-
వైఎస్సార్ సీపీలో చేరికలు
యలమంచిలి : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే ఈ ఎన్నికలలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపునకు దోహదం చేస్తాయని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు అన్నారు. లక్ష్మీపాలెంలో బుధవారం టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు నాగబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికీ నాగబాబు వైఎస్సార్ సీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన నచ్చడం వలనే టీడీపీ, జనసేన నాయకులు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారంతా పాలకొల్లు ఎమ్మెల్యేగా గుడాల శ్రీహరి గోపాలరావు, నరసాపురం ఎంపీగా గూడూరి ఉమాబాల విజయానికి కృషి చేయాలని కోరారు. సర్పంచ్ గటిగంటి మహేష్, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లాడి ఏడుకొండలు పార్టీ నాయకులు పెసంగి సుబ్రహ్మణ్యం, మోకా ప్రేమ్చంద్, లంకే సూర్యచంద్ర, పెసంగి ఏసు, పొన్నమండ నరసింహస్వామి, ఉండవల్లి చక్రవర్తి, జల్లి నరసింహమూర్తి, కందికట్ల చిట్టిబాబు, పొన్నమండ వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో మోకా రవితేజ, పొన్నమండ ముత్యాలు, కర్రి ఆంజనేయులు, మల్లాడి గంగరాజు, కర్రి పెద్దిరాజు, కర్రి శ్రీనివాస్, కర్రి ప్రేమ్కుమార్, పెసంగి దుర్గాప్రసాద్, కర్రి కృష్ణ, కర్రి సాయిబాబు, అంగాడి దుర్గా ప్రసాద్, మల్లాడి రవితేజ, వనమాడి సుబ్రహ్మణ్యం, పొన్నమండ వీరాస్వామి, బస్వాని విజయ్, బెజవాడ రామారావు తదితరులు ఉన్నారు. గుడాల గోపి సమక్షంలో 70 మంది చేరిక పాలకొల్లు అర్బన్: పేదల పక్షాన పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) కోరారు. పాలకొల్లు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం పట్టణంలోని 18వ వార్డు రాజీవ్నగర్కి చెందిన 70 మంది యువజనులు గుడాల గోపి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. గుడాల గోపి వీరికి పార్టీ కండువాలు మెడలో వేసి స్వాగతం పలికారు. మే 13న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతీ కార్యకర్త బూత్లను పర్యవేక్షించి ప్రతీ ఒక్కరి చేత ఓటు వేయించాలని కోరారు. పాలకొల్లులో ఈ సారి వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగించడానికి యువత నడుంకట్టాలన్నారు. పాలకొల్లును అభివృద్ధిపథంలో నడిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీచైర్మన్ యడ్ల తాతాజీ, జేసీఎస్ జిల్లా కన్వీనర్ ఖండవల్లి వాసు, వార్డు ఇన్చార్జ్ రామాంజుల పెదమధు, పసుపులేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య ‘ఆనందిని’
మెడలో స్టెతస్కోప్ వేసుకుని పేదల గుండె చప్పుడు వినాలని ఆ చిన్నారి ఉబలాటపడింది. ఒక్కో తరగతి పైకొస్తున్న కొద్దీ ఆ ఆశ బలమైన సంకల్పంగా మారింది. కూతురి తపన చూసి తల్లిదండ్రులు కలవరపడ్డారు. తమ స్తోమతకు వైద్య విద్య సాధ్యమేనా అని ఆందోళన చెందారు. పట్టువదలని ఆ విద్యార్థిని కష్టపడి చదివింది. కజకిస్థాన్లో ఎంబీబీఎస్ సీటు పొందింది. అక్కడకు వెళ్లి చదవడం ఎలా అనుకుంటున్న తరుణంలో చీకటిలో వెలుగు దివ్వెలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం వరమైంది. ఆన్లైన్లో ఆఖరి రోజు దరఖాస్తు చేసిన ఆ విద్యార్థినికి సంక్షేమ సర్కారు అండగా నిలిచింది. వైద్యవిద్య కయ్యే పూర్తి ఫీజు భరించేందుకు ముందుకొచ్చింది. అక్కడికెళ్లేందుకు అయ్యే ఖర్చులనూ భరించింది. ఇప్పుడు కజకిస్థాన్లో ఎంబీబీఎస్ చదువుతున్న ఆ విద్యార్థిని మోములో ఆనందం తొణికిసలాడుతోంది. -
వైద్య ‘ఆనందిని’
మెడలో స్టెతస్కోప్ వేసుకుని పేదల గుండె చప్పుడు వినాలని ఆ చిన్నారి ఉబలాటపడింది. ఒక్కో తరగతి పైకొస్తున్న కొద్దీ ఆ ఆశ బలమైన సంకల్పంగా మారింది. కూతురి తపన చూసి తల్లిదండ్రులు కలవరపడ్డారు. తమ స్తోమతకు వైద్య విద్య సాధ్యమేనా అని ఆందోళన చెందారు. పట్టువదలని ఆ విద్యార్థిని కష్టపడి చదివింది. కజకిస్థాన్లో ఎంబీబీఎస్ సీటు పొందింది. అక్కడకు వెళ్లి చదవడం ఎలా అనుకుంటున్న తరుణంలో చీకటిలో వెలుగు దివ్వెలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం వరమైంది. ఆన్లైన్లో ఆఖరి రోజు దరఖాస్తు చేసిన ఆ విద్యార్థినికి సంక్షేమ సర్కారు అండగా నిలిచింది. వైద్యవిద్య కయ్యే పూర్తి ఫీజు భరించేందుకు ముందుకొచ్చింది. అక్కడికెళ్లేందుకు అయ్యే ఖర్చులనూ భరించింది. ఇప్పుడు కజకిస్థాన్లో ఎంబీబీఎస్ చదువుతున్న ఆ విద్యార్థిని మోములో ఆనందం తొణికిసలాడుతోంది. -
కవిటంలో శ్రీరంగనాథరాజుకు మద్దతు తెలిపిన 200 తూర్పుకాపు కుటుంబాలు
పోడూరు: సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలకు సముచిత స్థానం ఉంటుందని ఆచంట వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. బుధవారం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో కవిటం గ్రామానికి చెందిన తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన 200 కుటుంబాలు ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజును కలిసి మద్దతు తెలిపాయి. ఎన్నికల్లో శ్రీరంగనాధరాజును మరోసారి ఆచంట ఎమ్మెల్యేగా భారీమెజార్టీతో గెలిపించేందుకు, సీఎం జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలోనే సాధ్యమన్నారు. జెడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు, కవిటం గ్రామకమిటీ అధ్యక్షుడు అంబళ్ల భాస్కరరావు, గ్రామసర్పంచ్ చుట్టుగుల్ల పూర్ణిమ, ఏఎంసీ మాజీ వైస్ఛైర్మన్ పడాల వెంకట సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. దుంపగడపలో ఉమాబాల సమక్షంలో.. ఆకివీడు: మహిళా పక్షపాతిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనకు మహిళలు ముగ్ధులవుతున్నారని నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిని గూడూరి ఉమాబాల, ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్.నర్శింహరాజు అన్నారు. మండలంలోని దుంపగడప గ్రామంలో 20 మంది మహిళలు బుధవారం వైఎస్సార్ సీపీలో చేరగా వారికి ఉమాబాల పార్టీ కండువాలు వేసి స్వాగతించారు. వైఎస్సార్సీపీ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని మహిళలు తెలిపారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో దుష్ప్రచారం తాడేపల్లిగూడెం (టీఓసీ): టీడీపీ అధినేత చంద్రబాబు తన హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమంపై చెప్పుకునే దమ్ములేక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, ఇది సరికాదని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు అన్నారు. పట్టణంలో బుధవారం మాలమహానాడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంగరాజు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభ్యర్థి కొట్టు సత్యనారాయణకు, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల గెలుపునకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై చంద్రబాబు, లోకేష్లు ప్రజలను తప్పు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, పచ్చ మీడియా కూడా ఇందులో భాగమయ్యిందన్నారు. టైటిల్లింగ్ యాక్ట్ ద్వారా భూ తగాయిదాలు ఉండవని ప్రజలు గుర్తించాలన్నారు. మరోసారి జగన్మోహన్రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీరవల్లి సునీల్, గెడ్డం అచ్చిబాబు, ప్రేమ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వాహా చేసిన రూ.36.15 లక్షల రికవరీ దువ్వ వీఏవో భాగ్యలక్ష్మిని విధుల నుంచి తొలగింపు తణుకు/తణుకు టౌన్: తణుకు మండలం దువ్వ గ్రామంలోని ఐకేపీ గ్రామ సంఘంలో నిధులు పక్కదోవ పట్టించిన వీఏవో వీరమళ్ల భాగ్యలక్ష్మిని విధుల నుంచి తప్పించినట్లు ఏపీఎం ఎ.రామకృష్ణ బుధవారం చెప్పారు. గ్రామంలోని 28 డ్వాక్రా సంఘాలకు చెందిన సుమారు రూ.36.15 లక్షలను ఫోర్జరీ సంతకాలతో సొంత ఖాతాకు మళ్లించింది. దీనిపై గత నెలలో గ్రామంలో డ్వాక్రా సంఘ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. దువ్వ యూబీఐ బ్రాంచి పరిధిలో నిధులు దుర్వినియోగం అయినట్లు తేల్చారు. ఈ మేరకు గ్రామ సంఘం తీర్మానం ద్వారా భాగ్యలక్ష్మిని విధుల నుంచి తప్పించి దుర్వినియోగం అయిన నిధులను రికవరీ చేసినట్లు ఆయన వెల్లడించారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి భీమవరం : భీమవరం టౌన్ – ఆరవల్లి రైల్వేస్టేషన్ల మధ్య మెంటేవారితోట సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే ఎస్సై పీటీవీ రమణ బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం శేషాద్రి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెంది ఉండవచ్చన్నారు. మృతుడి వయస్సు 60 ఏళ్ల లోపు ఉండవచ్చని, తెలుపు, ముక్కుపొడి రంగు చారల టవల్, తెలుపు, ఆకుపచ్చ లుంగీ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు 70939 39777 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. వాహన తనిఖీల్లో రూ.2 లక్షల నగదు స్వాధీనం కామవరపుకోట : కామవరపుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా బుధవారం ఒక వ్యక్తి నుంచి రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెక్పోస్ట్ ఎన్నికల అధికారి మహమ్మద్ మోహిద్దీన్ తెలిపారు. వీరిశెట్టిగూడెంకు కారులో వెళుతున్న వ్యక్తి నుంచి ఈ నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్సై స్వామి ద్వారా ఏలూరు ట్రెజరీలో జమ చేస్తామన్నారు. పోలీసు సిబ్బంది కె.రమేష్, కె.రామకృష్ణ, సూర్యరావు, షేక్ నాగూర్, ఎం.నాగార్జున, వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. -
వనితపై హత్యాయత్నం.. సహించరాని నేరం
వనితను కలిసి సంఘీభావం తెలిపిన ఎస్సీ సెల్ నాయకులుభీమడోలు: రాష్ట్ర హోంమంత్రి, దళిత మహిళా రాష్ట్ర నేత తానేటి వనితపై నల్లజర్లలో టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడడం సహించరాని నేరమని జిల్లా ఎస్సీ సెల్ నాయకులు తీవ్రంగా ఖండించారు. భీమడోలు మండలానికి చెందిన జిల్లా ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి అంబటి నాగేంద్ర ప్రసాద్, జిల్లా చైతన్య యువజన సంఘం అధ్యక్షుడు పాము మాన్సింగ్, వైఎస్సార్ సీపీ మండల ప్రధాన కార్యదర్శి రామకుర్తి నాగేశ్వరరావులతో పాటు పలువురు నల్లజర్లలో బుధవారం తానేటి వనితను కలిసి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం రాత్రి నల్లజర్లలో ప్రచారం ముగించుకుని వస్తున్న వనితపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడడం దారుణమని, వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలను స్వేచ్చాయుత వాతావరణంలో జరుపుకోవాల్సి ఉండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు దాడులకు పాల్పడుతూ పేట్రేగిపోతున్నారన్నారు. సీసీ ఫుటేజీల్లో గుర్తించిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగిస్తుందని, నల్లజర్లలో తానేటి వనిత అఖండ మెజార్టీతో గెలుస్తుందన్న సర్వేలతో టీడీపీ ఇన్చార్జి మద్దిపాటి వెంకట్రాజు, నాయకులు ముళ్లపూడి బాపిరాజు తదితరులు తమ అనుచరులతో వనితపై దాడి చేయించారన్నారు. అలాంటి సంఘ విద్రోహ శక్తులపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గోపాలపురంలో వైఎస్సార్ సీపీ విజయానికి చేరువగా ఉండడాన్ని జీర్ణించుకోలేక కూటమి నాయకులు ఇలాంటి అసాంఘిక శక్తులతో దాడులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర హోంమంత్రిపై దాడులకు తెగపడు తున్నారంటే టీడీపీ నాయకులు ఎంతకు బరి తెగించారోప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. ఎన్నికల ఘట్టం ముగిసే వరకు వనితకు మరింత సెక్యూరిటీని పెంచాలని వారు కోరారు. ఎన్ని శక్తులు అడ్డుపడినా తానేటి విజయం నల్లేరుపై నడకే అని ఎస్సీ సంఘం నాయకులు తెలిపారు. కూటమి అభ్యర్థులకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. -
జగనన్నకు కృతజ్ఞతలు
ఏలూరు తంగెళ్లమూడి నెహర్మసీద్ ప్రాంతానికి చెందిన జొన్నలగడ్డ నర్సింహరాజు, రాజ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. నర్సింహరాజు వ్యవసాయం చేస్తారు. రాజ్యలక్ష్మి గృహిణి. వీరి పెద్ద కుమార్తె జొన్నలగడ్డ నందినికి కజకిస్థాన్లో అల్ ఫరాబీ ఖజాక్ నేషన్ యూనివర్సిటీ (అంతర్జాతీయంగా 150వ ర్యాంకు)లో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఈ చదువుకు జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలిచింది. పూర్తి ఫీజు రూ.24 లక్షలు భరించేందుకు ముందుకొచ్చింది. మొదటి ఏడాది రూ.4 లక్షల 7 వేలు, రెండో సంవత్సరం ఫీజు కూడా ఇటీవల రూ.4 లక్షల 7 వేలు యూనివర్సిటీకి ప్రభుత్వం చెల్లించింది. నందిని కజకిస్థాన్ వెళ్లేందుకు వీసా, విమాన చార్జీలు సైతం ప్రభుత్వమే భరించింది. సుమారుగా రూ.50 వేల వరకు వీటి కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇదిలా ఉంటే నర్సింహరాజు కుమారుడు రాహుల్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. రాహుల్కు అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుతోంది. ఏలూరు నగరంలోనేపదుల సంఖ్యలో లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అనేక అద్భుతమైన ఘటనలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎన్నో ఆవిష్కృతమయ్యాయి. ఏలూరు నగరంలో జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంలో వైద్య విద్యను అభ్యసించేవారు ఇంకా పదుల సంఖ్యలో ఉండటం గమనార్హం. జగనన్న అందిస్తున్న పథకాలు తమలాంటి పేద విద్యార్థులు ఎందరికో ఉన్నత భవితను అందిస్తున్నాయని నందిని ఆనందంగా చెబుతోంది. పేద విద్యార్థినికి డాక్టర్ విద్య కజకిస్థాన్లో ఎంబీబీఎస్ వరమైన జగనన్న విదేశీ విద్యాదీవెన మా కుమార్తె డాక్టర్ కావాలన్న కోరిక జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా నెరవేరుతోంది. మాలాంటి కుటుంబాలకు రూ.లక్షలు ఖర్చు చేసి ఉన్నత విద్య చదివించడం సాధ్యంకాని పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద విద్యార్థులకు దేవుడిలా మారారు. భవిష్యత్తులోనూ ఆయన మరింతమంది పేద విద్యార్థుల భవితకు అండగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం. ఆయనకు కృతజ్ఞతలు. – జొన్నలగడ్డ రాజ్యలక్ష్మి, విద్యార్థిని తల్లి -
పోలవరం అభివృద్ధే నా లక్ష్యం
ప్రశ్న: మీరు టీచర్ కదా.. రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? రాజ్యలక్ష్మి: బుట్టాయగూడెం, దొరమామిడి గ్రామాల్లో 20 ఏళ్లుగా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశా. ప్రజలకు సేవ చేయడమంటే నాకెంతో ఇష్టం. ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున మహిళలకు స్థానం కల్పించారు. ఈ నేపథ్యంలోనే జగనన్న, నా భర్త తెల్లం బాలరాజు నాకు పోటీ చేసే అవకాశం కల్పించారు. అందుకే ఉపాధ్యాయ వృత్తిని వదులుకుని రాజకీయాల్లో అడుగుపెట్టా. ప్రశ్న: మీ రాజకీయ నేపథ్యం గురించి చెప్పండి. రాజ్యలక్ష్మి: మాది రాజకీయ కుటుంబం. మామగారు తెల్లం చినవడ్డీ పంచాయతీ సమితి ప్రెసిడెంట్గా, ఎంపీపీగా, సొసైటీ అధ్యక్షుడిగా, సర్పంచ్గా ప్రజలకు సేవలందించారు. ఆయన సుమారు 30 ఏళ్ల పాటు రాజకీయాల్లోనే జీవితం గడిపారు. నా భర్త తెల్లం బాలరాజు 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నాలుసార్లు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సేవ చేశారు. ప్రశ్న: పోలవరం అభివృద్ధికి తెల్లం బాలరాజు ఏం చేశారో మీకు అవగాహన ఉందా? రాజ్యలక్ష్మి: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పోగొండ రిజర్వాయర్, కొండ కాల్వపై నాలుగు హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణాలకు కృషి చేశారు. సన్నచిన్నకారు రైతులకు పొగాకు బేరన్ లైసెన్స్లు ఇప్పించి వారి కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించారు. పోడు భూములకు పట్టాలు ఇప్పించారు. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సీఎం జగనన్న పాలనలో గడిచిన 58 నెలల్లో సంక్షేమ పథకాల రూపంలో రూ.923.14 కోట్లు, అభివృద్ధి పథకాల రూపంలో రూ.665.77 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. వైద్య రంగ అభివృద్ధికి, రోడ్ల నిర్మాణానికి విశేష కృషి చేశారు. ప్రశ్న: ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? రాజ్యలక్ష్మి: నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారంలో నాకు సహకరిస్తున్నారు. సీఎం జగనన్న అమలుచేసిన సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ప్రజలు.. ప్రచారానికి వెళ్లిన నాకు ఎదురొచ్చి మరీ హారతులు పట్టి ఘన స్వాగతం పలుకుతుంటే చాలా సంతోషంగా ఉంది. జగనన్న చెబితే చేస్తాడని.. సంక్షేమ పథకాల అమలులో ఆయనకు ఎవ్వరూ సాటిలేరని.. జగనన్న ప్రభుత్వానికే మళ్లీ పట్టం కడతామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారు. ప్రశ్న : కూటమి మేనిఫెస్టోపై మీ అభిప్రాయం ఏమిటి? రాజ్యలక్ష్మి : టీడీపీ మేనిఫెస్టో అంతా బూటకం. మోసం, దగా వంచనకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. గత ఎన్నికల్లో రుణమాఫీ అమలుచేస్తానని హామీ ఇచ్చి.. ఆ తరువాత అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకుండా చంద్రబాబు మోసం చేశాడు. మళ్లీ ఈ ఎన్నికల్లో కూడా అధికార దాహంతో అమలు సాధ్యం కాని హామీలను మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నాడు. ప్రజలు కూటమి అభ్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. ప్రశ్న: ఎన్నికల ప్రచారంలో మీరు గమనించిన విషయాలేమిటి? రాజ్యలక్ష్మి : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాకు టికెట్ కేటాయించిన తర్వాత సుమారు నాలుగు నెలలుగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించా. ప్రచారం చేశాను. నిర్వాసితుల సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటి పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను. నిర్వాసితులకు అండగా ఉంటా. అదే ప్రధాన సమస్యగా గుర్తించాను. ప్రశ్న: ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తారు? రాజ్యలక్ష్మి : ఎంతో నమ్మకంతో జగనన్న పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఇచ్చారు. ప్రజల ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో గెలుపొందితే ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. పోలవరం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ప్రశ్న: వైఎస్సార్సీపీ విజయానికి కలిసొచ్చే అంశాలేమిటి? రాజ్యలక్ష్మి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన దేశానికే ఆదర్శంగా నిలిచింది. మాట తప్పని, మడమతిప్పని నాయకుడిగా ప్రజల్లో మంచి పేరుంది. గడచిన ఐదేళ్లలో జగనన్న అమలు చేసిన నవరత్న పథకాలు పార్టీ విజయానికి దోహదపడతాయి. మళ్లీ జగనన్న గెలిస్తేనే సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని ప్రతి ఒక్కరి మనసులో ఉంది. ప్రజలకు జగనన్నపై ఉన్న నమ్మకమే వైఎస్సార్సీపీని గెలిపిస్తుంది. ప్రశ్న: ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాజ్యలక్ష్మి: పోలవరం నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు. పూటకో పార్టీ మారుతూ ఎన్నికల ముందు మాత్రమే కనిపించే కూటమి అభ్యర్థులు ఎంతవరకు పనిచేస్తారో వారికి తెలుసు. కరోనా కష్టకాలంలో ఈ నాయకులు అప్పుడు కనిపించలేదు. ప్రజలు విలవిల్లాడుతున్న సమయంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రమే వారికి అండగా నిలిచింది. నా భర్త తెల్లం బాలరాజు తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలకు నిత్యావసరాలు అందించి అండగానిలిచారు. నా భర్త తెల్లం బాలరాజు చేసిన సేవలను, అభివృద్ధిని చూసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా. పోలవరం అభివృద్ధే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తా.సాక్షితో వైఎస్సార్ సీపీ పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి -
జగన్ జమానాలోనే ముస్లింల అభివృద్ధి
ఇటీవల ఎండీ ఇస్మాయిల్ షరీఫ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నగరంలోని ఒక కార్పొరేట్ వైద్య కళాశాలలో ఆయనకు చేసిన శస్త్రచికిత్స వికటించి మృత్యువుతో పోరాడారు. ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స చేయించుకోవడానికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. అయినప్పటికీ ఆయనకు వ్యాధి నయం కాకపోవడంతో మరోసారి శస్త్రచికిత్స అవసరమైంది. ఆరోగ్యశ్రీ నిబంధనల మేరకు ఒకసారి చికిత్స చేసిన వ్యాధికి మరోసారి ఆరోగ్యశ్రీ వర్తించదు. దీంతో శస్త్రచికిత్స చేయించుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేసిన ఒక ప్రకటన వరంగా మారింది. ఆరోగ్యశ్రీ చికిత్సల వ్యయాన్ని రూ.25 లక్షలకు పెంచుతూ సీఎం చేసిన ప్రకటనతో ఆయనకు మరోసారి శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం కలిగింది. కుటుంబ సభ్యులకూ లబ్ధి : ఇస్మాయిల్ కుమార్తెకు ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయంలో హెల్త్ సెక్రటరీ ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం ద్వారా అమె నెలకు రూ.32 వేలు జీతంగా పొందుతోంది. ఆయన మరొక కుమార్తెకు షాదీ తోఫాగా వివాహ ఖర్చుల నిమిత్తం జగన్ ప్రభుత్వం రూ.లక్ష విడుదల చేసింది. 72 ఏళ్ల వయసు కలిగిన అత్త హుస్సేనీబీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వృద్ధాప్య ఫించన్ కోసం తొక్కని గడప లేదు. ఎంపీటీసీని, ప్రజల వద్దకు పాలనలో అధికారులను, జన్మభూమి కమిటీలను ఎన్నిసార్లు కోరినా వృద్ధాప్య ఫించన్ మంజూరు కాలేదు. అనంతరం 2019వ సంవత్సరంలో వచ్చిన వలంటీర్ వ్యవస్థ ద్వారా వలంటీర్లు ఆయన ఇంటికి నేరుగా వచ్చి హుస్సేనీబీకి పింఛన్ వచ్చే ఏర్పాటు చేశారు. పిల్లలకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు, భార్యకు చేయూత పథకం ద్వారా రూ.18 వేలు ఏడాదికి జమఅవుతున్నాయని ఇస్మాయిల్ తెలిపారు. జగన్కు ముస్లింలు అండగా నిలవాలని ఆయన కోరుతున్నారు. ఆయనొక సామాజికవేత్త.. ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఆయన తన ఇంటి వద్దనే వెల్డింగ్ పనులు చేసుకుంటూ 8 మంది సంతానాన్ని చదివించి, ప్రయోజకులను చేసి, కుటుంబ అభివృద్ధికి పాటుపడుతున్నారు. అదే సమయంలో సామాజిక బాధ్యతగా నగరంలోని వివిధ సమస్యలను స్థానిక అధికారులతో పాటు, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ తాను అనారోగ్యం పాలైనప్పుడు ఆదుకున్నది ఆరోగ్యశ్రీయే అని.. కుటుంబం ఆర్థిక చేయూతకు జగన్ పథకాలే దోహదపడ్డాయని చెబుతున్నారు. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ షరీఫ్. జగన్ జమానాలోనే ముస్లింల పూర్తి స్థాయి అభివృద్ధి జరుగుతుందని, ముస్లింలంతా అబద్ధపు వాగ్ధానాలకు ఆకర్షితులు కాకుండా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ వైఎస్ జగన్కు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. – ఏలూరు (ఆర్ఆర్పేట) -
రచ్చ శ్రీను కేరాఫ్ తాడేపల్లిగూడెం
‘నేను నిజాయతీపరుడిని.. నాకు పక్కవాడిది రూపాయి కూడా అక్కర్లేదు.. కష్టపడి సంపాదించి ఈ స్థాయికి చేరాను..’ ఇవీ తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో రోజూ చెబుతున్న మాటలు. అయితే ఆయన అసలు స్వరూపం మరోలా ఉంది. బొలిశెట్టి శ్రీనుకు నియోజకవర్గంలో మరో పేరు ఉంది.. అదే రచ్చ శీను. దుందుడుకు స్వభావంతో ఇతరులను దబాయించడం, తీవ్రస్థాయిలో భయాందోళనలకు గురిచేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందారు. లారీ ఫీల్డ్తో మొదలుపెట్టి 30 ఏళ్లలో తాడేపల్లిగూడెంలో సంపన్నుడిగా మారారు. సెటిల్మెంట్లతో ప్రారంభమైన ప్రస్థానం రాజకీయ పార్టీ అభ్యర్థి వరకు సాగిందిలా..సాక్షి ప్రతినిధి, ఏలూరు: బొలిశెట్టి శ్రీనివాస్ను తాడేపల్లిగూడెంలో రచ్చ శీనుగా పిలుచుకుంటారు. 30 ఏళ్లలో కోట్ల సంపద సృష్టించారనేది ప్రచారం. వాస్తవంలో మాత్రం భూ సెటిల్మెంట్లతో మొదలుకొని అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల వరకు దండుకుని ఎదిగారనేది అందరికీ తెలిసిన సత్యం. వీటన్నింటితో పాటు జూద కళల్లో ప్రావీణ్యం కూడా ఉందనేది గూడెం ఎరిగిన నిజం. 1981లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, 1999లో మున్సిపల్ కౌన్సిలర్గా, ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ఆ తరువాత 2014లో టీడీపీలో చేరి మున్సిపల్ చైర్మన్గా ఐదేళ్ల పాటు పనిచేసి 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బియ్యం అక్రమ రవాణా : సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బొలిశెట్టి క్లాస్ వన్ కాంట్రాక్టర్ అని చెప్పుకుంటారు. కౌన్సిలర్గా ప్రారంభమైన నాటి నుంచే భూ సెటిల్మెంట్లలో అందె వేసిన చేయి. లెక్కకు మించి భూ సెటిల్మెంట్లు, చౌకగా భూములు కొనడం, భారీగా అమ్మడంతో ఆర్థికంగా ఎదిగారు. అక్కడి నుంచి సివిల్ సప్లయీస్కు లారీల కాంట్రా క్టర్గా, గన్నీ బ్యాగ్ సప్లయర్గా, కందిపప్పు సప్లయర్గా మారి భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. బియ్యం అక్రమ రవాణా, కందిపప్పు కల్తీలో సిద్ధహస్తుడిగా పేరొందారు. కట్ చేస్తే.. ఒకే లారీకి నంబర్ ప్లేట్లు మార్చి రవాణా చేయడం, అక్రమ బియ్యం సరఫరా వ్యవహారంలో కత్తిపూడి వద్ద లారీలను పట్టుకోగా కేసు నమోదైనట్టు సమాచారం. ఈ పరిణా మాల క్రమంలో ఆయన లైసెన్స్లను బ్లాక్ లిస్టులో పెట్టడంతో బావమరిది పేరుతో మరో లైసెన్స్ సృష్టించి దానిపై ఇదే వ్యాపారాన్ని నిరాటంకంగా కొన సాగించారు. ఈ పరిణామ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కేసు కూడా నమోదై ముగిసిపోయింది. బినామీ కాంట్రాక్టర్లతో భారీగా దండుకొని.. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ నిధులతో పార్కుల నిర్వహణ, డ్రెయిన్ల పూడికతీత, ఇతర అభివృద్ధి పనులన్నీ బినామీ కాంట్రాక్టర్లతో చేయించి భారీగా దండుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీలో ఎల్ఈడీ లైట్ల కొనుగోలు టెండర్లో రూ.5 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అప్పట్లో పట్టణమంతా చర్చ సాగింది. 20 ఎకరాల లేఅవుట్లో పది శాతం కమీషన్, పట్టణంలోని అనధికారిక లేఅవుట్లో 25 శాతం వాటాలు, దళితులకు చెందిన అసైన్డ్ భూమి స్వాహా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చంపేస్తామని మహిళకు బెదిరింపులు స్థలం అమ్మకపోతే చంపేస్తామని మహిళను బెదిరించిన కేసు కూడా 692/2021గా బొలిశెట్టిపై నమోదైంది. కొయ్యలగూడేనికి చెందిన మార్ని ప్రవీణ అనే మహిళకు గూడెంలోని మోర్ సూపర్బజార్ ఎదురుగా స్థలం ఉంది. బొలిశెట్టి దానిని తమకు విక్రయించమని కోరితే ఆమె నిరాకరించడంతో రాత్రికి రాత్రే కుర్రాళ్లను పెట్టి సరిహద్దు గోడను పగులగొట్టించి స్థలం అమ్మకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈ సంఘటనలో బొలిశెట్టి శ్రీనివాస్ మూడో నిందితుడిగా, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జీని 4వ నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. పేకాటలో సిద్ధహస్తుడు బొలిశెట్టికి ప్రవృత్తి రీత్యా ఇష్టమైన క్రీడ పేకాట. 2010లో పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొద్దిరోజులు పేకాట క్లబ్లు నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. పేకాటకు సంబంధించిన కేసు విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో ఆయనే ధ్రువీకరించారు. 2010లో క్రైమ్ నం.169 పట్టణంలోని ఒక రెసిడెన్సీలో పేకాడుతుండగా పోలీసులు దాడి చేసి రూ.26,565 స్వా«దీనం చేసుకుని బొలిశెట్టి శ్రీనును ఏ1గా చేర్చారు. 2020లో ఎస్సై, కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించి.. అరెస్టయిన వ్యక్తిని స్టేషన్ నుంచి తీసుకువెళ్లడమే కాకుండా 20 మంది కుర్రాళ్లను పంపి అందరి సంగతీ తేలుస్తానని పోలీసులను బెదిరించిన ఘటనలో క్రైమ్ నం.42తో కేసు నమోదైంది. తాడేపల్లిగూడెం అభివృద్ధికి మోకాలడ్డు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పారీ్టలో చేరిన క్రమంలో 2014లో తాడేపల్లిగూడెం నుంచి కౌన్సిలర్గా గెలిచి బొలిశెట్టి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు (బీజేపీ) మంత్రి అయ్యారు. కట్ చేస్తే.. మాణిక్యాలరావుకు చుక్కలు చూపించి ఆయన్ను మించి సంపాదించడంతో పాటు ఏ ఒక్క అభివృద్ధి పనీ ముందుకు సాగకుండా ఐదేళ్ల పాటు చేయడంలో బొలిశెట్టి సూపర్ సక్సెస్ అయ్యారు. మంత్రి మాణిక్యాలరావు మంజూరు చేయించిన పనులన్నింటినీ కౌన్సిలర్ తీర్మానం పేరుతో అడ్డుకుని పట్టణ అభివృద్ధిని ఐదేళ్లు వెనక్కి నెట్టారు. ప్రధానంగా మోడల్ ప్రాజెక్ట్గా ఏసీ రైతు బజారును మంత్రి మాణిక్యాలరావు గూడెంకు మంజూరు చేయించారు. ఏసీ ఫిష్, నాన్వెజ్ మార్కెట్, కూరగాయల మార్కెట్ అన్ని మున్సిపాలిటీలోని ప్రధాన ప్రాంతంలో ఉన్న ఎకరా స్థలంలో ఏర్పాటు చేయడానికి వీలుగా రూ.9 కోట్ల ప్రాజెక్టు మంజూరైంది. మాణిక్యాలరావుతో ఆధిపత్య పోరు ఉన్న క్రమంలో కౌన్సిల్లో తీర్మానం చేసి స్థలం మంజూరు చేయకుండా రూ.9 కోట్ల ప్రాజెక్టును గూడెంకు రాకుండా చేయడంలో బొలిశెట్టి సఫలీకృతులయ్యారు. అలాగే దాదాపు రూ.10 కోట్ల విలువైన రహదారుల పనులకు తీ ర్మానాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. తాడేపల్లిగూ డెం, పెంటపాడు మండలాల్లో మంత్రి పనులన్నింటికీ అడ్డంకొట్టి తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో మాత్రం తన స్నేహితుడి దగ్గర పర్సంటేజ్ తీ సుకుని పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. -
వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయం
పెనుగొండ: ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయమని, రోజురోజుకూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో అభిమానం పెరుగుతుందని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఆచంట అసెంబ్లీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మంగళవారం పెనుగొండ డాక్టర్ వైఎస్సార్ కూడలి నుంచి, కంచికామాక్షీ ఆలయం, గాంధీ బొమ్మల సెంటర్, రాజీవ్ సెంటర్, బీసీ కమ్యూనిటీ హాల్, సిద్ధాంతం రోడ్డు, దుర్గమ్మ ఆలయం కోటిపల్లి వారి వీఽధి, శ్రీరామ్ నగర్, జవ్వాది వారి వీధి, వేండ్రవారివీఽధిలో ఎన్నికల శంఖారావం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు విజయానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయన్నారు. ఎన్నికల ముందు వరకూ సంక్షేమ పథకాలతో ఏపీ శ్రీలంకగా మారిపోతుందంటూ చంద్రబాబు, వారి దత్తపుత్రుడు ప్రచారం చేశారని, అయితే నేడు వారి మేనిఫెస్టోలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే కొత్త పథకాలుగా ప్రకటించి మరింత మెరుగ్గా చేస్తామనడం ప్రజల మభ్యపెట్టడమేనని ప్రజలు గ్రహించారన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగింపునకు సీఎం వైఎస్ జగన్కు అండగా ఉండడానికి రెండు ఓట్లూ ఫ్యాన్ గుర్తుపైనే వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం పెనుగొండలో జోరు వర్షంలో ప్రచారం నిర్వహించగా, ప్రజలు శ్రీరంగనాథరాజుకు పూలవర్షం కురిపించారు. వర్షంలోనే నాయకులు, కార్యకర్తలు ప్రచారం కొనసాగించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరక్టరు కూనపరెడ్డి లక్ష్మయ్యనాయుడు (నానాజీ), ఎంపీపీ పూతినీడి వెంకటేశ్వరరావు (పెద్ద), జెడ్పీటీసీ పోడూరి గోవర్దన రామయ్య, ఉప సర్పంచ్ ఆకిశెట్టి వరలక్ష్మీ చంటి, ఎంపీటీసీలు మద్దింశెట్టి లక్ష్మీ, తాడి సుబ్బిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మేడపాటి సాయి చంద్రమౌళీశ్వరరెడ్డి, ఎన్నికల పరిశీలకుడు దిరిశాల శ్రీనివాస్, మండల కన్వీనర్లు నల్లిమిల్లి బాబిరెడ్డి, పలివెల శ్రీను, బాలం సత్తిరాజు, సుంకర నాగబాబులు, ఏఎంసీ వైస్ చైర్మన్ తానేటి మల్లి, పార్టీ నాయకులు నూలి తాతాజీ, గ్రంధి లక్ష్మీనారాయణ, నౌడు దుర్గారావు, తానేటి రాంబాబు, చెవ్వేటి రాజు, తిక్కిరెడ్డి పవన్, పాలసత్తిరామిరెడ్డి, చరణ్ రెడ్డి, మేడపాటి వీర్రేడ్డి, కుడిపూడి సత్యనారాయణ, నరేంద్ర, బోణం సుబ్రమ్మణ్యం, కాపిశెట్టి మణికంఠ, రాజేష్ నాయుడు, నాగిశెట్టి నరసింహరావు పాల్గొన్నారు. పెనుగొండ ప్రచారంలో ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు -
సంక్షేమం సగం బలం
పథకాల ద్వారా ఇంటిల్లిపాదికీ లబ్ధి రూ.రెండున్నర లక్షలకుపైగా సాయం చిన్న కుటుంబానికి కొండంత మేలు వయస్సు మీద పడుతున్నా.. కుటుంబం కాడిని బలవంతాన భుజానికెత్తుకుని లాగాల్సిన స్థితి. చింతలున్న చిన్న కుటుంబమమే అయినా, ఆశలను వాయిదా వేసుకోవాలి. ఉన్న కాడికి నాలుగు మెతుకులు తిని, నీడ పట్టున కునుకు తీద్దామనుకొనే లోగా, కష్టాల స్వప్నాలు నిద్రాభంగం కలిగించేవి. ఉన్న ఒక్క బిడ్డ చిన్న ప్రైవేటు ఉద్యోగి. బిడ్డ తెచ్చే నాలుగు రూపాయలు వేన్నీళ్లకు చన్నీళ్లుగా మాత్రమే ఉపయోగపడేవి. వృద్ధాప్య పింఛన్ పొందే అర్హత ఉన్నా, గ్రామంలో ఎవరైనా చనిపోతే చెప్పు, జన్మభూమి కమిటీతో చెప్పించుకో పింఛన్ వస్తుందనే పచ్చనాయకుల ఉచిత సలహాలు. ఐదేళ్ల క్రితం వరకు ఇదే తీరు. రెక్కల కష్టాన్ని నమ్ముకొని గౌరవంగా కుటుంబాన్ని ఈడ్చుకొస్తున్న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి గ్రామంలోని దూలపల్లి సుబ్బారావు కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ వరాల రేడుగా మారారు. -
జనసేన, టీడీపీకి రాంరాం
వైఎస్సార్ సీపీలో చేరిన కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు పెనుగొండ : ఆచంట మండలం పెనుమంచిలికి చెందిన శెట్టిబలిజ నాయకులు మంగళవారం తూర్పుపాలెంలోని కార్యాలయంలో ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో టీడీపీకి చెందిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించి సీఎం జగన్కు అండగా ఉండాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో కంచి భాస్కరరావు, కంచి మాచిరాజు, కడలి రామారావు, కంది కొండయ్య, బొర్రా వెంకటేశ్వర్లు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన, టీడీపీ నాయకుల చేరిక యలమంచిలి : నారినమెరక గ్రామంలో తెలుగుదేశం, జనసేన పార్టీకి చెందిన నాయకులు వైఎస్సార్ సీపీ నాయకుడు ఆరేపల్లి జగదీష్ (రాఖీ) ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు వైఎస్సార్ సీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన నచ్చడం వలనే అనేక మంది తెలుగుదేశం, జనసేన నాయకులు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారంతా పాలకొల్లు ఎమ్మెల్యేగా గుడాల శ్రీహరి గోపాలరావు, నరసాపురం ఎంపీగా గూడూరి ఉమాబాల విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఇసుకపల్లి శ్రీధర్వర్మ, పార్టీ నాయకులు వలవల బాలాజీ, వలవల సత్యధర్మారావు, వడ్డి వసంతం తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో ఇర్రింకి గెద్దయ్య, రాచమళ్ల నాగేశ్వరరావు, తాడి సురేష్, దీపాటి భాను, లింగాల వెంకటరమణ, దిడ్ల సూర్యతేజ, వల్లూరి సన్నిబాబు, తరపట్ల వేణు, పంతకాని వరప్రసాద్, బొడ్డుపల్లి నితిన్, బందుల ప్రవీణ్ (కన్న), తరపట్ల చిట్టిబాబు, పెదపాటి ప్రవీణ్, వడ్డి బాలాజీ, బొర్రా రవి, వడ్డి బాబ్జి ఉన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన 30 కుటుంబాలు నూజివీడు : ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలని ఎమ్మెల్యే, నూజివీడు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తనయుడు మేకా వేణుగోపాల అప్పారావు (చంటినాయన) కోరారు. మండలంలోని అన్నవరానికి చెందిన యాదవ సామాజిక వర్గం యువతతో పాటు 30 కుటుంబాలు చంటినాయన ఆధ్వర్యంలో మంగళవారం టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికి చంటినాయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే సాధ్యమన్నారు. 30కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు. చంద్రబాబు వస్తే రాష్ట్రాన్ని దోచుకోవడం చేయడమే కాకుండా రాష్ట్రం 30ఏళ్లు వెనక్కు వెళ్తుందన్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు గుర్తుగా ఒక్క సంక్షేమ పథకం కూడా లేదన్నారు. ఉన్న పథకాలను నిర్వీర్యం చేయడం, తన వర్గం వారికి దోచిపెట్టడమే చంద్రబాబు పాలన సాగుతుందన్నారు. గతంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని చెప్పి చేయకుండా నిలువునా మోసం చేశారన్నారు. ఇప్పుడు అమలు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడన్నారు. చంద్రబాబు చెప్పేవి సూపర్సిక్స్ కాదని, ఆరు మోసాలని వాటిని ప్రజలు నమ్మడం లేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి రూ.2లక్షల కోట్లు అవసరమని, కాబట్టి చంద్రబాబు ఒక్క హామీ కూడా అమలు చేయరన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అఽభ్యర్థులైన మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కారుమూరి సునీల్కుమార్ యాదవ్లను గెలిపించాలని కోరారు. -
చంద్రబాబు వల్లే అన్యాయం
ఇరగవరం: సజావుగా అందుతున్న సంక్షేమ పథకాలను చంద్రబాబు దుర్మార్గంతో అడ్డుకోవడంతో అవ్వాతాతలకు అన్యాయం జరిగిందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. రేలంగిలో మంగళవారం జోరు వర్షంలోనూ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బైక్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతంరం ఇరగవరం, అర్జునుడుపాలెం, ఓగిడి గ్రామాల్లో పలు సంఘాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. మహిళలు, ఆడపడుచులు పెద్ద ఎత్తున హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. మంత్రి కారుమూరి మాట్లాడుతూ ప్రజలకు నష్టం తప్ప మంచి చేద్దాం అనే ఉద్దేశం లేని వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ప్రజలకు ఏనాడు మంచి చేసింది లేదని, చంద్రబాబు చెప్పాడంటే చేయడని, అదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పాడంటే చేస్తాడని, చెప్పనివి కూడా చేసే మంచి గుణం వైఎస్ జగన్ది అన్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీ ఓటు బ్యాలెట్లో 1లో, ఏమ్మెల్యేగా తనది బ్యాలెట్లో 4వ నంబర్లో ఉంటుందని, రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. జెడ్పీటీసీ సభ్యులు పంపన అంజిబాబు, ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, డీసీఎంఏస్ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు, పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గా ప్రసాద్, నాయకులు వెలగల సాయిబాబారెడ్డి, చోడే జోషి, కొత్తపాడు, కె.ఇల్లిందలపర్రు, సొసైటీ అధ్యక్షులు పెన్మెత్స రామభద్రరాజు, మల్లిరెడ్డి నాగార్జున, మహిళ అధ్యక్షురాలు మెట్ల కిరణ్మయి, నాయకులు పులుపు అనిల్, పులుపు సునీల్, వడ్డే మార్కండేయులు, చేబ్రోలు పెద్దిరాజు, ఘంటా అప్పారావు పాల్గొన్నారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు -
గుడాల గోపికి అడుగడుగునా బ్రహ్మరథం
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి), అతని భార్య మంగాదేవి విస్రృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో గడపగడపకు కార్యక్రమం ద్వారా ప్రజలను పరిచయం చేసుకున్న గోపి ఎన్నికల ప్రచారంలో మరింత దూసుకుపోతున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో పట్టణంలో 31 గ్రామాలు, పాలకొల్లు మండలంలో 27 గ్రామాలు, యలమంచిలి మండలంలో 31 గ్రామాలు, పోడూరు మండలంలో 8 గ్రామాల్లోనూ దాదాపుగా ప్రచారం పూర్తి చేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో యలమంచిలి మండలంలో గోపి ప్రచారం చేస్తున్నారు. గోపి భార్య మంగాదేవి పాలకొల్లు మండలంలో, నియోజకవర్గ సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు యలమంచిలి మండలంలో, టీటీడీ బోర్డు డైరెక్టర్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, అతని భార్య శశికళ పాలకొల్లు మండలంలో, యడ్ల తాతాజీ ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు, ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాలను గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. యలమంచిలి మండలంలో కొందరు వృద్ధులను పలుకరించగా, జగనన్న అందించే సంక్షేమం ఇంకెవరు అందిస్తారని చెబుతు న్నారు. ‘ఉదయాన్నే ఇంటికి వచ్చి వలంటీర్ తలుపు తట్టి పింఛను, ఇంటికే వచ్చి రేషన్, ఇలా ప్రభుత్వ పథకం ఏదైనా సరే వలంటీర్ ఇంటికి వచ్చి అందిస్తున్నారని, ఎవరయ్యా ఇలా అన్నీ ఇంటికి తీసుకువచ్చి ఇచ్చేది.. మా బిడ్డలే మమ్మల్ని చూడడంలేదు.. జగన్బాబు లేకపోతే ఈ పాటికి నా జీవితం ముగిసిపోయేది’ అంటూ ఓ వృద్ధురాలు తన ఆవేదనను వెలిబుచ్చింది. మా సొంత బిడ్డలకే లేనిది ఓ కుటుంబ సభ్యునిగా జగన్ మమ్మల్ని ఆదుకుంటున్నాడని తెలిపింది. మరి చంద్రబాబునాయుడు పెన్షన్ రూ.4 వేలు ఇస్తానంటున్నాడు కదా మరో వెయ్యి ఎక్కువే వస్తుంది కదా అని ఆ వృద్ధులను ప్రశ్నిస్తే ‘నాలుగు కాదు రూ.40 వేలు ఇచ్చినా మాకు అవసరం లేదు. అయినా చంద్రబాబు అమలు చేస్తాడనే నమ్మకం నాకు లేదు. నా జీవితానికి రూ.3 వేలు నగదు, బియ్యం చాలు. జగనే రావాలి జగనే కావాలి. రూపాయికి పావలాకి అమ్ముడుపోయే నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పే నాయకులు మాకు అవసరం లేదు’ వృద్ధులు ఘంటాపధంగా చెబుతున్నారు. -
సమస్యలపై నాన్చడం నచ్చదు..
ఉండి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు సాక్షి: ప్రజాక్షేత్రంలో మీకు ఏ విధమైన గుర్తింపు ఉంది? పీవీఎల్: ప్రజలు నాపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. నీతి, నిజాయితీ గల వ్యక్తిగా నన్ను గుర్తించారు. ముక్కుసూటిగా మాట్లాడటం నా నైజం. ఇది ప్రజలకు ఎంతగానో నచ్చింది. సమస్యపై వచ్చే ప్రజలకు అది న్యాయం జరుగుతుందో లేదో వెంటనే చెప్పడం ద్వారా వారిలో మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. రాజకీయంగా నాయకులు ప్రజల సమస్యలను నాచ్చుతూ వస్తారు. అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అది ప్రజల్ని మోసం చేయడమే. సాక్షి: రాజకీయ నాయకుడిగా మీ ప్రస్థానం? పీవీఎల్: నా తండ్రి పీవీఎల్ తిమ్మరాజు 17 సంవత్సరాల పాటు ఆకివీడు సమితి అధ్యక్షుడిగా నీతి నిజాయితీతో సేవలందించారు. ఆయన వారసత్వంతో యండగండి సొసైటీ అధ్యక్షుడిగా 28 ఏళ్లపాటు రైతులకు సేవలందించా. ఎనిమిదేళ్లు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశాను. ఈ సమయంలోనే జాతీయ స్థాయిలో సొసైటీకి, సొసైటీ అధ్యక్షుడిగా ఉత్తమ అవార్డులు లభించాయి. ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా సేవలందించా. కాంగ్రెస్ పార్టీ లో పనిచేస్తూ తరువాత చిరంజీవి ప్రజారాజ్యంపార్టీలో చేరా. అనంతరం మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేశా. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందా. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నా నిజాయతీ, మంచితనాన్ని గుర్తించి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగించారు. ఈ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. సాక్షి: గత ఎన్నికల్లో ఓటమికి కారణం? పీవీఎల్: ప్రజాసేవకు మించిన ఆనందం ఉండదని భావించి గత ఎన్నికల్లో పోటీకి దిగాను. అయితే ప్రత్యర్థి ప్రలోభాలతోపాటు, ప్రజలు నా సేవల్ని గుర్తించలేకపోయారనేది నా అభిప్రాయం. ఎన్నికల అనంతరం ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడ్డాను. అయినప్పటికీ పార్టీకి కట్టుబడే ఉన్నాను. సాక్షి: ఓడినా.. మీరు నియోజకవర్గంలో సేవలందించారు. పీవీఎల్: గత ఎన్నికల్లో ఓటమి చెందినా కుంగిపోలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నన్ను పిలిచి మంచి వ్యక్తివి, ప్రజలకు సేవలందించు అని ఆదేశించడంతో నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేశాను. గత 58 నెలలుగా అలుపెరుగని సేవలందించాను. నా సొంత పనులకంటే నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాను. నియోజకవర్గంలో రూ.311.74 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాను. పూర్తయ్యే పనులకే కొబ్బరి కాయ కొట్టి, శంకుస్థాపనలు చేయడం నా సిద్ధాంతం. రోడ్లు, డ్రెయిన్లు, ఫిల్టర్ బెడ్లు, ఓహెచ్ఎస్ఆర్లు, విద్యుత్ సబ్స్టేషన్లు, వంతెనల నిర్మాణం పూర్తి చేశాను. సాక్షి: ఈ ఐదేళ్లలో ప్రజల జీవనశైలి మారిందంటారా? పీవీఎల్: సీఎం వైఎస్ జగన్ అమలు జరిపిన సంక్షేమ పథకాలు ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకువచ్చాయి. ముఖ్యంగా పేద వర్గాల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం, పాఠశాలలు, రైతు, మహిళా సంక్షేమం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. అన్నదాతల ఆత్మహత్యలే లేవు. ఆడపడుచులు ఆనందంతో జీవిస్తున్నారు. సర్కారు బడులకు, ప్రభుత్వ దవాఖానాలకు వెళ్లలేమని చెప్పే ప్రజలు.. నేడు వాటి కోసం క్యూ కడుతున్నారంటే జగన్ పాలన ఏ విధంగా ఉందో స్పష్టమవుతుంది. మరో పదేళ్లు జగన్ పాలన కొనసాగితే రాష్ట్రంలో ఇంజినీర్లు, డాక్టర్లు, ఉన్నత ఉద్యోగాల్లో కోకొల్లలుగా యువత స్థానం సంపాదిస్తారు. సాక్షి: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎలా అనిపించింది? పీవీఎల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుజేసిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రతి నాయకుడికీ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ప్రజల ముంగిటకు అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు వెళ్లిన సందర్భంలో ప్రజల ఆనందానికి అవధుల్లేవు. వారి సమస్యలు తక్షణం పరిష్కారం కావడంతో ఎంతో సంతోషించేవారు. సాక్షి: నాలుగు దశాబ్దాల సమస్యను మీరు పరిష్కరించారంట కదా? పీవీఎల్: అవును. నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక సొంత ఇంటి కల. గత పాలకులు, నాయకులు పేదల సొంత ఇంటికలను ఎండమావిగా చూశారు. ప్రతి ఎన్నికల్లో ఇది వారి వాగ్దానంగా మిగిలేది. రెండు తరాలకు చెందిన వారు సొంత ఇంటి కల కోసం ఎదురు చూసి అశువులు బాసారు. సీఎం జగన్ అధికారం చేపట్టిన తరువాత నియోజకర్గంలో 16 వేల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాం. వేలాది మంది సొంత ఇళ్లు నిర్మించుకున్నారు. అద్దె ఇంటి సమస్య, రోడ్ల వెంబడి, శ్మశానవాటికల్లో కాపురాలకు చెల్లుచీటి పెట్టారు. సాక్షి: నియోజకవర్గ ప్రజల్ని మీరు కోరుకునేది? పీవీఎల్: నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ పనిచేసిన పాలకులు ప్రజల సమస్యల్ని, గ్రామాల అభివృద్ధిని పక్కనపెట్టారు. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు రూ.800 కోట్లతో అభివృద్ధి చేశారు. సర్రాజుకు ముందు, తరువాత కూడా ఎవరూ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా నిత్యం ప్రజల్లో ఉంటూ గడపగడపలో ప్రజల్ని పలకరిస్తూ పనిచేసి, గ్రామాల్లో చాలా సీసీ రోడ్లను నిర్మించాను. ప్రధాన రోడ్లను అభివృద్ధి చేశాను. ప్రజలకు విద్యుత్ కోతలు లేకుండా, ఆక్వా రంగానికి విద్యుత్ సమస్య లేకుండా ఉండేందుకు నాలుగు సబ్స్టేషన్లు నిర్మించాను. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడే వ్యక్తులు చేయని పనుల్ని చేసి చూపిన నా సేవల్ని ప్రజలు గుర్తిస్తారని ఆశిస్తున్నా. -
చెల్లెం ఆనందప్రకాష్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు
పాలకొల్లు అర్బన్: ప్రభుత్వం ఎప్పటి నుంచో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎన్నికల కమిషన్ నిలుపుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లెం ఆనందప్రకాష్ అన్నారు. యాళ్లవానిగరువులో తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యాదీవెన, విద్యావసతి పథకాలను ఆపడం సరికాదన్నారు. దీనివల్ల దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎందరో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫీజులు చెల్లించకపోవడం, కళాశాలలు టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, దీంతో విద్యార్థుల నుంచి ప్రతి రోజు ఎస్సీ కమిషన్కి అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాలనలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోరాదన్నారు. ఎస్సీ కమిషన్ కూడా రాజ్యాంగ బద్ధంగా ఏర్పడి న సంస్థే అని చెప్పారు. ఎన్నికల కమిషన్ చర్యలు చూస్తుంటే కేంద్రానికి కొమ్ముకాస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ప్రతిపక్షం వారు ఫిర్యాదు చేస్తే చాలు విచారణ లేకుండా డీజీపీని, పరిపాలనాధికారులను మార్చడం చూస్తుంటే రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని అర్థమవుతుందన్నారు. తెలంగాణలో రైతు భరోసా అమలు చేస్తున్నారని.. అక్కడ లేని నిబంధనలు ఏపీలో ఎందుకు అని ప్రశ్నించారు. -
ముస్లింలకు అండగా జగన్
తాడేపల్లిగూడెం (టీఓసీ): దివంగత నేత వైఎస్సార్ బాటలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ముస్లింలకు అండగా ఉన్నారని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కె నౌషాద్ మోహిద్దీన్ పేర్కొన్నారు. పట్టణంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఏపీ రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలపై రూ.26 వేల కోట్లు ఖర్చు చేశారని కొనియాడారు. ముస్లింలపై కపట ప్రేమ చూపించిన చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు కేవలం రూ.2,650 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. నేటి ప్రభుత్వం నవరత్న పథకాలే కాకుండా అనేక సంక్షేమాలు ముస్లింలకు అందిచినట్లు చెప్పారు. టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లును రద్దు చేస్తామనడం చాలా అన్యాయమని విమర్శించారు. నెల్లూరు సభలో ముస్లింలకు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లుకు గాని, సీఐఏ, ఎన్ఆర్సీ, ఇతర ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇవ్వడం హర్షించదగ్గ విషయం అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకొని ముస్లింల విశ్వాసాన్ని కోల్పోయారని, వారికి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ముస్లింలు అంతా జగన్ వెంటే ఉంటారని, వైఎస్సార్ సీపీకి ఓట్లు వేసి గెలిపించుకుంటామని వెల్లడించారు. -
జగన్కు జైకొట్టిన ఆటో డ్రైవర్లు
తణుకులో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం తణుకు అర్బన్: స్వయం శక్తితో జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లని గుర్తించిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని భారతమాత ఆటో యూనియన్ కార్యదర్శి కంచుమర్తి విశ్వేశ్వరరావు అన్నారు. తణుకు ఆర్టీసీ బస్సు డిపో ఎదురుగా ఉన్న భారతమాత ఆటో స్టాండ్ వద్ద మంగళవారం యూనియన్ సమావేశం అనంతరం సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి ఆటో డ్రైవర్లు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 6 లక్షలకు పైగా ఆటో డ్రైవర్లు తమ కుటుంబాలను ఇదే వృత్తిలో ఉంటూ పోషించుకుంటున్నారని.. అందుకే ఈ పథకం వద్దని తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించినా టీడీపీ తమపై కరుణ చూపించకుండా మేనిఫెస్టోలో ప్రకటించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మా మొర ఆలకించి అమలుకు సాధ్యం కాని ఆ పథకాన్ని తన మేనిఫెస్టోలో పెట్టకుండా మాకు అండగా నిలిచారని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే వాహనమిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.10 వేలు అందజేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఆ మొత్తాన్ని రెట్టింపు చేస్తానని మేనిఫెస్టోలో పెట్టడాన్ని మేమంతా స్వాగతిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్కు తామంతా అండగా నిలబడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భారతమాత ఆటో యూనియన్ సభ్యులు ఎస్.నరసింహమూర్తి, వి.ప్రశాంత్కుమార్, కడలి శ్రీను, వి.పిలిప్, కుక్కల బాలాజీ, కుక్కల నారాయణ, వీరభద్రపురం రాజు, కుక్కల దైబు పాల్గొన్నారు. -
సంక్షేమం సగం బలం
పథకాల ద్వారా ఇంటిల్లిపాదికీ లబ్ధి రూ.రెండున్నర లక్షలకుపైగా సాయం చిన్న కుటుంబానికి కొండంత మేలు వయస్సు మీద పడుతున్నా.. కుటుంబం కాడిని బలవంతాన భుజానికెత్తుకుని లాగాల్సిన స్థితి. చింతలున్న చిన్న కుటుంబమమే అయినా, ఆశలను వాయిదా వేసుకోవాలి. ఉన్న కాడికి నాలుగు మెతుకులు తిని, నీడ పట్టున కునుకు తీద్దామనుకొనే లోగా, కష్టాల స్వప్నాలు నిద్రాభంగం కలిగించేవి. ఉన్న ఒక్క బిడ్డ చిన్న ప్రైవేటు ఉద్యోగి. బిడ్డ తెచ్చే నాలుగు రూపాయలు వేన్నీళ్లకు చన్నీళ్లుగా మాత్రమే ఉపయోగపడేవి. వృద్ధాప్య పింఛన్ పొందే అర్హత ఉన్నా, గ్రామంలో ఎవరైనా చనిపోతే చెప్పు, జన్మభూమి కమిటీతో చెప్పించుకో పింఛన్ వస్తుందనే పచ్చనాయకుల ఉచిత సలహాలు. ఐదేళ్ల క్రితం వరకు ఇదే తీరు. రెక్కల కష్టాన్ని నమ్ముకొని గౌరవంగా కుటుంబాన్ని ఈడ్చుకొస్తున్న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి గ్రామంలోని దూలపల్లి సుబ్బారావు కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ వరాల రేడుగా మారారు. -
చంద్రబాబు కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది
మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు పెనుగొండ: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్.. చంద్రబాబు కమిషన్గా విధులు నిర్వహిస్తున్నట్టు ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఆచంట అసెంబ్లీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మంగళవారం తూర్పుపాలెంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎన్డీయే కూటమిలో చేరిన తర్వాత ఎన్నికల కమిషన్ లేనిపోని నిబంధనలు పెడుతోందన్నారు. ఎక్కడా లేని నిర్ణయాలు రాష్ట్రంలో అమలు చేస్తూ ఎలక్షన్ కమిషన్ చంద్రబాబుకు ఒక తొత్తులా.. వారి కనుసన్నల్లో పనిచేస్తోందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రావలసిన విద్యాదీవెన సుమారు రూ.610 కోట్లు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.847 కోట్లు వారి ఖాతాల్లో జమ కాకుండా ఆంక్షలు విధించడం దారుణమన్నారు. ఇవి కొత్తగా పెట్టిన పథకాలు కావని, రాష్ట్రంలో ఐదేళ్లుగా అమలు చేస్తున్నవేనని గుర్తుచేశారు. ఎన్నికల కమిషన్ పునరాలోచించుకుని విద్యార్థులకు, రైతులకు న్యాయం చేసే విధంగా నిధులను విడుదల చేయాలని, ఈమేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదేశాలు ఇవ్వాలని శ్రీరంగనాథరాజు కోరారు. -
మా గుండెల్లో కొలిచేనేత ఆయన
గతమెంతో ‘హీనం’ ఇక్కడ మగ్గం దగ్గర కనిపిస్తున్న పెద్దావిడ పేరు ఆశపు భ్రమరాంబ. చిన్నప్పటి నుంచి నేత చేసుకోవడం పదీ.. పరకా సంపాదించుకోవడం ఒకటే తెలుసు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం వీవర్స్కాలనీకి చెందిన సూర్యచంద్రరావుతో పెళ్లయింది. భర్త కూడా నేత కార్మికుడే. పెళ్లయినప్పటి నుంచి భర్తతో కలసి వీవర్స్కాలనీలో మగ్గంపైనే కష్టపడుతూ జీవనం సాగించేది. వీరి కుమారుడు నాగరాజు, కోడలు శాంతకుమారి కూడా నేత కార్మికులే. అయితే చేనేత ప్రాభవం బాగా ఉన్న రోజుల్లో వీరికి పెద్దగా ఆర్థికంగా ఒడిదుడుకులు ఉండేవి కాదు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వీరి జీవనం మరీ దుర్భరంగా మారింది. నేత కార్మికులకు, మగ్గందారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడం, ఆరుగాలం మగ్గంపై శ్రమించినా సరైన ఆదాయం లేకపోవడంతో కొన్ని నెలలు మగ్గం మూసేసి వేరే పనులు కూడా చేసుకున్నారు. ఈ బతుకు ఎందుకూ అనిపించేది. 2019 తర్వాత బతుకుపై ‘ఆశపు’ట్టే 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేనేతదారుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు భ్రమరాంబ కుటుంబానికి కలిసి వచ్చాయి. సంక్షేమ ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాలు నవ్వులు పంచాయి. దీంతో మూలన పడిన మగ్గం మళ్లీ పరిగెత్తడం ప్రారంభించింది. ఆ ఇంట్లో మగ్గాల సంఖ్య రెండుకు చేరాయి. ప్రస్తుతం భ్రమరాంబ ఆమె భర్తతోపాటు కొడుకు నాగరాజు, కోడలు శాంతికుమారి అంతా మగ్గాలపై చీరలు నేస్తున్నారు. 5 దఫాలుగా ఆ కుటుంబానికి వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా రూ.2.40 లక్షలు వచ్చాయి. భ్రమరాంబ భర్త చంద్రరావుకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. కోడలు శాంతకుమారికి వైఎస్సార్ చేయూత పథకంలో ఏడాదికి రూ.18,750 చొప్పున రూ.56,250 వచ్చింది. నాగరాజు శాంతకుమారి దంపతులకు 5వ తరగతి, 6వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరికి అమ్మఒడి పథకంలో ఈ 5 ఏళ్లలో రూ.80 వేలు జమయ్యాయి. ఇక భ్రమరాంబతో పాటు కోడలు శాంతకుమారి ఇద్దరికి కూడా పట్టణంలో జగనన్న కాలనీలో ఇళ్లస్థలాలు ఇచ్చారు. ఈ రెండు స్థలాలు కలిపి రూ.15–17 లక్షలు విలువ చేస్తాయి. ఇలా ఈ ఐదేళ్ల కాలంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నుంచి పథకాల రూపంలో వచ్చిన సహాయం మొత్తం సమారు రూ.20 లక్షలకు చేరింది. దీంతో ఆ కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఇప్పుడు అందరూ ఆనందంగా జీవిస్తున్నారు. ఇదంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యం వల్లే సాధ్యమైందని, మేం నిత్యం కొలిచే నేత ఆయన అని ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. – నరసాపురం నవ్వులు పంచిన నవరత్నాలు ఒకప్పుడు భారంగా జీవనం ఆశపు ఇంట సంతోషాల సిరులు -
ఎన్నికల కమిషన్.. చంద్రబాబు జేబు సంస్థా..?
డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఇది రాజ్యాంగ విరుద్ధం తాడేపల్లిగూడెం: స్వత్రంత్ర ప్రతిపత్తి కలిగి ఎన్నికలలో అవాంఛనీయ చర్యలను నియంత్రించాల్సిన ఎన్నికల కమిషన్.. ప్రజలు సిగ్గుపడేలా, హాస్యాస్పదంగా వ్యవహరిస్తుందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విమర్శించారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపురం ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ అంటే చంద్రబాబు జేబు సంస్థా అనే విధంగా చర్యలున్నాయన్నారు. ఎన్నికల కమిషన్ వ్యవసాయ ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యాదీవెన, రైతులకు విత్తనాల సరఫరా వంటి వాటిని అమలు చేయకుండా ఉండటం వివిధ వర్గాలకు నష్టం కలిగించే చర్య అని అన్నారు. తెలంగాణలో అడ్డం రాని ఆంక్షలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వస్తున్నాయన్నారు. సకాలంలో రైతులకు విత్తనాలు సరఫరా చేయకుంటే వారు నారుమళ్లు ఎలా వేసుకుంటారు.. ఇదేమి ఎన్నికల హామీ కాదు కదా అని ప్రశ్నించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం బాబుకు ఇష్టం ఉండదని కొట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా, చంద్రబాబు స్వామ్యమా అని ప్రశ్నించారు. మోదీ, చంద్రబాబు వదిన పురందేశ్వరి చెప్పిన విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమిని ఘోరంగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్సడా వైస్చైర్మన్ వడ్డి రఘురాం పాల్గొన్నారు. జగన్ గెలుపును ఆపలేరు ఎన్నికల కమిషన్ తదితర వ్యవస్థల ద్వారా రాష్ట్రంలో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూసినా, ఎవ్వరూ ఎన్నిరకాలుగా కుట్రలు పన్నినా జగన్ గెలుపును ఆపలేరని గూడూరి ఉమాబాల అన్నారు. కూటమి పార్టీలు ప్రజలకు చెడు చేస్తూ జగన్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో కూటమికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ఈసీది పక్షపాత వైఖరి కొయ్యలగూడెం: ఎలక్షన్ కమిషన్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పక్షపాత వైఖరి అవలంభిస్తుందని వినియోగదారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏఆర్కే హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం అందించే విషయంలో తెలంగాణలో అనుమతించిన ఈసీ ఆంధ్రప్రదేశ్లో అనుమతించకపోవడం అన్యాయం అన్నారు. 2019వ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు ముందు వరకు పసుపు కుంకుమ పథకం పేరిట పదివేల రూపాయలు జమ చేయడం జరిగిందని. ఇప్పుడు రైతులను ఆదుకునే విషయంలో ఈసీ అడ్డుపడుతోందన్నారు. అదేవిధంగా విద్యార్థులకు సంక్షేమ పథకాల ద్వారా అందాల్సిన సొమ్ములు కూడా జమ కాకపోవడంతో తల్లిదండ్రులు వేదన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులను ఎలక్షన్ కమిషన్ బదిలీ చేస్తున్న ప్రక్రియ అనుమానాలకు తావిస్తోందని, ఈసీ వెనుక ఎవరు ఉన్నారనేది ప్రజలందరికీ అర్థమవుతోందని అన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఆంక్షలు విధిస్తున్న ఈసీ నిర్ణయాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారని ఈ విషయంలో రాష్ట్రపతి కలగచేసుకొని రైతులకు విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. -
ఆరోగ్యమస్తు
వైద్యో నారాయణో హరి.. అంటే వైద్యులు దేవతలతో సమానం అని అర్థం. ఆ రోగులకు వైద్యం చేయించుకునేందుకు ఆర్థికంగా చేయూత అందించేవారిని సైతం వారు దేవుడిగానే కొలుస్తారు. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలంలోని పూళ్ల గ్రామంలో ఓ మానసిక వైకల్యం గల బాలుడికి, అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు వైద్యసేవలు అందజేయడంతోపాటు సహాయ నిధి సొమ్ము అందజేసి వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకరించారు. పేదల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితికి సహకారం అందిస్తూ జగన్ మానవత్వాన్ని చాటుకుంటున్నారని, మా కుటుంబాల్లో వెలుగులు నింపిన ఆయనకు జీవితాంతం తాము రుణపడి ఉంటామని ఆయా కుటుంబాల సభ్యులు సంతోషంగా చెబుతున్నారు. – భీమడోలు ●పిల్లాడిని చూసి చలించిపోయారు పూళ్ల పంచాయతీ తూర్పు హరిజనపేటకు చెందిన అందుగుల లాజర్, జయశ్రీ కుటుంబం పడిన వేదన వారి మాటల్లోనే.. మాకు నవదీప్, భార్గవి ఇద్దరు సంతానం. వీరిలో నవదీప్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికితోడు రెండేళ్ల క్రితం నుంచి ఫిట్స్ వచ్చి ఎక్కడపడితే అక్కడ పడిపోయేవాడు. బయటకు వెళ్లినా ఇంటికి తిరిగి వచ్చేవాడు కాదు. ఎవరినీ గుర్తు పట్టేవాడు కాదు. దీనితో కుటుంబమంతా విలవిల్లాడిపోయింది. ఊరంతా తిరిగి పిల్లవాడిని వెతికి ఇంటికి తీసుకురావాల్సిన పరిస్థితి. ఏరోజు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడేది. పిల్లాడి ఆరోగ్యం కోసం 24 ఆసుపత్రులు తిరిగిం.. సుమారు రూ.8 లక్షలు అప్పులు చేసి వైద్యం చేయించినా పరిస్థితి ఆగమ్యగోచరం. ఇంక అప్పు కూడా దొరకని పరిస్థితి. గత ఏడాది సెప్టెంబర్ 16వ తేదీన కాపునేస్తం కార్యక్రమానికి నిడదవోలు వచ్చిన జగనన్నను ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సహకారంతో కలిసి మా గోడును విన్నవించుకున్నాం. ఆయన మా పిల్లాడిని చూసి చలించిపోయారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆరోజు సాయంత్రమే హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చేర్పించేలా చర్యలు తీసుకున్నారు. మా నవదీప్ ఐదు రోజుల్లో సాధారణ స్థితిలో చేరుకుని కోలుకున్నాడు. సుమారు రూ.3.50 లక్షల ఖర్చును ప్రభుత్వం భరించింది. ఇప్పుడు మా అబ్బాయి అందరి పిల్లల్లాగే ఆడుకుంటూ చదువుకుంటున్నాడు. మా దిగులంతా తీరింది. జనవరి 29వ తేదీన భీమవరం వచ్చిన జగనన్నను కలిసి నవదీప్ని చూపించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపాం. ఆస్పత్రి నుంచి డిశ్చార్చి చేసిన తరువాత మందులు వాడుతున్నామని.. ప్రతి నెలా రూ.5 వేలు వరకు ఖర్చవుతున్నాయని.. మందులకు భారంగా ఉందని చెప్పగానే వెంటనే జగనన్న రూ.లక్ష సీఎం సహాయ నిధి చెక్కును అందించారు. మా కుటుంబానికి దైవం వైఎస్ జగన్మోహన్రెడ్డి. జగన్ పాలనలో మాకుటుంబానికి వివిధ పథకాల ద్వారా మొత్తం రూ.11.60 లక్షల వరకు మేలు జరిగింది. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మాకు దక్కలేదు మా కుమార్తె భార్గవికి కడపులో కణితి వచ్చింది. చంద్రబాబు పాలనలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద మాకు సహాయం చేయలేదు. మాలాంటి పేదలకు ఆ పథకం ఉపయోగపడలేదు. రూ.1.09 లక్షల సొంత డబ్బులతో అమ్మాయికి వైద్యం చేయించుకున్నాం. చంద్రబాబును నమ్మవద్దు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం.. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ వ్యయపరిమితిని రూ.25 లక్షలకు పెంచడంతోపాటు 3 వేలకు పైగా వ్యాధులకు చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ వంటి కార్యక్రమాల ద్వారా ఇంటింటికీ వైద్యసేవలు అందిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరెందరినో ఆదుకుంటున్నారు. వైద్య రంగానికి ఇతోధికంగా నిధులు ఖర్చుచేస్తూ ప్రజల ఆరోగ్యానికి జగనన్న భరోసా కల్పిస్తున్నారు. – పుప్పాల శ్రీనివాసరావు, ఎమ్మెల్యే, ఉంగుటూరు నరాల బలహీనత తగ్గింది నా పేరు నూతులపాటి మార్తమ్మ. నాకు భర్త ఏసు, ఇద్దరు సంతానం ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత నరాల బలహీనత వ్యాధికి గురయ్యాను. దీనితో ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, వ్యక్తిగత పనులు సైతం చేసుకోలేక బాధపడేదాన్ని. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం మాది. వైద్యం చేయించుకునే స్తోమత లేదు. మా తమ్ముడు అందుగుల లాజర్ సహాకారంతో జనవరి 29న భీమవరంలో సీఎం జగన్ను కలిశా. ఆయనకు నా బాధ చెప్పగా తక్షణమే వైద్య సహాయం చేయించాలని అధికారులను ఆదేశించారు. భీమవరంలోని వర్మ ఆసుపత్రిలో లక్షలాది రూపాయల వైద్యం ఉచితంగా చేయించారు. దీనితో నేను పూర్తిగా కోలుకున్నాను. మందుల ఖర్చులు కూడా భారం కాకూడదని రూ.లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించారు. ఆయన మేలును మరువలేను. -
రఘరామలీలలు కన్నెత్తి చూడరు.. పట్టించుకోరు
స్వస్థలం ఉండి నియోజకవర్గమైనా.. ఉండేది మాత్రం రాజధానుల్లోనే.. సంక్రాంతి కోడిపందాల సమయంలో హడావుడి తప్ప మిగిలిన రోజుల్లో నియోజకవర్గానికి వచ్చింది అరుదే.. రచ్చబండంటూ.. అందలమెక్కించిన వారిపై నోరుపారేసుకోవడం తప్ప ఎంపీగా తనను గెలిపించిన ప్రజల వైపు కన్నెత్తి చూసింది లేదు.. ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదు.. ఆయనే మాజీ ఎంపీ, టీడీపీ ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు. ఢిల్లీలో తన బిల్డప్ పాచికలు పారకపోవడంతో ఉండిలో టీడీపీ అభ్యర్థిగా గెలుపు కోసం ఆపసోపాలు పడుతున్నారు. సాక్షి, భీమవరం: బ్యాంకు అప్పులకు సంబంధించిన వ్యవహారాలు, సీబీఐ కేసుల నేపథ్యంలో ఢిల్లీలోనే ఉంటూ లాబీయింగ్ చేసుకునేందుకు ఎంపీ సీటుపై చాలానే ఆశలు పెట్టుకున్నారు రఘు రామకృష్ణరాజు. తానే నరసాపురం కూటమి అభ్యర్థినంటూ తాడేపల్లిగూడెం జెండా సభలో స్వయంగా ప్రకటించేసుకున్నారు. ఇంతకన్నా భారీ సభ ఏర్పాటు చేస్తానంటూ బిల్డప్లూ ఇచ్చారు. అంతలోనే సీన్ రివర్స్ అయ్యింది. కేంద్రంలో ఆయన పలుకుబడి ఏ పాటిదో సీట్ల కేటాయింపుల్లోనే తేలిపోయింది. బీజేపీ సీటు మరొకరికి ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోలేదు. మరికొద్ది రోజుల్లో మంచి మాట వింటారంటూ మీడియా ముందు బిల్డప్లు ఇస్తూ ఎన్ని పైరవీలు చేసినా, జిల్లాలోని కూటమి అసెంబ్లీ అభ్యర్థులందరితో సంప్రదింపులు చేయించినా బీజేపీ నిర్ణయాన్ని మార్చలేకపోయారు. ఏదో క చోట నుంచి పోటీ చేయకపోతే తన బిల్డప్లు పనిచేయవనుకున్నారేమో ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు సీటుకు ఎసరుపెట్టి ఉండి అసెంబ్లీ నుంచి పోటీలో నిలిచారు. గెలుపు కోసం ఆపసోపాలు గత ఎన్నికల ప్రచారంలో తప్ప స్వతహాగా రఘురామకృష్ణరాజు ప్రజల మధ్య తిరిగింది ఏమీలేదు. నియోజకవర్గానికి వచ్చినా సొంత సామాజికవర్గంలోని కొందరితో తప్ప మిగిలిన సామాజిక వర్గాల వారిని పట్టించుకున్నది లేదు. నిత్యం తన సొంత వ్య వహారాల్లో తలమునకలై ఉండే ఆయనకు, నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు, వారి కష్టాలు, మౌలిక పరమైన అవసరాల గురించి అవగాహన ఏ మేరకు ఉందనేది ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఆయనకు అదే పెద్ద సమస్యగా తయారైందని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఎల్లప్పుడూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి అహరి్నశలు పాటుపడిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు, మరోపక్క రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కలిగి, ప్రస్తుతం టీడీపీ రెబల్గా బరిలో నిలిచిన వేటుకూరి వెంకట శివరామరాజు నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం అధికారపక్ష అభ్యర్థి పీవీఎల్కు లాభించే అంశం కావడంతో పాటు ఇప్పటికే ఆయన ప్రచారంలో ముందంజలో ఉన్నారు. దళితులు, క్రైస్తవులపై చిన్నచూపు దళితులు, క్రైస్తవులు టీడీపీకి ఓట్లే వేయరన్న భావనలో రఘురామకృష్ణరాజు వారిని చిన్నచూపు చూస్తున్నారన్న ప్రచారం ఎక్కువగానే ఉంది. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి ఆయన పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదంటున్నారు. ఎప్పు డూ ఢిల్లీ, హైదరాబాద్లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరని, సామాన్యులకు అపాయింట్మెంట్ దొరకడం కష్టమేనంటూ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం రఘురామను ఇరకాటంలో పడేస్తుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. తన ఎన్నికల ప్రచారానికి పెద్దగా స్పందన లేకపోవడం, రోజురోజుకూ విజయావకాశాలు సన్నగిల్లుతుండటంతో నిరాశకు లోనై చిన్నపాటి విషయాలకు కేడర్పై ఆయన చిర్రుబుర్రులాడుతున్నారని సమాచారం. అసమ్మతి సెగలు టీడీపీకి చెందిన కొందరు నేతలు పార్టీని వీడి రెబల్గా పోటీలో ఉన్న శివరామరాజు వెంట వెళ్లిపో గా మిగిలిన వారిలో అధిక శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు వర్గమే. సీటు మార్చొద్దంటూ రామరాజుకు మద్దతుగా ఆందోళన చేసిన టీడీపీ నాయకులను బెట్టింగ్రాయుళ్లని రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేయడం పార్టీలో అంతర్గతంగా అసమ్మతి జ్వాలలు రగిలిస్తూనే ఉంది. పైకి రామరాజుతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్నా సిట్టింగ్ సీటును లాక్కోవడంపై ఆయన వర్గం ఎంత వరకు తనకు సహకరిస్తారనే అనుమానం రఘురామను వెంటాడుతోందంటున్నారు. జనసేన కేడర్పైనే ఆయన నమ్మకం పెట్టుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాపులను ఉద్దేశించి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, కాపు యువకులపై కేసులు పెట్టి స్టేషన్లో పెట్టించిన సంఘటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘మీరు కాపు కాసేవారు మీ పని మీరు చేసుకోండి.. నార తీసే వృత్తి వేరు, తాట తీసే వృత్తి వేరంటూ’ ఆయన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన కేడర్ అన్నీ మర్చిపోయి ఆయనకు ఎంతవరకు కలిసివస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రశాంతంగా ఐసెట్
భీమవరం: పట్టణంలోని ఎస్ఆర్కేఆర్, శ్రీవిష్ణు, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలల్లో సోమవారం ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మూడు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 800 మందికి గాను 51 మంది గైర్హాజరయ్యారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 150 మందికి 142 మంది, మధ్యాహ్నం 150 మందికి 142 మంది హాజరయ్యారు. శ్రీవిష్ణు కళాశాలలో ఉదయం 100 మందికి 95 మంది, మధ్యాహ్నం 100 మందికి 88 మంది హాజరయ్యారు. డీఎన్నార్ కళాశాలలో ఉదయం 150 మందికి 144 మంది, మధ్యాహ్నం 150 మందికి 138 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పరీక్షలు ప్రశాంతం జరిగాయి. కాపులకు మేలు చేసింది సీఎం జగనే పాలకొల్లు అర్బన్: రాష్ట్రంలో తెలగ, బలిజ, కాపు, ఒంటరి కులాలకు సీఎం జగన్ మోహన్రెడ్డి ఒక్కరే మేలు చేశారని యునైటెడ్ కాపు సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ఉనికెల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పాలకొల్లు మండలం పూలపల్లిలో ఆయన సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి)కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులకు మేలు చేసే విధంగా కాపు నేస్తం పథకాన్ని కొనసాగిస్తూ 2024 మేనిఫెస్టోలో సీఎం జగన్ హామీ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గీయులంతా సీఎం జగన్కి అండగా నిలవాలని కోరారు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగించేలా ఐదేళ్లు పనిచేసిన సీఎం జగన్ ప్రజల హృదయాల్లో నిలిచారన్నారు. పసుపు చొక్కాతో నిమ్మల ప్రచారం పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులోని ఎన్నికల ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులతో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పచ్చ చొక్కా వేసుకుని వచ్చి మాట్లాడటంపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ఎంఎంకేఎన్ మున్సిపల్ హైస్కూల్లో సోమవారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం ఐదు బూత్లను ఏర్పాటుచేశారు. ఇక్క డ ఓటింగ్ సరళిని పరిశీలించడానికి పచ్చ చొక్కా వేసుకుని వచ్చిన ఎమ్మెల్యే నిమ్మలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తించారని అంటున్నారు. 20 రోజులు.. రూ.1.87 కోట్లు చిన వెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో సోమవారం లెక్కించారు. శ్రీవారికి విశేష ఆదాయం సమకూరింది. గత 20 రోజులకు గాను నగదు రూపేణా రూ.1,87,54,150 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. కానుకల రూపంలో 241 గ్రాముల బంగారం, 6.410 కేజీల వెండితో పాటు విదేశీ కరెన్సీ యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ డాలర్లు 56, ఇంగ్లాండ్ పౌండ్స్ 2, అరబ్ ఎమిరటీస్ థీరమ్స్ 5, సౌదీ అరేబియన్ రియాల్స్ 4, కువైట్ దినార్ 1 లభించా యన్నారు. అలాగే రద్దయిన పాత రూ.2 వేలు, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.31,500 లభించాయన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement