● కలెక్టర్ రాజర్షి షా
కై లాస్నగర్: పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పత్తి కొనుగోళ్ల సన్నద్ధతపై అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, కుర్చీలు వంటి వసతులతో పాటు జిరాక్స్ కేంద్రాన్ని సైతం అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటుతో పాటు సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేసి అక్కడ తగు ఏర్పాట్లు చేయాలన్నారు. రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, హమాలీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతుల బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో చేసేందుకు డీవీటీ భారత్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అదనపు ఎస్పీ సురేందర్ రావు, మార్కెటింగ్ ఏడీ గజానంద్, డీఎస్పీ జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment