మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం గురువారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు రమేషాచారి, మధసూదనాచారి, దిరేంద్రదాస్, నాగరాజుశర్మ, రవిచారి స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా మహాహోమం నిర్వహించి స్వామి వారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈఓ సత్యాచంద్రారెడ్డి, ఆలయచైర్మన్ ప్రహ్లదరావు, మండల నాయకులు మధుసూదన్రెడ్డి, సీతారామిరెడ్డి, చంద్రశేఖర్రావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment