విహార యాత్రకు వచ్చి గల్లంతైన విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

విహార యాత్రకు వచ్చి గల్లంతైన విద్యార్థులు

Published Wed, Dec 27 2023 1:56 AM | Last Updated on Wed, Dec 27 2023 9:22 AM

- - Sakshi

మందస: సరదాగా గడుపుదామని సముద్ర తీరానికి వచ్చిన విద్యార్థులకు విషాదం ఎదురైంది. ముగ్గురు విద్యార్థులు సముద్రంలో గల్లంతైపోగా.. ఇద్దరు దొరికారు. మరొకరి ఆచూకీ లభించలేదు. మందస మండలంలోని ఉద్దాన ప్రాంతమైన భేతాళపురం పంచాయతీ, రట్టి తీరంలోని సిగలపుట్టుగలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం బెల్లుపడలోని ఓ ట్యూషన్‌ సెంటర్‌ నుంచి సుమారు 38పైగా విద్యార్థులు సిగలపుట్టుగ బీచ్‌కు మంగళవారం పిక్నిక్‌ చేసుకుందామని వచ్చారు. తీరంలో ఆనందంగా గడిపిన విద్యార్థులు సముద్ర స్నానానికి దిగారు.

పెద్ద అల రావడంతో పలువురు విద్యార్థులు కొట్టుకుపోయా రు. కొంతమంది ఒడ్డుకు రాగా, ఆశి జయరాం, ఎస్‌.మేఘన, బి.చందు అనే విద్యార్థులు గల్లంత య్యారు. స్థానిక మత్స్యకారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. తీరంలోని గ్రామాల్లో గల మత్స్యకారులకు కూడా ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో వారంతా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ లోగా మైరెన్‌ సీఐ రమేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నా రు. మత్స్యకారులు చందు, మేఘనను కష్టపడి ఒడ్డుకు తీసుకురాగలిగారు. వీరు అప్పటికే అపస్మారక స్థితికి చేరుకోవడంతో హుటాహుటిన హరిపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు పంపించారు. ఆశి జయరాం ఆచూకీ మాత్రం లభించలేదు. ప్రమాదంపై విద్యార్థుల కుటుంబాలకు సమాచారం అందజేశారు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు ఆపారు.

ఒక్కడే కుమారుడు
ఇచ్ఛాపురం: గల్లంతైన ఆశి జయరాం తల్లిదండ్రులు హరికృష్ణ, నాగమ్మ దంపతులకు చిన్న కుమారుడు. వీరికి ముగ్గురు సంతానం కాగా ఇద్దరు ఆడ పిల్లల తర్వాత జయరాం జన్మించాడు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న జయరాం తోటి విద్యార్థులతో సరదాగా ఉండేవా డు. జయరాం సముద్రంలో గల్లంతైపోయాడన్న వార్త తెలిసి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఆచూకీ లభించకపోవడంతో తమ కుమారుడు ఎలాగైనా బతికి బయటపడాలని దేవుళ్లకు మొక్కుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement