మీ సర్కార్‌కు ఆరునెలలే ఆయుష్షు | - | Sakshi
Sakshi News home page

టచ్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు: ప్రియాంక్‌ ఖర్గే

Published Tue, Aug 15 2023 1:22 AM | Last Updated on Tue, Aug 15 2023 8:01 AM

- - Sakshi

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ప్రచ్ఛన్న వాగ్యుద్ధం ప్రారంభమైంది. మరో 10 నెలల్లో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి వివాదాత్మక వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ఆదివారం రాత్రి విజయపురలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి ఆరు నెలల ఆయుష్షు మాత్రమే అని వ్యాఖ్యానించారు. గ్యారంటీ పథకాలతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని కార్యకర్తలకు వివరించారు.

టచ్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు: ప్రియాంక్‌ ఖర్గే
మరోవైపు సోమవారం కలబుర్గిలో మంత్రి ప్రియాంక్‌ ఖర్గే కేంద్రంలో ఆర్నెల్లలో బీజేపీ వాషౌట్‌ అవుతుందన్నారు. రాష్ట్రంలో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, భవిష్యత్‌లో వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్‌ పాటిల్‌ సింధనూరులో స్పందిస్తూ యత్నాళ్‌ పగటి కలలు కంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆరు నెలల ఆయుష్షే అని వ్యాఖ్యానించడం తగదన్నారు. 40 ఽశాతం కమీషన్ల కక్కుర్తితో పాలించిన బీజేపీకి మాట్లాడే నైతికత లేదన్నారు. బీజేపీ నేతలకు పచ్చ కామెర్లు వచ్చాయని మంత్రి పాటిల్‌ చురకలు అంటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement