15 దేశాలు.. 160 పరిశోధన పత్రాలు
పర్లాకిమిడి: ఒడిశాలోని పర్లాకిమిడి సమీపంలోని ఆర్.సీతాపురంలో సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్లో గురువారం వికసిత్ భారత్, వినూత్న వ్యాపారం, వ్యవసాయం, టెక్నాలజీ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై వనరుల నిర్వాహణపై అంతర్జాతీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డాక్టర్ బినోద్ ఆత్రేయ (నేపాల్), ఓఆర్ఎస్ఐ. (భువనేశ్వర్) డాక్టర్ రబినారాయణ సుబుధ్ధి, ప్రొఫెసర్ మోనీ మడస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ అంశాలపై దేశ విదేశాలకు చెందిన నిష్ణాతులు కూలంకషంగా మాట్లాడారు. రెండురోజుల ఈ సదస్సుకు సెంచూరియన్ వైస్ చాన్స్లర్ డాక్టర్ సుప్రియా పట్నాయక్ అధ్యక్షత వహించారు. సదస్సులో 15 దేశాల నుంచి 160 పరిశోధన పేపర్లు అందినట్లు డాక్టర్ రబినారాయణ సుబుద్ధి తెలిపారు. సదస్సులో ఎం.ఎస్.స్వామినాథన్ వ్యవసాయ విద్యాలయం విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment