ఆటోను ఢీకొన్న కారు | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న కారు

Published Mon, Jan 15 2024 1:20 AM | Last Updated on Mon, Jan 15 2024 1:20 AM

రోడ్డు ప్రమాదంలో బోల్తా కొట్టిన ఆటో  - Sakshi

ఐదుగురు హిజ్రాలకు గాయాలు

తణుకు: తేతలి గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు హిజ్రాలు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లిగూడెంకు చెందిన హిజ్రాలు ఆటోలో ఉండ్రాజవరం మండలం వడ్లూరు వెళుతుండగా తేతలి గ్రామంలో ఓ కారు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. కారు వేగం ధాటికి ఆటో పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న హిజ్రాలు ప్రియాంక, సోనాలి, నందిని, అరుణ, గాయత్రి గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని తణుకు రూరల్‌ పోలీసులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement