రథసప్తమికి పెంచలకోన సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రథసప్తమికి పెంచలకోన సిద్ధం

Published Tue, Feb 4 2025 12:55 AM | Last Updated on Tue, Feb 4 2025 12:55 AM

రథసప్తమికి పెంచలకోన సిద్ధం

రథసప్తమికి పెంచలకోన సిద్ధం

రాపూరు: మండలంలోని పెంచలకోనలో మంగళవారం జరగనున్న రథసప్తమి వేడుకులకు సర్వం సిద్ధం చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. రథసప్తమి నాడు సప్త వాహనాల్లో శ్రీపెనుశిల లక్ష్మీనసింహుడు క్షేత్రంలోని మాడ వీధుల్లో ఊరేగనున్నారు. రథసప్తమి పర్వదినాన్ని మినీ బ్రహ్మోత్సవంలా భవిస్తారని అధికారులు వెల్లడించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టినట్టు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు సూర్యప్రభ వాహనంపై, 8కి శేష వాహనం, 10కి సింహ వాహనం, 12కు బంగారు హనుమంత వాహనం, 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు హనుమంత వాహనం, 6కు అశ్వ వాహనం, 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగనున్నట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement