ఉత్సాహంగా క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా క్రీడా పోటీలు

Published Thu, Oct 3 2024 1:42 AM | Last Updated on Thu, Oct 3 2024 1:42 AM

ఉత్సాహంగా క్రీడా పోటీలు

పెదవేగిలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 8లో u

కూటమి ప్రభుత్వం

ప్రజలకు చేసిందేమి లేదు

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రఘురాం

తాడేపల్లిగూడెం: కూటమి పాలన అఽధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా ప్రజలకు చేసిందేమి లేదని వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంటు వడ్డి రఘురాం నాయుడు ఎద్దేవా చేశారు. పట్టణంలోని ఆయన నివాసంలో బుధవారం సాయంత్రం జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ 100 రోజుల్లో కూటమి పాలన అర్థం కాని పరిస్థితిలో ఉందన్నారు. రైతే రాజు అని గౌరవించాల్సిన పరిస్థితి నుంచి టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి కుక్కలతోటి పోల్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రభుత్వానికి రైతు అంటే ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుందన్నారు. రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుంటే ఉద్యమిస్తామని రఘురాం హెచ్చరించారు. అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు పూర్తిస్థాయిలో కృషి చేయాలని, రాష్ట్రంలో రైతులకు సాయంగా ఉండటానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షలో చెప్పారన్నారు. ఈ మేరకు ముందుకు వెళతామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు. ఎంపీపీ పొనుకుమాటి శేషులత, పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు, పార్టీ నాయకులు గొర్రెల శ్రీనివాసు, మర్లపూడి సుబ్బారావు, నార్ని నాగు, మాకరాజు సతీష్‌, దారపురెడ్డి శ్రీనివాసు పాల్గొన్నారు. రఘురాంను ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించారు.

అధినేత వైఎస్‌ జగన్‌తో భేటీ

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వడ్డి రఘురాంనాయుడు బుధవారం తాడేపల్లిలోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement