రాయగడ: జిల్లాలోని చందిలి పోలీసుస్టేషన్ పరిధి బాకురుగుడ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్యూటీపై వెళ్తున్న ఇద్దరిని ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ మణికేశ్వర్ కాలనీకి చెందిన మనీషా బెగొరాయ్ (25), కల్యాణ సింగుపూర్ సమితి పండ్రపడ గ్రామానికి చెందిన పూర్ణ చంద్ర మహానందియా(29)లు మృతి చెందినట్లు గుర్తించామని చందిలి పోలీసులు తెలియజేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కల్యాణ సింగుపూర్ సమితి సికరపాయిలోని హర్ష ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థలో మనీషా, పూర్ణ చంద్రలు పనిచేస్తున్నారు. తమ విధుల్లో భాగంగా గురువారం రాయగడకు వచ్చారు. పనులు ముగించుకుని తిరిగి సికరపాయికి వెళ్తున్న సమయంలో బాకురుగుడ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటన స్థలంలో మనీష మృతి చెందగా, తీవ్రగాయాలకు గురైన పూర్ణచంద్రను స్థానిక ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment