంద్రబాబని విమర్శించారు. నాటి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు అండ్ గ్యాంగ్ అనేక ఇబ్బందలకు గురిచేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాపులకు అన్యాయం జరిగితే కనీసం ప్రశ్నించలేకపోయాయని, అటువంటి పార్టీలు నేడు కాపు ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు చేయడం శోచనీయమన్నారు. ఏపీలో అతిపెద్ద సామాజిక వర్గం కాపు సామాజికవర్గమని పేర్కొన్నారు. కాపు సామాజికవర్గానికి ఏడాది రూ.2 వేల కోట్లు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ గుర్తుచేశారు. (‘కాపు’ కాసిన దేవుడు !) ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గంలోని మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద బియ్యం కార్డు ఉన్న 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఇప్పుడు రూ.15 వేల చొప్పున సహాయం, అదేవిధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లించనున్నారు. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్ ఇన్కమ్బర్డ్ ఖాతాలో ఈ నగదు జమకానుంది. -
‘కాపు’ కాసిన దేవుడు !
సాక్షి ప్రతినిధి, విజయనగరం: చెప్పాడంటే..చేస్తాడంతే.. గత ఎన్నికల ముందు కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను కాపునేస్తం పథకం అమలు ద్వారా నెరవేర్చారు. కాపునేస్తం పథకాన్ని రాజధానిలోని తన క్యాంపు కార్యాలయంనుంచి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తదితరులు జిల్లాలోని కాపు నేస్తం లబ్ధిదారులు 3,720 మందికి రూ.5.58 కోట్లు ఆర్థిక సహాయం అందజేశారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నిజమైన అర్హులందరికీ వలంటీర్ల వ్యవస్థ ద్వారా అందజేస్తున్న ఘనత తన ప్రభుత్వానిదేనని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. కాపునేస్తం పథకం ప్రారంభోత్సవం సందర్భంగా విజయనగరం నుంచి వీడియోకాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన మాట్లాడు తూ జిల్లాలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ పథకం ప్రయోజనాలు అందేలా కృషి చేసిన జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులను అభినందించారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ పథకం కింద జిల్లాలో అత్యధికంగా 1186 మంది లబ్ధిదారులు నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందినవారే ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజాను తాను కలిశానని భోగాపురంలో రూ.1.50 కోట్లతో కాపు సామాజిక భవనం నిర్మించేందుకు ఆయన అంగీకరించారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర లో ఇచ్చిన హామీల్లో 90 శాతం హామీలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక్క ఏడాదిలోనే నెరవెర్చారని పేర్కొ న్నారు. కరోనా నేపథ్యంలో చేనేత కారి్మకులు, ఆటో డ్రైవర్లకు నాలుగు నెలల ముందే సంక్షేమ పథకాలను అందించి ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రిదేనని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం ఎవరికీ సాధ్యం కాదని, చిన్న వయస్సులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ దానిని ఆచరించి చూపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ ఆర్.కూర్మనాథ్, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, బీసీ కార్పొరేషన్ ఈడీ నాగరాణి, బీసీ సంక్షేమాధికారి డి.కీర్తి, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబి్ధదారులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న విపత్కర తరుణంలోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి కాపునేస్తం పథకం ద్వారా తమకు ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఊహించలేదు.. కాపు(తెలగ) కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తారని ఎప్పుడూ ఊహించలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. వెనుకబడిన తెలగ కులస్థులకు ఆరి్ధక సహాయం చేయడం గొప్ప ఆనందంగా ఉంది. గతంలో ఏ ప్రభుత్వం మమ్ము గుర్తించలేదు. గ్రామవలంటీర్లు ఇంటివద్దకే వచ్చి పేర్లు నమోదుచేసి ఈ పథకం వర్తించేలా చేశారు. – చెలమల తవిటమ్మ, రావుపల్లి, గరుగుబిల్లి మండలం కాపు నేస్తం ఒక వరం కాపు నేస్తం మాకు వరం. ఇంతవరకు వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదు. జగనన్న ఇచ్చిన ఈ భరోసాతో మాకు కొంత ఊరట కలిగింది. చిరువ్యాపారం చేసుకున్న వారికి ఇటువంటి ఆర్థిక సాయం ఎంతో ఉపకరిస్తుంది. ఎటువంటి రాజకీయాలు లేకుండా అర్హులందరికీ పథకం వర్తింపచేయడం గొప్ప విశేషం. – జి.మణి, బలిజిపేట -
అప్పటికి.. ఇప్పటికీ తేడా చూడండి
కాపులకు గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేసింది? గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడండి. ఏటా రూ.1,000 కోట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఇచ్చింది కేవలం రూ.1,874 కోట్లు మాత్రమే. అంటే ఏటా రూ.400 కోట్లు కూడా ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.4,770 కోట్లు కాపు కులస్తులకు ఇచ్చింది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గొప్ప మార్పుతో రాష్ట్రంలో 13 నెలల పాలన కొనసాగిందని.. ఎక్కడా వివక్ష, అవినీతికి ఏ మాత్రం తావు లేని విధంగా పథకాలు అమలు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గుండెల మీద చేయి వేసుకుని గత పాలనకు, ఇప్పటి పాలనకు తేడా చూడాలని కోరారు. తమకు ఓటు వేయకపోయినా, అర్హత ఉంటే మంచి జరగాలని ఆరాటపడ్డామని.. పథకాలు, కార్యక్రమాల అమలులో కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదన్నారు. దాదాపు 23 లక్షల మంది కాపు కులస్తులకు ఈ 13 నెలల్లో వివిధ పథకాల కింద రూ.4,770 కోట్ల లబ్ధి చేకూర్చామని తెలిపారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్ కాపు నేస్తం’ కింద దాదాపు 2.36 లక్షల మంది కాపు మహిళలకు ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 వేల చొప్పున సుమారు రూ.354 కోట్లు కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 13 నెలల కాలంలో.. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో అందరికీ మేలు చేయగలిగాం. ఈ 13 నెలల కాలంలో పలు పథకాల కింద 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశాం. గొప్ప మార్పుతో ఈ 13 నెలల పాలన కొనసాగింది. ► కాపు అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఈ ఏడాది కాలంలో అన్ని విధాలా తోడుగా ఉన్నాం. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, వాహనమిత్ర, చేదోడు, ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, చేయూత, కాపు నేస్తం వంటి అనేక పథకాల ద్వారా దాదాపు 23 లక్షల మందికి అక్షరాలా రూ.4,770 కోట్లు లబ్ధి చేకూర్చాము. ► ఇప్పుడు కూడా బియ్యం కార్డు ఉంటే చాలు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి రూ.15 వేల చొ ప్పున సహాయం చేస్తున్నాం. ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లించబోతున్నాం. ఈ నగ దును పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసు కోకుండా అన్ ఇన్కమ్బర్డ్ ఖాతాల్లో వేస్తున్నాం. ఒంగోలులో వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ.15 వేలు పొందిన ఆనందంలో అక్కచెల్లెమ్మలు అర్హులెవరైనా మిగిలిపోతే ఆందోళనొద్దు ► వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద లబ్ధి పొందని వారు ఇంకా ఎవరైనా ఉంటే ఆందోళన చెందవద్దు. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా, ఎలా మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం ఇది. అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం. ► ఈ పథకం అర్హుల జాబితాలో మీ పేరు లేకపోతే, మీకు అర్హత ఉంటే, వెంటనే దరఖాస్తు చేసుకోండి. వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తాం. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ఇంకా మంచి చేయాలని ఆశిస్తున్నాను. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. మమ్మల్ని ఓటు బ్యాంకుగానే చూశారు సీఎంగా మీరు ఏడాది కాలంలోనే పేదలకు ఇంత చేశారంటే.. జీవితాంతం మీరే సీఎంగా ఉంటే మేము ఇంకా అభివృద్ధి చెందుతాం. ఓట్ల సమయంలో ప్రతి నాయకుడు కాపులకు అదిచేస్తాం.. ఇది చేస్తామని చెప్పి తర్వాత కనిపించకుండా పోయేవారు. కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు. కానీ మీరు మాత్రం అన్ని విధాలా ఆదుకుంటున్నారు. నేను టైలరింగ్ చేస్తుంటాను. వైఎస్సార్ కాపు నేస్తం కింద మీరు అందించిన రూ.15 వేల సాయంతో మరికొందరికి జీవనోపాధి కల్పించాలని అనుకుంటున్నాను. – సలాటం కాళీప్రియ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా మరికొందరికి టైలరింగ్లో శిక్షణ ఇస్తా.. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా మీరు అందిస్తున్న ఈ డబ్బును సద్వినియోగం చేసుకుంటాం. నాకు టైలరింగ్ తెలుసు. కొత్త మిషన్లు కొనుగోలు చేసి, మరికొందరికి శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాను. కాపు, బలిజల్లో కూడా పేదవారు ఉంటారని గుర్తించి మా కోసం ఈ పథకం ప్రవేశపెట్టారు. కాపులకు ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి పథకం ప్రవేశపెట్టలేదు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మేం ఎంతగానో ఆనందపడుతున్నాం. కాపు మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మీరు చరిత్రలో స్థిరంగా నిలిచిపోతారు. –హైమావతిదేవి కడప, వైఎస్సార్ కడప జిల్లా ఈ సాయం మాకెంతో ఉపయోగం నాన్నా.. నువ్వు చేసిన మేలు నేను ఎప్పుడూ మరిచిపోలేను. కాపునేస్తం కింద అందు తున్న రూ.15 వేల సాయం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మా కుటుంబానికి కూడా అన్ని ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. నాన్నా.. మళ్లీ మళ్లీ నువ్వే సీఎం కావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వంలో పేదలందరికీ మేలు జరుగుతోంది. – నిర్మలమ్మ, పోతేపల్లి, మచిలీపట్నం మండలం, కృష్ణా జిల్లా మీ నిర్ణయం గొప్పది.. నేను ఉన్నాను.. నేను విన్నాను.. అంటూ పాదయాత్రలో అందరి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. అప్పుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. మీ తండ్రి వైఎస్సార్కు తగ్గ తనయుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. కాపు నేస్తం ద్వారా మీరు అందిస్తున్న సాయం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయి దేళ్లలో మాకు రూ.75 వేలు అందించాలన్న మీ నిర్ణయం గొప్పది. ఎప్పటికీ మీరే సీఎంగా వుండాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తున్నాను. – లంకలపల్లి శాంతమ్మ, పెద్దిపాలెం, ఆనందపురం మండలం, విశాఖపట్నం పేదలకు నిజమైన స్వాతంత్య్రం ఇచ్చిన ప్రతి మా టను నిలబెట్టు కుంటున్న మిమ్మ ల్ని చూసి గర్వపడుతున్నాం. కులాల పేరు చెప్పుకునే వ్యవస్థను మీరు పోగొట్టారు. కుల, మత వ్యవస్థ లేకుం డా పేదవాళ్లకు మేలు చేస్తూ.. వారి హృదయాలను గెలిచారు. కొత్త చరిత్రను సృష్టిస్తు న్నారు. పేద వా రిని ఆర్థికంగా అభివృద్ధి చేయా ల నే మీ తపనతో ఇప్పుడు నిజం గా పేదలకు స్వాతంత్య్రం వస్తోంది. – నారాయణస్వామి, డిప్యూటీ సీఎం చెప్పిన దానికన్నా ఎక్కువే.. పాదయాత్ర సం దర్భంగా కాపు లకు అయిదేళ్లలో రూ.10 వేల కోట్లు ఇస్తానని చెప్పారు. మీరు ఇచ్చిన హామీతో అందరూ ఆశ్చర్యపోయా రు. అధికారంలోకి వచ్చాక మీరు చెప్పిన దానికన్నా ఎక్కువగా కాపు లకు సాయం అందించారు. తొలి ఏడాదిలోనే ఏకంగా నాలుగు వేల కోట్లకు పైగా మీరు కాపు సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చారు. – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి మీకు ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలు చేస్తున్నం దుకు కాపు కుటుంబాల తర ఫున మీకు ధన్యవాదాలు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితు ల్లోనూ కాపునేస్తం కింద సాయం అందిస్తున్నారు. మాకు జగనన్న ఉన్నాడనే భరోసాతో ప్రజలు ఉన్నారు. మీకు వైఎస్సార్ ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు కూడా ఉంటాయి. – వంగా గీత, కాకినాడ ఎంపీ -
కనిపించని నాలుగో వ్యక్తి ‘జూమ్ యాప్’ ఏం చేశాడో..
సాక్షి, పశ్చిమ గోదావరి : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ఎక్కడా వెనుకాడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, అబ్బాయ చౌదరి అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గ మహిళలకు ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఏలూరులో మాట్లాడుతూ.. పాదయాత్రలో కాపు కార్పొరేషన్కు ఏటా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట కంటే ఎక్కువ ఇచ్చారని పేర్కొన్నారు. మాట ఇస్తే మడం తిప్పం అనే మాటను మరోసారి ముఖ్యమంత్రి నిరూపించారని ప్రశంసించారు. ('వైఎస్సార్ కాపు నేస్తం' ప్రారంభం ) ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సృజన చౌదరి, కామినేని శ్రీ నివాసరావు భేటి పై ఉంగుటూరు, దెందులూరు ఎమ్మెల్యేలు వాసుబాబు,అబ్బాయ చౌదరి స్పందింస్తూ.. ఈ కలయిక వెనక టీడీపీ హస్తం ఉదని తాము మొదటి నుంచి ఆరోపిస్తున్నామన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్లో మీడియాలో తాము చేసిన ఆరోపణలపై ప్రచారం చేశాయని, నేడు ఆ ఎల్లో మీడియా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ కలకయికలో ముగ్గురే కనిపించారని, కనిపించని నాలుగో వ్యక్తి ‘జూమ్ యాప్’ఎటువంటి సూచనలు చేశారో అని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్న ఎంతో గౌరవిస్తామని, నేడు ఇలాంటి కలయికను ఏమని చెప్పాలో తెలియడం లేదన్నారు. వారి కలయికలో ఎటువంటి చీకటి ఒప్పందాలు చేసుకున్నారో, రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారో అర్థం అవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా భారతదేశ ఎలక్షన్ కమిషన్ స్పందించి నిమ్మగడ్డ రమేష్ కుమార్పై చర్యలు తీసుకోవాలని వాసుబాబు, అబ్బయ్య చౌదరి డిమాండ్ చేశారు. (ఆ ముగ్గురి వ్యాపార లావాదేవీలు ఏమై ఉంటాయబ్బా?) -
'వైఎస్సార్ కాపు నేస్తం' ప్రారంభం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గంలోని మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ’వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయ, మీ చల్లని దీవెనలతో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేయగలిగాను. ఈ 13 నెలలో కాలంలో 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఎక్కడా వివక్షకు తావులేదు ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశాము. గొప్ప మార్పుతో ఈ 13 నెలల పాలన కొనసాగింది. మనకు ఓటు వేయకపోయినా, అర్హత ఉంటే మంచి జరగాలని ఆరాటపడ్డాం. అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు చేశాము. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదు. ఇవాళ కాపు అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఈ ఏడాది ఎంత ఖర్చు చేశామని చూస్తే.. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వాహనమిత్ర, చేదోడు, విదేశీ విద్యా దీవెన, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా 23 లక్షలకు పైగా లబ్ధిదారులకు అక్షరాలా రూ.4,770 కోట్లు ఇవ్వడం జరిగింది. బియ్యం కార్డు ఉంటే చాలు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఇప్పుడు రూ.15 వేల చొప్పున సహాయం. ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లింపు. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్ ఇన్కమ్బర్డ్ ఖాతాలో వేస్తున్నాం. ఆందోళన వద్దు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే ఆందోళన చెందవద్దు. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా, ఎలా మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం. అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. మీ పేరు లేకపోతే, మీకు అర్హత ఉంటే, వెంటనే దరఖాస్తు చేసుకోండి. వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తాం. గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడండి. గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేసింది? చూడండి. ఏటా రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం 5 ఏళ్లలో, ఏటా సగటున రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.4,770 కోట్లు కాపు కులస్తులకు ఇచ్చింది. దేవుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో మీకు ఇంకా మంచి చేయాలని భావిస్తున్నాను' అంటూ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.