కార్తీక్ దమ్ము, ఐశ్వర్యా సింగ్, పవన్ మల్హోత్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఫౌజా. అజిత్ దాల్మియా నిర్మాణంలో ప్రమోద్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. హిందీ ఆడియన్స్ను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ క్రమంలో ఫౌజా మూవీని హైద్రాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హీరో కార్తీక్ దమ్ము మాట్లాడుతూ.. ‘నేను హైదరాబాద్లో పుట్టాను. మళ్లీ ఇలా నా సినిమా కోసం ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. సినిమాకు భాషా సరిహద్దులు ఉండవు. త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లోకి ఈ చిత్రం రానుంది. మా సినిమాను చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు.
దర్శకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘డబ్బులు ఎన్ని ఉన్నా కూడా బ్రాండెండ్ బట్టల్ని కొనగలం.. కానీ ఇండియన్ ఆర్మీ యూనిఫాంని మాత్రం కొనలేం.. దాన్ని కష్టంతో, ఇష్టంతో సాధించుకోవాలి.. దేశ భక్తి ఉంటేనే అది మన సొంతం అవుతుంది. దేశం అంటే ప్రేమ, భక్తి ఉన్న ప్రతీ ఒక్కరికి ఫౌజా నచ్చుతుంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment