Abu Dhabi
-
యూఏఈ: 500 మందికి పైగా భారతీయులకు క్షమాభిక్ష
అబుదాబి: భారత్తో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో యూఏఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారీ సంఖ్యలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. అందులో భారత్కు చెందిన వాళ్లే 500 మందికి పైగా ఉండగా.. వాళ్లంతా జైళ్ల నుంచి విడుదలైనట్లు సమాచారం. రంజాన్ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అక్కడి జైళ్లలో ఉన్న 1,295 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. మరోవైపు ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా 1,518 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్లోని జైళ్లలో మగ్గుతున్న వివిధ దేశాలకు చెందిన ఖైదీలకు తాజా క్షమాభిక్ష వర్తిస్తుందని అటార్నీ జనరల్, ఛాన్సలర్ ఎస్సమ్ ఇస్సా అల్ హుమైదాన్ ప్రకటించారు. రంజాన్ మాసం సందర్భంగా ఇలా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం.. విడుదల చేయడం యూఏఈలో ఆనవాయితీగా వస్తోంది. అయితే సత్ప్రవర్తనను ఆధారంగా చేసుకునే ఆయా ఖైదీలను ఎంపిక చేసి విడుదల చేస్తుంటారు. అంతేకాదు వాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అవసరమయ్యే ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. -
పెళ్లి వేడుకలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ దంపతులు.. ఫోటోలు షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్ (ఫోటోలు)
-
ఎగిరే ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి..
ప్రపంచంలో తొలి ఫ్లయింగ్ ట్యాక్సీలు (flying taxi) అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. 2025 చివరి నాటికి ఈ ఫ్యూచరిస్టిక్ సర్వీస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి (Abu Dhabi) వేదికగా ప్రపంచానికి పరిచయం కానుంది.అంతేకాకుండా అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ కంపెనీ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) ఎయిర్ క్రాఫ్ట్ల ఉత్పత్తి కూడా ఇక్కడే ప్రారంభం కానుందది. ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చినట్లయితే, అబుదాబి నగర వ్యాప్తంగా వెర్టిపోర్ట్లు ఏర్పాటవుతాయి. వీటిని కలుపుతూ వినూత్నమైన మిడ్నైట్ ఈవీటోల్లు (eVTOL) ఒక్కో ట్రిప్కు నలుగురు ప్రయాణికులను తీసుకువెళతాయి. ప్రయాణ సమయాన్ని 80 శాతం వరకు తగ్గిస్తాయి.ఈవీటోల్ వాహనాలను విస్తృత ప్రయాణ సాధనాలుగా ఉపయోగించాలన్న ఆలోచన 2016లో ఉబెర్ తన ఎలివేట్ కాన్ఫరెన్స్లో ఈ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టినప్పుడు విస్తృత దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు కార్ రైడ్లను బుక్చేసుకుంటున్నంత సులభంగా భవిష్యత్తులో ఫ్లయింగ్ ట్యాక్సీలను కూడా బుక్ చేసుకునే వెసులుబాటు తీసుకురావాలని ఈ భావనకు కంపెనీ రూపకల్పన చేసింది.అప్పటి నుండి ఈవీటోల్ పరిశ్రమ ఆసక్తిని పెంచుతూ వస్తోంది. దీనికి సంబంధించి 300 కంటే ఎక్కువ స్టార్టప్లు ఉద్భవించాయి. ఇవి సమిష్టిగా దాదాపు 10 బిలియన్ డాలర్ల నిధులను పొందుతున్నాయి. అయితే పరిశోధనా సంస్థ ఐడీటెక్ఎక్స్ (IDTechEx) మాత్రం ఇటీవలి తన అధ్యయనంలో 5% కంటే తక్కువ కంపెనీలు మాత్రమే దీర్ఘకాలికంగా మనుగడ సాగిస్తాయని అంచనా వేసింది. కాగా వీటిలో ఆర్చర్ ఏవియేషన్ మొదటి మూడు అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది.ఆర్చర్ అబుదాబిలో తన ప్రారంభ వాణిజ్య సేవను ప్రారంభించడం ద్వారా ముందస్తు ప్రయోజనాన్ని పొందాలని భావిస్తోంది. మిడ్నైట్ ఈవీటోల్ గరిష్టంగా గంటకు 240 కి.మీ. వేగాన్ని చేరుకోగలదు. ఆర్చర్ అమెరికా, భారత్, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలలో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ, దాని యూఏఈ కార్యకలాపాలు అత్యంత ముందస్తు దశలో ఉన్నాయి. -
అరేబియా అద్భుతం
చాలామంది దుబాయికి వెళ్తారు. కానీ దాని పొరుగునే ఉండే అబూ ధాబీని ఎక్కువమంది పట్టించుకోరు. దుబాయిని న్యూయార్క్తోనూ, అబూ ధాబీని ప్యారిస్తోనూ పోల్చవచ్చు. రాజసం ఉట్టిపడే బంగళాలు, విశాలమైన రహదారులు, సజావుగా సాగిపోయే ట్రాఫిక్... ఒక్కమాటలో అబూ ధాబీకి వెళ్తే అరేబియా అద్భుత ప్రపంచంలో కాలు పెట్టినట్లే ఉంటుంది!మీకు దుబాయి తెలుసుగా? బంధుమిత్రుల్లో చాలామంది వెళ్లి ఉంటారు కూడా. అయితే దుబాయి నుంచి ఓ గంటన్నర ప్రయాణం దూరంలో ఉండే ఎమిరేట్స్ రాజధాని అబూ ధాబీ గురించి మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. వెళ్లి ఉండరు కూడా. ఇవ్వాళ మీతో కొన్ని దేదీప్యమానమైన విషయాలను పంచుకుంటాను. పోయిన వారం నేను అక్కడికి వెళ్లాను. చూడముచ్చటగా ఉందని చెప్పాలి. చూసి వచ్చినందుకు మనసులో ఓ సంతృప్తి మిగిలిపోయింది. దుబాయి మాదిరి తళుకుబెళుకుల్లేవు. గ్లామర్, హడావిడి అంతకంటే లేవు!అబూ ధాబీలో ప్రపంచం పరుగులు పెట్టదు. నెమ్మదిగా ఓ నదిలా హొయలు పోతూ సాగుతూంటుంది. పోలిక కావాలంటే... దుబాయ్ని న్యూయార్క్తోనూ, అబూ ధాబీని ప్యారిస్తోనూ పోల్చవచ్చు. రాజసం ఉట్టి పడే బంగళాలు, విశాలమైన రహదారులు, సజావుగా సాగిపోయే ట్రాఫిక్... వీటన్నింటి మధ్య అక్కడక్కడా లెక్కలేనన్ని ఆడంబ రాలు, హోటళ్లు, రెస్టా రెంట్లు! ఇదీ అబూ ధాబీ వర్ణన!ఎమిరాతీ జనాలు తమ నగరాన్ని బాగా ఆస్వాదిస్తూంటారు. షాపింగ్, డైనింగ్ ఏదైనా కానీ దుబాయి కంటే బాగా ఎంజాయ్ చేస్తూంటారు. విదేశీయులు ఎక్కువగానే ఉన్నా... వారు దుబాయిలో మాదిరిగా స్థానికులను బెదరగొట్టేంత స్థాయిలో లేరనే చెప్పాలి. అబూ ధాబీలో ఉన్న సాంస్కృతిక అద్భుతాల గురించి చెప్పాలంటే ‘ది లూవ్’, ‘షేక్ జాయెద్ మ్యూజియం’లను ప్రస్తావించాలి. ఈ రెండు ఉదాహరణలు కచ్చితంగా ఇచ్చి తీరాల్సినవే. షేక్ జాయెద్ సంగ్రహాలయంలో నేనుకొన్ని గంటల సమయం గడిపాను. అందులో ఉన్న వస్తువులు మాత్రమే కాదు... ఎంతో అద్భుతమైన ఊహతో వాటిని ప్రదర్శించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. చరిత్ర గర్భంలో కలిసిపోయిన ఒక్కో కాలానికి ప్రతిరూపంగా ఈ సంగ్రహాలయ గదులను తీర్చిదిద్దారు. అలాగే చాలా తెలివిగా వేర్వేరు నాగరికతలకు సంబంధించిన వస్తువు లను ప్రదర్శించారు. ఫలితంగా వీటిని వేర్వేరు వస్తువు లుగా కాకుండా... ఒకే కాలంలో మానవ నాగరికతలు సాధించిన విజయాలను చూసినట్టుగా ఉంటుంది. చైనా నుంచి మెసపటోమియా వరకూ... అలాగే మెక్సికో నుంచి ఫ్రాన్స్ వరకూ వేర్వేరు నాగరికతలకు సంబంధించిన చారిత్రక అవశేషాలను ఇక్కడ భద్రపరిచారు. ఇంకోలా చెప్పాలంటే చోళుల కాలం నాటి విగ్రహాలు మొదలుకొని పర్షియన్ల కుండలు, బెల్జియం నేతపనుల నుంచి టర్కీ విగ్రహాలను ఒకే గదిలో చూడవచ్చు! ఏ శతాబ్దంలోనైనా మనిషి ఊహ ఎంత అద్భుతంగా ఉందో చెప్పే ప్రతీకాత్మ కత అన్నమాట!షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ను ఒక్క మాటలో వర్ణిస్తా. చాలా పెద్దది. చూడటం మొదలుపెడితే పూర్తయ్యేందుకు రెండు కిలోమీటర్ల దూరం నడవాలి. కానీ ఇందులోని వైపరీత్యాలను మాత్రం కచ్చితంగా అధ్యయనం చేయా ల్సిందే. భూగర్భంలోని కారు పార్కింగ్ తరువాత స్టార్ బక్స్, కోస్టా కాఫీలతోపాటు చాక్లెట్లు, సుగంధ ద్రవ్యాల దుకాణాలున్న షాపింగ్ ప్రాంతానికి వెళతాం. ఆ తరువాత స్వచ్ఛమైన తెల్లటి పాలరాతి పరచుకున్న గోడలున్న భారీ హాల్లోకి ప్రవేశిస్తాం. హాల్లోని స్తంభాలపై అతి కౌశల మైన కళాకృతులు, అది కూడా విలువైన రంగురాళ్లు పొదిగి నవి ఉన్నాయి. పైకప్పు నుంచి జిలుగు వెలుగుల క్రిస్మస్ ట్రీల మాదిరిగా వేలాడే భారీ షాండ్లియర్లు... ఓహ్! అరే బియా అద్భుత ప్రపంచంలో కాలు పెట్టినట్లే ఉంటుంది!అతిథులను మనసారా ఆహ్వానించే రెస్టారెంట్లు దుబాయిలో మాత్రమే ఉంటాయని అనుకునేవాడిని. అబూ ధాబీ కూడా ఈ విషయంలో ఏమీ తీసిపోదు. ఫోర్ సీజన్స్లోని బర్గర్లు, స్టీక్స్ కానివ్వండి... సెయింట్ రెజిస్ లోని భారతీయ వంటకాలైనా కానివ్వండి... ఫాక్వెట్లోని ఫ్రెంచ్ మాధుర్యాలు, సముద్ర తీరంలోని ‘తాషా’లో తీరికగా చేసే భోజనం కానివ్వండి... ఒక్కోటి పొట్టకు స్వర్గాన్ని రుచి చూపించేవే. కాకపోతే, ఇక్కడికొస్తే అప్పటి వరకూ లేని తిండిపోతుతనం మనల్ని చుట్టేయడం మాత్రం గ్యారెంటీ!నేను ఇప్పటివరకూ చాలా దేశాల్లోని హోటళ్లలో బస చేశాను కానీ... ‘ది ఎమిరేట్స్ ప్యాలెస్’ ముందు అవన్నీ దిగదుడుపే! భారత్లోని ‘లేక్ ప్యాలెస్’, ‘తాజ్మహల్’లు కూడా దీనిముందు గల్లీ హోటళ్లలా చిన్న బోతాయి. పచ్చటి పచ్చికబయళ్లున్న రూమ్ టెర్రస్లో కూర్చుని సముద్రాన్ని చూస్తూ కాఫీ తాగడం... డిసెంబరు చలిలో సూర్యకిరణాలు నులి వెచ్చగా తాకడం... కవిత్వం చెప్పుకునేంత అద్భుతమైన అను భూతి. మొబైల్ ఫోన్ లేకుండా కూడా కాలం ఎంచక్కా గడచి పోతుందనేందుకు ఈ అనుభూతి ఒక ఉదాహరణంటే ఒట్టు!ఇంకో ముఖ్యమైన సంగతి. తప్పక చెప్పాల్సింది కూడా! ఎమిరాతీ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. అందుకే ఇక్కడ అంతా ఒక పద్ధతి ప్రకారం నడిచిపోతూంటుంది. ఒకవేళ పొరబాటున ఎవరైనా నిబంధనలు మీరారో... జరిమానాలు వీపు విమానం మోత మోగిస్తాయి. రెడ్ లైట్ దాటారంటే ఐదు వేల దిర్హమ్ల చమురు వదులుతుంది. వచ్చే ఏడాది నుంచి దీన్ని ఏకంగా యాభై వేల దిర్హమ్లకు పెంచుతున్నారు. డాలర్లలో చెప్పాలంటే 15 వేలు. రూపాయల్లోనైతే రూ. 12.73 లక్షలు! రోడ్లపై అడ్డదిడ్డంగా నడిచే మనిషిని గానీ, ఒక్క హారన్ మోతగానీ వినలేదంటే నమ్మండి!అబూ ధాబీ ఓ అద్భుత ప్రపంచం అనేంతగా దాన్ని వర్ణించానా? వాస్తవం ఏమిటంటే, దుబాయిలా కాకుండా... అబూ ధాబీ నిశ్శబ్దంగానే మీ అభిమానాన్ని చూరగొంటుంది. మీకు తెలియను కూడా తెలియదు. దుబాయిదంతా చెమ్కీల అంగీలే! కళ్లూ, చెవులు మదిపై చెడామడా దాడులు చేసే టైపు! దుబాయిని చూడంగానే ఆహా ఓహో అనిపిస్తే... పొరుగునే ఉండే అబూ ధాబీ మాత్రం నెమ్మదిగా మీ మనసుల్లోకి చేరి మత్తెక్కిస్తుంది. చిరకాలం ఒక జ్ఞాపకంలా నిలిచిపోతుంది. ఎప్పుడైనా అరబ్ దేశాల వైపు వెళ్లే పని పడిందనుకోండి... అబూ ధాబీని చూసి రావడం మరచి పోకండే! మరపురాని అనుభూతిని మిగులుస్తుంది. అందుకే, నేనూ ఇంకోసారి అక్కడకు వెళ్లాలని ఇప్పటికే తీర్మానించుకున్నా!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మేము అదానీ వెంటే...
న్యూఢిల్లీ: క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్నకు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు. గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తదితరులపై అమెరికాలో ఆరోపణలు వచ్చినప్పటికీ తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచనేమీ లేదని అబు ధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) వెల్లడించింది. హరిత ఇంధనం, పర్యావరణ అనుకూల రంగాల్లో అదానీ గ్రూప్ చేస్తున్న కృషిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. ఐహెచ్సీ 2022లో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్మిషన్లో (ఏటీఎల్) చెరి 500 మిలియన్ డాలర్లు, అదానీ ఎంటర్ప్రైజెస్లో 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏజీఈఎల్, ఏటీఎల్లో ఒక శాతం పైగా వాటాలు విక్రయించినప్పటికీ అదానీ ఎంటర్ప్రైజెస్లో మాత్రం 5 శాతం పైగా వాటాలు పెంచుకుంది. మరోవైపు, అంతర్జాతీయ భాగస్వాములు కూడా అదానీ గ్రూప్నకు మద్దతు తెలిపారు. అదానీ గ్రూప్తో భాగస్వామ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని శ్రీలంక పోర్ట్స్ అథారిటీ తెలిపింది. దేశంలో పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోందని వివరించింది. అదానీ గ్రూప్ 1 బిలియన్ డాలర్లతో కొలంబో టెరి్మనల్ను గ్రూప్ అభివృద్ధి చేస్తోంది. మరోవైపు, టాంజానియా ప్రభుత్వం కూడా అదానీ పోర్ట్స్తో ఒప్పందాలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై ఎలాంటి ఆందోళన లేదని, కాంట్రాక్టులన్నీ దేశ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. దార్–ఎ–సలామ్ పోర్టులోని 2వ కంటైనర్ టెర్మినల్ నిర్వహణకు టాంజానియాతో అదానీ పోర్ట్స్ ఇటీవలే 30 ఏళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అధికారులకు లంచాలిచ్చారని అదానీపై అమెరికాలో ఆరోపణలు రావడంతో గ్రూప్ కంపెనీల షేర్లు కుదేలుకావడం, అభియోగాలేమీ తీవ్రమైనవి కావని సంస్థ స్పష్టతనివ్వడంతో మళ్లీ పుంజుకోవడం తెలిసిందే. -
ఫిల్ సాల్ట్ ఊచకోత.. ఒకే ఓవర్లో 34 పరుగులు! వీడియో వైరల్
అబుదాబి టీ10 లీగ్-2024ను ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఘనంగా ఆరంభించాడు. ఈ లీగ్లో టీమ్ అబుదాబికి ప్రాతినిథ్యం సాల్ట్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం షేక్ జాయెద్ స్టేడియంలో అజ్మాన్ బోల్ట్స్తో జరిగిన మ్యాచ్లో సాల్ట్ విధ్వంసం సృష్టించాడు.80 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా అజ్మాన్ బోల్ట్స్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నైబ్ను ఓ ఆటఆడేసుకున్నాడు. అతడి వేసిన 5వ ఓవర్లో సాల్ట్.. 5 సిక్స్లు, ఓ ఫోరుతో ఏకంగా 34 పరుగులు పిండుకున్నాడు. తొలి రెండు బంతులను మిడ్-వికెట్ మీదగా సిక్సర్లగా మలిచిన సాల్ట్.. ఆ తర్వాత మూడో బంతిని బౌండరీకి తరలించాడు.అనంతరం ఆఖరి మూడు బంతులను రెండు లాంగ్-ఆన్, లాంగ్-ఆఫ్ మీదగా సిక్స్లు బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్లో 19 బంతులు ఎదుర్కొన్న సాల్ట్.. 2 ఫోర్లు, 6 సిక్స్లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసం ఫలితంగా టీమ్ అబుదాబి లక్ష్యాన్ని కేవలం 5.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి చేధించింది.చదవండి: విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు Salt makes it spicy! 🌶️🥵The swashbuckling English opener smacked 34 runs in an over and finished with 53* (19) leading Team Abu Dhabi to a thumping win in the #AbuDhabiT10 opener! 👊#ADT10onFanCode pic.twitter.com/V0ZiTNjldp— FanCode (@FanCode) November 21, 2024 -
ఐదేళ్లకే పుస్తకాన్ని రచించి రికార్డు సృష్టించింది..!
కథలు వినడమే కాదు, చెప్పడానికి కూడా ఇష్టపడుతుంటారు కొంతమంది చిన్నారులు. అయితే ఈ చిన్నారికి మాత్రం కథలు రాయటం కూడా ఇష్టమే! అలా అతిచిన్న వయసులోనే ఏకంగా ఓ పుస్తకాన్ని రచించి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఈ ఐదేళ్ల బాలిక పేరు అల్ఫయ్ అల్ మర్జూకీ. ‘ది లాస్ట్ ర్యాబిట్’ అనే పేరుతో పుస్తకాన్ని రచించి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. జంతువుల మధ్య ఏర్పడిన స్నేహానుబంధాన్ని అందమైన కథగా మలచి ఈ పుస్తకం రాసింది.ఇంగ్లిష్, అరబిక్ బాషలలో ప్రచురించిన ఈ పుస్తకం ఇప్పటికే వెయ్యి కాపీల వరకు అమ్ముడైంది. పుస్తకంలోని పాత్రలన్నింటికీ తన స్నేహితుల పేర్లనే పెట్టిందట! నిద్రపోయే ముందు తన తల్లిదండ్రులు కథలు చదివి వినిపించేవారు. అలా తనకు కథలపై ఆసక్తి పెరిగింది. మూడేళ్ల వయసులో తానే స్వయంగా ఒక పూర్తి కథను తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆమె ఆసక్తిని గుర్తించి, పుస్తక రచనలో శిక్షణ ఇచ్చారు. అలా కథను రాయడంతో పాటు, వాటికి సంబంధించిన బొమ్మలు వేయడం కూడా నేర్చుకుంది. మరో రెండు కథలు ‘క్యూట్ క్యాట్’, ’ హ్యాపీ ప్రిన్సెస్’ అనే పుస్తకాలు కూడా త్వరలోనే రానున్నాయట! అంతేకాదు, తన తమ్ముడు హమద్కు కూడా పుస్తక రచనలో శిక్షణ ఇస్తోంది. రచనలు కొనసాగిస్తూనే, పెద్దయ్యాక ఫ్యాషన్ డిజైనర్ అవుతానని చెబుతోంది ఈ చిన్నారి. (చదవండి: జస్ట్ ఐదేళ్లకే యోగా గురువుగా చిన్నారి..!) -
బాస్కెట్ బాల్ గేమ్ కోసం అబుదాబి వెళ్లిన 'మట్కా' బ్యూటీ నోరా ఫతేహి (ఫోటోలు)
-
#IIFAAwards2024 : అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక (ఫొటోలు)
-
#IIFAUtsavam2024 : అబుదాబిలో ఘనంగా ఐఫా.. మెరిసిన తారలు (ఫొటోలు)
-
ఇంధన రంగంలో సహకరించుకుందాం
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్, యూఏఈ మధ్య సంబంధాలతోపాటు ఇరుదేశాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. గాజాలోని తాజా పరిస్థితులతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇంధన రంగంలో సహకారానికి సంబంధించి భారత్, యూఏఈ నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ(అండోక్)– ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్), అండోక్–ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్(ఐఎస్పీఆర్ఎల్) మధ్య దీర్ఘకాలం ఇంధన సరఫరాకు ఒప్పందాలు కుదిరాయి. అలాగే అబుదాబీలోని బరాఖా అణువిద్యుత్ కేంద్రం నిర్వహణ కోసం ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ(ఈఎన్ఈసీ)–న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) మధ్య మరో ఒప్పందం కుదిరింది. అండోక్–ఊర్జా భారత్ మధ్య ప్రొడక్షన్ కన్సెషన్ అగ్రిమెంట్ కుదిరింది. అంతేకాకుండా భారత్లో ఫుడ్పార్కుల ఏర్పాటు కోసం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, అబుదాబీ డెవలప్మెంట్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సీ మధ్య ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అబుదాబీ యువరాజు భారత పర్యటన కోసం ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం రాజ్ఘాట్ను సందర్శించాయి. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులరి్పంచారు. యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారం ద్వారా భారత్, యూఏఈ మధ్య సంబంధాలు నానాటికీ బలోపేతం అవతుండడం పట్ల రాష్ట్రపతి ఈ సందర్భంగా హర్షం వ్యక్తంచేశారు. -
Rajinikanth: అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న రజినీకాంత్ (ఫొటోలు)
-
అబూదాబి హిందూ ఆలయంలో సామాన్య భక్తుల సందడి!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రాతితో నిర్మించిన మొదటి హిందూ దేవాలయాన్ని సామాన్యుల కోసం తెరిచారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అబుదాబిలోని ఈ హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేపై అల్ రహ్బా సమీపంలో 27 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.700 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం కోసం భూమిని యూఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది. అబుదాబిలోని ఈ తొలి హిందూ దేవాలయం నాగర్ శైలిలో నిర్మితమయ్యింది. ఇదే శైలిలో అయోధ్యలోని రామాలయాన్ని నిర్మించారు. అబూదాబి ఆలయ వాలంటీర్ ఉమేష్ రాజా తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్లో 20 వేల టన్నులకు పైగా సున్నపురాళ్లను 700 కంటైనర్లలో అబుదాబికి తీసుకువచ్చారు. అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్)తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో.. ‘నిరీక్షణ ముగిసింది! అబుదాబి ఆలయం ఇప్పుడు సందర్శకులు , సామాన్య భక్తుల కోసం తెరిచారు. సోమవారం మినహా అన్ని రోజుల్లో ఈ ఆలయం ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందని’ పేర్కొంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ‘ఆలయంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి, ఈ ప్రాంగణాన్ని క్రమబద్ధంగా నిర్వహించడానికి భక్తులు ఆలయ మార్గదర్శకాలను పాటించడం అవసరం’ అని పేర్కొన్నారు. -
కలిసి నడుస్తోన్న భారత్!
భౌగోళిక రాజకీయ స్థిరత్వంపై భాగస్వామ్య ఆసక్తి దృష్ట్యా ఈ ప్రాంత భద్రత విషయంలో భారతదేశం పెద్ద పాత్రనే పోషిస్తోంది. గత సంవత్సరం యూఏఈతో, ఫ్రాన్స్ తో తన మొదటి త్రైపాక్షిక విన్యాసాలను భారత్ నిర్వహించింది. ప్రస్తుతం భారత నౌకాదళం వాయవ్య అరేబియా సముద్ర జలాల్లో అసాధారణంగా చురుకుగా ఉంది. హౌతీల హెచ్చరికలకు గురైన వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తోంది. అంతేకాదు, బహ్రెయిన్లో ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా నేతృత్వంలోని కంబైన్్డ టాస్క్ ఫోర్స్లో భారతదేశం పూర్తి స్థాయి సభ్యదేశంగా మారింది. పశ్చిమాసియాలో ఈ విధమైన భారతదేశ ప్రయత్నాలు.. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల రీత్యా ముఖ్యమైన వ్యూహాత్మక అవకాశాలకు దారితీశాయి. ఇటీవల భారతదేశ విదేశాంగ విధానం ఆసక్తికరమైన ఒక వైరుద్ధ్యాన్ని కనబరిచింది. కేంద్ర ప్రభుత్వం తూర్పు వైపు చూడటం, తూర్పు దేశాలతో వ్యవహ రించడం గురించి మాట్లాడుతోంది కానీ వాస్తవానికి అది పశ్చిమ దేశాలతోనే ఎక్కువగా ఉంది. ఆ వైరుద్ధ్యం ఎలాగున్నా ప్రధానమంత్రి మోదీ స్వయంగా పశ్చిమాసియా దేశాలను ఆకర్షించడంలో అపార మైన సమయాన్ని, కృషిని పెట్టుబడిగా పెట్టారు. ఈ కారణంగా.. ఇంధనం మీద, ప్రవాసులపైన ఆధారపడిన మన సంబంధాలు ఇప్పుడు రాజకీయ, ఆర్థిక, రక్షణపరమైన ప్రయోజనాలను పొందు తున్నాయి. వాస్తవానికి చైనా మాదిరిగా పశ్చిమాసియా ప్రాంతంలో పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం భారతదేశానికి లేదు, అయితే ప్రవాస భారతీయులు, అమెరికా, ఇజ్రాయెల్,ఫ్రాన్స్ లతో భాగస్వామ్యం భారత్కి ఆ దిశగా ఇతర ప్రత్యామ్నాయ ఎంపికలను కల్పిస్తోంది. ఇజ్రాయెల్, ఇండియా–యూఏఈ, యు.ఎస్.లతో కూడిన ఐ2యూ2 గ్రూపింగ్లోనూ; ఇండియా, మధ్యప్రాచ్యం, యూరోప్ ఎకనామిక్ కారిడార్లోనూ భారతదేశ భాగస్వామ్యంలో ఈ చొరవ వ్యక్తమవుతోంది. మొదటిది ఇజ్రాయెల్, ఇండియా, యూఏఈ, అమె రికాలను కలుపుతూ ఒక రకమైన పాశ్చాత్య క్వాడ్గా పరిగణన పొందు తోంది. ఇక రెండోది యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్లనుంచి వెళుతున్న మల్టీమోడల్ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశాన్ని యూర ప్తో అనుసంధానించడానికి అమెరికా ముందుకు తెచ్చిన ప్రతిష్ఠా త్మకమైన కనెక్టివిటీ వెంచర్. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ ఏడోసారి యూఏఈ పర్యటనకు ఈ నెల ప్రారంభంలో వెళ్లారు. అబుదాబీలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించి, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేశారు. ఆ తర్వాత ఆయన ఖతార్కు వెళ్లారు. గూఢచర్యం ఆరోపణతో అక్కడ ఖైదీలుగా ఉన్న ఎనిమిది మంది భారతీయులకు ఖతార్ రాజరికపు క్షమాపణనుపొందే క్రమంలో 2048 వరకు 78 బిలియన్ డాలర్ల విలువైన సహజ వాయువు దిగుమతి ఒప్పందాన్ని పొడిగించగలిగారు. ఈ ప్రాంతంలో ముఖ్యమైన ‘ప్లేయర్’ అయిన చైనా తన ఆటను జాగ్రత్తగా ఆడుతోంది. గల్ఫ్ దేశాలు, పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య భారతదేశం తన స్థానాన్ని నిర్దేశించుకునే ప్రయత్నం చేస్తున్న సమ యంలోనే... చైనా ఇజ్రాయెల్ నుండి పక్కకు తొలిగిపోయింది. పైగా తటస్థ, సంభావ్య శాంతికర్తగా తనను తాను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈజిప్ట్, ఇరాన్ నుండి సౌదీ అరేబియా, ఒమన్ వరకు మొత్తం ప్రాంతాన్ని తన పెట్టుబడితో, ప్రాధాన్యంతో చుట్టు ముడుతున్న చైనాకు పోటీదారుగా ఉద్భవించడానికి భారతదేశం ఇప్పుడు పావులు కదుపుతోంది. ఇటీవలి కాలంలో యూఏఈ భారతదేశ రెండవ అతి పెద్ద ఎగు మతి మార్కెట్గా ఉద్భవించింది. 2022లో ఇరుపక్షాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. సంవత్సరంలో యూఏ ఈతో భారత వాణిజ్యం 16 శాతం పెరిగి 85 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశంతో ద్వైపాక్షిక మదుపు ఒప్పందం (బీఐటీ), స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) రెండింటిపై సంతకం చేసిన ఏకైక దేశం యూఏఈ. ఈ విధానంలో భాగంగా ఒక ప్రధాన ప్రయత్నం ఏమిటంటే, జెబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్లో రిటైల్, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ సౌకర్యాల సృష్టి ద్వారా భారతీయ ఎగుమతుల్ని ప్రోత్సహించడం. భారత్ మార్ట్ అనే జాయింట్ వెంచర్తో ఇది లాజిస్టిక్స్, పోర్ట్ కార్యకలాపాలు, సముద్ర సేవలలో ప్రత్యేకత కలిగిన డీపీ వరల్డ్ అనే యూఏఈ కంపెనీతో ముడిపడి ఉంది. భౌగోళిక రాజకీయ స్థిరత్వంపై భాగస్వామ్య ఆసక్తి దృష్ట్యా, ఈ ప్రాంత భద్రత విషయంలో భారతదేశం పెద్ద పాత్ర పోషిస్తోంది. గత సంవత్సరం యూఏఈతో, ఫ్రాన్స్తో తన మొదటి త్రైపాక్షిక విన్యా సాలను భారత్ నిర్వహించింది. ప్రస్తుతం భారత నౌకాదళం వాయవ్య అరేబియా సముద్రజలాల్లో అసాధారణంగా చురుకుగా ఉంది. హౌతీల హెచ్చరికలకు గురైన వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తోంది. బహ్రెయిన్లో ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా నేతృత్వంలోని కంబైన్్డ టాస్క్ ఫోర్స్లో భారత్ పూర్తి స్థాయి సభ్యదేశంగా మారింది. ఈ ప్రాంతంలో భారత్కు అవకాశాల కొరత లేదు. సౌదీ అరే బియా ప్రిన్్స మొహమ్మద్ బిన్ సల్మాన్ వంటి పాలకులు భారత్కు తలుపులు తెరిచేశారు. అంతర్జాతీయ గోల్ఫ్ నుండి ప్రీమియర్ సాకర్ వరకు, భవిష్యత్ కొత్త నగరం నుండి ప్రపంచ విమానయాన సంస్థను నిర్మించడం వరకు ప్రతిదానిలో పెట్టుబడి పెట్టడానికి లేదా పెట్టు బడిని ప్రతిపాదించడానికి వారు ముందుకొచ్చారు. యూఏఈకిచెందిన అతి పెద్ద సావరిన్ వెల్త్ ఫండ్ భారతీయ మౌలిక సదుపా యాల కోసం 75 బిలియన్ డాలర్లకు పైగా మదుపు చేయడానికి కట్టు బడింది. సౌదీ కంపెనీలు 100 బిలియన్ డాలర్లను ఆఫర్ చేశాయి. సంపన్న అరేబియా రాజ్యాలు రెండూ చమురును దాటి తమ ఆర్థిక ప్రణాళికల్ని ముందుకు తీసుకెళ్లే మార్గాల్ని భారత ఆర్థికవృద్ధిలో చూస్తున్నాయి. సౌదీ రాజు ‘విజన్ 2030’... రెండు ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహించడానికి, సౌదీ వెల్త్ ఫండ్ అయిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి పిలుపునిచ్చింది. అదిప్పుడు 718 బిలియన్ డాలర్ల వరకు చేరుకుంది. సౌదీలు తమ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర చాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో ఉన్నారు. సాంకేతికత బదిలీపై, అభివృద్ధిపై షరతులు విధించిన చైనా కంపెనీలు తిరిగి సౌదీలకు అపూర్వ మైన ఒప్పందాల్ని అందించడానికి చైనా ఆర్థిక సమస్యలే ఒప్పించాయి. ఈ పరిణామాలకు వెలుపలే మిగిలిన ఒక ప్రధాన దేశం ఇరాన్. అమెరికా ఆంక్షలే దీనికి కారణం. ఇష్టం ఉన్నా లేకున్నా పాకిస్తాన్, మధ్య ఆసియాకు సంబంధించి భారత్ లెక్కలలో ఇరాన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది భారతదేశానికి దగ్గరగా ఉన్న హైడ్రోకార్బన్ దేశం కూడా. చైనీయుల విషయానికొస్తే సౌదీ–ఇజ్రాయెల్కు సంబంధించి తమ ఇటీవలి ఎత్తుగడల విషయమై వారు పునరాలోచనలో పడినా, ఇప్పటికీ కొనసాగుతున్న సౌదీ–ఇరాన్ ఘర్షణ విషయమై మధ్యవర్తిత్వం నెరపటంలో వారు విజయవంతమయ్యారు. చైనా తన పెట్టుబడులను ఈ ప్రాంతం అంతటా విస్తరించినప్ప టికీ, ఇరాన్లో దాని వాగ్దానాలను అమలుపరచలేదు. యూఏఈ, సౌదీ అరేబియా (ఒక్కొక్కటి 8 బిలియన్ డాలర్లు), టుర్కీయే (5.8 బిలియన్ డాలర్లు) ఇరాక్ (4.3 బిలియన్ డాలర్లు) కంటే 2013–16 కాలంలో 16 బిలియన్ డాలర్ల విలువైన చైనీస్ పెట్టుబడితో దానిపెద్ద లబ్ధిదారుగా పాకిస్తాన్ నిలిచింది. ఇరాన్కు 0.35 బిలియన్ డాలర్లే లభించాయి. సాంకేతికత, ఆయుధాల ఎగుమతి దన్నుగా ఉన్న చైనాతో పాటుగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం భారత దేశానికి లేదు. కానీ తనకున్న అపారమైన వలస నైపుణ్యాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్లతో భాగస్వామ్యం ఇండియాకు ఇతర ప్రత్యామ్నాయాల ఎంపికలకు వీలు కల్పిస్తోంది. ప్రస్తుతానికి, పశ్చిమాసియా ప్రాంత భౌగోళిక రాజకీయ భవి ష్యత్తు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో మసకబారిపోయి ఉంది. ఇజ్రాయెల్తో సంబంధాల్ని మామూలు స్థితికి తెచ్చే విధానం నుండి యూఏఈ వైదొలగనప్పటికీ, శాంతికై సౌదీలు ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు. ఈలోగా ఇథియోపియా, ఇరాన్, ఈజిప్ట్లతో పాటు యూఏ ఈ, సౌదీ అరేబియా రెండూ విస్తరించిన బ్రిక్స్లో చేరిపోయాయి. పశ్చిమాసియాలో ఈ విధమైన భారతదేశ ప్రయత్నాలు... దేశా నికి భద్రత, ఆర్థిక ప్రయోజనాలలో ముఖ్యమైన వ్యూహాత్మక అవకా శాలను తెరవడానికి దారితీశాయి. అయితే ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదం, చైనా ప్రాంతీయ ఆకాంక్షలు రేపిన అల్లకల్లోలం మధ్య న్యూఢిల్లీ జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. - వ్యాసకర్త ‘డిస్టింగ్విష్డ్ ఫెలో’, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ - మనోజ్ జోషీ -
అబుదాబిలో కలిసి డీల్!.. పవన్ కల్యాణ్పై సంచలన ఆరోపణలు
-
బంధం బలపడుతోంది!
ప్రధానమంత్రిగా తన రెండో విడత పదవీకాలం ముగిసిపోనున్న వేళ నరేంద్ర మోదీ చేస్తున్న తుది అంతర్జాతీయ పర్యటనల్లో ఒకటి గత రెండు మూడు రోజులుగా ఆసక్తి రేపుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో, ఆ వెంటనే ఖతార్లో సాగిన మోదీ పర్యటన ఘన విజయం సాధించిందనే చెప్పాలి. అబుదాబిలో స్వామి నారాయణ్ ఆలయ ప్రారంభోత్సవం, ఈ పర్యటనకు సరిగ్గా ఒక రోజు ముందే ఖతార్ నుంచి ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళాధికారుల విడుదల, దుబాయ్లోని వరల్డ్ గవర్నమెంట్ సమిట్లో ఇతర దేశాలు చెవి ఒగ్గి మన మాట వినేలా చేయడంలో భారత విజయం... ఇవన్నీ ఛాతీ ఒకింత ఉప్పొంగే క్షణాలు. కృత్రిమ మేధ (ఏఐ), క్రిప్టో కరెన్సీ సహా పలు అంశాలపై ప్రపంచ దేశాల మధ్య సహకారానికి పిలుపునిస్తూ, ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది సమ్మిళిత, స్వచ్ఛ, పారదర్శక, పర్యావరణ హిత ప్రభుత్వాలని భారత ప్రధాని పేర్కొనడం సైతం ఆకర్షించిందనే చెప్పాలి. వెరసి, అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడితో భారత ప్రధానికి ఉన్న ప్రత్యేక అనుబంధం రెండు దేశాలనూ మరింత సన్నిహితం చేస్తోంది. నమ్మకమైన ఇలాంటి మిత్రదేశం చలవతో గల్ఫ్ ప్రాంతంలో భారత ప్రాబల్యం మరింత పెరగడం ఖాయమనిపిస్తోంది. తాజా పర్యటనలో భాగంగా యూఏఈ రాజధాని అబుదాబిలో ‘ఎహ్లాన్ మోదీ’ (మోదీకి స్వాగతం) కార్యక్రమం అట్టహాసంగా సాగింది. అక్కడి పాలకులను ప్రశంసిస్తూ, ప్రవాస భారతీ యులను ఉత్తేజపరుస్తూ ఆ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ హంగామా కానీ, ఆ మర్నాడు చేసిన భారీ హిందూ దేవాలయ ప్రారంభోత్సవం కానీ భారత్, గల్ఫ్సీమల మధ్య బలపడుతున్న బంధా నికి ప్రతీకలే. చెప్పాలంటే, మన దేశం దృష్టిలో పశ్చిమాసియాకు ముఖద్వారం అబుదాబి. అందుకే 2015 ఆగస్ట్లో మోదీ తొలిసారిగా ఈ గల్ఫ్దేశాన్ని సందర్శించారు. 1981లో ఇందిరా గాంధీ అనంతరం భారత ప్రధాని ఒకరు అక్కడికి వెళ్ళడం అదే తొలిసారి. మూడు దశాబ్దాల పైచిలుకు తర్వాత మొదలుపెట్టినా అప్పటి నుంచి ఈ తొమ్మిదేళ్ళలో 7 సార్లు యూఏఈ వెళ్ళారు మోదీ. విస్తృత ద్వైపాక్షిక అజెండాకూ, ఇరు దేశాల మధ్య బలమైన బంధానికీ అది బలమైన పునాది అయింది. పనిలో పనిగా యూఏఈలోని ప్రవాస భారతీయుల దీర్ఘకాలిక వాంఛకు తగ్గట్టుగా హిందూ ఆలయ నిర్మాణానికి స్థలం కోరారు. ఆ దేశం అంగీకరించింది. సంప్రదాయవాద ఇస్లామిక్ దేశంలో, పూర్తిగా ఆ దేశ పాలకుల అండతో, 27 ఎకరాల విశాల ప్రాంగణంలో అత్యంత భారీ హిందూ దేవాలయ నిర్మాణం జరగడం, దాని ప్రారంభోత్సవానికి భారత ప్రధాని వెళ్ళడం అనూహ్యం, అసాధారణం. ఇరుదేశాల మధ్య గాఢమైన బంధాన్ని పరస్పర ప్రయోజనాలు ప్రోది చేశాయి. యూఏఈలో దాదాపు 35 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారని లెక్క. ఏడు దేశాల సమూహమైన యూఏఈ మన వాళ్ళకు ఉపాధి అందించే కేంద్రం. ఫలితంగా, అక్కడి నుంచి మన దేశానికి ధన ప్రవాహం సరేసరి. గల్ఫ్సీమకు సైతం మనం వాణిజ్యానికీ, వ్యూహాత్మకంగా నమ్మదగిన దేశమయ్యాం. వీటన్నిటి ఫలితంగా స్థానిక రాజకీయాలతో సంబంధం లేకుండా కొన్నేళ్ళుగా బంధం బలపడిందన్న మాట. అసలు పశ్చిమాసియాలోని వివిధ శక్తిసంపన్న దేశాలతో చారిత్రకంగా మన దేశానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సున్నీల ప్రాబల్యమున్న సౌదీ అరేబియా నుంచి షియాలు చక్రం తిప్పే ఇరాన్ వరకు అన్నీ మనకు మిత్రదేశాలే. ఆ మధ్య కొన్నేళ్ళుగా అరబ్ ప్రపంచానికీ, ఇజ్రాయెల్కూ మధ్య సర్దుబాటు చేసే క్రమంలో పశ్చిమాసియాతో మన బంధం మరింత దృఢమవుతూ వచ్చింది. ఇక, భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాల మధ్య ఐ2యూ2 సాంకేతిక సహకారం నిమిత్తం 2022 జూలైలో అమెరికాతో కలసి మనం సంతకాలు చేశాం. ఖతార్ సైతం భారత్లో గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. అంతేకాక, భారత్ చేసుకొనే ద్రవీకృత సహజవాయు (ఎల్ఎన్జీ) దిగుమతుల్లో సగభాగం ఖతార్ చలవే. పైగా రష్యా ఇంధనంపై ఆధారపడడాన్ని తగ్గించుకొనేలా ఒప్పందాల కోసం యూరప్ సైతం ఈ ప్రాంతం వైపు చూస్తున్న సమయంలో... భారత్ – ఖతార్ల మధ్య దీర్ఘకాలిక ఇంధన సరఫరా ఒప్పందం సంతోషదాయక విషయం. నిజానికి, 2022లోనే ఇరుదేశాలూ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి, 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలని బాస చేసుకున్నాయి. ఇంధనం, డిజిటల్ లావాదేవీలు సహా పలు అంశాలపై ఒప్పందాలు కుదరడం విశేషం. ఇక,ఇండియా – మధ్యప్రాచ్యం– యూరప్ ఆర్థిక నడవాకు సంబంధించి ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒడంబడిక అత్యంత కీలకమైనది. చైనా చేపట్టిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’కు ప్రత్యామ్నా యమని భావిస్తున్న నడవాను గత సెప్టెంబర్లో ఢిల్లీలో జీ20 సదస్సు వేళ ప్రకటించారు. గాజాలో యుద్ధం కారణంగా దాని భవిష్యత్తుపై ప్రస్తుతం కొంత నీలినీడలు పరుచుకున్నా ఒక్కసారి అమలైతే ప్రాంతీయ అనుసంధానాన్ని అది పెంచుతుంది. అబుదాబిలో దిగితే అచ్చం స్వదేశంలో ఉన్నట్టే ఉందని భారత ప్రధాని వ్యాఖ్యానించడం గమనార్హం. వినడానికి కాస్త అత్యుక్తిగా అనిపించినా, ఆ మాటల్లో వాస్తవం లేకపోలేదు. భారత్ – అరబ్ ఎమిరేట్స్ మధ్య సాంస్కృతికంగా, ఆర్థికంగా, భౌగోళిక రాజకీయాల పరంగా సత్సంబంధాల సంచిత ఫలితమది. ముస్లిమ్ మెజారిటీ దేశంలో ఒక అతి పెద్ద హిందూ ఆలయ నిర్మాణం పెరుగుతున్న ధార్మిక సహిష్ణుతకు చిహ్నమనే చెప్పాలి. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఆయుధాలు, సైనిక టెక్నాలజీల విషయంలోనూ గల్ఫ్, భారత్ కలసి అడుగులు వేస్తే మంచిది. పశ్చిమ హిందూ మహా సముద్రంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. పరస్పర వ్యూహాత్మక ప్రయోజనాలూ నెరవేరుతాయి. -
మరో ముస్లిం దేశంలో హిందూ దేవాలయం.. త్వరలోనే నిర్మాణం!
యూఏఈలోని అబుదాబిలో నిర్మితమైన మొదటి హిందూ దేవాలయం బుధవారం (ఫిబ్రవరి 14)నాడు ప్రారంభమయ్యింది. బీఏపీఎస్ నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇప్పుడు అబుదాబి తర్వాత మరో ముస్లిం దేశంలోనూ హిందూ దేవాలయం నిర్మితం కాబోతోంది. ఇందుకోసం ఆ దేశ రాజు నుంచి భూమిని విరాళంగా అందించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. యూఏఈ తర్వాత మరో ముస్లిం దేశమైన బహ్రెయిన్లో హిందూ దేవాలయాన్ని నిర్మించనున్నారు. ఈ ఆలయం కూడా అబుదాబిలో నిర్మితమైన దేవాలయం మాదిరిగానే ఉండనుంది. ఈ ఆలయాన్ని బోచాసన్ నివాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ(బీఏపీఎస్) నిర్మించబోతోంది. ఈ నేపధ్యంలో బీఏపీఎస్ ప్రతినిధి బృందం బహ్రెయిన్ పాలకునితో సమావేశమైంది. ఆలయం కోసం బహ్రెయిన్ ప్రభుత్వం భూమిని కేటాయించింది. దీంతో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి భూమిని కేటాయించినట్లు స్వయంగా ప్రకటించారు. దీనికి ముందు స్వామి అక్షరతి దాస్, డాక్టర్ ప్రఫుల్ల వైద్య, రమేష్ పాటిదార్, మహేష్ దేవ్జీ తదితరులు ఆలయ నిర్మాణం విషయమై చర్చించేందుకు బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ను కలిశారు. అన్ని మతాల ప్రజలను స్వాగతించడం, వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహించడం తమ ఉద్దేశమని బీఏపీఎస్ పేర్కొంది. బహ్రెయిన్లోని హిందూ ఆలయ నిర్మాణానికి భూమిని ఇచ్చినందుకు భారత ప్రధాని మోదీ.. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. -
BAPS temple: సువర్ణాధ్యాయం
అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబీలో రూపుదిద్దుకున్న హిందూ ఆలయాన్ని ప్రపంచ మానవాళి ఉమ్మడి వారసత్వ విలువలకు నూతన ప్రతీకగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో మత సామరస్యానికి, ఐక్యతకు చిహ్నంగా అది విలసిల్లుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం సంస్థ (బాప్స్) ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ స్వామి నారాయణ్ ఆలయాన్ని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయ పద్ధతిలో లేత గులాబి రంగు ధోవతి, కుర్తా, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి అర్చకులు, పురోహితులతో కలిసి పూజాదికాలు తదితరాల్లో పాల్గొన్నారు. దేవతా మూర్తులకు హారతులిచ్చారు. యూఏఈ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, స్వామి నారాయణ్ సాంప్రదాయికులతో పాటు పలు మత సంప్రదాయాలకు చెందిన ఆధ్యాత్మిక పెద్దలు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అనంతరం వేలాదిగా పాల్గొన్న భక్తులనుద్దేశించి మోదీ మాట్లాడారు. ‘‘ఈ ఆలయ నిర్మాణం ద్వారా మానవ చరిత్రలోనే సువర్ణాధ్యాయానికి యూఈఏ తెర తీసింది. 140 కోట్ల మంది భారతీయుల మది గెలుచుకుంది’’ అంటూ కొనియాడారు. భారతీయుల ఆకాంక్షలను సాకారం చేసినందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్కు కృతజ్ఞతలన్నారు. ఆలయ నిర్మాణానికి ఆయన అందించిన అండదండలు మరవలేనివని ప్రశంసించారు. ‘‘ఈ ఆలయంలో అడుగడుగునా మత వైవిధ్యం కొట్టొచ్చినట్టు కని్పస్తుంది. యూఏఈ అనగానే గుర్తొచ్చే బుర్జ్ ఖలీఫా, షేక్ జాయేద్ మసీదులకు ఇకపై స్వామి నారాయణ్ ఆలయం కూడా తోడవుతుంది. దీని సందర్శనకు మున్ముందు భారీగా భక్తులు తరలి వస్తారు’’ అని ఆశాభావం వెలిబుచ్చారు. ఇటీవలే అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని ప్రారంభించుకున్నామంటూ గుర్తు చేసుకున్నారు. ఆ వెంటనే అబుదాబీలోనూ ఆలయాన్ని ప్రారంభించే అదృష్టం తనకు దక్కిందన్నారు. ఇది భారత్తో పాటు దేశ మత విశ్వాసానికి, సంస్కృతికి కూడా అమృత కాలమేనన్నారు. సుత్తి, ఉలి చేబట్టిన మోదీ... అంతకుముందు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న వారందరినీ మోదీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సుత్తి, ఉలి చేబూని అక్కడి రాతిపై వసుధైవ కుటుంబకం అంటూ స్వయంగా చెక్కారు. ఆలయ నిర్మాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. -
యూఏఈలో అతిపెద్ద హిందూ దేవాలయం..సామరస్యానికి ప్రతీక..
-
భారత్ యూఏఈ దోస్తీ జిందాబాద్
అబుదాబి: యూఏఈ, భారత్ మైత్రి ప్రపంచానికే ఆదర్శనీయమని ప్రధాని నరేంద్ర మోదీ శ్లాఘించారు. మంగళవారం అబూదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన ‘అహ్లాన్ (హలో) మోదీ’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దాదాపు 50,000 మంది పాల్గొన్న కార్యక్రమం ‘హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ’, ‘వుయ్ లవ్ మోదీ’, ‘ భారత్ మాతా కీ జై’, ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తిపోయింది. స్టేడియం బయట మోదీకి యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ సాదర స్వాగతం పలికారు. ప్రేక్షకులనుద్దేశించి మోదీ ఏమన్నారంటే... ‘‘యూఏఈ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో వచ్చి మీరంతా చరిత్ర సృష్టించారు. భారత్లోని విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన వారూ ఉన్నారు. అందరి హృదయాలను యూఏఈ కలిపింది. ఇక్కడి ప్రతి ఒక్కరి శ్వాస, గుండె చప్పుడు, స్వరం, ప్రతి గళం ‘భారత్, యూఏఈ దోస్తీ జిందాబాద్’ అని నినదిస్తోంది. ఇరు దేశాల మైత్రి ప్రపంచానికే ఒక మోడల్గా మారింది. 21వ శతాబ్ది మూడో దశకంలో కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. రెండు దేశాల భాగస్వామ్యం అన్ని రంగాల్లోనూ సమున్నత శిఖరాలకు చేరుతోంది. రోజు రోజుకూ ఈ బంధం మరింత బలపడాలని భారత్ మనసారా కోరుకుంటోంది. ప్రతిభ, సృజన, సంస్కృతిలో మన అనుబంధం దాగి ఉంది’’ అని మోదీ అన్నారు. భారతీయ భాషల్లో అంతర్భాగంగా కలిసిపోయిన అరబిక్ పదాలను ప్రస్తావించారు. ఆ పదాలను మోదీ ఉచ్ఛరించినప్పుడల్లా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది ‘140 మంది భారతీయుల సందేశాన్నిమోసుకొచ్చా. అదేంటంటే.. మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది. ఈ పదేళ్లలో ఏడు సార్లు ఇక్కడికొచ్చా. ఈరోజు కార్యక్రమం నా స్మృతిపథంలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జయేద్’ నాకు రావడం నిజంగా నా అదృష్టం. ఇది నాకు మాత్రమే కాదు 140 కోట్ల భారతీయులకు గర్వకారణం. సుఖమయ జీవనం, సులభతర వాణిజ్యానికి ఇరు దేశాలు కృషిచేస్తున్నాయి. 2047 కల్లా ‘అభివృద్ధి చెందిన భారత్’ ప్రతి ఒక్క భారతీయుడి లక్ష్యం. మోదీ గ్యారెంటీ అంటే ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడమే. ప్రధానిగా మూడోదఫా పాలనలో భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారుస్తానని గ్యారెంటీ ఇస్తున్నా’’ అని మోదీ వ్యాఖ్యానించారు. తర్వాత స్టేడియంలో ఓపెన్టాప్ బ్యాటరీ వాహనంలో స్టేడియంలో అంతా కలియతిరిగారు. ప్రేక్షకులకు అభివాదం చేశారు. జాతీయ జెండాలతో, సంప్రదాయ భారతీయ వస్త్రధారణలో విచ్చేసిన జనంతో స్టేడియం భారతీయతను సంతరించుకుంది. మోదీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో కొన్ని వాక్యాలు మాట్లాడారు. -
అరబ్బుల రాజధానిలో...అబ్బురాల ఆలయం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో హిందూ ఆలయం. కొన్నాళ్ల క్రితం దాకా అసాధ్యమైన ఊహగా తోచిన ఆ ఆలోచన ఇప్పుడు సాకారమైంది. యూఏఈ రాజధాని అబుదాబిలో ఏకంగా 27 ఎకరాల్లో సువిశాలమైన ఆలయం సర్వాంగ సుందరంగా రూపొందింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆరంభానికి సిద్ధమైంది. అదే బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) మందిరం. యూఏఈలోనే గాక మొత్తం మధ్యప్రాచ్యంలోనే పూర్తి హిందూ సంప్రదాయ రీతుల్లో నిర్మితమైన తొలి రాతి ఆలయమిది. భారత్తో యూఏఈ పటిష్ట బంధానికే గాక ఆ దేశ మత సామరస్యానికి కూడా ప్రతీకగా ఈ మందిరం అలరారనుంది... విశేషాలెన్నో... బాప్స్ ఆలయం ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు 30 లక్షల దాకా భారతీయులున్న యూఏఈలో ఆలయాలు లేకపోలేదు. దుబాయ్లో ఇప్పటికే రెండు హిందూ దేవాలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి. అయితే అవి చూసేందుకు విల్లాల మాదిరిగా ఉంటాయి. యూఏఈ మొత్తంలో పూర్తి హిందూ శైలిలో రూపొందిన తొలి ఆలయం బాప్స్ మందిరమే... ► ఇది దుబాయ్–అబుదాబి హైవే సమీపంలో వద్ద 27 ఎకరాల్లో నిర్మితమైంది. ► దీని నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చయింది. మొత్తం నిర్మాణం బాప్స్ సంస్థ కనుసన్నల్లో జరిగింది. ► 108 అడుగల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మొత్తం 55 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయం రూపుదిద్దుకుంది. ► దీని నిర్మాణానికి దాదాపు మూడున్నరేళ్లు పట్టింది. రాజస్తాన్, గుజరాత్కు చెందిన 2 వేల మందికి పైగా కార్మికులు, నిపుణులు మూడేళ్ల పాటు శ్రమించి 402 తెల్లని పాలరాతి స్తంభాలను చెక్కారు. ► ఆలయ నిర్మాణంలో స్టీల్, కాంక్రీట్, సిమెంట్ ఏ మాత్రమూ వాడలేదు. అయోధ్య రామాలయం మాదిరిగానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాళ్ల వరుసలను నేర్పుగా పరస్పరం కలుపుతూ పోయారు. ► ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన పాలరాతి తదితరాలను పూర్తిగా రాజస్తాన్లోని భరత్పూర్ నుంచి, శిల్పాలను భిల్వారా నుంచి తెప్పించారు. లోపలి నిర్మాణాల్లో ఇటాలియన్ మార్బుల్ వాడారు. ► మందిర పునాదుల్లో 100కు పైగా సెన్సర్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం. భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత, ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పట్టిస్తాయి. ► వీటిని మొత్తం 25 వేల పై చిలుకు విడి భాగాలుగా భారత్లో నిపుణులైన పనివాళ్లతో తయారు చేయించి యూఈఏలో జోడించడం విశేషం! ► ఆలయ కాంప్లెక్సులో ప్రార్థన మందిరం, సందర్శకుల కేంద్రం, థీమాటిక్ గార్డెన్లు, గ్రంథాలయం, గ్యాలరీ, ఎగ్జిబిషన్ సెంటర్లు, ఏకంగా 5,000 మంది పట్టే రెండు కమ్యూనిటీ హాళ్లతో పాటు ప్రత్యేకించి పిల్లల కోసం ఆటస్థలం కూడా ఉన్నాయి. ► మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనాలనుకునే వారికోసం ఆన్లైన్ రిజి్రస్టేషన్ పోర్టల్ ప్రారంభించారు. సోమవారం ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా... ► ఆలయంలోని ఏడు గోపురాలను యూఏఈలోని ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా తీర్చిదిద్దడం మరో విశేషం. ► రామాయణ ఇతివృత్తాలను ఆలయ గోడలపై అందంగా చెక్కారు. ► ఆలయం బయటి గోడలపై ప్రపంచ ప్రసిద్ధ నాగరికతలన్నింటినీ చక్కగా చెక్కారు. తద్వారా ఈ ఆలయాన్ని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దారు. ► భక్తుల బస తదితరాలకు ఆలయ సమీపంలో భవనం కూడా ఏర్పాటైంది. దీన్ని అరేబియన్, ఇస్లామిక్ వాస్తు రీతుల్లో నిర్మించడం విశేషం. ఇలా పురుడు పోసుకుంది... ► 2014లో మోదీ తొలిసారి ప్రధాని పదవి చేపట్టిన కొద్దికాలానికే ఈ హిందూ ఆలయ నిర్మాణానికి బీజం పడింది. 2015లో మోదీ యూఏఈ పర్యటన అనంతరం వేగం పుంజుకుంది. 1981 తర్వాత అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీయే. ఇప్పటిదాకా యూఏఈలో ఆరుసార్లు పర్యటించారాయన. తాజాగా ఏడో పర్యటనలో ఉన్నారు. ► 2015 పర్యటన సందర్భంగా యూఏఈ యువరాజుగా ఉన్న షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో పలు అంశాలపై మోదీ లోతుగా చర్చలు జరిపారు. ► ఆ వెంటనే ఆలయ నిర్మాణానికి యూఈఏ సర్కారు నిర్ణయం తీసుకోవడమే గాక 13.5 ఎకరాల భూమి కూడా కేటాయించింది. అనంతరం 2019లో మత సహన ఏడాది ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయానికి మరో 13.5 ఎకరాలు ప్రకటించింది. అలా ఆలయానికి 27 ఎకరాల భూమి సమకూరింది. ► 2018లో మోదీ తన రెండో యూఏఈ పర్యటన సందర్భంగా బాప్స్ హిందూ ఆలయ నిర్మాణానికి దుబాయ్ ఒపెరా హౌజ్ నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. -
భారత్ ను వీడనున్న ఇంగ్లాండ్ జట్టు
-
Chandrayaan-3: అబుదాబిలో భారత్ మాతా కీ జై
అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత అద్భుత ఘట్టంగా చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ నిలిచిపోయింది. ఈ అరుదైన ఘనతను చూడడానికి దేశవిదేశాల్లోనూ ప్రజలు ఆసక్తి కనబరిచారు. అలాగే.. విదేశాల్లో ఉంటున్న భారతీయుల కోసమూ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాయి అక్కడి ఇండియన్ కమ్యూనిటీస్. ఈ క్రమంలో.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో ఉంటున్న ప్రవాస భారతీయులందరు ఒక్క దగ్గర ఉండి వీక్షించేందుకు ఇండియా సోషల్ అండ్ కల్చర్ సెంటర్ ముఖ్య ప్రాంగణంలో LED స్క్రీన్ ద్వారా ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వందలాది ప్రవాస భారతీయులు అక్కడికి చేరుకొని చంద్రయాన్ 3 చంద్రుని ఉపరితలం పై లాండ్ అవడం వీక్షించారు. ఎక్కువ మంది తెలుగు ప్రజలు.. అందునా తెలంగాణ ప్రజలు ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. చంద్రయాన్ 3 లాండింగ్ చివరి క్షణాలలో ప్రాంగణం అంతా భారత్ మాతా కీ జై నినాదాలతో మారు మోగింది. ఈ క్షణాలు భారతీయలందరి హృదయాలలో ఒక గర్వం తో కూడిన ఆనందం చేకూర్చిందని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రాజశ్రీనివాస రావు, గోపాల్ మరియు ఎట్టి రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. అలాగే ISC ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఇది ‘భారతీయలందరికి మరచిపోలేని అనుభూతి’గా పేర్కొన్నారు. -
అబుదాబిలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం
-
ఒక్కరోజుకు నాలుగు వందలా?.. తనకు అవసరం లేదన్న హీరోయిన్
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం 'జరా హట్కే జరా బచ్కే'. ఈనెల 2న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లో రూ.12.7 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఇటీవలే అబుదాబిలో జరిగిన ఒక అవార్డ్ షో కోసం వచ్చిన సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ హాజరయ్యారు. (ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్ .. అమ్మాయి ఎవరో చెప్పేశాడు!) అయితే ఈ షోలో పాల్గొన్న సారా రూ.400 ఖర్చు చేసేందుకు కూడా నిరాకరించింది. అబుదాబిలో రోమింగ్ ఛార్జీల కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ సారా అలీ ఖాన్ ఒక్క రోజుకు నాలుగు వందల రూపాయలు ఖర్చు చేయడం ఇష్టం లేక ఇంటర్నెట్ కోసం పక్కవారిని హాట్స్పాట్ ఆన్ చేయమని అభ్యర్థించినట్లు తెలిపింది. సారా మాట్లాడుతూ.. 'నా పక్కన ఉన్న వ్యక్తిని రోమింగ్ ప్యాకేజీ ధర గురించి అడిగా. రోమింగ్ ప్యాక్ నెల ప్లాన్ మాత్రమే వస్తుందని చెప్పారు. కానీ నేను అబుదాబిలో ఒకే రోజు ఉండాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత 10 రోజులకు రూ. 3000 ఖర్చవుతుందని తెలుసుకున్నా. నేను కేవలం ఇక్కడ రోజే కదా ఉండేది. పది రోజుల ప్లాన్ ఎందుకనిపించింది. ఆ తర్వాత రోమింగ్ ప్యాక్ను రోజుకు రూ. 400కి కొనుగోలు చేయవచ్చని ఎవరో చెప్పారు. కానీ ఒక్క రోజు రూ.400 ఖర్చు చేయడం ఇష్టం లేక నేను నా పక్కవారిని హాట్స్పాట్ అడిగాను.' అంటూ చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!) -
క్యూబ్ హైవేస్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: బ్రిటిష్ కొలంబియా ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్, అబుధాబి సావరిన్ సంస్థ ముబడాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ తదితరాల నుంచి క్యూబ్ హైవేస్ ట్రస్ట్ 63 కోట్ల డాలర్లు(దాదాపు రూ. 5,226 కోట్లు) సమీకరించింది. ఇన్విట్కు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ అయిన క్యూబ్ హైవేస్ ఫండ్ అడ్వయిజర్స్ ప్రయివేట్ లిమిటెడ్ నిధుల సమీకరణ అంశాన్ని వెల్లడించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్ కింద జారీ చేసిన ఇన్విట్ సాధారణ యూనిట్లను లిస్టింగ్ చేసినట్లు పేర్కొంది. దేశీయంగా లిస్టయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్).. క్యూబ్ హైవేస్ ట్రస్ట్లో కెనడియన్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ బీసీఐ, ముబడాలతోపాటు మరికొన్ని దేశీ సంస్థలు కొత్త యాంకర్ ఇన్వెస్టర్లుగా నమోదైనట్లు తెలియజేసింది. 18 ఆస్తులు క్యూబ్ హైవేస్ ఇన్విట్ దాదాపు 1,424 కిలోమీటర్ల పొడవైన 18 టోల్, యాన్యుటీ రోడ్ ఆస్తులను కలిగి ఉంది. వీటిలో 17 ఎన్హెచ్ఏఐ టోల్ రోడ్ ఆస్తులుకాగా.. ఒకటి ఎన్హెచ్ఏఐ యాన్యుటీ రోడ్ ప్రాజెక్టుగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, హర్యానా తదితర 11 రాష్టాలలో రోడ్ ప్రాజెక్టులు విస్తరించినట్లు తెలియజేసింది. పీఎస్యూ దిగ్గజం ఎస్బీఐ నుంచి రూ. 10,000 కోట్ల రుణ సౌకర్యాలను పొందేందుకు సంతకాలు జరిగినట్లు క్యూబ్ హైవేస్ ఇన్విట్ పేర్కొంది. ప్రస్తుత రుణాల రీఫైనాన్సింగ్కు నిధులను వినియోగించనున్నట్లు తెలియజేసింది. -
రిటైర్మెంట్కు ముందు సానియా మీర్జాకు పరాభవం
రిటైర్మెంట్కు ముందు జరిగిన అబుదాబి ఓపెన్ టెన్నిస్ టోర్నీ-2023లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు పరాభవం ఎదురైంది. ఈ టోర్నీలో బెథానీ మాటెక్ (అమెరికా)తో బరిలోకి దిగిన హైదరాబాదీ తొలి రౌండ్లోనే నిష్క్రమించి అబాసుపాలైంది. సోమవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా–బెథానీ ద్వయం 3–6, 4–6తో ఫ్లిప్కెన్స్ (బెల్జియం)–లౌరా సిగెముండ్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా జోడీ తమ సర్వీస్ను ఆరుసార్లు కోల్పోయింది. సానియా–బెథానీలకు 4,350 డాలర్లు (రూ. 3 లక్షల 60 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. కాగా, ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్న దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్తో ప్రొఫెషనల్ టెన్నిస్కు గుడ్బై చెప్పనున్నట్లు సానియా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. -
గగనతలంలో ఉన్న విమానంలో మంటలు.. 184 మంది ప్రయాణికులు..
గగనతలంలో ఉన్న ఎయిర్ ఇండియా విమానం ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో మంటలను గుర్తించిన పైలట్ వెంటనే మళ్లీ విమానాన్ని విమానాశ్రయానికి మళ్లించి ల్యాండ్ చేశాడు. ఈ ఘటన అబుదాబిలో చోటుచేసుకుంది. కాగా, ఎయిర్ ఇండియా విమానం అబుదాబి నుంచి కాలికట్కు వస్తుండగా ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. 184 మంది ప్రయాణికులతో అబుదాబి నుంచి కాలికట్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ B737-800 విమాన ఇంజిన్లో మంటలు చెలరేగాయి. రన్వే నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే మంటలు కనిపించాయని డీజీసీఏ తెలిపింది. సుమారు 1000 అడుగుల ఎత్తులోకి వెళ్లగానే ఒకటో నెంబర్ ఇంజన్లో మంటలు రావడం గమనించిన పైలట్.. తిరిగి విమానాన్ని అబుదాబి విమానాశ్రయంలోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది. #BREAKING | Massive scare on an #AirIndia Express plane from Abu Dhabi to Calicut. The flight's engine caught fire during climb, forcing it to make landing. @Aruneel_S reports pic.twitter.com/IY8zYYZaV1 — Mirror Now (@MirrorNow) February 3, 2023 కాగా, ఈ ప్రమాదంపై ఎయిర్ ఇండియా అధికారులు స్పందించారు. విమాన ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగానే మంటలు వచ్చినట్టు తెలిపారు. విమానాన్ని పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పిందని స్పష్టం చేశారు. ఇక, విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. -
అబుదాబి పోలీసుల నిర్బంధంలో నోయిడా వ్యక్తి... ఆ తర్వాత...
నోయిడా: నోయిడాకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యాపారవేత్తను అబుదాబి పోలీసులు నేరస్తుడిగా భావించి నిర్బంధించారు. ఆ వ్యాపారస్తుడిని తాము గాలిస్తున్న నేరస్తుడిగా పొరబడి ఒక రాత్రంతా జైల్లో ఉంచారు. పైగా అతనిని నేరస్తుడిగా అంగీకరించమంటూ బలవంతం చేశారు. దీంతో ప్రవీణ్ కుమార్ కుటుంబం అతనను విడుదల చేయాలంటూ భారత ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవడమే కాకుండా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ భారత రాయబార కార్యాలయం, రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు. దీంతో ప్రవీణ్ కుమార్ని అబుదాబి పోలీసులు వెంటనే వదిలేశారు. తాము పొరపడి బంధించినట్లు అబుదాబీ పోలీసులు అంగీకరించారు. ఈ మేరకు గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా హబీబ్పూర్కు చెందిన సదరు వ్యాపారవేత్త ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...విమానాశ్రయంలో అబుదాబి సీఐడీ తనను అదుపులోకి తీసుకుని నిర్బంధించిందని, తర్వాత వదిలిపెట్టినట్లు వదిలి మళ్లీ తాను బయలుదేరుతున్న సమయంలో రెండోసారి నిర్బంధించారని తెలిపారు. ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుని తనను విడుదలయ్యేలా చేసినందుకు ప్రధాని మోదీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్కి ధన్యావాదాలు తెలిపారు. తనను శనివారం అబుదాబి పోలీసులు విడిచిపెట్టినట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామన భారత్కి తిరిగి వచ్చిన తర్వాత ప్రవీణ్ కుమార్కి ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. ఐతే ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేయడంతోనే త్వరితగతిన చర్యలు తీసుకోగలిగనట్లు అధికారులు తెలిపారు. (చదవండి: విజయపురలో పరువు హత్య?) -
అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నీ విజేత అర్జున్
సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో చాంపియన్గా అవతరించాడు. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో గురువారం ముగిసిన ఈ టోర్నీలో వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అర్జున్ ఆరు గేముల్లో విజయం సాధించి, మరో మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో అర్జున్ తెల్లపావులతో ఆడుతూ 67 ఎత్తుల్లో స్పెయిన్ గ్రాండ్మాస్టర్ డేవిడ్ ఆంటోన్ గిజారోపై గెలుపొందాడు. భారత్కే చెందిన రోహిత్కృష్ణ, దీప్సేన్ గుప్తా, రౌనక్ సాధ్వాని, అలెగ్జాండర్ ఇందిక్ (సెర్బియా), వాంగ్ హావో (చైనా)లపై కూడా అర్జున్ నెగ్గాడు. ఎవగెనీ తొమాషెవ్కీ (రష్యా), జోర్డెన్ వాన్ ఫారెస్ట్ (నెదర్లాండ్స్), రాబ్సన్ రే (అమెరికా)లతో జరిగిన గేమ్లను అర్జున్ ‘డ్రా’ చేసుకున్నాడు. విజేతగా నిలిచిన అర్జున్కు 15 వేల డాలర్ల (రూ. 12 లక్షలు) ప్రైజ్మనీ లభించింది. మాస్టర్స్ టోర్నీలో మొత్తం 148 మంది క్రీడాకారులు పాల్గొనగా... ఇందులో 43 మంది గ్రాండ్మాస్టర్లు, 35 మంది అంతర్జాతీయ మాస్టర్లు, ఏడుగురు మహిళా గ్రాండ్మాస్టర్లు, ముగ్గురు మహిళా అంతర్జాతీయ మాస్టర్లు ఉండటం విశేషం. -
ఏబీ హెల్త్లో ‘అబుధాబి’ పెట్టుబడి
ముంబై: ఆదిత్య బిర్లా(ఏబీ) గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(ఏఐడీఏ) 10 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 665 కోట్లు వెచ్చించనుంది. ఇందుకు ఏబీ హెల్త్ ఇన్సూరెన్స్ బోర్డుతోపాటు లిస్టెడ్ మాతృ సంస్థ ఏబీ క్యాపిటల్ అనుమతించాయి. తద్వారా ఆరోగ్య బీమా రంగ సంస్థ విలువను రూ. 6,650 కోట్లుగా మదింపు చేసినట్లు ఏబీ క్యాపిటల్ పేర్కొంది. ఏబీ హెల్త్ ఇన్సూరెన్స్ను ఆదిత్య బిర్లా గ్రూప్, దక్షిణాఫ్రికా సంస్థ మొమెంటమ్ మెట్రోపాలిటన్ హోల్డింగ్స్ సంయుక్తం (జేవీ)గా ఏర్పాటు చేశాయి. డీల్కు దేశీ బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) అనుమతించవలసి ఉంది. వాటా విక్రయం తదుపరి జేవీలో ఏబీసీఎల్కు 45.91 శాతం, మొమెంటమ్ మెట్రోకు 44.10 శాతం చొప్పున వాటాలు ఉంటాయి. ఆరోగ్య బీమాపట్ల అవగాహన పెరగడం, వృద్ధిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కారణంగా దేశీ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం భారీగా విస్తరించేందుకు వీలున్నట్లు ఏఐడీఏ పేర్కొంది. ఇక తాము అనుసరిస్తున్న ప్రత్యేక బిజినెస్ విధానాల పటిష్టతను అడియా పెట్టుబడులు సూచిస్తున్నట్లు ఏబీసీఎల్ తెలియజేసింది. హెల్త్ ఇన్సూరెన్స్లో వాటా విక్రయ వార్తల నేపథ్యంలో ఏబీ క్యాపిటల్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం లాభంతో రూ. 111 వద్ద ముగిసింది. చదవండి: బంఫర్ ఆఫర్: 15 వరకు ఏ మెట్రోస్టేషన్కైనా రూ.30 -
UAE President: యూఏఈ అధ్యక్షుడి కన్నుమూత!
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇక లేరు. 73 ఏళ్ల షేక్ ఖలీఫా.. శుక్రవారం కన్నుమూసినట్లు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. షేక్ ఖలీఫా 2014, నవంబర్ 3 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తండ్రి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ నుంచి వారసత్వంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. Sheikh Khalifa bin Zayed passes away: 40 days of mourning announced https://t.co/iDFqhzAO4J pic.twitter.com/jsXjR0MQjP — UAE News (@UAENews) May 13, 2022 1948లో పుట్టిన షేక్ ఖలీపా.. యూఏఈకి రెండో అధ్యక్షుడు. ఆ దేశ రాజధాని అబుదాబికి పదహారవ పాలకుడు. ఆయన మృతికి గల కారణాలు వెల్లడించలేదు. అయితే చాలాకాలంగా ఆయన అనారోగ్యంతో ఉండడంతో అదే కారణమని తెలుస్తోంది. షేక్ ఖలీఫా మృతికి పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. యూఏఈ అధ్యక్షుడి మృతికి సంతాపంగా 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. మూడు రోజులపాటు పబ్లిక్, ప్రైవేట్ రంగాలు పూర్తిగా బంద్ పాటించనున్నాయి. గతంలో స్ట్రోక్బారిన పడిన ఆయన.. 2014 నుండి బయట కనిపించడం చాలా అరుదుగా జరిగింది. అయినప్పటికీ ఆయన తీర్పులు, కీలక చట్టాలు చేయడం కొనసాగించారు.ఆయన సోదరుడు, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఈ మధ్యకాలంలో పరిపాలనలో చురుకుగా ఉంటూ వస్తున్నారు. షేక్ ఖలీఫా మృతికి భారత ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. I am deeply saddened to know about the passing away of HH Sheikh Khalifa bin Zayed. He was a great statesman and visonary leader under whom India-UAE relations prospered. The heartfelt condolences of the people of India are with the people of UAE. May his soul rest in peace. — Narendra Modi (@narendramodi) May 13, 2022 -
అదానీ గ్రీన్కు భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ పర్యావరణ అనుకూల కంపెనీలలో ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ(ఐహెచ్సీ) భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. అబు దాబికి చెందిన ఐహెచ్సీ అదానీ గ్రూప్నకు చెందిన మూడు గ్రీన్ కంపెనీలకు 200 కోట్ల డాలర్లు(సుమారు రూ. 15,000 కోట్లు) పెట్టుబడులు అందించనుంది. గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్)లో రూ. 7,700 కోట్లు(1.02 బిలియన్ డాలర్లు), అదానీ గ్రీన్ ఎనర్జీ(ఏజీఈఎల్)లో రూ. 3,850 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయనుంది. ఈ బాటలో అదానీ ట్రాన్స్మిషన్(ఏటీఎల్)కు సైతం రూ. 3,850 కోట్లు అందించనుంది. ఇందుకు వీలుగా మూడు కంపెనీలూ ఐహెచ్సీకి ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయనున్నాయి. ఇందుకు శుక్రవారం సమావేశమైన కంపెనీల బోర్డులు ‘గ్రీన్’సిగ్నల్ ఇచ్చాయి. అయితే తద్వారా మూడు కంపెనీలలోనూ ఐహెచ్సీకి ఎంతమేర వాటా లభించనున్నదీ అదానీ గ్రూప్ వెల్లడించలేదు. తాజా పెట్టుబడులను ఆయా కంపెనీల బిజినెస్ వృద్ధికి వినియోగించనున్నట్లు పేర్కొంది. బ్యాలెన్స్షీట్లను పటిష్టపరచడం, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం నిధులను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. -
అదృష్టాన్ని ఊహించగలమా?.. రూ. 44 కోట్లు గెల్చుకున్న లీనా
Kerala woman living in Abu Dhabi wins Big Ticket lottery Worth 44 Crores: నిజంగా అదృష్టాన్ని ఊహించగలమా? అలాంటి నమ్మకమే లేని ఓ యువతి.. సరదాగా తన కొలీగ్స్తో కలిసి టికెట్ కొన్న ఆ భారతీయ యువతికి జాక్పాట్ తగిలింది. అదీ కలలో కూడా ఆమె ఊహించని రేంజ్లో.. ఏకంగా 44 కోట్ల రూపాయల లాటరీ తగిలింది ఆమె టికెట్ మీద!. సౌదీ కంట్రీస్లో భారీ ప్రైజ్ మనీ లాటరీలు సర్వసాధారణం. అలాంటి జాక్పాట్ ఓ కేరళ యువతిని వరించింది. ఫిబ్రవరి 3న బిగ్ టికెట్ అబుదాబీ వీక్లీ డ్రా నిర్వహించారు. అందులో ఏకంగా 22 మిలియన్ల దీరామ్స్(మన కరెన్సీలో 44 కోట్ల 73 లక్షల 52 వేల 598 రూపాయల దాకా) ఆమె టికెట్ గెల్చినట్లు ప్రకటించారు. ఆమె పేరు లీనా జలాల్. లీనా స్వస్థలం కేరళ త్రిచూర్. అంజన్ గడి ప్రాంతానికి చెందిన ఆమె, ఉద్యోగరీత్యా గత నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటోంది. అబుదాబిలో షోయిదార్ ప్రాజెక్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎల్ఎల్ సీ అనే కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తోంది. ఈ మధ్య తన పది మంది ఆఫీస్ సహచరులతో కలిసి Terrific 22 million series 236లో భాగంగా ఆమె టికెట్ కొన్నది. తాజాగా డ్రా తీయగా, లీనా జలాల్ కొనుగోలు చేసిన టికెట్ కు రూ.44 కోట్ల భారీ ప్రైజ్ మనీ దక్కింది. అయితే, ఆ టికెట్ ను ఆమె తనతో పాటు ఆఫీసులో పనిచేసే మరో తొమ్మిది మందితో కలిసి కొనుగోలు చేసింది. దాంతో, ఆ ప్రైజ్ మనీని ఇప్పుడు వారందరూ పంచుకోనున్నారు. అయినప్పటికీ, ఒక్కొక్కరికి రూ.4 కోట్లు దాకా వస్తుంది. దీనిపై లీనా జలాల్ మాట్లాడుతూ.. లాటరీ తగిలిందని చెప్పగానే, తొలుత నమ్మలేకపోయానని వెల్లడించింది. తనకు మాటలు రావడంలేదని, దేవుడికి రుణపడి ఉంటానని తెలిపింది. అయితే, ఈ డబ్బును ఏంచేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని, కుటుంబ సభ్యులను అడిగిన తర్వాత నిర్ణయించుకుంటానని లీనా తెలిపింది. మరో నలుగురూ భారతీయులే.. బిగ్ టికెట్ అబుదాబీ వీక్లీ డ్రాలో లీనా కాకుండా గెలిచిన మరో నలుగురు కూడా భారతీయులే కావడం విశేషం. సెకండ్ ప్రైజ్ను సురాయిఫ్ సురు(2 కోట్ల రూ. పైగా), సిల్జోహ్న్ హోయాన్నన్ (కోటికి పైగా), నాలుగో ప్రైజ్ అన్జర్ సుక్కారియా(యాభై లక్షల రూ.), ఐదో ప్రైజ్ దివ్య (20 లక్షలరూ.) దక్కాయి. బంగ్లాదేశ్కు చెందిన నజీర్ అనే వ్యక్తికి రేంజ్ రోవర్ ఎవోక్యూ దక్కింది. మార్చి 3న ఈ ప్రైజ్మనీని, గిఫ్ట్ను అందించనున్నారు. -
హౌతీ మిస్సైల్స్ కూల్చేసిన యూఏఈ
దుబాయ్: రాజధాని అబుదాబి లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన రెండు క్షిపణులను మధ్యలోనే పేల్చేసినట్లు యూఏఈ సోమవారం ప్రకటించింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. దాడులకు ప్రతీకారంగా యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు చెందిన మిప్సైల్ లాంచర్ను యూఏఈ రక్షణ వర్గాలు పేల్చేశాయి. దీనికి సంబంధించిన వీడియోను యూఏఈ రక్షణ శాఖ ట్వీట్ చేసింది. ఎలాంటి దాడులను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పుకార్లు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. -
అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ల దాడి
-
అబుదాబి ఎయిర్పోర్టుపై డ్రోన్ దాడి, ఇద్దరు భారతీయుల దుర్మరణం!
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం డ్రోన్ దాడి జరిగింది. ఈ డ్రోన్ దాడిలో మూడు అయిల్ ట్యాంకర్లు పేలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అబుదాబి విమానాశ్రయంలోని ఓ నిర్మాణ స్థలంలో మంటలు చెలరేగాయని, ఏడీఎన్ఓసీ సంస్థకు చెందిన చమురు నిల్వలు ఉన్న పారిశ్రామిక ప్రాంతం ముసఫాలో మూడు ఇంధన ట్యాంకర్ ట్రక్కులు పేలిపోయాయని పోలీసులు తెలిపారు. ఈ డ్రోన్ దాడుల్లో ఇద్దరు భారతీయులు, ఓ పాకిస్తాన్ వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో చిన్న విమానానికి సంబంధించిన భాగాలు కనిపించాయని, రెండు ప్రదేశాల్లో చోటు చేసుకున్న పేలుడు, అగ్ని ప్రమాదానికి డ్రోన్ దాడులు కారణమని పోలీసులు పేర్కొన్నారు. డ్రోన్ దాడులకు తామే పాల్పడ్డామని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: Viral Video: హార్ట్ రైజింగ్ వీడియో: ఎదురుగా వస్తున్న రైలు ముందుకి తోసేసి.. -
నాకు కరోనా పాజిటివ్.. మరేం ఫర్వాలేదు: టెన్నిస్ స్టార్
Covid 19 Positive: స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ కరోనా బారిన పడ్డాడు. అబుదాబి టోర్నీలో ఆడిన నాదల్ స్వదేశానికి తిరిగి రాగానే నిర్వహించిన టెస్టులో పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని అతడు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. అయితే, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు. ‘‘అబుదాబి టోర్నమెంట్ తర్వాత స్పెయిన్కు తిరిగి వచ్చాను. ఈ సందర్భంగా నిర్వహించిన పీసీఆర్ టెస్టులో కోవిడ్ సోకినట్లు నిర్దారణ అయింది. కాస్త ఇబ్బందిగా ఉంది. అయితే, కంగారు పడాల్సిందేమీ లేదు. నాతో సన్నిహితంగా మెలిగిన వాళ్లకు.. నాకు కరోనా సోకిన విషయం తెలిపాను ’’ అని నాదల్ పేర్కొన్నాడు. కాగా 20 సార్లు గ్రాండ్స్లామ్ విజేత అయిన నాదల్... కాలి గాయం కారణంగా పలు టోర్నీలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అబుదాబి వేదికగా జరిగిన ముబదాలా వరల్డ్ టెన్నిస్ చాంపియన్షిప్తో పునరాగమనం చేశాడు. ముర్రే చేతిలో ఓటమిపాలై ఇంటిబాట పట్టాడు. చదవండి: Ashes: 77 బంతుల్లో 12 ... 207 బంతుల్లో 26 పరుగులు.. స్టోక్స్, బట్లర్ పాపం.. Hola a todos. Quería anunciaros que en mi regreso a casa tras disputar el torneo de Abu Dhabi, he dado positivo por COVID en la prueba PCR que se me ha realizado al llegar a España. — Rafa Nadal (@RafaelNadal) December 20, 2021 -
Rohit Sharma: ఆఖరి బాల్కు సిక్సర్ కొట్టేశాడు; ఇది అతి పెద్ద తప్పిదం!
Rohit Sharma & Usman Khawaja React On Verstappen Win: గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా ఉంటేనే నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తి చేయవచ్చంటారు... రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్కు ఈ మాటలు చక్కగా సరిపోతాయి. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన అబుదాబి గ్రాండ్ప్రి రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయీస్ హామిల్టన్ను ఓడించి తొలిసారి ఫార్ములావన్ (ఎఫ్ 1) ప్రపంచ చాంపియన్గా అవతరించాడు వెర్స్టాపెన్. తన చిరకాల కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నాడు. గెలవగానే.. ‘‘నిజంగా.. ఇది నా అదృష్టమనే చెప్పాలి’’ అని వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు విజేతను నిర్ణయించిన తీరుపై నిర్వాహకులపై విమర్శలు కూడా వస్తున్నాయి. రేసు చివర్లో సేఫ్టీ కారు విషయంలో రేసు డైరెక్టర్ తీసుకున్న నిర్ణయాలపై మెర్సిడెస్ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వెర్స్టాపెన్ గెలిచేలా సేఫ్టీ కారు నిర్ణయాలు తీసుకుందంటూ ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో.. అబుదాబి గ్రాండ్ప్రి రేసులో వెర్స్టాపెన్ విజయంపై పలువురు క్రికెటర్లు తమదైన శైలిలో స్పందించారు. కొంతమంది అతడిని అభినందిస్తే.. మరికొంతమంది మాత్రం మెర్సిడెస్కు వత్తాసు పలికారు. ఎవరెవరు ఏమన్నారంటే.. ఆఖరి బాల్.. సిక్స్ కొట్టేశాడు... ‘‘ఒక్క బాల్ సిక్సర్ కొట్లాలి.. ఏం జరిగిందో ఊహించండి.. మాక్స్ వెర్స్టాపెన్ సిక్స్ కొట్టేశాడు. నమ్మశక్యం కాని విజయం ఇది. అబుదాబి గ్రాండిప్రి.. కొత్త చాంపియన్ వెర్స్టాపెన్’’ అని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ వెర్స్టాపెన్కు శుభాకాంక్షలు తెలిపాడు. 1 ball 6 required and guess what, Max Verstappen hits it. Unbelievable win #AbuDhabiGP #F1TitleChampionship — Rohit Sharma (@ImRo45) December 12, 2021 అతిపెద్ద తప్పిదం ఇది.. ‘‘ఎఫ్ 1 చరిత్రలో అతిపెద్ద తప్పిదం ఇది’’ అని ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ట్వీట్ చేశాడు. That is the biggest mistake in F1 history. — Usman Khawaja (@Uz_Khawaja) December 12, 2021 హామిల్టన్ మాటల్ని ఉటంకించిన మాంటీ పనేసర్.. ‘‘కచ్చితంగా.. నేను ఏమాత్రం సంతోషంగా లేను. నా పట్ల ఎలా వ్యవహరించాలనుకున్నారో వాళ్లు అలాగే వ్యవహరించారు. దృఢ సంకల్పంతో నేను తిరిగి వస్తాను’’ అని మెర్సిడెస్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ మాటల్ని ఉటంకిస్తూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అతడికి మద్దతు పలికాడు. Obviously I am not happy but they can throw what they want at me, I will come back stronger. @LewisHamilton #LewisHamilton #MaxVerstappen #F1Finale #AbuDabhiGP pic.twitter.com/NGNLf5hmNc — Monty Panesar (@MontyPanesar) December 12, 2021 నిజంగా ఇది ఏమాత్రం సరికాదు.. ‘‘ఇద్దరు డ్రైవర్లు... రెండు జట్లు... అయినా ఇది సరికాదు... ఏం మాట్లాడాలో అర్థంకాలేదు’’ అని ఇంగ్లండ్ ఫస్ట్క్లాస్ క్రికెటర్ టిమ్ బ్రెస్నన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. చదవండి: ODI Captaincy: కోహ్లి కెప్టెన్గా ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి?జరిగేది అదే: గంభీర్ I like both drivers and both teams. But surely that wasn't right. Speechless #Formula1 #AbuDabhiGP — Tim Bresnan (@timbresnan) December 12, 2021 The journey to the top of the world for @Max33Verstappen 🏆#AbuDhabiGP 🇦🇪 #F1 pic.twitter.com/rHHH4H0oUj — Formula 1 (@F1) December 12, 2021 -
Max Verstappen: ఎఫ్1లో సంచలనం.. తొలిసారి చాంపియన్గా..
Max Verstappen wins Abu Dhabi Grand Prix, beats Lewis Hamilton: గత నాలుగు సీజన్లలో ఎదురులేని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఆధిపత్యానికి గండికొడుతూ ఫార్ములావన్ (ఎఫ్1)లో మాక్స్ వెర్స్టాపెన్ రూపంలో కొత్త ప్రపంచ చాంపియన్ అవతరించాడు. ఆదివారం జరిగిన చివరి రేసు అబుదాబి గ్రాండ్ప్రిలో రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నాటకీయ పరిణామాల మధ్య విజేతగా నిలిచాడు. తొలిసారి ప్రపంచ చాంపియన్ అయ్యాడు. రేసు చివరి వరకు ఆధిక్యంలో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్, ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ హామిల్టన్ ఆఖరి ల్యాప్లో వెనుకబడిపోయి ఓటమి మూటగట్టుకున్నాడు. దాంతో ఏడు ప్రపంచ టైటిల్స్ తో జర్మనీ దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాలని ఆశించిన హామిల్టన్ మరో ఏడాదిపాటు వేచి చూడక తప్పదు. అబుదాబి: ప్రతిభకు కాస్త అదృష్టం కూడా తోడైతే... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే... ఇక ఓటమి ఖాయమనుకున్న చోట కూడా పుంజుకొని అనూహ్య విజయం సాధించవచ్చని ఆదివారం జరిగిన అబుదాబి గ్రాండ్ప్రి రేసులో రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నిరూపించాడు. బ్లాక్ బాస్టర్ సినిమాను తలపించిన 2021 ఎఫ్1 సీజన్ వివాదాస్పదంగా ముగిసింది. డ్రైవర్ చాంపియన్షిప్ను తేల్చే అబుదాబి గ్రాండ్ప్రిలో 58 ల్యాప్ల ప్రధాన రేసును వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 17.345 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దాంతో డ్రైవర్ చాంపియన్షిప్లో 395.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన 24 ఏళ్ల వెర్స్టాపెన్ తొలిసారి ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. 57వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉండి చివరి ల్యాప్లో వెనుకబడిన హామిల్టన్ (బ్రిటన్) మొత్తం 387.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. హామిల్టన్ కొంపముంచిన సేఫ్టీ కార్... రెండో స్థానం నుంచి రేసును మొదలు పెట్టిన హామిల్టన్ తొలి మలుపులోనే వెర్స్టాపెన్ను అధిగమించి రేసులో ఆధిక్యంలోకి వచ్చాడు. ఇక్కడి నుంచి అద్భుతంగా డ్రైవ్ చేసిన హామిల్టన్ వెర్స్టాపెన్కు అందకుండా దూసుకెళ్లాడు. ల్యాప్ ల్యాప్నకు రెండో స్థానంలో ఉన్న వెర్స్టాపెన్తో అంతరాన్ని పెంచుకుంటూ పోయాడు. ఇక ఎనిమిదో డ్రైవర్ చాంపియన్షిప్ టైటిల్ ఖాయం అనుకున్న తరుణంలో ‘సేఫ్టీ కార్’ ట్విస్ట్ హామిల్టన్ ఆశలపై నీళ్లు చల్లింది. 53వ ల్యాప్లో విలియమ్స్ డ్రైవర్ నికోలస్ లతీఫీ కారు ప్రమాదానికి గురికావడంతో రేసు స్టీవర్డ్స్ సేఫ్టీ కారును ట్రాక్ మీదకు పంపారు. ఇదే సమయంలో పిట్లోకి వచ్చిన వెర్స్టాపెన్ టైర్లను మార్చుకొని మళ్లీ ట్రాక్పై హామిల్టన్ వెనకగా రెండో స్థానంలో నిలిచాడు. 53వ ల్యాప్ ముందు వరకు హామిల్టన్, వెర్స్టాపెన్ మధ్య 11 ఉన్న సెకన్ల గ్యాప్ .... 57వ ల్యాప్లో సెకను కంటే తక్కువకు తగ్గింది. చివరి ల్యాప్లో రేసు మరోసారి ఆరంభం కాగా... రెండో స్థానంలో ఉన్న వెర్స్టాపెన్ తన కారుకు ఉన్న కొత్త టైర్ల సాయంతో ఐదో మలుపు వద్ద హామిల్టన్ను అధిగమించి విజేతగా నిలవడంతో పాటు డ్రైవర్ చాంపియన్షిప్ టైటిల్ను కూడా సొంతం చేసుకున్నాడు. మెర్సిడెస్ నిరసన... రేసు చివర్లో సేఫ్టీ కారు విషయంలో రేసు డైరెక్టర్ తీసుకున్న నిర్ణయాలపై మెర్సిడెస్ నిరసన వ్యక్తం చేసింది. అంతేకాకుండా వెర్స్టాపెన్ గెలిచేలా సేఫ్టీ కారు నిర్ణయాలు తీసుకుందంటూ ఆరోపించింది. ఈ విషయంపై స్టీవర్డ్స్కు మెర్సిడెస్ ఫిర్యాదు కూడా చేసింది. 53వ ల్యాప్లో సేఫ్టీ కారు ట్రాక్పైకి రాగా... ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. తొలుత ల్యాప్డ్ (ఒక ల్యాప్ తక్కువగా పూర్తి చేసిన కార్లు) కార్లు అన్ల్యాప్ కాకూడదంటూ ఆదేశాలు జారీ చేసి... అనంతరం అన్ల్యాప్ చేయొచ్చుంటూ తన నిర్ణయాన్ని మార్చుకుంది. దాంతో హామిల్టన్, వెర్స్టాపెన్ మధ్య ఉన్న ఐదు ల్యాప్డ్ కార్లు హామిల్టన్ను దాటుకుంటూ వెళ్లాయి. అదే సమయంలో సేఫ్టీ కార్ పిట్లోకి వెళ్లి రేసును మళ్లీ ఆరంభించాలంటూ ఆజ్ఞలు జారీ చేసింది. ఇక్కడే వివాదం మొదలైంది. సేఫ్టీ కారు వచ్చే సమయానికి మొత్తం ఎనిమిది ల్యాప్డ్ కార్లు ట్రాక్పై ఉన్నాయి. కేవలం ఐదు కార్లకు మాత్రమే అన్ల్యాప్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించి మిగిలిన మూడు కార్లకు ఎందుకు కల్పించలేదంటూ మెర్సిడెస్ ఆరోపించింది. నిబంధనల ప్రకారం ల్యాప్డ్ కార్లు అన్ల్యాప్ అయితే తాము వెనుకబడి ఉన్న ల్యాప్ను పూర్తి చేసుకొని మళ్లీ మిగతా కార్ల వెనుక చేరే వరకు కూడా సేఫ్టీ కార్ పిట్లోకి వెళ్లరాదు. అయితే ఇక్కడ దానిని సేఫ్టీ కారు పాటించలేదు. అయితే తీవ్ర చర్చల అనంతరం మెర్సిడెస్ ఫిర్యాదును స్టీవర్డ్స్ తోసిపుచ్చి వెర్స్టాపెన్ను విజేతగా ప్రకటించారు. వరుసగా ఎనిమిదోసారి... ఎఫ్1 కన్స్ట్రక్టర్స్ చాంపియన్షిప్లో మెర్సిడెస్ జట్టు వరుసగా ఎనిమిదో ఏడాది విజేతగా నిలిచింది. ఈ సీజన్లో మొత్తం 9 రేసుల్లో గెలిచిన మెర్సిడెస్ 613.5 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచింది. ఎఫ్1కు కిమీ రైకొనెన్ గుడ్బై అబుదాబి గ్రాండ్ప్రితో ఫార్ములావన్కు ఫిన్లాండ్ డ్రైవర్ కిమీ రైకొనెన్ గుడ్బై చెప్పాడు. 2001లో సాబర్ జట్టు ద్వారా ఎఫ్1లో అరంగేట్రం చేసిన 41 ఏళ్ల రైకొనెన్... మెక్లారెన్, ఫెరారీ, లోటస్, ఆల్ఫా రొమెయో జట్ల తరఫున రేసింగ్లో పాల్గొన్నాడు. ఫెరారీ డ్రైవర్గా 2007లో డ్రైవర్ చాంపియన్షిప్ టైటిల్ను నెగ్గాడు. ఈ సీజన్లో వెర్స్టాపెన్ గెలిచిన రేసుల సంఖ్య. మొత్తం 22 రేసులు జరగ్గా... హామిల్టన్ ఎనిమిది రేసుల్లో నెగ్గాడు. పెరెజ్ (రెడ్బుల్), ఒకాన్ (అల్పైన్ రెనౌ), రికియార్డో (మెక్లారెన్), బొటాస్ (మెర్సిడెస్) ఒక్కో రేసులో గెలిచారు. The journey to the top of the world for @Max33Verstappen 🏆#AbuDhabiGP 🇦🇪 #F1 pic.twitter.com/rHHH4H0oUj — Formula 1 (@F1) December 12, 2021 -
ఫార్ములా వన్ రేసింగ్లో సంచలనం..
Max Verstappen Wins Formula One Title: ఫార్ములా వన్ రేసింగ్ ఛాంపియన్షిప్లో సంచలనం నమోదైంది. రెడ్ బుల్స్కి చెందిన డ్రైవర్ మ్యాక్స్ వెర్ట్సాపెన్ తన మొట్టమొదటి ఎఫ్1 టైటిల్ను సొంతం చేసుకున్నాడు. మెర్సడెజ్కి చెందిన రేసర్, ఏడుసార్లు ఛాంపియన్ అయిన లూయిస్ హామిల్టన్ని ఆఖరి లాప్లో ఓడించి, అబుదాబీ గ్రాండ్ ప్రీ 2021 టైటిల్ను సొంతం చేసుకున్నాడు. MAX VERSTAPPEN. WORLD CHAMPION!!! A stunning season by an extraordinary talent#HistoryMade #F1 @Max33Verstappen pic.twitter.com/FxT9W69xJe — Formula 1 (@F1) December 12, 2021 హోరాహోరీ సాగిన రేస్లో ఓ దశలో ఇద్దరు రేసర్లు చెరో 369.5 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే ఆఖరి లాప్ను ప్రత్యర్థి కంటే 1.22.09 సెకన్లు ముందుగా ముగించిన 24 ఏళ్ల మ్యాక్స్ వెర్ట్సాపెన్ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. చదవండి: Akthar: తాను హెచ్చరించిన గంటన్నరలోపే హార్ధిక్ గాయపడ్డాడు..! -
సుమారు రూ. 15 వేల కోట్లు..! అబుదాబీ కంపెనీతో జతకట్టిన రిలయన్స్..! ఎందుకంటే..!
అబుదాబి ప్రభుత్వ యాజమాన్యంలోని కెమికల్స్ డెరివేటివ్స్ కంపెనీ (TA'ZIZ)తో రిలయన్స్ ఇండస్ట్రీస్ జత కట్టింది. అబుదాబిలోని రువైస్లో రసాయన ప్రాజక్టులో భాగంగా ఇరు కంపెనీలు కలిసి పనిచేయనున్నాయి. యూఎఈలో పెట్రోకెమికల్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పడానికి సంయుక్తంగా 2 బిలియన్ల డాలర్ల(సుమారు రూ. 15 వేల కోట్ల)ను పెట్టుబడి పెట్టనున్నాయి. పశ్చిమ అబుదాబిలోని రువైస్లో రసాయన ప్రాజెక్టు సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి అబుదాబి రాష్ట్ర ఇంధన దిగ్గజం (ADNOC) రాష్ట్ర హోల్డింగ్ కంపెనీ (ADQ) ఇటీవల ఏర్పరిచిన TA'ZIZ జాయింట్ వెంచర్లో రిలయన్స్ చేరనుంది. ఈ కొత్త ‘TA'ZIZ EDC & PVC’ జాయింట్ వెంచర్తో 2 బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడితో క్లోర్-ఆల్కలీ, ఇథిలీన్ డైక్లోరైడ్ , పాలీ వినైల్ క్లోరైడ్ ఉత్పత్తి సౌకర్యాన్ని నిర్మించి, నిర్వహించనున్నాయి. యూఎఈ ఆర్థిక వ్యవస్థను బలోపేతం, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి TA'ZIZ మిషన్ మద్దతునివ్వనుంది.రెగ్యులేటరీ అనుమతులకు లోబడి జాయింట్ వెంచర్ నిబంధనలపై ఇరు కంపెనీలు సంతకం చేశాయి. ADNOC మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈవో, యూఎఈ ఇండస్ట్రీస్ మినిష్టర్ డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ , రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అధినేతల సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈ జాయింట్ వెంచర్ ప్రారంభంపై ముఖేష్ అంబానీ మాట్లాడుతూ...భారత్, యూఎఈ మధ్య దీర్ఘకాల, విలువైన సంబంధాలను మరింత సుస్థిరం చేస్తోందని అన్నారు. చదవండి: 120 సెకండ్లలో హాట్కేకుల్లా అమ్ముడైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఇవే...! -
Wanindu Hasaranga: వారెవ్వా హసరంగ.. పాదరసంలా కదిలి.. ఎగిరి..
Wanindu Hasaranga Jaw Dropping Effort T10 League Video Goes Viral: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రీలంక ఆల్రౌండర్ వనిందు హసరంగ ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్తో బిజీగా ఉన్నాడు. ఈ టోర్నీలో దక్కన్ గ్లాడియేటర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న హసరంగ.. ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. చెన్నై బ్రేవ్స్తో మ్యాచ్లో పాదరసంలా కదిలి.. జట్టుకు ఐదు పరుగులు సేవ్ చేశాడు. సిక్సర్ ఖాయమనుకున్న తరుణంలో హసరంగ బంతిని ఆపడంతో కంగుతినడం బ్యాటర్ వంతైంది. అబుదాబిలో షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్కన్ గ్లాడియేటర్స్ చెన్నై బ్రేవ్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో డేవిడ్ వీజ్ బౌలింగ్లో ఓపెనర్ మహ్మద్ షెహజాద్ భారీ షాట్ ఆడాడు. సిక్స్ ఖాయం అనుకున్న సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హసరంగ మెరుపులా కదిలి బంతిని లోపలికి విసిరాడు. ఎలాగో ఆరు పరుగులు వస్తాయి కదా అనుకున్న చెన్నై బ్రేవ్స్ హసరంగా షాక్తో ఒక పరుగు మాత్రమే సాధించగలిగింది. ఇక ఈ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టిన హసరంగ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్లో దక్కన్ గ్లాడియేటర్స్ 5 వికెట్ల తేడాతో బ్రేవ్స్పై గెలుపొందింది. చదవండి: Ind Vs Nz 1st Test Highlights: సూపర్ భరత్... సాహా స్థానంలో వచ్చీరాగానే.. Wow wow Wanindu 😱😱#CBvsDG pic.twitter.com/H7IeUxlVIj — Stay Cricket (@staycricket) November 26, 2021 -
T20 WC 2021 NZ Vs ENG: మన క్యూరేటర్కు నివాళిగా...
T20 WC 2021 NZ Vs ENG: Tribute To Indian Curator Minutes Silence Observed: భారత్కు చెందిన అబుదాబి చీఫ్ క్యూరేటర్ మోహన్ సింగ్ మృతికి ఇరు జట్ల క్రికెటర్లు నివాళులర్పించారు. షేక్ జాయెద్ స్టేడియానికి 45 ఏళ్ల మోహన్ సింగ్ సుదీర్ఘ సేవలు అందించారు. అయితే తీవ్రమైన డిప్రెషన్తో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీస్ మ్యాచ్కు ముందు ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించి నివాళి అర్పించారు. కాగా అబుదాబి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఐసీసీ ఈవెంట్లలో నాకౌట్ దశలో తమను దెబ్బ కొడుతున్న ఇంగ్లండ్పై ప్రతీకారం తీర్చుకుని దర్జాగా ఫైనల్ చేరుకుంది. ఇక నవంబరు 10న జరుగనున్న రెండో సెమీ ఫైనల్లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. ఈ పోరులో గెలిచిన జట్టు నవంబరు 14న కివీస్తో ఫైనల్ ఆడనుంది. స్కోర్లు: ఇంగ్లండ్: 166/4 (20) న్యూజిలాండ్: 167/5 (19) చదవండి: మరో మిచెల్ అవుదామనుకున్నాడు.. కానీ మిస్ అయింది -
అబుదాబిలో భారత క్యూరేటర్ ఆత్మహత్య
అబుదాబి: భారత్కు చెందిన చీఫ్ పిచ్ క్యూరేటర్ మోహన్ సింగ్ ఆదివారం అబుదాబిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన గత 15 ఏళ్లుగా ఇక్కడి జాయెద్ క్రికెట్ స్టేడియంలో చీఫ్ క్యూరేటర్గా పని చేస్తున్నారు. భారత్లోని మొహాలీ పిచ్ క్యూరేటర్ దల్జీత్ సింగ్ దగ్గర సుదీర్ఘకాలం పనిచేసిన మోహన్ తదనంతరం యూఏఈకి తరలివెళ్లారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆయన ఉన్నట్లుండి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 45 ఏళ్ల మోహన్ న్యూజిలాండ్–అఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్ కు ముందే ఆత్మహత్యకు పాల్పడినట్లు యూఏఈ క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఉదయమే గ్రౌండ్కు వచ్చిన ఆయన పిచ్ను పర్యవేక్షించి తన గదిలోకి వెళ్లి మళ్లీ ఎంతకీ తిరిగి రాలేదు. గ్రౌండ్ సిబ్బంది వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించారు. -
T20 WC: మంచు కొంప ముంచుతోంది.. ఒక్కటి మినహా భారత్ మ్యాచ్లన్నీ అక్కడే.. టాస్ ఓడారో
T20 World Cup 2021: Is Team India Winning Chances Depends On Toss How: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో భాగంగా విజయాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. టాస్ గెలిచి... తొలుత బౌలింగ్ ఎంచుకున్న జట్లదే పైచేయిగా ఉంటోంది. అక్టోబరు 17 నుంచి ఆరంభమైన క్వాలిఫయర్ పోటీల నుంచి నేటి దాకా ఎక్కువ శాతం మ్యాచ్లలో ఇదే తంతు కొనసాగుతోంది. మెగా ఈవెంట్లో మస్కట్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఒమన్.. 10 వికెట్ల తేడాతో పపువా న్యూగినియాపై గెలుపొందింది. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు అక్కడ జరిగిన దాదాపు అన్ని మ్యాచ్లలోనూ టాస్ గెలిచిన జట్టునే విజయం వరించింది. మంచు ప్రభావం టాస్ ఓడిన జట్ల కొంప ముంచుతోంది. ఉదాహరణకు.. అక్టోబరు 24 నాటి టీమిండియా- పాకిస్తాన్.. తాజాగా అక్టోబరు 28 నాటి ఆస్ట్రేలియా- శ్రీలంక మ్యాచ్లు. వీటిలో టాస్ గెలిచిన పాకిస్తాన్ 10 వికెట్లు, ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్లపై గెలుపొందాయి. ఒక్కటి మినహా టీమిండియా మ్యాచ్లన్నీ అక్కడే.. పరిస్థితులు అన్నీ బాగుంటే భారత్లోనే టీ20 వరల్డ్కప్-2021 టోర్నీ జరగాల్సింది. అయితే, కరోనా నేపథ్యంలో బీసీసీఐ ఈ వేదికను యూఏఈకి మార్చింది. ఈ క్రమంలో హోస్ట్ భారత జట్టు ఒక్కటి మినహా మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడనుంది. అన్నీ కూడా రాత్రి 7: 30 నిమిషాలకే ఆరంభం అవుతాయి. ఇక సూపర్-12లో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్తో మ్యాచ్ పూర్తి చేసుకున్న కోహ్లి సేన.. అక్టోబరు 31న న్యూజిలాండ్తో జరిగే కీలక మ్యాచ్కు సిద్ధమవుతోంది. ఆ తదుపరి అబుదాబి వేదికగా అఫ్గనిస్తాన్తో నవంబరు 3న తలపడనుంది. ఇక అన్నీ సజావుగా సాగి ఫైనల్ చేరితే దుబాయ్లోనే తుదిపోరుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. టాస్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? అక్టోబరు 24న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ ఓడిపోయాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు కనీవిని ఎరుగని రీతిలో ఓటమి ఎదురైన విషయం తెలిసిందే. ప్రపంచకప్ చరిత్రలో చిరకాల ప్రత్యర్థి చేతిలో ఓటమి ఎరుగని భారత జట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే, మంచు ప్రభావం కూడా ఈ మ్యాచ్పై ఎంతగానో ఉందని.. ఓటమి అనంతరం కోహ్లి పేర్కొన్నాడు. ఆ మాట వాస్తవమేనని.. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే వంటి మాజీలు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సెమీస్ చేరే క్రమంలో కోహ్లి సేనకు మార్గం సుగమం కావాలంటే కివీస్తో ఆడబోయే మ్యాచ్ కీలకంగా మారింది. కాబట్టి టాస్ గెలవాల్సిన ఆవశ్యకత కూడా ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ టాస్ ఓడినట్లయితే పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇప్పటికే అంచనా వేసిన అభిమానులు.. కోహ్లి తప్పక టాస్ గెలువు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. సూపర్-12 రౌండ్: టీ20 ప్రపంచకప్లో టీమిండియా షెడ్యూల్ ఇలా.. ►ఇండియా వర్సెస్ పాకిస్తాన్, అక్టోబరు 24-దుబాయ్ ►ఇండియా వర్సెస్ న్యూజిలాండ్-అక్టోబరు 31- దుబాయ్ ►ఇండియా వర్సెస్ అఫ్గనిస్తాన్- నవంబరు 3- అబుదాబి ►ఇండియా వర్సెస్ స్కాట్లాండ్- నవంబరు 5-దుబాయ్ ►ఇండియా వర్సెస్ నమీబియా- నవంబరు 8-దుబాయ్ చదవండి: T20 World Cup 2021: స్వదేశానికి తిరిగి వచ్చేసిన టీమిండియా నెట్ బౌలర్ -
T20 WC Aus Vs SA: ఆసీస్ ఏం చేస్తుందో... దక్షిణాఫ్రికాకు అదే సానుకూలాంశం..
T20 World Cup 2021: ధనాధన్ పోరులో రెండో అంకానికి రంగం సిద్ధం. 16 జట్ల సమరం 12 జట్లకు మారింది. వినోదం మాత్రం అంతకంటే రెట్టింపు కానుంది. టాప్ టీమ్ల మధ్య హోరాహోరీకి నేటితో తెర లేవనుండగా, మెగా టోర్నీని గెలుచుకునే లక్ష్యం దిశగా తొలి మ్యాచ్ నుంచే సత్తా చాటాలని జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఒక్కసారి కూడా పొట్టి ప్రపంచ కప్ను ముద్దాడని రెండు అగ్రశ్రేణి జట్లు ఈ సారైనా కల నెరవేర్చుకునేందుకు శుభారంభంపై దృష్టి పెట్టాయి. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తేల్చుకునేందుకు పదునైన అస్త్రాలతో భారత్ రేపు రంగంలోకి దిగనుంది. నవంబర్ 14న జరిగే ఫైనల్ వరకు మెరుపు ప్రదర్శనలు, విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో ఈ 23 రోజులు క్రికెట్ అభిమానులకు పెద్ద పండగే! అబుదాబి: సరిగ్గా ఏడాది క్రితం ఆస్ట్రేలియా గడ్డపై ఏడో టి20 ప్రపంచకప్ జరగాల్సింది. కానీ కరోనా కారణంగా మా వల్ల కాదంటూ ఆ్రస్టేలియా చేతులెత్తేసింది... అక్కడ ఏం జరిగినా మేం మాత్రం షెడ్యూల్ ప్రకారం 2021లో మా దేశంలోనే నిర్వహిస్తామని బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. కానీ 2021 ఏప్రిల్కు వచ్చేసరికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కోవిడ్ ఉధృత దశకు చేరుతున్న వేళ క్రికెట్ గురించి మాట్లాడే స్థితి లేకపోయింది. పైగా ఐపీఎల్కు కరోనా కాటు తగలడంతో రాబోయే ప్రమాదాన్ని ఊహించిన భారత బోర్డు మన దేశంలో మ్యాచ్లు నిర్వహించడం అసాధ్యమని తేల్చేసింది. చివరకు ఆతిథ్యం మనదే కానీ ఆట మాత్రం విదేశాల్లో జరిపేందుకు రంగం సిద్ధమైంది. ఎట్టకేలకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టి20 తొలి దశ పోటీలు శుక్రవారంతో ముగియగా, ముందంజ వేసే జట్లేవో ఖరారైపోయింది. ఇప్పుడు ఈ ‘సూపర్–12’ నుంచి ఎవరు విశ్వవిజేతగా నిలుస్తారనేది ఆసక్తికరం. ఆసీస్ ఏం చేస్తుందో! సుదీర్ఘ కాలంపాటు క్రికెట్ను శాసించినా టి20 ప్రపంచకప్ మాత్రం ఆస్ట్రేలియా జట్టుకు అందని ద్రాక్షే అయింది. ఆరు టోర్నీలను చూస్తే 2010లో ఫైనల్ చేరడం మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదు. ప్రస్తుత టీమ్లో ఓపెనర్లు వార్నర్, ఫించ్ పేలవ ఫామ్లో ఉండటం కలవరపెడుతుండగా... మిడిలార్డర్లో మ్యాక్స్వెల్, స్మిత్, స్టొయినిస్లను జట్టు నమ్ముకుంది. ఆ జట్టు పేస్ దళం మెరుగ్గానే ఉన్నా... స్పిన్కు అనుకూలించే యూఏఈ పిచ్లపై జంపా, అగర్ స్థాయి బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించగలరనేది సందేహమే. మరోవైపు స్టార్లతో నిండి ఉన్నప్పుడు కూడా దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ప్రపంచకప్లో ఫైనల్ చేరలేదు. ఇప్పుడు పెద్దగా అనుభవంలేని ఆటగాళ్లు ఎక్కువ మందితో కూడిన టీమ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడే అవకాశం ఉండటం సానుకూలాంశం. చదవండి: T20 WC 2021: చరిత్ర సృష్టించిన నమీబియా; ఆటగాళ్ల సంబరం మాములుగా లేదు -
T20 World Cup 2021: పాల్గొనే జట్లు, పూర్తి షెడ్యూల్.. ఇతర వివరాలు
ICC T20 World Cup 2021: మరికొన్ని గంటల్లో మరో క్రికెట్ పండుగ మొదలుకానుంది. పొట్టి ఫార్మాట్లోని మజా పంచేందుకు ఐసీసీ టీ20 వరల్డ్కప్ టోర్నీ మన ముందుకు రానుంది. అక్టోబరు 17 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా ఈవెంట్కు సంబంధించిన షెడ్యూల్, జట్లు, సమయ పట్టిక, వేదిక తదితర అంశాల గురించి పరిశీలిద్దాం. 16 జట్లు టీ20 వరల్డ్కప్-2021 టోర్నీలో మొత్తం 16 జట్లు ఆడబోతున్నాయి. టీమిండియా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాలాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఒమన్, పపువా న్యూ గినియా, నమీబియా మెగా టోర్నీలో భాగం కానున్నాయి. నవంబరు 14న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 4 స్థానాల కోసం పోటీ ►సూపర్ 12లో భాగంగా ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మిగిలిన నాలుగు స్థానాల కోసం 8 జట్లు పోటీపడనున్నాయి. ►గ్రూప్-ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్ బీలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ ఉన్నాయి. ప్రతి గ్రూపులో టాపర్గా నిలిచిన రెండు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. సూపర్ 12లో ఉన్న జట్లు ►గ్రూప్ 1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, గ్రూప్- ఏ(A1) టాపర్, గ్రూప్-బీ(B2)లోని రెండో జట్టు ఉంటాయి. ►గ్రూప్-2లో టీమిండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, A2, B1 ఉంటాయి. ►ప్లేఆఫ్ చేరుకున్న ఇరు గ్రూపుల నుంచి రెండు జట్లు సెమీ ఫైనల్లో తలపడతాయి. ►మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 నిమిషాలు, రాత్రి 7:30 నిమిషాలకు మొదలవుతాయి. మ్యాచ్ నెంబర్ తేదీ మ్యాచ్ సమయం వేదిక స్టేజ్ 1, అక్టోబరు 17 ఒమన్ వర్సెస్ పపువా న్యూగినియా 03:30 మస్కట్ రౌండ్- 1 2 అక్టోబరు 17 బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్ 07:30 మస్కట్ రౌండ్- 1 3 అక్టోబరు 18 ఐర్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ 03:30 అబుదాబి రౌండ్- 1 4 అక్టోబరు 18 శ్రీలంక వర్సెస్ నమీబియా 07:30 అబుదాబిi రౌండ్- 1 5 అక్టోబరు 19 స్కాట్లాండ్ వర్సెస్ పపువా న్యూగినియా 03:30 మస్కట్ రౌండ్- 1 6 అక్టోబరు 19 ఒమన్ వర్సెస్ బంగ్లాదేశ్ 07:30 మస్కట్ రౌండ్- 1 7 అక్టోబరు 20 నమీబియా వర్సెస్ నెదర్లాండ్స్ 03:30 అబుదాబి రౌండ్ 1 8 అక్టోబరు 20 శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ 07:30 అబుదాబి రౌండ్ 1 9 అక్టోబరు 21 బంగ్లాదేశ్ వర్సెస్ పపువా న్యూగినియా 03:30 మస్కట్ రౌండ్ 1 10 అక్టోబరు 21 ఒమన్ వర్సెస్ స్కాట్లాండ్ 07:30 మస్కట్ రౌండ్ 1 11 అక్టోబరు 22 నమీబియా వర్సెస్ ఐర్లాండ్ 03:30 అబుదాబి రౌండ్ 1 12 అక్టోబరు 22 శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్ 07: 30 అబుదాబి రౌండ్ 1 13 అక్టోబరు 23 ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా 03: 30 అబుదాబి సూపర్ 12 14 అక్టోబరు 23 ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ 07:30 అబుదాబి సూపర్ 12 15 అక్టోబరు 24 A1 vs B2 03:30 షార్జా సూపర్ 12 16 అక్టోబరు 24 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 07:30 దుబాయ్ సూపర్ 12 17 అక్టోబరు 25 అఫ్గనిస్తాన్ వర్సెస్ B1 07:30 షార్జా సూపర్ 12 18 అక్టోబరు 26 సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ 03:30 దుబాయ్ సూపర్ 12 19 అక్టోబరు 26 పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ 07:30 షార్జా సూపర్ 12 20 అక్టోబరు 27 ఇంగ్లండ్ వర్సెస్ B2 03:30 అబుదాబి సూపర్ 12 21 అక్టోబరు 27 B1 వర్సెస్ A2 07:30 అబుదాబి సూపర్ 12 22 అక్టోబరు 28 ఆస్ట్రేలియా వర్సెస్ A1 07:30 దుబాయ్ సూపర్ 12 23 అక్టోబరు 29 వెస్టిండీస్ వర్సెస్ B2 03:30 షార్జా సూపర్ 12 24 అక్టోబరు 29 అఫ్గనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ 07:30 దుబాయ్ సూపర్ 12 25 అక్టోబరు 30 సౌతాఫ్రికా వర్సెస్ A1 03:30 షార్జా సూపర్ 12 26 అక్టోబరు 30 ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, 07:30 దుబాయ్ సూపర్ 12 27 అక్టోబరు 31 అఫ్గనిస్తాన్ వర్సెస్ A2 03:30 అబుదాబి సూపర్ 12 28 అక్టోబరు 31 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 07:30 దుబాయ్ సూపర్ 12 29 నవంబరు 1 ఇంగ్లండ్ వర్సెస్ A1 07:30 షార్జా సూపర్ 12 30 నవంబరు 2 సౌతాఫ్రికా వర్సెస్ B2 03:30 అబుదాబి సూపర్ 12 31 నవంబరు 2 పాకిస్తాన్ వర్సెస్ A2 07:30 అబుదాబి సూపర్ 12 32 నవంబరు 3 న్యూజిలాండ్ వర్సెస్ B1 03:30 దుబాయ్ సూపర్ 12 33 నవంబరు 3 ఇండియా వర్సెస్ అఫ్గనిస్తాన్ 07:30 అబుదాబి సూపర్ 12 34 నవంబరు 4 ఆస్ట్రేలియా వర్సెస్ B2 03:30 దుబాయ్ సూపర్ 12 35 నవంబరు 4 వెస్టిండీస్ వర్సెస్ A1 07:30 అబుదాబి సూపర్ 12 36 నవంబరు 5 న్యూజిలాండ్ వర్సెస్ A2 03:30 షార్జా సూపర్ 12 37 నవంబరు 5 ఇండియా వర్సెస్ B1 07:30 దుబాయ్ సూపర్ 12 38 నవంబరు 6 ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ 03:30 అబుదాబి సూపర్ 12 39 నవంబరు 6 ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా 07:30 షార్జా సూపర్ 12 40 నవంబరు 7 న్యూజిలాండ్ వర్సెస్ అఫ్గనిస్తాన్ 03:30 అబుదాబి సూపర్ 12 41 నవంబరు 7 పాకిస్తాన్ వర్సెస్ B1 07:30 షార్జా సూపర్ 12 42 నవంబరు 8 ఇండియా వర్సెస్ A2 07:30 దుబాయ్ సూపర్ 12 43 నవంబరు 10 సెమీ ఫైనల్-1 07:30 అబుదాబి ప్లే ఆఫ్ 44 నవంబరు 11 సెమీఫైనల్-2 07:30 దుబాయ్ ప్లేఆఫ్ 45 నవంబరు 14 ఫైనల్ 07:30 దుబాయ్ ఫైనల్ చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు -
యూఏఈ: భారతీయులకు గుడ్ న్యూస్
అబుదాబి: యూఏఈ వెళ్లే భారతీయులకు గుడ్న్యూస్. ఆన్లైన్ పేమెంట్ల విషయంలో భారతీయ సందర్శకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు లైన్ క్లియర్ అయ్యింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వారా చెల్లింపులు చేసేందుకు వీలు కల్పించింది యూఏఈ. తద్వారా UPI పేమెంట్లకు అనుమతి ఇచ్చిన మూడో దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిలిచింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NCPI).. మష్రెక్యూ బ్యాంక్ భాగస్వామ్యంతో యూపీఐ పేమెంట్ అవకాశం కల్పించనుంది. ఇండియాలో ఎలాగైతే యూపీఐ సిస్టమ్ను ఉపయోగించుకుంటున్నారో.. యూజర్లు ఇక అదే రీతిలో విదేశీ ట్రాన్జాక్షన్లు చేసుకోవచ్చు. తద్వారా వ్యాపార, ఇతరత్ర వ్యవహారాలపై యూఏఈని సందర్శించే 20 లక్షల మంది భారతీయులకు లబ్ది చేకూరనుందని అంచనా వేస్తున్నారు. సందర్శకులతో పాటు యూఏఈ వాసులకు సైతం క్యాష్లెష్ పేమెంట్స్కు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనుందని ఎఐపీఎల్ సీఈవో రితేష్ శుక్లా వెల్లడించారు. ఇంతకు ముందు సింగపూర్, భూటాన్లు యూపీఐ పేమెంట్స్కు అనుమతి ఇచ్చాయి. భారత్లో మొత్తం 50 థర్డ్పార్టీ యూపీఐ యాప్స్ ఉండగా.. అందులో ఫోన్పే, గూగుల్పే, పేటీఎం, అమెజాన్ పే మార్కెట్లో పాపులర్ అయ్యాయి. చదవండి: అఫ్గన్ కార్మికుల సంగతి ఏంటి? ప్రయాణికులకు ఊరట పాస్పోర్టులు ఉన్న భారతీయ ప్రయాణికులు టూరిస్ట్ వీసాలపై తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్లో కాకుండా విదేశాల్లో గత 14 రోజులుగా ఉన్న భారతీయులు మాత్రమే రావచ్చని స్పష్టం చేసింది. ఇదే సౌకర్యాన్ని నేపాల్, నైజీరియా, పాకిస్థాన్, శ్రీలంక, ఉగాండా ప్రయాణికులకూ కల్పిస్తున్నట్లు యూఏఈ వివరించింది. యూఏఈ చేరుకున్న రోజుతో పాటు తొమ్మిదో రోజు కూడా ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: భార్య ఎఫైర్లన్నీ వెబ్సైట్లో.. సొంతవాళ్లపైనే భర్త అఘాయిత్యాలని ఆరోపణలు -
ముఖేష్ అంబానీ రూ.11,100 కోట్ల ఇన్వెస్ట్, ఒప్పందం పూర్తి
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) యూఏఈలో నిర్మితమవుతున్న భారీ పెట్రోకెమికల్ కేంద్రం(హబ్)లో ఇన్వెస్ట్ చేసేందుకు అంగీకరించింది. ఇందుకు ఒప్పందంపై సంతకాలు చేసింది. పెట్టుబడి వివరాలు వెల్లడికానప్పటికీ 150 కోట్ల డాలర్లు(సుమారు రూ. 11,100 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు అంచనా. అబుధాబి ప్రభుత్వ ఇంధన దిగ్గజం అడ్నాక్, హోల్డింగ్ కంపెనీ ఏడీక్యూ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టాజిజ్ జేవీ పశ్చిమ అబుధాబిలో రువాయిస్ డెరివేటివ్ పార్క్ను అభివృద్ధి చేస్తోంది. ఈ జేవీతో ముఖేష్ అంబానీ చేతులు కలపనున్నారు. ఈ ప్రాజెక్టులో పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ తెలియజేసింది. అయితే ఇన్వెస్ట్మెంట్ వివరాలు వెల్లడించలేదు. పార్క్కు సంబంధించి జత కలవగల భాగస్వాముల కోసం టాజిజ్ చర్చలు నిర్వహిస్తోంది. 2025కల్లా కార్యకలాపాలు ప్రారంభించే వీలున్న ఈ పార్క్ 500 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోగలదని అంచనా. అబుధాబి జాతీయ చమురు కంపెనీ(అడ్నాక్) రోజుకి 3 మిలియన్ బ్యారళ్ల చమురును సరఫరా చేయనుంది. తద్వారా రువాయిస్లో డౌన్స్ట్రీమ్ కార్యకలాపాలకు తెరతీయనుంది. ఇందుకు వీలుగా భాగస్వాముల ద్వారా 45 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెచ్చించాలని ప్రణాళికలు వేసింది. డౌన్స్ట్రీమ్ కార్యకలాపాల అభివృద్ధిలో భాగంగా రిఫైనింగ్, పెట్రోకెమికల్ సామర్థ్యాలను భారీగా పెంచుకోవాలని చూస్తోంది. చదవండి : Realme : రూ.7వేలకే 5జీ స్మార్ట్ఫోన్ ఎప్పుడో తెలుసా ? ఆర్ఐఎల్ ప్రణాళికలు రువాయిస్లో చమురు రిఫైనరీతోపాటు.. పెట్రోకెమికల్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని టాజిజ్ ప్రణాళికలు వేసింది. కాగా.. ఒప్పందంలో భాగంగా ఆర్ఐఎల్ ప్రపంచస్థాయి క్లోర్ ఆల్కలీ, ఎథిలీన్ డైక్లోరైడ్, పీవీసీ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆర్ఐఎల్ సంతకాలు చేసినట్లు అడ్నాక్ తాజాగా పేర్కొంది. తద్వారా కీలకమైన పారిశ్రామిక ముడిసరుకులకు పెరుగుతున్న డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు గ్లోబల్ ఇంధన దిగ్గజాలైన రెండు సంస్థల శక్తి, సామర్థ్యాలను వినియోగించనున్నట్లు తెలియజేసింది. ఒప్పందం ప్రకారం టాజిజ్, ఆర్ఐఎల్ సంయుక్తంగా సమీకృత ప్లాంటును ఏర్పాటు చేయనున్నాయి. దీనిలో భాగంగా వార్షికంగా 9,40,000 టన్నుల క్లోర్ ఆల్కలీ, 1.1 మిలియన్ టన్నుల ఎథిలీన్ డైక్లోరైడ్, 3,60,000 టన్నుల పీవీసీ తయారీ సామర్థ్యాలు ఏర్పాటు కానున్నట్లు అడ్నాక్ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు ఎన్ఎస్ఈలో 0.2 శాతం పుంజుకుని రూ. 2,090 వద్ద ముగిసింది. చదవండి: వాట్సాప్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయండిలా.! -
అమ్మా.. నాన్న ఫోన్ ఎందుకు చేస్తలేడు?
మేడిపెల్లి (వేములవాడ): ‘దుబాయ్ పోయి పైసలు సంపాదించి పిల్లలకు ఏ లోటు రాకుండా చూద్దామని అంటివి. అమ్మను ఏడిపించొద్దు.. చెప్పినట్టు వినాలని పిల్లలకు చెప్తివి. పిల్లలను మంచిగ చూసుకో.. డబ్బులు పంపిస్త.. అని చెప్పి పోయి ఆరు నెలలైతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫోన్ లేదు. అమ్మా.. నాన్న ఎందుకు ఫోన్ చేస్తలేడని పిల్లలు అడిగితే ఇప్పటిదాకా ఏదోలాగా సమాధానం చెప్పుకొచ్చిన. నువ్వు ఎక్కడున్నా మాతో ఫోన్లో మాట్లాడి క్షేమంగా ఉన్నానని చెప్పు’అంటూ జాడలేని తన భర్తకోసం ఓ ఇల్లాలు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం మన్నెగూడెంకు చెందిన శ్రీరాముల హరిప్రసాద్ (40) ఊళ్లోనే టీ స్టాల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అతడికి భార్య నీరజతో పాటు పవన్ (9), రక్షిత (7) ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలు ఎదుగుతుండటంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. అయినప్పటికీ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలని ఆశ పడ్డాడు. గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకొని, అబుదాబిలో హోటల్లో పనికోసం రూ.2 లక్షలు చెల్లించి గతేడాది డిసెంబర్ 27న అక్కడికి వెళ్లాడు. కరోనా నిబంధనల ప్రకారం కంపెనీ వారు హరిప్రసాద్ను 10 రోజులపాటు క్వారంటైన్లో ఉంచారు. జనవరి 5న కంపెనీ కేటాయించిన రూములోకి మారాడు. రూల్స్ ప్రకారం మెడికల్ టెస్టులు చేయించి జనవరి 19 నుంచి పనికి రావాలని కంపెనీ యాజమాన్యం తెలిపింది. అయితే జనవరి 18న చిన్న పని ఉందని తనతో రూమ్లో ఉన్నవారికి చెప్పి బయటకు వెళ్లిన హరిప్రసాద్ అదృశ్యమయ్యాడు. ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. తన భర్త అబుదాబి వెళ్లి ఫోన్ చేయకపోవడంతో భర్త పనికి కుదిరిన ప్రాంతంలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది నీరజ. వారు అక్కడికి వెళ్లి చూడగా హరిప్రసాద్ ఫోన్తోపాటు లగేజీ కూడా రూములోనే ఉన్నాయి. కంపెనీ వారు సైతం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు వెల్లడించారు. హరిప్రసాద్ ఇంటి నుంచి వెళ్లి ఆరు నెలలు అవుతున్నా భార్య, ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్ చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తన భర్తను ఇంటికి రప్పించేలా చూడాలని భార్యా పిల్లలు చేతులు జోడించి వేడుకుంటున్నారు. హరిప్రసాద్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకోవాలని, స్వగ్రామానికి తీసుకువచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఔదార్యం..
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ గత 53 ఏళ్లుగా ప్రవాస భారతీయుల సంక్షేమానికి కోసం పలు సేవ కార్యక్రమాలు చేపడుతూ అండగా నిలుస్తోంది. అయితే భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగసామ్యం కావడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు కరోనా బాధితులకు అవసరమయ్యే సుమారు రూ.10 లక్షల విలువైన ఆక్సిజన్ సిలిండర్స్ని ఢిల్లీలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి పంపించింది. భారత దౌత్య కార్యాలయ విజ్ఞప్తి మేరకు ఎమిరేట్స్ విమానయాన సంస్థ ఈ ఆక్సిజన్ సిలిండర్స్ని ఉచితంగా ఇండియాకు రవాణా చేసింది. ఎమిరేట్స్ విమానయాన సంస్థకి యూఏఈలో నివసిస్తున్న ప్రవాసీ భారతీయులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆ సంస్థ సంక్షేమ కార్యదర్శి రాజా శ్రీనివాసరావు అన్నారు. రానున్న రోజుల్లో మరింత సహాయం అందిస్తామని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి జోజో అంబూకేన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు జార్జ్ వర్గీస్, క్రీడా కార్యదర్శి ఫ్రెడ్డీ జె. ఫెర్నాండెజ్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ సి. జార్జ్ వర్గీస్, జనరల్ మేనేజర్ రాజు పాల్గొన్నారు. (చదవండి: TikTok: నేను మరీ అంత సోషల్ కాదు.. సీఈఓగా ఉండలేను) -
విజేత వెర్స్టాపెన్
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) 2020–సీజన్ ముగింపు రేసులో రెడ్బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. యాస్ మరీనా సర్క్యూట్లో ఆదివారం జరిగిన అబుదాబి గ్రాండ్ప్రిలో నిర్ణీత 55 ల్యాప్లను వెర్స్టాపెన్ అందరికంటే ముందుగా గంటా 36 నిమిషాల 28.645 సెకన్లలో ముగించి ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన 23 ఏళ్ల వెర్స్టాపెన్కు ఏదశలోనూ ఇతర డ్రైవర్ల నుంచి పోటీ ఎదురుకాలేదు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు బొటాస్ రెండో స్థానంలో... హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు. గతవారం సాఖిర్ గ్రాండ్ప్రి విజేత సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్–ఆర్పీ) ఎనిమిదో ల్యాప్లోనే రేసు నుంచి తప్పుకున్నాడు. కరోనా కారణంగా ఈ సీజన్లో 22 రేసులకు బదులుగా 17 రేసులను మాత్రమే నిర్వహించారు. 11 రేసుల్లో గెలుపొందిన హామిల్టన్ (మెర్సిడెస్) 347 పాయింట్లతో ఓవరాల్ డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్ను ఏడోసారి సొంతం చేసుకొని దిగ్గజ డ్రైవర్ మైకేల్ షుమాకర్ (జర్మనీ) రికార్డును సమం చేశాడు. బొటాస్, వెర్స్టాపెన్ రెండేసి రేసుల్లో నెగ్గగా... పెరెజ్, పియరీగ్యాస్లీ ఒక్కో రేసులో గెలిచారు. 573 పాయింట్లతో టీమ్ కన్స్ట్రక్టర్స్ చాంపియన్షిప్ కూడా మెర్సిడెస్ జట్టుకే లభించింది. -
హవ్వా!! పిచ్చి పనికి గిన్నిస్ రికార్డా..
అబుదాబి : ఓ పెద్ద బిల్డింగ్ను అతి తక్కువ సమయంలో కూల్చి ప్రపంచ రికార్డు నెలకొల్పిందో రియల్ ఎస్టేట్ సంస్థ. వివరాలు.. అబుదాబికి చెందిన మోడన్ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొద్దిరోజుల క్రితం 541.44 అడుగుల సొంత బిల్డింగ్ ‘మినా ప్లాజా’ను 10 సెకన్లలో కూల్చేసింది. 4 టవర్లు, 144 ఫ్లోర్లు ఉన్న ఆ పెద్ద భవనం అతి తక్కవ సమయంలో పేకమేడలా కూలిపోయింది. దీంతో గిన్నిస్ బుక్ రికార్డ్ సంస్థ సొంతమైంది. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ సంస్థ తమ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసింది. ( ఆన్లైన్లో పెళ్లికి 2 వేల మంది అతిధులు ) దీంతో వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు‘అవెంజర్స్ సినిమాలో టోనీ స్టార్క్.. హల్కుతో గొడవపడి ఎప్పుడో ఇలాంటి బిల్డింగ్ను కూల్చేశాడు’.. ‘అదో పిచ్చి పని’.. ‘ డబ్బుల్ని, వనరుల్ని వృధా చేస్తున్నారు’.. ‘అద్బుతంగా ఉంది’.. ‘ హవ్వా!! పిచ్చి పనికి గిన్నిస్ రికార్డా..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఆ దేశాల్లో కరోనా రోగుల్ని గుర్తించే శునకాలు
అబుధాబి: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కొన్ని దేశాలు శునకాల సాయం తీసుకుంటున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ వాసనని శునకాలు పసిగడతాయని ఇప్పటికే అధ్యయనాల్లో తేలిన విషయం తెలిసిందే. యూఏఈ, ఫిన్ల్యాండ్, లెబనాన్ దేశాల్లో రోగుల్లో కరోనా లక్షణాలు బయటపడక ముందే శునకాలు రోగుల్ని గుర్తిస్తున్నాయి. లెబనాన్ విమానా శ్రయానికి వచ్చిన 1,680 మంది ప్రయాణికుల్లో 159 మందిని కరోనా రోగులుగా శునకాలు గుర్తిస్తే, వారిలో 92 శాతం మందికి కరోనా ఉన్నట్టుగా ఆ తర్వాత తేలిందని అధికారులు చెప్పారు. (కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత) -
జాక్పాట్ అంటే నీదే తమ్ముడు
షార్జా : కొందరికి వద్దన్నా అదృష్టం నక్కలాగా అతుక్కుపోతుందంటారు. ఏదో సరదాకు కొన్న లాటరీ టికెట్ ద్వారా అంత పెద్ద మొత్తం వస్తుందని బహుశా అతను కూడా ఊహించి ఉండడు. లాటరీలో నీకు కోట్లు తగిలాయరా అని మొదటిసారి వచ్చి చెప్పినప్పుడు అతను నమ్మలేదు.. తీరా అది నిజమేనని తెలిశాక అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి... 'జాక్పాట్ అంటే నీదే తమ్ముడు' అంటూ కామెంట్ చేశారు. ఇక అసలు విషయానికి వస్తే.. పంజాబ్కు చెందిన గుర్ప్రీత్ సింగ్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం యూఏఈ వెళ్లాడు. షార్జాలో ఐటీ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్న ఆయన.. ఆగస్ట్ 12న అబుదాబిలో బిగ్ టికెట్ రాఫెల్ లాటరీ టికెట్ను కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3న లక్కీ డ్రా నిర్వాహకులు డ్రా తీయగా.. గుర్ప్రీత్ సింగ్ 10 మిలియన్ దిర్హామ్స్( భారత కరెన్సీలో రూ.19.90కోట్లు) గెలుచుకున్నాడు. ( చదవండి : ప్లీజ్.. బోన్లెస్ చికెన్ పేరును మార్చండి) దీనిపై గురుప్రీత్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ' లాటరీలో నేను కోట్ల రూపాయలు గెలుచుకున్నా అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అదృష్టం అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. లక్కీ డ్రాలో గెలుచుకున్న డబ్బులతో యూఏఈలో ఓ ఇల్లు కొనుగోలు చేస్తా. నా తల్లిదండ్రులంటే నాకు చెప్పలేనంత ఇష్టం.. ఈ డబ్బులతో వారిని యూఏఈకి తీసుకొస్తా'నంటూ చెప్పుకొచ్చాడు.(చదవండి : విమర్శకుల నోళ్లుమూయించాం : రష్యా) -
అబుదాబిలో భారత దంపతుల అనుమానాస్పద మృతి
దుబాయ్ : అబుదాబిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఫ్లాట్లో భారత్కు చెందిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ మేరకు ఖలీజ్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. మృతులను కేరళ కోజికోడ్ జిల్లాకు చెందిన జనార్ధనన్ పట్టీరీ(57), మినిజ(52) దంపతులుగా గుర్తించారు. అయితే వారి మరణానికి గల కారణాలు తెలియరాలేదు. వీరు 18 ఏళ్ల నుంచి అబుదాబిలో నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. జనార్ధనన్ ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తుండగా, మినిజా చార్టర్ అకౌంటెంట్గా ఉన్నారు. అయితే జనార్ధన్ ఇటీవలే తన ఉద్యోగం కోల్పోయినట్టుగా సమాచారం.(నియంత రాజ్యంలో తొలి కరోనా కేసు) ఈ ఘటనకు సంబంధించి వారి సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ.. ‘జనార్థనన్, మినిజ చాలా మంచివారు. వారికి ఎవరితోనూ ఎటువంటి సమస్య లేదు. జనార్ధనన్ తన ఉద్యోగం కోల్పోయాడు. కొద్ది రోజుల క్రితమే తన కారును కూడా అమ్మేశాడు. ఈ ఘటనపై అతని సహోద్యోగులు, స్నేహితులు షాక్కు గురయ్యారు. ఇలా జరిగి ఉండాల్సి కాదు’ అని పేర్కొన్నారు. కాగా, జననార్ధనన్కు-మినిజ దంపతకుల ఒక కుమారుడు ఉన్నాడు. అతడు అబుదాబిలోనే చదువుకున్నప్పటకీ.. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు.(అన్లాక్ 3.0 : సినిమా హాళ్లు, జిమ్లకు అనుమతి?) -
జియోలో పెట్టుబడుల ప్రవాహం: మరో డీల్
సాక్షి, ముంబై: పెట్టుబడుల సమీకరణలో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వరుసగా ఆరోసారి మెగా డీల్ సాధించింది. జియో ప్లాట్ఫామ్స్లో మరో భారీ ఒప్పందాన్ని అధికారికంగా అంబానీ ప్రకటించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఆరు వారాల్లో ఆరు దిగ్గజ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను సేకరించడం విశేషం. ఆర్ఐఎల్ టెలికాం విభాగం జియో ప్లాట్ఫామ్స్లో అబుదాబికి చెందిన ముబదాలా ఇన్వెస్ట్మెంట్ సంస్థ 1.85 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. దీని విలువ రూ. 9,093.6 కోట్లు. ఈక్విటీ విలువ, రూ. 4.91 లక్షల కోట్లు కాగా ఎంటర్ప్రైజ్ విలువ రూ. 5.16 లక్షల కోట్లు అని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో జియో సేకరించిన మొత్తం పెట్టుబడులు విలువ రూ.87,655.35 కోట్లకు చేరినట్టు ప్రకటించింది. ఆరు భారీ ఒప్పందాల ద్వారా 18.97 శాతం వాటాలను విక్రయించింది. (రిలయన్స్ సామ్రాజ్యంలోకి మరో వారసుడు) కాగా జియో వాటాల అమ్మకాల ద్వారా రూ. 85వేల నుంచి రూ. 90 వేల కోట్లు సేకరించాలని ఆర్ఐఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జియో ప్లాట్ఫామ్స్లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఏప్రిల్ 22న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మొదలు వరుసగా మెగా డీల్స్ ను ప్రకటిస్తోంది. అనంతరం సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ , తాజాగా ముబదాలా లాంటి దిగ్గజ సంస్థలు ఈ వరుసలో నిలిచాయి. (జియోలో కేకేఆర్ భారీ పెట్టుబడి) జియోలో మొత్తం పెట్టుబడుల వివరాలివి.. 9.99 శాతం వాటా కొనుగోలుతో ఫేస్బుక్ పెట్టుబడులు రూ. 43,574 కోట్లు 1.15 శాతం వాటాతో సిల్వర్లేక్ పార్ట్నర్స్ రూ.5,656 కోట్లు 2.32 శాతం వాటాతో విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ రూ.11,367 కోట్లు 1.34 శాతం వాటాతో జనరిక్ అట్లాంటిక్ రూ.6,598 కోట్లు 2.32 శాతం వాటాతో కేకేఆర్ రూ.11,367 కోట్లు తాజాగా 1.8 5శాతం వాటాతో ముబదాల రూ.9,094 కోట్లు -
కరోనా: మీ పౌరులను తీసుకువెళ్లండి.. లేదంటే..
అబుదాబి: కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న తరుణంలో తమ దేశంలో చిక్కుకుపోయిన పౌరులను స్వదేశాలకు తీసువెళ్లని దేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హెచ్చరించింది. వర్క్ వీసాలపై ఆంక్షలు కఠినతరం చేస్తామని పేర్కొంది. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా తమ దేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశాల పౌరులకు కరోనా నిరార్ధరణ పరీక్షల్లో నెగటివ్ ఫలితం వస్తే స్వదేశాలకు పంపిస్తామని యూఏఈ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. అన్ని దేశాల రాయబార కార్యాలయాలకు ఈ మేరకు సమాచారం అందించింది. అయితే ఇప్పటి వరకు చాలా దేశాలు ఇందుకు స్పందించకపోవడంతో వర్క్ వీసాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేసింది.(కుప్పలుగా శవాలు.. అక్కడే ఎందుకు ఎక్కువ మరణాలు? ) కాగా దాదాపు 90 లక్షల జనాభా కలిగిన యూఏఈలో చాలా మంది పొట్టికూటి కోసం వచ్చిన వారే ఉన్నారు. ఇక ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న తరుణంలో కరోనా నెగటివ్గా తేలి... స్వదేశాలకు వెళ్లాలని భావిస్తున్న వారిని తమ దేశాలకు పంపుతామని రెండు వారాల క్రితం యూఏఈ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు 25 వేల మంది పాకిస్తానీలు దుబాయ్, అబుదాబిలో చిక్కుకుపోయారని పాకిస్తాన్ యూఏఈ రాయబారి గులాం దస్తగిర్ గల్ఫ్ న్యూస్కు వెల్లడించారు. వారిని స్వదేశానికి తరలించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే మిగతా దేశాల నుంచి సరైన స్పందన రాకపోవడంతో యూఏఈ తాజాగా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఇక కరోనా ధాటికి ఇప్పటివరకు యూఏఈలో 20 మంది మరణించగా.. 3736 మంది దీని బారిన పడ్డారు. కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా మాల్స్, రెస్టారెంట్లు మూసివేసింది. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించింది.(కరోనా: భారత్ నుంచి 444 మంది స్వదేశాలకు) భారత్ నుంచి 1300 మంది వెనక్కి: అమెరికా -
అబుదాబిలో సత్తా చాటిన తెలుగువాడు
అబుదాబిలో తెలుగువారు తమ సత్తా చాటుకున్నారు. అక్కడ జరిగిన ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన రాజా శ్రీనివాసరావు విజయం సాధించారు. గతంలో ఎన్నడూ తెలుగువారికి ప్రాధాన్యత లేదు. అయితే ఈ విజయంతో తెలుగు వాడికి గత మూడున్నర దశాబ్దాలుగా లేని ప్రాధాన్యత ఈ సారి దక్కడంతో తెలుగు వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజా శ్రీనివాసరావు సెంటర్ సదరన్ రీజియన్ సెక్రటరీగా ఎన్నిక కావడంపట్ల.. పలు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారు ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన రాజా శ్రీనివాసరావు తెలంగాణ ఉద్యమంలో కూడా యూఏఈలో ఉంటూ తన వంతు సహకారం అందించారు. సదరన్ రీజియన్ సెక్రటరీగా విజయం సాధించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన గెలుపు యూఏఈలోని ప్రతి తెలుగు వారికి అంకితమన్నారు. ఆయనకు ఈ బాధ్యతలు లభించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. -
రాజుగారు ఇంటికొచ్చారు
చిన్నారులు మనసు చిన్నబుచ్చుకుంటే పెద్దవాళ్ల ప్రాణం ఉసూరుమంటుంది. చిన్నబుచ్చింది తామే అని తెలిస్తే వెళ్లి ఊరడించేవరకు ఊరుకోరు. షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ పెద్ద మనిషి మనిషి మాత్రమే కాదు, అబుదాబికి యువరాజు కూడా! అంతటి మనిషి తనకు తెలియకుండానే ఓ బాలిక మనసు నొప్పించారు. ఓ విందు కార్యక్రమానికి ఆయన హాజరు అవుతున్నారని తెలిసి ఆయనకు స్వాగతం పలికేందుకు కొందరు చిన్నారులను ఎంపిక చేశారు నిర్వాహకులు.ఆ పిల్లలందర్నీ పలకరిస్తూ ముందుకు వెళుతున్న యువరాజు వారిలోని ఒక చిన్నారి చాచిన స్నేహ హస్తాన్ని గమనించకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు. తర్వాత ఆ వీడియో వైరల్ అయి యువరాజు వరకు వచ్చింది. వెంటనే ఆయన ఆ బాలిక ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి ఆప్యాయంగా కరచాలనం చేశారు. అంతేకాదు. బాలిక నుదుటిపై ముద్దు కూడా పెట్టారు. ఇక చూడండి.. ఆ పాప ఆనందం, ఆ ఇంటి ఆనందం. -
యువరాజు షేక్హ్యాండ్ ఇవ్వలేదు.. అంతకు మించి
అబుదాబి : అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ కొద్దిరోజుల క్రితం ఓ విందులో పాల్గొన్నారు. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజలు అతని షేక్హ్యాండ్ కోసం బారులు తీరారు. ఇంతలో ఓ చిన్నారి పరుగు పరుగున వచ్చి ఆ లైన్లో నిలబడింది. అతని కోసం చేతులు ముందుకు చాచి ఆతృతగా ఎదురు చూడసాగింది. అందరికీ చిరునవ్వుతో కరచాలనం చేస్తూ వచ్చిన యువరాజు చివరకు ఆ చిన్నారికి షేక్హ్యాండ్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. దీంతో బాలిక తీవ్ర నిరాశకు గురైంది. తనవంతు రాగానే యువరాజు షేక్హ్యాండ్ ఇవ్వలేదని ఎంతగానో బాధపడింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో వెంటనే ఆ యువరాజు చిన్నారి ఐశా మహమ్మద్ మషీత్ అల్ మజ్రౌవీ ఇంటికి వెళ్లి సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. చిన్నారితో కరచాలనం చేయడమే కాకుండా నుదుటిపై ఆత్మీయంగా ముద్దు పెట్టాడు. దీంతో బాలిక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యువరాజుది గొప్ప మనసు అంటూ ఆయన చేసిన పనికి నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు. -
ఇదేం బౌలింగ్రా నాయనా.. ఆడమ్స్ను మించిపోయావే!
అబుదాబి: శ్రీలంకకు చెందిన కెవిన్ కొతత్తిగొడ తన బౌలింగ్ యాక్షన్తో వార్తల్లో నిలిచాడు. అబుదాబి టీ10 లీగ్లో భాగంగా బంగ్లా టైగర్స్ తరఫున ఆడుతున్న కొతత్తిగొడ.. డెక్కన్ గ్లాడియేటర్స్తో మూడు రోజుల క్రితం తన వైవిధ్యమైన బౌలింగ్తో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. గతంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ పాల్ ఆడమ్స్ ఇదే తరహాలో బౌలింగ్ వేస్తూ హాట్ టాపిక్గా మారగా, ఇప్పుడు పాల్ ఆడమ్స్నే మించిపోయి మరీ బౌలింగ్ వేశాడు ఈ 24 ఏళ్ల శ్రీలంక స్పిన్నర్. 90 దశకాల్లోని క్రికెట్ అభిమానులకు దక్షిణాఫ్రికా స్పిన్నర్ పాల్ ఆడమ్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. బంతి విసిరడానికి ముందు తలను పూర్తిగా కిందకు వంచి రెండు చేతులూ పైకి చాస్తూ ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్మెన్కు బంతులేసేవాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత ఆ తరహా బౌలింగ్ యాక్షన్ మనకు దాదాపు కరువైందనే చెప్పాలి. తాజాగా కొతత్తిగొడ.. ఆడమ్స్ను గుర్తు చేస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో గాలే క్రికెట్ క్లబ్ తరుపున లిస్ట్-ఎ, టీ20 మ్యాచ్ల్లో అరంగేట్రం చేశాడు. లిస్ట్-ఎ మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీసిన అతడు నాలుగు టీ20ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 2017 ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ తరఫున ఆడిన శివం కౌశిక్ది కూడా ఈ విధమైన ప్రత్యేకమైన బౌలింగ్ శైలే కావడం విశేషం. ఇప్పుడు కెవిన్ కొతత్తిగొడ బౌలింగ్ యాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాంతో అభిమానులు విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదే బౌలింగ్రా నాయనా.. పాల్స్ ఆడమ్స్ను మించిపోయావే అంటూ కామెంట్లు పెడుతున్నారు. #NewFavePlayer Kevin Koththiigoda. Consonant in a blender pic.twitter.com/9EmOBFuNOW — Paul Radley (@PaulRadley) November 16, 2019 -
‘నన్నెవరు కిడ్నాప్ చేయలేదు’
అబుదాబి: కిడ్నాప్ చేసి.. మతం మార్చి.. ఉగ్రవాద గ్రూపులో చేర్చినట్లు ప్రచారం జరుగుతున్న కేరళ యువతి ఉన్నట్టుండి మీడియా ముందుకు వచ్చారు. ప్రేమించిన వ్యక్తి కోసం తాను అబుదాబి వెళ్లానని.. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు. వివరాలు.. కేరళ కోజికోడ్కు చెందిన 19 ఏళ్ల సియానీ బెన్ని అనే యువతి ఢిల్లీలోని జీసస్ అండ్ మేరి కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 18 నుంచి సియానీ కనిపించకుండా పోయారు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సియానీ అబుదాబి వెళ్లినట్లు గుర్తించారు. దాంతో ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని.. మతం మార్చి.. ఉగ్రవాద గ్రూపులో చేర్చారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సియానీ మీడియా ముందుకు వచ్చారు. తనను కిడ్నాప్ చేశారంటూ వస్తోన్న వార్తల్ని ఖండించారు. ప్రేమించిన యువకుడి కోసం తాను అబుదాబి వెళ్లానని తెలిపారు. ఈ సందర్భంగా సియానీ మాట్లాడుతూ.. ‘అబుదాబిలో స్థిరపడిన భారత సంతతి వ్యక్తితో 9 నెలల క్రితం నాకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ప్రేమగా మారింది. అతడిని వివాహం చేసుకోవడం కోసమే నేను అబుదాబి వెళ్లాను. నా ఇష్ట ప్రకారమే ఇస్లాంలోకి మారాను. ఇందులో ఎవరి బలవంతం లేదు. భారత్కు చెందిన నేను మేజర్ని. నా జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం అయినా తీసుకునే హక్కు నాకుంది’ అని తెలిపారు. అంతేకాక తన ఇష్ట ప్రకారమే ఇస్లాంలోకి మారానని అబుదాబి కోర్టులో కూడా తెలిపానన్నారు. తన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం తనను కలుసుకోవడానికి అబుదాబి వస్తున్నారని పేర్కొన్నారు సియానీ. తనకు ఇండియా వచ్చే ఉద్దేశం లేదని.. ఇక్కడే ఉంటానని.. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంటానని సియానీ స్పష్టం చేశారు. అంతేకాక తనను కిడ్నాప్ చేశారంటూ ప్రచారం చేస్తోన్న వారిపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. -
భర్తకు చెప్పకుండా లాటరీ.. కానీ..!
తిరువనంతపురం: అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో..! యూఏఈలో నివాసముండే కేరళకు చెందిన సోప్నా నాయర్కు ఊహించని విధంగా జాక్పాట్ తగిలింది. అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్వహించే లాటరీలో బుధవారం ఆమెను భారీ లాటరీ వరించింది. వివరాలు.. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం వారు బిగ్ టిక్కెట్ లాటరీ నిర్వహిస్తున్నారు. సోప్నా గతంతో మూడునాలుగు సార్లు లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసినప్పటికీ ఎలాంటి బహుమతి లభించలేదు. ఇటీవల మరోసారి తన అదృష్టం పరీక్షించుకొంది. తన భర్తకు తెలియకుండా ఐదోసారి టికెట్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన డ్రా.. బుధవారం జరిగింది. డ్రాలో సోప్నాకు 3.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.22 కోట్లు) బహుమతి వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. ఇక లాటరీ గెలుచుకోవడం పట్ల సోప్నా, ఆమె కుటుంబం ఆనందం వ్యక్తం చేశారు. గెలుచుకున్న సొమ్ములో కొంత నిరుపేదలను ఆదుకోవడానికి, మిగతాది తన కుటుంబ పోషణకు కేటాయిస్తానన్నారు సోప్నా. -
లాటరీల్లో భారతీయులను వరిస్తున్న అదృష్టం
దుబాయి: బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లిన భారతీయులకు ఈ మధ్య లాటరీలు బాగానే తగులుతున్నాయి. ఇటీవలే కేరళకు చెందిన డ్రైవర్ జాన్ వర్గీస్ ఓ లాటరీలో రూ.80 కోట్లకుపైగా గెలుచుకున్నాడు. తాజాగా మరో భారతీయుడికి (4 మిలియన్ అమెరికా డాలర్ల) రూ.27.7 కోట్ల విలువైన లాటరీ తగిలింది. యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షప్రసారం చేసిన అబుదాబి డ్యూటీ ఫ్రీ బిగ్ టికెట్ సిరీస్ డ్రాలో షార్జాలో నివసిస్తున్న భారతీయుడు షోజిత్ కేఎస్ భారీ మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. షోజిత్ గతనెల 1వ తేదీన ఆన్లైన్లో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అయితే లాటరీ తగిలిన విషయం షోజిత్కు తెలియక నిర్వాహకులను సంప్రదించనే లేదట. దీంతో నిర్వాహకులే స్వయంగా షోజిత్ ఇంటికి వెళ్లి, లాటరీ మొత్తాన్ని అందజేశారు. ఇక ఇదే లాటరీ లక్కీ డ్రాలో బహిష్కృత భారతీయుడు మంగేశ్ మైందె బీఎండబ్ల్యూ కారును దక్కించుకున్నాడు. మరో ఎనిమిదిమంది భారతీయులతోపాటు ఒక పాక్ పౌరుడు కూడా ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నారని నిర్వాహకులు తెలిపారు. -
రేణువులలో నారాయణుడు
అక్షరధామ్ రూపురేఖలు, హవా మహల్ వర్ణమిశ్రాల మేళవింపుతో అబూధాబిలో మన దేశం నిర్మిస్తున్న స్వామి నారాయణ్ ఆలయం పూర్తయేందుకు కొంత సమయం పట్టవచ్చు. అయితే సమయంతో నిమిత్తం లేకుండా ఇప్పటికే ఆ నిర్మాణ ప్రయత్నాల్లోంచి మత సామరస్యం గుడి గంటల ధ్వనిలా ప్రపంచమంతటా వినిపిస్తోంది! ఇస్లాం దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబు ధాబి నగరంలో 26 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఓ హిందూ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం 2015లోనే యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ 16 ఎకరాల స్థలాన్ని ఉచితంగా కేటాయించగా, ఇటీవల యూఏఈ ప్రభుత్వం నిర్వహించిన సర్వమత సమ్మేళనం సందర్భంగా ఆలయంలో పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం మరో పది ఎకరాలు స్థలాన్ని విరాళంగా ప్రకటించారు. అబు ధాబి–దుబాయ్ ప్రధాన రోడ్డు పక్కన నిర్మించనున్న స్వామి నారాయణ్ ఆలయ నిర్మాణానికి ఇటీవలే మహంత్ స్వామి మహరాజ్ భూమి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు కూడా. బ్రహ్మవిహారి స్వామి ఆలయ నిర్మాణ బాధ్యతలు చూస్తారు. అతిపెద్ద షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ మసీదుకు సమీపంలోనే ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2019 సంవత్సరాన్ని టాలరెన్స్ (సహనం) సంవత్సరంగా ప్రకటించడమే కాకుండా టాలరెన్స్ పేరిట ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మత సామరస్యం కోసం ఓ నిధిని కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ‘సహన శాఖ’ను ఏర్పాటు చేసిన ఏకైక దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చరిత్రలోకి ఎక్కింది. ఈ శాఖ సమన్వయంతో ఇస్లాం మత పెద్దల మండలి ఫిబ్రవరి నెల మూడు, నాలుగు తేదీల్లో క్రై స్తవ, ఇస్లాం సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించింది. దీనికి క్రై స్తవుల తరఫున పోప్ ఫ్రాన్సిస్ హాజరుకాగా, ఇస్లాం మతస్థుల తరఫున అల్ అజర్ ఇమామ్ అహ్మద్ అల్ తయ్యబ్ ముఖ్య అతిథిగా హాజరై ఓ సంయుక్త ప్రకటన చేశారు. ‘తూర్పు–పశ్చిమ ప్రాంతాలకు చెందిన క్యాథలిక్కులు, క్యాథలిక్ చర్చి, తూర్పు–పశ్చిమ ప్రాంతాలకు చెందిన ముస్లింలు, అల్ అజర్ అల్ షరీఫ్లు సంయుక్తంగా చేస్తున్న ప్రకటన ఏమిటంటే పరస్పర సహకారం, పరస్పర అవగాహనే ప్రవర్తన నియామావళిగా చర్చలే సరైన మార్గంగా కలసి ముందుకు సాగుతాం’ అని. ఆ డిక్లరేషన్ను పోప్, ఇమామ్లు సంయుక్తంగా విడుదల చేశారు. పాశ్చాత్య దేశాల్లో క్రై స్తవులు, అరబ్ ప్రపంచంలోని ఇస్లాం మతస్థుల మధ్యన సత్సంబంధాలు నెలకొల్పాలనే లక్ష్యంతోనే ఈ సమ్మేళనాన్ని నిర్వహించినప్పటికీ ప్రపంచంలోని పలు మతాలకు చెందిన ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. భారత ప్రతినిధిగా హాజరైన బ్రహ్మ విహారి స్వామి సమ్మేళనంలో మాట్లాడారు. ‘నేడు ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని సంస్కృతులు, అన్ని మతస్థుల ముందున్న ముఖ్యమైన అంశం ఒక్కటే. ఐక్యంగా కలిసి ముందుకు వెళితే కలిసి పురోభివృద్ధి సాధిస్తాం. విడిపోయి ముందుకు పోవాలనుకుంటే కుంటుపడిపోతాం’ అని! మారుతున్న దేశం గతంలో యూఏఈ కరడుగట్టిన ఇస్లాం దేశం. భారతదేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడిన దావూద్ ఇబ్రహీం తొలుత యూఏఈలోనే ఆశ్రయం పొందారు. అఫ్ఘానిస్థాన్లో తాలిబన్ ప్రభుత్వాన్ని 1996లో గుర్తించిన మూడవ దేశం యూఏఈ. పాకిస్థాన్, సౌదీ అరేబియా తర్వాత ఈ దేశం అక్కిడి ప్రభుత్వాన్ని గుర్తిస్తూ ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అప్ఘానిస్తాన్’ అని నామకరణం కూడా చేసింది. అలాంటి దేశంలో యువరాజు పట్టాభిషక్తుడైన నాటి నుంచి వివిధ మతాల మధ్య సామరస్యం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు.తమ దేశంలో నివసిస్తున్న వివిధ మతాల వారికి ఉదారంగా స్థలాలు కేటాయించారు. అందులో భాగంగానే ఈ హిందూ దేవాలయం కోసం 26 ఎకరాలు ఇచ్చారు. యూఏఈలో 26 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరికోసం దుబాయిలో ఇప్పటికే ఓ శివాలయం, కృష్ణుడి ఆలయం ఉన్నాయి. – వి.నరేందర్ రెడ్డి సాక్షి వెబ్ డెస్క్ -
అబుదాబిలో తొలి హిందూ ఆలయం
దుబాయ్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుదాబిలో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయానికి అంకురార్పణ జరిగింది. వేలాదిమంది భారతీయుల సమక్షంలో దేవాలయ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని నిర్మిస్తున్న బోచసన్వాసి శ్రీ అక్షర్–పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) అధిపతి మహాంత్ స్వామి మహారాజ్ గర్భగుడి నిర్మాణం కోసం పునాదిరాయి వేశారు. అబుదాబి–దుబాయ్ హైవేకు సమీపంలో 14 ఎకరాల్లో ఏడు అంతస్తులుగా ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఆర్ట్ గ్యాలరీ, గ్రంథాలయం, వ్యాయామశాల ఏర్పాటు చేయనున్నారు. -
మళ్లీ మెరిసిన ఫించ్.. ఆసీస్దే సిరీస్
అబుదాబి: పాకిస్తాన్తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ను ఇంకా రెండు వన్డేలు మిగిలి ఉండగానే ఆసీస్ కైవసం చేసుకుంది. పాకిస్తాన్పై హ్యాట్రిక్ విజయాలు సాధించి ఆసీస్ సిరీస్ గెలవడంలో కెప్టెన్ అరోన్ ఫించ్ కీలక పాత్ర పోషించాడు. తొలి రెండు వన్డేల్లో సెంచరీలు బాదిన ఫించ్.. మూడో వన్డేలో 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా డకౌట్గా పెవిలియన్ చేరినప్పటికీ ఫించ్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టును నడిపించాడు. అతనికి జతగా మ్యాక్స్వెల్(71), పీటర్ హ్యాండ్స్ కోంబ్(47)లు రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 44.4 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమిని చవిచూసింది. పాక్ ఆటగాళ్లలో ఇమాముల్ హక్(46),ఇమాద్ వసీమ్(43), ఉమర్ అక్మల్(36), షోయబ్ మాలిక్(32)లు మినహా ఎవరూ రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు సాధించగా, ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. బెహ్రాన్డార్ఫ్, నాథన్ లయన్, మ్యాక్స్వెల్లు తలో వికెట్ తీశారు. -
అబు ధాబిలో హిందూ ఆలయం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : ఇస్లాం దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబు ధాబి నగరంలో 26 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఓ హిందూ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం 2015లోనే యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ 16 ఎకరాల స్థలాన్ని ఉచితంగా కేటాయించగా, ఇటీవల యూఏఈ ప్రభుత్వం నిర్వహించిన సర్వమత సమ్మేళనం సందర్భంగా ఆలయంలో పార్కింగ్ ఇతర సౌకర్యాల కోసం మరో పది ఎకరాలు స్థలాన్ని విరాళంగా ప్రకటించారు. అబు ధాబి–దుబాయ్ ప్రధాన రోడ్డు పక్కన నిర్మించనున్న స్వామి నారాయణ్ ఆలయ నిర్మాణానికి ఏప్రిల్ 13వ తేదీన మహంత్ స్వామి మహరాజ్ భూమి పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వామి నారాయణ్ సంప్రదాయానికి చెందిన బ్రహ్మవిహారి స్వామి ఆలయ నిర్మాణ బాధ్యతలు చూస్తారు. అతిపెద్ద షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ మసీదుకు సమీపంలోనే ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2019 సంవత్సరాన్ని టాలరెన్స్ (సహనం) సంవత్సరంగా ప్రకటించడమే కాకుండా టాలరెన్స్ పేరిట ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మత సామరస్యం కోసం ఓ నిధిని కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచంలో సహనం శాఖను ఏర్పాటు చేసిన ఏకైక దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చరిత్రలోకి ఎక్కింది. ఈ శాఖ సమన్వయంతో ఇస్లాం మత పెద్దల మండలి ఈ నెల మూడు, నాలుగు తేదీల్లో క్రైస్తవ, ఇస్లాం సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించింది. దీనికి క్రైస్తవుల తరఫున పోప్ ఫ్రాన్సిస్ హాజరుకాగా, ఇస్లాం మతస్థుల తరఫున అల్ అజర్ ఇమామ్ అహ్మద్ అల్ తయ్యబ్ ముఖ్య అతిథిగా హాజరై ఓ సంయుక్త ప్రకటన చేశారు. ‘తూర్పు–పశ్చిమ ప్రాంతాలకు చెందిన క్యాథలిక్కులు, క్యాథలిక్ చర్చి, తూర్పు–పశ్చిమ ప్రాంతాలకు చెందిన ముస్లింలు, అల్ అజర్ అల్ షరీఫ్లు సంయుక్తంగా చేస్తున్న ప్రకటన ఏమిటంటే పరస్పర సహకారం, పరస్పర అవగాహనే ప్రవర్తన నియామావళిగా చర్చలే సరైన మార్గంగా కలసి ముందుకు సాగుతాం’ అన్న డిక్లరేషన్ను పోప్, ఇమామ్లు సంయుక్తంగా విడుదల చేశారు. పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవులు, అరబ్ ప్రపంచంలోని ఇస్లాం మతస్థుల మధ్యన సత్సంబంధాలు నెలకొల్పాలనే లక్ష్యంతోనే ఈ సమ్మేళనాన్ని నిర్వహించినప్పటికీ ప్రపంచంలోని పలు మతాలకు చెందిన ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. భారత ప్రతినిధిగా హాజరైన బ్రహ్మ విహారి స్వామి సమ్మేళనంలో మాట్లాడుతూ ‘నేడు ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని సంస్కతులు, అన్ని మతస్థుల ముందున్న ముఖ్యమైన అంశం ఒక్కటే. ఐక్యంగా కలిసి ముందుకు వెళితే కలిసి పురోభివృద్ధి సాధిస్తాం. విడిపోయి ముందుకు పోవాలనుకుంటే సర్వనాశనం అవుతాం’ అని చెప్పారు. ఒకప్పుడు కరడుగట్టిన దేశమే! గతంలో యూఏఈ కరడుగట్టిన ఇస్లాం దేశం. భారత దేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడిన దావూద్ ఇబ్రహీం తొలుత యూఏఈలోనే ఆశ్రయం పొందారు. అఫ్ఘానిస్థాన్లో తాలిబన్ ప్రభుత్వాన్ని 1996లో గుర్తించిన మూడవ దేశం యూఏఈ. పాకిస్థాన్, సౌదీ అరేబియా తర్వాత ఈ దేశం అక్కిడి ప్రభుత్వాన్ని గుర్తిస్తూ ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అప్ఘానిస్తాన్’ అని నామకరణం కూడా చేసింది. అలాంటి దేశంలో యువరాజు పట్టాభిషక్తుడైన నాటి నుంచి వివిధ మతాల మధ్య సామరస్యం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. తమ దేశంలో నివసిస్తున్న వివిధ మతాల వారికి ఉదారంగా స్థలాలు కేటాయించారు. అందులో భాగంగా హిందూ దేవాలయం కోసం 26 ఎకరాలు ఇచ్చారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ ప్రస్తుతం జబ్బు పడడంతో ప్రభుత్వ పాలనా వ్యవహారాలను కూడా యువరాజే చూసుకుంటున్నారు. కేవలం 12 శాతం దేశస్థులు, 88 శాతం ప్రపంచ వలసకార్మికులను కలిగిన దేశంలో ఇలాంటి సంస్కరణలు తప్పవనే వారూ ఉన్నారు. యూఏఈలో 26 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరికోసం దుబాయిలో ఓ శివాలయం, కృష్ణుడి ఆలయం ఉండగా, అబుదాబిలో నిర్మించబోయే ఆలయమే మొదటిది. -
దుబాయ్లో పర్యటించిన తొలి పోప్
అబుదాబీ: చరిత్రాత్మక పర్యటన కోసం దుబాయ్లో అడుగుపెట్టిన క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్కు ఘన స్వాగతం లభించింది. ఆదివారం రాత్రి దుబాయ్ చేరుకున్న పోప్కు మిలటరీ పరేడ్తో అధికారులు ఆహ్వానం పలికారు. దీంతో దుబాయ్లో పర్యటించిన తొలి పోప్గా పోప్ ఫ్రాన్సిస్కు చరిత్రకెక్కారు. పోప్ బసచేసిన అబుదాబీ అధ్యక్ష భవనం వద్ద అధికారులు గౌరవ సూచకంగా గాలులోకి కాల్పులు జరిపారు. దుబాయ్లో జరగనున్న ఇంటర్ఫెయిత్ కాన్ఫరెన్స్కు హాజరుకావాలన్న అబుదాబీ యువరాజు షేక్ మహ్మద్ బిన్ జయేద్ ఆహ్వానం మేరకు పోప్ యూఏఈలో పర్యటిస్తున్నారు. ‘సోదరుడిగా.. యూఏఈతో కలసి పనిచేసేందుకు, శాంతి మార్గంలో పయనించేందుకు ఇక్కడకు వచ్చాను’ అని ఈ సందర్భంగా పోప్ అన్నారు. దీనిలో భాగంగా పోప్తో సోమవారం జరిగిన భేటీపై యూఏఈ ప్రిన్స్ స్పందిస్తూ.. ‘పోప్ను కలవడం చాలా సంతోషాన్ని కలిగించింది. సమావేశంలో భాగంగా పరస్పర సహకార మెరుగుదల, సహనశీలత, ప్రజలు, సమాజం కోసం శాంతి, స్థిరత్వం, అభివృద్ధి సాధించడానికి చేయాల్సిన ముఖ్యమైన విషయాలపై చర్చించాం’అని ప్రిన్స్ ట్వీట్ చేశారు. 1219లో ఈజిప్ట్ మాలెక్ అల్ కమేల్, స్టెయింట్ ఫ్రాన్సిస్ అస్సిసి మధ్య సమావేశాన్ని పోప్ గుర్తు చేసుకున్నారు. -
ప్రియున్ని చంపి.. కూర వండేసింది..!
అబుదాబి : యూఏఈకి చెందిన ఓ మహిళ తన ప్రియున్ని చంపడమే కాక అతని మాంసంతో ఓ మొరాకో వంటకాన్ని తయారు చేసింది. అనంతరం అక్కడ పని చేస్తోన్న భవన నిర్మాణ కార్మికులకు ప్రియుడి మాంసంతో వండిన వంటని వడ్డించింది. అబుదాబికి చెందిన ఓ వార్తాసంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన ప్రియుడితో ఏడేళ్లుగా సహజీవనం చేస్తోంది. కానీ సదరు వ్యక్తి ఆమెను కాదని మరొకరితో పెళ్లికి సిద్ధపడ్డాడు. దాంతో తనను తిరస్కరించిన వ్యక్తిమీద పగ తీర్చుకోవాలని భావించిన మహిళ అతన్ని హత్య చేసింది. అంతటితో ఆగకుండా అతని శరీరంలో కొన్ని భాగాలను ముక్కలు చేసి వండింది. మిగిలిన మృత దేహాన్ని కుక్కలకు వేసినట్లు స్వయంగా సదరు మహిళే కోర్టు విచారణలో తెలిపిందని ‘ఖలీజ్ టైమ్స్’ పేర్కొంది. నెల రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. తన సోదరుడు కనిపించడం లేదని మృతుడి తమ్ముడు.. సదరు మహిళ ఇంటి వద్ద తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. తొలుత మహిళను ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని చెప్పింది. అయితే ఆమె ఇంట్లో ఓ మనిషి దంతాలు కనిపించడంతో అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితురాలి ఇంట్లో దొరికిన దంతాలను డీఎన్ఏ పరీక్ష కోసం పంపగా అవి మృతుడివేనని తేలడంతో ఈ హత్యోదంతం వెలుగు చూసింది. -
అబుదాబిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
అబుదాబి : అబుదాబిలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ పాటలు, పిల్లల కోలాటం, డప్పుల చప్పుళ్లతో అబుదాబి ఇండియా సోషల్ సెంటర్ శుక్రవారం భక్తి భావంతో పులకించిపోయింది. తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ ఆటా పాటలతో హోరెత్తించారు. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ప్రజలంతా ఒక్కచోట బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అబుదాబి తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో ప్రముఖ కళాకారులు కోకిల నాగరాజు, గాయని వరంలు తమ ఆటా, పాటలతో ఉర్రూతలూగించారు. ఉత్తమ బతుకమ్మలు పదింటికి ఈ సందర్భంగా బహుమతులతో సత్కరించారు. చక్కటి నృత్య ప్రదర్శనలతో మహిళలు, పిల్లలు ఆకట్టుకున్నారు. దుబాయి, అబుదాబి వివిధ క్యాంప్ల నుండి అధిక సంఖ్యలో తెలంగాణ, తెలుగు వారు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శన చేసిన దంపతులకు, పిల్లలకు, మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు రాజశ్రీనివాస రావు, పృథ్వీరాజ్, గోపాల్, వంశీ, గంగన్న, రాజశేఖర్, మహిళ కమిటీ సభ్యులు పావని, సౌజన్య, లక్ష్మీ, రోజా, అర్చన, పద్మజలు పాల్గొని విజయవంతం చేశారు. -
కారం సరిపోయిందా?
షూటింగ్ లేని సమయాల్లో వేరే పనులేవీ లేకుండా ఖాళీగా ఉంటే స్టార్స్ ఫన్నీగా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంటారు. కొందరు గొంతు సవరించుకుని పాట పాడతారు. శ్రుతీహాసన్, సోనాక్షి సిన్హా లాంటి వారు పెయింటింగ్తో బిజీ అయిపోతారు. ఇంకొందరు పుస్తకంలో తలదూర్చుతారు. మరికొందరు గరిటె పడతారు. సల్మాన్ ఖాన్ మల్టీ టాలెండెడ్. పాడతారు. అలాగే పెయింటింగ్, వంట కూడా చేస్తారు. నిన్న (ఆదివారం) సల్మాన్కి బాగా తీరిక చిక్కినట్లుంది. వంట చేసే పనిలో పడ్డారు. సల్మాన్ ఖాన్ వంట చేస్తున్నది ఇక్కడ కాదు.. అబుదాబిలో. ‘భారత్’ సినిమా కోసం అక్కడికి వెళ్లారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. కత్రినా కైఫ్ కథానాయిక. ఇక్కడున్న ఫొటో చూస్తుంటే.. కర్రీలో కారం సరిపోయిందా? అని సల్మాన్ ఆలోచిస్తున్నట్లు ఉంది కదూ. -
ఘనీని విచారించిన ఎన్ఐఏ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్కు అనుబంధంగా ఏర్పడిన అబుధాబి మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా అనుమానితుల విచారణ నాలుగో రోజైన శుక్రవారమూ కొనసాగింది. బేగంపేటలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయంలో ఢిల్లీ నుంచి వచ్చిన డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం అబ్దుల్లా బాసిత్ సహా ఎనిమిది మందితో పాటు కొత్తగా ఘనీ అనే యువకుడికి నోటీసులిచ్చి పిలిచి ప్రశ్నించింది. ఫలక్నుమా ప్రాంతానికి చెందిన ఘనీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఉంటూనే ఆన్లైన్ ద్వారా ఐసిస్కు ఆకర్షితుడయ్యాడు. అంతేకాకుండా నగరానికి చెందిన వారినీ ఆకర్షించి సిరియా వెళ్లేలా ప్రోత్సహించాడు. ఈ విషయం గుర్తించిన రాష్ట్ర పోలీసులు అతడిని డిపోర్ట్ (బలవంతంగా తిప్పి పంపడం) చేయాలని సౌదీ ప్రభుత్వాన్ని కోరారు. అలా అక్కడి ప్రభుత్వం 2016లో ఘనీని డిపోర్ట్ చేసింది. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన అతడిని అదుపులోకి తీసుకున్న రాష్ట్ర పోలీసు వర్గాలు కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టాయి. ఆపై కొన్నాళ్లు ఊరుకున్నా ఘనీ మళ్లీ ఐసిస్కు సానుభూతిపరుడిగా మారినట్లు ఎన్ఐఏ గుర్తించింది. దీంతో శుక్రవారం అతడిని పిలిపించి వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఘనీతో పాటు ఆ ఎనిమిది మందినీ ప్రశ్నిస్తున్న ప్రత్యేక బృందం వీరు చెప్తున్న అంశాలను సరిచూస్తోంది. ఫర్హతుల్లాకు సమీప బంధువు... ఘనీ నగరానికి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీకి సమీప బంధువు. నగరంలోని మాదన్నపేట సమీప కుర్మగూడకు చెందిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్ 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్ (జేఈఎం)కు సానుభూతిపరుడిగా ఉండి 2002లో గుజరాత్లోని అక్షర్ధామ్పై జరిగిన దాడి, 2004లో జరిగిన బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర తదితర కేసుల్లో నిందితుడిగా మారాడు. 2005లో నగర కమిషనర్స్ టాస్క్ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసులోనూ నిందితుడు. ఇతడిపై రెండు కేసులే ఉన్నప్పటికీ... నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలకు తెరవెనుక సాయం చేయడంతో కీలక వ్యక్తిగా మారాడని నిఘా వర్గాలు గుర్తించాయి. జేఈఎం నుంచి లష్కరేతోయిబా (ఎల్ఈటీ) వైపు మళ్లిన అతను దేశీయ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు అమీర్ రజా ఖాన్కు సన్నిహితుడిగా ఉన్నాడని నిఘా వర్గాలు చెప్తున్నాయి. -
‘అబుదాబి మాడ్యుల్’పై రెండో రోజూ విచారణ
సాక్షి, హైదరాబాద్: ఐసీస్ అనుబంధ సంస్థ అబుదాబి మాడ్యుల్ అనుమానితుల విచారణ రెండో రోజైన బుధవారమూ కొనసాగింది. బేగంపేటలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐ ఏ) కార్యాలయంలో ఢిల్లీ నుంచి వచ్చిన డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం అను మానితుల్ని ప్రశ్నిస్తోంది. అబ్దుల్లా బాసిత్, ఖదీర్ సహా మొత్తం 8 మందిని వరుసగా రెండో రోజూ విచారించారు. ఒక్కొక్కరిని దాదాపు 6 గంటల పాటు పలు కోణాల్లో ప్రశ్నించారు. వీరి వాంగ్మూలాల్లో 4 కొత్త పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీం తో వారిని ఎన్ఐఏ కార్యాలయానికి పిలిపించిన పోలీసులు కొన్ని అంశాల గురించి ప్రశ్నించారు. రాత్రి 7కి అందరినీ ఇళ్లకు పంపిన అధికారులు మళ్లీ గురువారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. ఈ విచారణ ప్రక్రియ మరికొన్ని రోజులు సాగే అవకాశం ఉంది. -
స్వదేశానికి వస్తుండగా.. కోట్లు వచ్చిపడ్డాయ్!
అబుదబీ : అదృష్టం అంటే అతడిదే. పొట్టకూటి కోసం వెళ్లిన పరాయి దేశాన్ని శాశ్వతం వదిలి స్వదేశానికి వచ్చేస్తున్న వేళ లాటరీ రూపంలో అదృష్టం వీడ్కోలు పలికింది. ఏకంగా రూ.13.5 కోట్లు వచ్చి ఒళ్లో పడ్డాయి! ఈ లక్కీమేన్ కేరళ వాసి టోజో మాథ్యూ(30). అబుదబీలో సివిల్ సూపర్వైజర్గా పనిచేసిన ఆయన దుబాయిని వదిలి స్వదేశానికి వచ్చేస్తుండగా అదృష్ట దేవత కరుణించింది. అబుదబీ విమానాశ్రయంలో ఆయన కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెలవారీ బిగ్ టికెట్ రాఫెల్ డ్రాలో దాదాపు రూ. 13.1 కోట్లు(7 మిలియన్ల దిర్హమ్లు) గెల్చుకున్నట్టు‘ ఖలీజ్ టైమ్స్’ వెల్లడించింది. ‘భారత్కు పయనమవుతూ జూన్ 24న అబుదబీ విమానాశ్రయంలో టికెట్ కొన్నాను. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న నా భార్యతో కలిసుండాలన్న ఉద్దేశంతో దుబాయ్ను వదిలిపెట్టాలనుకున్నా. లాటరీలో భారీ మొత్తంలో డబ్బు వచ్చిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కేరళలో సొంత ఇల్లు కట్టుకోవాలన్నది నా చిరకాల స్వప్నం. ఈ లాటరీతో నా కల తీరనుంద’ని టోజో మాథ్యూ సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం తీసిన డ్రాలో ఆయనతో మరో 9 మంది లాటరీ గెలుచుకున్నారు. విజేతల్లో ఐదుగురు భారతీయులు ఉండటం విశేషం. -
అబుదాబి రాయల్ ఫ్యామిలీతో ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సాహో చిత్రీకరణ ప్రస్తుతం అబుదాబిలో జరుగుతోంది. 50 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, చేజ్ సీన్లు చిత్రీకరించనున్నారు. దాదాపు 200 మంది యూనిట్ సభ్యులు ఈ షూటింగ్ కోసం అబుదాబి చేరుకున్నారు. ప్రస్తుతం అబుదాబిలో ఉన్న ప్రభాస్ అక్కడి రాజకుటుంబీకులతో సమావేశమయ్యారు. రాయల్ ఫ్యామిలీకి చెందిన మహిళతో ప్రభాస్ సమావేశానికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్తో పాటు ఆయన సోదరుడు, యూవీ క్రియేషన్స్ నిర్మాత ప్రమోద్ కూడా రాయల్ ఫ్యామిలీని కలిసిన వారిలో ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2019లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
దుబాయ్లో భారతీయుడికి రూ.21కోట్ల లాటరీ
దుబాయ్: భారత్కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్లో జాక్ పాట్ కొట్టాడు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో మంగళ వారం జరిగిన బిగ్ టికెట్ లాటరీలో ఏకంగా రూ.21.2 కోట్లు(12 మిలియన్ల దిర్హామ్లు) గెలుచుకున్నాడు. కేర ళకు చెందిన జాన్ వర్గీస్ ఇక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. లాటరీ గెలిచినట్లు ఫోన్ కాల్ వచ్చిందని, ఎవరైనా తనని ఏప్రిల్ ఫూల్ చేయడానికి కాల్చేసి ఉంటారని భావించా నని జాన్ చెప్పారు. డబ్బుతో తొలుత స్మార్ట్ఫోన్ కొనుక్కుంటానని తెలిపాడు. తర్వాత కొంత భాగాన్ని తన ఇద్దరు పిల్లల చదువుకు, మిగతా మొత్తాన్ని పేదవారికి కేటాయిస్తానని చెప్పాడు. -
లక్కీ డ్రాలో.. భారతీయులకు జాక్పాట్
దుబాయి: అబుదాబి ‘బిగ్ టికెట్ లక్కీ డ్రా’లో భారతీయులకు జాక్పాట్ తగిలింది. ఈ లక్కీ డ్రా వరించిన 8 మంది విజేతల్లో ఏడుగురు భారతీయులు భారీ మొత్తం గెల్చుకున్నారు. సోమవారం అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన లక్కీ డ్రాలో భారతీయుల పంట పండింది. కేరళకు చెందిన థాన్సిలాస్ బాబు మాథ్యూస్ 7 మిలియన్ల దినార్లు (దాదాపు 12.5 కోట్లు) గెలుచుకున్నాడు. ఈ లాటరీ తగటడం నమ్మలేకపోతున్నానని థాన్సిలాస్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గత నెలలో రాఫెల్ బొనాంజా బిగ్ లక్కీ మిలియనీర్ లాటరీ టికెట్ నెంబర్ 030202 కొనుగోలు చేయగా, డ్రాలో పెద్ద మొత్తమైన 12.5 కోట్లు గెలుచుకున్నాడు. ఇదే డ్రాలో మరో ఆరుగురు భారతీయులు ఒక్కొక్కరు దాదాపు 18 లక్షలు గెలుపొందారు. బిగ్ టికెట్ లక్కీ డ్రా విజేతల్లో ఏడుగురు భారతీయులు కాగా, బెహ్రెయిన్ కు చెందిన మరో వ్యక్తి ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చేతులకు రావడంతో విజేతలు అమితాశ్చర్యానికి గురయ్యారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బిగ్ టికెట్ లక్కీ డ్రా విజేతలు వీరే.. -
‘అజ్ఞాతవాసి పరిహాసమేమో అనుకున్నా..!’
దుబాయ్ : అదృష్టదేవత ఎప్పుడు ఎవరికి ఎందుకు వరమిస్తుందో తెలియదు! ఒకవేళ వరమిచ్చినా అది నిజమని నమ్మాలనిపించదు!! పరాయి దేశంలో దర్జాగా సెటిలైన ఓ భారతీయుయ కుటుంబం ఇప్పుడు సరిగ్గా ఇలాంటి స్థతిలోనే ఉంది. సరదాగా కొన్న లాటరీ టికెట్కు రూ.21కోట్ల జాక్పాట్ లభించింది. దుబాయ్ సహా ఇండియా అంతటా మారుమోగుతోన్న ఈ వార్త వివరాల్లోకి వెళితే.. అలెప్పి(కేరళ)కు చెందిన హరి కృషన్ దుబాయ్లో బిజినెస్ డెవలపర్గా సెటిలయ్యారు. అతనికి భార్యా,కొడుకు ఉన్నారు. దుబాయ్ ఎయిర్పోర్టులో ఒకటిరెండుసార్లు లాటరీ టికెట్లు కొన్నా బహుమతి తగల్లేదు. హరికి అదేమంత పెద్ద విషయంకాదు. ఇటీవల 500 దిరామ్స్పెట్టి ఇంకో లాటరీ టికెట్ కొని ఆ సంగతి మర్చిపోయారు. రెండు రోజుల కిందటే లాటరీ ఫలితాలు వచ్చాయి. హరి కొన్న టికెట్ నంబర్కే రూ.12లక్షల దిరామ్స్(సుమారు రూ.21కోట్లు) జాక్పాట్ తగిలింది. ‘‘రూ.21కోట్ల బంపరాఫర్ కొట్టేశారని ఫోన్ వచ్చింది.. ఎవరో అజ్ఞాతవాసి పరిహాసం చేస్తున్నాడేమో అనుకున్నా. అలా నాలుగైదు కాల్స్ తర్వాత ఓ మీడియా మితృడి నుంచి ఫోనొచ్చింది, అటుపై ఓ రేడియో స్టేసన్ నుంచి!! వెంటనే నా భార్యకు చెప్పాను.. లాటరీ కంపెనీ వెబ్సైట్ చూడమని. చివరికి ఆమె కన్ఫార్మ్ చేస్తేగానీ నమ్మలేదు. ఇంతటి అదృష్టం ఇంకా కలగానే అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చాడు హరి. ఈ సొమ్మును తన భవిష్యత్ అవసరాల కోసం అట్టిపెట్టుకుంటానని ఆయన తెలిపారు. -
ఒక్కరోజు పైలట్!
పైలట్ అవ్వడమే ఆ చిన్నారి లక్ష్యం. అందుకే.. వయసు ఆరేళ్లే అయినా.. ఓ పైలట్కు ఉండాల్సిన స్కిల్స్ అన్నీ ఆ చిన్నారి సొంతం. ఆ చిన్నారి పేరు ఆడమ్. చిన్నప్పటి నుంచి విమానాలు నడపాలనే ఆసక్తితో యూట్యూబ్లో పైలట్ శిక్షణకు సంబంధించిన వీడియోలన్నీ చూసేశాడు. అబుదాబీకి చెందిన ఆడమ్కు విమానాలకు సంబంధించిన నాలెడ్జ్ను చూసి ఆశ్చర్యపోయిన ఎతిహాద్ ఎయిర్వేస్ సిబ్బంది ఆడమ్కు ఒక్కరోజు పైలట్గా ఉండే అవకాశాన్ని కల్పించారు. దీంతో తన డ్రీమ్ను ఆరేళ్ల వయసులోనే తీర్చేసుకున్నాడు ఆడమ్. ఆడమ్ను ఎతిహాద్ ఎయిర్వేస్ ట్రెయినింగ్ సెంటర్కు పిలిచి.. పైలట్ యూనిఫాం వేసి, ఎయిర్బస్ ఏ380కు ఒక్కరోజు కోపైలట్గా అవకాశం ఇచ్చారు. ఇక... ఆడమ్కు ఉన్న నాలెడ్జ్ చూసి ఆశ్చర్యపోయిన కెప్టెన్ సమెరె యాక్లెఫ్ ఆడమ్ విమానం నడిపిస్తుండగా వీడియో తీసి.. ఎయిర్వేస్ అధికారుల పర్మిషన్తో ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అంతే.. ఆ వీడియోను ఇప్పటి వరకు 2 కోట్ల మందికిపైగా వీక్షించారు. అంతే కాదు.. ఆ చిన్నారి కచ్చితంగా భవిష్యత్తులో పైలట్ అవుతాడని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ఏ380 ఎయిర్బస్కు కెప్టెన్ అవ్వడమే ఆడమ్ ఆశయమట. తప్పకుండా ఆడమ్ కోరుకున్న ఎయిర్బస్కు కెప్టెన్ అవ్వాలని మనమూ కోరుకుందాం. -
భారతీయులకు జాక్పాట్..
దుబాయ్: అబుదాబి ‘బిగ్ టికెట్ లక్కీ డ్రా’లో భారతీయులకు జాక్పాట్ తగిలింది. ఈ లక్కీ డ్రా వరించిన 10 మంది విజేతలల్లో 8 మంది భారతీయులు భారీ మొత్తం గెల్చుకున్నారు. ఒక్కొక్కరు రూ. కోటి 70 లక్షల (2.7లక్షల డాలర్లు) ప్రైజ్మనీ దక్కించుకున్నారు. విజేతల్లో ఒక కెనడియన్, పిలిప్పీన్ దేశస్థులు మినహా మిగతా వారంతా భారతీయులే కాగా ఓ మహిళా కూడా ఉంది. యూఏఈ రాజధానిలో ప్రతినెలా లగ్జరీ కార్ల, ప్రైజ్మనీ లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఇటీవల అబుదాబి అంతర్జాతీయ విమాన కేంద్రంలో నిర్వహించిన లక్కీ డ్రాలో భారతీయుల పంట పండింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చేతులకు రావడంతో విజేతలు అమితాశ్చర్యానికి గురయ్యారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ‘ప్రస్తుతానికి నాకు ఎలాంటి ప్రణాళికలు లేవు. చాలా ఎగ్జైట్గా ఉంది. డబ్బులు ఎలా ఖర్చు చేయాలో ఆలోచిస్తున్నా’ అని చంద్రేశ్ మోతివారస్ అనే విజేత తెలిపారు. తనకు తొలిసారి కాల్ వచ్చినప్పుడు నమ్మలేదని, ఆటపట్టించడానికే స్నేహితులు ఎవరో ఇలా చేస్తారనుకున్నానని, రెండోసారి నిర్వహకులు ఫోన్ చేసినపుడు షాక్ గురయ్యానని అభయ కుమార్ క్రిష్ణన్ అనే మరో విజేత పేర్కొన్నారు. ‘ఈ డబ్బును నేను నా స్నేహితునితో పంచుకుంటా. మేమిద్దరం కలిసే ఈ టికెట్ కొన్నాం. కొంత డబ్బు కేరళలోని చారిటీలకు ఇచ్చేస్తామ’ని మరో విజేత చెప్పుకొచ్చారు. గత పది ఏళ్ల నుంచి టికెట్లు కొంటున్నా. కానీ ఈ లక్కీ డ్రా తీసే రోజు మాత్రం తనకు గుర్తులేదని ఇంకొక విజేత తెలిపారు. -
అబుదాబీలో బతుకమ్మ సంబరాలు
అబుదాబీ: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు అబుదాబీలో తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమరేట్స్లో ఉంటున్న తెలంగాణ వాసులందరూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అబుదాబీ నగరంలోని ఇండియా సోషల్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు సుమారు పదిహేను వందల మంది తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఫిదా మూవీ ఫేమ్ టి శరణ్య వేడుకలను మరింత తారస్థాయికి చేర్చింది. డప్పులతో అబుదాబి తెలుగింటి ఆడబిడ్డలు బతుకమ్మలతో ప్రాంగణానికి చేరగా, ప్రార్థన గీతంతో కార్యక్రమం మెదలైంది. చిన్నారుల ఆట, పాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆడపడుచుల బతుకమ్మ ఆట, పాటలతో ఐఎస్సీ ఆడిటోరియం మరో తెలంగాణను తలపించింది. బతుకమ్మ సాంప్రదాయకంగా నిమజ్జనం చేస్తూ ప్రసాదాలు పంచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అందమైన బతుకమ్మలకు, సాంప్రదాయకంగా తయారైన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి నిర్వాహకులు రాజ శ్రీనివాస్, వంశీ, పృథ్వీ, సదానంద్, గంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పావని, రోజా, అర్చన, పద్మజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
భారీకాయురాలు.. ఎమ్మాన్ మృతి
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత భారీకాయంతో రికార్డులకు ఎక్కిన ఎమ్మాన్ అహ్మద్ అబూదాబిలోని బుర్జీల్ ఆసుపత్రిలో సోమవారం ఉదయం మృతి చెందారు. తన 37వ బర్త్డే వేడుకలను పూర్తి చేసుకున్న వారానికే ఆమె కన్నుమూశారు. ఎమ్మాన్ మృతిని బుర్జీల్ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. కిడ్నీలు పనిచేయకపోవడం, గుండె సంబంధిత వ్యాధులతో ఆమె బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన 20 మంది నిపుణులైన వైద్యులు ఆమెను నిత్యం పర్యవేక్షించారని బుర్జీల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈజిఫ్టుకు చెందిన ఎమ్మాన్ అహ్మద్ అరుదైన వ్యాధివల్ల శరీరం భారీగా పెరిగిపోయింది. మొదట చికిత్స కోసం ఎమ్మార్ ముంబైలోని సైఫీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో గోడలను బద్దలు కొట్టాల్సి వచ్చింది. అంతేకాక ప్రత్యేక విమానంలో ఆమెను ముంబై తరలించారు. ఆమెను క్రేన్ల సాయంతో సైఫీ ఆసుపత్రి లోని ప్రత్యేక గదికి తరలించారు. కొంతకాలం ముంబైలోని చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆమెను అబుదాబిలోని బుర్జీల్ ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా బుర్జీల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఎమ్మాన్ అక్కడే మృతి చెందారు. -
ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు
కొచ్చి: ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కోచి విమానాశ్రయంలో అబుదాబి-కోచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఒక పక్కకు ఒరిగిపోయింది. మంగళవారం తెల్లవారుజామున 2.39 గంటలకు చేరుకున్న విమానం అకస్మాత్తుగా ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 102 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కొచ్చి విమానాశ్రాయానికి చేరుకున్న బోయింగ్ 737-800 విమానం ఎయిర్ పోర్టులోని టాక్సీవేనుంచి పార్కింగ్ వే వైపు దూసుకుపోయింది. దీంతో ముంగు బాగం బాగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని కోచిన్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్(సీఐఏఎల్) అధికార ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ప్రమాదంపై అంతర్గత విచారణ, అలాగే డిఐజిసి ఏవియేషన్ రెగ్యులేటర్ దర్యాప్తును ప్రారంభించామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి అందుబాటులో లేరు. -
‘నన్ను పట్టుకున్నావ్గా.. అభినందనలు’
శ్రీనగర్: ‘నేను ఎప్పుడైతే మా అమ్మానాన్నలను విడిచిపెట్టి వచ్చానో అప్పుటి నుంచే వారు చనిపోయినట్లు భావిస్తున్నాను. నాకు ఎవరూ లేరు.. ఎలాంటి సెంటిమెంట్లు లేవు. కొన్నిసార్లు నేను ముందడుగు వేశాను. కొన్నిసార్లు మీరు ముందడుగేశారు. ఈ రోజు నన్ను పట్టుకున్నారు. అందుకు మీకు అభినందనలు’ అంటూ కశ్మీర్లో మంగళవారం బలగాల చేతుల్లో హతమైన లష్కరే తోయిబా ఉగ్రవాది అబు దుజానా అన్నాడు. బలగాలు చుట్టుముట్టి అతడిని లొంగిపోవాలని సూచిస్తూ అతడికి ఫోన్ చేయగా చివరిసారిగా దాదాపు తొమ్మిదినిమిషాలు మాట్లాడిన అతడు లొంగిపోయేందుకు నిరాకరించాడు. పాకిస్థాన్కు చెందిన దుజాన ఓ గ్రామంలోని తనకు ఉన్న మిత్రురాళ్లలో ఒకరిని కలిసేందుకు వచ్చినప్పుడు బలగాలు చుట్టుమట్టారు. ఆ సమయంలో అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అతడికి ఫోన్ చేయించారు. అయితే, తొలిమాటగా ఎలా ఉన్నారు? అంటై పలకరించి ఆశ్చర్యపరిచిన దుజానా లొంగిపోయేందుకు నిరాకరించాడు. ‘నేను ఎలా ఉన్నాననే విషయం మర్చిపో.. నువ్వెందుకు సరెండర్ కావడం లేదు? ఇప్పుడెంత చెత్తగా ఉందో నీకు తెలుసా? ఇదంతా ఓ ఆట. మీ అమ్మనాన్నల గురించి ఓసారి ఆలోచించు. నీకు సహాయం చేస్తాను.. లొంగిపో.. నువ్వు బయటకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పకుంటే అనవసరం రక్తపాతం జరుగుతుంది. ఇష్టమొచ్చినట్లుగా మీరు చేసే పనులకు కశ్మీరు ప్రజలు ప్రాణాలుకోల్పోవాల్సి వస్తుంది’ అని ఆఫీసర్ అనగా.. నేను ఈ రక్తపాతాన్ని సృష్టించలేదు.. దీనంతటికి ఎవరు కారణమో నాకు తెలుసు’ అని అతడు అన్నాడు. అయితే, ఇది జిహాద్ కాదు.. అని బదులివ్వగా ‘అది కాక ఏంటి ఇది’ అంటూ అతడు ఫోన్ కట్ చేశాడు. ఈ క్రమంలోలోనే బలగాలు జరిపిన కాల్పుల్లో మృత్యువాతపడ్డారు. -
లష్కరే టాప్ కమాండర్ హతం
► ఎన్కౌంటర్లో దుజానాతోపాటు మరో ఉగ్రవాది దార్ మృతి ► ఇంట్లో నక్కిన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భద్రతాబలగాలు ► కశ్మీర్ లోయలో అప్రమత్తత ► ఇంటర్నెట్ సేవలు బంద్ శ్రీనగర్: ఉగ్రపోరులో భారత భద్రతాదళాలు కీలక ముందడుగు వేశాయి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబు దుజానాను పక్కా ప్రణాళికతో మట్టుబెట్టాయి. ఉగ్ర సంస్థల కీలక నేతలను నిర్మూలించే ఆపరేషన్లో మరో విజయం సాధించాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ పక్కా సమాచారం, సమర్థ ప్రణాళికతో సాగిన ‘ఆపరేషన్ దుజానా’ను విజయవంతంగా, తమవైపు నుంచి ఎలాంటి నష్టం లేకుండా ముగించగలిగాయి. జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ జాతీయుడైన దుజానాను, అతని స్థానిక అనుచరుడు అరిఫ్ నబీ దార్ భద్రతా బలగాలు హతమార్చాయి. ఒక ఇంట్లో దుజానా, దార్లు దాక్కొన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు సోమవారం అర్ధ రాత్రి నుంచి పుల్వామాలో హక్రిపోరా ప్రాంతాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. చివరకు మంగళవారం తెల్లవారుజామున భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల్లో దుజానా, దార్లు హతమయ్యారని, వారి మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు. గతేడాది హిజ్బుల్ టాప్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం తలెత్తిన హింస నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. కశ్మీర్లో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. చాలాచోట్ల బ్రాడ్బాండ్ సేవల్ని నిలిపేశారు. కశ్మీర్ లోయలో బడులు, కళాశాలలు, వర్సిటీల్ని మూసివేశారు. పక్కాగా.. ఆపరేషన్ దుజానా: సోమవారం అర్ధ రాత్రి.. పుల్వామాలోని హక్రిపోరాలోని ఒక ఇంట్లో లష్కరే కశ్మీర్ చీఫ్ అబు దుజానా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. హుటాహుటిన స్పెషల్ ఆపరేషన్స్ (ఎస్ఓజీ) బృందాల్ని పుల్వామాకు 13 కి.మీ. దూరంలో ఉన్న హక్రిపురాకు తరలించారు. డీఐజీ స్వయం ప్రకాశ్ పాణి సంఘటన ప్రాంతానికి చేరుకుని ‘ఆపరేషన్ దుజానా’ను పర్యవేక్షించారు. ఎస్ఓజీతో పాటు పుల్వామా జిల్లా పోలీసులు, ఆర్మీకి చెందిన విక్టర్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ బెటాలియన్లు ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇంతలో స్థానికులు భద్రతా బలగాల్ని ప్రతిఘటిస్తూ వాళ్లపై రాళ్లదాడికి పాల్పడ్డారు. మరోవైపు దుజానా, దార్లను మట్టుబెట్టేందుకు వారు ఉన్న ఇంట్లోని ప్రజల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ మొదలుపెట్టాయి. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో దుజానా, భట్ మరణించారు. ఉగ్రవాదులు మరణించారని తెలియగానే.. జనాల్లోంచి కొందరు మిలిటెంట్లు పోలీసులపైకి కాల్పులు ప్రారంభించారని పోలీసులు తెలిపారు. వంద మందికిపైగా ఆందోళనకారులు భద్రతా బలగాలపైకి రాళ్లు రువ్వడంతో.. వారిపైకి టియర్ గ్యాస్ షెల్స్, పెల్లెట్లు ప్రయోగించడంతో పాటు.. రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు మరణించాడు. నియామకాల్లో కీలకం.. దాడుల్లో చురుగ్గా! అబు దుజానా(26) దక్షిణ కశ్మీర్లో లష్కరే తోయిబా చీఫ్ కమాండర్.. లష్కరేలో ఏ+++ హోదా ఉగ్రవాది. అతను పాకిస్తానీ అన్న విషయం తప్ప మిగతా వివరాలు తెలియదు. పుల్వామా గ్రామీణ ప్రాంతాల నుంచే ఉగ్రవాద కార్యకలాపాల్ని కొనసాగించే దుజానా తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. 2013లో అబు ఖాసీం మరణించాక.. దుజానాను లష్కరే టాప్ కమాండర్గా నియమించారు. ఆరేళ్ల క్రితం కశ్మీర్లోకి ప్రవేశించిన దుజానా మొదట్లో ఉత్తర కశ్మీర్లో చురుగ్గా పనిచేశాడు. లష్కరే నాయకత్వంతో విభేదాలతో జకీర్ ముసా గ్రూపులో చేరినట్లు వార్తలు వినిపించాయి. దాదాపు 12 సార్లు పోలీసుల వల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. దక్షిణ కశ్మీర్లో భద్రతా బలగాలు, రాజకీయ కార్యకర్తలపై అనేక దాడుల్లో చురుగ్గా వ్యవహరించాడు. స్థానిక యువతను లష్కరే తోయిబాలో చేర్పించడంలో అతను చురుగ్గా వ్యవహరించేవాడని, రెయాజ్ అహ్మద్, అరిఫ్ నబీ దార్, అయూబ్ లోన్ల్ని లష్కరేలో చేర్పించింది అతనే. ఇక పుల్వామా జిల్లాకు చెందిన ఉగ్రవాది దార్.. అరిహల్, రత్నిపోరా, నెహమాల్లో జమ్మూ కశ్మీర్ బ్యాంక్ బ్రాంచ్లు, ఎల్లాక్వాయ్ దేహతి బ్యాంక్ దోపిడీల్లో చురుగ్గా వ్యవహరించాడు. భార్యను చూసేందుకొచ్చి: భార్యను, గర్ల్ఫ్రెండ్ను చూసేందుకు ఒక గ్రామానికి తరచూ రావ డమే దుజానాను పట్టిచ్చింది. మూడు నెల ల వ్యవధిలో పుల్వామా జిల్లాలోని ఒక గ్రామానికి చాలాసార్లు రావడంపై నిఘా వర్గాలు దృష్టిపెట్టాయి. ఖుర్షీద్ అనే వ్యక్తి ఇంటికి వస్తున్నాడని, అతని కుమార్తెతో దుజానాకు వివాహమైనట్లు నిఘా వర్గాలు నిర్ధారించుకున్నాయి. ఆపరేషన్ ‘ఏరివేత’! హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హన్ వనీ ఎన్కౌంటర్తో గతేడాది నుంచి అశాంతితో కశ్మీర్ రగులుతూనే ఉంది. దీనికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో కేంద్రం ‘హిట్లిస్ట్’ను రూపొందించి మరీ ఉగ్రవాదుల ఏరివేతను కొనసాగిస్తోంది. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ మే నెలాఖరులో మాట్లాడుతూ, కశ్మీర్లో పరిస్థితిని సాధారణ స్థితికి తెస్తామని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామన్నారు. పక్కాగా వ్యూహం సిద్ధం చేశాకే హోంమంత్రి ఈ ప్రకటన చేసినట్లు తెలు స్తోంది. సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు మిలి టెంట్ల జాబితాను రూపొందించగా.. 253 మంది క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు లెక్కతేల్చారు. వీరి లో విదేశీయులు, స్థానికులు ఎవరో గుర్తించారు. టార్గెట్... లీడర్ ఉగ్రవాదులకు నాయకత్వం వహిస్తున్న 12 మందితో జాబితాను రూపొందించి... జూన్ ఆరంభంలో విడుదల చేశారు. రెండునెలల్లో ఈ జాబితాలోని ముగ్గుర్ని మట్టుబెట్టారు. జూన్ 16న లష్కరే తోయిబా కమాండర్ జునైద్ మట్టూ హతమయ్యాడు. మట్టూ ఎన్కౌంటర్కు ప్రతీకారంగా అదేరోజు ఉగ్రవాదులు అనంత్నాగ్ జిల్లాలో ఎస్ఐ సహా ఆరుగురు పోలీసుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడికి సూత్రధారిగా తేలిన లష్కరే కమాండర్ బషీర్ వనీని జూలై 1న హతమార్చారు. ఇప్పుడు దుజానా వంతు.. గత జనవరి నుంచి దాదాపు 110 మంది ఉగ్రవాదుల్ని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. జూన్ నుంచి భారత సైన్యం వ్యూహం మార్చింది. అగ్రనాయకత్వంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎ++ కేటగిరిలో ఉన్న ఉగ్రవాద నాయకుల్ని టార్గెట్ చేసింది. వీరి కదలికల్ని ఇన్ఫార్మర్లు, నిఘావర్గాల ద్వారా సేకరించి ఉచ్చు బిగిస్తోంది. అగ్రనాయకుల్ని ఏరివేస్తే... మిగిలిన తీవ్రవాదులు చెల్లాచెదురవడం లేక లొంగిపోతారనేది భారత సైన్యం వ్యూహం. మిలిటెంట్లకు స్థానిక ప్రజల మద్దతు ఉండటంతో భద్రతాబలగాలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్ వంటి వాటిలో ఫలానా చోట ఎన్కౌంటర్ జరుగుతోందనే సమాచారం క్షణాల్లో యువతలో పాకిపోతోంది. దాంతో చుట్టుపక్కల ప్రజలు అక్కడికి చేరుకొని భద్రతాబలగాలపై రాళ్ల దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనల కారణంగానే కాల్పుల్లో మరణించే సాధారణ పౌరుల సంఖ్య అధికంగా ఉంటోంది. అందుకే 300 దాకా వాట్సాప్ గ్రూపులపై స్థానిక పోలీసులు నిఘా పెట్టారు. మిగిలింది వీరే.. 1. రియాజ్ నైకూ అలియాస్ జుబైర్ అధునాతన సాంకేతికతపై పట్టున్నవాడు. కశ్మీర్ లౌకిక రాజ్యంగా ఉండాలని కాంక్షించే 29 ఏళ్ల నైకూపై 12 లక్షల రివార్డు ఉంది. ఈ ఏడాది జూన్ ఆరంభంలో హిజుబుల్ ముజాహిదీన్ కశ్మీర్ చీఫ్గా నియమితుడయ్యాడు. 2. జకీర్ మూసా హురియత్ లౌకికవాద వైఖరితో విభేదించి... వారి తలలు తీయాలని పిలుపిచ్చాడు. హిజుబుల్ అగ్రనాయకత్వంతో విభేదించి ఆ సంస్థకు దూరమయ్యాడు. కశ్మీర్ లోయలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలనేది ఇతని వాదన. 3. జీనత్ ఉల్ ఇస్లామ్ లష్కరేలో ఎ కేటగిరి ఉగ్రవాది 4. అబు హమస్ : జైషే మహమ్మద్ డివిజినల్ కమాండర్. పాక్కు చెందిన ఇతను 2016 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. 5. సద్దాం పద్దార్ అలియాస్ జైద్: హిజ్బుల్ ముజాహిదీన్ సోపియాన్ జిల్లా కమాండర్. 6. షౌకత్ తక్ లష్కరే పుల్వామా జిల్లా కమాండర్. 2011లో ఉగ్రసంస్థలో చేరాడు. 7. మహ్మద్ యాసిన్ ఇట్టూ అలియాస్ మాన్సూన్: హిజ్బుల్ బద్గాం జిల్లా కమాండర్. 8. వసీం అలియాస్ ఒసామా లష్కరే తోయిబా సోపియాన్ జిల్లా కమాండర్. అంతకముందు 2014లో హిజ్బుల్లో చేరి బుర్హన్ వనీతో కలిసి పనిచేశాడు. 9. అల్తాఫ్ దార్ అలియాస్ కచ్రూ హిజ్బుల్ కుల్గాం జిల్లా కమాండర్. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఎల్ఈటీ టాప్ కమాండర్ ఖతం!
శ్రీనగర్: కశ్మీర్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ) టాప్ కమాండర్ అబు దుజనా మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందినట్టు తెలుస్తోంది. పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతాదళాలు జరిపిన ఎన్కౌంటర్లో అబు (27)తోపాటు మరో మిలిటెంట్ చనిపోయాడని స్థానిక టీవీ చానెళ్లు తెలిపాయి. పుల్వామాలోని హక్రిపోరా గ్రామంలో మిలిటెంట్లుకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, చనిపోయిన ఉగ్రవాదుల మృతదేహాలను ఇంకా తాము స్వాధీనం చేసుకోలేదని, కాబట్టి ఎవరు చనిపోయింది ఇప్పుడే చెప్పలేమని కశ్మీర్ ఐజీ మునీర్ ఖాన్ విలేకరులకు తెలిపారు. పాకిస్థాన్ ఆక్రమిక కశ్మీర్లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతానికి చెందిన అబు దుజనా దక్షిణ కశ్మీర్లో జరిగిన చాలా మిలిటెంట్ దాడుల వెనక ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. -
ఘనంగా సైమా సంబరం (2)
-
ఘనంగా సైమా సంబరం
-
షాపింగ్మాల్లో రంజాన్ ఫ్రీ ఆఫర్
-
అబుదాబి రాజును కలిసిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అబుదాబి రాజును కలుసుకున్నారు. మొట్టమొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా శ్వేతసౌదానికి ఆహ్వానించి ముచ్చటించారు. త్వరలోనే ట్రంప్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. అబుదాబి రాజు జయద్ అల్-నయాన్ శ్వేత సౌదంలోని ఓవల్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ట్రంప్ ఆయనను సాదరంగా హ్వానిస్తూ ‘నయన్ ప్రత్యేకమైన అతిధి.. మెండుగా గౌరవించదగినవారు’ అని ఫొటో సెషన్ సందర్భంగా అన్నారు. ‘ఆయన దేశాన్ని ప్రేమిస్తున్నాను.. మీరు కూడా ఆయన దేశాన్ని ప్రేమించండి. వీటన్నింటికంటే ముందు అమెరికాను ప్రేమించండి.. మనందరికీ అదే ముఖ్యం’ అంటూ ట్రంప్ చెప్పినట్లు యూఎస్ఏ టుడే తెలిపింది. ఇరు దేశాల భద్రత, వాణిజ్య, ఇరు దేశాల్లో పెట్టుబడుల అంశాలపై చర్చించుకున్నారని, ద్వైపాక్షి సంబంధాలపై తీవ్రంగా చర్చిచారని కూడా అది పేర్కొంది. మరోపక్క, అమెరికా రహస్యాలను డోనాల్డ్ ట్రంప్ రష్యాకు లీక్ చేశారని వచ్చిన వార్తలను అమెరికా శ్వేతసౌదం కొట్టిపారేసింది. అవన్నీ కూడా కట్టుకథలేనంటూ తిప్పికొట్టింది. -
ఇక దుబాయి ఆస్పత్రిలో లావాటి మహిళ
దుబాయి: ముంబయిలో చికిత్స చేయించుకొని వెళ్లిన ఈజిప్టుకు చెందిన స్థూలకాయురాలు ఎమన్ అహ్మద్ అబుదాబిలోని ఆస్పత్రిలో చేరింది. ఈ ఆస్పత్రిలో ఆమెకు ధీర్ఘకాలంపాటు శారీరక, మానసిక వైద్యాన్ని అందించనున్నారు. దాదాపు అరటన్ను బరువుతో ప్రపంచంలోనే అతి లావాటి మహిళగా రికార్డుల్లోకి ఎక్కిన ఎమన్ను ఒక సవాల్గా తీసుకొని ముంబయి వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో ఆమెను ఈజిప్టు నుంచి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె సర్జరీ చేసి దాదాపు 323 కిలోల బరువు తగ్గించారు. ప్రస్తుతం ఆమె బరువు 176.6కేజీలు. దీంతో తిరిగి ఆమెను పంపించేశారు. ప్రస్తుతం ఏడాదిపాటు చికిత్స పొందేందుకు ఎమన్ అబుదాబిలోని వీపీఎస్ బుర్జీల్ ఆస్పత్రిలో చేరింది. ఈ సందర్భంగా యాసిన్ శహత్ అనే వైద్యుడు మాట్లాడుతూ తన ప్రయాణం సౌకర్యాంగానే సాగినట్లు ఎమన్ తెలిపిందన్నారు. ఆమె కోసం ప్రత్యేకంగా ఇటలీ నుంచి హైడ్రాలిక స్ట్రెచర్ తీసుకొచ్చామని, 20మంది వైద్యులను ఆమెకు కేటాయించి వైద్యం చేయబోతున్నట్లు ప్రకటించారు. -
కోట్ల లాటరీ.. భారతీయురాలి పంటపండింది
దుబాయి: అబుదాబిలో ఓ భారతీయురాలి పంటపండింది. ఎంతోమంది ఆసక్తిగా, ఆశగా ఎదురుచూస్తున్న మిలయనీర్ బంపర్ లాటరీలో భారీ మొత్తం ఆమె సొంతమైంది. ఏకంగా రూ.17,69,03,813.39 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన రాఫెల్ బోనాంజా లాటరీ ఆమెను వరించింది. దాదాపు 50 ప్రయత్నాల తర్వాత ఈ అదృష్టం కలిసొచ్చింది. నిషితా రాధాకృష్ణ పిళ్లై అనే మహిళ అబుదాబిలో రెండేళ్లపాటు ఆమె భర్తతో కలిసి మెడికల్ ప్రాక్టీస్ చేసింది. ఆమె భర్త ఇప్పటికే 50సార్లు రాఫెల్ బొనాంజా బిగ్ లక్కీ మిలియనీర్ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. దాదాపు 50సార్లు టికెట్ కొన్న ఆయన తన భార్య నిషితా పేరిట 058390 నెంబర్గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా తీసిన లక్కీ డ్రాలో ఈ నెంబర్కే ఆ లాటరీ తగిలింది. దీంతో నిషితా, ఆమె భర్త సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇద్దరు పిల్లల తల్లి అయిన రాధా ప్రస్తుతం టెక్సాస్లో భర్తతో కలిసి ఉంటోంది. గత ఏడాది(2016) జూలై నెలలో టెక్సాస్లో జెనెటిక్స్ విభాగంలో ఫెలోషిప్ ప్రోగ్రాం పూర్తి చేసేందుకు వెళ్లింది. అక్కడికి వెళ్లినా వారి లాటరీ ప్రయత్నాలు ఆపకపోవడంతోనే ఈ అదృష్టం దక్కింది. ఇలా రాఫెల్ బోనాంజా ప్రారంభించిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో డబ్బు లాటరీ రూపంలో తీసుకెళ్లనున్న రెండో వ్యక్తి ఈమె కానున్నారు. -
టాలెంట్ ఉంటే చాలు.. ఇక వీసా ఈజీ
అబుదాబి: అమెరికాలో హెచ్ 1 బి వీసాల విషయంలో అనేక గందరగోళ పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మాత్రం టాలెంట్కు పెద్దపీట వేస్తూ కొత్త వీసా విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఆయా రంగాల్లో ప్రతిభను గుర్తించి అలాంటి వారిని ఎక్కువగా ఆకర్షించడానికి వీలుగా కొత్త వీసా విధానాన్ని రూపొందించనున్నట్టు ఆ దేశం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి వేలాదిగా ఇప్పటికే యూఏఈ లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. విదేశీయులకు ప్రధానంగా నిర్మాణ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయి. ఇకనుంచి విద్య, వైద్యం, టూరిజం, సైన్స్, రీసర్చ్ వంటి రంగాలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా 150 కి పైగా దేశాలకు చెందిన వారు ఆయా రంగాల్లో అక్కడ పనిచేస్తున్నారు. తాజాగా కీలక రంగాల్లో "క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్" కు పెద్దపీట వేయాలని యూఏఈ నిర్ణయించింది. యూఏఈ ప్రధాని, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశం ఈ మేరకు తీర్మానించింది. అత్యున్నత అర్హత కలిగిన ప్రొఫెషనల్స్ను ఆకర్షించాల్సిన అవసరం ఉందని కేబినేట్ అభిప్రాయపడింది. యూఏఈ అనేక రంగాల్లో అవకాశాలు కల్పిస్తూ 'ల్యాండ్ ఆఫ్ అపర్చునిటీస్' గా మంచి వాతావరణం కల్పించామని, ఈ నేపథ్యంలో యూఏఈ కి వచ్చే వారిలో టాలెంట్ను ఎక్కువగా ఆకర్షించడానికి కొత్త వీసా విధానం అమలు చేయబోతున్నట్టు వివరించారు. ప్రధానంగా టూరిజం, హెల్త్, ఎడ్యుకేషన్ రంగాల్లో అధిక ప్రాధాన్యత కల్పించి ఆ రంగాల్లో నిపుణులకు అధికంగా వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. అలాగే మెడిసిన్, సైన్స్- రీసర్చ్ రంగాల్లో కూడా ఎక్కువ వీసాలు జారీ చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇకపోతే వివిధ దేశాలతో సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవడానికి రాజధాని అబుదాబిలో అన్ని దేశాలు ఎంబసీలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీలు కల్పించాలని నిర్ణయించారు. -
అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి
వాషింగ్టన్: ఏడు ఇస్లామిక్ దేశాలపై నిషేధం నిషేధంతో ప్రపంచదేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికాకు రెండు సంపన్న ముస్లిం దేశాల సమర్థనతో తొలిసారి ఊరట లభించింది. అంతర్యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన సిరియా, యెమెన్ లాంటి దేశాల నుంచి అమెరికాకు వచ్చే శరణార్థులను అక్కున చేర్చుకునేబదులు.. ఆయా దేశాల్లోనే సేఫ్ జోన్లు(రక్షణ ప్రాంత్రాలు) నిర్మించాలన్న అమెరికా ప్రతిపాదనను సౌదీ అరేబియా, అబుదాబిలు సమర్థించాయి. (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్తోనూ, అబుదాబి యువరాజు మహమ్మద్ బిన్ జాయేద్ అల్ సహ్యాన్తోనూ ఫోన్లో జరిపిన సంభాషణలో సానుకూలత వ్యక్తమైందని వైట్హౌస్ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. సిరియా, యెమెన్ సహా అంతర్యుద్ధం కొనసాగుతున్న దేశాల్లో సేఫ్ జోన్లు నిర్మించడం ద్వారా పాశ్చాత్య దేశాలకు శరణార్థుల ప్రవాహాన్ని అడ్డుకోవచ్చన్న ట్రంప్ ఆలోచనకు ఇద్దరు రాజులూ మద్దతు పలికారని, దీనితోపాటు సౌదీ-అమెరికా, అబుదాబి-అమెరికాల ద్వైపాక్షిక సంబంధాలపైనా వారు చర్చించారని వైట్హౌస్ వర్గాలు తెలిపాయి. (ముస్లింలపై నిషేధం: గొంతుమార్చిన ట్రంప్) -
‘గణతంత్ర అతిథి’కి ఘన స్వాగతం
► నేడు అబుదాబి ప్రిన్స్తో భేటీ ► డజను ఒప్పందాలు న్యూఢిల్లీ: భారత్ పర్యటనలో భాగంగా అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్– నహ్యన్ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఢిల్లీ ఎయిర్పోర్టుకు వెళ్లి నహ్యన్ కు ఘనస్వాగతం పలికారు. ప్రధానితోపాటు పలువురు ఉన్నతాధికారులు నహ్యన్ కు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ గురువారం జరగనున్న 68వ గణతంత్ర వేడుకల్లో అబుదాబి యువరాజు నహ్యన్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ఆయనకు భారత్ ఆహ్వానం పంపింది. 2006లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు (అరబ్ దేశాల నుంచి) సౌదీ రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ముఖ్య అతిథిగా పాల్గొనగా.. 2016 గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ హాజరయ్యారు. నేడు మోదీ, అబుదాబి ప్రిన్స్ నహ్యన్ భేటీ భారత్, యూఏఈ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదరనుంది. ప్రధాని మోదీ, అబుదాబి యువరాజు నహ్యన్ బుధవారం సమావేశం కానున్నారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చలు జరిపిన అనంతరం ఈ ఒప్పందం కుదుర్చుకుంటారు. యూఏఈ భారత్లో 75 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 5 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టే అంశంతోపాటు డజనుకు పైగా ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. -
గల్ఫ్ తరిమినా.. ఎడారి బాటే!
సాక్షి, జగిత్యాల: ఈ ఫొటోలో కనిపిస్తున్న వారంతా ఈ నెల 25న జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ కన్సల్టెన్సీ నిర్వహించిన గల్ఫ్ ఉద్యోగాల ఇంట ర్వ్యూకు వచ్చిన నిరుద్యోగులు. అబుదాబీలోని నేషనల్ హోటల్స్లో 500 పోస్టుల భర్తీ కోసం సదరు కంపెనీ నిర్వహించిన జాబ్మేళాలో ఏడొం దలకుపైగా మంది హాజరయ్యారు. ఏ ప్రకటన లేకుండానే కన్సల్టెన్సీ నిర్వహించిన జాబ్మేళా ఇది. ఒకవేళ పత్రిక ప్రకటన ఇస్తే.. వెరుు్య మందికిపైనే ఇంటర్వ్యూకు హాజరయ్యేవారని నిరుద్యోగులు చెప్పారు. ఇందులో మరో విశేష మేమిటంటే..! ఈ పోస్టులన్నీ హోటళ్లలో క్లీనింగ్ సెక్షన్లో మాత్రమే. ఎడారి దేశంలో.. క్లీనింగ్ ఉద్యోగం కోసం ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు సైతం సిద్ధం కావడం విశేషం. ఇంతకు ఈ ఉద్యో గాలకు అక్కడి యాజమాన్యం నిర్ణరుుంచిన వేతనం.. 950 దినార్లు (ఇక్కడి రూ.17,100) మాత్రమే. సంబంధిత హోటల్ ప్రతినిధులూ ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇక్కడ పనుల్లేక... పరారుుదేశంలో పనుల్లేక.. వందలాది మంది స్వదేశానికి తిరిగి వస్తున్నా గల్ఫ్ దేశంలో పని చేసేందుకు యువత సిద్ధమ వుతోంది. ఇప్పటికే సౌదీలోని జెడ్డా, రియాద్, దమామ్లలో ఉన్న బిన్లాడెన్ వంటి పెద్ద కంపెనీలు మూతబడ్డారుు. అబుదాబీ, ఒమన్, ఖతర్, మస్కట్, షార్జా ల్లో ఉన్న ప్రముఖ కంపెనీలు మూతబడే దిశలో ఉన్నారుు. దీంతో యాజమాన్యాలు కార్మికులను పనిలోంచి తొలగిస్తున్నారుు. గల్ఫ్ నుంచి మూడు నెలల వ్యవధిలో 60వేలకు పైగా మంది తిరిగొచ్చేశారు. -
టాప్ లష్కరే టెర్రరిస్ట్ కలకలం
శ్రీనగర్: ఆందోళనలతో అట్టుడుకుతున్న కశ్మీర్ లో మరో కలకలం చెలరేగింది. లష్కరే తోయిబా ముఖ్య నాయకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబూ దుజాన్ బహిరంగ ప్రదేశంలో కనిపించాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆదివారం పుల్వామా జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో కశ్మీరీ యువకులతోపాటు కలిసి నడుస్తూ అబూ దుజాన్ వీడియోలకు చిక్కినట్లు తెలిసింది. నిఘావర్గాలు కూడా అబూ ఉనికిని నిర్ధారించారు. హిజబుల్ ఉగ్రవాది బుర్హాన్ వని అంత్యక్రియలకు కూడా అబూ హాజరైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా అతనికి సంబంధించిన వీడియోలు బయటికి రావడంతో కశ్మీర్ లోయలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మరినట్లయింది. లష్కరేకు కశ్మీర్ చీఫ్ గా వ్యవహరిస్తూ, గడిచిన కొన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉంటోన్న అబూ దుజాన్ బహిరంగ ర్యాలీల్లో కనిపించడం వెనుక పెద్ద కుట్రే దాగుందని నిఘావర్గాలు పేర్కొంటున్నాయి. బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న పాకిస్థాన్.. ఇక్కడి యువకులను తనవైపునకు తిప్పుకునేందుకు అబూ దుజాన్ లాంటి పెద్ద నాయకులను రంగంలోకి దింపింది. నేరుగా యువకలో మాట్లాడి, వారిని ప్రభావితం చేయగలితే ఉగ్రవాదాన్ని మరింత విస్తరించవచ్చన్నది అబూ దుజాన్ వ్యూహంగా కనిపిస్తున్నట్లు నిఘావర్గాలు పేర్కొన్నాయి. బుర్హాన్ అంత్యక్రియలు సైతం లష్కరేకే చెందిన ఆమిర్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో జరగడం గమనార్హం. రాజ్ నాథ్ పాక్ పర్యటనపై హెచ్చరికలు కశ్మీర్ అంశంలో పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా ఉగ్రనాయకులు హఫీజ్ సయీద్(జమాత్ ఉల్ దవా), సయీద్ సలాహుద్దీన్(హిజబుల్ ముజాహిద్దీన్)లు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టారు. భారీ ర్యాలీలు, ఇస్లామాబాద్ లో భారత హైకమిషనర్ కార్యాలయం ముట్టడి తదితర ఆందోళనలు నిర్వహించినవారు.. తాజాగా భారత్ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ పర్యటనను వ్యతిరేకిస్తూ అక్కడి ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. ఆదివారం జరిగిన ర్యాలీల్లో ప్రసంగించిన హఫీజ్, సలాహుద్దీన్ లు 'రాజ్ నాథ్ సింగ్ ను పాకిస్థాన్ లో అగుడు పెట్టనివ్వొద్దు' అని ప్రభుత్వాన్ని కోరారు. సైనిక బలంతో అమాయక కశ్మీరీలను చంపుతోన్న భారత్ తో ఎలాంటి చర్చలు వద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటు పాక్ ప్రభుత్వం రాజ్ నాథ్ పర్యటనపై ప్రకటన చేసింది. 'ఆయన(రాజ్ నాథ్) సార్క్ సమావేశాల్లో పాల్గొని వెళ్లిపోతారు. భారత్- పాక్ ల మధ్య దైపాక్షిక చర్చలేవీ ఉండబోవు' అని ఆదివారం ఇస్లామాబాద్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఆగస్టు రెండో వారంలో జరగనున్న సార్క్ సమావేశాల్లో వీలైనన్ని మార్గాల్లో పాక్ తీరును ఎండగట్టేందుకు భారత్ సిద్ధపడుతోంది. పఠాన్ కోట్ దర్యాప్తు మొదలు కశ్మీర్ ఆందోళనలు, బుర్హాన్ వనిలపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలను ఎండగట్టేందుకు రాజ్ నాథ్ ప్రయత్నిస్తారని తెలుస్తోంది. -
వామ్మో! వాట్సాప్ ను వాళ్లూ వాడుకుంటున్నారు!
అబుధాబి: మొబైల్ మెసెజింగ్ యాప్ వాట్సాప్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. నిన్నమొన్నటివరకు రోడ్డుపక్కన పేవ్మెంట్ల మీద, కూడళ్ల వద్ద, థియేటర్ల వద్ద అడుక్కున్న యాచకులు ఇప్పుడు వాట్సాప్నూ వదిలిపెట్టడం లేదు. సున్నితమైన మనస్సు, దానగుణం ఉన్న వారు లక్ష్యంగా ఏకంగా వాట్సాప్ లో కరుణరసాత్మకమైన కథనాలు వండివారుస్తున్నారు. అమ్మ జబ్బుకు, అక్కకు రోగం, అన్నకు వైకల్యం అన్న తరహాలో అత్యంత దయనీయ కథనాలను గుర్తుతెలియన నంబర్ల ద్వారా పంపిస్తూ డబ్బులు అడుక్కుంటున్నారు. ఎంత తోచితే అంత దానం చేయాలని వేడుకుంటూ ఏకంగా బ్యాంకు అకౌంట్ నంబర్లు కూడా వాట్సాప్లకు పంపిస్తున్నారు. రంజాన్ మాసం కావడంతో దుబాయ్లో ఈ ట్రెండ్ మరింత ముదిరింది. ప్రజల జాలిగుణాన్ని సొమ్ము చేసుకొని డబ్బు దోచుకునే ఉద్దేశంతో మోసగాళ్లే ఇలాంటి సందేశాలను వాట్సాప్ నంబర్లకు కుప్పలు తెప్పలుగా పంపిస్తున్నారని, వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని అబుదాబి డీజీపీ (ఆపరేషన్స్) ఆమిర్ మహమ్మద్ ఆల్ ముహైరి చెప్పారు. వాట్సాప్ లో తనకు నిత్యం ఇలాంటి దీనతీదీనమైన కథనాలతో సందేశాలు వస్తుండటంతో ఓ మహిళ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి మోసపూరితమైన సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, మీడియా దుబాయ్ ప్రజలకు సూచించింది. -
హోటళ్లలో సరికొత్త బాదుడు
సరదాగా సెలవు రోజుల్లో దుబాయ్ వెళ్లి వద్దామనుకుంటున్నారా? అయితే జేబులు మరికాస్త ఎక్కువగా నింపుకోండి. ఎందుకంటే, అక్కడి హోటల్ బిల్లులపై 4 శాతం అదనపు మునిసిపల్ ఫీజులను విధించనున్నారు. దాంతోపాటు, రాత్రిపూట బసచేస్తే ఇంకా అదనపు వడ్డింపు కూడా ఉంటుంది. ఇవన్నీ జూన్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఈ విషయమై మునిసిపల్, రవాణా శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అన్ని ఆర్థిక రికార్డులలోను పర్యాటక ఫీజును, మునిసిపల్ ఫీజును ప్రత్యేకంగా చూపించాలని హోటళ్లకు తెలిపారు. మునిసిపల్ ఫీజును ఎలా వసూలు చేయాలన్న విషయమై త్వరలోనే వర్క్షాపులు కూడా నిర్వహిస్తారట. అబుదాబి నగరంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ఫీజును మునిసిపల్ శాఖ ఉపయోగిస్తుందని, హోటళ్లలో ఉండే అతిథులు, ఇతర కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తుందని అంటున్నారు. -
మసాలాల మాటున మాదక ద్రవ్యాలు!
అబుధబిః మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠా గుట్టును అబుధబి పోలీసులు రట్టు చేశారు. మసాలా దినుసుల మాటున మాదకద్రవ్యాలను ఎగుమతి చేస్తున్న ముగ్గురు మహిళలతో సహా 8 మంది నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. మసాలాల పేరుతో మాదక ద్రవ్యాలు కలిగిన 398 సంచులను వారివద్దనుంచీ స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో కూడిన మొత్తం ఎనిమిది సభ్యులతో కూడిన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాను అబుధబి పోలీసులు పట్టుకున్నారు. మసాలా దినుసులు, సంప్రదాయ ఔషధాల పేరున ముఠా... మాదక ద్రవ్యాల రవాణా జరుపుతున్నట్లు సిఐడీ డైరెక్టర్ డాక్టర్ రషీద్ మొహమ్మద్ తెలిపారు. ముఠాలోని సభ్యులంతా ఇంచుమించుగా 21-28 సంవత్సరాల మధ్య వయస్కులేనన్న పోలీసులు, సుమారు 25 లక్షల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలు వారి అధీనంలో ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న నిందితులపై అక్రమ రవాణా, మత్తు పదార్థాల విక్రయం తదితర కేసులను నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన వారిలో అరబ్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు, ముగ్గురు యూరోపియన్లు, వివిధ దేశాలకు చెందిన ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
అబుదాబిలో జోయాలుక్కాస్ షోరూమ్
జోయాలుక్కాస్ తాజాగా అబుదాబి లోని ముష్రిఫ్ మాల్లో కొత్తగా షోరూమ్ను ప్రారంభించింది. ఇందులో బంగారం, డైమండ్, విలువైన రాళ్లు, ప్లాటినం, రత్నాలు సంబంధిత ఆభరణాలు పలు రకాల మోడళ్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారులకు ఆభరణాల కొనుగోలుపై బంగారు నాణేన్ని ఉచితంగా అందిస్తున్నట్లు జోయలుక్కాస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జాన్ పాల్ అలుక్కాస్ తెలిపారు. జోయాలుక్కాస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జాన్ పాల్ అలుక్కాస్, జోయాలుక్కాస్ గ్రూప్ డెరైక్టర్లు ఆంటోనీ జోస్, మేరీ ఆంటోనీ సహా ఇతర ప్రముఖుల సమక్షంలో ఇతిహద్ గెస్ట్ మేనేజింగ్ డెరైక్టర్ యాసర్ అల్ యూసుఫ్ షోరూమ్ను ప్రారంభించారు. -
భారతీయుడికి జైలు శిక్ష
అబుదాబి: గూఢచర్యం కేసులో దోషిగా భారతీయుడొకరికి యూఏఈ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడిని మనార్ అబ్బాస్ గా గుర్తించారు. భారత నిఘా విభాగం తరపున గూఢచారిగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు రుజువుకావడంతో అతడికి అబుదాబిలోని సుప్రీంకోర్టు ఐదేళ్ల శిక్ష విధించిందని 'గల్ఫ్ న్యూస్' తెలిపింది. అబుబాబి నౌకాశ్రయాల్లో సైనిక జలాంతర్గాములకు చెందిన కీలక సమాచారాన్ని అబుదాబిలోని భారత దౌత్యకార్యాలయానికి చేరవేస్తున్నారనే ఆరోపణలతో గతేడాది అబ్బాస్ ను అరెస్ట్ చేశారు. జైలు శిక్ష పూర్తైన తర్వాత అతడిని స్వదేశానికి పంపిస్తారు. అబ్బాస్ కు జైలు శిక్ష విధించడంపై భారత ఎంబసీ ఇంకా స్పందించలేదు. -
వేడుకలకు వచ్చిన పాప్ సింగర్కు చేదు అనుభవం
హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల కోసం వచ్చిన ప్రముఖ పాప్ సింగర్ రాహత్ ఫతే అలీఖాన్కు చేదు అనుభవం ఎదురైంది. అబుదాబి నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయనను ఇమ్మిగ్రేషన్ అధికారులు గురువారం రాత్రి వెనక్కి పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ప్రముఖ హోటల్ తాజ్ ఫలక్నుమాలో పాటలు పాడేందుకు అలీఖాన్ వచ్చారు. అబుదాబి నుంచి ఢిల్లీ మీదుగా హైదరాబాద్ రావాల్సిందిగా ఇమ్మిగ్రేషన్ అధికారులు సూచించగా.. అందుకు విరుద్ధంగా నేరుగా హైదరాబాద్కు రావడంతో ఆయనను అధికారులు తిప్పి పంపించారు. -
ప్రియురాలిని హత్య చేసి....
దుబాయ్: యూఏఈలో ప్రియురాలిని హత్య చేసి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడో భారతీయుడు. నిందితుడు అబుదాబిలో ఒక హోటల్ ముందు ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. తర్వాత సముద్రంలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నిందితుడిని పేరును ఎంఏ, అతడి ప్రియురాలి పేరును కేకే అని మాత్రమే వెల్లడించింది. అసూయతో అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. సముద్రంలోకి దూకిన నిందితుడిని తీరపరిరక్షక దళాలు కాపాడాయని గల్ఫ్ న్యూస్ తెలిపింది. అతడిని ఆస్పత్రిలో చేర్చారు. కోలుకున్నాక అతడిని అధికారులు ప్రశ్నించనున్నారు. నిందితుడు, హతురాలి పూర్తి వివరాలు వెల్లడికాలేదు. -
దావూద్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న భారత్
-
కొనసాగుతున్న మోదీ యూఏఈ పర్యటన!
-
'అవమానకరంగా భావిస్తున్నా'
-
'అవమానకరంగా భావిస్తున్నా'
అబుదాబి: తమ దేశంలో పెట్టుబడి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అవకాశాల గడ్డగా పేరుగా గాంచిన ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. అబుదాబిలో యూఈఏ, ప్రవాస భారత పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తమది ఒకటని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టుబడులకు అమితావకాశాలు ఉన్నాయని తెలిపారు. తక్కువ వ్యయంతో ఏడేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మించాలనుకుంటున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించకపోవడంతో పెట్టుబడులు మందగించాయని విమర్శించారు. ఇండియా శక్తి, యూఏఈ సామర్థ్యంతో భవిష్యత్ లో ఆసియా ముఖచిత్రం మారనుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 34 ఏళ్లుగా భారత ప్రధానులెవరూ యూఏఈలో పర్యటించకపోవడం అవమానకరంగా భావిస్తున్నానని చెప్పారు. 'భారత్, యూఏఈ మధ్య ప్రతిరోజూ అనేక విమానాలు తిరుగుతున్నాయి. భారత ప్రధాని ఇక్కడకు రావడానికి 34 ఏళ్లు పట్టింది' అని మోదీ పేర్కొన్నారు. -
ఉగ్రభూతంపై ఉమ్మడి పోరు
-
ఉగ్రభూతంపై ఉమ్మడి పోరు
అబుదాబి: పశ్చిమాసియా దేశాల ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలలో బయటి దేశాల ప్రమేయం వల్లనే అశాంతి పెరిగిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ దేశాలు కలసికట్టుగా కృషి చేస్తే సమస్యల పరిష్కారం తేలికవుతుందని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వచ్చిన సందర్భంగా మోదీ, స్థానిక ఖలీజ్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక సమస్యలు ఆయా దేశాలు పూనుకుంటేనే పరిష్కారమవుతాయన్నది తన ప్రగాఢ విశ్వాసమన్నారు. పశ్చిమాసియా దేశాలన్నింటితో భారత్కు సత్సంబంధాలు ఉండటం విశేషమని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని అంతర్గత సమస్యల్లో జోక్యం చేసుకోకూడదన్న మౌలిక నియమాన్ని భారత్ పాటిస్తూ, వివిధ అంశాల్లో చర్చలకు మద్దతిస్తోందన్నారు. ఈ ప్రాంత దేశాలు సమష్టిగా, నిర్మాణాత్మకంగా శాంతి స్థాపనకు కృషి చేయాలని, ఈ కృషి కేవలం ఈ ప్రాంతానికే కాకుండా మొత్తం ప్రపంచానికే మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇరాన్తో అగ్రదేశాల అణు ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ ‘ఉగ్రవాదం వంటి అతి తీవ్రమైన సమస్యలు ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని, శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగిస్తున్నప్పుడు అణు ఒప్పందం అనేది ఈ ప్రాంతంలో అస్థిరత్వానికి కారణం కానే కాకూడదు’ అని అన్నారు. పరస్పర విశ్వాసంతో ఈ ప్రాంతంలో చర్చలు, సహకారం మొదలవాలని అన్నారు. 34 ఏళ్ల తరువాత తొలిసారి భారత ప్రధాని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్లో పర్యటిస్తున్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి వెళ్లిన మోదీ సాయంత్రం అబుదాబి చేరుకున్నారు. విమానాశ్రయంలో యువరాజు షేక్ మహమ్మద్ జాయేద్ అల్ నహ్యా ప్రొటోకాల్ను పక్కన పెట్టి మోదీకి సంప్రదాయక స్వాగతం పలికారు. యువరాజుతో పాటు ఆయన ఐదుగురు సోదరులూ మోదీ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఏఈ సైనిక దళాల వందనాన్ని మోదీ స్వీకరించారు. ప్యాలెస్లో తనకు ఏర్పాటు చేసిన బసకు మోదీ చేరుకున్నారు. అక్కడ యువరాజుతో కాసేపు చర్చలు జరిపారు. శాంతికి ప్రతీక ఈ మసీదు.. అక్కడి నుంచి ముందుగా అరబ్లకు అత్యంత పవిత్రమైన షేక్ జాయేద్ గ్రాండ్ మసీదును సందర్శించారు. 82 గుమ్మటాలతో అద్భుతమైన ఇస్లామిక్ నిర్మాణ కౌశల్యానికి ప్రసిద్ధి చెందిన ఈ మసీదు.. మక్కా, మదీనా మసీదుల తర్వాత మూడో అతిపెద్దది. లక్షా 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 3,500 కోట్లతో నిర్మించిన ఈ మసీదుకు యూఏఈ తొలి అధ్యక్షుడు షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ అన్ నహ్యా పేరును పెట్టారు. ‘ఈ అపూర్వమైన పవిత్ర మసీదును సందర్శించటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అద్భుతమైన నైపుణ్యానికి, సృజనాత్మకతకు గొప్ప ఉదాహరణ. శాంతికి, కరుణకు, సౌభ్రాతృత్వానికి, ఇస్లాంపై అచంచలమైన విశ్వాసానికి ఇది ప్రతీక’ అని మోదీ సందర్శకుల పుస్తకంలో రాశారు. కీలక భాగస్వామిగా యూఏఈ యూఏఈతో తన చర్చల ఎజెండాను ఖలీజ్టైమ్స్కు ఇంటర్వ్యూలోనే మోదీ స్పష్టంగా సూచించారు. వాణిజ్యం, ఉగ్రవాద నిరోధం వంటి అంశాలలో యూఏఈతో కీలక భాగస్వామ్యం నెరపడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. రెండు దేశాలు ఉగ్రవాదం, తీవ్రవాదంతో సహా కొన్ని అంశాలలో ఒకే విధమైన ఆందోళనలను ఎదుర్కొంటున్నాయి కాబట్టి ఈ అంశాలు రెండు దేశాలకు అత్యధిక ప్రాధాన్యాంశాలన్నారు. భద్రత విషయంలో యూఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ఇంధనం, పెట్టుబడుల రంగాలలో సహకారాన్ని ఆశిస్తున్నామన్నారు. వ్యాపారానికి భారత్ ఆకర్షణీయ గమ్యంగా పెట్టుబడిదారులను ప్రోత్సహించటం తన లక్ష్యమన్నారు. 1970లలో 180 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్న యూఏఈ-భారత్ వ్యాపార బంధం ప్రస్తుతం 60 బిలియన్ డాలర్లతో భారత్ మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉందని.. ఇది మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు వివరించారు. భారతీయ కార్మికులతో భేటీ ఆ తర్వాత భారత్ నుంచి వలస వచ్చిన కార్మికులను ఐ-కాడ్ కార్మికుల రెసిడెన్షియల్ క్యాంప్ హౌస్లో కలిసి వారి సమస్యలపై చర్చించారు. క్రీడా హాల్లో వారితో ఫొటోలు దిగారు. ఈ దేశ అభివృద్ధిలో 26 లక్షల మంది భారతీయులు భాగస్వామ్యం వహించటం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. భారత ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం యువరాజుతో చర్చలు జరిపిన అనంతరం మోదీ దుబాయ్కి వెళ్తారు. అక్కడ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్తో చర్చలు జరుపుతారు. ఆ తరువాత ప్రపంచంలో అత్యంత ఎత్తై బుర్జ్ ఖలీఫాను సందర్శిస్తారు. అనంతరం దుబాయ్ క్రికెట్ మైదానంలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడతారు. మోదీ పర్యటనను పురస్కరించుకుని యూఏఈలో ఒక దేవాలయం నిర్మించుకోవటానికి స్థలం కేటాయించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మోదీ సెల్ఫీ దౌత్యం అరబ్ దేశంలో కూడా కొనసాగింది. ప్రఖ్యాత షేక్ జాయేద్ మసీదును సందర్శించిన సందర్భంగా మోదీ అరబ్ రాజకుటుంబీకులు, షేక్లతో సెల్ఫీ దౌత్యం నెరిపారు. మీగడ రంగు కుర్తా, కాషాయం తెలుపు లాల్చీ ధరించిన మోదీ మసీదుకు వచ్చిన షేక్లతో తన మొబైల్తో సెల్ఫీకి పోజ్లిచ్చారు. -
కారులో మరిచిన తండ్రి: బాలుడి మృతి
అబుదాబి: ఓ నాలుగేళ్ల బాలుణ్ని తండ్రి కారులో మరచిపోవడంతో ఊపిరాడక మరణించిన ఘటన షార్జాలోని అల్ రమ్ సా ప్రాంతంలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తండ్రి -కొడుకులు ఇద్దరూ కలిసి కారులో ఇంటికి వచ్చారు. అయితే కొడుకు కారు వెనుక సీట్లో ఉన్న విషయాన్ని తండ్రి మరిచిపోయాడు. ఆ బాలుడు తనతో ఉన్న విషయాన్ని మరిచిపోయిన తండ్రి కారును పార్కింగ్ ప్లేస్ లో పెట్టాడు. అదే సమయంలో కారును కూడా లాక్ చేశాడు. కారు లోపల ఊపిరాడక పిల్లాడు.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కొద్ది సేపటి తర్వాత కొడుకు కారులోనే ఉన్న విషయం ఉన్నట్టుండి గుర్తుకొచ్చిన తండ్రి.. పరుగున కారు దగ్గరకు వెళ్లి, పిల్లాడిని తీసుకుని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆ పిల్లాడి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు షార్జా పోలీసులు శనివారం తెలిపారు. ఈ తరహా ఘటనలో గత సంవత్సరం ఐదుకు పైగా చోటు చేసుకున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. తమ పిల్లల్ని కారులో మరిచిపోవడం తో పాటు ఇంజిన్ ను ఆన్ లో ఉంచడంతోనే లోపల వేడి ఎక్కువై ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. -
ఖాండ్వా టు జానకీపురం
* జైలు నుంచి తప్పించుకుంటూనే అబు ఫైజల్ ముఠా అరాచకం * ఇద్దరు కానిస్టేబుళ్లను పొడిచిన వైనం * ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో దోపిడీలు * చొప్పదండి ఎస్బీఐలో దొంగతనం సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జైలు నుంచి అబు ఫైజల్ నేతృత్వంలో తప్పించుకున్న ముష్కరమూక దేశవ్యాప్తంగా ఎన్నో అరాచకాలకు పాల్పడింది. పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడింది. పలు చోట్ల బాంబు పేలుళ్లతోనూ వీరికి సంబంధమున్నట్లు అనుమానాలున్నాయి. అలాంటి ఈ ముఠాలో ఇద్దరు శనివారం నల్లగొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్లో మరణించారు. మరో నలుగురు ఏపీలోకి అడుగుపెట్టినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన అబు ఫైజల్ ముంబైలోని జుహూ కేంద్రంగా కార్యకలాపాలు సాగించాడు. నిషేధిత సిమి మధ్యప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా పనిచేశాడు. డాక్టర్గా చెలామణీ అవుతూ... దోపిడీలతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. భోపాల్కు చెందిన ఒక బీఎస్పీ నేత, బీజేవైఎం నాయకుడిపై జరిగిన హత్యాయత్నాల కేసుల్లో అరెస్టయిన అబు ఫైజ ల్ను మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జైల్లో ఉంచారు. ఇక మధ్యప్రదేశ్కు చెందిన కానిస్టేబుళ్లు యాదవ్, సింగ్ల హత్యతో పాటు దోపిడీ, దొంగతనం కేసుల్లో అరెస్టయిన వివిధ ప్రాంతాలకు చెందిన సిమి ఉగ్రవాదులు జకీర్ హుస్సేన్ అలియాస్ సాదిఖ్, మహ్మద్ అస్లాం అలియాస్ బిలాల్, షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు అలియాస్ మాలిక్, అంజాద్ అలియాస్ దౌడ్, మహ్మద్ ఇజాజుద్దీన్, అబిద్ మీర్జాలు కూడా ఆ సమయంలో ఖాండ్వా జైల్లోనే ఉన్నారు. పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వీరిని ఆకర్షించిన అబు ఫైజల్ ఒక ముఠాగా తయారుచేశాడు. వరుసగా నేరాలు.. ఖాండ్వా జైల్లోంచి పారిపోయిన వారిలో మిగిలిన జకీర్ హుస్సేన్, మహ్మద్ అస్లాం, షేక్ మహబూబ్, అంజాద్, మహ్మద్ ఇజాజుద్దీన్లకు మరో వ్యక్తి తోడయినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. వీరంతా కలిసి ‘మాల్-ఇ-గనిమఠ్’ పేరుతో కొత్త మాడ్యుల్ను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను టార్గెట్గా చేసుకుని.. గత ఏడాది ఫిబ్రవరి 1న పంజా విసిరారు. గత ఏడాది మే 1న చెన్నై రైల్వేస్టేషన్లో బెంగళూరు-గువహటి రైల్లో జరిగిన పేలుళ్లలో వీరి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 12న ఉత్తరప్రదేశ్లోని బిజ్నూర్లో పోలీసుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇక గతేడాది డిసెంబర్ 29న బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్ పేలుడు కూడా వీరిపనిగానే అనుమానిస్తున్నారు. ఖాండ్వా ఎస్కేప్.. ఈ ఏడుగురు ముష్కరులు 2013 అక్టోబర్ 1న ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సెల్ బాత్రూమ్ గోడల్ని పగలగొట్టుకుని బయటకు వచ్చారు. అడ్డుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లను పొడిచి వారి వద్ద ఉన్న తుపాకులు, వైర్లెస్ సెట్లను తీసుకుని పారిపోయారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే అబిద్ పోలీసులకు చిక్కాడు. తరవాత 2013 డిసెంబర్లో మధ్యప్రదేశ్లోని బర్వానీ జిల్లాలో అబు ఫైజల్ దొరికిపోయాడు. ఫైజల్ను విచారిస్తున్న సమయంలోనే... ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు భత్కల్ జైల్లోంచి పారిపోవడానికి స్కెచ్ వేసినట్లు బయపడింది. ‘ముత్తూట్’లో దోపిడీ వీరిపనే! సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ శివార్లలో పటాన్చెరు సమీపంలోని బీరంగూడలో ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీ చేసింది కూడా ఈ అబు ఫైజల్ ముఠాయేనని పోలీసులు అనుమానిస్తున్నారు. జానకీపురంలో హతమైన అస్లాంకు, ఈ దోపిడీలో పాల్గొన్న అజాజ్ ఊహాచిత్రంతో దగ్గరి పోలికలున్నట్టు తేలింది. మెదక్ జిల్లా పరిధిలోని బీరంగూడ లో ముత్తూట్ ఫైనాన్స్లో గత నెల 4న దోపిడీ జరిగింది. ఐదుగురు వ్యక్తులు దోపిడీకి తెగబడ్డారు. అజాజ్ అనే దుండగుడి ఊహచిత్రాన్ని రూపొందించారు. అది అస్లాం ఫొటోతో సరిపోలడం విశేషం! -
నెలరోజులు ప్రత్యక్ష నరకం..
* అరబ్ షేక్ల చెర నుంచి మహిళలకు విముక్తి * చెప్పలేని పనులు చేయించారు * తిరిగివస్తామనుకోలేదు:బాధిత మహిళలు చాంద్రాయణగుట్ట : ‘‘ పేదరికాన్ని ఆసరాగా చేసుకున్నారు. నెలకు రూ. 30 వేలు జీతం వచ్చేలా చూస్తామన్నారు. గత నెల 19న అబుదాబీకి పంపారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించవచ్చని ఆశపడ్డాం. తీరా అక్కడికి వెళితే షేక్లు గదిలో బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. నెల రోజులుగా ప్రత్యక్షనరకాన్ని అనుభవించాం’’అంటూ దళారులు చేతుల్లో మోసపోయిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అరబ్షేక్ల చెర నుంచి మహిళలను చంద్రాయణగుట్ట పోలీసులు సురక్షితంగా ఆదివారం నగరానికి తీసుకువచ్చారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, బాధిత మహిళలతో కలసి వివరాలను విలేకరులకు తెలిపారు. గుంటూరు జిల్లా వడ్లమూడి గ్రామానికి చెందిన ముంతాజ్ బేగం (37), హసీనా బేగం (35) హైదరాబాద్ పాతబస్తీలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటూ కూలీ నాలీ చేసుకొని జీవిస్తున్నారు. వీరి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న బార్కాస్ ప్రాంతానికి చెందిన దళారులు ఫాతిమా, ఇంతియాజ్ దుబాయిలో వంటింటి పనులు చేస్తే నెలకు 20-30 వేలు ఇస్తారని నమ్మించారు. తమ జీవితాలతో పాటు పిల్లలు జీవితాలు మెరుగుపడతాయని ముంతాజ్ బేగం, హసీనా బేగం ఆశపడ్డారు. గత నెల 19న అబుదాబీ వెళ్లారు. ఇందుకు వీరి నుంచి దళారులు 30 వేల చొప్పున వసూలు చేశారు. తీరా అక్కడికి వెళ్లాక వారికి అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. వారిని గదిలో బంధించి చిత్ర హింసలకు గురి చేశారు. షేక్లు లైంగిక కార్యకలాపాలకు పాల్పడడంతో పాటు చిత్రహింసలకు గురిచేశారు. పది రోజుల కిందట ముంతాజ్ బేగానికి గుండెనొప్పి వచ్చింది. ఆమెకు ఏదైనా జరిగితే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన షేక్లు ముంతాజ్ బేగాన్ని హైదరాబాదాద్కు పంపించారు. ఇక్కడికి వచ్చిన అనంతరం ఆమె షేక్ల అరాచకాలపై చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బార్కాస్ చెందిన దళారులు ఫాతిమా, ఇంతియాజ్లను అదుపులోకి తీసుకున్నారు. షేక్ల చెరలో ఉన్న హసీనా బేగాన్ని ఇక్కడికి తీసుకువచ్చేలా ఒత్తిడి చేశారు. దుబాయి దళారులతో వారు మాట్లాడి హసీనాను హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 7 గంటలకు హసీనా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. పోలీసులు వెంటనే హసీనాను పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. ఈ ఘటనపై ఇంతియాజ్, ఫాతిమాలపై చీటింగ్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీసీపీ స్యతనారాయణ తెలిపారు. దళారులు ఇంకెవరినైనా ఇలా దుబాయికి పంపించారా...? అన్న విషయాన్ని విచారిస్తున్నామన్నారు. ముంతాజ్, హసీనాలను చిత్ర హింసలకు గురి చేసిన షేక్లకు కూడా సీఐడీ సహకారంతో నోటీసులు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తుచేస్తున్నామన్నారు.విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, చాంద్రాయణగుట్ట అదనపు ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేందర్, ఎస్సై లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. బాధితురాలిని సురక్షితంగా తీసుకొచ్చేలా కృషి చేసిన చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్, ఎస్సైలకు రివార్డులను అందిస్తామని డీసీపీ తెలిపారు. తిరిగి వస్తామనుకోలేదు: బాధిత మహిళలు తాము తిరిగి ప్రాణాలతో వస్తామనుకోలేదని బాధిత మహిళలు ముంతాజ్, హసీనా కన్నీటిపర్యంతమయ్యారు. రోజుల తరబడి భోజనం పెట్టకుండా చిత్ర హింసలకు గురిచేశారని, నిర్భందించి చెప్పుకోలేని పనులు చేయించారన్నారు. తమ లాంటి వారు చాలా మంది తెలియక దుబాయికి వెళ్లి నరకం అనుభవిస్తున్నారన్నారు. అలాంటి వారందరిని ఇక్కడికి తీసుకురావాలన్నారు. ఒంటిపై నగలను లాక్కొన్నారని హసీనా ఆవేదన చెందింది. -
ఫెరారీ నుంచి హైబ్రీడ్ సూపర్కారు
అబుదాబి: లగ్జరీ స్పోర్ట్స్ కార్లకు ప్రసిద్ధి చెందిన ఫెరారీ సంస్థ తొలిసారి హైబ్రీడ్ సూపర్కారు ఎఫ్ఎక్స్ఎక్స్ కె కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. అబుదాబిలోని యాస్ మరీనా సర్క్యూట్లో ఆదివారం ఈ కారును ఆవిష్కరించనున్నారు. తమ వార్షిక రేసింగ్ ఈవెంట్ ఫెరారీ మోండియాలి చాలెంజ్ కార్యక్రమం సందర్భంగా ఈ కారును విడుదల చేస్తారు. ఇటలీకి చెందిన ఫెరారీ 21 ఏళ్ల తర్వాత తమ వార్షిక ఈవెంట్ను యూరోప్ ఆవల నిర్వహించడం ఇదే ప్రథమం. తమ కొత్త కారును టెస్ట్ డ్రైవ్ చేసేందుకు ఎంపిక చేసిన అతి కొద్దిమందికి మాత్రమే ఫెరారీ కంపెనీ ఆహ్వానం పంపించింది. పరిమితంగానే తయారు చేయనున్న ఈ హైబ్రీడ్ సూపర్కారు ధర ఒక్కోటి 25 లక్షల యూరోలు (రూ. 19 కోట్లు) ఉంటుందని సమాచారం. -
పిల్లవాడి దగ్గర నేర్చుకున్న ఐఐటి విద్యార్థులు!
అబూ దబీ : బెనారస్ ఐఐటి విద్యార్థులు వినూత్న పోరాటం చేస్తున్నారు. కాశీ కేంద్రంగా ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం చేపట్టారు. యునైటెడ్ అరబిక్ ఎమిరేడ్స్ (యూఏఈ) రాజధాని అబూ దబీ నగరంలో ఉంటున్న ఓ భారతీయ బాలుడిని ఆదర్శంగా తీసుకొని దాదాపు పది వేల మంది విద్యార్థులు ఈ ఉద్యమం చేపట్టారు. 5 లక్షల కాగితపు సంచులు తయారు చేసి కాశీలో పంపిణీ చేయాలని ఈ విద్యార్థులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అబ్దుల్ ముఖీట్ అనే 13 ఏళ్ల బాలుడు ఇక్కడ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం చేపట్టాడు. 8 గ్రేడ్ చదువుతున్న ఈ విద్యార్థి అనేక అవార్డులు గెలుచుకున్నాడు. ఈ బాలుడు చేపట్టిన ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం, కాగితపు బ్యాగుల తయారు చేయడానికి చేస్తున్న కృషిని వీడియోలో చూసి తాము ఉత్తేజితులమైనట్లు ఐఐటి విద్యార్థులు తెలిపారు. ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమ ప్రచారానికి అబ్దుల్ ముఖీట్ బ్యాండ్ అంబాసిడర్ అని చెప్పడానికి తాము గర్వపడుతున్నట్లు ఐఐటి విద్యార్థులు చెప్పారు. ఈ ఉద్యమం ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి అబ్దుల్ ముఖీట్ గురువారం బెనారస్ వెళుతున్నాడు. ** -
ఎతిహాద్ విమానంలో సాంకేతిక లోపం
చెన్నై: అబుదాబి చెందిన ఎతిహాద్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో చెన్నై విమానాశ్రయంలో నిలిపివేశారు. సోమవారం ఉదయం విమానం పైకి ఎగరడానికి సిద్దమవుతున్న సమయంలో సాంకేతిక సమస్య వచ్చింది. దీన్ని గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని ఆపేశాడని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. విమానంలోని 117 మంది ప్రయాణికులకు వసతి కల్పించామన్నారు. సమస్యను పరిష్కరించిన తర్వాత వీరిని తమ గమ్యస్థానాలకు పంపిచనున్నారు. -
ప్రపంచవ్యాప్త మిస్ ఇండియా పోటీకి అనుజ్ఞ
న్యూఢిల్లీ: అబుదాబిలో ఈ నెల 20న జరగనున్న ప్రపంచవ్యాప్త మిస్ ఇండియా అందాల పోటీకి సూరత్కు చెందిన అనుజ్ఞ శర్మ ఎంపికైంది. ఈ పోటీలో 40 దేశాలకు చెందిన 40 మంది విజేతలు కిరీటం కోసం పోటీపడతారు. ప్రస్తుతం పుణెలో నివసిస్తున్న డాక్టర్ అనుజ్ఞ.. శనివారం రాత్రి పుణెలోనే జరిగిన భారత విభాగం మిస్ ఇండియా వరల్డ్వైడ్ పోటీలో విజేతగా నిలిచింది. ముంబైకి చెందిన కృష్ణ వర్మ తొలి రన్నరప్, గోవాకు చెందిన ఆద్రే డిసిల్వా రెండో రన్నరప్గా నిలిచారు. 40 దేశాల్లోని భారత సంతతికి చెందిన యువతుల మధ్యన జరిగిన పోటీల్లో విజేతలు అబుదాబిలో జరిగే ప్రపంచవ్యాప్త మిస్ ఇండియా కిరీటం కోసం పోటీపడనున్నారు. కాగా, అబుదాబిలో జరిగే పోటీలోని విజేతకు రూ. 4 లక్షల 73 వేల రూపాయలు దక్కనున్నాయి. -
బెంగళూరు ‘ఢమాల్’
70 పరుగులకే కుప్పకూలిన కోహ్లి సేన రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం ప్రవీణ్ తాంబే స్పిన్ మాయాజాలం ఐపీఎల్లోనే అత్యంత ఖరీదైన బ్యాటింగ్ లైనప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ది. దీనికి తగ్గట్లే మూడు మ్యాచ్ల పాటు చెలరేగిన స్టార్ ఆటగాళ్లు... అనూహ్యంగా నాలుగో మ్యాచ్లో ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా ఐపీఎల్లో తమ అత్యల్ప స్కోరు (70)కు ఆలౌటైన బెంగళూరు... రాజస్థాన్ చేతిలో ఓడింది. అబుదాబి: జట్టులో స్టార్ ఆటగాళ్లు లేకపోయినా.. క్రమశిక్షణతో, కలిసికట్టుగా ఆడితే ఎంతటి బలమైన జట్టునైనా మట్టి కరిపించవచ్చని రాజస్థాన్ రాయల్స్ మరోసారి నిరూపించింది. కోహ్లి, డివిలియర్స్, యువరాజ్ వంటి ‘కాస్ట్లీ’ ఆటగాళ్లతో కూడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును అతి తక్కువ స్కోరుకే కుప్పకూల్చి అలవోక విజయం నమోదు చేసింది. మరోవైపు తొలి రెండు మ్యాచ్ల్లో అద్భుత విజయాలతో దూకుడు ప్రదర్శించిన కోహ్లిసేన.. వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. షేక్ జాయెద్ స్టేడియంలో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ను ఓడించింది. తొలుత బెంగళూరు 15 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్లో బెంగళూరుకు ఇది అత్యల్ప స్కోరు కాగా, మొత్తంగా మూడో అత్యల్ప స్కోరు కావడం విశేషం. కెప్టెన్ కోహ్లి (21; 3 ఫోర్లు), స్టార్క్ (18; 2 ఫోర్లు), రాంపాల్ (13; 1 సిక్స్)లు మినహా ఇతర బ్యాట్స్మెన్ ఎవరూ రెండంకెల స్కోరు నమోదు చేయలేకపోయారు. అనంతరం రాజస్థాన్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలోనే 71 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రహానే (19 బంతుల్లో 23; 4 ఫోర్లు), వాట్సన్ (24 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్లు)లు సమయోచితంగా ఆడి జట్టును గెలిపించారు. రాజస్థాన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. తొలి ఓవర్ నుంచే.. విధ్వంసక ఓపెనర్ గేల్ మరోసారి డగౌట్కే పరిమితం కాగా, బెంగళూరుకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. బిన్నీ వేసిన ఈ ఓవర్లో నాలుగో బంతికే తకవాలే (0) వెనుదిరగ్గా, మరుసటి బంతికే పార్థివ్ (1) రనౌటయ్యాడు. ఆ వెంటనే రిచర్డ్సన్ బౌలింగ్లో పేలవమైన షాట్తో యువరాజ్ (3) స్లిప్స్లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తరువాతి బంతికే రిచర్డ్సన్.. డివిలియర్స్ (0)ను బౌల్డ్ చేయడంతో బెంగళూరు 5 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో సచిన్ రాణాతో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. ఆరో ఓవర్లో రాణా (3) వాట్సన్ బౌలింగ్లో అవుటయ్యాడు. దీంతో పవర్ప్లే ఆరు ఓవర్లలో బెంగళూరు 5 వికెట్లకు 22 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత తాంబే స్పిన్ మాయాజాలం మొదలైంది. కోహ్లి సహా నాలుగు వికెట్లు తీసిన తాంబే ఐపీఎల్లో తన ఉత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. రాయల్స్ అలవోకగా.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్కు తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో రహానే దూకుడైన ఆరంభాన్నిచ్చాడు. అయితే అ తరువాత కూడా అదే జోరు కొనసాగించిన రహానేను ఐదో ఓవర్లో స్టార్క్ ఔట్ చేశాడు. ఆపై వెంట వెంటనే శామ్సన్ (2) రనౌట్ కావడం, కరుణ్ నాయర్ (8)నూ స్టార్క్ వెనక్కి పంపడంతో బెంగళూరు శిబిరంలో ఆశలు చిగురించాయి. క్రీజులోకొచ్చిన కెప్టెన్ షేన్ వాట్సన్ కొద్దిసేపు జాగ్రత్తగా ఆడినా.. ఆ తరువాత రెండు సిక్స్లు బాది కోహ్లిసేనకు మరో అవకాశం లేకుండా చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: పార్థివ్ పటేల్ రనౌట్ 1, తకవాలే (సి) శామ్సన్ (బి) బిన్నీ 0, విరాట్ కోహ్లి (సి) సౌతీ (బి) తాంబే 21, యువరాజ్ (సి) స్మిత్ (బి) రిచర్డ్సన్ 3, డివిలియర్స్ (బి) రిచర్డ్సన్ 0, రాణా (బి) వాట్సన్ 3, ఆల్బీ మోర్కెల్ (సి) స్మిత్ (బి) తాంబే 7, స్టార్క్ (సి) బిన్నీ (బి) భాటియా 18, రాంపాల్ (సి) సౌతీ (బి) తాంబే 13, దిండా ఎల్బీడబ్ల్యూ (బి) తాంబే 0, చహల్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు 4, మొత్తం: (15 ఓవర్లలో ఆలౌట్) 70. వికెట్ల పతనం: 1-1, 2-1, 3-5, 4-5, 5-17, 6-28, 7-46, 8-62, 9-70, 10-70. బౌలింగ్: బిన్నీ 1-0-1-1, సౌతీ 3-0-16-0, రిచర్డ్సన్ 4-0-18-2, వాట్సన్ 2-1-5-1, తాంబే 4-0-20-4, రజత్ భాటియా 1-0-7-1. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: అజింక్యా రహానే (సి) పార్థివ్ పటేల్ (బి) స్టార్క్ 23, కరుణ్ నాయర్ (సి) పార్థివ్ (బి) స్టార్క్ 8, శామ్సన్ రనౌట్ 2, అభిషేక్ నాయర్ నాటౌట్ 11, వాట్సన్ (సి) డివిలియర్స్ (బి) చహల్ 24, స్టువర్ట్ బిన్నీ నాటౌట్ 0, ఎక్స్ట్రాలు 3, మొత్తం: (13 ఓవర్లలో 4 వికెట్లకు) 71. వికెట్ల పతనం: 1-31, 2-35, 3-36, 4-68. బౌలింగ్: స్టార్క్ 4-0-29-2, రాంపాల్ 4-0-16-0, చహల్ 3-1-17-1, అశోక్ దిండా 2-0-8-0. -
చెన్నైపై ‘మ్యాక్స్’ దాడి
మ్యాక్స్వెల్ సంచలన ఇన్నింగ్స్ సూపర్ కింగ్స్పై పంజాబ్ విజయం రాణించిన మిల్లర్ స్మిత్, మెకల్లమ్ శ్రమ వృథా అబుదాబి: టి20ల్లో ఏ బంతికి ఎలాంటి షాట్ ఆడాలో మ్యాక్స్వెల్కు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చేమో. ఎందుకంటే చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అతను ఆడని షాట్ లేదంటే అతిశయోక్తి కాదు. సంప్రదాయ ఆటతీరుతో పాటు స్వీప్, రివర్స్ స్వీప్, స్విచ్ హిట్, స్కూప్... ఇలా భిన్నమైన షాట్లతో పరుగుల వరద పారించాడు. ఫలితంగా పొట్టి ఫార్మాట్లో 200ల పైచిలుకు స్కోరును నీళ్లు తాగినంత సులువుగా ఛేదించి కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు అద్వితీయ విజయాన్ని అందించాడు. షేక్ జాయెద్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఐపీఎల్-7 లీగ్ మ్యాచ్లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో చెన్నైకి షాకిచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసింది. బ్రెండన్ మెకల్లమ్ (45 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), స్మిత్ (43 బంతుల్లో 66; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడారు. చివర్లో రైనా (19 బంతుల్లో 24; 2 ఫోర్లు), ధోని (11 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్సర్) విజృంభించారు. బాలాజీ 2, అక్షర్ పటేల్, అవానా చెరో వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ (43 బంతుల్లో 95; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా... మిల్లర్ (37 బంతుల్లో 54 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. సెహ్వాగ్ (10 బంతుల్లో 19; 4 ఫోర్లు) విఫలమయ్యాడు. అశ్విన్ 2, నెహ్రా, స్మిత్ చెరో వికెట్ పడగొట్టారు. మ్యాక్స్వెల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మెకల్లమ్ మెరుపులు పంజాబ్ పేసర్లు ప్రభావం చూపకపోవడంతో ఓపెనర్లు స్మిత్, మెకల్లమ్ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించారు. 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెయిలీ క్యాచ్ జారవిడచడంతో ఊపిరి పీల్చుకున్న మెకల్లమ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. పవర్ ప్లేలో ఈ జోడి 7 బౌండరీలు, 3 సిక్సర్లు బాదడంతో చెన్నై ఖాతాలో 70 పరుగులు సమకూరాయి. ధావన్ బౌలింగ్లో ఫోర్, సిక్సర్తో మెకల్లమ్ 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తర్వాత స్ట్రయిక్ రొటేట్ చేయడంతో చెన్నై 10 ఓవర్లలో 102 పరుగులు చేసింది. పటేల్ బౌలింగ్లో మెకల్లమ్ షాట్కు ప్రయత్నించి మ్యాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్కు 123 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఎదుర్కొన్న తొలి బంతికే ఫోర్ కొట్టిన రైనా అదే స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రెండో ఎండ్లో దూకుడు తగ్గించని స్మిత్... మాక్స్వెల్ బౌలింగ్లో ఓ ఫోర్, సిక్సర్ కొట్టి 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే బాలాజీకి వికెట్ సమర్పించుకున్నాడు. ధోని వచ్చి రావడంతోనే రెండు ఫోర్లు కొట్టాడు. రైనా భారీ షాట్లకు ప్రయత్నించకపోవడంతో కీలకమైన 18వ ఓవర్లో జాన్సన్ 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాతి ఓవర్లో రైనా స్కూప్ చేయబోయి ఫైన్లెగ్లో సెహ్వాగ్ చేతికి చిక్కాడు. చివరి ఓవర్లో ధోని, బ్రేవో రెండు సిక్సర్లు కొట్టడంతో చెన్నై 200 పరుగుల మైలురాయిని దాటింది. కెప్టెన్ ఆఖరి బంతికి అవుటయ్యాడు. మ్యాక్స్వెల్ సెంచరీ మిస్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన సెహ్వాగ్ చకచకా 4 బౌండరీలు కొట్టి టచ్లో కనిపించాడు. కానీ 9 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ నుంచి బయటపడ్డా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. పుజారా, వీరూ వరుస ఓవర్లలో అవుట్కాగా కొద్దిసేపటికే అక్షర్ కూడా వెనుదిరిగాడు. మ్యాక్స్వెల్ వేగంగా ఆడటంతో తొలి ఆరు ఓవర్లలో పంజాబ్ 3 వికెట్లకు 64 పరుగులు చేసింది. 37 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ మ్యాక్స్వెల్ ఆ తర్వాత మిల్లర్తో కలిసి వీరవిహారం చేశాడు. బౌలర్ ఎవరైనా లెక్క చేయకుండా బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 14వ ఓవర్లో బద్రీ క్యాచ్ డ్రాప్ చేయడంతో బ్రతికి బయటపడ్డ మ్యాక్స్వెల్ (77) మిల్లర్ను ఓ ఎండ్లో నిలబెట్టి ఓవర్కు ఒకటి, రెండు ఫోర్లు కొట్టాడు. చివరకు స్మిత్ బౌలింగ్లో వరుసగా సిక్సర్, ఫోర్ కొట్టి తర్వాతి బంతికే క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఈ జోడి నాలుగో వికెట్కు 63 బంతుల్లో 115 పరుగులు జోడించింది. 32 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన మిల్లర్... జడేజా బౌలింగ్లో రెండు సిక్సర్లు కొట్టాడు. చివరకు 12 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో బెయిలీ రెండు ఫోర్లతో 7 బంతులు మిగిలి ఉండగానే లాంఛనం పూర్తి చేశాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) బెయిలీ (బి) బాలాజీ 66; బి. మెకల్లమ్ (సి) మ్యాక్స్వెల్ (బి) అక్షర్ పటేల్ 67; రైనా (సి) సెహ్వాగ్ (బి) అవానా 24; ధోని (సి) రిషీ ధావన్ (బి) బాలాజీ 26; డ్వేన్ బ్రేవో నాటౌట్ 8; ఎక్స్ట్రాలు: 14; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1-123; 2-161; 3-185; 4-205 బౌలింగ్: అక్షర్ పటేల్ 4-0-34-1; అవానా 3-0-35-1; జాన్సన్ 4-0-47-0; బాలాజీ 4-0-43-2; రిషీ ధావన్ 3-0-21-0; మ్యాక్స్వెల్ 2-0-23-0 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: పుజారా ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 13; సెహ్వాగ్ (బి) నెహ్రా 19; మ్యాక్స్వెల్ (బి) స్మిత్ 95; అక్షర్ పటేల్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 2; మిల్లర్ నాటౌట్ 54; బెయిలీ నాటౌట్ 17; ఎక్స్ట్రాలు: 6; మొత్తం: (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1-31; 2-38; 3-52; 4-167 బౌలింగ్: నెహ్రా 3-0-24-1; మోహిత్ శర్మ 2.5-0-35-0; అశ్విన్ 4-0-41-2; నేగి 3-0-37-0; జడేజా 4-0-43-0; స్మిత్ 2-0-25-1. -
రాయల్స్ రాజసంగా...
సన్రైజర్స్పై గెలుపుతో రాజస్థాన్ శుభారంభం రాణించిన రహానే ఐపీఎల్-7 కొత్త లుక్తో అదరగొడదామని బరిలోకి దిగిన సన్రైజర్స్కు తొలి మ్యాచ్లోనే షాక్ తగిలింది. పేలవ ఆటతీరుతో బ్యాటింగ్లో విఫలం కాగా... బౌలర్లు ప్రారంభంలో వికెట్లు తీసినా ఆ తర్వాత లయ తప్పారు. మరోవైపు గత సీజన్లో ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా తమ దృష్టంతా విజయంపైనే అని వాట్సన్ సేన నిరూపించుకుని ఏడో సీజన్లో శుభారంభం చేసింది. అబుదాబి: 31 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అజింక్యా రహానే (53 బంతుల్లో 59; 6 ఫోర్లు) నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లు పట్టు సాధిస్తున్న వేళ ఓపిగ్గా ఎదురు నిలిచి జట్టుకు కావాల్సిన పరుగులు సాధించాడు. చివర్లో ఉత్కంఠ నెలకొన్నా... స్టువర్ట్ బిన్నీ (32 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్) జట్టును ఒడ్డున పడేశాడు. తద్వారా షేక్ జాయెద్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఐపీఎల్-7 మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ నెగ్గింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (34 బంతుల్లో 38; 3 ఫోర్లు; 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 32; 1 ఫోర్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. లోకేశ్ రాహుల్ (18 బంతుల్లో 20; 1 ఫోర్; 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ధావల్ కులకర్ణి, రిచర్డ్సన్, భాటియాలకు రెండేసి వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ 19.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 135 పరుగులు చేసింది. రహానేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. ఆది నుంచీ తడబాటే.. తొలి ఓవర్లోనే సన్రైజర్స్ ఓపెనర్ ఫించ్ (2) వికెట్ను కోల్పోయింది. దీంతో బరిలో స్టార్ హిట్టర్లు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్లున్నా ఆటలో జోరు కనిపించలేదు. వికెట్ నెమ్మదించడంతో ఈ జోడి ఆచితూచి ఆడుతూ సింగిల్స్కే పరిమితమైంది. తొలి పవర్ప్లేలో 41 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొమ్మిదో ఓవర్లో ధావన్ బ్యాట్ నుంచి ఇన్నింగ్స్లో తొలి సిక్స్ నమోదైంది. ఆ తర్వాత ఓవర్లో బౌండరీతో టచ్లో కనిపించినా 12వ ఓవర్లో రజత్ భాటియా బౌలింగ్లో డీప్ స్క్వేర్లెగ్లో క్యాచ్ ఇచ్చాడు. దీంతో రెండో వికెట్కు 55 పరుగులు నమోదయ్యాయి. భాటియా తన మరుసటి ఓవర్లో వార్నర్ను అవుట్ చేయడంతో సన్రైజర్స్ కష్టాల్లో పడింది. స్లాగ్ ఓవర్లలో తుపాన్ ఆటతీరును చూపే డారెన్ స్యామీ (6) జట్టును ఆదుకుంటాడని ఆశించినా తనూ నిరాశపరిచాడు. లోకేశ్ రాహుల్ ఉన్న కాసేపు వేగంగా ఆడినా వీరిద్దరు నాలుగు బంతుల వ్యవధిలో పెవిలియన్కు చేరారు. చివర్లో వేణుగోపాల్ (12 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్) బ్యాట్ ఝుళిపించడంతో సన్రైజర్స్కు ఆమాత్రం స్కోరైనా వచ్చింది. నిదానంగా... రాజస్థాన్ను కూడా సన్రైజర్స్ తొలి ఓవర్లోనే దెబ్బతీసింది. స్టెయిన్ వేసిన తొలి బంతినే బౌండరీకి తరలించిన నాయర్ (4) మూడో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో ఓవర్లో యువ ఆటగాడు సామ్సన్ (3) ధావన్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న రహానేకు తోడు కెప్టెన్ షేన్ వాట్సన్ (3) రాకతో ఇన్నింగ్స్ కుదుటపడుతుందనుకున్నప్పటికీ ఏడో ఓవర్లో ఇషాంత్ శర్మ గట్టి దెబ్బ తీశాడు. కీపర్కు క్యాచ్ ఇచ్చి వాట్సన్ వెనుదిరిగాడు. రహానే, స్టువర్ట్ బిన్నీ జోడి మధ్య ఓవర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. స్యామీ బౌలింగ్లో బిన్నీ భారీ సిక్స్, ఫోర్ బాది స్కోరు వేగాన్ని పెంచాడు. ఆ తర్వాత వీరి ఇన్నింగ్స్లో దూకుడు కనిపించకపోయినప్పటికీ పిచ్ పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగారు. ఎక్కువగా సింగిల్స్కే పరిమితమవుతూ లక్ష్యాన్ని అందుకున్నారు. స్టెయిన్ వేసిన 15వ ఓవర్లో వరుస బంతుల్లో రెండు ఫోర్లు సాధించిన రహానే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాతమిశ్రా తన వరుస ఓవర్లలో రహానే, హాడ్జ్ను అవుట్ చేసి మ్యాచ్లో ఉత్కంఠ రేపాడు. అయితే బిన్నీ, ఫాల్క్నర్ (2 బంతుల్లో 8; 2 ఫోర్లు) లాంఛనాన్ని పూర్తి చేశారు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) రిచర్డ్సన్ (బి) కులకర్ణి 2; ధావన్ (సి) రిచర్డ్సన్ (బి) భాటియా 38; వార్నర్ (సి) రిచర్డ్సన్ (బి) భాటియా 32; రాహుల్ (సి) రహానే (బి) కులకర్ణి 20; స్యామీ (సి) సామ్సన్ (బి) రిచ ర్డ్సన్ 6; వేణుగోపాల్రావు నాటౌట్ 16; కరణ్ శర్మ (సి) హాడ్జ్ (బి) రిచర్డ్సన్ 4; స్టెయిన్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 133 వికెట్ల పతనం: 1-2; 2-77; 3-82; 4-108; 5-111; 6-130. బౌలింగ్: కులకర్ణి 4-0-23-2; రిచర్డ్సన్ 4-0-25-2; ఫాల్క్నర్ 3-0-27-0; తాంబే 4-0-23-0; భాటియా 4-0-22-0; బిన్నీ 1-0-7-0. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: నాయర్ ఎల్బీడబ్ల్యు (బి) స్టెయిన్ 4; రహానే (సి) ఫించ్ (బి) మిశ్రా 59; సామ్సన్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 3; వాట్సన్ (సి) రాహుల్ (బి) ఇషాంత్ 3; బిన్నీ నాటౌట్ 48; హాడ్జ్ (సి) స్యామీ (బి) మిశ్రా 1; ఫాల్క్నర్ నాటౌట్ 8; ఎక్స్ట్రాలు 5; మొత్తం (19.3 ఓవర్లలో ఆరు వికెట్లకు) 135 వికెట్ల పతనం: 1-4; 2-15; 3-31; 4-108; 5-111, 6-121 బౌలింగ్: స్టెయిన్ 4-0-29-2; భువనేశ్వర్ 3.3-0-21-1; ఇషాంత్ 4-0-29-1; స్యామీ 2-0-19-0; మిశ్రా 4-0-26-2; కరణ్ శర్మ 2-0-8-0. ఐపీఎల్లో నేడు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ X ముంబై ఇండియన్స్ సా. గం. 4.00 నుంచి కోల్కతా నైట్ రైడర్స్ X ఢిల్లీ డేర్ డెవిల్స్ రా. గం. 8.00 నుంచి వేదిక: దుబాయ్ సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం -
‘గోల’ను మిస్సవుతున్నాం
ఐపీఎల్ సందడిపై ఆటగాళ్ల పెదవి విరుపు అబుదాబి: చీర్ లీడర్స్ వయ్యారాలు వలకబోస్తున్నా... అభిమానుల్లో ఊపు లేదు. స్టేడియాలు నిండుతున్నా... హోరెత్తించే అరుపులు, కేరింతలు లేవు. అభిమానుల సందడి కనబడుతున్నా... ఆకట్టుకునే వేషాలుగానీ, హుషారెత్తించే అభినయాలుగానీ కనడబడటం లేదు. మ్యాచ్ మధ్యలో చెవులు దద్దరిల్లే మ్యూజిక్ సౌండ్స్, సూపర్హిట్ పాటల హోరు అసలే లేదు. ఓవరాల్గా యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్లు చప్పగా సాగిపోతుండటంపై కొంత మంది ఆటగాళ్లు పెదవి విరుస్తున్నారు. భారత్తో పోలిస్తే ఇక్కడ వాతావరణ చాలా భిన్నంగా ఉందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ అన్నాడు. ప్రేక్షకుల ఉత్సాహం, ఆ సందడి, ఊపు ఇక్కడ మచ్చుకైన కనబడటం లేదని వాపోతున్నాడు. అయితే టోర్నీ ముందుకు సాగేకొద్దీ కొద్దిగానైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నాడు. షాన్ మార్ష్ కూడా మిల్లర్ వ్యాఖ్యలతో ఏకీభవించినా... దుబాయ్లోని దగ్గరి ప్రాంతాల్లో తిరగడం కొత్త అనుభూతినిస్తోందన్నాడు. యూఏఈలో వేడి అధికంగా ఉన్నా... ప్రస్తుతం బాగానే ఉందన్నాడు. ఇది ఇలాగే కొనసాగితే బాగుంటుందని కోరుకుంటున్నాడు. మళ్లీ భారత్లో మ్యాచ్లు మొదలైతే సందడి ఉంటుందని ఆటగాళ్లు ఆశిస్తున్నారు. -
మండు వేసవిలో నిండు వినోదం
-
‘ఎడారి’లో ఫుల్ క్రేజ్
అబుదాబి: విదేశాల్లో ఐపీఎల్కు ఆదరణ ఉంటుందా..? 2009లో ఎన్నికల కారణంగా దక్షిణాఫ్రికాలో జరిగినప్పుడు పెద్దగా ప్రేక్షకులు లేరు. కాబట్టి ఈసారి పరిస్థితి ఏమిటి? యూఏఈని వేదికగా ఎంచుకోక ముందు ఉన్న సందేహం ఇది. కానీ ఒక్కసారి యూఏఈలోని మూడు వేదికలను ఖరారు చేసిన తర్వాత అక్కడి అభిమానుల నుంచి వచ్చిన స్పందనతో బీసీసీఐ ఊపిరి పీల్చుకుంది. టిక్కెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. భారత్ను మించి యూఏఈలో బ్లాక్లో టిక్కెట్లు కొంటున్నారు. తొలి మ్యాచ్ ముంబై, కోల్కతాల మధ్య పోరుకు వాస్తవ విలువ (80 దిర్హామ్లు)కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువగా 1500 దిర్హామ్లకు బ్లాక్లో టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఈ ఒక్క మ్యాచ్కే కాదు... మొత్తం యూఏఈలోని మూడు వేదికల్లో జరిగే 20 మ్యాచ్లకు ఇదే స్థాయిలో డిమాండ్ ఉంది. ఇన్నేళ్లుగా తమ దేశంలో చూడని పాపులర్ లీగ్ టోర్నీ కోసం వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్లను తిలకించినా...ఐపీఎల్లో పెద్ద సంఖ్యలో ఉండే స్టార్ క్రికెటర్ల సందడిని కోల్పోకూడదని వారు భావిస్తున్నారు. సంపన్నులైన స్థానికులకు ఇదో రకం కొత్త సరదా కాబట్టి వారూ ఐపీఎల్పై అమితాసక్తి కనబరుస్తున్నారు. అంతా మనోళ్లే... ఉపాధి కోసం యూఏఈ వెళ్లిన భారత్, పాక్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల అభిమానులే ఈ టోర్నీకి శ్రీరామరక్ష కానున్నారు. సహజంగానే మనోళ్ల క్రికెట్ పిచ్చి అరబ్ దేశంలో ప్రతిఫలిస్తోంది. ‘నా స్వస్థలం రాంచీ. డైనమైట్ ధోని ఆటను ప్రత్యక్షంగా తిలకించేందుకు నాకు ఇదో మంచి అవకాశం. అతను ఆడే ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాను’ అని రాజేందర్ సోరేన్ అనే అభిమాని అన్నాడు. నేపాల్కు చెందిన కారు డ్రైవర్ మదన్ బహదూర్...స్టేడియం వరకు ప్యాసింజర్లతో వెళతానని, మ్యాచ్ చూసి మళ్లీ ప్యాసింజర్లతో తిరిగి వస్తానని చెబుతున్నాడు. పాకిస్థాన్ వీరాభిమాని అయిన 35 ఏళ్ల మొహమ్మద్ హుస్సేన్ కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నాడు. ‘భోజనం చేయకుండా ఉండగలను కానీ క్రికెట్ మ్యాచ్ చూడకుండా ఉండలేను. మా ఆటగాళ్లు ఐపీఎల్లో లేరని తెలుసు. అయితే ఎవరు ఆడినా ఆడకున్నా ఆటపైనే నా ప్రేమంతా’ అని తన అభిమానం చాటుకున్నాడు. ఐపీఎల్తో తమ వ్యాపారం కూడా మెరుగుపడుతుందంటున్న మరో బంగ్లాదేశ్ డ్రైవర్... షకీబ్ ఆడుతున్నాడు కాబట్టి కోల్కతాకే తన మద్దతు ప్రకటించాడు. ఎండ సమస్యే గత కొన్నేళ్లుగా షార్జా, అబుదాబి, దుబాయ్లు పాకిస్థాన్ జట్టుకు సొంత మైదానంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రధాన కార్యాలయం ఉన్న దుబాయ్లో ఇన్నేళ్లకు ఒక పెద్ద పండగ జరుగుతుండటం అన్ని వర్గాలను ఆనంద పరుస్తోంది. ముఖ్యంగా అక్కడి కొన్ని వ్యాపార సంస్థలు ప్రత్యేకంగా ఐపీఎల్ ప్రచారం కోసమే జట్లతో తాత్కాలిక ఒప్పందాలు చేసుకున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడి వాతావరణమే ఇప్పుడు ఐపీఎల్కు పెద్ద సవాల్గా కనిపిస్తోంది. తీవ్రమైన ఎండ వేడిమి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టవచ్చు. భారత్లో ఈ సీజన్లో 35-38 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ఆడేందుకే విదేశీ ఆటగాళ్లు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ వేడిని వారు తట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో క్రికెటర్లు చెమటోడ్చక తప్పదు. పెద్ద మైదానాలు అసలు ఆట విషయానికి వస్తే ఇక్కడి మూడు మైదానాలు కూడా భారత్లోని గ్రౌండ్లతో పోలిస్తే చాలా పెద్దవి. కాబట్టి బ్యాట్కు, బంతికి మధ్య సమాన పోటీ ఉంటూ ఆసక్తికర మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. అయితే పిచ్లు నెమ్మదిగా ఉంటూ ఇటీవల బౌన్స్ కూడా తగ్గింది. కాబట్టి భారీ స్కోర్లు ఎక్కువగా నమోదు కాకపోవచ్చు. షార్జా స్టేడియంలో 9 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు జరిగితే రెండు సార్లు 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. -
సచిన్ సాధన!
అబుదాబి: ఒకటా...రెండా...దాదాపు పాతికేళ్లు అతనికి క్రికెట్టే ప్రపంచం. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా తన అస్త్రాలు వదిలి ఆటకు దూరం కాగలడా...ఇతరుల సంగతేమో కానీ సచిన్ టెండూల్కర్కు మాత్రం అది సాధ్యం కావడం లేదు. అందుకే ఐకాన్గా ఉంటూ సూచనలిస్తే చాలని ముంబై ఇండియన్స్ బాధ్యతలు అప్పగిస్తే, తాను మాత్రం మరో విధంగా ఆలోచిస్తున్నాడు. మంగళవారం ఇక్కడ జరిగిన ముంబై జట్టు ప్రాక్టీస్ సెషన్లో మాస్టరే హైలైట్గా నిలిచాడు. మ్యాచ్లో తానే ఆడబోతున్నాడా అన్నట్లుగా అతను అరగంటకు పైగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. తనకు అలవాటైన రీతిలో సహాయక సిబ్బందికి ‘త్రో’ విసరమని చెప్పి మరీ సాధన చేశాడు. తన కెరీర్ సమయంలో ఎలా ప్రాక్టీస్ చేసేవాడో అదే తరహాలో సీరియస్గా సాధన చేయడం ముంబై జట్టును కూడా ఆశ్చర్య పరచింది. -
నమ్మకం నిలబెట్టాలి
గవాస్కర్ ముందున్న సవాల్ షార్జాలో బుకీల బెడద ఎక్కువ స్పాన్సర్ల కోసం ఫ్రాంచైజీల తంటాలు మరో 6 రోజుల్లో ఐపీఎల్-7 సునీల్ మనోహర్ గవాస్కర్ క్రికెటర్గా తన కెరీర్లో ఎన్నో అత్యుత్తమ మ్యాచ్లు ఆడారు. ఓపెనర్ స్థానంలో బరిలోకి దిగి ప్రత్యర్థులపై చెలరేగి తన జట్టుకు కొండంత అండగా నిలిచారు. సన్నీ జోరుతో ఆ తర్వాత మిడిలార్డర్పై భారం తగ్గేది. ఇతర సభ్యులు ప్రశాంతంగా తమ ఇన్నింగ్స్ను కొనసాగించేవారు. కెరీర్ ఆసాంతం భారత్ ఎవరికంటే తక్కువ కాదు అని నిరూపించేందుకు ఆయన ప్రయత్నించారు. ఇప్పుడు కార్యనిర్వాహకుడిగా ఆయన బరిలోకి దిగనున్నారు. గత ఆరేళ్లతో పోలిస్తే ఈసారి ఐపీఎల్ను మరింత విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత గవాస్కర్పై ఉంది. సాక్షి క్రీడా విభాగం ‘జూన్ 2న ఫైనల్ ముగిసిన తర్వాత ఐపీఎల్ అత్యుత్తమ క్రికెట్ చూపించింది అనే భావనే తప్ప అభిమానుల మదిలో మరో ఆలోచన రాకూడదు. వివాదాలు లేని లీగ్గా దీనిని నిర్వహించేందుకు నా తరఫు నుంచి పూర్తిగా శ్రమిస్తాను’ అబుదాబిలో ఐపీఎల్ గురించి ప్రకటన చేస్తూ గవాస్కర్ చేసిన వ్యాఖ్య ఇది. ఆటగాడిగా, కెప్టెన్గా, వ్యాఖ్యాతగా, కొన్నాళ్ల పాటు కోచ్గా కూడా పని చేసిన గవాస్కర్ ఒక అడ్మినిస్ట్రేటర్గా మాత్రం ఎన్నడూ వ్యవహరించలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సరికొత్త బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త కొత్తగా... క్రికెట్ దిగ్గజంగా గుర్తింపు ఉన్నా... రిటైర్ అయిన 27 ఏళ్ల తర్వాత కూడా పాలనా పరమైన వ్యవహారాల్లో మాత్రం సన్నీకి ఉన్న అనుభవం తక్కువ. సుప్రీంకోర్టు సూచించింది కాబట్టి ఆయన బాధ్యత చేపట్టారే తప్ప స్వచ్ఛందంగా కాదు. ఒడ్డున కూర్చొని వ్యాఖ్యలు చేసేవాళ్లు నీళ్లలోకి దిగితే కాని లోతు తెలీదు. ఇంత కాలం ఆయన చేసిందదే. కాబట్టి ఐపీఎల్ నిర్వహణ అంత సులభమైన వ్యవహారం కాదు. బోర్డులో అందరూ అండగా నిలుస్తారని... పైగా ఐపీఎల్కు గవర్నింగ్ కౌన్సిల్ ఉంది కాబట్టి సన్నీకి పెద్దగా బాధ్యత ఉండకపోవచ్చు అని కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టిలో ఐపీఎల్ అంటే గవాస్కర్ మాత్రమే. అందులో ఎలాంటి మంచి జరిగినా, చెడు జరిగినా పేరు ఆయనకే. పైగా సుప్రీం కోర్టు ఒక పెద్ద బాధ్యతను నమ్మకంతో అప్పజెప్పింది కాబట్టి దానిని నిలబెట్టుకోవాల్సింది కూడా గవాస్కరే. ఈ ప్రయత్నంలో సన్నీ తొలి అడుగే తప్పుగా వేశారు. రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ మ్యాచ్లను జైపూర్లో నిర్వహించకుండా అహ్మదాబాద్కు తరలించి పక్కా బీసీసీఐ ప్రతినిధిలాగే పని చేశారు. మున్ముందు ఇలాంటివి జరగకుండా ఆయన పని చేయాలి. ఫిక్సింగ్ కోటలో... సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్ మొదటి దశ మరో దేశంలో నిర్వహించాల్సి వచ్చింది. అయితే దీనికి వేదికగా యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని ఎంచుకోవడమే ఆశ్చర్యం కలిగించింది. మ్యాచ్ ఫిక్సింగ్లకు అడ్డా అయిన షార్జాలో కూడా మ్యాచ్లు జరగనున్నాయి. ఫిక్సింగ్ ఆరోపణలతోనే భారత్ 2000 తర్వాత అక్కడ వన్డే మ్యాచ్లు ఆడటం మానేసింది. ఆ తర్వాత ఆరేళ్లకు అబుదాబిలో మరో రెండు వన్డేలు ఆడటం మినహా టీమిండియా అటువైపు తిరిగి చూడలేదు. కానీ ఐపీఎల్ పుణ్యమా అని ఇప్పుడు మనవాళ్లు అక్కడ అడుగు పెడుతున్నారు. ఫిక్సింగ్ ఆరోపణలతో అతలాకుతలమైన మరుసటి ఏడాదే షార్జాలాంటి చోట్ల మ్యాచ్లకు సిద్ధం కావడం కత్తి మీద సాములాంటిదే. ఇందుకోసం సన్నీ బృందం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ‘ఎలాంటి సమస్యలు రాకుండా ఐపీఎల్ నిర్వహించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని స్థానిక పోలీసులతో పాటు ఐసీసీ అధికారులు కూడా మాకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా యూఏఈ ప్రభుత్వం ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది’ అని గవాస్కర్ వెల్లడించారు. నిజంగా ఎలాంటి బయటి వ్యక్తుల ప్రమేయం లేకుండా ఐపీఎల్ పారదర్శకంగా జరిగితే సన్నీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. స్పాన్సర్లు ఎటు వైపు... ఐపీఎల్ ఆరంభానికి వారం రోజుల ముందు వరకు కూడా ఐదు జట్లు తమ ప్రధాన స్పాన్సర్లతో ఒప్పందానికి రాలేకపోయాయి. లీగ్కు వచ్చిన చెడ్డ పేరు లేదా తొలి దశ మ్యాచ్లు బయట జరుగుతుండటం కూడా దీనికి కారణం కావచ్చు. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించగానే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో తమ కాంట్రాక్ట్ను పునరుద్ధరించుకోరాదని ‘లక్స్ కోజి’ నిర్ణయించుకుంది. గతంతో పోలిస్తే ఈసారి ఐపీఎల్ జట్లను స్పాన్సర్ చేసేందుకు ఎవరూ అమితాసక్తి చూపించడం లేదు. లీగ్లో వివాదాలు కూడా కారణం కావచ్చు. ‘అనూహ్యంగా ప్రతీ ఒక్కరు బేరమాడుతున్నారు. స్పాన్సర్షిప్ మొత్తాలను భారీగా తగ్గించాల్సి రావచ్చు’ అని ఒక జట్టు సీఈఓ వెల్లడించారు. ఆటగాళ్ల జెర్సీల ముందు భాగంలో కనిపించే ప్రధాన స్పాన్సర్షిప్ కోసం కూడా పెద్దగా పోటీ లేదు. ఢిల్లీ డేర్డెవిల్స్తో కొనసాగరాదని నిర్ణయించుకున్నట్లు ‘ముత్తూట్ ఫైనాన్స్’ ప్రకటించింది. రాజస్థాన్ రాయల్స్తో సుదీర్ఘ అనుబంధాన్ని ‘అల్ట్రాటెక్ సిమెంట్’ తెంచేసుకుంది. ఒక జట్టు టీ షర్ట్పై కనీసం ఆరు రకాల ప్రకటనలను ప్రదర్శించే అవకాశం ఉంది. మ్యాచ్లకు సమయం చేరువైనా పంజాబ్ జట్టు ఈ ఆరింటిలో ఒక్కదానికీ స్పాన్సర్ను తెచ్చుకోలేకపోయిందంటే పరిస్థితి అర్థమవుతోంది. ‘మా ఉత్పత్తులకు విదేశాల్లో ప్రచారం కోరుకోవట్లేదు. టీవీల్లో లోగో కనిపించడం వేరు. ప్రధానంగా స్థానిక మార్కెట్ను దృష్టిలో పెట్టుకొనే మేం స్పాన్సర్ చేస్తాం’ అని ఒక వ్యాపార సంస్థ ప్రతినిధి చెప్పారు. అయితే చాలా జట్లు తొలి మూడు ఐపీఎల్లు... ఆ తర్వాతి మూడు ఐపీఎల్ల చొప్పునే ఒప్పందం కుదుర్చుకున్నాయి. చీర్ లీడర్స్ ఉన్నట్లే (నా) కొన్నాళ్ల క్రితం బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జగ్మోహన్ దాల్మియా ఐపీఎల్ను బాగు చేస్తామంటూ ఎన్నో కొత్త కొత్త వాగ్ధానాలు, సూచనలు చేశారు. అందులో భాగంగా చీర్ గర్ల్స్ను కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించారు. కానీ ఎంత గొప్పగా దాని గురించి చెప్పారో ఇప్పుడు అంతే వేగంగా తమ నిర్ణయంపై వెనక్కి మళ్లినట్లుంది. మీ చీర్ గర్ల్స్ను సిద్ధం చేసుకోండంటూ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు నిర్వాహకుల నుంచి సమాచారం కూడా వెళ్లిపోయింది. దీనిని రెండు జట్ల యజమానులు ధ్రువీకరించారు. ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిశ్వాల్ అయితే దీనిపై మరీ ఆశ్చర్యంగా స్పందించారు. ‘అసలు ఐపీఎల్లో చీర్ లీడర్స్ను ఎప్పుడూ నిషేధించారు’ అని ఆయన ప్రశ్నించడాన్ని చూస్తే ఈసారి కూడా చిందులు తప్పవేమో అనిపిస్తోంది. అయితే యూఏఈ చట్టాలు చీర్గర్ల్స్ నృత్యాలను అనుమతిస్తాయో లేదో మ్యాచ్ జరిగే వరకు చెప్పలేం. -
ఆన్లైన్లో 40 వేల ఐపీఎల్ టికెట్ల విక్రయం
అబుదాబీ: ఐపీఎల్-7 టికెట్ల విక్రయం జోరందుకుంది. ఇక్కడ జరిగే తొలి విడత మ్యాచ్ల కోసం ఆన్లైన్లో సుమారు 40 వేల టికెట్లు విక్రయించినట్లు లీగ్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ నెల 16 నుంచి 30 వరకు యూఏఈలోని మూడు వేదికల్లో తొలి విడత మ్యాచ్లు జరగనున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్లో అందుబాటులో ఉంచిన టికెట్లకు అనూహ్య స్పందన లభించిందని ఐపీఎల్ పాలక మండలి చైర్మన్ రంజీబ్ బిస్వాల్ తెలిపారు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ ఈస్ట్ మాట్లాడుతూ యూఏఈలో క్రికెట్కు పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని చెప్పారు. కేవలం మూడు రోజుల్లోనే ఇంతమొత్తంలో టికెట్లు అమ్ముడవడం గొప్ప విషయమన్నారు. -
జేపీ జల విద్యుత్ కేంద్రాలు టీఏక్యూఏ చేతికి!
న్యూఢిల్లీ/అబుదాబి: దేశీయ సంస్థ జైప్రకాష్ పవర్ వెంచర్స్కు చెందిన రెండు జల విద్యుత్ కేంద్రాలను అబుదాబి నేషనల్ ఎనర్జీ కంపెనీ(టీఏక్యూఏ) ఆధ్వర్యంలో ఏర్పాటైన కన్సార్షియం కొనుగోలు చేయనుంది. ఇందుకు 160 కోట్ల డాలర్లను(రూ. 10,000 కోట్లు) చెల్లించనున్నట్లు టీఏక్యూఏ తెలిపింది. దీనిలో ఈక్విటీ రూపేణా 61.6 కోట్ల డాలర్లను(రూ. 3,820 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. మిగిలిన మొత్తం ప్రధానంగా సెక్యూర్డ్(నాన్రికోర్స్) రుణం రూపేణా ఉంటుందని తెలిపింది. డీల్లో భాగంగా హిమాచల్ప్రదేశ్లోని కినౌర్ జిల్లాలోగల బాస్పా రెండో దశ, కర్చాం వాంగ్టూ ప్లాంట్లను సొంతం చేసుకోనుంది. వీటి సంయుక్త విద్యుదుత్పత్తి సామర్థ్యం 1,391 మెగావాట్లుకాగా, ఈక్విటీ పెట్టుబడులలో టీఏక్యూఏ 51% వాటాను సమకూరుస్తుంది. త ద్వారా రెండు జల విద్యుత్ ప్లాంట్లకు సంబంధిం చిన యాజ మాన్యం, కార్యకలాపాల నిర్వహణలను అబుదాబీ నేషనల్ ఎనర్జీ కంపెనీ సొంతం చేసుకోనుంది. కన్సార్షియంలో కెనడాకు చెందిన సంస్థాగత ఇన్వెస్టర్ సంస్థకు(పేరు వెల్లడించలేదు) 39% వాటా, ఐడీఎఫ్సీ ఆల్టర్నేటివ్స్ ఇండియా ఇన్ఫ్రా ఫండ్కు 10% వాటా ఉంటుందని టీఏక్యూఏ వివరించింది. ఈ కొనుగోలు ద్వారా ఇండియా జల విద్యుత్ రంగంలో తాము అతిపెద్ద ప్రయివేట్ కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు టీఏక్యూఏ తెలిపింది. -
నేడు భారత్-పాక్ మ్యాచ్
అబుదాబి: అండర్-19 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు నేడు (శనివారం) తమ తొలి మ్యాచ్ ఆడనుంది. దాయాది పాకిస్థాన్తో జరిగే ఈ మ్యాచ్తో తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది. మరోవైపు గురువారం ప్రారంభమైన ఈ టోర్నీలో జింబాబ్వే జట్టు 6 వికెట్ల తేడాతో కెనడాపై గెలిచింది. న్యూజిలాండ్పై శ్రీలంక 49 పరుగుల తేడాతో నెగ్గింది. అలాగే విండీస్పై 94 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా.. యూఏఈపై 213 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ గెలిచాయి. -
మాథ్యూస్ అజేయ సెంచరీ
అబుదాబి: రోజంతా ఆడి ఒక్క వికెట్ మాత్రమే చేజార్చుకున్న శ్రీలంక.. పాక్తో జరుగుతున్న తొలి టెస్టులో కోలుకుంది. కెప్టెన్ మాథ్యూస్ (282 బంతుల్లో 116 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో చెలరేగడంతో శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి లంక రెండో ఇన్నింగ్స్లో 148 ఓవర్లలో 5 వికెట్లకు 420 పరుగులు చేసింది. మాథ్యూస్తో పాటు ప్రసన్న జయవర్ధనే (48 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఓవరాల్గా లంక 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 186/4 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన లంక జట్టులో చండిమాల్ (166 బంతుల్లో 89; 12 ఫోర్లు), మాథ్యూస్ నిలకడగా ఆడారు. వీరిద్దరు ఐదో వికెట్కు 138 పరుగులు జోడించారు. ఈ దశలో జునైద్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి చండిమాల్ అవుటయ్యాడు. కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్న మాథ్యూస్ ఆరో వికెట్కు ప్రసన్నతో కలిసి అజేయంగా 96 పరుగులు జోడించి రోజును ముగించాడు. -
పట్టు బిగించిన పాక్
అబుదాబి: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ జట్టు క్రమంగా పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంక రెండో ఇన్నింగ్స్లో 61.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 186 పరుగులు చేసింది. ఓపెనర్ కౌశల్ సిల్వ (177 బంతుల్లో 81; 11 ఫోర్లు), సంగక్కర (99 బంతుల్లో 55; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. క్రీజులో చండిమాల్ (36 బంతుల్లో 24 బ్యాటింగ్; 4 ఫోర్లు) ఉన్నాడు. జునైద్ ఖాన్, బిలావల్ భట్టికి రెండేసి వికెట్లు దక్కాయి. ప్రస్తుతం లంక ఏడు పరుగుల ఆధిక్యంలో ఉంది. మ్యాచ్కు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో శుక్రవారం వీలైనంత త్వరగా మిగిలిన లంక ఆటగాళ్లను పెవిలియన్కు చేర్చితే లక్ష్యాన్ని ఛేదించేందుకు పాక్కు తగినంత సమయం ఉంటుంది. అంతకుముందు 327/4 ఓవర్నైట్ స్కోరుతో తమ తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన పాక్ 129.1 ఓవర్లలో 383 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 179 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. చివరి వరుస బ్యాట్స్మెన్ త్వరగానే పెవిలియన్కు చేరడంతో 56 పరుగులకే చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. మిస్బా 135 (306 బంతుల్లో; 16 ఫోర్లు; 1 సిక్స్) పరుగులు చేశాడు. ఎరంగ, హెరాత్లకు మూడేసి, లక్మల్కు రెండు వికెట్లు దక్కాయి. -
యూనిస్, మిస్బా సెంచరీలు
అబుదాబి: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్ భారీ ఆధిక్యాన్ని అందుకుంది. సీనియర్ ఆటగాళ్లు యూనిస్ ఖాన్ (198 బంతుల్లో 136; 19 ఫోర్లు, 1 సిక్స్), మిస్బావుల్ హక్ (250 బంతుల్లో 105 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీలతో చెలరేగడంతో బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ప్రస్తుతం పాక్ 123 పరుగులు ముందంజలో ఉంది. యూనిస్, మిస్బా నాలుగో వికెట్కు 218 పరుగులు జోడించడం విశేషం. 69 పరుగుల వద్ద హెరాత్ బౌలింగ్లో జయవర్ధనే క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన మిస్బా కెరీర్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 46/1 పరుగులతో ఆట ప్రారంభించిన పాక్ తక్కువ వ్యవధిలోనే హఫీజ్ (11), షహజాద్ (38) వికెట్లు కోల్పోయినా యూనిస్, మిస్బా భాగస్వామ్యంతో కోలుకుంది. -
డీఆర్ఎస్ స్థానంలో ఓఆర్ఎస్!
అబుదాబి: ఇటీవలి కాలంలో తరచూ విమర్శలనెదుర్కొంటున్న అంపైర్ నిర్ణయ పునస్సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)ని మరింత మెరుగుపరిచేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నడుం బిగించింది. ప్రస్తుతం మైదానంలో అంపైర్ నిర్ణయాలను ఆటగాడు అప్పీల్ చేసుకుంటే థర్డ్ అంపైర్ రీప్లే ద్వారా సమీక్షించి నిర్ణయం ప్రకటిస్తున్నారు. అయితే ఈ పద్ధతిని మార్చి మ్యాచ్ ప్రసారమవుతున్న అన్ని కెమెరాలను ఉపయోగించుకుని ఓ స్వతంత్ర వ్యక్తి చేత నిర్ణయాలను వెలువరించే పద్ధతిని ఐసీసీ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని అఫీసియేట్ రివ్యూ పద్ధతి (ఓఆర్ ఎస్)గా పిలుస్తున్నారు. -
వెటెల్ విజయ ‘సప్తమి’
అబుదాబి: ఇప్పటికే ఈ సీజన్ ఫార్ములావన్ టైటిల్ ఖరారయినా... రెడ్బుల్ రేసర్ సెబాస్టియన్ వెటెల్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. గత వారం ఢిల్లీలో చూపిన ప్రదర్శననే కొనసాగిస్తూ అబుదాబి గ్రాండ్ప్రిలో విజయం సాధించాడు. ఈ సీజన్లో వెటెల్కు ఇది వరుసగా ఏడో విజయం కాగా, ఓవరాల్గా 11వది. 55 ల్యాప్ల అబుదాబి రేస్ను వెటెల్ గంటా 38 నిమిషాల 6.106 సెకన్లలో పూర్తి చేశాడు. రెడ్బుల్కే చెందిన మార్క్ వెబెర్కు రెండో స్థానం దక్కగా, మెర్సిడెజ్ డ్రైవర్ రోస్బర్గ్ మూడో స్థానంలో నిలిచాడు. పోల్ పొజిషన్లో దక్కిన అగ్రస్థానాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వెబర్ విఫలమయ్యాడు. రెండో స్థానంతో ప్రారంభించిన వెటెల్ తొలి మలుపునుంచే ముందుకు దూసుకుపోయి చివరి వరకు దానిని కొనసాగించాడు. తొలి స్థానంపై ఆశలు వదులుకున్న వెబర్, తన వెనకే దూసుకొస్తున్న రోస్బర్గ్పైనే దృష్టి నిలిపి రేస్ను కొనసాగించడంతో వెటెల్ పని మరింత సులువైంది.ఈ విజయంతో వెటెల్... వరుసగా ఏడు రేస్లు నెగ్గిన మైకేల్ షుమాకర్ (2004) సరసన చేరాడు. సీజన్లో మిగిలి ఉన్న రెండు రేస్లను కూడా నెగ్గితే వరుసగా తొమ్మిది సార్లు గెలిచిన ఆల్బర్టో అస్కారి (1952-53) రికార్డును వెటెల్ సమం చేస్తాడు. మరో వైపు తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (2011లో 11 రేస్లు) కూడా సెబాస్టియన్ సమం చేశాడు. చివరి రెండూ గెలిస్తే సీజన్లో అత్యధిక విజయాల షుమాకర్ (13) రికార్డును కూడా అతను అందుకోగలడు. టాప్-10లో ఫోర్స్ డ్రైవర్లు మరో వైపు ఫోర్స్ ఇండియా జట్టు ప్రదర్శన ఇండియన్ గ్రాండ్ప్రి కంటే మెరుగు పడింది. సీజన్లో రెండో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ ఫోర్స్ డ్రైవర్ పాల్ డి రెస్టా ఆరో స్థానంలో నిలిచాడు. మరో డ్రైవర్ ఆడ్రియన్ సుటిల్ 10వ స్థానం సాధించాడు. ఫోర్స్ ఇండియాకు ఇది వరుసగా రెండో డబుల్ పాయింట్ ఫినిష్ కావడం విశేషం. -
యూఏఈలో భారతీయ వృద్ధుడి మృతదేహం లభ్యం
అబుదాబిలోని ఎలక్ట్రా స్ట్రీట్లోని ఎల్డరాడొ సినిమా బిల్డింగ్లో 62 సంవత్సరాల వృద్ధుడి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని గల్స్ న్యూస్ మంగళవారం వెల్లడించింది. మృతుడు అతని భార్యతో కలసి దాదాపు ఏడాది కాలంగా ఆ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారని తెలిపింది. మృతుడిని అతడి భార్య సీబీ, భార్యను అతడు జీబీ అని పిలుచుకునే వారని ఆ అపార్ట్మెంట్ వాసులు తమ విచారణలో వెల్లడించారన్నారు. మృతుడు స్వస్థలం భారత్లోని ఉత్తరప్రదేశ్ అని పోలీసు తెలిపారని పేర్కొంది. అయితే మృతుడి భార్య అబుదాబిలోని ప్రముఖ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారని వివరించింది. కాగా మృతుడు కింద పడి మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. భారతీయుడు మృతి చెందినట్లు నిన్న ఉదయం స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అతడి మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.