world
-
World TB Day: క్షయకు కళ్లెం పడేనా!
కర్నూలుకు చెందిన 45 ఏళ్ల మహిళ క్షయ వ్యాధితో కోలుకోలేక కన్నుమూసింది. మందులపై సరైన అవగాహన లేక మొదట్లో కాస్త బాగా అనిపించగానే మందులు మానేసింది. ఆమెకు షుగర్ కూడా ఉండటంతో వ్యాధి తిరగబెట్టి ఎండీఆర్ టీబీగా రూపాంతరం చెందింది. తర్వాత మందులు వాడినా కోలుకోలేక మృతిచెందింది. ఈ మందులు ఎలా వాడాలో వైద్యులు, సిబ్బంది అవగాహన కలి్పంచకపోవడం వల్లే ఆమె కన్నుమూయాల్సి వచ్చింది. – కర్నూలు(హాస్పిటల్)ఎంతో మంది క్షయ వ్యాధికి మందులు వాడుతూ మధ్యలో ఆపేసి, ఆ తర్వాత మొండి టీబీతో మరణిస్తున్నారు. క్షయ బాధితులు మొదటిసారి మందుల వాడకం ప్రారంభించగానే కొందరికి కడుపులో తిప్పుతుంది. ఇందుకోసం కొందరు వైద్యులు గ్యాస్ట్రబుల్ మందులు ఇస్తారు. మరికొందరికి తీవ్ర ఆకలి అవుతుంది. ఇంకొందరికి రెండు నెలలు మందులు వాడగానే ఆరోగ్యం కుదుట పడుతుండటంతో బాగైందని భావించి మందుల ప్రభావానికి భయపడి మానేస్తున్నారు. కానీ మందులు మధ్యలో ఆపకూడదని, కచ్చితంగా 6 నుంచి 8 నెలలు వాడాలని చెప్పేవారు లేరు. గతంలో లాగా డాట్స్ విధానంలో ఇచ్చే మందుల పద్ధతి కూడా ఇప్పుడు లేకపోవడంతో రోగుల్లో తీవ్రత పెరిగిపోతోంది. నేడు వరల్డ్ టీబీ డే (ప్రపంచ క్షయ వ్యాధి అవగాహన దినం) సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లాలో ప్రతి 2 లక్షల నుంచి 2.5 లక్షల జనాభాకు ఒక టీబీ యూనిట్ చొప్పున 9 యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇందులో ఒక సీనియర్ టీబీ సూపర్వైజర్, సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ విధులు నిర్వహిస్తున్నారు. రోగులను పర్యవేక్షించేందుకు ప్రతి సూపర్వైజర్కు ఒక మోటార్ సైకిల్ ఇచ్చారు. దీంతో పాటు ప్రతి పీహెచ్సీలో ఎక్స్రే యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా క్షయ నిర్ధారణ చేయవచ్చు. గతేడాది 78,368 మందికి పరీక్షలు చేయగా 3,077 మందికి క్షయ నిర్ధారణ అయ్యింది. గత కేసులతో కలుపుకొని మొత్తం 4,571 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు 6 నుంచి 8 నెలల పాటు ఉచితంగా అందిస్తారు. గతేడాది క్షయ నుంచి కోలుకోలేక 104 మంది మరణించారు. వ్యాధినిర్దారణ ఇలా ! రెండు వారాలకు మించి దగ్గ, సాయంత్రం వేళల్లో జ్వరం, దగ్గితే గళ్ల పడటం, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, ఉమ్మిలో రక్తం పడటం వంటి లక్షణాలుంటే క్షయగా అనుమానించి సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాలి. రోగి గళ్లను వైద్య సిబ్బంది సేకరించి మైక్రోస్కోప్, ట్రూనాట్, సీబీ నాట్ మిషన్ల ద్వారా నిర్దారిస్తారు. పెరుగుతున్న ఎండీఆర్టీబీ కేసులు క్షయవ్యాధిలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ (ఎండీఆర్టీబీ) కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. క్షయ మందులపై అవగాహన లేక చాలా మంది కోర్సు మధ్యలోనే మానేస్తున్నారు. దీనివల్ల వ్యాధి తిరగబెట్టి మరింత మొండిగా తయారవుతోంది. అప్పుడు సాధారణ టీబీ మందులు పనిచేయవు. వారికి ఖరీదైన ఎండీఆర్ టీబీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఖరీదు రూ.2 లక్షల దాకా ఉంటుంది. ఈ మందులకు కూడా లొంగకపోతే బెడాక్విలిన్ అనే రూ.18 లక్షల విలువైన 11 నెలల కోర్సు మందును ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎండీఆర్ టీబీ రోగులు 135 మంది ఉండగా, బెడాక్విలిన్ మందులు వాడే వారు 52 మంది ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత మందులతో పాటు రోగి పోష కాహారం కోసం నెలకు రూ.వెయ్యి అందిస్తున్నారు. నిక్షయ్ మిత్ర ద్వారా సరుకులు నిక్షయ్ మిత్ర ద్వారా కో–ఆపరేటివ్, కార్పొరేట్, ప్రజాప్రతినిధులు, దాతల ద్వారా క్షయ రోగులకు అవసరమైన పోషకాహార కిట్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 129 సంస్థలు రిజిస్టర్ కాగా 2,117 మంది క్షయ రోగులను దత్తత తీసు కుని 12,045 పోషకాహార ప్యాకెట్లను అందజేశారు. నేడు అవగాహన సదస్సు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులో ఈ నెల 24వ తేదీన ర్యాలీ నిర్వహించనున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. క్షయ వ్యాధిపై వైద్య, ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నారు. క్షయను తగ్గించడమే లక్ష్యం జిల్లాలో ప్రస్తుతం ప్రతి 3 వేల మందికి పరీక్ష చేయగా 170 దాకా కేసులు బయటపడుతు న్నాయి. ఈ సంఖ్యను 50లోపు తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకకుండా చర్యలు తీసుకుంటు న్నాం. వ్యాధిసోకిన వారి ఇంట్లో అందరికీ టీబీ ప్రీవెంటివ్ థెరపీ కింద ఆరు నెలల పాటు మందులు ఉచితంగా ఇస్తున్నాం. ఇటీవల పెద్దవారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. –డాక్టర్ ఎల్.భాస్కర్, జిల్లా క్షయ నియంత్రణాధికారి, కర్నూలు -
మాది ఆనందం.. మీది అనుబంధం..
బహుశా ఫిన్లాండ్ అనే చిన్న దేశం గురించి మిగిలిన సందర్భాల్లో ఎవరూ ఎక్కువ ముచ్చటించుకోకపోవచ్చు.. కానీ యేటా మార్చి నెల్లో మాత్రం కచ్చితంగా ఆ దేశం టాక్ ఆఫ్ ది వరల్డ్ అవుతుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా హ్యాపీనెస్ ఇండెక్స్లో తొలిస్థానంలో ఫిన్లాండ్ నిలుస్తోంది కాబట్టి. అదే క్రమంలో తాజా హ్యాపీ నెస్ ఇండెక్స్లోనూ ఫిన్లాండ్ తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ దేశపు మహిళ.. మన తెలుగింటి కోడలు రైతా ముచ్చర్ల ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..ఫిన్లాండ్..‘హ్యాపీ’ బ్రాండ్.. మా దేశంలో పేద ధనిక గొప్ప తారతమ్యాలు ఉండవు. వాటికి చిన్నవయసులోనే పాతరేస్తారు.. దాదాపు 90 శాతం విద్యావ్యవస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటుంది. స్కూల్స్లో, కాలేజీల్లో డబ్బుల్ని బట్టి, హోదాల్ని బట్టి విద్యార్థులను విభజించడం ఉండదు కాబట్టి చిన్న వయసులోనే ఈక్వాలిటీ అనేది బాగా నాటుకుంటుంది. దీని వల్ల 100 శాతం అక్షరాస్యత సాధించగలిగారు. అలాగే చదువుతో పాటు ప్రతి నగరంలోనూ శిక్షణా సంస్థలు ఉంటాయి. విభిన్న రకాల కళలు, సామర్థ్యాలలో రాణించాలనుకునేవారు ఎవరైనా సరే వయసుతో ప్రమేయం లేకుండా నామమాత్రపు రుసుముతోనే నేరి్పంచే శిక్షణా సంస్థలు ఉంటాయి. అభిరుచులే.. ఆనంద మార్గాలు.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిరుచి/హాబీ మా దేశంలో తప్పకుండా ఉంటుంది. అక్కడ కూడా సినిమాలు ఉంటాయి కానీ.. వాటికన్నా కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలే ఎక్కువ ఉంటాయి. దానికి కళల పట్ల, కళారంగాల పట్ల వ్యక్తుల్లో ఉన్న అభిరుచే కారణం కావచ్చు.హరితం.. లంచాల రహితం.. పిల్లలను ప్రకృతికి దగ్గరగా ఉంచడానికి అక్కడ ప్రాధాన్యత ఇస్తారు. దాదాపు ప్రతి నగరానికీ ఆనుకుని ఒక అడవి ఉంటుంది. అందులో నెలకు ఒక్క రోజైనా పిల్లలను స్వేచ్ఛగా విహరించేలా చూస్తారు. రాజకీయాలు సంపాదనకు మార్గంగా భావించడం ఉండదు. రాజకీయాలనే కాదు, ఏ రంగమైనా సరే లంచగొండితనం జీరో అని చెప్పొచ్చు. తద్వారా ఒకరిని ఒకరు దోపిడీ చేస్తారనే భయాలు ఉండవు. అలాగే ఏ అర్ధరాత్రయినా సరే భద్రంగా సంచరించవచ్చు.. దొంగతనాలు, నేరాల రేటు కూడా అత్యంత స్వల్పం. ఒకరినొకరు అనుమానించుకోవడం, అపనమ్మకాలతో బంధాలు వంటివి అక్కడ కనపడవు. అన్నీ బాగున్నా.. అనుబంధాల్లో మీరే మిన్న.. ఫిన్లాండ్.. చాలా విషయాల్లో బాగున్నా.. అనుబంధాల్లో మాత్రం భారత దేశంతో పోలిస్తే వెనుకబడే ఉందని అనుభవపూర్వకంగా చెప్పగలను. తెలుగు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని నగరానికి వచి్చన యువతిగా.. ఈ దేశపు అనుబంధాలు నాకు ఆశ్చర్యానందాలను కలిగించాయి. పరస్పరం కేరింగ్ ఇక్కడ ఎక్కువ. వ్యక్తుల మధ్య అనుబంధాలకు ఇక్కడ ఇస్తున్నంత విలువ అక్కడ కనపడదు. అక్కడ విడాకుల సంఖ్య కూడా ఇక్కడితో పోలిస్తే ఎక్కువే. స్వేచ్ఛా ప్రియత్వం ఎక్కువగా ఉండడం వల్ల 20 నిమిషాల్లో పెళ్లి తంతు ముగించినట్టుగానే బంధాలకూ అంతే వేగంగా, సులభంగా వీడ్కోలు పలుకుతారు. దీనివల్లే అక్కడ ఒంటరితనం బాధితులు ఎక్కువగా కనబడతారు. అదే సమయంలో ఇక్కడ ఉన్నంత పోటీ తత్వం కూడా అక్కడ ఉండదు. అన్ని రకాలుగానూ ఇతరుల్ని మించి ఎదగాలనే తపన, ఆరాటం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ క్రమంలోనే తమ హోదాలు, అంతస్తులు.. వగైరాలను ప్రదర్శించుకోవడం కూడా జరుగుతుంటుంది. అక్కడ ఇలాంటివి ఏ మాత్రం కనిపించవు. -
ప్రపంచ వాతావరణ సంస్థ ఎలా ఏర్పాటైందంటే..! ఇప్పటికీ 75 ఏళ్లా..?
మనిషి జాతకాన్ని పంచాంగాలు చెబుతాయి. పంచాంగాలు చెప్పే జాతకాలను సైతం మార్చగల పంచభూతాల ‘మూడ్’.. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందో ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (ప్రవాస) చెబుతుంది! పంచాంగమైనా కాస్తా అటూఇటూ అవొచ్చు. లేదా, అసలెటూ కాకపోవచ్చు. పంచభూతాలు ఎలా ఉండబోతున్నాయో ‘ప్రవాస’ చెబితే మాత్రం... దాదాపుగా చెప్పిందే జరుగుతుంది. ‘మబ్బు పట్టి.. గాలి కొట్టి..’ఆకాశం మేఘావృతమై ఉంటుంది అంటే ‘ప్రవాస’ చెబితే ఆకాశం మేఘావృతమయ్యే ఉంటుంది! భూమి భగభగమంటుంది అంటే భగభగమన్నట్లే ఉంటుంది. చిరుజల్లులు, కుంభవృష్టి, ఈదురుగాలులు, సముద్రపు ఆటు పోట్లు, సముద్రం లోపలి సుడిగుండాలు, సముద్ర గర్భంలో బద్ధలయ్యే అగ్ని పర్వతాలు, వరదలు, విపత్తులు, ప్రకృతి విలయాలు అన్నిటినీ ‘ప్రవాస’ సరిగ్గా అంచనా వేస్తుంది. ‘‘ఎండలు విపరీతంగా ఉండబోతున్నాయి ఇంట్లోంచి బయటికి రావద్దు..’’ అని జాగ్రత్త చెబుతుంది. చలి తీవ్రత, చలి గాలులు పెరిగే ప్రమాదం ఉందని అప్రమత్తం చేస్తుంది. ‘‘వాయుగుండం పడబోతోంది సముద్రంలోకి వెళ్లొద్దు’’ అని మత్స్యకారులను హెచ్చరిస్తుంది. ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ప్రభుత్వాలకు ముందే సమాచారం అందిస్తుంది. ఇలా అనుక్షణం ప్రకృతి ధోరణులను గమనిస్తూ, ప్రపంచ దేశాల వాతావరణ శాఖలకు ఎప్పటికప్పుడు ఆ సమాచారం పంపుతూ, మానవాళి మనుగడలో అంత్యంత ప్రాముఖ్యం కలిగి ఉన్న ‘ప్రవాస’కు నేటికి 75 ఏళ్లంటే చరిత్రలో ఒక విశేషమే కదా. ‘ప్రవాస’ స్వయం ప్రతిపత్తి కలిగిన అంతర్జాతీయ సంస్థ. ఐక్యరాజ్య సమితి 1950 మార్చి 23న ఈ సంస్థను ఏర్పాటు చేసింది. అప్పట్నుంచీ ఏటా ఈ రోజును ‘వరల్డ్ మీటియరలాజికల్ డే’ (ప్రపంచ వాతావరణ దినోత్సవం)గా జరుపుకుంటున్నాం. సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది.‘మేఘాలు లేని ఆకాశం.. పూలగడ్డి లేని మైదానం’మనిషి పంచభూతాలను ‘డిస్టర్బ్’ చేయకుండా ఉంటే ‘ప్రవాస’కు గానీ, ఇండియన్ మీటియరలాజికల్ వంటి ఇతర దేశాల వాతావరణ శాఖలకు గానీ ఇంతగా ‘వాతావరణ జోస్యం’ చెప్పే అవసరం లేకపోయేది. కవులు కూడా ప్రకృతిపై కాస్త కనికరం చూపండి అని మనిషికి ఏనాటి నుండో చెబుతూనే వస్తున్నారు. ‘‘మేఘాలు లేని ఆకాశం.. పూలగడ్డి లేని మైదానం.. ’’ అంటాడు కవి. మేఘాలు లేకుండా ఆకాశం ఎందుకు ‘ఎండిపోతుంది’? మనిషి వల్లే. ఎండల్ని మండిచేస్తున్నాం కదా! ‘‘ప్రకృతిని ప్రేమించండి. ప్రకృతికి దగ్గరగా ఉండండి’’ అంటాడు కవి. ఎందుకు మనం అసలు ప్రకృతి వైపే చూడము? ప్లాస్టిక్ సౌఖ్యాల్లో మునిగిపోయాం కదా.. అందుకు! ‘‘చెట్లను చూడండి. పక్షులను చూడండి. నక్షత్రాలను చూడండి’’ అంటాడు కవి. చూస్తూనే ఉన్నాం. కానీ కూలిపోతున్న చెట్లను, అంతరించిపోతున్న పక్షులను, ధూళి కొట్టుకుని పోయిన నక్షత్రాలను!! ఎప్పటికి మనం మారుతాం? వాతావరణం పూర్తిగా మారిపోయి, మనిషి ఉనికే లేకుండా పోయాక, ఈ భూగోళపు పునఃప్రారంభంలోనా?‘ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరూ..’’ అని రాశారు కొసరాజు రాఘవయ్యగారు. నిజమే. ఊహించలేం. కానీ మనమింకా మహర్జాతకులంగానే మిగిలి ఉన్నాం అంటే వాతావరణ సంస్థలు, శాఖల వల్లనే. ఏం జరగబోతోందో అవి చక్కగా అంచనా వేసి మనల్ని ఆపదల నుండి తప్పిస్తున్నాయి. మన వల్ల వాతావరణానికి ఆపద రాకుండా మనమూ బాధ్యతగా ఉండాలి. ‘ప్రవాస’ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సెలెస్ట్ సౌలో ఇటీవలే జనవరి 15న ‘భారత వాతావరణ శాఖ’ (ఐ.ఎం.డి) 150 వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఇండియా వచ్చి వెళ్లారు! ఆ సందర్భంగా వాతావరణ మార్పులపై భారత్ సహసోపేతమైన చర్యలు తీసుకుంటోందని కూడా ఆమె ప్రశంసించారు. భారతదేశంలో 1875లో ఐ.ఎం.డి. ప్రారంభం అయింది. అంతకన్నా ముందు, ప్రపంచంలోనే తొలి ఐ.ఎం.డి. 1854లో బ్రిటన్లో ఏర్పాటైంది. అంటే ఇప్పటికి సుమారు 170 ఏళ్ల క్రితం. భారత్లో ఐ.ఎం.డి.ని నెలకొల్పింది కూడా బ్రిటిష్ వారే. 1864 కలకత్తా సైక్లోన్లో 80 వేల మంది ప్రాణాలు కోల్పోవటంతో, భవిష్యత్తులో మళ్లీ అంతగా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అప్పటి దేశ రాజధాని కలకత్తా ప్రధాన కార్యాలయంగా ఐ.ఎం.డి.ని నెలకొల్పారు. తర్వాత సిమ్లాకు, అక్కడి నుంచి పుణె, చివరికి 1944లో ఢిల్లీ ఐ.ఎం.డి.కి ప్రధాన కార్యాలయం అయింది. బ్రిటన్లోను, ఇండియాలోనూ ఐ.ఎం.డి.లు ఏర్పాటు చేయకముందు వరకు మేఘాల పోకడలు, జంతువుల ప్రవర్తనలు, రుతు చక్రాల ఆధారంగా రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతున్నదో అంచనా వేసేవారు. అలాగే ఉష్ణోగ్రత, పీడనం, తేమ, గాలి వేగాలను కొలిచే సాధనాలు కొన్ని ఉండేవి. వాతావరణ హెచ్చరిక కేంద్రాల స్థాపన తర్వాత తొలిరోజుల్లో వర్షపాత సమాచారాన్ని పోస్ట్ కార్డ్లపైన, టెలిగ్రాఫిక్ సిస్టమ్ల ద్వారా అందించేవారు. తర్వాత రాడార్లు, ఇప్పుడు జీపిఎస్.. వాతావరణ సూచనల సమాచారాన్ని చేరవేయటంలో ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. (చదవండి: ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’కి ప్రధాని మెదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..) -
World Poetry Day 2025 : పాలింకిపోవడానికున్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే!
ప్రపంచ కవితా దినోత్సవం (World Poetry Day) మనసుల్లోతుల్లో దాగివున్న భావాన్ని, అనుభవాన్ని, బాధను, లోతైన గాథల్ని వ్యక్తికరించేందుకు అనుసరించే ఒక ప్రక్రియ కవిత. హృదయాంతరాలలోని భావాలను అర్థవంతంగా, స్ఫూర్తివంతంగా ప్రకటించే సామర్థ్యం కొందరికి మాత్రమే లభించే వరం. సాంస్కృతిక ,భాషా వ్యక్తీకరణ రూపాలలో ఒకటైన ఈ ప్రపంచ కవితా దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకోవడం ఆనవాయితీ. 1999లో పారిస్లో జరిగిన 30వ సర్వసభ్య సమావేశంలో UNESCO (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రపంచ కవితా దినోత్సవాన్ని మొదలు పెట్టింది. 1999లో పారిస్లో జరిగిన 30వ సర్వసభ్య సమావేశంలో UNESCO (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఆమోదించారు. భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, సాంస్కృతిక మార్పిడి, . సృజనాత్మకతను ప్రోత్సహించడం కవిత్వం అంతరించిపోతున్న భాషలతో సహా భాషల గొప్పతనాన్ని చాటుకోవడం, సమాజాలకు స్వరాన్ని అందివ్వడం దీని ఉద్దేశం. విభిన్న సంస్కృతుల నుండి కవితలను పంచుకోవడం ద్వారా ఇతర ప్రజా సమూహాల అనుభవాలు, దృక్కోణాలపై అంతర్దృష్టులను పొందుతారు, సానుభూతి మరియు అవగాహనను పెంపొందిస్తారు.ప్రపంచ కవితా దినోత్సవం సందర్బంగా కొంతమంది మహిళా కవయిత్రుల కవితలను చూద్దాం. సమాజంలోని పురుషాహంకార ధోరణిని నిరసిస్తూ, ఆ భావజాలాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది స్త్రీవాద కవిత్వం. స్త్రీల భావాలను, బాధలను, స్త్రీలు మాత్రమే ప్రభావవంతంగా ఆవిష్కరింగలరు అనేదానికి అక్షర సత్యాలుగా అనేక కవితలు తెలుగు కవితా ప్రపంచంలో ప్రభంజనం సృష్టించాయి. స్త్రీ స్వేచ్ఛ, సాధికారత అన్ని రంగాల్లో సమాన హక్కులతో పాటు సంతానోత్పత్తి , మాతృత్వం మాటున దాగివున్న పురుషాధిక్యాన్నిచాటి చెప్పిందీ కవిత్వం.ఇందులో సావిత్రి, బందిపోట్లు కవిత మొదలు ఘంటశాల నిర్మల, కొండేపూడి నిర్మల, జయప్రభ, ఓల్గా, సావిత్రి, మందరపు హైమవతి, రజియా బేగం, పాటిబండ్ల రజని, బి. పద్మావతి, కె. గీత, ఎస్. జయ, శిలాలోలిత, విమల ఇలా ఎంతోమంది తమ కవితలను ఆవిష్కరించారు.తొలి స్త్రీవాద కవితగా 1972లో ఓల్గా రాసిన ‘ప్రతి స్త్రీ నిర్మల కావాలి’ అనే కవితను విమర్శకులు గుర్తించారు. ‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తానని పంతులుగారన్నప్పుడు భయమేసింది, ‘ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరమొచ్చినా సెలవు ఇవ్వడ’ని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది.ఇంకా ‘అయ్యో! పాలింకిపోవడానికున్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే ఎంత బాగుండు’ అన్న పాటిబండ్ల రజనీ కవితతో పాటు, ‘లేబర్ రూం* రైలు పట్టా మీద నాణెం విస్తరించిన బాధ, కలపను చెక్కుతున్న రంపం కింద పొట్టులా ఉండచుట్టుకున్న బాధ. ఇది ప్రసవ వేదన కవితగా మారిన వైనం. ఇంకా పైటను తగలెయ్యాలి, చూపులు, అబార్షన్ స్టేట్మెంట్, సర్పపరష్వంగం, రాజీవనాలు, కాల్గళ్స్ మొనోలాగ్, గుక్క పట్టిన బాల్యం, కట్టుకొయ్య, గృహమేకదా స్వర్గ సీమ, దాంపత్యం, నిషిద్ధాక్షరి, నీలి కవితలే రాస్తాం, విమల సౌందర్యాత్మకహింస లాంటివి ఈ కోవలో ప్రముఖంగా ఉంటాయి.ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మరో కవితమనసుకు అలసటతో చెమట పట్టినపుడోదేహంలోని నెత్తురు మరిగినపుడోగొంతు అక్షరాల సాయం తీసుకుంటుందివేదన కళగా మారిసృజనాత్మకతనులేపనంగా అద్దుకుంటుందిశిశిరాలు వెంటపడిఅదేపనిగా తరుముతున్నప్పుడువసంతం కోసం చేసే తపస్సుపెనవేసుకున్న శీతగాలి ఖాళీతనపు భావాగ్నిని అల్లుకున్నపుడుతుపాన్లతో చైతన్య పరిచేదిచందమామ మాగన్నుగా నిద్రిస్తున్నపుడుకళ్ళు మూసుకున్న ప్రపంచాన్నివేకువ గీతాలై నిద్రలేపేదిఎప్పటికీ కాలని, విడగొట్టినా చీలనిఅనంతం నిండా వ్యాపించినఅక్షయం కాని అక్షర సముదాయంఒకానొక మహావాక్యమైఅద్వితీయ కావ్యమై నిలుస్తుంది.– ర్యాలి ప్రసాద్ -
Filter Coffee: ఫిల్టర్ కాఫీ క్రేజ్ అలాంటిది మరి..అందుకే!
ఉదయాన్నే గుక్కెడు కాఫీ కడుపులో పడితే గానీ.. మనసు ప్రశాంతంగా ఉండదు. అసలా ఆ వాసన పీల్చగానే వచ్చే ఫీలింగే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మరి అలాంటి కాఫీ లవర్స్కు గుడ్న్యూస్. అదేంటంటే..ట్రావెల్ గైడ్ ప్లాట్ఫామ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన 'టాప్ 38 కాఫీస్ ఇన్ ది వరల్డ్' జాబితాలో మన ఫిల్టర్ కాఫీ ట్యాప్ ప్లేస్లో చోటు దక్కించుకుంది. ప్రపంచ టాప్ 38 కాఫీల జాబితాలో ఫిల్టర్ కాఫీకి రెండో స్థానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల కాఫీ గింజలు, పలురకాల కాఫీలు పలురకాలున్నప్పటికీ ఫిల్టర్ కాఫీ కున్నప్రత్యేకతే వేరు. అందులోనూ భారతీయులు ఇష్టంగా తాగేది మాత్రం ఫిల్టర్ కాఫీనే. మరీ ముఖ్యంగా సౌతిండియాలో ఫిల్టర్ కాఫీకి ఉన్న డిమాండే వేరు.ఫుడ్ అండ్ ట్రావెల్ టావెల్ గైడ్ ప్లాట్ఫాం టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ టాప్ 38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్ కాఫీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నది.కాఫీ రుచి,వాసన, కాఫీ తయారీకి ఉపయోగించే సాంప్రదాయ , ప్రత్యేకమైన పద్ధతుల ఆధారంగా ఈ ర్యాంకింగ్లను ఇచ్చారు.మొదటి ప్లేస్లో క్యూబాకు చెందిన ఎస్ప్రెస్సో నిలిచింది. దీన్ని డార్క్ రోస్టెడ్ గింజలతో కాఫీ కాచేటప్పుడు చక్కెర కలుపుతారు. దీనిని స్టవ్టాప్ ఎస్ప్రెస్సో మేకర్లో లేదా ఎలక్ట్రిక్ ఎస్ప్రెస్సో మెషీన్లో తయారు చేస్తారు. ఇండియన్ ఫిల్టర్ కాఫీని ఇండియన్ కాఫీ ఫిల్టర్ మెషీన్ని ఉపయోగించి తయారు చేస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ పైభాగంలో కాఫీ పౌడర్ వేసి, వేడి నీళ్లు పోస్తారు. దీని అడుగు భాగా ఉన్న చిన్న చిన్న రంధ్రాల ద్వారా, చుక్క చుక్కలుగా కింద వున్న మరో గిన్నెలో పడతాయి. దీన్ని పాలతో మరిగించి, చక్కెర కలుపుకొని తాగుతారు.ఘిక మూడు, నాలుగు స్థానాల్లో గ్రీస్కు చెందిన రెండు రకాల కాఫీలు చోటు దక్కించుకున్నాయి. ఇటలీకి చెందిన క్యాపచినో ఐదో స్థానంలో, తుర్కియేకు చెందిన టర్కిష్ కాఫీ ఆరోస్థానంలో, ఇటలీకే చెందిన కాఫీ రిస్ట్రెట్టో 7వ స్థానంలో, గ్రీస్కు చెందిన ఇంకో రకం ఫ్రాప్పె 8వ స్థానంలో, జర్మనీకి చెందిన ఐస్కాపీ 9వ స్థానంలో నిలువగా.. చివరిగా పదో స్థానంలో వియత్నాంకు చెందిన వియత్నాంకు చెందిన ఐస్డ్ కాఫీ నిలిచింది. -
World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ
అంతరించిపోతున్న వన్యప్రాణులను సంరక్షించే ఉద్దేశంతో ప్రతి ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే.. సహజ వనరుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం, వాటి పరిరక్షణకు పాటు పడాలనే భావనను పెంపొందించుకోవడం.ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం(World Wild Life Day) అనేది సమైక్యంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడటాన్ని ప్రోత్సహిస్తుంది. గతంలో అంతర్జాతీయ వన్యప్రాణుల వాణిజ్యాన్ని నిషేధించే ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం తీసుకువచ్చింది. తద్వారా అంతరించిపోతున్న జాతులను రక్షించేందుకు చర్యలకు ఉపక్రమించింది. 2013, డిసెంబర్ 20న ఐక్యరాజ్యసమితి తన జనరల్ అసెంబ్లీలో ప్రతి ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.అంతర్జాతీయ వన్యప్రాణుల వ్యాపారాన్ని నిషేధించే ప్రతిపాదనపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(United Nations General Assembly) 1973 మార్చి 3న సంతకం చేసింది. దీనికి గుర్తుగా అదేరోజున ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం నిర్వహణ ద్వారా అంతరించిపోతున్న జంతువులు, మొక్కలను సంరక్షించేందుకు ప్రేరణ కలుగుతుంది. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా2014, మార్చి 3న జరుపుకున్నారు.ప్రాముఖ్యతవన్యప్రాణులు అంతరించిపోవడం అనేది పర్యావరణ సమతుల్యతను మాత్రమే కాకుండా అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. అటవీ జంతువులు, మొక్కలు, వృక్షాల సంరక్షణ తప్పనిసరి. వాటిని సంరక్షించడం ద్వారా, మనిషి భూమిపై జీవితాన్ని సక్రమంగా కొనసాగించగులుగుతాడు. ఈ అంశాలను గుర్తించేందుకే వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణలో ఐక్యరాజ్యసమితి లక్ష్యాల దిశగా మనమంతా ముందుకు సాగాలి. వన్యప్రాణుల సంరక్షణకు పరిష్కారాలను కనుగొనాలి. అంతరించిపోతున్న జాతుల పరిరక్షణపై దృష్టి సారించాలి. వన్యప్రాణుల సంరక్షణకు వివిధ దేశాలు ఉమ్మడి ప్రయత్నాలు సాగించాలి. ఇది కూడా చదవండి: సోమనాథుని సన్నిధిలో ప్రధాని మోదీ పూజలు -
అబ్బురపరిచే అద్భుత చిత్రాలు.. చూస్తే వావ్ అనాల్సిందే! (ఫొటోలు)
-
ప్రపంచం చూపు భారత్ వైపు
భోపాల్: భారతదేశ ఆర్థిక ప్రగతి పట్ల ప్రపంచం మొత్తం ఎంతో ఆశాభావంతో ఉందని, ఇలాంటి పరిణామం మన దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత్ నుంచి సామాన్య ప్రజలతోపాటు ఆర్థికవేత్తలు, ప్రపంచ దేశాలు, సంస్థలు ఎంతో ఆశిస్తున్నాయని అన్నారు. మనపై ఎన్నో ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నాయని తెలిపారు. సోమవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ‘ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్–గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2025’లో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రపంచం భవిష్యత్తు భారత్లో ఉందనడంలో సందేహం లేదన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇండియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచబ్యాంక్ సైతం ఆశాభావం వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. ‘సోలార్ పవర్లో ఇండియా సూపర్ పవర్’ అని వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి సంస్థ ప్రశంసించిందని తెలిపారు. చాలా దేశాలు కేవలం మాటలకు పరిమితం అవుతుండగా, ఇండియా మాత్రం కార్యరంగంలోకి దిగి, ఫలితాలు సాధించి చూపుతోందని స్పష్టంచేశారు. అంతర్జాతీయంగా ఏరోస్పేస్ సంస్థలకు మన దేశమే అతిపెద్ద సరఫరాదారుగా మారిందన్నారు. రాబోయే కొన్నేళ్లలో టెక్స్టైల్, టూరిజం, టెక్నాలజీ వంటి రంగాల్లో యువతకు కోట్లాది ఉద్యోగాలు దక్కబోతున్నాయని వివరించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో దూసుకెళ్తున్నాం గత దశాబ్ద కాలంలో ఇంధన రంగంలో మునుపెన్నడూ లేని ప్రగతి సాధించామని ప్రధానమంత్రి మోదీ వివరించారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో ముందుకు దూసుకెళ్తున్నామని చెప్పారు. పదేళ్లలో పునరుత్పాదక ఇంధన రంగంలో 70 బిలియన్ డాలర్ల(రూ.6 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చాయన్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో గత ఏడాది 10 లక్షలకుపైగా ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో పెట్టుబడులకు అద్బుతమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వీటిని సది్వనియోగం చేసుకోవాలని దేశ విదేశీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలో మధ్యప్రదేశ్ ముందంజలో ఉందని తెలిపారు. రాష్ట్రం అతిపెద్ద తయారీ కేంద్రంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి వివరించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన 18 నూతన విధాన నిర్ణయాలను మోదీ ఆవిష్కరించారు. విద్యార్థుల కోసమేఆలస్యంగా వచ్చా భోపాల్లో పెట్టుబడిదారుల సదస్సుకు ప్రధాని మోదీ కొంత ఆలస్యంగా హాజరయ్యారు. దీనిపై ఆయన సదస్సులో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ఈ రోజు పది, పన్నెండో తరగతుల విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయని చెప్పారు. రాజ్భవన్ నుంచి తాను బయలుదేరే సమయానికే వారు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉందని తెలిపారు. తాను బయటకు వస్తే రోడ్లపై ట్రాఫిక్ నిలిపివేస్తారు కాబట్టి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో దాదాపు 15 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరానని వెల్లడించారు. తన వల్ల విద్యార్థులు నష్టపోవడాన్ని తాను భరించలేనన్నారు. వారు సరైన సమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. -
World Richest: శత్రు దుర్భేద్యం.. అత్యంత ధనిక దేశం
ఈ భూమ్మీద అత్యంత ధనికుడు ఎవరు?.. ప్రస్తుతానికైతే అపరకుబేరుల జాబితాలో 384 బిలియన్ డాలర్లతో ఇలాన్ మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మరి ప్రపంచంలో అధిక దేశం ఏది?.. జీడీపీ పరంగా చూసుకుంటే యూరప్ దేశం లగ్జెంబర్గ్. అలాంటప్పుడు మళ్లీ ధనిక దేశం, మస్క్ కంటే ధనికుడు అనే మాట ఎందుకు వస్తుందంటారా?.. అక్కడికే వస్తున్నాం.. ఇలాన్ మస్క్(Elon Musk), మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్ల పేర్లే అత్యంత ధనికుల లిస్ట్లో ఎప్పుడూ కనిపిస్తుంటుంది. వీళ్లతో పాటు మరో నలుగురైదుగురి పేర్లే ఈ జాబితాలో పైకి కిందకి తారుమారు అవుతుంటాయి. అయితే వాస్తవ ప్రపంచానికి కాస్త దూరంగా వెళ్తే.. ఇలాంటి ధనికులు వందల మంది కలిసొచ్చినా కూడా ఆయన సంపదకు దరిదాపుల్లో కూడా కనిపించరు!. ఆయన పేరే టీచల్లా.టీచల్లా.. వకాండా(Wakanda) అనే దేశానికి రాజు. ఈ దేశం ఆఫ్రికాలో ఉంది. ఈ భూమ్మీద అత్యంత సురక్షితమైన.. శత్రు దుర్భేద్యమైన దేశంగా వకాండాకు పేరుంది. అక్కడ దొరికే వైబ్రేనియం అనే మెటల్ కారణంగా ఆ రాజుకు, ఆ దేశానికి వెలకట్టలేనంత సంపద రాగలిగింది. ఇప్పుడే కాదు. ఇంకా కొన్ని వందల ఏళ్లు గడిచినా ఆ సంపద విలువను ఎవరూ అందుకోలేరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ దేశం కల్పితం మాత్రమే. మార్వెల్ కామిక్స్, ఆ సిరీస్లో వచ్చే సినిమాలు చూసిన వాళ్లకు బాగా పరిచయం ఉన్న పేరు. రాజుగా కన్నా బ్లాక్ పాంథర్ అనే సూపర్ హీరోగానే ఆయన ఈ ప్రపంచానికి సుపరిచితుడు. కల్పిత దేశమైన వకాండలో వైబ్రేనియం(Vibranium) అనే అత్యంత అరుదైన.. అతివిలువైన ఖనిజం ఉంటుంది. దాని సాయంతో ఈ భూమ్మీద ఏ దేశానికి కూడా సాధ్యపడని అత్యాధునిక టెక్నాలజీని ఈ దేశం ఉపయోగిస్తుంటుంది. అలా.. ఈ భూమ్మీద అత్యంత ధనిక దేశంగా వకాండా నిలిచింది.ఇంతకీ టీచల్లా(బ్లాక్పాంథర్) సంపద ఎంతో తెలుసా?.. అక్షరాల 90 ట్రిలియన్ డాలర్లు. అయితే కొన్ని కామిక్ పుస్తకాల్లో మాత్రం ఆయన సంపద కేవలం 500 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఏరకంగా చూసుకున్నా కూడా.. టీచల్లానే ఈ భూమ్మీద అత్యంత ధనికుడన్నమాట. ఇక వ్రైబేనియం కారణంగా వకాండ ఈ భూమ్మీదే అత్యంత ధనికమైన దేశంగా నిలిచింది.వకాండాలో రకరకాల తెగలు ఉంటాయి. బ్లాక్ పాంథర్ అనే బలమైన సంరక్షణలో ఆ దేశం ఉంటుంది. అక్కడి తెగల ప్రజలు చిన్నాపెద్దా తేడా లేకుండా యుద్ధ శిక్షలో ఆరితేరి ఉంటాయి. వాటి మధ్య ఎన్ని వైరాలున్నా.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే మాత్రం ఏకతాటికి వస్తుంటాయి. ఈ భూమ్మీద అత్యంత సురక్షితమైన దేశంగా వాకాండాకు పేరుంది. అందుకు కారణాలు లేకపోలేదు.తమ భూభాగంలో దొరికే వైబ్రేనియంతోనే అత్యాధునిక ఆయుధ సంపత్తిని, రక్షణ వ్యవస్థలను తయారు చేసుకుంటుంది ఆ దేశం. పటిష్టమైన నిఘా వ్యవస్థ, కంటికి కనిపించని రక్షణ వలయం ఏర్పాటు చేసుకుని శత్రువుల నుంచి తమ దేశాన్ని రక్షించుకుంటోంది.అత్యంత ఖరీదైన సహజ సంపద ఉన్నందున.. కొన్ని తరాలపాటు ప్రపంచ దేశాలకు వీలైనంత దూరంగా ఉంటూ ఐసోలేషన్ పాటిస్తూ వచ్చింది ఆ దేశం. అయితే టీచల్లా రాజు అయ్యాక ఆ పరిస్థితి మారింది. వర్తక వాణిజ్య ఒప్పందాల, దౌత్యపరమైన సంబంధాల కోసం ప్రపంచ దేశాలకు వకాండా తలుపులు తెరిచాడాడు. అలాగే.. అగ్రదేశాలకూ వకాండా నుంచి అత్యాధునికమైన సాంకేతికత సాయం కూడా అందింది. దీంతో వకాండా ఆర్థిక అభివృద్ధి .. ఈ భూమ్మీద మరేయితర దేశం అందుకోనంత స్థాయికి చేరింది. అదే సమయంలో వైబ్రేనియం మీద కొన్ని దేశాలు, వ్యక్తులు కన్నేయడంతో వకాండాకు శత్రువులను సంపాదించి పెట్టింది కూడా.మైక్రోసాఫ్ట్ నెట్వర్క్)MSN) డాటా ప్రకారం.. డీసీ సూపర్ హీరో బ్రూస్ వేన్(బ్యాట్మన్) సంపద విలువ 9.2 బిలియన్ డాలర్లు కాగా, మార్వెల్ తరఫున టోనీ స్టార్క్(ఐరన్ మ్యాన్) సంపద విలువ 12.4 బిలియన్ డాలర్లు వీళ్లతో పాటు ప్రొఫెసర్ ఎక్స్, అక్వామాన్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అలాగే సూపర్ విలన్లలో విక్టర్ వోన్ డూమ్ సంపద 100 బిలియన్ డాలర్లు కాగా, లెక్స్ లూథోర్ సంపద విలువ 75 బిలియన్ డాలర్లు. అంటే మొత్తం సూపర్ హీరోల ప్రపంచంలోనూ టీచల్లా రిచ్చెస్ట్ అన్నమాట. అయితే వాస్తవ ప్రపంచంలోనూ వెలకట్టలేని సంపదతో ఓ ధనికుడు ఉన్నాడని మీకు తెలుసా?ఒక మహా చక్రవర్తి.. మానవజాతి చరిత్రలో అంతటి సంపద కలిగిన మరో వ్యక్తి ఇప్పటి వరకు లేరు. ఆయనే మన్సా మూసా (Mansa Musa). ఆఫ్రికాలోని ప్రస్తుత మాలి, సెనెగల్, గాంబియా, గినియా, నైగర్, నైజీరియా, చాద్, మారిటేనియా తదితర దేశాలతో కూడిన విశాల ‘మాలి’ సామ్రాజ్యాన్ని ఈయన పాలించాడు. ప్రస్తుత మాలిలోని టింబుక్టును నిర్మించింది ఆయనే. క్రీ.శ. 1312 నుంచి 1337 వరకు ఆయన పాలనలో మాలి ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. మూసా సామ్రాజ్యంలో బంగారు, ఉప్పు గనులు ఎక్కువగా ఉండేవి. ప్రత్యేకించి బంగారు గనులు ఎక్కువగా ఉండటంతో బంగారం వేల టన్నుల్లో ఈయన ఖజానాలో ఉండేది. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో భారీగా సంపద దేశానికి తరలివచ్చింది. ప్రస్తుతం ఈ భూమ్మీద అందరి దగ్గర ఉన్న సంపదను కలిపినా.. అప్పట్లో ఆయన ఒక్కడి దగ్గర ఉన్న సంపదే ఎక్కువట!!. అంతేకాదు.. హజ్ యాత్రకు ఆయన దాదాపు లక్షమంది పరివారంతో బయలుదేరినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఆయన ఈజిప్ట్లో పంచిన బంగారంతో.. ఆ దేశంలో బంగారం విలువ పడిపోయిందట!. అలాగే ప్రపంచంలోనే ఇంత ఖరీదైన యాత్ర ఇప్పటివరకు లేదు. మూసా 1337లో కన్నుమూశారు. అనంతరం వచ్చిన పాలకులు అసమర్థులు కావడంతో మూసా నిర్మించిన మహాసామ్రాజ్యం విచ్ఛిన్నం కాగా, ఆ సంపదను కొల్లగొట్టుకుని పోయారు. -
World Day of Social Justice సామాజిక న్యాయం కావాలి!
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పిలుపు మేరకు 2009 నుంచి ఫిబ్రవరి 20వ తేదీన ‘ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవా’న్ని జరుపుతున్నారు. సమాజాల మధ్య సంఘీభావం, సామరస్యం, సమాన అవకాశాలను ప్రోత్సహించడానికీ; పేదరికం, నిరుద్యోగాన్ని తొలగించవలసిన ప్రాముఖ్యాన్ని గుర్తించడం దీని వెనుక ఉన్న లక్ష్యం. ఈ ఏడాది ఉత్సవం సందర్భంగా... విద్యార్థులకు పేదరికం, ప్రపంచ పౌరసత్వం, మానవ హక్కులు, స్థిరమైన అభివృద్ధి వంటి సామాజిక న్యాయ ఆవశ్యకత గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. జాతి, లింగ, వయస్సు, లైంగిక ధోరణి, మతం, జాతీయత, విద్య, మానసిక లేదా శారీరక సామర్థ్యం వంటివాటిలో పక్షపాతం వల్ల ఈ అసమానతలు ఉత్పన్నమవుతాయి. సామాజిక న్యాయం లేక పోవ డానికి గల కారణాలలో వలసవాదం, బానిసత్వం, లేదా అణచివేత ప్రభుత్వాలకు మద్దతు, ఆర్థిక అధికార దుర్వినియోగం, జాత్యహంకారం, ఆర్థిక అసమానత, వర్గ వివక్ష ముఖ్యమైనవి. 2024 నాటికి, సామాజిక న్యాయం అందించడంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాలు: స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, డెన్మార్క్, లక్సెంబర్గ్, ఐర్లాండ్. మానవ హక్కులు లేకపోవడం, న్యాయం పొందడం కష్టమవ్వడం, అవినీతి రాజ్యమేలడం వంటి అంశాల్లో ముందున్న దేశాలు వెనిజులా, కంబోడియా, అఫ్గానిస్తాన్, హైతీ, మయన్మార్లు.భారతదేశంలో సామాజిక న్యాయాన్ని నెలకొల్పడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కృషి అపారమైనది. అందుకే ‘భారత సామాజిక న్యాయ పితామహుని’గా అంబేడ్కర్ను గౌరవించుకుంటున్నాం. భారతదేశంలో రాజ్యాంగం పీఠిక సామాజిక న్యాయాన్ని సూచిస్తోంది. భారతదేశంలో సామాజిక న్యాయాన్ని నెలకొల్పడంలో మూడు అంశా లను పేర్కొనాలి: ఒకటి – ప్రాథమిక హక్కులు, నిర్దేశక సూత్రాల రూపంలో రాజకీయ సామాజిక–ఆర్థిక హక్కులను కల్పించడం. ఇది సమాన స్వేచ్ఛా సూత్రాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది,రెండవది–సామాజిక–ఆర్థిక అభివృద్ధి మధ్య, విరుద్ధమైన సామాజిక– ఆర్థిక లక్ష్యాల మధ్య సమాన సంతులనాన్ని సాధించే నమూనాను అవలంబించడం. మూడవది – భారతీయ సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక రక్షణలు నిశ్చయాత్మక చర్యలను అందించడం.ఇందుకోసం దేశంలో ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలు, పథకాలు, చట్టాలు రూపొందించి అమలు చేయడం. – డా. పి.ఎస్. చారి ‘ 83090 82823(ఫిబ్రవరి 20న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం) -
దేశంలోనే ధనిక పార్టీ బీజేపీ
-
ప్రపంచంలో 10 పేద దేశాలు: కనిపించని బంగ్లా, పాక్
ప్రపంచంలోని 10 అత్యంత పేద దేశాల జాబితా విడుదలయ్యింది. ఫోర్బ్స్ అందించిన ఈ సూచీలో టాప్లో నిలిచిన దేశాలు ప్రపంచంలో అతి చిన్న దేశాలుగా గుర్తింపుపొందాయి. వీటిలో భారత్కు సన్నిహిత దేశమైన మడగాస్కర్ 10వ స్థానంలో ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ల పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు.1. దక్షిణ సూడాన్దక్షిణ సూడాన్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా గుర్తింపు పొందింది. ఈ దేశపు జీడీపీ 29.99 బిలియన్ డాలర్లు. దక్షిణ సూడాన్ జనాభా 1.11 కోట్లు. ఈ దేశంలో యువత అత్యధిక శాతంలో ఉంది. 2011లో ఈ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. ఈ దేశంలోని అత్యధిక జనాభా వ్యవసాయంపైననే ఆధారపడింది.2. బురుండీమధ్య ఆఫ్రికాలోని బురుండీ ప్రపంచంలో రెండవ అత్యంత పేద దేశం. బురుండీ జీడీపీ 2.15 బిలియన్ డాలర్లు. ఇక్కడి జనాభా 1,34,59,236. రాజకీయ అస్థిరత, అంతర్గత సంఘర్షణలు ఈ దేశపు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశంలోని 80 శాతం జనాభా వ్యవసాయంపైననే ఆధారపడి జీవిస్తోంది.3. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రపంచంలో మూడవ పేద దేశం. ఇక్కడి జనాభా 58,49,358. జీడీపీ 3.03 బిలియన్ డాలర్లు. రాజకీయ అస్థిరత, సాయుధ పోరాటం మౌలిక సదుపాయాల కొరతతో ఈ దేశం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ దేశంలో 80 శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు.4. మలావిమలావి ప్రపంచంలో నాల్గవ పేద దేశం. మలావి జనాభా 2,13,90,465. జీడీపీ 10.78 బిలియన్ డాలర్లు. మలావి గణనీయమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. వర్షాధార వ్యవసాయంపై ఇక్కడ పంటలు సాగుచేస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వం విద్య, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి,పేదరికాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది.5. మొజాంబిక్మొజాంబిక్ ప్రపంచంలో ఐదవ పేద దేశం. మొజాంబిక్ జనాభా 3,44,97,736. జీడీపీ 24.55 బిలియన్ డాలర్లు. ఉగ్రవాదం, హింస మొజాంబిక్ ముందున్న ప్రధాన సమస్యలు. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు, జనాభా పెరుగుదల మొదలైనవి ఈ దేశాన్ని పేదరికంలోకి నెట్టివేశాయి.6. సోమాలియాసోమాలియా ప్రపంచంలో ఆరవ పేద దేశం. సోమాలియా జీడీపీ 13.89 బిలియన్ డాలర్లు. జనాభా 1,90, 09,151. ఇక్కడి అంతర్యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. దీంతో దేశం పతనమయ్యింది.7. కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ప్రపంచంలో ఏడవ పేద దేశం. జీడీపీ 79.24 బిలియన్ డాలర్లు. జనాభా 10,43,54,615. ఈ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రువాండా అనుకూల తిరుగుబాటుదారుల దాడులతో అతలాకుతలమవుతోంది. కాంగోలో దాదాపు 62 శాతం మంది రోజుకు రూ.180 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు.8. లైబీరియాలైబీరియా ప్రపంచంలో ఎనిమిదవ పేద దేశం. లైబీరియా జీడీపీ 5.05 బిలియన్ డాలర్లు. జనాభా 54,92,486. ఆఫ్రికన్ దేశమైన లైబీరియాలో అంతర్యుద్ధం కారణంగా శాశ్వత పేదరికం ఏర్పడింది. ప్రపంచ ఆహార కార్యక్రమం వంటి అంతర్జాతీయ సంస్థలు విద్య , ఆరోగ్య సంరక్షణలో లైబీరియాకు సహకారాన్ని అందిస్తున్నాయి.9. యెమెన్ప్రపంచంలోని పేద దేశాలలో యెమెన్ తొమ్మిదవ స్థానంలో ఉంది. యెమెన్ జీడీపీ 16.22 బిలియన్ డాలర్లు. జనాభా 34.4 మిలియన్లు. సంవత్సరాల తరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత యెమెన్ను ఆర్థికంగా దెబ్బతీశాయి. ఆహారం, నీరు, మందులు, నిత్యావసర వస్తువుల కొరత ఈ దేశాన్ని నిత్యం వెంటాడుతుంటుంది.10. మడగాస్కర్మడగాస్కర్ ప్రపంచంలోని 10వ పేద దేశం. మడగాస్కర్ జీడీపీ 18.1 బిలియన్ డాలర్లు. జనాభా 30.3 మిలియన్లు. ఈ దేశం భారతదేశానికి సన్నిహిత దేశంగా పేరొందింది. మడగాస్కర్ ఆఫ్రికాకు ఆగ్నేయ తీరంలో ఉన్న ఒక ద్వీప దేశం. మైనింగ్, పర్యాటకం ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి.ఇది కూడా చదవండి: ఆరు అలవాట్లు.. విజయానికి అడ్డు గోడలు -
ప్రపంచం అంతమయ్యేది అప్పుడే..! వెలుగులోకి న్యూటన్ లేఖ..
ఇంతవరకు ప్రపంచం అంతం ఫలానా టైంలో అంటూ ఏవేవో పుకార్లు హల్చల్ చేశాయి. వాటిపై సినిమాలు కూడా వచ్చాయి. కానీ అది నిజంగా ఎప్పుడని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు కానరాలేదు. తాజాగా సరిగ్గా ఆ ఏడాదిలోనే ప్రపంచం అంతం అని చెప్పేందుకు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. అది కూడా సర్ హైజాక్ న్యూటన్ పరిశోధనలో బహిర్గతమవ్వడం విశేషం. నిజానికి దాన్ని ఆ శాస్త్రవేత్త ఎలా నిర్థారించారనేది కూడా పరిశోధనలో వివరించారు.చలనం, గురుత్వాకర్షణ నియమాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన సర్ ఐజాక్ న్యూటన్ 1704లో రాసిన ఓ లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా ప్రపంచం అంతం అవ్వడాన్ని ముందుగా అంచనా వేయడాన్ని డూమ్స్డే సిద్ధాంతం లేదా ప్రవచనం అని అంటారు. ఇక న్యూటన్ తన డూమ్స్డే ప్రవచనాన్ని బైబిల్ పొటెస్టంట్ వివరణ, బైబిల్ చరిత్ర తర్వాత జరిగిన సంఘటనలు, ఆర్మగెడానా యుద్ధం ఆధారంగా ఆ విషయాన్ని నిర్థారించినట్లు లేఖలో పేర్కొన్నారు. తాను చెప్పిన ఏడాది కంటే ముందే ప్రపంచం ముగిసిపోతుంది అనడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని ఆ లేఖలో తెలిపారు. ఇది కేవలం అంత్య సమయం అంచనా వేయడానికే గాక ఊహజనిత వ్యక్తుల తొందపాటు ఊహలను ఆపడం, వారి అంచనాలు సరైన కావని తేల్చి చెప్పేందుకే ఇలా దీనిపై పరిశోధన చేసి మరి గణించినట్లు లేఖలో వివరించారుఅదంతా 150 నవల నిడివి గల పుస్తకాల్లో పొందుపరిచినట్లు తెలిపారు. దానిలోని 1260, 1290, 2300 రోజుల సంఖ్యను ఉపయోగించి ఏ ఏడాది అంతమవుతుందనేది నిర్ణయించాడు న్యూటన్. దీనిలోని కొన్ని ముఖ్యమైన క్షణాల ముగింపు, ప్రారంభాన్ని సూచిస్తాయి. ఆ రోజులను సంవత్సరాలుగా నిర్ణయించాడు. తత్ఫలితంగా 800 ADని చర్చిని వదిలివేయడం అధికారికంగా ప్రారంభమైన తేదీగా నిర్ణయించారు. అదే పవిత్ర రోమన్ సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం. అంటే ప్రపంచం ఆరంభమైన 1,260 సంవత్సరాలకు మళ్లీ రీసెట్ అవుతుందని లేఖలో తెలిపారు. ఆదిమ సంవత్సర క్యాలెండర్ ప్రకారం పన్నెండు నుంచి ఒక సంవత్సరం ముప్పే రోజుల నుంచి ఒక నెల వరకు లెక్కడించడం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు.స్వల్పకాలిక జంతువుల రోజులను జీవించిన రాజ్యాల సంవత్సరాలకు గుర్తుగా ఉంచారు. 1260 రోజుల కాలం, ముగ్గురు రాజులు AC 800 పూర్తి విజయం సాధించిన తేదీలుగా నిర్ణయిస్తే ముగింపు కాలం ఏసీ 2060తో ముగుస్తుందట.ఇలాంటే డూమ్స్ డే అంచనాలను వేసిన ఏకైక వ్యక్తి న్యూటన్ మాత్రమే కాదు 1500 లలో నివసించిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్, 2025 లో ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టవచ్చని లేదా గ్రహానికి ప్రమాదకరమైన సామీప్యతలోకి రావచ్చని అంచనా వేశారు.(చదవండి: కొత్త.. రుచుల కోకా కట్టుకున్నదీ పేట..) -
ఈ దేశంలో యువత అధికం.. 15 ఏళ్ల లోపువారు మరీ అధికం
ఎప్పుడైనా జనాభా విషయమై విస్తృత ప్రస్తావనకు వస్తే రెండు వాదనలు వినిపిస్తుంటాయి. వాటిలో ఒకటి.. అధిక జనాభా సమస్యగా మారుతున్న దేశాలు. మరొకటి తగ్గుతున్న జనాభా సంఖ్య కారణంగా జనన రేటును పెంచుకోవాలనుకుంటున్న దేశాలు.ఏ దేశంలోనైనా వృద్ధుల జనాభా అధికంగా ఉంటే ఆ దేశంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. వాటిని పరిష్కరించడం ఆయా ప్రభుత్వాలకు సమస్యగా మారుతుంది. అయితే ఇప్పుడు మనం ప్రపంచంలోని అతి పిన్న వయస్కుల జనాభా కలిగిన దేశం గురించి తెలుసుకుందాం. ఆ దేశంలో జనాభాలో సగం మంది 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మరోవైపు ఆఫ్రికన్ దేశాలలో నెలకొన్న పేదరికం, వనరుల కొరత కారణంగా అక్కడి ప్రజల ఆయుర్దాయం అంతకంతకూ తగ్గుతోంది. ఫలితంగా అక్కడి ప్రజల సగటు వయస్సు క్షీణిస్తోంది.ఇక అత్యంత పిన్న వయస్కుల జనాభా కలిగిన దేశాల విషయానికొస్తే ఆఫ్రికన్ దేశమైన నైజర్ ఈ జాబితాలో ముందువరుసలో ఉంటుంది. ఐక్యరాజ్యసమితి అందించిన డేటా ప్రకారం ఈ దేశంలోని ప్రజల సగటు వయస్సు 14.8 ఏళ్లు. ఈ జనాభాలో సగం మంది 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారేకావడం విశేషం. పేదరికం, వనరుల కొరత కారణంగా ఇక్కడ జనన రేటు చాలా ఎక్కువగా ఉంది. నైజర్లో సగటు జనన రేటు ప్రతి స్త్రీకి 7.6 మంది పిల్లలు. ప్రపంచ సంఖ్య 2.5 అయితే. ఇక్కడ ఆయుర్దాయం దాదాపు 58 ఏళ్లు.యువ జనాభా పరంగా నైజర్ ముందు వరుసలో ఉంది. అయితే పెరుగుతున్న యువత జనాభా ఈ దేశానికి సమస్యగా మారింది. నైజర్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో దేశంలో విద్యా సౌకర్యాలు, ప్రాథమిక అవసరాలు యువతకు అందడం లేదు. ఈ కారణంగా, ఇక్కడ పేదరికం, బాల్యవివాహాలు తదితర సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ప్రపంచ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం పేద దేశాలలో అధిక సంతానోత్పత్తి రేట్లు కూడా ఆరోగ్య సమస్యలను సృష్టిస్తున్నాయి.ఆఫ్రికాలో పిన్న వయస్కుల జనాభా కలిగిన దేశం నైజర్ ఒక్కటి మాత్రమే కాదు. ఉగాండా, అంగోలాలలో కూడా పిన్న వయస్కుల జనాభా అధికంగా ఉంది. ఈ రెండు దేశాలలో యువత సగటు వయస్సు 16 సంవత్సరాలు. మధ్యప్రాచ్యంలోని పాలస్తీనా, యెమెన్, ఇరాక్లలో యువత సగటు వయస్సు దాదాపు 22 ఏళ్లు. దీని తరువాత ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్లు, తైమూర్-లెస్టే 20.6 ఏళ్లు, పాపువా న్యూ గినియాలో యువత సగటు వయస్సు 21.7 ఏళ్లుగా ఉంది.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ప్రచారంలో మూమూస్ రుచిచూసిన కేజ్రీవాల్ -
కృత్రిమ దీవిలో అతిపెద్ద విమానాశ్రయం!
చైనా ప్రభుత్వం సముద్రంలో అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. కృత్రిమ దీవిలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. లియోనింగ్ ప్రావిన్స్లోని డాలియన్ నగరాన్ని ఆనుకుని ఉన్న సముద్రాన్ని పూడ్చి ఏకంగా ఓ సరికొత్త దీవిని నిర్మిస్తోంది. ఇక్కడే మొత్తం 20.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘డాలియన్ జి¯Œ జౌవాన్’ పేరుతో అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి, ఏటా 5 లక్షలకు పైగా విమానాలు, 8 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో పనిచేయనుంది. ఇందులో నాలుగు అతిపెద్ద రన్ వేలు, 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాసెంజర్ టెర్మినల్స్ కూడా ఏర్పాటవుతున్నాయి. వీటి ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతుందని అంచనా. ఈ నిర్మాణం పూర్తయితే, ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా కొనసాగుతున్న హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (12.48 చ.కి.మీ) రెండో స్థానానికి పడిపోతుంది. అయితే, ఈ రెండు విమానాశ్రయాలు కూడా కృత్రిమ దీవుల్లో ఏర్పాటైనవే కావడం విశేషం. ఈ విమానాశ్రయాన్ని 2035 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. -
‘ఆంగ్లం’లో భారత్ స్థానం ఎంత? నాన్ ఇంగ్లీషులో టాప్ దేశమేది?
ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ ప్రధాన భాషగా మారింది. భారతదేశంలో కూడా హిందీతో పాటు ఇతర భాషలకన్నా ఇంగ్లీషుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఏ దేశాల్లో ఇంగ్లీషు అధికంగా మాట్లాడతారో తెలుసా? ఈ విషయంలో భారత్ ర్యాంక్ ఎంత?ఇప్పుడున్న రోజుల్లో ఆంగ్లం అన్నిరంగాల్లో ప్రధాన భాషగా ఉంది. ఇంగ్లీషు(English)వస్తే ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్లవచ్చని, అక్కడివారితో మాట్లాడవచ్చని అంటారు. ఇంగ్లీష్ మాట్లాడే విషయంలో భారతదేశం ప్రపంచ సగటుకు మించి ఉంది. దేశంలోని ఢిల్లీ ఆంగ్ల భాషణలో ముందంజలో ఉంది. ఈ విషయాన్ని ఒక నివేదిక వెల్లడించింది.పియర్సన్ గ్లోబల్ ఇంగ్లిష్ ప్రొషిషియన్సీ(Pearson Global English Proficiency) నివేదిక ప్రకారం ఢిల్లీలోని ప్రజలకు ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యం ఉత్తమంగా ఉంది. రాజస్థాన్, పంజాబ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా ఇంగ్లీష్ మాట్లాడేవారి విషయంలో ఢిల్లీకి 63 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత రాజస్థాన్కు 60 పాయింట్లు, పంజాబ్కు 58 పాయింట్లు వచ్చాయి.బ్రిటన్లో గరిష్టంగా 98.3 శాతం మందికి ఇంగ్లీషు బాగా వచ్చు. అమెరికాలో 95 శాతం మందికి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలుసు. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుండి అందిన డేటా ప్రకారం బ్రిటన్లోని జిబ్రాల్టర్లో 100 శాతం మంది ప్రజలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడతారు. ఇక్కడి జనాభా 32,669 మాత్రమే.భారతదేశంలో 20 శాతం మంది ప్రజలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలరు. జనాభా పరంగా చూస్తే, భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య ప్రపంచంలో టాప్ 5 దేశాలలో ఉంది. పియర్సన్స్ గ్లోబల్ ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారిలో రాజధాని ఢిల్లీ(Delhi) ముందంజలో ఉంది. కాగా చైనాలో ఇంగ్లీష్ మాట్లాడేవారి సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ 0.9 శాతం మంది మాత్రమే ఇంగ్లీషులో మాట్లాడతారు. చైనీస్ ప్రజలు వారి మాతృభాషలోనే సంభాషిస్తారు. చైనాలో చైనీస్, మంగోలియన్, టిబెటన్, ఉయ్ఘర్, జువాంగ్ భాషల్లో మాట్లాడుతుంటారు.ఇది కూడా చదవండి: Winter Travel Ideas: శీతాకాలంలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు -
ఈ ఏడాది ప్రపంచ రూపురేఖలను మార్చే ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్లు!
ఎంతోమంది రాజులు రాజ్యాలేలారు.. కాలంతో పాటు కనుమరుగైపోయారు. అయితే వారు కట్టిన కట్టడాలు మాత్రం ఇప్పటికీ వారి ఉనికిని తెలియజేస్తూ ఉన్నాయి. కట్టడాలకు అంత చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా కొంత మంది ఆర్కిటెక్చర్లు లేదా సంస్థలు కనీవినీ ఎరుగని కట్టడాలను నిర్మించి అక్కడి ప్రాంతాల రూపురేఖలనే మార్చేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి నిర్మాణాలు భూమిపై అనేకం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది (2025) 11 ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్లు సిద్ధమవుతున్నాయి. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.న్యూ సిడ్నీ ఫిష్ మార్కెట్ (సిడ్నీ)ప్రపంచంలోని మూడో అతిపెద్ద చేపల మార్కెట్గా ప్రసిద్ధి చెందిన 'సిడ్నీ ఫిష్ మార్కెట్' (Sydney Fish Market) మరింత పెద్దదికానుంది. దీనికోసం 3XN ఆర్కిటెక్ట్లు, ఆస్ట్రేలియన్ సంస్థ BVN ముందడుగు వేసాయి. లాజిస్టిక్లు, ఇతర కార్యకలాపాలు గ్రౌండ్ ఫ్లోర్లో నిర్వహించనున్నారు. పై అంతస్తులలో సందర్శకుల కోసం మార్కెట్ హాల్, వేలం హాలు ఉంటాయి. ఇక్కడ రెస్టారెంట్లు, రిటైలర్లు పాంటూన్లు వంటివన్నీ చూడవచ్చు.గ్రాండ్ రింగ్, ఒసాకా (జపాన్)ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు.. జపాన్ రెండవ నగరమైన ఒసాకాలో నిర్వహించే ఎక్స్పో 2025 కార్యక్రమానికి 28 మిలియన్ల మంది సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉంది. వేదిక మధ్య భాగంలో ఉంటుంది. గ్రాండ్ రింగ్ వృత్తాకార చెక్క నిర్మాణంతో పూర్తవుతుంది. 1970లో ఒసాకా మొదటిసారిగా ఎక్స్పోను నిర్వహించినప్పుడు, ఆ సమయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అవాంట్-గార్డ్ జపనీస్ వాస్తుశిల్పులు భారీ స్పేస్-ఫ్రేమ్ పైకప్పును నిర్మించారు. దాదాపు 6,46,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఇది ప్రపంచంలోని అతిపెద్ద చెక్క భవనాలలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేయనుంది.లైఫ్ అండ్ మైండ్ బిల్డింగ్, ఆక్స్ఫర్డ్ (యూకే)లైఫ్ అండ్ మైండ్ బిల్డింగ్ అనేది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ చరిత్రలో అతిపెద్ద నిర్మాణ ప్రాజెక్ట్. ఈ నిర్మాణ డిజైన్ సూత్రాలు విద్యాసంబంధమైన వాటికి దగ్గరగా ఉన్నాయి. లోపల ఫ్లెక్సిబుల్ ల్యాబ్ స్పేస్లు వివిధ విభాగాల అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఇది కూడా గొప్ప ఆర్కిటెక్చర్ నిర్మాణాలలో ఒకటిగా ఉంటుంది.కెనడియన్ స్కూల్, చోలులా (మెక్సికో)మెక్సికోలోని చోలులాలోని ఆర్కిటెక్చర్ సంస్థ సోర్డో మడలెనోస్ కెనడియన్ స్కూల్ ప్రాజెక్ట్ చేపట్టింది. ప్రకృతిలో మమేకమయ్యే ఈ ప్రాజెక్ట్ ఇతర ప్రాజెక్టులకంటే భిన్నంగా ఉంటుంది. అయితే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మెక్సికన్ ఆర్కిటెక్ట్ ఫెర్నాండో సోర్డో మడలెనో.. దీనిని పర్యావరణంతో మిళితం చేయడంతో పాటు భవనం కూడా ఆట స్థలంలో భాగమవుతుందని పేర్కొన్నాడు.టెక్కో అంతర్జాతీయ విమానాశ్రయం, నమ్ పెన్ (కంబోడియా)కంబోడియా దాని రాజధాని నమ్ పెన్.. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత పెద్దది కానుంది. ఇది ఇప్పటి కంటే ఆరు రెట్లు ఎక్కువ మంది సందర్శకులను నిర్వహించగల సామర్థ్యం పొందనుంది. పర్యాటకుల సంఖ్యను పెంచడానికి మాత్రమే కాకుండా.. ప్రాంతీయ విమానయాన కేంద్రంగా మారడానికి దీనిని సిద్ధం చేస్తున్నారు. సిటీ సెంటర్కు దక్షిణంగా 12 మైళ్ల దూరంలో ఉన్న ఈ టెర్మినల్ భవనం ఆగ్నేయాసియాలో అతిపెద్దది.సౌత్ స్టేషన్ రీడెవలప్మెంట్, బోస్టన్ (ఇంగ్లాండ్)న్యూ ఇంగ్లాండ్లో అత్యంత రద్దీగా ఉండే గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ హబ్ అయిన బోస్టన్ సౌత్ స్టేషన్ను కూడా రీడెవలప్మెంట్ చేయనున్నారు. ఇది పూర్తయితే.. బస్సు, రైలు సామర్థ్యం వరుసగా 50 శాతం, 70 శాతం పెరుగుతుంది. 1899 నుంచి అలాగే ఉన్న ఈ నిర్మాణం కొత్త హంగులు సంతరించుకోనుంది.గోథే ఇన్స్టిట్యూట్, డాకర్ (సెనెగల్)"నోబెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్"గా ప్రసిద్ధి చెందిన ప్రిట్జ్కర్ ప్రైజ్ని.. మొట్టమొదటి ఆఫ్రికన్ విజేత ఫ్రాన్సిస్ కేరే తన స్వదేశీ ఖండంలో నిర్మించిన వాతావరణాన్ని మార్చనున్నారు. 18,300 చదరపు అడుగుల భవనం వక్రతలు చుట్టుపక్కల ఉన్న పందిరి రూపురేఖలను ప్రతిబింబించేలా రూపొందించారు. దీనిని ప్రధానంగా స్థానికంగా లభించే ఇటుకలతో నిర్మించారు. కాగా ఇది ఈ ఏడాది మరింత సుందరంగా మారనుంది.అర్బన్ గ్లెన్, హాంగ్జౌ (చైనా)బీజింగ్లోని సీసీటీవీ హెడ్క్వార్టర్స్.. చైనాలోని అత్యంత ప్రసిద్ధి చెందిన సమకాలీన భవనంగా మారనుంది. తూర్పు నగరమైన హాంగ్జౌలో దాదాపు 9,00,000 చదరపు అడుగుల ఆఫీసు, హోటల్, విశ్రాంతి స్థలాన్ని కలిగి ఉన్న ఒక జత టవర్లు అర్బన్ గ్లెన్లో అత్యంత అద్భుతమైనవిగా రూపుదిద్దుకోనుంది.రియాద్ మెట్రో, రియాద్ (సౌదీ అరేబియా)2020లలో సౌదీ అరేబియాలో ఈ రియాద్ మెట్రో వెంచర్లను ప్రకటించారు. ఇది క్యూబ్ ఆకారంలో ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాణాలలో ఒకటిగా మారనుంది. ఇది ఆరు లైన్లతో ఉంటుంది. దీని రోజువారీ సామర్థ్యం రోజుకు 3.6 మిలియన్లు. ఈ ప్రాజెక్టు నవంబర్లో ప్రారంభమైంది.స్కైపార్క్ బిజినెస్ సెంటర్, లక్సెంబర్గ్ (ఫ్రాన్స్)యూరప్ దేశంలోని కొత్త పబ్లిక్ భవనాలు కనీసం 50 శాతం కలపను కలిగి ఉండాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే లక్సెంబర్గ్ రూపుదిద్దుకుంటోంది. ఇది ఖండంలోని అతిపెద్ద హైబ్రిడ్ చెక్క భవనాలలో ఒకటిగా మారనుంది. దీని విస్తీర్ణం 8,44,000 చదరపు అడుగులు. ఇందులో సుమారు 5,42,000 క్యూబిక్ అడుగులు కలపతో మిర్మించనున్నారు. ఈ భవనం, మొదటి దశ ఫిబ్రవరితో పూర్తవుతుంది.డాంజియాంగ్ బ్రిడ్జ్, తైపీ (తైవాన్)డాన్జియాంగ్ బ్రిడ్జ్ దాదాపు తొమ్మిదేళ్లుగా, దివంగత జహా హదీద్ సంస్థ తన వారసత్వాన్ని కొనసాగించింది. 3,018 అడుగుల పొడవైన నిర్మాణం తైవాన్ రాజధాని తైపీ గుండా ప్రవహించే తమ్సుయ్ నది ముఖద్వారం మీదుగా నాలుగు ప్రధాన రహదారులను కలుపుతుంది. మొత్తం నిర్మాణం కేవలం ఒకే కాంక్రీట్ మాస్ట్తో ఉంటుంది. ఇది పూర్తయిన తరువాత ప్రపంచంలోనే అతి పొడవైన సింగిల్-మాస్ట్ అసమాన కేబుల్-స్టేడ్ బ్రిడ్జ్ అవుతుంది. -
Snowfall Destinations: అత్యధిక మంచు కురిసే ప్రాంతాలివే..
భారతదేశంలోని ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతంగా మంచుకురుస్తోంది. దీంతో పర్యాటకులు ఆ మంచుతో కూడిన ప్రాంతాలను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఆ మంచులో చాలాసేపు ఆడుకోవాలని తహతహలాడుతున్నారు. మరి ప్రపంచంలో అత్యధికంగా మంచుకురిసే ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలుసా?నూతన సంవత్సరం ప్రారంభంలో ప్రపంచంలోని పలు దేశాల్లో మంచు కురుస్తుంటుంది. అయితే కొన్ని ప్రాంతాలు భారీ హిమపాతం కారణంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ సమయంలో టూరిస్టులు ఆయా ప్రాంతాలకు తరలివచ్చి, తనివితీరా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ప్రాంతాలేవో, ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.మౌంట్ డెనాలి, అలాస్కా ఉత్తర ధ్రువానికి సమీపంలోని అందమైన ప్రాంతం అలస్కా(Alaska). ఇది అమెరికాలో ఉంది. హిమపాతానికి ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాస్కాలో ఏడాది పొడవునా మంచు కురుస్తుంటుంది. అయితే శీతాకాలంలో డెనాలి పర్వతంపై హిమపాత దృశ్యం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.వెర్ఖోయాన్స్క్ అండ్ ఐమ్యాకాన్, రష్యారష్యాలోని వెర్కోయాన్స్క్, ఐమ్యాకాన్లు ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందాయి. శీతాకాలంలో వెర్ఖోయాన్స్క్లో ఉష్ణోగ్రత -48 డిగ్రీల సెల్సియస్ వరకుచేరుకుంటుంది. ఐమ్యాకాన్(iMacon)లో ఉష్ణోగ్రత -71 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. అందుకే ప్రతీయేటా నూతన సంవత్సరంలో హిమపాతాన్ని చూసేందుకు పర్యాటకులు రష్యాకు తరలివస్తుంటారు.ఫ్రేజర్, కొలరాడోకొలరాడో అమెరికాలోని రెండవ అత్యంత శీతల ప్రదేశంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా శీతాకాలంలో కొలరాడోలో భారీ హిమపాతంతో పాటు, తెల్లటి మంచు పలకలు కనిపిస్తాయి. కొలరాడోలోని ఫ్రేజర్లో మంచు కురుస్తున్న దృశ్యం టూరిస్టులను సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా చేస్తుంది.మిన్నెసోటా అండ్ యుకాన్, అమెరికాఅమెరికాలోని మిన్నెసోటాలో గల అంతర్జాతీయ జలపాతం(International Falls) ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటిగా గుర్తిస్తారు. ఈ జలపాతాన్ని ‘ఐస్ బాక్స్ ఆఫ్ ది నేషన్’ అని కూడా పిలుస్తారు. అమెరికాలోని యుకాన్లో గల స్నాగ్ అనే చిన్ని గ్రామం కూడా భారీ హిమపాతానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఉలాన్బాతర్, మంగోలియామంగోలియా రాజధాని ఉలాన్బాతర్ ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రత -16 డిగ్రీల సెల్సియస్కి పడిపోతుంది. ఫలితంగా భారీగా హిమపాతం కురుస్తుంది.ఇది కూడా చదవండి: భారత్పై ‘బంగ్లా’ విషం.. ఈ అంశాలతో స్పష్టం -
ప్రపంచ చీరల దినోత్సవం
సాక్షి, సిటీబ్యూరో: చీర కట్టుకునే సంస్కృతి 5 వేల ఏళ్ల నుంచి కొనసాగుతోందని ఫ్లో (ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్ చైర్పర్సన్ ప్రియా గజ్దర్ అన్నారు. శుక్రవారం ఫిక్కీ (ఎఫ్ఐసీసీఐ) లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ చీరల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ చీర కట్టు అనేది ప్రపంచం ఉన్నంత కాలం కొనసాగుతుందని అన్నారు. ఏటా డిసెంబర్ 21న శారీ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ‘ది సారీ– సిక్స్ యార్డ్స్ ఆఫ్ సస్టైనబుల్ హెరిటేజ్’ అనే అంశంపై చర్చ నిర్వహించారు. -
World Meditation Day : మెరుగైన సమాజం కోసం
ప్రస్తుతంపై మనస్సును లగ్నం చేయడాన్ని ధ్యానం అనవచ్చు. ఇది చాలా ప్రాచీన కాలం నుంచి అనేక సంస్కృతుల్లో భాగంగా కొనసాగుతోంది. వ్యక్తి గత శ్రేయస్సు, మానసిక ఆరోగ్యానికి ఇది ఉపయోగ పడుతుంది. అయితే భారతీయ సంస్కృతిలో యోగా, ధ్యానం మిళితమై కనిపిస్తాయి. అందుకే మన ప్రాచీన గ్రంథాలు కానీ, శిల్పాలు కానీ ధ్యాన ముద్రను ప్రతిబింబిస్తూ ఉంటాయి.జూన్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్స వంగా జరపాలని ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ) నిర్ణయించడం ముదావహం. ధ్యానం యొక్క శక్తిని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ధ్యానం మానసిక, భౌతిక శక్తి సామ ర్థ్యాలను వృద్ధి చేయడమే కాక మనస్సును ఒక విషయంపై లగ్నం చేయడానికి ఉపకరిస్తుంది. ఆధునిక కాలపు ఒత్తిడులను తట్టుకోవడానికి ధ్యానం ఇప్పుడు ప్రధాన సాధనం అయ్యింది. అలాగే వ్యక్తిగత ప్రయోజనాలకన్నా సామూ హిక శ్రేయస్సుకు ఇది దోహదం చేస్తుంది. దైనందిన జీవితంలో ధ్యానాన్ని ఒక భాగం చేసుకుంటే మానసిక ఒత్తిడుల నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. యోగాకు ధ్యానాన్ని జోడిస్తే రక్తపోటు, స్థూల కాయం, ఆందోళన, నిద్రలేమి వంటి వాటి నుంచి బయటపడవచ్చు. అనా రోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి ధ్యాన, యోగాలు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు. మనస్సు– శరీరం మధ్య అవినాభావ సంబం«ధాన్ని మన ప్రాచీన యోగశాస్త్రం చెబుతుంది. కానీ ఆధునిక వైద్యులు మనస్సునూ, శరీరాన్నీ రెండు వేరువేరు విభాగాలుగా చూస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఈ ధోరణిలో కొంత మార్పు గమనించవచ్చు. ఆరోగ్యవంతమైన జనాభాను, సుస్థిరమైన ప్రపంచాన్ని సృష్టించడానికి ధ్యానం ఒక మార్గంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.– జంగం పాండు; పరిశోధక విద్యార్థి, హైదరాబాద్(రేపు ప్రపంచ ధ్యాన దినోత్సవం) -
నిత్యం ఫాలో కావాల్సిన జీవిత సత్యాలు : చెప్పైనా,మనిషైనా బాధిస్తోంటే..!
జీవితం సాఫీగా సాగాలంటే కొన్ని ఖచ్చితమైన సూత్రాలను పాటించాలి. వివేకానందుడు చెప్పినట్టు సుఖదు:ఖాలు నాణేనికి రెండు పార్శాలు లాంటివి. కాబట్టి సానుకూల దృక్పథంతో ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే నడవదు. విశ్వంలో ప్రతి అంశం తార్కిక ఆలోచనలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి తార్కిక ఆలోచనలతో ప్రపంచాన్ని అవగాహన చేసుకోడానికి ప్రయత్నించాలి. నిశితంగా పరిశీలించి అర్థం చేసుకొని, జీవితానికి అన్వయం చేసుకొని సాగిపోవాలి. ఉదాహరణకు అమృత బిందువుల్లాంటి ఈ విషయాలను గమనించండి! కోపంలో సమాధానం చెప్పకు సంతోషంలో వాగ్దానం చేయకు. ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అయినవారి ఎదుట అబద్ధం చెప్పకు.అనుభవం ఎదిగిన అభిప్రాయాన్ని బట్టి రాదు. తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది.‘తప్పు చేయడానికి ఎవరూ భయపడరు. కానీ చేసిన తప్పు బయట పడకుండా ఉండడం కోసం భయపడతారు.జీవితంలో వయసు ఉన్నప్పుడే చదవండి. ఎందుకంటే జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్నా ఆచరించేందుకు జీవితం ఉండదు.‘ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది. కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం గురించి తెలుసుకునే తెలివి ఉండదు.వేదం చదివితే ధర్మం తెలుస్తుంది. వైద్యం చదివితే రోగం ఏమిటో తెలుస్తుంది.గణితం చదివితే లెక్క తెలుస్తుంది. లోకం చదివితే ఎలా బతకాలో తెలుస్తుంది.కాలికున్న చెప్పులైనా మనతో ఉన్న మనుషులైనా నొప్పిని, బాధను కలిగిస్తున్నారంటే, సరిపోయేవి కావని అర్థం. ఇదీ చదవండి: మానవ కళ్యాణార్థం మార్గళీ వ్రతం! -
ప్రపంచంలోనే చెత్త ఎయిర్లైన్స్.. ఇండిగో స్థానం ఇది!
విమానంలో ప్రయాణించాలంటే ఏ విమానయాన సంస్థ బెటర్ అనేది తెలుసుండాలి. అలాగే కేబిన్లు, సేవల నాణ్యత తోపాటు..విమానాలు ఎంత ఆలస్యంగా వస్తున్నాయన్నది కూడా అన్నింటికంటే ముఖ్యం. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ ప్రతి ఏటా దీనికి సంబంధించి ప్రయాణికులకు అవగాహన కల్పించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది. ఏడాది మెత్తంలో ఎన్ని సార్లు ఆలస్యంగా కస్టమర్లను గమ్యస్థానాలకు చేర్చింది, సౌకర్యం, సేవలు, ప్రయాణికుల ఫీడ్బ్యాక్ వంటి అంశాల ఆధారంగా అత్యుత్తమమైనవి, చెత్త సర్వీస్ అందించిన ఎయిర్లైన్స్గా జాబితా చేసి ర్యాంకులు ఇస్తుంది. ఈ ఏడాది మాత్రం కస్టమర్ ఫీడ్బ్యాక్, కార్యచరణ సామర్థ్యం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్లైన్లకు ర్యాంకుల ఇచ్చింది.ఇందులో జనవరి నుంచి అక్టోబర్ వరకు గల డేటాను బేస్ చేసుకుని ఈ ర్యాంకులు ఇచ్చింది. ఇలా ర్యాంకులు ఎందుకంటే.. కేవలం ప్రయాణికుల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎయిర్లైన్స్ని ప్రోత్సహించడమేనని ఎయిర్ హెల్ప్ సీఈవో టామ్జ్ పౌల్జిన్ చెబుతున్నారు.2024 సంవత్త్సరానికి అత్యంత చెత్త విమానయాన సంస్థలు..100. స్కై ఎక్స్ప్రెస్101.ఎయిర్ మారిషస్102. తారోమ్103. ఇండిగో104. పెగాసస్ ఎయిర్లైన్స్105. ఎల్ అల్ ఇజ్రాయెల్ ఎయిర్లైన్స్106. బల్గేరియా ఎయిర్107. నౌవెలైర్108. బజ్109. తునిసైర్2024 సంవత్సరానికి అత్యుత్తమ విమానయాన సంస్థలు..10. ఎయిర్ సెర్బియా9. వైడెరో8. ఎయిర్ అరేబియా7. లాట్ పోలిష్ ఎయిర్లైన్స్6. ఆస్ట్రియన్ ఎయిర్లైన్స్5. ప్లే (ఐస్లాండ్)4. అమెరికన్ ఎయిర్లైన్స్3. యునైటెడ్ ఎయిర్లైన్స్2. ఖతార్ ఎయిర్వేస్1. బ్రస్సెల్స్ ఎయిర్లైన్స్ఈసారి బ్రస్సెల్స్ ఎయిర్లైన్స్ 2018 నుంచి ర్యాంకింగ్స్లో ఆధిపత్యం చెలాయించి.. ఖతార్ ఎయిర్వేస్ను వెనక్కు నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. యునైటెడ్ ఎయిర్లైన్స్, అమెరికన్ ఎయిర్లైన్స్, ఈ ఏడాది గణనీయమైన కార్యాచరణ అంతరాయాలను ఎదుర్కొన్నప్పటికీ..మంచి పనితీరును కొనసాగించి మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక కెనడియన్ క్యారియర్ ఎయిర్ ట్రాన్సాట్ 36వ స్థానంలో నిలవగా, డెల్టా ఎయిర్ లైన్స్ 17వ స్థానానికి పడిపోయింది. అలాగే జెట్బ్లూ, ఎయిర్ కెనడా దిగువ 50 స్థానాల్లో నిలిచాయి. అలాస్కా ఎయిర్లైన్స్ కూడా 88వ స్థానానికి పరిమతమయ్యింది.ఇండిగో స్పందన:భారత్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వే ఫలితాలపై స్పందించింది. సదరు గ్లోబల్ ఎయిర్లైన్స్ ఎయిర్ హెల్ప్ ఇచ్చిన ర్యాంక్ని ఖండిచింది. తమ సంస్థ కస్టమర్లకు మంచి ప్రయాణ అనుభవాన్ని ఇస్తుందని స్పష్టం చేసింది. కస్టమర్ పిర్యాదులు కూడా తక్కువేనని పేర్కొంది ఇండిగో. భారత ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకారం..తొమ్మిది నెలల కాలంలో 7.25 కోట్లకు పైగా ప్రయాణికులను తీసుకెళ్లడమే గాక 61.3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. అంతేగాక నెలవారీగా కస్టమర్ పిర్యాదులను, సమయాపాలన డేటాను ప్రచురిస్తామని కూడా ఇండిగో స్పష్టం చేసింది. గ్లోబల్ ఎయిర్లైన్స్ ఎయిర్ హెల్ప్ విశ్వసనీయత లేని విధంగా ర్యాంకులు ఇచ్చిందని, తమ విమానయాన సంస్థ డేటాని పరిగణలోనికి తీసుకుని ఇచ్చిన ర్యాంకు మాత్రం కాదని ఆరోపించింది. (చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక) -
ప్రపంచ కుబేరుడు 'మస్క్' కార్ల ప్రపంచం (ఫోటోలు)
-
దస్తన్ ఆటో వరల్డ్ కార్ల మ్యూజియం
రోల్స్రాయిస్, జాగ్వార్, బెంట్లీ, లాగోండా, క్యాడిలాక్, ఆస్టిన్, మెర్సిడెస్, ఆంబుమ్స్, హెచ్జె ముల్లినర్, అర్థర్ ముల్లినర్, విండోవర్స్, పార్క్ వార్డ్... ఈ కార్లన్నింటినీ ఒకే చోట చూడాలంటే దస్తన్ ఆటోవరల్డ్ వింటేజ్ మ్యూజియానికి వెళ్లాలి. మన హైదరాబాద్లో నిజాం నవాబు సేకరించిన కార్లను చౌమొహల్లా ΄్యాలెస్లో చూడవచ్చు. ఈ కలెక్షన్కు పదింతలు పెద్ద కలెక్షన్ అహ్మదాబాద్లోని ఆటో వరల్డ్ వింటేజ్ మ్యూజియంలో ఉంది. రెండువేల రెండు వందల ఎకరాల్లో విస్తరించిన ఈ మ్యూజియంలో మూడు వందలకు పైగా మోటారు వాహనాలుంటాయి. గాంధీ సినిమాలో ఉపయోగించిన మేబాష్ కారును కూడా చూడవచ్చు. అలాగే 1923 రోల్స్ 20 మోడల్ కూడా ఉంది. అహ్మదాబాద్ నగర శివారులో సర్దార్ పటేల్ రింగ్రోడ్, కత్వారాలో ఉన్న ఓ ఉన్న ఈ మ్యూజియం గిన్నిస్ రికార్డ్స్లో నమోదైంది. ప్రియమైన ప్రయాణం!ఈ మ్యూజియంలో ఉన్న బైక్లు, గుర్రపు బగ్గీలు, కార్లను సేకరించిన వ్యక్తి పేరు ప్రణ్లాల్ భోగిలాల్. రకరకాల కార్ల మీద ఆయనకున్న మోజు ఇలా మ్యూజియం రూపంలో కొలువుతీరింది. ఈ కార్లతో ఫొటో తీసుకోవాలనే సరదా కలిగితే ఒక్కో ఫొటోలకి వంద రూపాయలిచ్చి ఫొటో తీసుకోవచ్చు. వింటేజ్ కారులో ప్రయాణించాలనే సరదా కలిగితే అదీ సాధ్యమే. అయితే అత్యంత ప్రియమైన ప్రయాణమనే చెప్పాలి. ట్రిప్కి వెయ్యి రూపాయల వుతుంది. బరువైన బాడీ, పాత మోటర్లు కావడంతో నాలుగు లీటర్ల పెట్రోలు పోస్తే కిలోమీటరు ప్రయాణిస్తాయి. టూరిస్టులను మ్యూజియం బయటకు రెండు–మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకువస్తారు. కారు ఎక్కేటప్పుడు ఒకరు వచ్చి డోర్ తీస్తారు, కూర్చోగానే డోర్ వేసేసి సెల్యూట్ చేస్తారు. తల΄ాగా చుట్టుకున్న డ్రైవర్ మన ఫోన్ తీసుకుని ఒక ఫొటో తీసిచ్చి ఆ తర్వాత కారు నడుపుతాడు. గంట కొట్టే కారుమ్యూజియం ఉద్యోగులు మేబాష్ కారును చూపిస్తూ ‘ఇది మేబాష్ తొలి కారు. ఈ కారును డిజైన్ చేసిన వ్యక్తి మనుమడు జర్మనీ నుంచి వచ్చి చెందిన 6 సిలిండర్ మేబాష్ కారును తనకు అమ్మవలసిందిగా కోరాడని, తన ఆటో ట్రెజరీ నుంచి అంత విలువైన కారును వదులుకోవడానికి ప్రాణ్లాల్ మనసు అంగీకరించలేదని చెబుతారు. ఈ మ్యూజియం అంతటినీ తిరిగి చూడాలంటే ఐదారు గంటలు పడుతుంది. సుడిగాలి పర్యటనలా చుట్టిరావాలన్నా కూడా మూడు గంటల సమయం పడుతుంది. గంట కొడుతూ ప్రయాణించే కారు చిన్న పిల్లలను ఆకట్టుకుంటుంది. ఇంజన్ మోడల్, చాసిటీ వంటి వివరాలు యువతను కట్టిపడేస్తాయి. ఇక్కడ పర్యటిస్తే ప్రపంచంలో మోటారు రంగం ఆవిర్భావం నుంచి నేటి వరకు పరిణామక్రమం అవగతమవుతుంది. దస్తన్ ఆటో వరల్డ్ వింటేజ్ మ్యూజియంలోకి ఎంట్రీ టికెట్ వంద రూపాయలు, పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన రెస్టారెంట్లో కాంప్లిమెంటరీ టీ ఇస్తారు. అహ్మదాబాద్ వెళ్లినప్పుడు గాంధీ ఆశ్రమం, సయ్యద్ సిద్ధిఖీ జాలీలతోపాటు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
2025.. ప్రపంచం అంతానికి ఆరంభం: బాబా వంగా కాలజ్ఞానం
బాబా వంగా.. దివ్యదృష్టి కలిగిన బల్గేరియన్ కాలజ్ఞాని. ఈమెను ‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్’ అని కూడా పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం లాంటి ప్రధాన సంఘటనలను ఈమె ముందుగానే ఊహించారని చెబుతారు. రాబోయే సంవత్సరం అంటే 2025లో జరగబోయే ఒక ఘటన గురించి బాబా వంగా ముందుగానే చెప్పారు.2025లో ఐరోపాలో జరిగే ఒక భారీ యుద్ధం గురించి వంగా ముందుగానే హెచ్చరించారు. ఇది ప్రపంచ జనాభాకు భారీ చేటు తీసుకురానున్నదని ఆమె పేర్కొన్నారు. 5079 నాటికి మానవజాతి పూర్తిగా నాశనమవుతుంది.. అందుకు 2025లో ప్రపంచం అంతమయ్యేందుకు బీజం పడుతుందని బాబా వంగా తీవ్రంగా హెచ్చరించారు. 2043 నాటికి యూరప్ ముస్లిం పాలనలోకి వస్తుందని, 2076 నాటికి కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుందని ఆమె అంచనా వేశారు.2025 నాటికి భూమిపై గ్రహాంతర జీవులు కనిపిస్తాయని, ఈ జీవులు భూమిపై తమ ఉనికిని చాటుకుంటాయని ఆమె పేర్కొన్నారు. కాగా 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ కూడా ఇదే విధమైన అంచనాలు అందించారు. ఆయన 2025లో జరగబోయే యూరోపియన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. బాబా వంగా భవిష్యత్లో జరగబోయే వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కరువు, అడవులలో కార్చిచ్చు తదితర పర్యావరణ విపత్తులను ముందుగానే అంచనా వేశారు. 1911 అక్టోబర్ 3న జన్మించిన బాబా వంగా తన 84వ ఏట 1996 ఆగస్టు 11న కన్నుమూశారు. నిజమైన బాబా వంగా అంచనాలురెండవ ప్రపంచ యుద్ధం: విధ్వంసం, భారీ మరణాల అంచనాసోవియట్ యూనియన్ విచ్ఛిన్నం: యూఎస్ఎస్ఆర్ పతనాన్ని 1991కి ముందే ఊహించారు.చెర్నోబిల్ విపత్తు: 1986లోనే బాబా వంగా అంచనా వేశారు.స్టాలిన్ మరణం: బాబా వంగా ముందుగానే చెప్పారు.కుర్స్క్ జలాంతర్గామి విపత్తు: 2000కి ముందుగానే వంగా ఊహించారు. సెప్టెంబర్ 11 దాడులు: ‘ఉక్కు పక్షులు’ అమెరికాపై దాడి చేస్తాయని బాబా వంగా ముందుగానే అంచనా వేశారు. 2004 సునామీ: హిందూ మహాసముద్రంలో విధ్వంసకర సునామీ ప్రమాదం.1985 భూకంపం: ఉత్తర బల్గేరియాలో భూకంపం.9/11 దాడులతో సహా పలు ముఖ్యమైన సంఘటనలలో బాబా వంగా భవిష్య అంచనాలు 85శాతం వరకూ నిజమయ్యాయని కొందరు నిపుణులు చెబుతుంటారు.ఇది కూడా చదవండి: బ్యాటరీలు, బ్లేడ్లు సహా పొట్టలో 56 వస్తువులు -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు ఇవే.. ధర తెలిస్తే షాకవుతారు! (ఫోటోలు)
-
World Students Day: అబ్ధుల్ కలాం స్ఫూర్తిగా..
విద్యార్థి దశలో నేర్చుకున్న అంశాల ఆధారంగానే పిల్లలు ఉత్తమ పౌరులుగా రూపొందుతారు. మనిషి జీవితంలో విద్యార్థి దశ అత్యంత కీలకమైనది. ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ప్రతియేటా అక్టోబర్ 15న నిర్వహిస్తుంటారు.ఈరోజు (అక్టోబర్ 15) దేశ మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి. ఆ మహనీయుని గౌరవార్థం ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అబ్దుల్ కలాం విద్యార్థులకు స్ఫూర్తిదాయకునిగా నిలిచారు. ఆయన విద్యారంగంలో ప్రశంసనీయమైన కృషి చేశారు. డాక్టర్ ఏపీ జె కలాం ప్రజా రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు.ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేక థీమ్తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం (2024) థీమ్ 'విద్యార్థుల భవిష్యత్తు కోసం సంపూర్ణ విద్య'. విద్యను కేవలం అకడమిక్ అచీవ్మెంట్లకే పరిమితం చేయకుండా, విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడమే లక్ష్యంగా ఈ ఏడాది ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2010 (అబ్దుల్ కలాం 79వ జయంతి) నుంచి ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఆయన 2002, జూలై 18న దేశానికి 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.ప్రపంచ విద్యార్థుల దినోత్సవం రోజున కలాం సాధించిన విజయాలు, విద్యార్థులకు అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకుంటారు. కలాం 2002 నుండి 2007 వరకు దేశానికి 11వ రాష్ట్రపతిగా ఉన్నారు. తన పదవీకాలంలో ఆయన విద్యార్థులు, యువతపై తనకున్న ప్రేమ, ఆప్యాయతలను వివిధ కార్యక్రమాల్లో వ్యక్తం చేశారు. కలాం అందించిన స్ఫూర్తిదాయకమైన మాటలు ఇప్పటికీ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.ఇది కూడా చదవండి: చేతులు కడుక్కుందాం..ఆరోగ్యంగా ఉందాం..! -
World Standards Day: ప్రమాణాల ప్రాధాన్యత తెలిపేందుకు..
మనం కొనుగోలు చేసే లేదా వినియోగించే ఏ వస్తువుకైనా నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి. వస్తు ప్రమాణీకరణకున్న ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, ప్రతి సంవత్సరం అక్టోబరు 14న ప్రపంచ ప్రమాణాల దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజున ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్(ఐఎస్ఓ)తో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ప్రమాణాల ప్రయోజనాల గురించి అవగాహన కల్పించేందుకు నిపుణులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని పలు సూచనలు, సలహాలు అందజేస్తుంటారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రామాణీకరణ ప్రాముఖ్యత గురించి వినియోగదారులకు అవగాహన పెంచడమే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడంలోని ముఖ్య ఉద్దేశ్యం. తొలిసారిగా ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని 1970లో నిర్వహించారు. ప్రామాణీకరణను సులభతరం చేయడానికి అంతర్జాతీయ సంస్థను రూపొందించాలని నిర్ణయించిన 25 దేశాల ప్రతినిధులు 1956లో సమావేశమయ్యారు. ఈ నేపధ్యంలోనే 1847లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్(ఐఎస్ఓ)ఏర్పాటయ్యింది.సామాజిక అసమతుల్యతలను పరిష్కరించడం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం లాంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఐఎస్ఓ ఏర్పాటయ్యింది. ఇక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే.. భారతదేశంలో ప్రామాణీకరణ కార్యకలాపాలను సామరస్యపూర్వకంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో 1947 సంవత్సరంలో దీనిని స్థాపించారు. 1986లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ ద్వారా ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ పేరును బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్గా మార్చారు. ఈ సంస్థ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖల పరిధిలో పని చేస్తుంది.ఇది కూడా చదవండి: ఓలా.. అలా కుదరదు.. రిఫండ్ ఇవ్వాల్సిందే! -
ప్రపంచంలో భారత ఆహారమే బెస్ట్..
సాక్షి, అమరావతి: ప్రతి దేశంలో విభిన్న ఆహార అలవాట్లు, పద్ధతులు ఉంటాయి. వాటిలో ఏ దేశ ఆహారం, పద్ధతులు ఉత్తమమైనవి అంటే.. కచ్చితంగా భారత దేశానివేనని అంతర్జాతీయ అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. మానవుల ఆరోగ్యంతోపాటు, భూమిపై కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడటంలోనూ భారత ఆహార (ఇండియన్ ఫుడ్ ప్లేట్) పద్ధతులు, సాగు విధానాలే భేషైనవని తేల్చి చెబుతున్నాయి. కొన్ని దేశాల ఆహారం మొత్తం భూమండలానికే డేంజర్ అని కూడా ఆ సంస్థలు లెక్కలు కట్టి మరీ చెబుతున్నాయి. ఆరోగ్యం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో భారత ఆహారం కీలక పాత్ర పోషిస్తోందని స్విట్జర్లాండ్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రపంచ వన్యప్రాణి ఫౌండేషన్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) కూడా తన లివింగ్ ప్లానెట్ పరిశోధనలో తాజాగా వెల్లడించింది. ఎక్కువ శాకాహారం, తక్కువ మాంసాహారం ఉండే భారత విధానం అత్యుత్తమమైనదని తెలిపింది. తక్కువ రసాయన ఎరువులతో ఆరోగ్యకరమైన భారత దేశ సాగు విధానం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని వెల్లడించింది. ఈ పంటల ఉత్పత్తి విధానాన్ని అన్ని దేశాలు అనుసరిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపింది. తద్వారా 2050 నాటికి పర్యావరణ కాలుష్యానికి చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చని సూచించింది. భారత్ తర్వాత ఇండొనేసియా, చైనాలో ఆహార పద్ధతులు భేషైనవని పేర్కొంది. అమెరికా, అర్జెంటీనా, ఆ్రస్టేలియా వంటి దేశాల ఆహార పద్ధతులు ప్రపంచానికి, పర్యావరణానికి ప్రమాదకరమని చెబుతోంది. తృణధాన్యాలతో ఎంతో మేలు భారతదేశ సంప్రదాయ ఆహారంలో తృణ ధాన్యాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది. ప్రజల ఆరోగ్యం, వాతావరణ పరిరక్షణకు తృణ ధాన్యాలు (మిల్లెట్లు) మేలైనవని చెప్పింది. ఉత్తర భారత దేశంలో తృణ ధాన్యాలు, గోధుమ ఆధారిత రోటీలు, అప్పుడప్పుడు మాంసం వంటకాలు, దక్షిణాదిలో ప్రధానంగా అన్నం, ఇడ్లీ, దోస వంటి బియ్యం ఆధారిత ఆహారం, పశ్చిమ,, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో రకరకాల చేపలతో పాటు జొన్న, సజ్జలు, రాగి, గోధుమలు వంటి పురాతన మిల్లెట్లతో అధిక ప్రయోజనాలు కలుగుతున్నాయని పేర్కొంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కొవ్వు, చక్కెర పదార్థాల వినియోగం పెరగడం వల్ల స్తూలకాయులు పెరిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. తక్కువ భూమి వినియోగించాలి.. మేలైన పంటల సాగు ద్వారా వ్యవసాయ భూమిని గణనీయంగా తగ్గించవచ్చని ఆ నివేదిక తెలిపింది. ఇందుకు కూడా భారత విధానాలే ఉత్తమమైనవని తెలిపింది. భారత విధానాలను ఇతర దేశాలు అనుసరిస్తే 2050 నాటికి ప్రపంచ ఆహార ఉత్పత్తికి ఒక భూమి (ఎర్త్)లో 0.84 కంటే తక్కువ అవసరం ఉంటుందని వివరించింది. ఇతర దేశాల్లోని విధానాలే పాటిస్తే మన భూగ్రహం సరిపోదని, ఒకటి కంటే ఎక్కువే అవసరమవుతాయని హెచ్చరించింది. ఉదాహరణకు అర్జెంటీనా ఆహార పద్ధతులను అవలంభిస్తే ఆహార ఉత్పత్తులకు ఏడు భూగ్రహాలు కూడా సరిపోవని వివరించింది. పప్పులు, తృణధాన్యాలు, మొక్కల ఆధారిత ఆహారం, మాంసానికి ప్రత్యామ్నాయంగా అధిక పోషక విలువలు ఉండే ఆల్గే (నీటిలో పెరిగే మొక్కలు) వినియోగించాలని కోరుతోంది. -
World Post Day 2024: ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవంలో..
ఒకటిన్నర శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పోస్టల్ వ్యవస్థ మనుగడ సాగిస్తోంది. ప్రజల దైనందిన జీవితంలో పోస్టల్ రంగానికున్న పాత్ర, ప్రపంచ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో పోస్టల్ వ్యవస్థ సహకారంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు.1874లో స్విట్జర్లాండ్లో ప్రారంభమైన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీయూ) వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ పోస్టల్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవంలో యూపీయూ కీలక పాత్ర పోషించింది. ప్రపంచ తపాలా దినోత్సవం 1969లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పోస్టల్ సేవల ప్రాముఖ్యతను తెలియజెప్పేందుకు అక్టోబర్ 9న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.యూపీయూ స్థాపించి ఈ సంవత్సరానికి 150 ఏళ్లు పూర్తవుతుంది. ప్రపంచ తపాలా దినోత్సవం ప్రారంభమైనది మొదలు కమ్యూనికేషన్లు, వాణిజ్యం, అభివృద్ధిలో పోస్టల్ సేవల ప్రాముఖ్యత మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఈ-కామర్స్, లాజిస్టిక్స్, ఆర్థిక సేవల విషయంలో పోస్టల్ వ్యవస్థ ప్రముఖమైనదిగా మారింది.ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థగా భారతదేశం గుర్తింపు పొందింది. 1774లో వారెన్ హేస్టింగ్స్ కలకత్తాలో జనరల్ పోస్టాఫీసును ప్రారంభించారు. 1837లో కలకత్తా, మద్రాస్, బాంబేలలో తపాలా సేవలను ఆలిండియా సర్వీసుల్లో చేర్చారు. 1852లో మనదేశంలో తొలిసారిగా సింథ్డాక్ అనే తపాలా బిళ్లను విడుదలచేశారు. పూర్తి కథనం: స్మార్ట్గా పోస్టల్ సేవలు -
Cotton Day : పత్తి ఉత్పత్తుల ప్రాముఖ్యత తెలిపేందుకు..
పురాతన కాలం నుంచి పత్తిని దుస్తుల తయారీతోపాటు వివిధ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో పత్తికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించేందుకు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని తొలిసారిగా 2019లో ప్రపంచ ఆహార సంస్థ, అంతర్జాతీయ పత్తి సలహా కమిటీలు సంయుక్తంగా నిర్వహించాయి.ప్రతి సంవత్సరం అక్టోబర్ 7న ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు. పత్తిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంటారు. పత్తి ఉత్పత్తి కోట్లాది మందికి ఉపాధిని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పత్తి ఉత్పత్తి రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడం ప్రపంచ పత్తి దినోత్సవ లక్ష్యం. పత్తిని ఫైబర్ దుస్తుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. ఆహార పదార్థాల తయారీలో కూడా పత్తిని వినియోగిస్తారు.2019లో సహజ ఫైబర్ పత్తి ఉత్పత్తి, వాణిజ్యం, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ ఏడున ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహించడం మొదలుపెట్టారు. ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పత్తి ఉత్పత్తికి సంబంధించిన పలు విషయాలను చర్చించేదుకు పరిశోధకులు, రైతులు, బడా వ్యాపారవేత్తలు ఒక చోట సమావేశం అవుతుంటారు. ఇది కూడా చదవండి: నవరాత్రి సందడిలో కారు ప్రమాదం.. 12 మందికి గాయాలు -
Cerebral Palsy Day: మస్తిష్క పక్షవాతం అంటే..
నేడు వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే.. సెరిబ్రల్ పాల్సీ అంటే మస్తిష్క పక్షవాతం. ఇదొక నరాల వ్యాధి. దీనిపై అవగాహన కల్పించేందుకు సెరిబ్రల్ పాల్సీ డేను అక్టోబర్ 6న నిర్వహిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఒక కోటీ 70 లక్షలకు పైగా సెరిబ్రల్ పాల్సీ కేసులు నమోదయ్యాయి.కొందరికి పుట్టుకతో, మరికొందరికి తలకు గాయమైనప్పుడు మస్తిష్క పక్షవాతం సంభవిస్తుంది. దీని కారణంగా మెదడులో ఎదుగుదల లోపించి కండరాలు, కదలికలపై సమన్వయం అనేది లోపిస్తుంది. బాల్యంలో సంభవించే ఈ వైకల్యానికి జన్యుపరమైన లోపాలే ప్రధాన కారణంగా నిలుస్తాయి. భారతదేశంలోని ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ముగ్గురికి మస్తిష్క పక్షవాతం ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. మస్తిష్క పక్షవాతం సోకిన పిల్లల్లో దొర్లడం, కూర్చోవడం, నడవడం వంటివి ఆలస్యమవుతాయి. ఇది ఆడపిల్లల కంటే కంటే మగపిల్లలలోనే అధికంగా కనిపిస్తుంది.మూడు నెలల వయసులో శిశువును ఎత్తిన సందర్భంలో తల వెనక్కి వాలిపోవడం, శరీరమంతా బిగుసుకోపవడం, కండరాల బలహీనత, ఆరు నెలలకు గానీ దొర్లకపోవడం, రెండు చేతులను కూడదీసుకోవడంలో వైఫల్యం, నోటివద్దకు చేతులు తీసుకురావడంలో సమస్యలు.. ఇవన్నీ మస్తిష్క పక్షవాతం లక్షణాలని వైద్యులు చెబుతుంటారు. ఇది కండరాల తీరు, ప్రతిచర్యలు, భంగిమ సమన్వయాన్ని, కదలికలు, కండరాల నియంత్రణను సమన్వయం చేయక ఇబ్బందులకు గురిచేస్తుంది.గర్భధారణ సమయంలో శిశువు అభివృద్ధిపై ప్రభావం చూపే రుబెల్లా వ్యాధి, శిశువు మెదడుకు రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడటం, ప్రసూతిలో సమయంలో ఆక్సిజన్ కొరత మొదలైనవి మస్తిష్క పక్షవాతానికి దారితీస్తాయి. మస్తిష్క పక్షవాతం నయం చేయలేని వ్యాధులలో ఒకటిగా పరిగణిస్తారు. అయితే మందులు, శస్త్రచికిత్స, స్పీచ్ థెరపీ మొదలైనవి మస్తిష్క పక్షవాతం బాధితులకు ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఈ వ్యాధి బారినపడినవారికి సకాలంలో వైద్యం అందిస్తే వ్యాధిని కొంత వరకు అరికట్టవచ్చని వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవదహనం -
World Teachers Day : టీచర్ల హక్కుల సాధనకు గుర్తుగా..
భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి ఏటా సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినమైన సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్రను గౌరవించడం, విద్యా రంగంలో వారి సేవలను అభినందించడం కోసం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.ఉపాధ్యాయులు వృత్తిపరమైన ఉద్యోగం మాత్రమే చేయరని, వారు చిన్నారులను చక్కని భావిపౌరులుగా తీర్చిదిద్దుతారని ఈరోజు గుర్తుచేస్తుంది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 1994లో ప్రారంభమైంది. ఉపాధ్యాయ విద్య- వారి కార్యాలయంలో ప్రమాణాలపై రూపొందించిన సిఫార్సులను యునెస్కోతో పాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) ఆమోదించినందుకు గుర్తుగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉపాధ్యాయుల హక్కులు, వారి పని పరిస్థితులు, వారి వృత్తిపరమైన బాధ్యతలను ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం గుర్తు చేస్తుంది.ప్రతి సంవత్సరం యునెస్కోతో పాటు విద్యా రంగానికి సంబంధించిన సంస్థలు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం కోసం ఒక ప్రత్యేక థీమ్ను ఎంచుకుంటాయి. 2024 థీమ్ ‘ఉపాధ్యాయుల గొంతుకకు విలువనివ్వడం: విద్య కోసం నూతన సామాజిక ఒప్పందం వైపు పయనం’. ఉపాధ్యాయుల సమస్యలు, వాటి పరిష్కారాలపై దృష్టి పెట్టేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక థీమ్ను ఎంచుకుంటారు. అలాగే ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, విద్యా నాణ్యత మెరుగుదల, నూతన విద్యా విధానాలపై చర్చిస్తారు. ఇది కూడా చదవండి: ఇంటి భోజనం.. భారం! -
‘ఎక్స్’లెంట్ ఫాలోయింగ్! అత్యధిక ఫాలోవర్లున్న ప్రముఖులు (ఫొటోలు)
-
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు (ఫొటోలు)
-
ప్రపంచ విషపూరిత నదుల్లో 23వ స్థానంలో మూసీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ విషపూరిత నదుల్లో హైదరాబాద్లోని మూసీ 23వ స్థానంలో ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మూసీ చుట్టుపక్కల ఉన్న బోర్ వాటర్ కూడా కలుíÙతమైందని, అందుకే దాని పక్కన ఉన్న ప్రజలను తరలించాలని ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. సోమవారం గాం«దీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూసీ పక్కన ఉంటున్న వాళ్ల శరీరంలో హెవీ మెటల్స్ ఉన్నట్లు తేలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పక్కన తాను నివాసం ఉన్నానని, ఆ బాధలు ఏంటో తనకు తెలుసునని స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పా? అని ప్రశ్నించారు. మూసీ, హైడ్రాపై కేటీఆర్, హరీశ్రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ చేయలేని పనిని సీఎం రేవంత్రెడ్డి చేస్తున్నారన్నారు. కేటీఆర్ ఫామ్హౌస్ కట్టుకొని హాయిగా ఉండొచ్చునని, ఇటలీ నుంచి వచ్చే నీళ్లు కేటీఆర్ తాగుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు శనిలాగా దాపురించారని శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. -
అత్యంత ఖరీదైన హ్యాండ్బ్యాగ్లు..కోట్లలోనే..! (ఫొటోలు)
-
World Rose Day 2024: క్యాన్సర్ను జయించాలని కోరుకుంటూ..
రోజ్ డే అనగానే ఎవరికైనా సరే ప్రేమ జంటలకు సంబంధించిన వాలంటైన్స్ వీక్ గుర్తుకువస్తుంది. అయితే ప్రపంచ రోజ్ డేకు ఒక ప్రత్యేకత ఉంది. సెప్టెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రోజ్డే జరుపుకుంటారు. ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై మరింతగా అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.క్యాన్సర్ రోగులకు అంకితం చేసిన నేటి రోజున క్యాన్సర్ బాధితులకు గులాబీలను అందజేసి, వారిలో మానసిక ధైర్యాన్ని కల్పిస్తారు. ప్రపంచ గులాబీ దినోత్సవం ఎప్పుడు ప్రారంభమయ్యింది? దీనివెనుక ఎవరు ఉన్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.కెనడాకు చెందిన మెలిండా అనే బాలిక జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. 12 ఏళ్ల వయసుకే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆ చిన్నారికి వైద్యులు ఎలాంటి వైద్య సహాయం అందించలేకపోయారు. ఆ చిన్నారి ఇక రెండు వారాలు మాత్రమే జీవించి ఉంటుందని తేల్చిచెప్పారు. అయితే మెలిండా ఎంతో ధైర్యంతో ఆరు నెలల పాటు క్యాన్సర్తో పోరాడింది. ఈ సమయంలో ఆ చిన్నారి ఇతర క్యాన్సర్ బాధితులతో గడిపింది. తోటి బాధితులు ఆమెకు కవితలు, కథలు చెబుతూ ఆమెను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు.ఆరు నెలల పాటు క్యాన్సర్తో పోరాడిన ఆ చిన్నారి సెప్టెంబర్లో మృతి చెందింది. దీని తరువాత ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని సెప్టెంబర్ నెలలో నాల్గవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున కేన్సర్ బాధితులకు గులాబీ పూలు అందించి, వారికి ధైర్యం చెబుతూ ప్రపంచమంతా వారికి అండగా నిలుస్తుందనే సందేశాన్ని తెలియజేస్తారు. గులాబీని ప్రేమ, ఆనందాలకు గుర్తుగా పరిగణిస్తారు. క్యాన్సర్తో పోరాడుతున్న వారెవరైనా మీకు తెలిస్తే, మీరు కూడా వారికి గులాబీని అందించి ధైర్యాన్ని చెప్పండి.ఇది కూడా చదవండి: టీనేజ్లో ముఖ్యం.. మానసిక ఆరోగ్యం -
World Gratitude Day: నేనెవరికి థ్యాంక్స్ చెప్తానంటే
థాంక్యూ అమ్మమ్మా!నేను ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పలనుకుని చెప్పలేకపోయింది మా అమ్మమ్మకే. తన ప్రవర్తన ద్వారా మాకు ఒక జీవన విధానాన్ని నేర్పించిందామె. ముఖ్యంగా జీవన సహచరుడితో ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా మెలగాలో, కొట్టకుండా... తిట్టకుండానే పిల్లలను క్రమశిక్షణతో ఎలా పెంచాలో మా అమ్మమ్మ మా అందరితో మెలిగిన తీరు నుంచే మేము నేర్చుకున్నాం. పోదుపు పాఠాల సంగతి సరేసరి. మేమందరం చిన్నప్పుడు మా ప్రతి సెలవులకూ మా అమ్మమ్మ వాళ్లింటికే వెళ్లేవాళ్లం. తన పిల్లలతో΄ాటు మమ్మల్ని అందరినీ చదువుల వైపు, ఉద్యోగాల వైపు ముఖ్యంగా నిజాయితీతో కష్టపడి పనిచేయాలనే తలంపు వైపు, కుల మతాలకు తావులేని ఆదర్శాలవైపు తమ జీవన విధానంతోనే మళ్లించిన మా అమ్మమ్మ, తాతయ్యలు శ్రీమతి వావిలాల సీతాదేవి, వెంకటేశ్వర్లు గార్లకు కృతజ్ఞతలు ఎలా చెప్పలో మాకు అప్పట్లో తెలియలేదు. ఇప్పుడు తెలిసినా, చెప్పడానికి భౌతికంగా వారు మా మధ్య లేదు. అయితేనేం, మా జ్ఞాపకాలలో పదిలంగా ఉన్న మా అమ్మమ్మ, తాతయ్యలకు ఈ రోజున గుండెలనిండుగా థాంక్స్ చెప్పుకునే అవకాశం మాకు కల్పించిన సాక్షికి కూడా థాంక్స్.– తెల్కపల్లి ఇందిరా ప్రియదర్శిని, కంభం మా వారికే నా థాంక్స్నేను థాంక్స్ చెప్పేది ముందుగా మా వారికే. ఎందుకంటే కుటుంబ పరిస్థితుల రీత్యా పెళ్లయ్యే సమయానికి నేను అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేయగలిగాను. అయితే ఇంకా చదువుకోవాలని ఉందన్న నా మనసు గ్రహించింది మా వారు జేవీఎస్ రామారావు గారే. ఇంటిలో పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, నేను చదువుకునేందుకు ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనతో΄ాటు మా అత్తగారు, మా మామగారు, వదినగారు కూడా చదువుకుని ఉద్యోగం చేయడంలో ఎంతగానో సహకరించారు. ఇప్పుడు నేను మూడు పీజీలు, రెండు డిగ్రీలు, రెండు డిపామాలు, ఎం.ఈడీ. చేసి ఉద్యోగం చేస్తూ కూడా మరికొద్దికాలంలోనే పీహెచ్డీ కూడా పూర్తి చేయబోతున్నానంటే అందుకు మా వారి ప్రోత్సాహ సహకారాలే కారణం. అందుకే మా వారికే నా ధన్యవాదాలు. – డి.ఎల్. అనూరాధ, భద్రాద్రి కొత్తగూడెంతండ్రి తర్వాత తండ్రి లాంటి...నేను నా జీవితంలో నా తల్లిదండ్రుల తర్వాత అంతగా రుణ పడిన ఏకైక వ్యక్తి మా మేనమామ కొన్నూరు సత్యారెడ్డిగారే. నా చిన్నప్పుడు నా సోదరుడి అనారోగ్య పరిస్థితుల్లో, నా తల్లిదండ్రులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే వారికి అండగా ఉంటూ, నన్ను గుండెలపై పెట్టి పెంచుకున్న ఆ రోజులను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆయన ప్రేమతో పెట్టిన గోరుముద్దలతో పెరిగిన ఈ దేహం పడిపోయే వరకూ ఆయన పేరు కాపాడుకుంటూ నిలబడే ఉంటుంది. నన్ను పెంచి పెద్ద చేసి, విలువలు నేర్పి, ఇంతవాణ్ణి చేసిన నా మేనమామకు సాక్షి పత్రిక వేదికగా కృతజ్ఞతలు తెలుపుతున్నందుకు సంతోషిస్తున్నాను. – లంకల అన్వేశ్వర్ రెడ్డి, కుమార లింగం పల్లి, మహబూబ్నగర్ జిల్లా -
కిన్మేమై బియ్యం గురించి విన్నారా? ధర తెలిస్తే కంగుతింటారు!
మనం చూసే సాధారణ తెల్లటి బియ్యం మాదిరిగానే ఉంటాయి జపాన్కి చెందిన కిన్మేమై బియ్యం. అయితే దీన్ని ప్రత్యేకమైన ప్రాసెసింగ్ పద్ధతిలో తయారు చేస్తారు. జపాన్ వాళ్లు ఈ బియ్యాన్నితాము పేటెంట్ పొందిన ప్రత్యేక సాంకేతిక ప్రక్రియలోనే అభివృద్ది చేశారు. ముఖ్యంగా ఆహార ప్రియలుకు మంచి పోషాకాలను అందించే దృష్ట్యా ప్రత్యేకంగా రూపొందించిన బియ్యం. అయితే ఈ బియ్యం స్పెషాలిటీ ఏంటంటే వండే ముందు కడగాల్సిన పని ఉండదు. అంటే వీటి వాడకం వల్ల నీటి వృధాను తగ్గించొచ్చు. ఇవి రుచికి కమ్మదనంతో కూడిన స్వీట్నెస్గా ఉంటాయి. చూసేందుకు కూడా చాలా వెన్న మాదిరి సున్నితంగా ఉంటుంది. పోషకాల పరంగా సంప్రదాయ తెల్ల బియ్యం కంటే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు బ్రౌన్ రైస్ మాదిరి ప్రయోజనాలకు కూడా అందిస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేకమైన చెస్ట్నట్ రంగు ఉన్నతమైన పోషకాహార ప్రొఫైల్ని కలిగి ఉంటుంది. అలాగే తొందరగా ఉడికిపోతుంది.ఆరోగ్య ప్రయోజనాలు..ఇవి తెలుపు, గోధుమ వంటి రెండు రకాల్లోనూ లభ్యమవుతాయి. ఇందులో ఊక ఉంటుంది.సాధారణ బియ్యం కంటే 1.8 రెట్లు ఫైబర్, ఏడు రెట్టు విటమిన్ బీ1 కలిగి ఉంది. ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదర్కొనడంలో సహాయపడుతుంది. ఇందులో ఆరు రెట్లు లిపోపాలిసాకరైడ్లు(ఎల్పీఎస్)ను కలిగి ఉంది. ఫ్లూ, ఇన్ఫెక్షన్లు, కేన్సర్, డిమెన్షియా(చిత్త వైకల్యం) వంటి వ్యాధులతో పోరాడేలా రోగనిరోధక వ్యవస్థకు సహజమైన బూస్టర్.కడుపు ఉబ్బరం, అజీర్ణం తదితర సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే అన్నం అధిక నీటిని పీల్చుకోకుండా చేస్తుంది కాబట్టి ఇది బ్రౌన్ రైస్కి సమానమైన ఆరోగ్య ప్రయోజనాలను అందింగలదని చెబతున్నారు నిపుణులు. ధర..మార్కెట్లో ఈ బియ్యం కిలో ధర రూ.15 వేలు పలుకుతోంది. ధరల పరంగా అత్యంత ఖరీదైన బియ్యంగా ప్రపంచ రికార్డు సాధించింది. అయితే జపాన్లో ఈ బియ్యాన్ని ఒక పెట్టేలో 140 గ్రాముల చొప్పున ఆరు ప్యాకెట్లుగా ప్యాక్ చేసి విక్రయిస్తుంటారు. దీని ధర రూ. 13000/-కిన్మెమై రైస్ని టోయో రైస్ కార్పొరేషన్ రూపొందించింది. ఈ రైస్ కార్పొరేషన్ వాకయామాలో 1961 స్థాపించబడింది. అక్కడే ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్పొరేషన్ సాంకేతికలో మెరుగుదల ఈ కిన్మెమై రైస్ అభివృద్ధికి దారితీసిందని జపాన్ అగ్రికల్చర్ నిపుణులు చెబుతున్నారు.(చదవండి: టైటానిక్ మూవీ నటి 48 ఏళ్ల వయసులో టెస్టోస్టెరాన్ థెరపీ! మహిళలకు మంచిదేనా..?) -
ప్రపంచంలో అతి పెద్ద ఇన్డోర్ స్కీయింగ్ పార్క్
సినిమాల్లో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో స్కీయింగ్ చూస్తాం. మంచు మీద స్కీస్ బిగించుకుని చాలా వేగంగా దూకుతూ ముందుకెళతారు. స్కీయింగ్లో మాగ్జిమమ్ ఎంత స్పీడ్గా వెళ్లవచ్చో తెలుసా? గంటకు 250 కిలోమీటర్లు. అవును. పారిస్లో సిమోన్ బిల్లీ అనే స్కియర్ ఈ ఘనత సాధించాడు. మన దేశంలో జనవరి నుంచి మార్చి మధ్యలో కశ్మీర్లో, హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో స్కీయింగ్ చేసేంత మంచు ఉంటుంది. ఆ సీజన్లో టూరిస్ట్లు వెళ్లి స్కీయింగ్ చేస్తారు. ఆ సీజన్ తర్వాత ఊరికే కూచోవాల్సిందే. అయితే చైనా వాళ్లు సంవత్సరం పోడుగునా స్కీయింగ్ చేయొచ్చు కదా అనుకున్నారు. అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద ఇండోర్ స్కీయింగ్ పార్క్లో ఇటీవల షాంఘైలో ప్రాంరంభించారు. దీని పేరు ‘ఎల్ స్నో స్కీయింగ్ థీమ్ రిసార్ట్’.90 వేల చదరపు మీటర్లలోస్కీయింగ్ చాలా దూరం వరకూ చేయాల్సిన స్పోర్ట్. ఔట్డోర్ అయితే మంచు మైదానం ఉంటుంది. కాని ఇండోర్లో అంటే కష్టమే. అయినా సరే చైనావాళ్లు 90 వేల చదరపు మీటర్ల పార్క్లో కృత్రిమ మంచు మైదానం సృష్టించారు. ఇందుకోసం 72 కూలింగ్ మిషీన్లు 33 స్నోమేకింగ్ మెషిన్లు ఉపయోగిస్తారు. అంటే ఎప్పుడూ లోపలి ఉష్ణోగ్రత 0 డిగ్రీల కంటే తక్కువే ఉంటుంది.సహజమైన మంచు లేకచైనాలోని ఉత్త ప్రాతంలో మంచు కొండలు ఉన్నాయి. చైనీయులు అక్కడ స్కీయింగ్ చేయడానికి వెళతారు. అయితే సహజమైన మంచు మైదానాల్లో ప్రమాదాలు ఎక్కువ. పైగా గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు పలుచబడుతోంది. అందువల్ల చైనీయులు తమకో స్కీయింగ్ ΄ార్క్ కావాలని కోరుకున్నారు. వారి ఆలోచనలకు తగినట్టుగా ఇప్పుడు పార్క్ తయారైంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉండటానికి గదులు షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. నగరంలో ఉంటూనే మంచు ప్రాంతానికి వెళ్లివచ్చిన అనుభూతిని పోందవచ్చు. పిల్లలు ఈ పార్క్ గురించి విన్న వెంటనే వెళ్దామని అంటున్నారట. మనం వెళ్లలేం. ఇక్కడ ఫొటోలు చూడటమే. -
ఆఫ్రికాపై చైనాకు ఎందుకంత ప్రేమ?
ఆఫ్రికా దేశాలపై చైనా ఎన్నో వరాలు కురిపించింది. 51 బిలియన్ డాలర్ల ఆర్థిక సహకారం, పది లక్షల ఉద్యోగాలు, సైనిక శిక్షణ... ఇలా అనేక హమీల వరదను పారించింది. ఒక వైపు చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతోంది. మరో వైపు అమెరికా సహా పశ్చిమ దేశాలతో భౌగోళిక, రాజకీయ ఘర్షణలు, వ్యాపార ఆంక్షలు ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్ కుంచించుకుపోతోంది. చైనా దౌత్యానికి, ఆర్థిక వ్యవస్థకు ఊపు తేవటానికి ఆఫ్రికా దోహదకారి అవుతుందని భావించింది. ఈ పూర్వరంగంలో ‘బీజింగ్ సమ్మిట్ ఆఫ్ ది ఫోరమ్ ఆన్ చైనా–ఆఫ్రికా కోఆపరేషన్’ (ఎఫ్ఓసీఏసీ) అనే సదస్సును మూడు రోజుల పాటు (2024,సెప్టెంబర్ 4–6) చైనాలో నిర్వహించింది. కోవిడ్ అనంతరం చైనా నిర్వహించిన అతి పెద్ద కార్యక్రమం ఇదే.ఈ సదస్సు ద్వారా ప్రధానంగా రెండు లక్ష్యాలను సాధించాలని భావించింది. మొదటిది గ్లోబల్ సౌత్లో తన ప్రభావాన్ని పెంచుకోవటం. రెండోది చైనా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా చూసుకోవటం. గ్లోబల్ సౌత్ లో ఆఫ్రికా అత్యంత ముఖ్యమైంది. అందుకే ఈ ఖండం మనసు గెలుచుకోవటానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సర్వశక్తులు వెచ్చించారు. ఆఫ్రికాలో మొత్తం దేశాలు 54 ఉంటే 53 దేశాలు సదస్సులో పాల్గొన్నాయి. 2023 నాటికి, అమెరికాను అధిగమించి 282 బిలి యన్ డాలర్లతో చైనా ఆఫ్రికాకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. ఆఫ్రికా మినరల్స్, ఫ్యూయల్స్, మెటల్స్ చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మరో వైపు ఆఫ్రికా రుణదాతల్లో చైనా అగ్రగామిగా ఉంది. గత 20 ఏళ్లలో అది అందించిన రుణం 696 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు ప్రకటించిన 51 బిలియన్ డాలర్లు (360 బిలియన్ యువాన్లు) పెద్ద ఎక్కువేం కాదు అంటున్న వాళ్లూ ఉన్నారు. ఇందులో రుణాలుగా కొంత (210 బిలి యన్ల యువాన్లు), సహాయంగా కొంత (80 బిలియన్ల యువాన్లు), పెట్టుబడులుగా కొంత (70 బిలియన్ల యువాన్లు) అందించాలని బీజింగ్ నిర్ణయించింది. ఇదంతా వచ్చే మూడేళ్ల కాలంలో చేయాలనేది చైనా ఆలోచన. జిన్పింగ్ తన ప్రసంగంలో ఎక్కడా రుణం అన్న మాట వాడకుండా జాగ్రత్తగా ఆర్థిక సాయం అన్న పదాన్ని మాత్రమే ఉపయోగించారు. ఆఫ్రికాతో కేవలం వాణిజ్య సంబంధాలను మాత్రమే కాదు, రాజకీయంగా, ఆర్థికంగా సంబంధాలను ఉన్నతీకరించుకోవాలని భావిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ‘మనం అంతా కలిసి రైళ్లు, రోడ్లు, వంతెనలు, స్కూళ్లు, హాస్పిటళ్లు, స్పెషల్ ఎకనమిక్ జోన్లు నిర్మించుకున్నాం. ఈ ప్రాజెక్టులు ఎంతో మంది ప్రజల జీవితాలను, వారి అదృష్టాన్ని మార్చి వేశాయి’ అని జిన్పింగ్ గుర్తు చేశారు. ఈ దఫా ఆర్థిక సాయం డాలర్లలో కాకుండా చైనా యువాన్ల రూపంలో ఉంటుందని బీజింగ్ ప్రకటించింది. చైనా కరెన్సీని అంతర్జాతీయం చేయాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఆఫ్రికాలో పది లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తారు. ఇందుకోసం కనెక్టివిటీని పెంచేందుకు ప్రత్యే కంగా 30 ప్రాజెక్టులను చేపడతారు. మరో వెయ్యి చిన్న ప్రాజెక్టులను చేపడతారు. 140 మిలియన్ డాలర్లతో సైన్యా నికి ఆర్థిక సహకారం, శిక్షణ అందిస్తారు. ఆరువేల మంది సైనికులకు, వెయ్యి మంది పోలీసు అధికారులకు శిక్షణ అందిస్తారు. ఆఫ్రికా పారిశ్రామికీకరణకు అవరోధంగా నిలిచిన ఇంధన సమస్యను కూడా పరిష్కరిస్తామని చైనా హామీ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి అతి తక్కువ అభివృద్ధి సాధించిన దేశాలుగా పేర్కొన్న 33 ప్రాంతాల్లో ఓపెన్ మార్కెట్లు ప్రారంభిస్తామని (జీరో టారిఫ్లతో) ప్రకటించింది. ఇవన్నీ బీజింగ్కు ఉపయోగపడే అంశాలు. మా సంగతి కూడా ఆలోచించండి అని అడిగారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్ఫోసా. బదులుగా ‘వాణిజ్య మిగులు 64 బిలియన్ డాలర్లు ఉంది. మీ దగ్గర నుంచి రా మెటీరియల్, డెయిరీ ప్రోడక్ట్స్ మేము కొనుగోలు చేస్తాం’ అని చైనా హామీ ఇచ్చింది. అంతే తప్ప మరే రకమైన ప్రకటనలు చేయలేదు. అప్పుల ఊబిలోకి ఆఫ్రికా దేశాలు రుణమాఫీ చేసి తమకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని చాలా ఆఫ్రికా దేశాలు కోరుతున్నాయి. మైనింగ్, ఇంధన రంగంలో ప్రైవేటు పెట్టుబడుల పోర్టుఫోలియోను వికేంద్రీకరించమని కోరుతున్నాయి. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ పెద్ద ప్రాజెక్టులను నిభాయించగలిగే పరిస్థితిలో లేదు. చైనా చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్టులు ఆఫ్రికా దేశాలను అప్పుల ఊబిలోకి లాగేస్తు న్నాయి. దాదాపు ఆరు బిలియన్ డాలర్ల అప్పుతోజాంబియా ఎగవేతదారుల్లో ఉంది. అలాగే ఘనా, ఆంగోలాలు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఇదే విషయాన్ని సదస్సులో చెప్పారు. ‘ఆఫ్రికా రుణాలనేవి భరించలేని దశకు చేరాయి, ఆర్థిక సుస్థిరత దెబ్బతింటోంది’ అని ప్రకటించారు. బీజింగ్ మాత్రం దీనికి స్పందించలేదు. రుణామాఫీ కాదు, కనీసం రుణాలను పునర్వ్యవస్థీకరిస్తుందని ఆఫ్రికా దేశాలు ఆశించాయి. కానీ చైనాది పెట్టుబడి దారు మనస్తత్వం. అది తన వ్యాపార ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. మరి తాజా హామీలు ఆఫ్రికా దేశాలపై ఏ రకమైన ప్రభావం చూపుతాయో భవిష్యత్తులో కానీ ప్రపంచానికి అర్థం కాదు.– డా‘‘ పార్థసారథి చిరువోలు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో శ్రీశైలం దేవస్థానం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం దేవస్థానానికి లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కల్పించినట్లు ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఇలియాజర్ తెలిపారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దీనికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో డాక్టర్ ఉల్లాజి ఇలియాజర్ సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని దేవస్థానం ఈవోకి అందజేశారు. ఆలయ ఈవో డి.పెద్దిరాజు మాట్లాడుతూ శ్రీశైల క్షేత్ర ప్రత్యేకతలను వివరించారు. శ్రీశైలక్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలసిన క్షేత్రం కావడం, ప్రధానాలయ విస్తీర్ణం, ప్రధాన ఆలయాల ఎత్తు, వెడల్పు, ప్రధానాలయం చుట్టూగల అరుదైన శిల్పప్రాకారం, క్షేత్రంలోని ప్రాచీన కట్టడాలు, నందీశ్వరుడు సైజు, ఆలయ నిర్మాణం మొదలైన అంశాల ఆధారంగా శ్రీశైల ఆలయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో చేర్చినట్లు ఉల్లాజి ఇలియాజర్ చెప్పారు. దక్షిణ భారత్లో ఈ తరహా క్షేత్రాలు ఉంటే 9000798123 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
ప్రపంచ దేశాల్లో పర్యాటక రంగం కొత్త పుంతలు (ఫొటోలు)
-
Teachers' Day 2024 : ప్రపంచంలో తొలి పాఠశాల ఎలా ప్రారంభమయ్యింది?
మనిషి జీవితంలో గురువు పాత్ర అమోఘమైనది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి కూడా. అయితే ప్రపంచంలోని మొట్టమొదటగా పాఠశాల ఎలా ప్రారంభమయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రపంచంలోని మొట్టమొదటి ప్రొఫెషనల్ టీచర్గా కన్ఫ్యూషియస్ గుర్తింపు పొందారు. 551 బీసీలో చైనాలో జన్మించిన తత్వవేత్త కన్ఫ్యూషియస్ ఒక ప్రైవేట్ ట్యూటర్గా జీవితం ప్రారంభించారు. కొంతమంది గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ను మొదటి గురువుగా పరిగణించినప్పటికీ, కన్ఫ్యూషియస్ను కూడా అదేవిధంగా భావిస్తారు. కన్ఫ్యూషియన్ చైనాలోని ఒక పేద కుటుంబంలో జన్మించాడని చెబుతారు. ఆయన స్వతహాగా సంగీతం, చరిత్ర, గణితం నేర్చుకున్నాడు. ఆ కాలంలో రాజకుటుంబంలోని పిల్లలకు మాత్రమే విద్యనభ్యసించే అవకాశం ఉండేది. అయితే కన్ఫ్యూషియస్ విద్య అనేది అందరికీ చేరాలని కోరుకున్నాడు. అందుకే అతను ట్యూటర్గా మారి, అందరికీ విద్యను బోధించడం ప్రారంభించారు.3,000 బీసీ నాటికే ఈజిప్టులో పాఠశాల విద్య ప్రారంభమైంది. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తెలిపిన వివరాల ప్రకారం ఈజిప్టులో రెండు రకాల అధికారిక పాఠశాలలు నెలకొల్పారు. ఒకటి క్లరికల్ పనులు నేర్చించేందుకు, మరొకటి పండిత శిక్షణ కోసం కేటాయించారు. ఐదేళ్ల వయసు గల పిల్లలను ఈ పాఠశాలల్లో చేర్పించేవారు. వారికి 16-17 ఏళ్లు వచ్చేవరకూ విద్యను బోధించేవారు. -
ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పాదనలో భారత్ నంబర్ వన్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను భారత్ ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ఒక ఏడాదిలో 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది రెండవ అతిపెద్ద ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిదారు కంటే రెండు రెట్లు అధికం. యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం ఉత్పత్తి అవుతోంది.ఈ అధ్యయనం ప్రకారం ఈ 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ గ్లోబల్ సౌత్ నుండి వస్తుంది. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన కోస్టాస్ వెలిస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఒకచోట చేరిస్తే, అది న్యూయార్క్ నగరంలోగల సెంట్రల్ పార్క్లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్తుకంటే అధికంగా ఉంటుంది. పరిశోధకులు ఈ అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా 50 వేలకు పైగా నగరాలు, పట్టణాలలో స్థానికంగా ఉత్పత్తి అయిన వ్యర్థాలను పరిశీలించారు.ఈ అధ్యయన ఫలితాలు నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం బహిరంగ వాతావరణంలో కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశీలించింది. ప్రపంచ జనాభాలో 15 శాతం మంది నుంచి వస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పారవేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఆగ్నేయాసియా, సబ్-సహారా ఆఫ్రికాలో అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తికి ఇదే ప్రధాన కారణమని అధ్యయనం వెల్లడించింది. ఈ 15 శాతం జనాభాలో భారతదేశంలోని 25.5 కోట్ల మంది ఉన్నారు.నైజీరియాలోని లాగోస్ ప్రపంచంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ ప్లాస్టిక్ కాలుష్యాన్ని విడుదల చేస్తోంది. ఇదేవిధంగా న్యూఢిల్లీ, లువాండా, అంగోలా, కరాచీ, ఈజిప్ట్లోని కైరోలు ప్లాస్టిక్ కాలుష్య కారకాల విడుదలలో అగ్రస్థానంలో ఉన్నాయి. చైనా ఈ విషయంలో నాల్గవ స్థానంలో ఉంది. వ్యర్థాలను తగ్గించడంలో ఆ దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తోందని వెల్లడయ్యింది. -
ప్రపంచ కొబ్బరి దినోత్సవం: కొబ్బరితో చేసే ప్రసిద్ధ వంటకాలివే..!
ప్రపంచవ్యాప్తంగా బాగా వినియోగించే ఆహారాల్లో కొబ్బరికాయలు ప్రధానమైనవి. అన్ని చోట్లా ఆయా పద్దతుల రీత్యా వీటిని బాగా వినియోగిస్తారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మనకు చేసే మేలును గుర్తించడం కోసం ఒక రోజును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరి ప్రతి ఏటా ఆ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇలా ఏటా సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరికాయల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవాన్ని ఆసియన్ పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కొబ్బరితో చేసే ప్రసిద్ధ రెసిపీలు, లాభాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.మనదేశంలో ఏ చిన్న పూజ లేదా ఏ కార్యమైనా కొబ్బరికాయ లేనిదే పూర్తి కాదు. ముఖ్యంగా కేరళ కొబ్బరికాయ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంటుంది. ఈ కొబ్బరికాయ రుచి పరంగా అద్భుతంగా ఉంటుంది. అలాగే దీన్ని కూరగా లేదా పచ్చడి రూపంలో తీసుకుంటారు చాలామంది. దీన్ని పలురకాల రెసిపీలో అదనపు రుచి కోసం ఉపయోగిస్తారు. ఎంతటి రుచిలేని కూరకైనా కాస్త కొబ్బరిని జోడిస్తే దాని రుచే వేరు. అలాంటి కొబ్బరితో వివిధ రాష్ట్రాల్లో చేసే ప్రముఖ వంటకాలేంటో చూద్దాం..ఎరిస్సేరీ:ఎరిస్సేరీ అనేది కేరళకు చెందిన సాంప్రదాయక వంటకం. ఇది ఓనం వంటి పండుగ సందర్భాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కూర గుమ్మడికాయ, పప్పు, కొబ్బరితో తయారు చేస్తారు. చివరిగా ఆవాలు, కరివేపాకు మరియు ఎండు మిరపకాయలతో తాలింపు వేస్తారు. ఈ కూరని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరేలెవెల్.చింగ్రీ మలై కర్రీచింగ్రి మలై కర్రీ అనేది ఒక ప్రసిద్ధ బెంగాలీ వంటకం. దీన్ని పెద్ద సైజులో ఉండే రొయ్యలతో చేసే కూరలో ఉపయోగిస్తారు. మసాల దినులు, కొబ్బరిపాలతో ఈ రొయ్యల కూర చేస్తారు.బాంగ్ద్యాచే అంబట్ కాల్వన్ఇది మహారాష్ట్రలోని తీర ప్రాంతాలలో చేసే స్పైసీ చేపల కూర. మాకేరెల్ (బాంగ్డా) కొబ్బరిపాలతో తయారు చేసిన కూర తింటే..ఓ పక్క నోరు మండుతున్న తింట ఆపరట. అంతలా స్పైసీగా టేస్టీగా ఉంటుందట. ఈ రెసిపీలో చింతపండు పులుసు అత్యంత కీలమైనది. ఇది గ్రేవీకి మంచి టేస్ట్ అందిస్తుంది.ఖవ్సాఖవ్సా లేదా ఖౌ సూయ్ గుజరాత్లోని కుచ్చి మెమన్ కమ్యూనిటీ తయారు చేసే వంటకం. చికెన్ని, కొబ్బరి పాలతో చేసే వంటకం. ఇది సాధారణంగా పూర్తి భోజనం కోసం క్రిస్పీ ఫ్రైడ్ నూడుల్స్ లేదా సెవ్తో వడ్డిస్తారు.గోవాన్ జిట్ కోడిజిట్ కోడి ప్రతి గోవా ఇంటిలో ప్రధానమైనది. ఇది కూడా చేపలతో తయారు చేసే వంటకమే. సాధారణంగా మాకేరెల్ లేదా కింగ్ ఫిష్, వంటి వాటిని కొబ్బరి పాలు, ఎర్ర మిరపకాయలు, కొత్తిమీరచ చింతపండు మిశ్రమంతో తయారు చేస్తారు. వెజిటబుల్ కుర్మావెజిటబుల్ కుర్మా అనేది దక్షిణ భారతదేశం అంతటా ఒక ప్రసిద్ధ వంటకం. ఇది తేలికపాటి మసాలాలతో కూడిన కొబ్బరి గ్రేవీకి పేరుగాంచింది. కుర్మాలో సాధారణంగా క్యారెట్, బఠానీలు, బీన్స్చ బంగాళదుంపలు వంటి వివిధ రకాల కూరగాయలు ఉంటాయి. వీటిని కొబ్బరి, జీడిపప్పు, పెరుగుతో తయారు చేసిన సాస్తో వండుతారు. ఈ వంటకానికి లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క వంటివి మొత్తం కూర రుచిని పెంచుతాయి. దీన్ని చపాతీలు లేదా పరాఠాలతో ఆస్వాదించవచ్చు.నార్కెల్ దూద్ పులావ్కొబ్బరి పాలతో కూడిన మరో బెంగాలీ వంటకం. ఇక్కడ పులావ్ని కొబ్బరి పాలతో తయారు చేస్తారు. ఇది సాధారణంగా గోబిందోభోగ్లా ఉంటుంది. ఇక్కడ కొబ్బరి పాలు, బిర్యానీ ఆకులు, నెయ్యి, దాల్చిన చెక్క, ఏలుకులు, ఉల్లిపాయలు, జీడిపప్పు, ఎండుద్రాక్షలతో తయారుచేస్తారు.చికెన్ కాల్డిన్చికెన్ కాల్డైన్ ఒక తేలికపాటి మరియు సుగంధ గోవా కూర. ఈ వంటకం కోకోనట్ మిల్క్ గ్రేవీలో ఉడికించి, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీరతో రుచికరంగా తయారు చేస్తారు. దీన్ని అన్నం లేదా ఇష్టమైన రోటీలతో ఆస్వాదించవచ్చు. కొబ్బరితో కలిగే లాభాలు..పోషకాలతో నిండిన కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.కొబ్బరి నూనెను చర్మం, జుట్టుకు అప్లై చేస్తే తేమను సమర్థవంతంగా లాక్ చేస్తుంది. పొడి చర్మం, పొడి జుట్టుకు చికిత్స చేస్తుంది. తామర వంటి చర్మవ్యాధులను నిర్వహించడానికి సహాయపడుతుంది.కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.బరువు తగ్గాలనుకుంటే కేలరీల వినియోగాన్ని పెంచడానికి పెరుగు లేదా ఓట్ మీల్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు జోడించండి. ఇది ఆకలిని తీర్చడానికి, కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది. (చదవండి: ఉడకని పంది మాంసం తింటే ఇంత డేంజరా..!) -
అత్యంత వృద్ధ స్లోత్ మృతి
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ స్లాత్ పశ్చిమ జర్మనీలోని క్రెఫెల్డ్ జూపార్కులో కన్నుమూసింది. 54 ఏళ్ల ఈ స్లోత్ను జాన్ అని పిలిచేవారు. అది గత వారం కన్నుమూసినట్లు జూ తెలిపింది. 1969లో పుట్టిన జాన్ తొలుత హాంబర్గ్ జూలో నివసించింది. తర్వాత క్రెఫెల్డ్ జూకు మారి 38 ఏళ్లుగా అక్కడే గడిపింది. మానవ సంరక్షణలో ఉన్న అత్యంత వృద్ధ స్లోత్గా 2021లో గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ మగ స్లోత్కు 22 మంది సంతానం. ఏటా ఏప్రిల్ 30న దాని పుట్టిన రోజు సంబరాలు అట్టహాసంగా జరిగేవి. స్లోత్ల జీవితకాలం 30 నుంచి 40 ఏళ్లు. బద్ధకానికి మారుపేరు! స్లోత్ను అత్యంత బద్ధకస్తురాలైన జీవిగా చెబుతారు. ఇది క్షీరదం. వీటిలో ఆరు రకాలుంటాయి. అన్నీ చెట్ల కొమ్మల మీదే నివసిస్తాయి. మరో చెట్టుపైకి వెళ్లడానికి మాత్రమే కిందకు దిగుతాయి. నేలపై నిమిషానికి కేవలం ఐదడుగుల వేగంతో, చెట్లపైనైతే 15 అడుగుల వేగంతో కదులుతాయి. చూట్టానికి ఎలుగుబంటికి దగ్గరగా, అందంగా ఉంటాయి. ఆకులు, పళ్లు తింటాయి. చెట్ల రసాలు తాగుతాయి. అన్నట్టూ, వీటి జీర్ణ వ్యవస్థ కూడా అత్యంత నెమ్మదిగా పని చేస్తుందట! -
Bangladesh: భారీ వర్షాలు, వరదలకు 20 మంది మృతి
బంగ్లాదేశ్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా నదులు ఉప్పొంగి వరదలు సంభవిస్తున్నాయి. వరదల బారినపడి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 52 లక్షల మందికి పైగా జనం వరదల కారణంగా నిరాశ్రయులయ్యారని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు. వీరికి ఆహారం, తాగునీరు, మందులు, దుస్తులు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయితే మారుమూల ప్రాంతాల్లో రోడ్లు మూసుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది.తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితులు కాస్త మెరుగువుతున్నాయని అన్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత యూనస్ ప్రమాణ స్వీకారం చేశారు.కాగా దేశంలోని 11 వరద ప్రభావిత జిల్లాల్లో ఏర్పాటు చేసిన 3,500 షెల్టర్లలో నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు తలదాచుకుంటున్నారని అధికారులు తెలిపారు. 750 వైద్య బృందాలు వారికి వైద్య సహాయం అందిస్తున్నాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. -
ప్రపంచాన్ని వణికిస్తున్న దోమలు
ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆగస్టు 20న నిర్వహిస్తుంటారు. ఈ రోజున దోమల కారణంగా వచ్చే వ్యాధులపై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటాయి. ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తుంటారు.వర్షాకాలంలో దోమల బెడద విపరీతంగా ఉంటుంది. ఇదే సమయంలో దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా, జికా వైరస్ తదితర వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో దోమకాటు కారణంగా లక్షల మంది అనారోగ్యానికి గురవుతుంటారు. అందుకే ఇటువంటి సమయంలో ప్రజలు ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు.దోమ కాటు వల్ల వచ్చే వ్యాధుల నివారణకు సంబంధించిన ప్రజలకు అవగాహన కల్పించేందుకే ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. దోమల కారణంగా మలేరియా వ్యాపిస్తుందని 1897లో శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నారు. ప్రపంచ దోమల దినోత్సవాన్ని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రారంభించింది. ప్రపంచ దోమల దినోత్సవం- 2024ను ‘మరింత మెరుగైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటాన్ని తీవ్రతరం చేయడం’ అనే థీమ్తో నిర్వహిస్తున్నారు.దోమల నివారణకు కలుషితమైన నీటి వినియోగాన్ని నివారించాలి. దోమలు తేమగా ఉండే ప్రదేశాలలోను, నీరు నిలిచే ప్రదేశాలలోను త్వరగా వృద్ధి చెందుతాయి. అందుకే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు దోమ తెరలు లాంటివి వినియోగించడం ఉత్తమం.వర్షాకాలంలో దోమల్ని తరిమికొట్టే చిట్కాలు -
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులు ఉన్న నగరాలు (ఫొటోలు)
-
World Lung Cancer Day 2024 లక్షణాలను గుర్తించడం ముఖ్యం, లేదంటే ముప్పే!
ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత సాధారణ కేన్సర్. ప్రపంచవ్యాప్తంగా అనేకమరణాలను ప్రధానకారణం లంగ్ కేన్సర్. ప్రతీ ఏడాది 1.6 మిలియన్ల మంది ఈ కేన్సర్కి బలవుతున్నారు. ఊపిరితిత్తుల కేన్సర్కు ప్రధాన కారణం పొగాకు,ధూమపానం అయినప్పటికీ, ఎపుడూ ధూమపానం చేయని వ్యక్తులలో కూడా సంభవించవచ్చు. దాదాపు 15 శాతం మంది పొగాడు వినియోగం చరిత్ర లేనప్పటికీ ఈ వ్యాధిబారిన పడుతున్నారని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అందుకే దీనిపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఈరోజు ( ఆగస్టు 1)న ప్రపంచ ఊపిరితిత్తుల కేన్సర్ దినోత్సవంగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ధూమపానంతో పాటు కొన్ని జన్యు పరమైన కారణాలు, గాలి కాలుష్యం, పరోక్షంగా ధూమపాన ప్రభావానికి లోనుకావడం, ఆస్బెస్టాస్ ఎక్స్పోజర్, రాడాన్ వాయువులు, డీజిల్ ఎగ్జాస్ట్ పొగ తదితర కారణాల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ వాడే వారిలో కూడా ఈ ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఊపిరితిత్తుల కేన్సర్ను సోకిన మహిళల్లో 20 శాతం మంది ఎప్పుడూ ధూమపానం చేయనివారే.ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం 2024: చరిత్రఊపిరితిత్తుల కేన్సర్ వ్యాప్తి మరియు ప్రభావం,ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం పాటిస్తారు. ఫోరమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీస్ (FIRS), ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ (IASLC) మధ్య సహకారంతో 2012లో మొదటిసారిగా దీన్ని పాటించారు. గమనించారు. ఇక అప్పటినుంచి ఊపిరితిత్తుల కేన్సర్ దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 1న జరుపు కుంటారు. లంగ్ కేన్సర్పై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.కేన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించడం, సమయానికి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఈ కేన్సర్ను ఎదుర్కోవడానికి కొనసాగుతున్న పరిశోధన ఆవిష్కరణల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రచారాలు ,కార్యకలాపాలు నిర్వహిస్తారు.థీమ్: “క్లోజ్ ది కేర్ గ్యాప్: ప్రతి ఒక్కరూ కేన్సర్ నుంచి రక్షణ పొందేందుకు అర్హులు’’ అనే థీమ్తో 2024 వరల్డ్ లంగ్ కేన్సర్ డే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ఊపిరితిత్తుల కేన్సర్ రకాలుఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణంగా రెండు రకాలగా విభజించారు. నాన్-స్మాల్ సెల్ ఊపిరితిత్తుల కేన్సర్ (NSCLC) , చిన్న-కణ ఊపిరితిత్తుల క్యాన్సర్ (SCLC). రెండో రకం కేన్సర్లో రెండింటి లక్షణాలు ఉంటాయి. లక్షణాలు ఎడతెరపి లేని దగ్గుఉన్నట్టుండి బరువు తగ్గడంగాలిపీల్చుకోవడంలో ఇబ్బంది, ఆయాసంఛాతీలో నొప్పిదగ్గుతున్నప్పుడు రక్తం పడటంఎముకల్లో నొప్పివేలిగోళ్లు బాగా వెడల్పుకావడంజ్వరం అలసట / నీరసంఆహారాన్ని మింగడంలో ఇబ్బందులుఆహారం రుచించకపోవడంగొంతు బొంగురుపోవడంచర్మం, కళ్లు పసుపు రంగులో మారడంనోట్ : వీటిల్లో కొన్ని లక్షణాలు కనిపించినంత మాత్రాన కేన్సర్ సోకినట్టు కాదు. ఇలాంటి లక్షణాలు శరీరంలో కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. టీబీ సోకినా వీటిల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో వ్యాధి నిర్ణారణ చేసుకోవాలి. ఈ కేన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. -
12 రోజులు.. 5000 కిలోమీటర్లు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ సైక్లింగ్ పోటీల్లో అత్యంత కఠినమైన రేస్ ఎక్రాస్ అమెరికా (వరల్డ్ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ) సైక్లింగ్ ఈవెంట్. దీనికి అర్హత సాధించానని హైదరాబాద్ బండ్లగూడకు చెందిన రవీందర్రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 10 నుంచి సైక్లింగ్ పోటీలు ప్రారంభం కానున్నాయన్నారు. భారత్ నుంచి తొలిసారి ఈ పోటీల్లో పాల్గొంటున్న తొలి వ్యక్తి తానేనని, 12 రోజులు, 12 నగరాల మీదుగా 5 వేల కిలో మీటర్ల నిరంతరాయంగా సైక్లింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.ఈస్ట్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రారంభమై న్యూజెర్సీలో ముగుస్తుందన్నారు. ప్రపంచంలో 60 ఏళ్ల పైబడిన వారు ఇద్దరు, 50 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసులో 5 గరు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి ప్లస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో ఈ సైక్లింగ్ ఉంటుందన్నారు. పేద పిల్లలకు ఫండ్ రైజింగ్లో భాగంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారని, గతంలో 29 మంది సైక్లిస్టులు రూ.100 కోట్ల ఫండ్ రైజ్ చేశారని గుర్తుచేశారు.గతంలో రేస్ ఎక్రాస్ ఇండియా, రేస్ ఎక్రాస్ ఆసియా పోటీల్లో విజేతగా నిలిచానని తెలిపారు. రేస్ ఎక్రాస్ అమెరికా ఈట్లోనూ 50 ఏళ్ల కేటగిరిలో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ముందస్తు ట్రయల్స్లో భాగంగా ప్రస్తుతం అమెరికాలో సైక్లింగ్ చేయనున్న రూట్లో ట్రయల్ వేస్తున్నారు.ఇవి చదవండి: Singer Smita: ఓల్డ్ స్కూల్ బృందావనం! నగరంలో కొత్త కాన్సెప్ట్.. -
2024లో ప్రపంచంలో బెస్ట్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ ఇవే (ఫోటోలు)
-
ప్రపంచంలోనే ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు వీరికే (ఫొటోలు)
-
World Population Day 2024 : ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
అసాధ్యం కాస్త సుసాధ్యం.. ముచు ఛిష్ను జయించారు
ఢిల్లీ: ఈ భూమ్మీద మనిషి ఇప్పటికీ అధిరోహించని పర్వతాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటిగా మన పొరుగున పాకిస్తాన్లోని ముచు ఛిష్ ఉండేది. అయితే అది గతం. ఇప్పుడు దానిని కూడా జయించేశారు.తల్చుకుంటే మనిషి సాధించలేనిది ఏది లేదని మరోసారి రుజువైంది. కారకోరం రేంజ్లోని 7,453 మీటర్ల(24,452 అడుగులు) ఎత్తైన ముచు ఛిష్ పర్వతాన్ని ఎట్టకేలకు అధిరోహించారు. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన బృందం.. ఆరు రోజుల పాటు శ్రమించి ఈ ఘనత సాధించింది. డెనెక్ హక్, రాడోస్లావ్ గ్రోహ్, జరోస్లావ్ బాన్స్కీ ఈ బృందంలో ఉన్నారు.గతంలో ఎందరో పర్వతాహరోహకులు దీనిని అధిరోహించే ప్రయత్నంలో భంగపడ్డారు. కిందటి ఏడాది ఓ బృందం.. 7,200 మీటర్ల దాకా వెళ్లి ప్రతికూల వాతావరణంతో వెనక్కి తిరిగి వచ్చేసింది. చెక్ రిపబ్లిక్కు చెందిన పర్వతారోహకులు.. గత నాలుగేళ్లలో మూడుసార్లు ఈ పర్వతాన్ని అధిరోహించాలని ప్రయత్నించారు. అయితే ఈసారి అదే దేశానికే చెందిన బృందం ఒకటి ఎట్టకేలకు ఆ ఘనత సాధించింది. -
నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం
రాహుల్గాంధీ రాజకీయాల్ని మరచిపోతారు.. సచిన్టెండూల్కర్ బ్యాటింగ్కు బదులు ఈటింగ్కి జై కొడతారు.. హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీలకే సెలబ్రిటీ. శతాబ్దాల నాటి బిర్యానీ ఎప్పటికప్పుడు నగరాన్ని రుచుల విశ్వంలో రారాజుగా నిలబెడుతూనే ఉంది. నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం.. ఈ సందర్భంగా లొట్టలేస్తూ నెమరేసుకుందాం..మన బిర్యానీ..కహానీ..దేశంలో అత్యధికంగా జనం ఆస్వాదిస్తోన్న ఆహారం బిర్యానీయే. అయితే అలా ఆర్డర్ ఇస్తున్న ప్రతి ఐదు బిర్యానీల్లో ఒకటి మనదేనట. ఆ విధంగా చూస్తే భాగ్యనగరం దేశానికి బిర్యానీ క్యాపిటల్గా మారిందన్నమాటే. దేశవ్యాప్తంగా సెకనుకు సగటున 2.5 బిర్యానీలు హాంఫట్ అవుతున్నాయట. గతేడాది నగరంలో 13 మిలియన్ల బిర్యానీలు స్విగ్గీ సర్వ్ చేసింది. అంటే అక్షరాలా కోటి 30లక్షలు.. నగరంలోని 1700కు పైగా రెస్టారెంట్లలో కేవలం ఒక్క స్విగ్గీ ద్వారా అమ్ముడవుతున్న బిర్యానీల సంఖ్యే ఇది. ఇక ఇతరత్రా మార్గాల ద్వారా జరిగే విక్రయాలను కలుపుకుంటే చెప్పనక్కర్లేదు. నగరంలో అమ్ముడయ్యే బిర్యానీల్లో తొలిస్థానం చికెన్ బిర్యానీ కాగా, రెండో స్థానం వెజ్ బిర్యానీ కావడం మరో విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీలు ఉన్నాయి. తాజాగా టేస్ట్ అట్లాస్ నిర్వహించిన ఓ అధ్యయనంలో అత్యుత్తమ రుచుల్లో మన బిర్యానీ 6వ స్థానంలో నిలిచింది. బిర్యానీ అనే పదం పర్షియన్ భాషలోని బిరింజ్ నుంచి పుట్టింది. దీని అర్థం రైస్. బిర్యానీ మన దేశానికి 1398లో పరిచయం అయ్యిందట. హైదరాబాద్ నిజామ్స్, లక్నో నవాబులు బిరియానీ అంటే లొట్టలేసేవారట. మొఘలుల కాలంలో తరచూ యుద్ధాల్లో పాల్గొనే సైనికుల కోసం చేసిన ప్రత్యేక వంటకం ఇది. సైనికుల శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని మటన్, బియ్యం సమపాళ్లలో మేళవించి చెక్కల మంట మీద మసాలాలు, కుంకుమ పువ్వు దీనిలో కలిపి వండేవారట. నగరాన్ని పాలించిన నిజామ్ ఉల్ మల్్క.. బిర్యానీ విస్తరణ చరిత్రలో చెక్కుచెదరని పేరు తెచ్చుకున్నారు. స్థానిక వంటకాల శైలులను ఒకటొకటిగా కలుపుకుంటూ ఎన్నో కొత్త రుచులను అద్దుకుంది బిర్యానీ. ఇందులో నిజామ్స్ సృష్టించిన కచ్చి గోస్త్ బిర్యానీ ఒకటి. ఇటీవల మన దేశపు అగ్రగామి చెఫ్ సంజీవ్కపూర్ సైతం తన అభిమాన బిర్యానీ హైదరాబాద్లో పుట్టిన కచ్చి గోస్త్ బిర్యానీ గురించి చెప్పడం విశేషం. సిటీలో టాప్ బిర్యానీ సెంటర్లు ఇవే... ఏళ్ల నాటి నుంచి చారి్మనార్కు సమీపంలోని షాబాద్ హోటల్ బిర్యానీకి ఫేమస్. అదే క్రమంలో పాతబస్తీలోని దారుల్íÙఫాలోని నయాబ్, బంజారాహిల్స్లోని బిర్యానీ వాలా, హైదర్గూడలోని కేఫ్ బహార్, సికింద్రాబాద్లోని పారడైజ్, నారాయణగూడలోని మెహ్ఫిల్, టోలిచౌకిలోని షాగౌస్, ఫలుక్నుమా ప్యాలెస్లోని అదా, క్రాస్రోడ్స్లోని బావర్చి, పాతబస్తీలోని పిస్తా హౌజ్, పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్... తదితర పేర్లు నగరంలోని బిర్యానీప్రియులకు నిత్య స్మరణీయం. ఇవన్నీ దశాబ్దాలుగా బిర్యానీ ఫేవరెట్స్ కాగా.. ఇటీవలి కాలంలో మరికొన్ని రెస్టారెంట్స్ అత్యాధునిక హంగులతో రుచికరమైన బిర్యానీలను వడ్డిస్తున్నాయి. బహురూపాల్లో...⇒ బిర్యానీని సాధారణంగా హండి లేదా కుండలో వండడం అనేది ఏళ్లనాటి సంప్రదాయం. కానీ కుండలోనే వడ్డిస్తూ, పార్సిల్స్ కూడా అందిస్తున్నారు. ఆ తర్వాత డబ్బా బిర్యానీ వచి్చంది. ఇది కాంపాక్ట్ కంటైనర్లో అందించడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని మారేడు మిల్లి బొంగులో బిర్యానీకి ఫేమస్. వెదురు బొంగుల్లో వండిన బిర్యానీని అలాగే వడ్డిస్తూ టేక్ అవే ఇస్తున్నారు. జూబ్లీహిల్స్లోని స్పైసీ వెన్యూ రెస్టారెంట్లో ఎంఎల్ఏ పొట్లం బిర్యానీ పేరుతో ఆమ్లెట్లో చుట్టి వడ్డిస్తూ పార్సిల్స్ చేస్తున్నారు. ⇒ కొత్తగా బకెట్ బిర్యానీ వచి్చంది. ఎరుపు, తెలుపు, బ్లూ.. ఇలా అనేక రంగుల బిర్యానీ బకెట్లు నగరవాలుకు కలర్ఫుల్ ట్రీట్ అందుబాటులోకి తెచ్చాయి. నగరంలోని ఓ రెస్టారెంట్లో బిర్యానీ–ఇన్–ఏ–వాటర్–వెస్సల్ కూడా రానుందని అంటున్నారు. అంతే కాదు కోన్లో బిర్యానీ, పిజ్జాలో బిర్యానీ, సమోసాలో బిర్యానీ, బిర్యానీ సుషీ రోల్స్, బిర్యానీ ఫ్లేవర్ ఐస్ క్రీం వంటివి ఆన్ ద వే అట.చవులూరించే వెరైటీలు... చికెన్, మటన్, వెజిటబుల్స్.. జోడించిన బిర్యానీలు ఓ వైపు లీడ్ చేస్తుండగా, నగరంలో ఉలవచారు బిర్యానీ, క్లాసిక్ హైదరాబాదీ బిర్యానీ, రిచ్ అండ్ క్రీమీ లక్నోవి బిర్యానీ. టాంగీ, ఫ్లేవర్ఫుల్ బాంబే బిర్యానీ వంటివి విభిన్న రకాల మేళవింపులతో అందుబాటులోకి వచ్చాయి. చైనీస్– ఆధారిత ఫ్రైడ్ రైస్ బిర్యానీ లేదా మెక్సికన్–ప్రేరేపిత బురిటో బిర్యానీ ఫ్యూజన్ బిర్యానీ... ఇలా ఫుడ్ లవర్స్కి పదుల సంఖ్యలో ఎంపిక అవకాశాలు అందిస్తున్నారు.మండీ వచి్చనా... ట్రెండీ మనదే..నగరంలోని బార్కాస్ ప్రాంతంలో పేరొందిన మండీ...బిర్యానీకి గట్టి పోటీ ఇస్తుందని అంచనా. అరబ్బుల వంటకమైన మండీ.. నగరంలో వేగంగా విస్తరించింది. అలా దాదాపు ఎనిమిదేళ్ల నుంచీ మండీ హవా మొదలైంది. అయితే ఇప్పటికీ బిర్యానీకి దరిదాపుల్లో కూడా రాలేకపోయిందంటే.. దటీజ్ హైదరాబాద్ బిర్యానీ అంటున్నారు సిటీ ఫుడ్ ఇండస్ట్రీ వర్గాలు. పొట్లం బిర్యానీ స్పెషల్బిర్యానీ రుచి, నాణ్యతతో పాటు కంటైనర్స్ కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వెరైటీ కంటైనర్స్లో వడ్డించడం, పార్సిల్ చేయడం ద్వారా ఫుడ్ లవర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే ఏదేమైనా ఫుడ్ క్వాలిటీ, టేస్ట్ ముఖ్యం. మా రెస్టారెంట్ స్పెషల్గా పొట్లం బిర్యానీ అందిస్తున్నాం. ఆమ్లెట్లో చుట్టిన బిర్యానీని సిటీలో ఎక్స్క్లూజివ్గా అందుబాటులోకి తెచ్చాం. – సంపత్, ద స్పైసీ వెన్యూ రెస్టారెంట్హైదరాబాద్ ఆవకాయతో.. అమెరికాలో బిర్యానీ..నగరవాసులు అనేకమంది విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. అక్కడ తెలుగువాళ్లు అధికంగా నివసించే చోట కూడా హైదరాబాద్ బిర్యానీ హల్చల్ చేస్తోంది. ‘మన ఇండియన్స్తో పాటు అమెరికన్లు కూడా హైదరాబాద్ బిర్యానీని బాగా ఇష్టపడతారు’ అంటూ చెప్పారు నగరంలోని మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన నగే‹Ù, సాయిప్రసాద్. ఈ బావా, బావమరుదులు ఇద్దరూ అమెరికాకు వలస వెళ్లి అక్కడ బావర్చి బిర్యానీ రెస్టారెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్లో అందించే ఆవకాయ బిర్యానీ అక్కడ పాప్యులర్. దీని కోసం సునీత బంధువులు మల్కాజ్గిరిలో భారీ ఎత్తున ఆవకాయ పచ్చడి తయారు చేసి అమెరికాకు పంపిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకూ... థియేటర్లలో షోస్ టైమింగ్స్లాగే నగరంలోనూ బిర్యానీ దొరికే వేళలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. నైట్లైఫ్తో పాటే మిడ్నైట్ బిర్యానీలు కూడా పుట్టుకొచ్చేశాయి. అబిడ్స్లోని గ్రాండ్ హోటల్ అర్ధరాత్రి బిర్యానీ విందుకు చిరునామాగానూ, అలాగే చాదర్ఘాట్ మిడ్నైట్ బిర్యానీలకు కేరాఫ్గా మారాయి. కొన్ని స్టార్ హోటల్స్ బిర్యానీ ప్రియులకు అర్ధరాత్రుళ్లు తలుపులు తెరుస్తున్నాయి. అలాగే తెల్లవారుజామున 4 గంటలకే వేడివేడి బిర్యానీని అందించే ట్రెండ్ ఇటీవలే ఊపందుకుంటోంది. మాదాపూర్, గచ్చి»ౌలి, బోరబండ, వివేకానందనగర్.. ప్రాంతాల్లో సందడి కనిపిస్తోంది. కాల్ సెంటర్లు, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు నైట్ షిఫ్ట్ను ఈ బిర్యానీతో ముగించడానికి అలవాటు పడుతున్నారు.వుడ్ ఫైర్పై వండే కేటరర్.. సూపర్..నగరానికి చెందిన మహరాజ్ కేటరర్స్, ఎస్కె కేటరర్స్, ఎలిగెన్స్.. తదితర సంస్థలు వుడ్ ఫైర్ మీద వండి కేటరింగ్ చేస్తున్నారు. పెళ్లిళ్లు, వేడుకల్లో వీరి బిర్యానీలకు డిమాండ్ ఉంది. అలాగే హోటల్స్ విషయానికి వస్తే..బావర్చి, పంజాగుట్టలోని మెరిడియన్, ఫైవ్స్టార్ హోటల్ మారియట్లో బిదిరి అనే హైదరాబాద్ స్పెషల్ రెస్టారెంట్, ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని ఆస్టోరియా, పిస్తా హౌజ్లోని సాఫ్రాని బిర్యానీలు నా ఛాయిస్. –జుబైర్ అలీ, ఫుడ్ బ్లాగర్ -
CNG-Powered Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ (ఫొటోలు)
-
ప్రపంచంలోనే టాప్ 10 నివాసయోగ్యమైన నగరాలు (ఫొటోలు)
-
10 అత్యంత వివాదాస్పద ‘వికీలీక్స్’
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఐదేళ్లకు పైగా బ్రిటీష్ హై-సెక్యూరిటీ జైలులో, ఏడేళ్లపాటు లండన్లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందిన తర్వాత బుధవారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. 2010లో వేలాది రహస్య పత్రాలను వికీలీక్స్లో విడుదల చేయడంతో చిక్కుల్లో పడి న్యాయపోరాటం సాగించారు. ప్రపంచాన్ని కదిలించిన 10 వికీలీక్స్ ఇవే..1. ఇరాక్ యుద్ధం2010లో వికీలీక్స్ ఇరాక్ యుద్ధంలో పౌరుల ప్రాణనష్టం, వివాదాస్పద వ్యూహాలను బహిర్గతం చేసే రహస్య యూఎస్ఏ సైనిక పత్రాలను విడుదల చేసింది. దీంతో సైనిక కార్యకలాపాలలో పారదర్శకత ఆవశ్యకతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. అమెరికా సంకీర్ణ దళాల చర్యల కారణంగా చోటు చేసుకున్న పౌర మరణాలు వికీలీక్స్ కారణంగా వెల్లడయ్యాయి.2. గ్వాంటనామో ఫైల్స్వికీలీక్స్ గ్వాంటనామో బేలో జరుగుతున్న కార్యకలాపాలను వివరించే పత్రాలను ప్రచురించింది. ఖైదీలు ఎదుర్కొంటున్న చట్టపరమైన ఇబ్బందులను దీనిలో బహిర్గతం చేసింది. ఇది అంతర్జాతీయ నిరసనలకు ఆజ్యం పోసింది. ఖైదీలను హింసించడం, వారి హక్కులను కాలరాడయం లాంటి వివరాలు దీనిలో వెల్లడయ్యాయి.3. ఆఫ్ఘన్ వార్ డైరీఆఫ్ఘన్ వార్ డైరీ పత్రాలను వికీలీక్స్ విడుదల చేసింది, పౌర మరణాలు, రహస్య కార్యకలాపాలు, తాలిబాన్ వ్యూహాలను దానిలో బహిర్గతం చేసింది. యూఎస్ఏ కాంట్రాక్టర్లు ఆఫ్ఘనిస్తాన్లో కుర్రాళ్లను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్న తీరు దీనిలో వెల్లడయ్యింది. ఆఫ్ఘన్లో తాలిబాన్ బలోపేతమవుతున్నదని వికీలీక్స్ వెల్లడించింది.4. కొల్లేటరల్ మర్డర్ వీడియోబాగ్దాద్లో యూఎస్ అపాచీ హెలికాప్టర్ దాడికి సంబంధించిన ఒక రహస్య వీడియోను వికీలీల్స్ విడుదల చేసింది. హెలికాప్టర్ సిబ్బంది పౌరులను సాయుధ తిరుగుబాటుదారులుగా పొరపాటుగా గుర్తించి, వారితోపాటు రాయిటర్స్ ఫోటోగ్రాఫర్, అతని డ్రైవర్పై కాల్పులు జరుపుతున్నట్లు ఉన్న వీడియోను బయటపెట్టింది. నాడు ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలంగా మారింది.5. ప్రపంచ నేతలపై ఎన్ఎస్ఏ టార్గెట్అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) ప్రపంచ నేతలను టార్గెట్ చేసిందని వికీలీక్స్ వెల్లడించింది. బెర్లిన్లో అప్పటి యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్-కీ-మూన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మధ్య జరిగిన ప్రైవేట్ సమావేశాన్ని ఎన్ఎస్ఏ బగ్ చేసిందని వికీలీక్స్ పత్రాలు వెల్లడించాయి.6. డీఎన్సీ ఈ మెయిల్ వివాదం2016లో వికీలీక్స్.. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ)కి చెందిన ఈ మెయిల్స్ను విడుదల చేయడం ద్వారా పార్టీ అంతర్గత విభేదాలు ప్రపంచం ముందు వెల్లడయ్యాయి. లీకైన ఈ మెయిల్స్లో డీఎన్సీ అధికారులు బెర్నీ సాండర్స్ కన్నా హిల్లరీ క్లింటన్కు ప్రాధాన్యతనిచ్చారని వెల్లడయ్యింది. ఈ వివాదం సాండర్స్ మద్దతుదారులలో అపనమ్మకాన్ని పెంచింది. ఇది అమెరికన్ రాజకీయ వ్యవస్థలో పారదర్శకతపై చర్చకు దారితీసింది.7. సౌదీ కేబుల్స్సౌదీ దౌత్య వ్యవహరాలకు సంబంధించిన కీలక విషయాలను వికీలీక్స్ బయటపెట్టింది. లీకైన పత్రాలలో సౌదీ వ్యూహాత్మక పొత్తులు, రహస్య కార్యకలాపాలు, దౌత్య వివరాలున్నాయి. ఈ లీక్లు సౌదీ అరేబియా విదేశీ విధానాలను, ప్రాంతీయ సంఘర్షణలను బహిర్గతం చేసింది.8. స్నోడెన్ ఎన్ఎస్ఏ పత్రాలుఎడ్వర్డ్ స్నోడెన్తో కలిసి, వికీలీక్స్ గ్లోబల్ నిఘా కార్యక్రమాలను బహిర్గతం చేసే క్లాసిఫైడ్ ఎన్ఎస్ఏ పత్రాలను ప్రచురించింది. ఇది గోప్యతా హక్కులు, ప్రభుత్వ పర్యవేక్షణ, విజిల్బ్లోయర్ల పాత్రపై చర్చలకు దారితీసింది. ఈ వెల్లడి జాతీయ భద్రత, పౌర స్వేచ్ఛల మధ్య సమతుల్యతపై పలు సందేహాలకు పురిగొల్పింది.9. హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో వికీలీక్స్ హిల్లరీ క్లింటన్ ప్రచారం, డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి చెందిన ఈ మెయిల్స్ను ప్రచురించింది. ఇది సైబర్ భద్రత, రాజకీయ పారదర్శకత, విదేశీ జోక్యంపై ఆందోళనలకు దారితీసింది.10. వాల్ట్ 72017లో వాల్ట్ 7 సిరీస్ను వికీలీక్స్ విడుదల చేసింది. దీనిలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) హ్యాకింగ్ సాధనాలు, నిఘా పద్ధతులను బహిర్గతం చేసింది. ఇది ప్రభుత్వ నిఘా సామర్థ్యాలు, డిజిటల్ గోప్యతపై ఆందోళను లేవనెత్తింది. -
ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలివే.. అంబానీ ప్లేస్? (ఫోటోలు)
-
ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంట.. ఇంట్రెస్టింగ్ ఫోటోలు!
-
ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగా రికార్డు!
పెళ్లి అంటే ఈడు జోడు ఉండాలి, ఇరు సంప్రదాయాలు అన్ని కలవాలి అని చెబుతుంటారు పెద్దలు. ఇప్పుడూ ఈ రోజుల్లో అదంతా కష్టంగా మారింది.కెరీర్ అంటూ.. ముప్పై, నలభైల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక స్థితికే ప్రాధాన్యత, మిగతా అంతా ఎలా ఉన్న పర్లేదు అన్నట్లుగా ఉంది వ్యవహారం. అలాంటి పరిస్థితుల్లో శారీరకపరంగా పొట్టిగా ఉన్న ఓ జంట మాత్రం తమలాంటి ఆహార్యం ఉన్న వ్యక్తులు దొరికే వరకు నిరీక్షించి మరీ పెళ్లి చేసుకున్నారు. పైగా అదే వారిని విలక్షణమైన జంటగా రికార్డులకెక్కేలా చేసింది. వివరాల్లోకెళ్తే..బ్రెజిలియన్కి చెందిన పాలో గాబ్రియేల్ డా సిల్వా బారోస్, కటియుసియా లీ ఇద్దరూ ఆహార్యం పరంగా అత్యంత పొట్టి వ్యక్తులు. సమాజం నంచి ఎదురైనా అవహేళనలు, ఒత్తిళ్లకు తగ్గకుండా..తమలాంటి వ్యక్తులు కోసం అన్వేషించారు. వారి భౌతిక లక్షణాలను అంగీకరించి మరీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. వారి అన్వేషణ ఎట్టకేలకు ఫలించి 2006లో ఇరువురు కలుసుకోవడం జరిగింది. దాదాపు 15 ఏళ్లుగా ఒకరి అభిప్రాయాలను ఒకరు షేర్ చేసుకుంటూ..వారి మధ్య బలమైన సంబంధాన్ని పెంపొందించుకున్నారు.ఆ తర్వాత ఇరువురు వివాహ బంధంతో ఒక్కటి అవ్వాలని భావించి పెళ్లి చేసుకున్నారు. దీంతో ప్రపంచంలోని అత్యంత పొట్టి వివాహిత జంటగా గిన్నిస్ రికార్డులకెక్కారు. జీవతంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాం. తామిరువురం ఎదురపడతామనే ఊహించలేదు. అలాగే మా బంధాన్ని కొనసాగించగలమా? లేదా ఎలాంటి సవాళ్లనైనా తట్టుకుని ఇరువరి నిలబడగలుగుతామా అని నిర్ణయించుకుని, ఒకరిపై ఒకరికి అవగాహన ఏర్పడ్డాక తాము వివాహ బంధంలోకి అగుడుపెట్టాం అని చెబుతోంది ఆ జంట. అంతేగాదు తాము చూసేందుకు చిన్నగా ఉన్నా తమ ఇద్ది\రి మనసులు చాలా విశాలమని, జీవితం విసిరే ప్రతి సవాలుని ఎదుర్కొని సంతోషంగా జీవించగలమని నమ్మకంగా చెబుతున్నారు. కాగా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ప్రకారం..ఈ జంట ఉమ్మడి ఎత్తు 181.41 సెం.మీ (71.42 అంగుళాలు). పాలో ఎత్తు 90.28 cm (35.54 in) అయితే కటియుసియా ఎత్తు 91.13 సెం.మీ(35.88 అంగుళాలు). ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామం వేదికగా వెల్లడించింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు. అంతేగాదు నెజన్టు కూడా ది బెస్ట్ కపుల్, ఈ జంట సూపర్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: పెద్ద వయసులో.. పెద్ద గుర్తింపు) -
ఈ ప్రపంచ అందగత్తెలపై ఓ లుక్కేసుకోండి! (ఫొటోలు)
-
మళ్లీ ‘చెత్త’ పని చేసిన నార్త్ కొరియా కిమ్!
ఇప్పటి వరకు ఉత్తర కొరియా తన దగ్గరున్న క్షిపణులు, అణుబాంబులతో దక్షిణ కొరియాను బెదిరిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఆ దేశం దక్షిణ కొరియాను ‘చెత్త బెలూన్ల’తో కవ్విస్తోంది. ఉత్తర కొరియా ఇటీవల 150 బెలూన్లకు చెత్తను కట్టి దక్షిణ కొరియాలోకి విడుదల చేసింది. దీనిపై దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఖఠినవైఖరి అవలంబిస్తామని ఉత్తర కొరియాను హెచ్చరించింది.ఉత్తరకొరియా తీరును ఎండగడుతూ లౌడ్ స్పీకర్ల ద్వారా మరోసారి వ్యోంగ్యాంగ్ (ఉత్తర కొరియాలోని ప్రధాన నగరం)నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని సియోల్(దక్షిన కొరియాలోని ప్రధాన నగరం) పరిపాలనా అధికారులు హెచ్చరించారు. జాతీయ భద్రతా సమావేశంలో ఈమేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం వెలుపల లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా ప్రసారాలు ప్రారంభిస్తామని జాతీయ భద్రతా అధికారులు హెచ్చరించారు.కొద్ది రోజులుగా ఉత్తర కొరియా చెత్తతో కూడిన వందలాది బెలూన్లను పంపిందని దక్షిణ కొరియా సైన్యం మీడియాకు తెలిపింది. ఈ బెలూన్లు తెస్తున్న చెత్తలో ఉత్తర కొరియా ప్రచార సామాగ్రి ఉందా లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సైన్యం తెలిపింది. కాగా సరిహద్దు ప్రాంతాల్లో కరపత్రాలు, ఇతర చెత్తను పారవేస్తున్న దక్షిణ కొరియా కార్యకర్తలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఉత్తర కొరియా తెలిపింది. ఈ ప్రటన తరువాతనే దక్షిణ కొరియాకు చెత్త కట్టిన బెలూన్లు రావడం ప్రారంభమయ్యింది.1950లలో కొరియా యుద్ధం జరిగినప్పటి నుండి ఉత్తర, దక్షిణ కొరియాలు తమ ప్రచార కార్యక్రమాలలో బెలూన్లను ఉపయోగిస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా 2018- అంతర్-కొరియా ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు దక్షిణ కొరియా జాతీయ భద్రతా మండలి తెలిపింది. ఈ ఒప్పంద ఉద్దేశ్యం ఇరు కొరియా దేశాల మధ్య పరస్పర నమ్మకం ఏర్పడే వరకూ సరిహద్దు శత్రుత్వాన్ని తగ్గించడం.ఈ ఒప్పందాన్ని ఎత్తివేడం వల్ల ఉత్తర కొరియా సరిహద్దులో దక్షిణ కొరియా మళ్లీ సైనిక విన్యాసాలు ప్రారంభించేందుకు వీలు కలుగుతుందని, పొరుగు దేశం కవ్వింపు చర్యలని తిప్పొకొట్టవచ్చని భద్రతా మండలి పేర్కొంది. ఒప్పందపు రద్దు ప్రతిపాదనను ఆమోదం కోసం క్యాబినెట్ కౌన్సిల్కు సమర్పించనున్నారు. కాగా ఉత్తర కొరియా ఇప్పటివరకు దక్షిణ కొరియాలోని వివిధ ప్రాంతాల్లో వెయ్యికి పైగా చెత్తతో కూడిన బెలూన్లను ఎగరేసింది. వీటిలో పేడ, సిగరెట్ పీకలు, గుడ్డ ముక్కలు, వ్యర్థ కాగితాలు ఉన్నట్లు గుర్తించారు. దక్షిణ కొరియా సైన్యం తెలిపిన వివరాల ప్రకారం ఈ బెలూన్లలో ఎటువంటి ప్రమాదకర పదార్థాలు లేవు. -
ప్రపంచంలో బర్డ్ ఫ్లూతో తొలి మృతి నమోదు
కరోనాకు మించిన ప్రమాదకరమైనదిగా పరిగణిస్తున్న హెచ్5 ఎన్1(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) పలు దేశాలకు విస్తరిస్తోంది. పశువులు, పాల ద్వారా మనుషులకు బర్డ్ఫ్లూ సోకుతోంది. అమెరికాలోని పలు నగరాల్లో బర్డ్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంలో హెచ్5ఎన్1 వైరస్ కేసుల పెరుగుదలపై భారతదేశం కూడా అప్రమత్తమైంది. హెచ్5ఎన్1 వైరస్ను బర్డ్ ఫ్లూ అని కూడా అంటారు.తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) బర్డ్ ఫ్లూ కారణంగా ప్రపంచంలోనే మొదటి మరణం నమోదయ్యిందని తెలిపింది. మెక్సికోలో 59 ఏళ్ల వ్యక్తి బర్డ్ ఫ్లూ కారణంగా మరణించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అయితే ఆ వ్యక్తికి వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన ఈ ఏజెన్సీ వెల్లడించలేదు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు తదితర లక్షణాలతో బాధితుడిని ఆసుపత్రిలో చేర్చారు. అతను అప్పటికే దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం, మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధులతో బాధపడుతున్నాడు.మే 23న ఈ కేసు గురించి తమకు మొదట తెలిసిందని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇది కరోనావైరస్ కంటే వంద రెట్లు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ అని వైద్య నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అందించిన నివేదికలో ప్రస్తుతానికి ఒకరి నుండి మరొకరికి హెచ్5ఎన్1 వైరస్ సోకిన సందర్భాలు కనిపించలేదు. అయినప్పటికీ ఈ వైరస్ విషయంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.ఈ వైరస్ సంక్రమించినప్పుడు దాని లక్షణాలు తేలికపాటి నుండి తీవ్ర స్థాయి వరకూ ఉంటాయి. ఈ నెల ప్రారంభంలో బర్డ్ ఫ్లూపై భారత ప్రభుత్వం ఒక సలహాను జారీ చేసింది. ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరింది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. -
'ప్రపంచ ఆకలి దినోత్సవం': ఎంతమంది బాధపడుతున్నారంటే..?
'ఆకలి' దీనికి ఎవరూ అతీతులు కారు. ఆకలి వేస్తే రాజైనా.. అల్లాడిపోవాల్సిందే. ఆకలి విలువ తెలిసిన వ్యక్తి సాటి వాడిని ఆకలితో బాధపడేలా చేయడు. కనీసం ఓ బ్రెడ్ లేదా గుప్పెడు అన్నం అయిన ఇచ్చి ఆదుకునే యత్నం చేస్తాడు. ముఖ్యంగా మనదేశంలో ఆకలితో అల్లాడిపోతున్న పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అంతేగాదు అధికారిక లెక్కల ప్రకారం.. ఆకలి (Hunger) బాధితుల సంఖ్య 46 మిలియన్లు ఎగబాకినట్లు యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆకలిని అంతం చేసేలా పేదరికం నిర్మూలనకు నడుంకట్టేందుకు ఈ ఆకలి దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ దినోత్సవం ప్రాముఖ్యత ? విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.2011లో, ఆకలి, పేదరికాన్ని అంతం చేయడానికి ‘ది హంగర్ ప్రాజెక్ట్’ అనే లాభరహిత సంస్థ మే 28ని ‘ప్రపంచ ఆకలి దినోత్సవం’గా (World Hunger Day) ప్రకటించింది. ఈ రోజునఆహార భద్రతను ప్రోత్సహించే కమ్యూనిటీలను బలోపేతం చేయడం, పరిష్కారాలను కనుగొనడం వంటివి చేస్తుంది. ప్రతి ఏడాది ఓ థీమ్ని ఏర్పాటు చేసి ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు అధికారులు. ఆకలితో అల్లాడుతున్న వారికి సాయం అందేలా ఏం చేయాలనే అనే అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడతారు. ప్రపంచ వ్యాప్తంగా 811 మిలియన్ల మంది ఆకలి బాధతలో సతమతమవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ఈ ఏడాది థీమ్! "అభివృద్ధి చెందుతున్న తల్లులు, అభివృద్ధి చెందుతున్న ప్రపంచం" దీన్ని ఇతి వృత్తంగా తీసుకుని మహిళలు, తమ కుటుంబాలు సమాజాలు ఆహారభద్రతను నిర్థారించడంలో కీలకపాత్ర పోషిస్తాయని నొక్కి చెబుతోంది. యూఎన్ ప్రకారం బిలియన్ కంటే ఎక్కువ మంది మహిళలు, కౌమరదశలో ఉన్న బాలికలు పోషకాహార లోపాన్ని అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితి తల్లులు, వారి పిల్లలు ఇరువురికి దారుణమైన పరిస్థితులున ఎదుర్కొనేలా చేస్తుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం, విద్య, ఆర్థిక అవకాశాలపై పెట్టుబడి పెట్టడం ద్వారా ఆకలి చక్రాన్ని విచ్ఛిన్నం చేసి, అభివృద్ధి చెందుతున్న సమాజాన్ని సృష్టించొచ్చు. ప్రాముఖ్యత ..ఈ రోజున ప్రతి ఒక్కరిని కార్యచరణకు పిలుపునిచ్చేలా..ఆహార భద్రతను ప్రోత్సహించే సంస్థలకు మద్దతు ఇవ్వడం, ఆహార భద్రతను ప్రోత్సహించే విధానాల కోసం కృషి చేయడం. తినే ఆహారానికి సంబంధించిన సరైన ప్రణాళికలు, ఆకలిని అంతం చేసేలా కృషి చేయడం తదితర కార్యక్రమాలను చేపడతారు. అందరూ కలిసి ఆరోగ్యంగా, సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి అవసరమైన పౌష్టికాహారాన్ని పొందేలా సరికొత్త ప్రపంచాన్ని నిర్మించేలా చేయడం ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం. చేయాల్సినవి..వ్యవసాయ అభివృద్ధి: రైతులు అవసరమైన వనరుల, సరైన శిక్షణ అందేలా చేయడంవిద్య: పేదరికం నిర్మూలించేలా విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంఆరోగ్య సంరక్షణ: ఆకలి సంబంధితన అనారోగ్యాలను తగ్గుముఖం పట్టేలా ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడంఆర్థిక సాధికారత: పేద ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, వస్థాపకతకు మద్దతు ఇవ్వడం.(చదవండి: వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే : పీరియడ్స్ పరిశుభ్రత ముఖ్యం, లేదంటే చాలా ప్రమాదం) -
అదొక.. 'AI పొలిటికల్ అవతార్'!
ఈ సంవత్సరమే జరిగిన పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో.. అవినీతి ఆరోపణల కింద ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. అతని పార్టీ పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్) తరఫున అతను పోటీ చేయడానికే కాదు.. ప్రచారం చేయడానికీ వీల్లేదని ఆ దేశపు సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. దాంతో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రంగా బరిలోకి దిగారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికలుగా ఇమ్రాన్ ప్రచారం చేసిపెట్టాడు. ప్రసంగాలిచ్చాడు. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ కోర్టు తీర్పును ధిక్కరించాడా? అయ్యో అస్సలు కాదు. జైల్లోనే ఉన్నాడు. మరి? ప్రచారం, ప్రసంగాలు చేసింది ఇమ్రాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతార్!ఒక్క పాకిస్తాన్లోనే కాదు ప్రపంచ రాజకీయాల్లో తన చిప్ని దూర్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్! దాదాపు 50కి పైగా దేశాలకు ఇది ఎన్నికల సంవత్సరం. సుమారు రెండు బిలియన్ల (రెండువందల కోట్లు) మంది ఓటును వినియోగించుకుంటున్నారు. అమెరికా టు ఆఫ్రికా, ఆసియా టు ఐరోపాలోని దేశాల్లో జరిగే ఈ ఎన్నికల్లో పాలసీ మ్యాటర్స్, ప్రచారం .. పాజిటివ్, నెగటివ్ రెండు కోణాల్లో ఏఐదే ప్రధాన పాత్ర! అందుకే 2024, గ్లోబల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ సంవత్సరాన్ని ఏఐ ఎలక్షన్స్ ఇయర్ అంటున్నారు. ఈ సందర్భంగా.. మన దగ్గర స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సాంకేతికత అందిపుచ్చుకుంటున్న ఈ క్షణం దాకా ఎన్నికల ప్రచారాల్లో వస్తున్న మార్పుల వెంట సరదాగా నడిచొద్దాం..దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొన్ని దశాబ్దాల వరకు ఎన్నికల ప్రచారమంటే అగ్రనేతలు నిర్వహించే బహిరంగ సభలే! ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకి వస్తే.. ఖాదీ వస్త్రధారణ, పవర్ఫుల్ స్లోగన్సే ప్రచారస్త్రాలుగా ఉండేవి. 1965లో లాల్బహదూర్ శాస్త్రి ‘జైజవాన్ జై కిసాన్’తో మొదలైందీ ఎన్నికల నినాద యాత్ర. ఉత్తరప్రదేశ్, ప్రయాగ్రాజ్లోని ఉరువా బహిరంగ సభలో ఆ నినాదాన్నిచ్చారు ఆయన. చైనా, పాకిస్తాన్లను దృష్టిలో పెట్టుకుని.. సరిహద్దు గట్టి రక్షణకు సైనికుల బలాన్ని, వ్యవసాయాధారిత మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక రైతులే కాబట్టి వాళ్ల సంక్షేమాన్ని కాంక్షిస్తూ.. ఆ రెండు వర్గాలకు తమ సర్కారు అండగా ఉంటుందనే భరోసాను కల్పించడానికి శాస్త్రి ఆ స్లోగన్ని అందుకున్నారు. అది వైరలై నేటికీ లైవ్గానే ఉంది.1971లో ఇందిరాగాంధీ ఇచ్చిన ‘గరీబీ హటావో (పేదరిక నిర్మూలన)’ నినాదం కాంగ్రెస్కి ల్యాండ్స్లైడ్ విక్టరీని తెచ్చిపెట్టింది. అయితే ఆ నినాదానికి యాంటీగా ప్రతిపక్షాలు.. ‘గరీబీ కాదు గరీబోంకో హటారహే (పేదరికాన్ని కాదు పేదలను నిర్మూలిస్తోంది)’ అంటూ ఆమెను ట్రోల్ చేశాయి. 1975 ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికలప్పుడు జనతా పార్టీ ‘ఇందిరా హటావో దేశ్ బచావో’ స్లోగన్తో విజయం సాధించింది. ఇందిరా హత్య తర్వాత 1984 ఎన్నికల్లో ‘జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా.. ఇందిరా తేరా నామ్ రహేగా (సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఇందిరా నీ పేరుంటుంది)’ నినాదంతో కాంగ్రెస్ గెలుపొందింది.1989లో వీపీ సింగ్ ‘రాజా నహీ ఫకీర్ హై.. దేశ్ కీ తక్దీర్ హై (రాజు కాదు పేద.. ఆయనే ఈ దేశపు భాగ్యప్రదాత)’ స్లోగన్తో ఎన్నికలను జయించి ప్రధాని అయ్యాడు.1996 స్లోగన్ ‘బారీ బారీ అబ్ కీ బారీ అటల్ బిహారీ’ ఎంత పాపులరో వేరేగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత వరుసగా ‘ఇండియా ఈజ్ షైనింగ్’, ‘కాంగ్రెస్ కే హాత్ ఆమ్ ఆద్మీ కే సాథ్ (కాంగ్రెస్ హస్తం.. సామాన్యుడికి ఆపన్న హస్తం)’ నినాదాలు ఆయా పార్టీల ఐడెంటిటీలుగా మారాయి. అయితే నినాదాల పవర్ సోషల్ మీడియా ఇరాలోనూ కొనసాగుతోంది. ‘అచ్ఛే దిన్ ఆలే వాలే హై (మంచి రోజులు రానున్నాయి)’, ‘హాత్ బద్లేగా హాలాత్ (హస్తం మార్పును తెస్తుంది), ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’, ‘అబ్ కీ బార్ చార్సౌ పార్’ వంటి నినాదాలే అందుకు నిదర్శనం.స్వాతంత్య్రం వచ్చిన ఓ రెండుమూడు దశాబ్దాల వరకు ఎన్నికల ప్రచారంలో రేడియో కూడా ప్రధాన పాత్ర పోషించింది. దశాబ్దం కిందటి వరకు పత్రికలు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఆ రోల్ని తీసుకున్నాయి. వీటితోపాటు గోడ పత్రికలు, పాంప్లెట్స్, వాల్ రైటింగ్స్ కూడా తమ ఉనికిని చాటాయి. ప్రైవేట్ చానళ్ల పర్వం మొదలయ్యాక అవీ తమ ఇన్ఫ్లుయెన్స్ని చూపించాయి. నేతల ప్రచార యాత్రలూ ఆయా పార్టీల జయాపజయాలను ప్రభావితం చేశాయి. వాటిల్లో ఆడ్వాణీ రథ యాత్ర ఒకటి. ఇది వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచినప్పటికీ రైట్ వింగ్ ఐడియాలజీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఫలితంగా ఆ తర్వాత ఐదేళ్లలోనే కేంద్రంలో ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేలా చేసింది.రిగ్గింగ్ చేస్తున్నట్టు..స్లొవేకియాలో నిరుడు జరిగిన ఎన్నికల్లో.. ప్రధాన పార్టీల తరఫున నిలబడిన వ్యక్తి ఆడియో టేప్ సంచలనంగా మారింది. ఆ టేప్లో.. తాను ఎలా రిగ్గింగ్ చేయబోతున్నాడో మరొకరికి విపులంగా వివరిస్తున్నాడు. ఆ ఆడియో బయటకు వచ్చాక సదరు నేత ఎన్నికల్లో ఓడిపోయాడు. అతనికి అమెరికా, నాటో దేశాలను సమర్థించే వ్యక్తిగా పేరుంది. అందుకే అతన్ని ఎన్నికల్లో ఓడించేందుకు ఏఐ సాయంతో రష్యన్ ఏజెన్సీలు డీప్ఫేక్ ఆడియోను çసృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశాయి అమెరికా అనుకూల అభ్యర్థి ఓటమికి దారులు వేసి, రష్యన్ అనుకూల వ్యక్తిని గెలిపించుకున్నాయి. ఎన్నికల అనంతరం యూఎస్ చేపట్టిన సమగ్ర విచారణలో ఈ అంశం వెలుగు చూసింది.జంతువులతో పోల్చినట్టు..ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండోనేషియా ఎన్నికలపైనా ఏఐ ఎఫెక్ట్ పడింది. ప్రభుత్వాధినేత ప్రభోవో సుబియాంటో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉపాధ్యక్షుడు గిబ్రాన్ రకాబుమ్మింగ్ తీవ్రంగా విమర్శిస్తున్న వీడియో అక్కడ సంచలనమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకునే వ్యక్తులను ఉపాధ్యక్షుడు ‘జూ’లోని జంతువులతో పోల్చినట్టుగా ఉందీ వీడియోలో. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ వీడియోపై విచారణ జరిపించింది. గిబ్రాన్ పాత వీడియోకు ఏఐ జనరేటెడ్ వాయిస్ను జోడించి ఫేక్ వీడియో క్రియేట్ చేసినట్టుగా తేలింది.తప్పుకుంటున్నట్టు..ఈ సంవత్సరం మొదట్లో బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికల్లో అబ్దుల్లా నహీద్.. స్వతంత్ర అభ్యర్థిగా గాయ్బంధా నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల పోరులో గెలుపు కోసం అతను శ్రమిస్తుండగా.. హఠాత్తుగా ఓ వీడియో బయటకు వచ్చింది. అతను పోటీ నుంచి తప్పుకుని ప్రత్యర్థికి మద్దతు ఇస్తున్నట్టుగా! దీంతో అప్పటి వరకు నహీద్కు వచ్చిన ప్రచార ఊపంతా గంగపాలైంది. చివరకు ఆ వీడియో డీప్ ఫేక్గా నిర్ధారణైంది.సోషల్ మీడియా..తొంభైయ్యవ దశకంలో ఎన్నికల ప్రచారం పేరుతో అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం మొదలైంది. సామాన్యులు పోటీలో నిలబడి తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో రాజకీయ ప్రచారంపై ఎన్నికల కమిషన్ నజర్ పెట్టింది. కొత్త నియమ నిబంధనలను తీసుకొచ్చింది. అలా రాజకీయ ప్రచారానికి హద్దులు నిర్దేశమవుతున్న తరుణంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ఎన్నికల ప్రచారంలో భాగం పంచుకున్నాయి. ఆ తర్వాత కొద్ది కాలానికే ఇంటర్నెట్ విప్లవం వచ్చి పడింది. సోషల్ మీడియాను మోసుకొచ్చింది. అంతే ఈమెయిల్స్, వాట్సాప్ మొదలు యూట్యూబ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఎక్స్, ఇన్స్టా లాంటి సోషల్ మీడియా పాపులర్ ప్లాట్ఫామ్స్ జనాలకు చేరువయ్యాయి. ఆదిలోనే వాటి ఇంపాక్ట్ని గ్రహించి.. సమర్థవంతంగా వాడుకున్న పార్టీగా బీజేపీకి పేరుంది. గుజరాత్లో మొదలైన మోదీ వేవ్ 2014లో సోషల్ మీడియా వేదికగా దేశమంతటా విస్తరించడానికి కారణమైంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీ..సోషల్ మీడియా ప్రచారాన్ని రాకెట్లోకి ఎక్కించి ఆకాశం అందుకునేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్స(ఏఐ) ఎంట్రీ ఇచ్చింది. 2013 నుంచే ఏఐ వాడకం మొదలైనా అది శైశవ దశ. ఇప్పుడు ఏఐ యవ్వన దశకు చేరుకుంది. సరదాగా మొదలైన ఏఐ వాడకం ప్రొఫెషన్స్సకి ఉపకరణంలా మారింది. ఇప్పుడు మరింతగా ముదిరి ఎన్నికల ప్రక్రియలో భాగమైంది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఓటును వినియోగించుకునేందుకు అందుబాటులో ఉన్న సమాచారం ఎంతో కీలకం. తమకు తెలిసిన, తమ దగ్గరకు వస్తున్న సమాచారం ఆధారంగానే ఓటరు నిర్ణయం ప్రభావితం అవుతుంది. కానీ ఇప్పుడు గెలుపే పరమావధిగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏఐని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి వినియోగిస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో రాజకీయాల్లోని వ్యక్తులతో పాటు ఆకతాయిలూ ఉంటున్నారు. ఫలితంగా అగ్రరాజ్యమైన అమెరికా నుంచి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ వరకు అంతటా ఎన్నికల ప్రక్రియ కుదుపునకు లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏఐ వాడి, వేడికి అమెరికా, యూరప్లలో ఫెయిర్ ఎలక్షన్స్స కోరుకునే ప్రజాస్వామ్యవాదులకు దడ మొదలైంది.ఆర్థిక, ఆయుధ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంపై అమెరికా ఆధిపత్యం తెలియంది కాదు. అమెరికా తన దగ్గరున్న టెక్నాలజీ సాయంతో ఇండియాలో మన చేతికి ఉన్న వాచిలో టైమ్ ఎంతో చూడగలదని చెబుతుంటారు. అంతటి అమెరికా అధ్యక్షుడికే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్స చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో! డెమొక్రాట్ల తరఫున బైడెన్, రిపబ్లికన్ ల తరఫున డోనాల్డ్ ట్రంప్లు ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఏఐ ద్వారా వచ్చే సమస్యలను ఎదుర్కోవడం వారికీ సవాలుగా మారిందనడంలో సందేహం లేదు.ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తున్న వీడియోఇద్దరినీ..తైవాన్ ఎన్నికల సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సైయింగ్ వెన్ లక్ష్యంగా అనేక ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వాటిల్లో ఆ దేశానికి చెందిన ప్రముఖ న్యూస్ యాంకర్‡దేశాధ్యక్షుడిని ఇంటర్వ్యూ చేసినట్టుగా ఉన్ని వీడియో ఒకటి. అందులో చైనా – తైవాన్ సంబంధాలపై దేశ అధ్యక్షుడి ప్రతిష్ఠకు భంగం కలిగేలా సమాచారం వ్యాప్తి చేశారు. ఈ డీప్ఫేక్ వీడియోలో అధ్యక్షుడి వాయిస్నే కాదు న్యూస్ యాంకర్నూ ఏఐ ద్వారా సృష్టించారు.ఘాటైన వ్యాఖ్యలు!బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఇటీవల వారణాసి వెళ్లారు. అక్కడ జరిగిన అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. అయితే కొద్ది రోజులకే ఏఐ సాయంతో రణ్వీర్సింగ్ వాయిస్ను క్లోన్ చేసి అదే వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. అందులో.. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, మోడీ అసంబద్ధ విధానాలపై రణ్వీర్సింగ్ ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. అంతేకాదు దేశ భవిష్యత్తు కోసం రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్కు ఓటేయాలని కోరినట్టుగా ఉంది. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. వెంటనే తేరుకున్న రణ్వీర్ సింగ్ కుటుంబం సదరు తప్పుడు సమాచారాన్ని షేర్ చేసిన వారిపై కేసు పెట్టింది. మరో హీరో ఆమిర్ఖాన్ కూ ఇలాంటి అనుభమే ఎదురైంది.ఇమ్రాన్ .. నీకు నేనున్నాను!ఈ మార్చి మొదట్లో ట్రంప్ మాట్లాడుతున్న వీడియో ఒకటి అమెరికాలో వైరల్ అయింది. అందులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ును ఉద్దేశిస్తూ ట్రంప్ చెప్పిన మాటలు అమెరికాలో సంచలనం కలిగించాయి. త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే, ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను విడిపిస్తానని, అమెరికా– పాకిస్తాన్ ల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తానని ట్రంప్ మాట్లాడినట్టుగా ఆ వీడియోలో ఉంది. దీనిపై నలువైపులా విమర్శలు చుట్టుముట్టాయి. చివరకు టెక్నోక్రాట్స్, అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు రంగంలోకి దిగి దర్యాప్తు జరిపితే.. అది ఏఐ యాప్ ద్వారా తయారైన డీప్ ఫేక్ వీడియో అని తేలింది. ట్రంప్ మాట్లాడుతున్న పాత వీడియోలు, ట్రంప్ను పోలిన ఏఐ వాయిస్ సాయంతో కొత్త వీడియోను తయారుచేసి వదిలారు. అది నిజామా.. కాదా? అని తెలుసుకునేలోపు ఆ వీడియో సగం అమెరికాను చుట్టొచ్చింది.అంతేకాదు న్యూహాంప్షైర్ ప్రైమరీ ఎన్నికలప్పుడు.. అక్కడి ఓటర్లకు ఫోన్ కాల్స్ వచ్చాయి. అందులో బైడెన్ స్వయంగా.. ప్రైమరీ ఎన్నికల్లో ఓటు వేయద్దంటూ ఆ ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల్లో సేవ్ చేసిన ఓటును త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు కోసం ఉపయోగించాలంటూ విజ్ఞప్తి చేశారు. గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, ట్రంప్ల మధ్య విజయం దోబూచులాడింది. ఓట్ల లెక్కింపు అంశం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో బైడెన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ నిజమేనేమోనని సగటు అమెరికన్ ఓటరు నమ్మే పరిస్థితి నెలకొంది. కానీ విచారణలో ఏఐ సాయంతో బైడెన్ వాయిస్ను సృష్టించి ఆ కాల్స్ చేసినట్టు తేలింది. ఇలా అసలు జరగని విషయాన్ని కచ్చితంగా జరిగిందన్నట్టుగా మన పంచేద్రియాలను నమ్మించడం సులువైపోయింది.మన దగ్గర..అమెరికన్ ర్యాపర్ లిల్ యాచీ నడక ఆధారంగా.. ప్రధాని నరేంద్ర మోదీని డిక్టేటర్గా పేర్కొంటూ రూపొందిన ఏఐ మీమ్.. ఎక్స్లో పోస్ట్ అయిన క్షణాల్లోనే వైరల్ అయింది. ఆ వెంటనే దేశంలో అనేక మంది రాజకీయ నాయకుల ఏఐ మీమ్స్, ఏఐ అవతార్లు స్క్రీన్ మీదకు వచ్చాయి. ఆఖరికి ఈ ఏఐ మీమ్స్ ట్రెండ్పై సాక్షాత్తు ప్రధాని ‘నా మీద చేసిన మీమ్ చాలా క్రియేటివ్గా ఉంది. ఎన్నికల ఒత్తిడితో సతమతమవుతున్న నేను దీన్ని చూసి భలే రిలాక్స్ అయ్యాను’ అని స్పందించారు. భారతీయ జనతా పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారానికి ఏఐని వాడుకుంటోంది. ప్రధాని మోదీ హిందీ సంభాషణను ఏఐ సాయంతో ఎనిమిది ప్రాంతీయ భాషల్లోకి మార్చింది.నేరుగా దేశ ప్రధానే తమ సొంత భాషలో తమతో మాట్లాడారు అని ప్రజలు మురిసిపోయారు. సాంకేతికతను ఒడిసిపట్టుకున్నామని బీజేపీ ఆనందంతో గంతులేసింది. అదే విధంగా గడిచిన పదేళ్లలో భారత్ ఎలా అభివృద్ధి చెందిందనే అంశాలపైనా ఏఐ సాయంతో వీడియో రూపొందించి జనాల్లోకి వదిలింది. ప్రచారంలో దూసుకుపోయింది. ఏఐని మంచికి వాడుకుంటే తప్పులేదు. ప్రజలను భ్రమల్లోకి నెట్టాలనుకుంటేనే ప్రమాదం. ప్రపంచంలోనే ఏ దేశానికి లేనంత యువ జనాభా మన సొంతం. ఈ యువ భారతానికి స్పీడెక్కువ.సోషల్ మీడియా అధికంగా ఉపయోగించేది వీళ్లే. ఈ ఉడుకు రక్తానికి సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ల ద్వారా.. నిజాన్ని తలదన్నేలా ఏఐ తయారుచేస్తున్న తప్పుడు సమాచారం అందితే? దాని ఆధారంగా వారి ప్రయాణం సాగితే? వ్యక్తులుగా వారికి, వ్యవస్థగా దేశానికి తీరని నష్టం. రెచ్చగొట్టే సభలు, సమావేశాలు, తప్పుడు ప్రకటనలనైతే అడ్డుకోవచ్చు. కానీ చేతిలో ఇమిడిపోయే ఫోన్లను టాయిలెట్లకు సైతం తీసుకుపోతున్న కాలంలో.. నియంత్రణ లేకుండా కనురెప్ప పాటులో సోషల్ మీడియా ద్వారా బట్వాడా అవుతున్న అబ్ధాలను అడ్డుకోవడమెలా?మరణించిన వ్యక్తి ప్రచారం..2019లో.. తమిళనాడు, కన్యాకుమారి నుంచి వసంత్ కుమార్ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2020లో ఆయన మరణించారు. మొన్నటి ఏప్రిల్ 19న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కొడుకు విజయ్కుమార్ పోటీ చేశారు. అయితే పోలింగ్కు కొన్ని రోజుల ముందు తన కొడుకు విజయ్ను గెలిపించాలంటూ వసంత్కుమార్ కోరుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. 2020లో చనిపోయిన వసంత్ 2024లో ఎలా ప్రచారం చేశాడా అని జనాలు అవాక్కయ్యారు. అయితే అది డీప్ఫేక్ సాయంతో రూపొందించిన వీడియోగా తేలింది.ఫ్యాక్ట్ చెక్ ఉన్నా..సాంకేతికంగా రోజుకో కొత్త ఆవిష్కరణ పుట్టుకొస్తున్న ఆధునిక యుగంలో ప్రతి చెడును చట్టాలతో అరికట్టడం ఒకింత కష్టమే! అనుమానం ఉన్న కంటెంట్ను పట్టుకుని, దానికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి నిజానిజాలు తేల్చడం ఖర్చు, కాలంతో కూడుకున్న పని. ఫ్యాక్ట్ చెక్, ట్రూత్ ఫైండర్, ఫేక్న్యూస్ తదితర పద్ధతుల్లో అసలు ఏదో నకిలీ ఏదో తెలుసుకోవడం సంక్లిష్టంగా మారింది. డిజిటల్ లిటరేట్సే కానీ డిజిటల్ ఎడ్యుకేట్స్ లేదా డిజిటల్లీ చాలెంజ్డ్ జనాభా ఉన్న దేశాల్లో.. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పలురకాలుగా వడబోస్తే తప్ప అసలైన విషయం బటయకు రాదు. కానీ అసలు నిజం వెలుగు చూసేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తోంది.ముల్లును ముల్లుతోనే..ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా టెక్నాలజీ ఆధారంగా జరుగుతున్న తప్పుడు సమాచార ప్రచారానికి చెక్ పెట్టాలంటే తిరిగి టెక్నాలజీనే ఆయుధంగా మలచుకోవాలి. సాంకెతిక నైపుణ్యంతో సృష్టిస్తున్న అభూత కల్పనలను ఇట్టే పసిగట్టి హెచ్చరించి, నిరోధించే ప్రత్యామ్నాయ యాప్లను డెవలప్ చేయడంపై భావి ఆవిష్కర్తలు దృష్టి సారించాలి. లేదంటే నీడే నిజమనే భ్రాంతిలో బతకాల్సి వస్తుంది. ఇప్పటికే గూగుల్, మెటా, ఎక్స్, ఓపెన్ ఏఐ, టిక్టాక్లు తమ ఫ్లాట్ఫామ్స్పై డీప్ఫేక్ ద్వారా జరిగే ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చాయి. ఈ మేరకు ఫేక్ను గుర్తించే వ్యవస్థలను మరింత సమర్థంగా రూపొందిస్తామని వెల్లడించాయి.ఎన్నికల వ్యవస్థలోకి ఏఐని జొప్పించి చేస్తున్న విష ప్రచారంపై పాశ్చాత్య ప్రపంచం మేల్కొంది. ఏఐని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై చర్చలను నిర్వహిస్తోంది. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా చట్టాలను రూపొందించాలని ప్రపంచ దేశాలకు సూచనలు చేస్తోంది. ఏఐని అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల సహకారంతో అంతర్జాతీయ స్థాయి చట్టాల రూపకల్పనకు సమయం ఆసన్నమైందని పోరుతోంది.యంత్రమా.. హృదయ స్పందనా..వందమంది చేసే పనిని ఒక్క యంత్రమే చేయగలదు. మనిషి కంటే ఎన్నో రెట్లు శక్తి సామర్థ్యాలు యంత్రాల సొంతం. ఇప్పుడా యంత్రాలకు మరింత మెరుగ్గా ఆలోచించే శక్తిని ఏఐ అందిస్తోంది. అయితే ఎన్ని శక్తియుక్తులు ఉన్నా మనిషి స్పృహ, హృదయ స్పందన ముందు అవన్నీ దిగదుడుపే.ముగింపు..సంప్రదాయం, సాంకేతికతకు ఎప్పుడూ ముడిపడదు. ఆ పోరులో టెక్నాలజే ఓ మెట్టు పైన ఉంటుంది. కాలానికి తగ్గట్టు మారాల్సిందే. తప్పదు.. తప్పు లేదు. అయితే మంచిచెడులను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలి. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల పర్యవసానాలు అనుభవించిన తర్వాత ప్రపంచ దేశాలు అణ్వాయుధాల తయారీ మీద స్వీయ నియంత్రణను పాటిస్తున్నాయి. జీవాయుధాల తయారీ, సాగులో బయోటెక్నాలజీ వినియోగం తదితర అంశాల మీద ఓ కన్నేసి ఉంచాయి. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఏఐ వాడకం వంటి వాటి నియంత్రణ మీదే ఇంకా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఐక్యం కావాల్సిన సందర్భం వచ్చింది అంటున్నారు సామాజిక, రాజకీయ విశ్లేషకులు. – తాండ్ర కృష్ణ గోవింద్ -
ప్రపంచంలోనే 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాలో రెండు భారతీయ రెస్టారెంట్లకు చోటు!
విలియం రీడ్ మీడియా ఈ ఏడాది 2024కి ప్రంపంచలోని 50 అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అందుకోసం రెస్టారెంట్ల జాబితాను మరింతగా సవరించింది. ఈ గ్లోబల్ ర్యాకింగ్స్ని సవరించి 2024కి సంబంధించిన ప్రతిష్టాత్మక ఉత్తమ రెస్టారెంట్ల జాబితాను చేసింది. అందులో రెండు భారతీయ రెస్టారెంట్లకు చోటు దక్కడం విశేషం. ఈ రెండు రెస్టారెంట్లు టాప్ 51 నుంచి 100వ ర్యాంకుల్లో స్థానాలు దక్కించుకున్నాయి. ఈ సవరించిన జాబితాలో ముంబైలోని రెండు భారతీయ రెస్టారెంట్లలలో న్యూఢిల్లీలోని ఒక రెస్టారెంట్కి స్థానం దక్కింది. ముంబైలోని మాస్క్ అనే రెస్టారెంట్ ఈ అంతర్జాతీయ జాబితాలో 78వ స్థానం దక్కించుకోగా న్యూఢిల్లీలోని ఇండియన్ యాక్సెంట్ మరోసారి రీ ఎంట్రీ ఇచ్చి..89వ స్థానంలో నిలిచింది. మాస్క్ రెస్టారెంట్..ఆసియాలోని 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితా ప్రకారం 2023-2024లో భారతదేశంలోని ది బెస్ట్ రెస్టారెంట్గా మాస్క్ నిలిచింది. ఈ రెస్టారెంట్ ఫౌండర్ అదితి దుగర్, హెడ్ చెఫ్ వరణ్ టోట్లని సారథ్యంలో కస్టమర్లకు మంచి బ్రాండెడ్ ఉత్పత్తులతో చేసిన రుచులను అందించేవారు. అంతేగాదు అందుబాటులో ఉన్న పదర్థాలతోనే మంచి రుచిని అందించేలా ఆకరషణీయంగా కనిపించేలా సర్వ్ చేస్తుంది. ఇండియన్ యాక్సెంట్, న్యూఢిల్లీ ఇది 2015 నుండి 2021 వరకు వరుసగా ఏడేళ్లు అత్యుత్తమ రెస్టారెంట్ ప్రకటించబడింది. ఇది 2024కి ఆసియాలోని 50 ఉత్తమ రెస్టారెంట్లలో 26వ స్థానంలో ఉంది.ఇది భారతీయ సమాకాలీన వంటకాలను అందించే రెస్టారెంట్గా పేరుగాంచింది. చెఫ్ మనీష్ మెహ్రోత్రా సారథ్యంలో రకరకాల రుచుల ఆవిష్కరణల తోపాటు సీజన్కు తగ్గట్టు భారతీయ సంప్రదాయ వంటకాలతో ప్రజలను మంత్రముగ్ధులను చేస్తుంది. కాగా, జూన్ 5, 2024న లాస్ వెగాస్లో జరిగే అవార్డుల వేడుకలో ఈ ఏడాది 2024కి సంబంధించిన 50 అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాను లైవ్లో ప్రకటించనుంది. (చదవండి: నటుడు వరుణ్ సూద్కు వచ్చిన బ్రెయిన్ ఇంజూరీ అంటే? ఎందువల్ల వస్తుంది?)a -
అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
ప్రతి ఏడాది మే 21వ తేదీ అంతర్జాతీయ టీ దినోత్సవం( International Tea Day! జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21, 2019న తీర్మానించింది. దీంతో ఏటా ఆహార, వ్యవసాయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మే 21వ తేదీని ఘనంగా నిర్వహిస్తున్నాయి. టీని ఉత్పత్తి చేయడం, వినియోగానికి అనుకూలమైన కార్యకలాపాలను అమలు చేసేందుకు సమిష్టి చర్యలు తీసుకోవడం, ప్రోత్సహించడం ఈ రోజు ప్రధాన లక్ష్యం.చరిత్రఈశాన్య భారతదేశం, ఉత్తర మయన్మార్, నైరుతి చైనాలో ఈ టీ (Tea) ఉద్భవించిందని చాలా మంది నమ్ముతారు. కచ్చితమైన ప్రదేశం తెలియనప్పటికీ 5వేల ఏళ్ల క్రితం చైనాలో మొదటిసారిగా టీ తాగినట్టు కొన్ని ఆధారాలున్నాయి. భారతదేశంతో పాటు శ్రీలంక, నేపాల్, వియత్నాం, ఇండోనేషియా, బంగ్లాదేశ్, కెన్యాస మలావి, మలేషియా, ఉగాండా, టాంజానియా వంటి టీ ఉత్పత్తి దేశాల్లో 2005నుంచి అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ రోజున టీ ఉత్పత్తి చేసే దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ వర్కర్స్ సంస్థలు సెమినార్లు, పబ్లిక్ ఈవెంట్లను నిర్వహిస్తూ సమావేశమవుతాయి.పొద్దుపొద్దునే వేడి వేడి చాయ్ కడుపులో పడితేగానీ హాయిగా ఉండదు చాలామందికి. ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగించేది టీ. చుట్టాలు వచ్చినా ముందుగా గుర్తొచ్చొది టీ. అలాంటి టీలో ప్రపంచం నలుమూలల ఉన్న వెరైటీలు ఏంటో చూద్దామా..మాచా, జపాన్: గ్రీన్ టీ ఆకులతో ప్రాసెస్ చేసిన టీ పొడి. ఆకుపచ్చరంగులో ఉండే టీ. జపాన్లో ఈ టీ బాగా ఫేమస్. ఇది మట్టి రుచిని కలిగి ఉంటుంది. ముందు సిప్ చేస్తే చేదుగా ఉండి రానురాను మాధుర్యంగా ఉంటుంది. దీన్ని ఐస్డ్ టీ, ఐస్క్రీమ్లు, ఇతర డెజర్ట్లలో కూడా ఉపయోగించింది.టెహ్ తారిక్, మలేషియా: టెహ్ తారిక్ అనేది మలేషియా నుంచి వచ్చిన ఒక ప్రసిద్ధ వేడి పాల టీ పానీయం. సాధారణంగా నురుగుతో ఉంటుంది. 'తే తారిక్' అనే పేరుకు "తీసి తీసిన టీ" అని అర్ధం. ఈ తీపి టీలో ఉడికించిన, స్ట్రాంగ్ బ్లాక్ టీ, ఆవిరైన క్రీమర్, పాలు ఉంటాయి. మరింత రుచిగా ఉండేలా ఏలకులను కూడా జోడించవచ్చు. చా యెన్, థాయిలాండ్: చా యెన్ ఒక ప్రసిద్ధ థాయ్ ఐస్డ్ టీ. ఇది మంచి రిఫ్రెష్ నిచ్చే పానీయం. ఇది బ్లాక్ టీ, రూయిబోస్ టీ, స్టార్ సోంపు, లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, పాలు, పంచదారతో తయారు చేసే పానీయం. ఇది తీపి, క్రీము, సుగంధ రుచిని కలిగి ఉంటుంది. దీన్ని కొబ్బరి పాలను ఉపయోగించి కూడా తయారు చేసుకోవచ్చు. చా యెన్ని ఐస్ముక్కలతో సర్వ్ చేస్తారు.మసాలా చాయ్: భారతదేశం ఇది చాలా ఫేమస్. చాలా మంది భారతీయులు తమ రోజును ప్రారంభించేందుకు లేదా సాయంత్రం విశ్రాంతి తీసుకోనే టైంలో ఈ మసాలా చాయ్ని ఆస్వాదిస్తారు. ఇది బిస్కెట్లు, రొట్టెలు లేదా పకోరస్ వంటి భారతీయ స్నాక్స్తో కూడా బాగా జత చేస్తుంది. మసాలా చాయ్ని మొదటగా వేడినీటిలో ఆకుపచ్చ ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, అల్లం, సోపు గింజలు వంటి మొత్తం మసాలా దినుసులను టీ ఆకులు వేసి బాగా మరిగిస్తారు. ఆ తర్వాత పాలు జోడించి, కావాల్సిన రంగు వచ్చేలా టీని తయారు చేసుకోవాలి. చాలా మంది ప్రజలు తమ కప్పు మసాలా చాయ్ను ప్రిపేర్ చేసేందుకు చక్కెర లేదా బెల్లం కూడా కలుపుతారు.సిలోన్ బ్లాక్ టీ, శ్రీలంక: సిలోన్ అనేది శ్రీలంకకు పూర్వపు పేరు, దీనిని ఇప్పటికీ టీ వ్యాపారంలో ఉపయోగిస్తున్నారు. శ్రీలంకకు చెందిన ఈ బ్లాక్ టీ స్ట్రాంగ్ రుచిని కలిగి ఉంటుంది. ఇది పూల వాసనలా ఉండి గొప్ప రంగును కలిగి ఉంటుంది. దీన్ని కూల్గా లేదా వెచ్చగా ఆస్వాదించవచ్చు. మీరు దీన్ని ఐస్డ్ టీ లేదా వెచ్చని బ్లాక్ టీగా ఆస్వాదించవచ్చు. -
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
సిడ్నీ: ప్రపంచంలో హీట్వేవ్ వల్ల సంభవించే మరణాల్లో అయిదో వంతు భారత్లోనేని ఒక అధ్యయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా హీట్వేవ్ కారణంగా 1.53లక్షల మందికిపైగా మరణిస్తుండగా ఇందులో ఐదో వంతు మంది భారత్లో చనిపోతుండడం కలవరం కలిగిస్తోంది. హీట్వేవ్ మరణాల్లో భారత్ తర్వాత వరుసగా చైనా, రష్యా దేశాలున్నాయి. మొత్తం హీట్వేవ్ మరణాల్లో సగం ఆసియా నుంచే కావడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. 1990 నుంచి ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా హీట్వేవ్తో సంభవిస్తున్న మరణాలను యూనివర్సిటీ అధ్యయనం చేసింది. మొత్తం మరణాల్లో 30 శాతం యూరప్లో సంభవిస్తున్నాయని తేలింది. ప్రభుత్వాలు హీట్వేవ్ల పట్ల సమగ్ర దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేసినప్పుడే మరణాలను అరికట్టవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.క్లైమేట్ చేంజ్ మైగ్రేషన్ పాలసీ, హీట్ యాక్షన్ ప్రణాళికలు, అర్బన్ ప్లానింగ్ అండ్ గ్రీన్ స్ట్రక్చర్స్, సామాజిక మద్దతు కార్యాచరణ, పబ్లిక్ హెల్త్కేర్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ అవేర్నెస్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ వంటి చర్యలు హీట్వేవ్ మరణాలు నివారించడానికి తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. -
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
ప్రకృతి అపూర్వమైన సంపద, మూలికలకు నిలయం. ప్రకృతిలో మమేకమైన పక్షులకు జంతువులే ఈ విషయాన్ని ఎక్కువగా పసిగడతాయి. మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయి అనడానికి నిదర్శనంగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి వెలుగులో వచ్చింది. ఇండోనేషియాలో పరిశోధకులు తొలిసారిగా ఈ విషయాన్ని రికార్డు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయిసుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని రాకుస్ అనే మగ కోతి (ఒరంగుటాన్) తనకు తనే వైద్యం చేసుకుంది. సుమత్రన్ ఒరంగుటాన్ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోని గునుంగ్ ల్యూజర్ నేషనల్ పార్క్లో ఈ దృశ్యాలను రికార్డుచేశారు. ఇండోనేషియాలోని నేషనల్ యూనివర్సిటీ, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ సంస్థలకు చెందిన పరిశోధకులు కొన్ని రోజులుగా ఈ తోక లేని కోతులపై అధ్యయనం చేస్తున్నారు.సైంటిఫిక్ రిపోర్ట్స్లోని ఒక అధ్యయనం ప్రకారం ఒక మగ కోతికి మరో కోతితో జరిగిన కొట్లాటలో ముఖానికి గాయమైంది. ఒక చెట్టు ఆకులోని ఔషధ గుణాలను గుర్తించింది రాకూస్. ఫైబ్రేరియా టింక్టోరియా" అనే శాస్త్రీయ నామంతో పిలిచే మొక్కల ఆకులతో వైద్యం చేసుకున్నది. ఈ ఆకులు నమిలి, వాటి పసరును దవడ గాయంపై రాసుకుంది. తర్వాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. అంతేకాదు గాయం మానేందుకు ఈ కోతి ఎక్కువ సేపు నిద్రపోయిందని కూడా పరిశోధకులు గుర్తించడం విశేషం.ఒక అడవి జంతువు చాలా శక్తివంతమైన ఔషధ మొక్కను నేరుగా గాయానికి పూయడాన్ని గమనించడం ఇదే తొలిసారి అని జర్మనీలోని కాన్స్టాంజ్లోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్, జీవశాస్త్రవేత్, ఈ స్టడీ సహ రచయిత ఇసాబెల్లె లామర్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయని, మలేరియా, విరేచనాలు, డయాబెటిస్ చికిత్సలో ఈ మొక్కలు వాడుతారని పేర్కొన్నారు. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు గురించి విని ఉంటారు. అలాగే అత్యంత వ్యాపార దిగ్గజాలుగా పేరుగాంచిన వారి గురించి కూడా విని ఉంటారు. కానీ ఇదేంటి అత్యంత ధనిక ఖైదీ. ఖైదీల్లో ధనికులు ఉంటారా..! అని విస్తుపోకండి. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి తెలిస్తే తప్పక ఔనని అంటారు. అతడెవరంటే..క్రిప్టోకరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్పెంగ్ జావోకి యూఎస్ కోర్టు గత మంగళవారమే నాలుగు నెలల శిక్ష విధించింది. దీంతో జావో ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఖైదీగా నిలిచినట్లు యూఎస్ టెలిగ్రాఫ్ పేర్కొంది. ఆయన గతేడాది యూఎస్ మనీలాండరింగ్కి సంబంధించిన నిరోధక ఆంక్షల చట్టాలను ఉల్లంఘింట్లు అంగీకరించడంతో సీటెల్ కోర్టు జావోకు ఈ శిక్షను విధించింది. నిజానికి జావోకు ఈ నేరంలో మూడేళ్ల జైలు శిక్ష విధించాలని న్యాయవాదులు నుంచి ఒత్తిడిచ్చినా..జడ్డి అతడి అతని దాతృత్వ రికార్డు, ప్రవర్తనను పరిణలోకి తీసుకుని నాలుగు నెలల జైలు శిక్షను మాత్రమే విధించారు. నాలుగు నెలల జైలు శిక్షఅనుభవిస్తున్న జావో తన బినాన్స్ సంస్థ ద్వారా దాదాపు మూడు వేల కోట్ల సంపదను కలిగి ఉన్నాడు. దీంతో అతడు అత్యంత సంపన్న ఖైదీలలో ఒకరిగా నిలిచాడు. 47 ఏళ్ల జావో యూఎస్ అధికారిక ఒప్పందంలో భాగంగా గతేడాది బినాన్స్ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. అయినప్పటికీ బినాన్స్లో ఆయన 90% వాటాను కలిగి ఉండటం విశేషం. పైగా మనీలాండరింగ్ ఆరోపణల పరిష్కారంలో భాగంగా ఫిబ్రవరిలో రూ. 35 వేల కోట్లు చెల్లించడానికి బినాన్స్ సంస్థ అంగీకరించింది.కాగా,2017లో ఈ బినాన్స్ సంస్థ ఏర్పాటయ్యింది. ఇది చాంగ్పెంగ్ జావోను ఒక్కసారిగా బిలియనీర్గా మార్చేసింది. ఈ సంస్థ క్రిప్టో ఎక్స్ఛేంజీలను నడుపుతూ.. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తోంది. ఎప్పుడైతే క్రిప్టో మార్కెట్ కుప్పకూలిపోయిందో అప్పటి నుంచి చట్టబద్దతను ఉల్లంఘించి..నష్టాల బాట పట్టింది. చెప్పాలంటే కుప్పకూలిని క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సామ్ బ్యాంక్మ్యాన్ ఫ్రైడ్ చేసి బిలయన్ డాలర్ల మోసానికి గానూ 25 ఏళ్ల జైలు శిక్ష విధించిన వారాల తర్వాత జావో నేరం వెలుగులోకి వచ్చింది. జావో అధిక రిస్క్తో కూడిన పెట్టుబడుల కోసం కస్టమర్ ఫండ్లలో బిలియన్ డాలర్లను స్వాహ చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. (మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో 60 ఏళ్ల మహిళ..!) -
ప్రపంచంలోనే అతిపొడవైన మహిళ కన్నుమూత
ప్రపంచంలోని అతిపొడవైన మహిళల్లో ఒకరిగా ఖ్యాతిగాంచిన బ్రెజిల్కు చెందిన మరియా ఫెలిసియానా దోస్ శాంటోస్ (77) కన్ను మూశారు. 'క్వీన్ ఆఫ్ హైట్'గా ఫెలిసియానా డాస్ శాంటోస్ అనారోగ్యంతో అరకాజులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతున్న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.ఆమెమరణంతో బ్రెజిల్ వాసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అభిమానులు, రాజకీయ నాయకులు, ఇతర అధికారులు, ఆమె మృతిపై సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా అరకాజు మేయర్ ఎడ్వాల్డో నోగ్వేరా రాజధాని నగరంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.యుక్త వయసులో ఏకంగా 7 అడుగుల 3.8 అంగుళాల ఎత్తు పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా ఏళ్లపాటు ఆమెను ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన మహిళగా నిలిచారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఆమె ఎత్తు కాస్త తగ్గుతూ వచ్చారు.గాయని, బాస్కెట్బాల్ క్రీడాకారిణి మారియా తన టీనేజీలో అసాధారణ రీతిలో ఎత్తు పెరిగింది. యుక్త వయసులో ఆమె దేశంలోని వివిధ నగరాల్లో జరిగే సర్కస్లలో పనిచేస్తూ వీక్షకులను అబ్బురపరిచేంది. ఆ తరువాత జాతీయంగా అంతర్జాతీయంగా పాపులర్ అయింది. 1960లో క్వీన్ ఆఫ్హైట్ బిరుదు గెలుచుకోవడంతో బ్రెజిల్ అంతటా ఆమె పేరు మార్మోగింది. అలాగే 2022 మేలో బ్రెజిల్లోని మ్యూజియం ప్రవేశద్వారం వద్ద మారియా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. కాగా ఆమె భర్త అష్యూయిర్స్ జోస్ డోస్ శాంటోస్. వీరికి ముగ్గురు పిల్లలు. మరియా తండ్రి, ఆంటోనియో టింటినో డా సిల్వా, 7 అడుగుల 8.7 అంగుళాలు, ఆమె తాత 7 అడుగుల 5.4 అంగుళాల ఎత్తు ఉండే వారట. -
అవును! అతను.. విమానాల్లో లోకం చుట్టిన వీరుడు..!
విమానాల్లో అత్యధిక దూరం ప్రయాణించిన ఈ పెద్దమనిషి పేరు టామ్ స్టూకర్. అమెరికాలోని న్యూజెర్సీవాసి. ప్రస్తుతం ఇతడి వయసు 69 ఏళ్లు. విమాన ప్రయాణాల మీద మక్కువతో 1990లో యునైటెడ్ ఎయిర్లైన్స్ నుంచి 2.90 లక్షల డాలర్లకు (రూ.2.41 కోట్లు) లైఫ్టైమ్ పాస్ తీసుకున్నాడు.ఇక అప్పటి నుంచి తోచినప్పుడల్లా విమానాల్లో దేశాదేశాలను చుట్టేయడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు ఇతగాడు విమానాల్లో ఏకంగా 20 మిలియన్ మైళ్లకు (3.21 కోట్ల కిలోమీటర్లు) పైగా ప్రయాణాలు చేశాడు. ప్రపంచంలోనే అత్యంత విరివిగా విమాన ప్రయాణాలు చేసే వ్యక్తిగా రికార్డులకెక్కాడు. లైఫ్టైమ్ పాస్ కోసం అప్పట్లో తాను పెద్దమొత్తమే చెల్లించినా, అలా చెల్లించడం వల్ల ఇప్పటి వరకు లెక్కిస్తే తనకు 2.44 మిలియన్ డాలర్లు (రూ.20.30 కోట్లు) మిగిలినట్లేనని టామ్ చెప్పడం విశేషం. అతి తక్కువ లగేజీతో తాను ప్రయాణాలు చేస్తానని, చేసే ప్రయాణాల కంటే, ప్రయాణాల్లో మనుషులను కలుసుకోవడం తనకు చాలా ఇష్టమని అతడు చెబుతాడు.ఇవి చదవండి: అరాచక పరిస్థితుల్లో జరిగిన ఓ వింత.. నేటికీ మిస్టరీయే! -
ప్రపంచంలో తొలి 20 అత్యుత్తమ విమానాశ్రయాలు ఇవే..(ఫొటోలు)
-
పేలిన అగ్ని పర్వతం.. సునామీ ముప్పు?
ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం పేలడంతో స్థానికుల్లో భయాందోళనలు చెలరేగుతున్నాయి. ఈ పేలుడు దరిమిలా సునామీ ముప్పు పొంచివుంది. పేలుడు కారణంగా అగ్నిపర్వతంలోని కొంత భాగం సముద్రంలో పడిపోనున్నదని, ఫలితంగా 1871లో సంభవించిన మాదిరిగా భారీ సునామీ వచ్చే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండోనేషియాలోని రుయాంగ్ అగ్నిపర్వతం గత కొన్ని రోజులుగా యాక్టివ్గా ఉంది. బూడిద, పొగను వెదజల్లుతోంది. అగ్నిపర్వతంలోని కొంత భాగం బలహీనంగా మారిందని, అది ఎప్పుడైనా సముద్రంలో పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది జరిగితే, ఇది భారీ సునామీ సంభవిస్తుందని, ఇది సమీపంలోని తీర ప్రాంతాలలో భారీ విధ్వంసం కలిగించవచ్చని స్థానిక అధికారులు అంటున్నారు. ALERT: Indonesia volcano eruption sparks tsunami fears, alert level raised to highest — Officials worry that part of the volcano could collapse into the sea and cause a tsunami, as happened in 1871. pic.twitter.com/idTYAjuImo — Insider Paper (@TheInsiderPaper) April 17, 2024 సునామీ ముప్పు నేపధ్యంలో తీర ప్రాంతాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. అలాగే బీచ్లను సందర్శించడం, సముద్రంలోకి వెళ్లడం లాంటి పనులు చేయకూడదని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థలు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. -
ప్రపంచంలోనే తొలి ఏఐ అందాల పోటీలు!
ఎన్నో రకాల అందాల పోటీలను చూసి ఉంటారు. కానీ ఇలాంటి సాంకేతికతో కూడిన అందాల పోటీలను చూసి ఉండరు. ప్రపచంలోనే తొలిసారిగా ఏఐ అందాల పోటీలు వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్(WAICA) పిలుపునిచ్చింది. ఈ పోటీలో కృత్రిమ మేధస్సుతో రూపొందించిన మోడల్స్ పాల్గొంటారు. కోటి రూపాయల విలువ చేసే ప్రైజ్మనీలతో భారీ ఎత్తున ఈ ఏఐ అందాల పోటీలను నిర్వహిస్తోంది WAICA. ఈ ఐఏ మోడల్స్ని ప్రేక్షకుల్లో వాటికున్న ఆదరణ, ఫ్లాట్ఫామ్లో ఎక్కువగా వినియోగించగలిగేది, సోషల్ మీడియా క్రేజ్ వంటి వాటిని ఆధారంగా చేసుకుని న్యాయనిర్ణేతలు విజేతను ప్రకటిస్తారు. తొలిసారిగా కంప్యూటర్ సాంకేతికత సృష్టించిన మనుషుల అందాల పోటీ అనేది ఫ్యాషన్ వైవిధ్యానికి ఓ నిదర్శనం. వరల్డ్ AI క్రియేటర్ అవార్డ్స్ వర్చువల్ మోడల్స్ని సబ్స్క్రిప్షన్-ఆధారిత ప్లాట్ఫారమ్ అయిన ఫ్యాన్వ్యూని(Fanvue) కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ సదరు వర్చువల్ మోడల్ ఫ్యాన్ వ్యూ, పీఆర్ మద్దతులను కూడా బేస్ చేసుకుని విజేతను ప్రకటించడం జరుగుతుంది. అలాగే రన్నరప్, మూడో స్థానంలో ఉన్న విజేతలకు కూడా నగదు బహుమతులు అందచేయడం జరుగుతుందని వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్ పేర్కొంది. ఈ పోటీలకు ఎంట్రీలు గత ఆదివారం(ఏప్రిల్ 14) నుంచే ప్రారంభమయ్యాయి. మే 10న విజేతలను ప్రకటిస్తారు. ఇక ఈ అందాల పోటీ ఈ నెలఖారులోపు జరగనుంది. ఇక ఈ పోటీలు నలుగురు సభ్యుల ఫ్యానెల్ సమక్లంలో జరుగుతుంది. ఆ ఫ్యానెల్లో ఇద్దరు ఏఐ ఇన్ఫ్లయోన్సర్ జడ్డిలు..ఒకరేమో మూడు లక్షల ఫ్యాన్ఫాలోయింగ్ కలిగిన స్పెయిన్కు చెందిన ఐతానా లోపెజ్, మరోకరు రెండు లక్షలకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎమిలీ పెల్లెగ్రిని జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఇక వారిలో మిగిలిన ఇద్దరు వ్యక్తులు..పీఆర్ సలహదారు, వ్యవస్థాపకుడు ఆండ్రూ బ్లాచ్, మరొకరు అందాల పోటీ చరిత్రకారుడు, బ్యూటీ క్వీన్ స్కాండల్స్ పుస్తక రచయిత అయిన సాలీ-ఆన్ ఫాసెట్ విజేతలను ప్రకటిస్తారు. ఇది ఏఐ సృష్టికర్తలలో దాగున్న ప్రతిభ సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు జరుగుతున్న అందాల పోటీ అని ఫ్యానల్ వ్యక్తులు చెబుతున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా 100 శాతం ఏఐ జనరేటేడ్ మోడల్స్నే క్రియేట్ చేయాలి. అందుకోసం ఎలాంటి టూల్స్ ఉపయోగిస్తారనేందుకు ఎలాంటి పరిమితులు లేవు. ఓన్లీ ఏఐ జెనరేటర్ క్రియేషన్స్ని స్వాగతిస్తుంది. అది డీప్ ఏఐ, లేదా వ్యకగత టూల్స్ వంటివి ఏదైనా కావొచ్చు. ఈ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నవారు దాదాపు రూ. 4 లక్షలపైనే నగదు బహుమతి అందజేస్తారు నిర్వాహకులు. ( చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన 'కర్రీ' ఏంటో తెలుసా!
పురాతన తవ్వకాల్లో శాస్త్రవేత్తలు వెలికి తీసిన పనిముట్లు, ఆయుధాలు, విలువైన వస్తువుల గురించి కథలు కథలుగా విన్నాం. అలాగే వేటితో వంటలు చేసుకునేవారు, వారు ఉపయోగించిన వంట సామాగ్రి గురించి విన్నాం. కానీ పురాతన కాలంలో ఎలాంటి కూరలు వండుకునేవారు, ఏం తినేవారు తెలియదు. వాటి గురించి చరిత్రకారులు రాసిన దాఖాలాలు కూడా లేవు. అయితే తాజాగా ఫర్మానాలో జరిపిన తవ్వకాల్లో నాలుగువేల ఏళ్ల నాటి పురాతన వంటకం వెలుగులోకి వచ్చింది. మన పూర్వీకులు అప్పట్లోనే అలా వండుకుని తినేవారా అని కంగుతిన్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ అదేం కర్రీ?.. ఏ దేశపు వంటకం అంటే.. మన పూర్వీకుల తరుచుగా ఏం వంటకాలు వండుకుని తినేవారు అనే దిశగా సాగిన తవ్వకాల్లో కొంత వరకు పురొగతి సాధించారు శాస్త్రవేత్తలు. ప్రతి వంటకం తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి వచ్చిన వంటకాలే. అయితే ఆ కాలంలో కుండలు, దంతాల అవశేషాల సామాగ్రితో చేసుకునేవారు. ఇక్కడ శాస్త్రవేతలు హరప్పా నగరమైన రాఖీగర్హికి ఆగ్నేయంగా ఉన్న ఫర్మానాలో పూర్వీకుల వంటకాలు గురించి చేసిన అన్వేషణలో నాలుగు వేల ఏళ్ల నాటి పురాతన వంటకాన్ని గుర్తించారు వారు తవ్వకాల్లో ఒక కుండలో పసుపు, అల్లం, వెల్లుల్లి, వంకాయలతో చేసి అవశేషాలను గుర్తించారు. ఈ మిశ్రమం ఆధునికులకు బాగా తెలిసిన రెసిపీనే. ముఖ్యంగా ఇది భారతదేశ వంటకం. దీంతో ఈ కూర ప్రస్తుతం ఇప్పటి వరకు నమోదయ్యిన పురాతన కూరల్లో ఒకటిగా నిలిచింది. మన పూర్వీకులు, అరటి పండ్లు, మామిడి వంటివి తినేవారని, పొట్లకాయ, ఖర్జురాలు ఎక్కువగా ఉపయోగించినట్లు తవ్వకాల్లో గుర్తించారు గానీ కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే తాజాగా గుర్తించిన పురాతన కూరలో వాడిన అల్లం పసుపు హరప్పా నాగరికతకు సంబంధించిన తవ్వకాల్లోనే గుర్తించడం జరిగింది. అంతేగాదు ఈ సుగంధ ద్రవ్యాలే 2023లో వియత్నాంలో 2 వేల ఏళ్ల నాటి ఇసుకరాయి స్లాబ్పై కనిపించి కూర అవశేషాల్లో కూడా గుర్తించారు శాస్త్రవేత్తలు. అక్కడ పరిశోధకులు మైక్రోస్కోపిక్ ద్వారా స్టార్చ్ ధాన్యాలను పరిశీలించారు. విశ్లేషణలో పసుపు, అల్లం, వంటి విభిన్న సుగంధద్రవ్యాల మూలాలను గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే ఆసియా వంటకాల మూలాలు చరిత్రలో స్థిరంగా ఉన్నాయని తెలుస్తోందన్నారు శాస్తవేత్తలు. ఇక పురాతన వంటకాన్ని ఎలా చేస్తారో చూద్దామా..! మన భారతీయలు ఈజీగా చేసుకునే వంకాయ వేపుడే!.. నాటి పుర్వీకులు చేసుకునేవారు. ఈ ఆధారాలను బట్టి చూస్తే.. వంకాయ వేపుడు పురాతన వంటకంగా తెలుస్తోంది. ఈ రెసిపీని నాటి పూర్వీకులు ఎలా చేసుకున్నారనే దాని గురించి ప్రముఖ చెఫ్ కునాల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా సవివరంగా వెల్లడించారు. కావాల్సిన పదార్థాలు. . రెండు పెద్ద సైజు వంకాయలు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పసుపు ఉప్పు తగినంత తయారీ విధానం: ఓ కడాయిలో నూనె వేసుకుని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కరివేపాకు వేయించి ఆ తర్వాత తరిగి పెట్టుకున్నవంకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసుకుని మగ్గనివ్వాలి. ఓ ఐదు నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచి తర్వాత దించేయాలి. అంతే వంకాయ వేపుడు రెడీ..! View this post on Instagram A post shared by Kunal Kapur (@chefkunal) (చదవండి: 'మోదీ మామిడి': ఈ పండు ప్రత్యేకత ఏంటో తెలుసా..!) -
అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం ఏది?
కొద్ది రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో పలువురు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్లాన్ చేసుకుంటున్నారు. అందమైన పర్యాటక ప్రదేశాలకు వెళ్లి, అక్కడి ప్రకృతిని చూడాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం కూడా ఉంది. అయితే అది ఎక్కడ ఉంది? ఎందుకు ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉంది? అంటార్కిటికా ఖండం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతంగా పేరొందింది. దక్షిణ ధ్రువం వద్ద ఉన్న ఈ ఖండంలో బలమైన మంచు గాలులు వీస్తాయి. అంటార్కిటికాలో దాదాపు రెండు కిలోమీటర్ల మందపాటి మంచు పలక విస్తరించి ఉంది. రక్తాన్ని గడ్డకట్టే చలి వాతావరణం ఉన్నప్పటికీ, ఈ ఖండంలో సందర్శించదగిన అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉండే ఏకైక ప్రదేశం అంటార్కిటికా. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం అనే రెండు సీజన్లు మాత్రమే ఉంటాయి. అంటార్కిటికా ఖండంలో వేసవి కాలంలో ఆరు నెలల పాటు పగటి వెలుతురు ఉంటుంది. అయితే చలికాలంలో ఆరు నెలల పాటు ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తుంది. అంటార్కిటికా ఖండంలోని ఎత్తైన శిఖరం పేరు విన్సన్ రేంజ్. దాదాపు 4,892 మీటర్ల ఎత్తు ఉన్న ఈ శిఖరాన్ని విన్సన్ మాసిఫ్ అని కూడా పిలుస్తారు. పద్మశ్రీ డాక్టర్ అరుణిమ సిన్హా ఈ పర్వత శిఖరంపై భారత జెండాను ఎగురవేశారు. ఈ శిఖరం పర్వతారోహకులను అమితంగా ఆకర్షిస్తుంది. అంటార్కిటికాలో సౌత్ షెట్లాండ్ ద్వీపం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. సౌత్ షెట్లాండ్ దీవుల్లోని పరిశోధనా కేంద్రాలకు వివిధ దేశాల నుంచి పరిశోధకులు వస్తుంటారు. ఈ ఖండంలో డ్రేక్ పాసేజ్, ఫాక్లాండ్ దీవులు, దక్షిణ జార్జియా వంటి అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రయాణించడాన్ని పర్యాటకులు సాహసంగా పరిగణిస్తారు. అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడానికి వేసవి కాలం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. -
ప్రపంచంలోనే ఖరీదైన గడియారాలు.. ధరెంతో తెలుసా..? (ఫొటోలు)
-
ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు!
ఓ వ్యక్తి వందేళ్లు జీవించడమే ఓ కల అన్నట్లుంది ఇప్పటి పరిస్థితి. బతకడం మాటా అటుంచి అసలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా బతుకు ఈడ్చగలమా అన్నదే సందేహం. ఎందుకంటే ఇప్పుడున్న కాలుష్యం, కల్తీల మధ్య క్షణ క్షణం మృత్యు గండంలా ఉంది జీవితం. కానీ ఈ వృద్ధుడు ఆయుష్షులో సెంచరీని దాటేశాడు. ఎవరా వ్యక్తి..? అతడి ఆరోగ్యం రహస్యం ఏంటో చూద్దామా..! బ్రిటన్కి చెందిన టిన్నిస్వుడ్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు. అతడు ఉత్తర ఇంగ్లాండ్లో మెర్సీసైడ్లో 1912లో జన్మించాడు. అతని వయసు ప్రస్తుతం 111 ఏళ్ల 222 రోజులు. ఆయన పోస్టల్లో రిటైర్డ్ అకౌంటెంట్గా పనిచేసి రిటైర్డ్ అయ్యిన వ్యక్తి. దీర్ఘాఆయుష్షులో సెంచరీని దాటేశాడు. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కి టైటిల్ని గెలుచుకున్నాడు. ఈ రికార్డు ఇంతకుమునుపు వెనిజులా జువాన్ విసెంట్ పెరెజ్ మోరా మీద ఉంది. ఆమె 114 ఏళ్ల జీవించి సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తి గిన్నిస్ రికార్డు టైటిల్ని పొందింది. ఆమె తర్వాత ఈ టైటిల్ని టిన్నిస్వుడ్ గెలుచుకోవడం విశేషం. అయితే ఇంతలా సుదీర్ఘకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు మీరు ఏ డైట్ ఫాలో అయ్యేవారు, ఎలాంటి ఆహారం తీసుకుంటారని ప్రశ్నించగా..ఆయన చిరునవ్వు చిందిస్తూ తన డైట్కి సంబంధించిన సీక్రేట్ అంటూ ఏం లేదని, సాధారణంగానే తీసుకునే వాడినని చెప్పారు. తాను ప్రత్యేకమైన ఫుడ్ అంటూ ఏం తీసుకోలేదని అన్నారు. ఇప్పటికీ ప్రతి శుక్రవారం ఇష్టమైన చేపలు, చిప్స్ తింటానని అన్నారు. ఇంతలా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడమనేది కేవలం అదృష్టమని అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తుల గురించి జెరొంటాలజీ రీసెర్చ్ గ్రూప్ శోధించి మరీ ఇలా గిన్నిస్ టైటిల్ని అందిస్తోంది. అంతేగాదు ప్రపంచంలోనే ఎక్కువకాలం జీవించిన సూపర్ సెంటెనరియన్స్ జాబితాను లిస్ట్ చేస్తుంది. ఇందులో 116 ఏళ్ల 54 రోజుల వరకు జీవించిన జపాన్కు చెందిన జిరోమాన్ కిమురా అత్యంత వృద్ధుడు. కాగా, 117 సంవత్సరాల వయస్సు గల స్పెయిన్కు చెందిన మరియా బ్రన్యాస్ మోరేరా జీవించి ఉన్న అత్యంత వృద్ధ మహిళ ఈ జాబితాను చూస్తే కొంచెం మనిషి ఆయుష్షు మెరుగుపడుతుందనాలో, తగ్గుతుందనాలో.. తెయని పరిస్థితి నెలకొందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది నిరంతరం మారుతూ ఉంటోందని అన్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: సిక్సర్ల బ్యాటర్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితా (ఫొటోలు)
-
ప్రపంచంలోనే అత్యంత వృద్దుడి కన్నుమూత
కారకాస్ (వెనెజులా): ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నిస్ రికార్డుకెక్కిన వెనెజులాకు చెందిన 114 ఏళ్ల జువాన్ విసెంటీ పెరీజ్ మోరా మంగళవారం మరణించారు. ఆయనకు ఆరుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఏకంగా 41 మంది మనవలు, మనవరాళ్లు, 18 మంది మునిమనవలు, మనవరాళ్లున్నారు! ఆ తర్వాత తరంలోనూ ఇంకో 12 మంది వారసులుండటం విశేషం. జువాన్ 1909 మే 27న పుట్టారు. చనిపోయేదాకా పొలంలో పనిచేశారు. బాల్యం నుంచీ రోజూ పొలం పని, త్వరగా నిద్రపోవడం, రోజూ ఒక మద్యం తన దీర్ఘాయు రహస్యమనేవారు! -
Tana: మన ప్రాచీన భారతీయ సాహిత్యం.. ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహణలో – మన ప్రాచీన భారతీయ సాహిత్యం – ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ సదస్సు డాలస్, టెక్సాస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 66 వ సాహిత్య సమావేశం: మన ప్రాచీన భారతీయ సాహిత్యం – ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే కార్యక్రమం ఘనంగా, విజ్ఞానదాయకంగా జరిగింది. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - విజ్ఞానశాస్త్రంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న ప్రముఖులు పాల్గొంటున్న ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకం అంటూ, అతిథులందరినీ ఆహ్వానిస్తూ సభను ప్రారంభించారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. “ఎన్నో వేల సంవత్సారల క్రితమే ఖగోళశాస్త్రం, గణితశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, ఆయుర్వేదశాస్త్రం, వృక్షశాస్త్రం, శిల్పశాస్త్రం, శబ్దశాస్త్రం, కాలశాస్త్రం లాంటి అనేక శాస్త్రాలకు పుట్టినిల్లు అఖండ భారతదేశం. ఎంతోమంది వీరులకు, శూరులకు, శాస్త్రవేత్తలకు, పండితులకు నిలయమై, నలంద, తక్షశిలల లాంటి విశ్వవిద్యాలయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించి ఒక గొప్ప విజ్ఞానగనిగా విరాజిల్లిన ఘనచరిత్ర కల్గిన భారత మూలాలపై ఇంకా ఎంతో పరిశోధన జరుగవలసి ఉంది అన్నారు”. ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పూర్వ సంచాలకులు, చంద్రయాన్-3 కీలక శాస్త్రవేత్త అయిన డా. జోశ్యుల అచ్యుత కమలాకర్ తన ప్రసంగంలో ఇప్పటివరకు ఇస్రో సాగించిన ప్రయోగాలు, సాధించిన విజయాలు, గత సంవత్సరం ప్రపంచంలోనే మొదటిసారిగా చంద్రుని దక్షిణ ద్రువంపై దిగిన మొదటి దేశంగా భారత్ ఉండడం, చంద్రునిపై నీరు ఉన్నదని మొదటిసారిగా కనుగొన్న దేశం భారతదేశం కావడం, అతి తక్కువ వ్యయంతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్ష పరిశోధనలలో ప్రపంచంలోనే మొదటి 5 దేశాలలో ఒకటిగా భారతదేశం ఉండగల్గడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అన్నారు. 30 నిమిషాలకు పైగా సాగిన తన పవర్ పాయింట్ ప్రజంటేషన్లో ఇస్రో త్వరలో చేపట్టబోయే అనేక ప్రయోగాలతో సహా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుని అందర్నీ ఆకర్షించారు. విశిష్టఅతిథిగా హాజరైన ప్రఖ్యాత రచయిత, సైన్సు ప్రచారానికి విశేష కృషి చేస్తున్న ఆకాశవాణి పూర్వ ఉన్నతోద్యోగి డా. నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ – “మన ప్రాచీన భారతీయ వాంగ్మయ విషయాలను సరిగా అర్థం చేసుకోవడం, వాటిని సరైన అవగాహనతో ప్రపంచంలోని అనేక ఇతర భాషల్లోకి అనువదించ వలసిన ఆవశ్యకత, ముఖ్యంగా విజ్ఞానశాస్త్ర పరివ్యాప్తికి ప్రభుత్వాలు, సంస్థలు కృషి చేసి యువతరంలో చైతన్యం తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.” ప్రముఖ రచయిత, విశ్రాంత అధ్యాపకులు, అనేక సైన్స్ సదస్సులు, సైన్స్ ప్రసంగాలు చేసిన డా. ప్రతాప్ కౌటిల్య తన ప్రసంగంలో బాల్యంనుంచే విధ్యార్ధులలో సైన్స్ పట్ల ఆసక్తి కల్గేలా కొన్ని చిన్న చిన్న ప్రయోగాలతో అభిరుచి కల్పిస్తే, దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలు తయారవుతారన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును. -
ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుంది?
పుస్తకాలు చదవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుందంటారు. పుస్తకాలు ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతాయని కూడా చెబుతారు. పుస్తకాలు మనకు తెలియని ఎన్నో విషయాలను నేర్పుతాయి. అలాంటి పుస్తకాలకు నిలయం లైబ్రరీ. మరి ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుంది? పుస్తకాలు మనిషికి మంచి మిత్రుని లాంటివని పెద్దలు చెబుతుంటారు. ఒంటరితనాన్ని పోగొట్టే దివ్య ఔషధం పుస్తకమేనని కూడా అంటారు. నచ్చిన పుస్తకాలను చదివేందుకు పుస్తకప్రియులు లైబ్రరీకి వెళుతుంటారు. కొంతమంది లైబ్రరీలో గంటల తరబడి ఉండేందుకు ఇష్టపడతారు. మన దేశంలో లైబ్రరీలు చాలానే ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీ ఇంగ్లండ్ రాజధాని లండన్లో ఉంది. దీనిని బ్రిటిష్ లైబ్రరీ అని పిలుస్తారు. ఇక్కడ దాదాపు 20 కోట్ల పుస్తకాలు, ఇతర పత్రాలు ఉన్నాయి. ఈ లైబ్రరీ 1973, జూలై ఒకటిన నెలకొల్పారు. ఈ లైబ్రరీ గతంలో బ్రిటిష్ మ్యూజియంలో భాగంగా ఉండేది. ఈ లైబ్రరీకి వెళ్లి ఎవరైనా అక్కడి పుస్తకాలు చదువుకోవచ్చు. -
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన వృక్షాలివే!
చెట్లు మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వృక్షం ఏదో తెలుసా? అది ఎక్కడ ఉంది? ఈ జాబితాలో ఇంకేమి వృక్షాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైపెరియన్, కోస్ట్ రెడ్వుడ్ కాలిఫోర్నియాలోని రెడ్వుడ్ నేషనల్ పార్క్లో ఉన్న హైపెరియన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టు. దీని సగటు ఎత్తు 360 అడుగులు. ఈ చెట్టు 16 అడుగులు (4.94 మీటర్లు) కంటే అధిక వ్యాసాన్ని కలిగి ఉంటుంది. హైపెరియన్ రెడ్వుడ్కు 600 నుంచి 800 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని అంచనా. హైపెరియన్ కోస్ట్ రెడ్వుడ్లు 2,000 సంవత్సరాలకు పైగా భూమిపై ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 2006లో క్రిస్ అట్కిన్స్ , మైఖేల్ టేలర్ అనే ప్రకృతి శాస్త్రవేత్తలు హైపెరియన్ను కనుగొన్నారు. మేనరా, ఎల్లో మెరంటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉష్ణమండల వృక్షం మేనరా. ఇది మలేషియా బోర్నియోలోని సబాలోని డానుమ్ వ్యాలీ పరిరక్షణ ప్రాంతంలో ఉంది. దాని ఖచ్చితమైన ఎత్తుపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ఈ వృక్షం ఎత్తును 331 అడుగులు (100.8 మీటర్లు)అని గుర్తించారు. మేనరా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యాంజియోస్పెర్మ్ లేదా పుష్పించే మొక్కగా ప్రసిద్ధి చెందింది. సెంచూరియన్, మౌంటైన్ యాష్ సెంచూరియన్ అనేది 330 అడుగుల (100.5 మీటర్లు) ఎత్తులో 13 అడుగుల (4.05 మీటర్లు) ట్రంక్ వ్యాసంతో కూడి ఉంటుంది. ఆస్ట్రేలియాలోని టాస్మానియాలోని ఆర్వ్ లోయలో ఈ వృక్షాల కారణంగా చెలరేగిన టాస్మానియన్ బుష్ఫైర్ల వల్ల ఈ ద్వీప భూభాగంలో దాదాపు మూడు శాతం అంటే 494,210 ఎకరాలు (200,000 హెక్టార్లు) కాలిపోయింది. డోర్నర్ ఫిర్, కోస్ట్ డగ్లస్ ఫిర్ డోర్నర్ ఫిర్ను ఒరెగాన్ కోస్ట్ రేంజ్లోని బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్మెంట్ సంరక్షిస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన డగ్లస్ ఫిర్. భూమిపై ఉన్న అత్యంత ఎత్తయిన నాన్ రెడ్వుడ్ వృక్షం. 327 అడుగుల (99.7 మీటర్లు) ఎత్తుతో, 11.5 అడుగుల (3.5 మీటర్లు) వ్యాసంతో ఇది చూపరులను ఆకట్టుకుంటుంది. 1989లో ఈ భారీ వృక్షాన్ని కనుగొన్నారు. రావెన్స్ టవర్, సిట్కా స్ప్రూస్ రావెన్స్ టవర్ అనేది 317 అడుగుల (96.7 మీటర్లు)ఎత్తు కలిగివుంటుంది. సిట్కా స్ప్రూస్ 2001లో దీనిని కనుగొన్నారు. అతను హైపెరియన్, హీలియోస్, ఐకారస్ లాంటి ఇతర పొడవైన చెట్లను కూడా కనుగొన్నాడు. రావెన్స్ టవర్ ఉత్తర కాలిఫోర్నియాలోని ప్రైరీ క్రీక్ రెడ్వుడ్స్ స్టేట్ పార్క్లో ఉంది. జెయింట్ సీక్వోయా కాలిఫోర్నియాలోని జెయింట్ సీక్వోయాస్ పొడవైన వృక్షాలుగా పేరొందాయి. సీక్వోయా నేషనల్ ఫారెస్ట్లో 314-అడుగుల (95.7 మీటర్లు) ఎత్తుతో ఈ వృక్షం ఉంది. జెయింట్ సీక్వోయాస్ 25 అడుగుల (7.7 మీటర్లు) వ్యాసంతో దృఢమైన ట్రంక్ను కలిగి ఉంటుంది. వైట్ నైట్, మన్నా గమ్ టాస్మానియాలోని ఎవర్క్రీచ్ ఫారెస్ట్ రిజర్వ్లోని మన్నా గమ్ (యూకలిప్టస్ విమినాలిస్) వృక్షం కనిపిస్తుంది. దీని ఎత్తు 299 అడుగులు (91 మీటర్లు). ఈ చెట్లు కలిగిన ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. కాగా ఆఫ్రికాలో పొడవైన చెట్ల జాతులు లేవు అయితే మౌంట్ కిలిమంజారో నేషనల్ పార్క్లో 267 అడుగుల (81.5 మీటర్లు) ఎత్తు కలిగిన ఎంటాండ్రోఫ్రాగ్మా ఎక్సెల్సమ్ వృక్షం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. -
HOLI 2024: జీవితం వర్ణమయం
మానవ జీవితం రంగుల మయం. ఆ మాటకొస్తే అసలీ ప్రపంచమే రంగులమయం. ఎందుకంటే మన జీవనవిధానమే రకరకాల రంగులతో మమేకమై ఉంది. ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటే ప్రకృతిలో వేనవేల రంగులున్నాయి. ఈ ప్రకృతిలోని రంగులన్నీ జీవన తత్త్వాన్ని బోధిస్తాయి. ఆ రంగులతో చేసుకునే సంబరమే హోలీ. అందుకే హోలీని ఆలయాలలో కూడా ఒక వేడుకగా... ఉత్సవంగా నిర్వహిస్తారు. చిగురించే మోదుగులు. పూసే గురువిందలు. పరిమళించే మల్లెలు. మొగ్గలు తొడిగే మొల్లలు... రాలే పొగడ పుప్పొడి రేణువులు. చిందే గోగు తేనెలు. గుబాళించే గోరింట పూలు. ఎర్రని చివుళ్లతో మామిళ్లు... తెల్లని పూతాపుందెతో వేప చెట్లు... ఇందుకే కదా కవులు కీర్తించేది... వసంతాన్ని రుతువులకే రారాజని! మధుమాస వేళలో జరిగే వసంతోత్సవాన్ని భారతదేశమంతటా ఘనంగా జరుపుకుంటుంది. గతంలో రాజు, పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ రంగునీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకొని సంతోషించేవారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని హోళీ జరుపుకుంటారు. ఫాల్గుణ మాసం పూర్ణిమనాడు జరుపుకునే పండుగ కనుక ఫాల్గుణోత్సవమని... వసంత రుతువును స్వాగతించే వేడుక కాబట్టి వసంతోత్సవమని పిలుచుకుంటాం. హోళీ పర్వదినం వెనుక చాలా పురాణ కథలు ఉన్నాయి. యోగనిష్ఠలో ఉన్న పరమేశ్వరుడికి తపోభంగం కలిగించమని దేవతలందరూ మన్మథుడిని కోరడంతో ఆయన శివుడి మీదకు తన పూలబాణాలను ప్రయోగిస్తాడు. ఆ బాణాల తాకిడికి ధ్యాన భంగం అయిన శివుడు ఆగ్రహంతో తన మూడో కంటిని తెరచి మన్మథుడిని మసి చేస్తాడు. మదనుడి భార్య రతీదేవి తనకు పతి భిక్ష పెట్టవలసిందిగా ప్రాధేయపడటంతో బోళా శంకరుడు కరిగిపోయి మన్మథుడు.. రతీదేవికి మాత్రమే శరీరంతో కనిపించేలా వరమిచ్చాడు. అలా మళ్లీ మన్మథుడు రతీదేవికి దక్కాడు. ఈ పండుగ జరుపుకోవడానికి ఈ కథ ఓ కారణమైందని విశ్వసిస్తారు. అన్నింటికీ మించి హోలీ పండుగ పుట్టుకకు మరో కథను చెబుతారు. శ్రీకృష్ణుడు నల్లనివాడు, రాధ మేలిమి బంగారం. ఓరోజున వారిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వనవిహారం చేస్తుండగా రాధ చేతిపక్కన ఉన్న తన చేయి నల్లగా ఉండటం చూసి దిగులు పడ్డాడట కృష్ణుడు. కన్నయ్య విచారానికి కారణం తెలుసుకున్న యశోదమ్మ ‘నాయనా! రాధమ్మ అసలు రంగు తెలియకుండా నువ్వు ఆమె ఒంటినిండా రంగులు కలిపిన నీళ్లు పోయి’ అని సలహా ఇచ్చిందట. అమ్మ మాట మేరకు నల్లనయ్య రాధమీద రంగునీళ్లు పోశాడట. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన రాధ తను కూడా కృష్ణుని మీద రంగులు కలిపిన నీరు చిలకరిస్తూ కృష్ణునికి అందకుండా ఉద్యానవనం నుంచి బయటకు పరుగులు తీసిందట. రాధాకృష్ణులిద్దరూ ఇలా ఒకరి మీద ఒకరు రంగునీళ్లు పోసుకోవడం చూసిన పురజనులు... ఆనందోత్సాహాలతో రంగుల పండుగ చేసుకున్నారట. ఆనాడు ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ. నాటినుంచి ప్రతి ఫాల్గుణ పున్నమినాడు ప్రజలందరూ ఒకరినొకరు రంగులతో ముంచెత్తుకోవడం, పెద్దఎత్తున పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. పైన చెప్పుకున్న కథల నుంచి మనం గ్రహిం^è వలసినది ఏమిటంటే... మనందరమూ మనుషులమే కాబట్టి ఏదో ఒక లోపం ఉండితీరుతుంది. అలాంటి లోపాలను తీసుకు వచ్చే దుర్గుణాలను దూరం చేసుకోవడం అవసరం. అన్ని రంగులు ఉంటేనే.. ప్రకృతికి అందం. అందరిని కలుపుకుంటేనే మనసుకి అందం. అన్ని ఆలోచనలను పరిగణించి, చక్కని దారిన కలిసి నడిస్తేనే మనిషికి అందం. హోళీ రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేవి రంగులు కావు. అనురాగ ఆప్యాయతలు కలసిన పన్నీటి పరిమళ జల్లులు. హోలీ పండుగను వసంత రుతువు వస్తోందనడానికి సంకేతంగా భావిస్తారు. వసంతకాలం అంటే చెట్లు చిగిర్చి పూలు పూసే కాలం కదా! అంటే మనలో ఉన్న దుర్గుణాలనే ఎండుటాకులను రాల్చేసి, వాటి స్థానంలో ఉల్లాసం, ఉత్సాహం, ప్రేమ, అనే సుగుణాలతో కూడిన ఆకులను చిగురింప చేసుకోవాలి. మన్మథుడు అంటే మనస్సును మథించేవాడని అర్థం. మనిషిలో దాగి ఉన్న కామక్రోధలోభమోహమదమాత్సర్యాలనే ఆరు అంతః శత్రువులు మనస్సును మథిస్తాయి. వాటినే అరిషడ్వర్గాలు అంటారు. మనిషిని పతనం చేసే ఈ ఆరుగుణాలనూ అదుపులో ఉంచుకోవాలని చెప్పేందుకే పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేశాడు. రూపం కోల్పోయిన మన్మథుడు ఆనాటి నుంచి మనుషుల మనస్సులలో దాగి ఉండి అసలు పని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకునేందుకే, ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన రోజైన ఫాల్గుణ శుద్ధపూర్ణిమకు ముందురోజు, గ్రామాలలో కామదేవుని ప్రతిమను తయారుచేసి, ఊరేగింపుగా తీసుకెళతారు. యువకులంతా కలిసి కామదహనం చేస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. మన జీవితాలలో అనేక విధాలైన అలకలు, కినుకలు, అసంతృప్తులు, కోపాలు, తాపాలు, ఆవేశకావేశాలు, అలజడులు, అపశ్రుతులు, తడబాట్లు, ఎడబాట్లు ఉండొచ్చు. అందువల్ల ఈ హోళీ రోజు మనకు దగ్గరగా ఉన్న వారితోనే మాట, ఆట కాకుండా.... మనసుకు దగ్గర అయిన బంధు మిత్రులతో, మనవల్లో, వారి వల్లో ఏర్పడిన మానసిక దూరాన్ని తగ్గించుకుని, మనమే ముందుగా ఒక అడుగు వేసి అందరినీ దగ్గర చేసుకుని జీవితాలను వర్ణమయం... రాగ రంజితం చేసుకుందాం. హోలీ పర్వదినాన్ని అందరూ ఆప్యాయతతో కలిసే రంగుల రోజుగా మార్చుకుందాం. – డి.వి.ఆర్. భాస్కర్ -
పపువా న్యూగినియాలో భూకంపం.. 6.9 తీవ్రత నమోదు!
పపువా న్యూ గినియాలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దేశంలోని తూర్పు సెపిక్ ప్రావిన్స్లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం చోటుచేసుకుందని, కొంతమేరకు ప్రాణ నష్టం జరిగివుండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపింది. ఇక్కడ మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని యూఎస్జీఎస్ హెచ్చరించింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అంబుంటి ప్రాంతంలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీని కేంద్రం భూమి కింద 35 కిలోమీటర్ల లోతున ఉంది. దీనికి ముందు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్జెడ్) తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర పపువా న్యూ గినియాలోని మారుమూల ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 65 కిలోమీటర్ల లోతున ఉంది. ప్రస్తుతానికి సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. ఈ విపత్తులో ఎంత ప్రాణనష్టం జరిగిందనే సమాచారం ఇంకా అందలేదు. ఈ భూకంపం కారణంగా ఆస్ట్రేలియాలో సునామీ ప్రమాదం లేదని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. కాగా 6.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం పెను విపత్తుకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పపువా న్యూ గినియా ప్రాంతం ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉంది. ఇక్కడ భూకంపాలు సర్వసాధారణం. గత ఏడాది ఏప్రిల్లో ఇదే ప్రాంతంలో 7.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. అప్పుడు ఏడుగురు మృతి చెందారు. -
ఎలుగుబంట్లలో రకాలెన్ని? ఏ ఎలుగుబంటి ప్రమాదకరం?
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 23న ‘వరల్డ్ బేర్ డే’ అంటే ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలుగుబంట్ల జీవన విధానంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. ఎలుగుబంటి దినోత్సవాన్ని తొలిసారిగా 1992లో నిర్వహించారు. ఎలుగుబంట్ల దుస్థితిపై అవగాహన కల్పించేందుకు దీనిని ప్రారంభించారు. ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఎలుగుబంట్ల అభయారణ్యాన్ని సందర్శించడం, ఎలుగుబంటి పాత్ర ఉన్న సినిమా చూడటం, ఎలుగుబంటి వివరాలు కలిగిన పుస్తకాన్ని చదవడం లాంటి కార్యకలాపాలు చేస్తారు. ఎలుగుబంట్లు క్షీరద జాతికి చెందినవి. ఇవి మాంసాహార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎలుగుబంటి జాతులు ప్రధానంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా ఐరోపాలలో కనిపిస్తాయి. గోధుమ లేదా నలుపు రంగులో ఇవి ఉంటాయి. స్వచ్ఛమైన తెలుపు రంగులో పోలార్ ఎలుగుబంట్లు ఉంటాయి. ఎలుగుబంటి ఒంటరి జంతువు. ఎలుగుబంట్లు శీతాకాలంలో ఎక్కువసేపు నిద్రావస్థలో ఉంటాయి. ఈ కాలంలో అవి గుహలలో ఆశ్రయం పొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎనిమిది రకాల ఎలుగుబంట్లు ఉన్నాయి. అమెరికన్ బ్లాక్ బేర్ అమెరికన్ బ్లాక్ బేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపించే ఎలుగుబంటి జాతి. ఈ రకమైన ఎలుగుబంటి ఎక్కువగా ఉత్తర అమెరికాలోని అటవీ, పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది మధ్యస్థ పరిమాణంతో ఉంటుంది. దట్టమైన నల్లని బొచ్చుతో శారీరకంగా చాలా బలంగా ఉంటుంది. ఆసియన్ బ్లాక్ బేర్ దాని పేరులో సూచించినట్లుగా ఇది ఆసియాలో కనిపించే ఎలుగుబంటి జాతి. ఇది భారతదేశం, కొరియా, ఈశాన్య చైనా, రష్యా, జపాన్, తైవాన్లలో కనిపిస్తుంది. దీనిని మూన్ బేర్ అని కూడా అంటారు. స్పెక్టాక్లెడ్ బేర్ ఇది ఛాతీ పైభాగంలో లేత గోధుమరంగు రంగును కలిగి ఉంటుంది. దీని ఆకారంలో కళ్లకు అద్దాలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నందున దీనిని స్పెక్టాక్లెడ్ బేర్ అని అంటారు. దీనిని ఆండియన్ బేర్, పర్వత ప్రాంత ఎలుగుబంటి అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ట్రెమార్క్టోస్ ఆర్నాటస్. ఇది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. ఇవి చెట్లపై ఎక్కువ సమయం గడుపుతాయి. ఇవి ఒంటరిగా తిరుగుతాయి. జెయింట్ పాండా జెయింట్ పాండా ఎలుగుబంటికి కళ్ళ చుట్టూ నల్లటి గుర్తులు కనిపిస్తాయి. నలుపు, తెలుపు రంగుల మృదువైన బొచ్చుతో కూడిన శరీరంతో విభిన్నంగా కనిపిస్తాయి. జెయింట్ పాండా బేర్ దక్షిణ మధ్య చైనాలో కనిపిస్తుంది. జెయింట్ పాండాకు రెండు ఉపజాతులు ఉన్నాయి. సన్ బేర్ ఎలుగుబంటి జాతులలో సన్ బేర్ చిన్నగా కనిపిస్తుంది. ఇది ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల వర్షారణ్యాలలో ఉంటుంది. తేనెను విపరీతంగా ఇష్టపడే దీనిని హనీ బేర్ అని కూడా పిలుస్తారు. దాని మెడపై ప్రత్యేకమైన గుర్రపుడెక్క ఆకారంలో ఆరెంజ్ రంగు గుర్తు ఉంటుంది. సన్ ఎలుగుబంటికి రెండు ఉపజాతులు ఉన్నాయి. ఇవి అన్ని రకాల ఎలుగుబంట్లలో అత్యంత ప్రమాదకరమైనవని చెబుతారు. స్లాత్ బేర్ స్లాత్ బేర్ శాస్త్రీయ నామం మెలుర్సస్ ఉర్సినస్. ఇది ప్రధానంగా భారతదేశం, నేపాల్, శ్రీలంకలో కనిపిస్తుంది. దీని పొడవాటి దిగువ పెదవి కారణంగా దీనిని లాబియేట్ బేర్ అని కూడా అంటారు. ఈ రకమైన ఎలుగుబంట్ల చెవులు పొడవాటి జుట్టును కలిగి ఉంటాయి. ఈ ఎలుగుబంట్లు జంటగా తిరుగుతాయి. బ్రౌన్ బేర్ బ్రౌన్ బేర్ భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీనిని గ్రిజ్లీ బేర్ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ ఆర్క్టోస్. ఉత్తర యురేషియా, ఉత్తర అమెరికాలో ఇవి కనిపిస్తాయి. బ్రౌన్ బేర్ ఉపజాతులు అనేకం ఉన్నాయి. వీటి మెడ వెనుక భాగంలో పొడవైన మందపాటి బొచ్చు ఉంటుంది. బ్రౌన్ బేర్ అనేక యూరోపియన్ దేశాలకు జాతీయ జంతువు. పోలార్ బేర్ పోలార్ బేర్ అనేది భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ మారిటిమస్. ఇది ప్రధానంగా ఆర్కిటిక్ సర్కిల్ చుట్టూ కనిపిస్తుంది. దీనికి తెల్లటి బొచ్చు కింద నల్లని చర్మం ఉంటుంది. దీనికి రెండు ఉపజాతులు. అవి అమెరికన్ పోలార్ బేర్, సైబీరియన్ పోలార్ బేర్. సముద్రపు మంచు ఘనీభవించిన శీతాకాలంలో ఈ ధృవపు ఎలుగుబంట్లు మరింత చురుకుగా ఉంటాయి. ప్రాణాలు తీస్తున్న ఎలుగుబంట్లు గత రెండు దశాబ్దాలో స్లాత్ ఎలుగుబంట్లు వేలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఇవి మన దేశంలో వందల మందిని చంపాయి. భారత ప్రభుత్వం అధికారికంగా ఎలుగుబంట్ల దాడులను లెక్కించనప్పటికీ, స్లాత్ ఎలుగుబంటి మన దేశంలోని అత్యంత ప్రాణాంతక జంతువులలో ఒకటని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇతర రకాల ఎలుగుబంటి కంటే ఈ స్లాత్ ఎలుగుబంటి మనుషులపై అధికంగా దాడులు చేస్తోంది. మరోవైపు మనదేశంలో ఈ రకపు ఎలుగుబంట్ల సంఖ్య పెరుగుతున్న కారణంగా అవి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలోని అడవులలో కేవలం 10 శాతం మాత్రమే ఎలుగుబంట్లకు అనువైనవిగా ఉన్నాయి. ఎవరైనా ఈ అడవుల్లోకి ప్రవేశించినప్పుడు లేదా అవి (ఎలుగుబంట్లు) ఆహారం, నీటి కోసం మానవ నివాసాలలోకి ప్రవేశించినప్పుడు అవి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఆగ్రాలో ఎలుగుబంట్ల రక్షిత కేంద్రం యూపీలోని ఆగ్రాలో ప్రపంచంలోనే అతిపెద్ద రక్షిత బేర్ సెంటర్ ఉంది. ఇక్కడ 100 ఎలుగుబంట్లు ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వీటి సంఖ్య 500కు పైగానే ఉండేది. వైల్డ్లైఫ్ ఎస్ఏఓస్కు చెందినప్రత్యేక బృందం ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్లో ఎలుగుబంట్లను సంరక్షిస్తోంది. తాజ్ సిటీలోని సుర్ సరోవర్ ప్రాంతంలో ఈ బేర్ కన్జర్వేషన్ సెంటర్ ఉంది. 1995లో స్థాపితమైన వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్.. ఎలుగుబంట్లతో కొందరు ఫీట్స్ చేయించడాన్ని అరికట్టేందుకు ఉద్యమించింది. యూపీలోని ‘కలందర్’ తెగ ప్రజలు ఎలుగుబంటి పిల్లలను వేటాడి, వాటి చేత గారడీ చేయించేవారు. ఈ వ్యవహారాలను వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్ అరికట్టింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం జంతువులను హింసించడం చట్టవిరుద్ధం. వైల్డ్లైఫ్ సంస్థ ఇప్పటివరకూ 628 ఎలుగుబంట్లను రక్షించింది. ఈ సంస్థ నాలుగు ఎలుగుబంట్ల పునరావాస కేంద్రాలను నిర్వహిస్తోంది. వీటిలో ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ ప్రముఖమైనది. ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ సహ వ్యవస్థాపకుడు కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎలుగుబంట్లకు తాము ఉదయం వేళ పండ్లు, సాయంత్రం గంజి అందిస్తామన్నారు. వాటికి పలువిధాలుగా ఉపయోగపడేలా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశామన్నారు. -
కాలుష్య రాజధానిగా ఢిల్లీ
న్యూఢిల్లీ: ‘అత్యంత కాలుష్య దేశ రాజధాని’ అప్రతిష్ట కిరీటాన్ని ఢిల్లీ మరోసారి తన నెత్తిన పెట్టుకుంది. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూఎయిర్ సంస్థ ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక–2023లో పలు అంశాలను ప్రస్తావించింది. నివేదికలో వెల్లడైన వివరాల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో నిండిన మెట్రోపాలిటన్ ప్రాంతంగా బిహార్లోని బెగుసరాయ్ నిలిచింది. ఘనపు మీటర్కు 54.4 మైక్రోగ్రామ్ల చొప్పున వార్షిక సూక్ష్మధూళికణాల(పీఎం 2.5) గాఢత ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 79.9 మైక్రోగ్రామ్లతో బంగ్లాదేశ్ తొలిస్థానంలో, 73.7 మైక్రోగ్రామ్లతో పాకిస్థాన్ రెండోస్తానంలో నిలిచింది. గత ఏడాది ఘనపు మీటర్కు కేవలం 53.4 మైక్రోగ్రామ్ల వార్షిక సూక్ష్మధూళి కణాల(పీఎం 2.5)గాఢతతో భారత్ ఎనిమిదో స్థానంలో ఉండగా ఇటీవలికాలంలో దేశంలో కాలుష్యం విపరీతంగా కమ్ముకుని భారత స్థానం దారుణంగా మూడో స్థానానికి ఎగబాకడం ఆందోళనకరం. ఇక బిహార్లోని బెగుసరాయ్ గత ఏడాది కాలుష్యప్రాంతాల జాబితాలోనే లేదు. కానీ ఈ ఏడాది ఘనపు మీటర్కు 118.9 మైక్రోగ్రామ్ల పీఎం2.5 గాఢతతో ప్రపంచంలోనే అతి కాలుష్య మెట్రోపాలిటన్ పట్టణంగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఆ తర్వాతి స్థానాలో గువాహటి, ఢిల్లీ, పంజాబ్లోని ముల్లాన్పూర్ నిలిచాయి. నాలుగుసార్లు టాప్ ర్యాంక్ ఢిల్లీ పీఎం2.5 గాఢత గత ఏడాది 89.1 మైక్రోగ్రాములు ఉంటే ఈసారి మరికాస్త పెరిగి 92.7 మైక్రోగ్రాములకు చేరుకుంది. దీంతో విపరీతమై కాలుష్యం కారణంగా 2018 ఏడాది నుంచి చూస్తే నాలుగుసార్లు మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ కిరీటాన్ని ఢిల్లీకే కట్టబెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక ఘనపు మీటర్కు 5 మైక్రోగ్రాములకు మించి సూక్ష్మధూళి కణాలు ఉండకూడదు. కానీ భారత్లోని 136 కోట్ల ప్రజలు అధిక వాయుకాలుష్యం బారిన పడ్డారని తాజా నివేదిక ఘోషిస్తోంది. దేశ జనాభాలో 96 శాతం మంది అంటే 133 కోట్ల మంది డబ్ల్యూహెచ్వో పరిమితికి ఏడు రెట్లు మించి కాలుష్యమయ వాతావరణంలో జీవిస్తున్నారు. భారత్లోని 66 శాతం నగరాలు సగటున ఘనపు మీటర్కు 35 మైక్రోగ్రామ్ల ధూళికణాలున్న వాయుకాలుష్యం బారిన పడ్డాయి. విభిన్న మార్గాల్లో, విస్తృతస్థాయి డేటా ప్రపంచవ్యాప్తంగా 134 దేశాల్లో ఏర్పాటుచేసిన 30,000 వాయునాణ్యతా ప్రమాణాల స్టేషన్లు, సెన్సార్లు సేకరించిన డేటాను క్రోడీకరించి ఈ నివేదికను తయారుచేసినట్లు ఐక్యూఎయిర్ తెలిపింది. అధ్యయన సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వేతర లాభాపేక్షలేని సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, పౌర శాస్త్రవేత్తల నుంచి తీసుకున్న డేటాను ఈ నివేదిక కోసం వినియోగించినట్లు సంస్థ పేర్కొంది. ఆసియా ‘100’లో 83 భారత్లోనే ప్రపంచవ్యాప్తంగా కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్గా భారత్ పేరుమోస్తోంది. ఆసియాలో అత్యంత కాలుష్యమయ 100 నగరాల జాబితా ప్రకటించగా అందులో 83 నగరాలు భారత్లో ఉండటం దారుణ పరిస్థితికి దర్పణం పడుతోంది. కొన్ని నగరాల్లో కాలుష్యం డబ్ల్యూహెచ్వో పరిమితిని పది రెట్లు దాటేయడం గమ నార్హం. కాలుష్యానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 7,800 నగరాలను పరిశీలిస్తే అందులో డబ్ల్యూహెచ్వో పరిమితికి లోబడి కేవలం 9 శాతం నగరాలు ఉండటం చూస్తే పరిస్థితి చేయిదాటిపోయిందని అర్ధమవుతోంది. ‘ ఫిన్లాండ్, ఎస్తోనియా, ప్యూర్టోరీకో, ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్, బెర్ముడా, గ్రెనెడా, ఐస్ల్యాండ్, మారిషస్, ప్రెంచ్ పాలినేసియా దేశాల్లో మాత్రం వాయు నాణ్యత బాగుంది. -
అత్యంత లగ్జరీయస్ నౌక..ప్రయాణించాలంటే కోట్లు వెచ్చించాల్సిందే!
ఇలాంటి నౌకను ఇప్పటి వరకు చూసి ఉండరు. దీన్ని ఏకంగా 24 కేరెట్ల బంగారంతో తయారు చేశారు. ప్రయాణించాలంటే మాత్రం కోట్లు వెచ్చించాల్సి ఉంటుందట. దీన్ని ఎవరూ తయారు చేశారు? ఎక్కడుందంటే.. దూరం నుంచి చూడగానే బంగారు ధగధగలతో మిరుమిట్లు గొలిపే ఈ నౌకకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బంగారునౌక. నౌక వెలుపలి వైపు పూర్తిగా 24 కేరెట్ల బంగారు రేకుతో తాపడం చేశారు. నౌక లోపల కూడా గదుల్లోని ఫర్నిచర్ హ్యాండిల్స్, నాబ్స్, షాండ్లియర్స్, గ్లాస్ ఫ్రేమ్స్ వంటివాటిని కూడా పూర్తిగా బంగారు తాపడంతో తయారు చేశారు. దీని యజమాని ఆస్ట్రేలియన్ కంపెనీ ఏకే రాయల్టీ అధినేత ఆరన్ ఫిడ్లర్. ఇందులో సిబ్బందితో పాటు మరో పన్నెండుమంది అతిథులు విలాసవంతంగా ప్రయాణించడానికి వీలు ఉంటుంది. అతిథుల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన డైవింగ్ స్కూటర్లు, జెట్ స్కీ బోట్లు వంటివి కూడా పూర్తిగా బంగారు తాపడం చేసినవే కావడం విశేషం. ఇందులో నాలుగు లగ్జరీ సూట్లు, ప్రత్యేక డైనింగ్ రూమ్లు, బాంకెట్ హాల్, స్విమింగ్ పూల్, బాక్సింగ్ పరికరాలతో కూడిన అధునాతన జిమ్, సినిమా థియేటర్, డీజే బూత్, పబ్ వంటి విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఏకంగా 136 అడుగుల పొడవు ఉండే ఈ నౌకను ఎటు నుంచి చూసినా కళ్లు చెదిరేలా బంగారు ధగధగలే కనిపిస్తాయి. ఏటా వేసవిలోను, శీతకాలంలోను దీనిని ప్రయాణికుల విహారానికి అద్దెకు ఇస్తున్నారు. ఇందులో ప్రయాణించాలంటే వారం రోజులకు లక్ష పౌండ్లు (రూ.1.05 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. -
ప్రంచంలోనే అత్యంత సంపన్న శునకం! ఆస్తుల జాబితా వింటే..
చాలామంది టైం బాగోకపోయినా, అనుకున్న పని జరగకపోయినా ఛీ.. కుక్క బతుకు అని అంటుంటారు. కానీ ఈ కుక్క గురించి విన్నాక మీ అభిప్రాయం మార్చుకుంటాంటారు. ఆ కుక్కలా లైఫ్ ఉంటే బాగుండును అనుకుంటారు. దాని ఆస్తుల వివరాలు, బ్యాంకు బాలెన్స్లు వింటే షాకవ్వుతారు. దానికున్న సెక్యూరిటీ, బతుకుతున్న రేంజ్ వింటే వామ్మో అంటారు. ఇప్పుడూ చెప్పబోయే ఈ కుక్క ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్కగా గుర్తింపు పొందింది. దీని పేరు గున్థర్ VI. ఇది జర్మన్ షెపర్డ్ కుక్క. ఇది సుమారు రూ. 500 కోట్ల విలువచేసే విలాసవంతమైన ఇంటిలో ఉంటుంది. అలాగే తిరిగేందుకు బీఎండబ్ల్యూ కార్లు, సరదాగా షికారు చేయడానికి ప్రైవేట్ షిప్ సౌకర్యం తదితరాలు ఉన్నాయి. దీనికి స్వంత ఫుట్బాల్ క్లబ్ ఉంది. ఆ కుక్క డబ్బును పర్యవేక్షించేది 66 ఏళ్ల ఇటాలియన్ వ్యవస్థాపకుడు మౌరిజియో మియాన్. కుక్కకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం, దాని బాగోగోలు చూసుకోవడం అతని బాధ్యత. అయితే ఈ కుక్కకు అంత డబ్బు ఎలా వచ్చిందంటే..? అ కుక్క తాత గున్థర్ III నుంచి ఈ సంపదను వారసత్వంగా పొందాడు. జర్మన్ కౌంటెస్ కార్లోట్టా లీబెన్స్టెయిన్ అనే ధనికుడు ఈ గున్థర్ IIIని ప్రేమగా పెంచుకునేవాడు. అయితే ఆ ధనికుడు కొడుకు విషాదకరంగా ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వారుసులెవరూ లేకుండా పోయారు. దీంతో లీబెన్స్టెయిన్ చనిపోయేంత వరకు ఆ కుక్కనే ప్రేమగా చూసుకునేవాడు. అతను వెళ్తూ వెళ్తూ..దాదాపు రూ. 600 కోట్ల ఆస్తిని ఆ కుక్క పేరు మీద రాసి వెళ్లిపోయాడు. అంతేగాదు ఆ డబ్బును, కుక్కను పర్యవేక్షించేలా ఇటాలియన్ ఫార్మటిస్ట్ మౌరిజియో మియాన్కి బాధ్యతలు కూడా అప్పగించాడు. అలా గుంథర్ ట్రస్ట్ ఏర్పడింది. నాడు ఆరు వందల కోట్లగా ఉన్న ఆస్తి కాస్త గున్థర్ VI టైంకి వచ్చేటప్పటికీ దాని విలువ ఏకంగా రూ. 3 వేల కోట్లకు చేరింది. యజమాని లిబెన్స్టెయిన్ వదలిపెట్టి వెళ్లిన సంపదతో విలాసవంతమైన ఇళ్లు, విల్లాలు, ఓ ప్రైవేట్ ఓడ కొనుగోలు మౌరిజియో మియాన్చేశాడు. అంతేగాదు ఈ కుక్క బిజినెస్ క్లాస్లోనే ప్రయాణిస్తుందట. అలాగే ఆ కుక్కుబాగోగులు చూసుకునేందుకు సిబ్బంది, బయటకు వెళ్లేటప్పుడూ చుట్టూ గట్టి సెక్యూరిటీ ఉండటం విశేషం. అంతేగాదు ఈ గున్థర్ VI తర్వాత ఈ ఆస్తి అంతా దాని పిల్లలకు వెళ్తుంది. ఇలా ఆ కోట్ల ఆస్తి అంతా ఈ గున్థర్ కుక్క వంశానికే చెందుతుందన్నమాట. ఈ గున్థర్ కుక్కలు గోల్డెన్ స్పూన్ బేబి మాదిరి కుక్కలన్నమాట. బిజినెస్ మ్యాగ్జైన్లో ఈ కుక్క గురించి పలు కథనాలు వచ్చాయి. అలాగే దీనిపై పలు డాక్యుమెంటరీలు కూడా రావడం విశేషం. (చదవండి: షాపు షట్టర్లో కోటు చిక్కుకోవడంతో పాపం ఆ మహిళ..!) -
వరల్డ్ బెస్ట్ లిస్ట్లో భారత ఫిల్టర్ కాఫీ
కాఫీ గుమాళింపు ముక్కు పుటలకు తాకగానే హా! అని ఆస్వాదించేందుకు రెడీ అయిపోతాం. అలాంటి కాఫీలలో అత్యుత్తమమైన కాఫీల జాభితాను ఫుడ్ అండ్ ట్రామెల్ గైడ్ ఫ్లాట్ఫాం టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసింది. మొత్తం 38 అత్యుత్తమమైన కాఫీ జాబితాలను విడుదల చేయగా, అందులో భారతీయ ఫిల్టర్ కాఫీ రెండో స్థానం దక్కించుకుంది. తొలి స్థానంలో క్యూబాకి చెందిన క్యూబన్ ఎస్ప్రెస్సో కాఫీ నిలిచింది. ఈ క్యూబన్ ఎస్ప్రెసో అనేది డార్క్ రోస్ట్ కాఫీ. దీన్ని పంచదారను ఉపయోగించి తయారు చేసే షాట్స్లా ఉంటుంది. కాఫీ కాచేటప్పుడు కొద్దిగా చక్కెర స్టవ్ టాప్ ఎస్ర్పెస్సో మేకర్లో లేదా ఎలక్ట్రిక్ ఎస్ప్రెస్సో మెషిన్లో తయారు చేస్తారు. దీనిపై లేత గోధుమ రంగు నురుగ కూడా ఉంటుంది. ఇక భారతీయ ఫిల్టర్ కాఫీ స్టెయిన్లెస్ స్టీల్లో తయారు చేస్తారు. ఇందులో రెండు గదులుగా ఉంటుంది. పైభాగం చిల్లులగా ఉండి దిగువ భాగంలో కాఫీని ఉంచడానికి ఉపయోగాస్తారు. దిగువున ఉన్న గది నుంచి నెమ్మదిగా కాఫీ బయటకు రావడం జరగుతుంది. దక్షిణ భారతదేశంలో విస్తృత ప్రాచుర్యం పొందింది ఈ కాఫీ. చాలామంది వ్యక్తులు రాత్రిపూట ఈ ఫిల్టర్ కాఫీని ఏర్పాటు చేసుకుని ఉదయాన్నే ఈ తాజా కాఫీ మిశ్రమానికి వెచ్చని పాలు, చక్కెర కలుపుతారు. ఈ కాఫీ ఉక్కు లేదా ఇత్తడితో చేసిన చిన్న గ్లాస్లో సర్వ్ చేస్తారు. దీంతోపాటు దబారా అనే చిన్న గిన్నెలాంటి సాసర్ ఉంటుంది. సర్వ్ చేసే ముందు చక్కగా తిరగబోసి నురుగు వచ్చేలా అందంగా సర్వ్ చేయడం జరుగుతుంది. కాగా, టేస్లీ అట్లాస్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యుత్తమ పది కాఫీల జాబితాలో ఏయే దేశాల కాఫీలు ఉన్నాయంటే.. 1. క్యూబన్ ఎస్ప్రెస్సో (క్యూబా) 2. సౌత్ ఇండియన్ కాఫీ (భారతదేశం) 3. ఎస్ప్రెస్సో ఫ్రెడ్డో (గ్రీస్) 4. ఫ్రెడ్డో కాపుచినో (గ్రీస్) 5. కాపుచినో (ఇటలీ) 6. టర్కిష్ కాఫీ (టర్కీయే) 7. రిస్ట్రెట్టో (ఇటలీ) 8. ఫ్రాప్పే (గ్రీస్) 9. ఐస్కాఫీ (జర్మనీ) 10. వియత్నామీస్ ఐస్డ్ కాఫీ (వియత్నాం) (చదవండి: అక్కడ మహిళలదే పైచేయి..అబ్బాయే అత్తారింటికి వస్తాడు..ఎక్కడంటే..!) -
రేపు లైవ్లో మహాదేవుని కల్యాణం
రేపు (శుక్రవారం) మహా శివరాత్రి సందర్భంగా యూపీలోని కాశీలో మహాదేవుని కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను భక్తులు తమ మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షంగా చూడవచ్చు. కాశీ విశ్వనాథ దేవాలయం ట్రస్ట్.. మార్చి 8న మంగళ హారతి నుండి మార్చి 9 న భోగ్ హారతి వరకు మొత్తం 36 గంటల పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారాలలో నాన్స్టాప్ లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని ట్రస్ట్ అంచనా వేస్తోంది. వికలాంగులు, వృద్ధులు సులభంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది మహాశివరాత్రి సందర్భంగా సుమారు 8 లక్షల మంది భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నారని, ఈసారి ఆ సంఖ్య 10 లక్షలు దాటే అవకాశం ఉందని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. వారణాసిలోని అస్సీ ఘాట్, దశాశ్వమేధ్ ఘాట్, వారణాసి కాంట్ రైల్వే స్టేషన్ ఇతర ప్రధాన ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడి నుంచి ప్రత్యక్ష దర్శనాన్ని ప్రసారం చేయనున్నమని తెలిపారు. -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు! ఆమె ఆరోగ్య రహస్యం ఇదే..!
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా అమెరికాలో జన్మించిన స్పానిష్ మహిళ బ్రన్యాస్ మోరారే నిలిచింది. ఆమె ఇటీవలే తన 117వ పుట్టిన రోజుని జరుపుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ప్రకారం..ఫ్రాన్స్కు చెందిన 118 ఏళ్ల లూసిల్ రాండన్ మరణం తర్వాత మోరారేనే 117 ఏళ్లు సుదీర్థకాలం జీవించిన మహిళగా రికార్డు సృష్టించింది. ఇక మోరారే తల్లిదండ్రులు యూఎస్కు వలస వచ్చిన ఒక ఏడాది తర్వాత మార్చి 04, 1907న కాలిఫోర్నియాలో శాన్ఫ్రాన్సిస్కోలో జన్మించారు. మళ్లీ ఎనిమిదేళ్లకు స్పెయిన్ తిరిగి వచ్చి అక్కడ కాటలోనియాలో స్థిరపడింది. గత 22 ఏళ్లుగా మోరారే ఆ ప్రాంతంలోనే ఒక నర్సింగ్ హోమ్ రెసిడ్ఎన్సియా శాంటా మారియా డెల్ తురాలో కాలం వెళ్లదీస్తోంది. ఈ వృద్ధురాలు ప్రపంచ యుద్ధాలు, స్పానిస్ అంతర్యుద్ధం, స్పానిష్ ఫ్లూ వంటి మహమ్మారీలన్నింటిని తట్టుకుంది. చివరిగా 2020లో కోవిడ్ -19తో పోరాడారు. ఆమె ఈ వైరస్ బారిన తన 113వ పుట్టిన రోజు జరుపుకున్న కొద్ది వారాలకే పడింది. అయినప్పటికి త్వరగా కోలుకోవడం విశేషం. ఇన్స్టాగ్రామ వేదికగా గిన్నస్ వరల్డ్ రికార్డ్స్ ఆ వృద్ధరాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడమే గాక గత ఏడాది జనవరి 2023న ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ధృవీకరించిన విషయాన్ని పేర్కొంది. చింతించొద్దు, విచారించొద్దు.. మోరేరా తన ఆరోగ్య రహస్యంగా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రశాంతంగా ఉండటం, కుటుంబం, స్నేహితులతో మంచి అనుబంధం, భావోద్వేగ స్థిరత్వం తదితర వాటివల్లే ఇంతలా ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవించగలిగానని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఎక్కువగా చింతించడం, విచారించడం మానేయాలని, విషపూరితమైన వ్యక్తులకు దూరంగా ఉండటం వంటివి చేస్తే ఆయురారోగ్యాలతో ఉండగలరని చెప్పుకొచ్చింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం దగ్గరకు వచ్చేసరికి మోరారే 1931లో కాటలాన్ వైద్యుడు జోన్ మోరెట్ను వివాహం చేసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె తన పెళ్లి రోజు చాలా సంఘటనలతో ముడిపడి ఉందని చెప్పింది. ఇక ఆమె భర్త 72 ఏళ్ల వయసులో చనిపోయారు. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు, 11 మంది మనవళ్లు, 13 మంది మనవరాళ్లు ఉన్నారు. సైంటిస్టులు ఏం అన్నారంటే.. మోరారేతో మాట్లాడిన సైంటిస్ట్ మానెల్ ఎస్టేల్లర్ మాట్లాడుతూ.."ఆమెను పరీక్షించగా పూర్తిగా స్పష్టమైన తల ఉంది. కేవలం నాలుగేళ్ల వయసులో జరిగిన సంఘటనలను సైతం గుర్తించుకుంటుంది. అలాగే వృద్ధులకు ఉండే సాధారణ హృదయ సంబంధ వ్యాధులు ఏమీ లేవు. ఆమె కుటుంబంలో 90 ఏళ్లు పైబడిన వాళ్లు చాలామంది ఉండటం విశేషం. ఇక్కడ జన్యుసంబంధ కారణమే అయ్యి ఉండొచ్చు. ఇక మోరారే మూత్రం, లాలాజలం, రక్తనమునాలు ఆమె 80 ఏళ్ల కుమార్తెతో సరిపోలుతాయి. ఆమె డీఎన్ఏ వయసు సంబంధిత వ్యాధులతో పోరాడగల ఔషధ సృష్టికి దోహదపడొచ్చు" అని ఎస్టేల్లర్ అన్నారు. (చదవండి: ప్రాణాంతక కేన్సర్తో పోరాడుతూ భావోద్వేగ పోస్ట్..'భర్తకు ప్రేమతో'..) -
ఏఏ దేశాల్లో శివాలయాలు ఉన్నాయి?
పరమశివునికి మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ దేవాలయాలు ఉన్నాయి. శుక్రవారం శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో విదేశాల్లోని శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశుపతినాథ్ ఆలయం (నేపాల్) ఈ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది ఇది శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయాన్ని హిందువులతో పాటు బౌద్ధమతస్తులు కూడా సందర్శిస్తుంటారు. కైలాస మానసరోవరం (చైనా) కైలాస మానసరోవరం అనేది ఒక పవిత్రమైన సరస్సు. ఈ పర్వతం టిబెట్ చైనాలో ఉంది. ఇది శివుని నివాసం అని హిందువులు నమ్ముతారు. ప్రంబనన్ ఆలయం (ఇండోనేషియా) ప్రంబనన్ ఆలయం ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్లో ఉంది. దీనిని ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయమని చెబుతుంటారు. ఇక్కడ ఎనిమిది దేవాలయాల సమూహం ఉంది. మున్నేశ్వరం (శ్రీలంక) ఈ ఆలయం శ్రీలంకలో ఉంది. దీనిని 'త్రికోణమాలి' అని కూడా పిలుస్తారు. మున్నేశ్వరం అత్యంత పురాతనమైన శివుని ఆలయం. రావణుని వధించిన తర్వాత రాముడు ఈ ఆలయంలో తన ఆరాధ్యదైవమైన శివుణ్ణి పూజించాడని చెబుతారు. గౌరీశంకర్ ఆలయం (నేపాల్) ఈ ఆలయం నేపాల్లో ఉంది. ఆలయంలో శివపార్వతులు కొలువయ్యారు. ఈ ఆలయం ఖాట్మండుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కటాస్రాజ్ ఆలయం (పాకిస్థాన్) ఈ ఆలయం పాకిస్తాన్లో ఉంది . దీనిని 'సెవెన్ పూల్స్ టెంపుల్' అని కూడా పిలుస్తారు. అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం (మలేషియా) అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం మలేషియాలోని జోహోర్ బారులో ఉంది. ఇది మలేషియాలోని పురాతన హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది. శ్రీ శివ మందిర్ (ఇంగ్లండ్) శ్రీ శివాలయం ఇంగ్లండ్లో ఉంది. ఈ ఆలయం లండన్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివాలయం (నెదర్లాండ్స్) ఈ ఆలయం నెదర్లాండ్స్లో ఉంది. ఈ ఆలయం ఆమ్స్టర్డామ్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివాలయం (జర్మనీ) ఈ ఆలయం జర్మనీలో ఉంది. ఈ ఆలయం బెర్లిన్కు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. -
భాషలన్నింటిలో టాప్ ఏవో తెలుసా మీకు?
2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడిన భాషలు ఎన్నో, ఎంతమంది మాట్లాడారో తెలుసా.ప్రతి సంవత్సరం అతిపెద్ద భాషల జాబితాను ప్రచురించే ఎథ్నోలాగ్ తాజా జాబితాను వెల్లడించించింది. ఇందులో అత్యధికంగా అంటే 1.5 బిలియన్లు మంది మాట్లాడిన భాషగా ఇంగ్లీష్ నిలిచింది. అలాగే భారత దేశానికి చెందిన హిందీ భాష మూడో స్థానంలో నిలవడం విశేషం. అలాగే బెంగాలీ భాష 7, ఉర్దూ భాష 10వ స్థానంలో నిలిచాయి. భూమి మొత్తం 200కు పైగా దేశాలు ఉండగా వాటిల్లో మొత్తం 7వేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ జాబితా ఆర్థిక పోకడలు, అధిక జనాభా ఉన్న దేశాలు, వలస చరిత్రను కూడా ప్రతిబింబిస్తాయంటున్నారు విశ్లేషకులు భూమిపై అత్యధికంగా మాట్లాడే 12 భాషలు ఇంగ్లీష్: 1,500,000,000 మాండరిన్: 1,100,000,000 హిందీ: 609,500,000 స్పానిష్: 559,100,000 ఫ్రెంచ్: 309,800,000 ప్రామాణిక అరబిక్: 274,000,000 బెంగాలీ: 272,800,000 పోర్చుగీస్: 263,600,000 రష్యన్: 255,000,000 ఉర్దూ: 231,700,000 ఇండోనేషియన్: 199,100,000 జర్మన్: 133,200,000 -
ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా!
ఆరోగ్యంగా ఉండాలంటే ఓన్లీ శాకాహారమే కాక కొద్ది మొత్తంలో మాంసకృత్తులతో కూడిన ఆహారం తీసుకోవడం మంచిది. శరీరానకి అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా లభించాలంటే తప్పనిసరిగా మాంసాహారం కూడా తీసుకోవాలసిందే. కొన్ని ప్రాంతాల్లో వివిధ జంతువుల మాంసాన్ని ఇష్టంగా తింటారు. ఇక మన దేశంలో కోడి, గొర్రె మాంసం ఎక్కువగా తింటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తినే జంతు మాంస ఏదో తెలిస్తే షాకవ్వుతారు. ముఖ్యంగా మన భారత్లో ఏం తింటారో వింటే నోట మాట రాదు. ఇంతకీ ప్రపంచవ్యాప్తంగా ఏ జంతు మాంసాన్ని అత్యధికంగా ఇష్టపడుతున్నారంటే.. గత కొన్నేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా మాంసాహార వినియోగం విపరీతంగా పెరిగింది. దీని రుచి బాగా ఎక్కువ ఉండటంతో అత్యధిక మంది వీటినే ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు. అన్ని వనరులు అందుబాటులో ఉండటం కారణంగా కూడా ఈ మాంస వినియోగం ఎక్కువయ్యిందని చెప్పొచ్చు. ఇక 2017 లెక్కల ప్రకారం మాంసం వినియోగం ఏకంగా 330 మిలియన్ టన్నులు ఉంది. ప్రజల ఆదాయం పెరగడంతో పాటు ఆరోగ్యంపై స్ప్రుహ కూడా ఎక్కువగా ఉండటంతో మాంసం వినియోగం పెరిగిందనే చెప్పొచ్చు. కొన్ని దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. మాంసం వినియోగం మాత్రం తగ్గడం లేదు. అయితే సంపన్న దేశాల్లో మాంసం ఎక్కువగా వినియోగిస్తుండగా, పేద దేశాల్లో వినియోగం తక్కువగానే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ జంతువు మాంసం ఎక్కువగా ఇష్టపడుతున్నారో గమనిస్తే..పోర్క్ మాంసానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. ఒక సర్వే ప్రకారం..ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు ఇష్టపడే మాంసాల్లో ఈ పోర్కే తొలి స్థానంలో నిలవడం విశేషం. ఆ తరువాత స్థానంలో చికెన్నును ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు వెల్లడయ్యింది. భారత్లో కూడా చికెన్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత మూడో స్థానంలో గొడ్డు మాంసం ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీని ధర తక్కువగా ఉండడంతో చాలా మంది దీనికి మొగ్గు చూపిస్తున్నారు. మేకలు నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. ఐదో స్థానంలో టర్కీ కోడి ఉంది. దీనిని ఎక్కువగా ఉత్తర అమెరికా, మెక్సికోలో ఎక్కువగా వాడుతారు. ప్రపంచంలో బాతు మాంసం ఆరో స్థానంలో నిలిచింది. దీనిని చైనా, అమెరికాలో ఎక్కువగా వినియోగిస్తారు. ఏడో స్థానంలో గేదె మాంసం ఉంది. దీనిని ఆసియాలోని కొన్ని దేశాల్లో ఎక్కువగా తింటారు. కుందేలు మాంసం 8వ స్థానంలో నిలిచింది. దీనిని చైనా, ఉత్తర కొరియాలో ఎక్కువగా తింటారు. తొమ్మిదో స్థానంలో జింక ఉండగా..జపాన్ లో ఈ మాంసాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాగా, అత్యంత తక్కువ మాంసం వినియోగిస్తున్న దేశంగా భారత్ నిలవడం విశేషం. ఇక్కడ మాంసాహారం కంటే శాఖాహారానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మరో సర్వే ప్రకారం మూడింటరెండు వంతుల మాంసాహారం వినియోగిస్తున్నారని తేలినా.. సగటు వినియోగంతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆధ్యాత్మిక భావాలు, సంప్రదాయాలు పట్టింపులు ఎక్కువగా ఉండడం వల్ల అంత తొందరగా మాంసాహారం జోలికి వెళ్లరు. (చదవండి: చల్లటి నీరు అరుదైన గుండె వ్యాధికి దారితీస్తుందా? ఓ బాడీబిల్డర్ చేదు అనుభవం) -
తొలి వేద గడియారం సిద్ధం.. అందుబాటులోకి ఎప్పుడంటే..
ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో రూపొందింది. దీనిని మార్చి ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంయుక్తంగా కాళిదాస్ అకాడమీలో ప్రారంభించనున్నారు. వేద గడియారానికి సంబంధించిన ఇన్స్టలేషన్, టెస్టింగ్ వర్క్ పూర్తయింది. భారత ప్రామాణిక సమయాన్ని ఈ వేద గడియారంలో చూడవచ్చు. ఈ గడియారంలో ఒక గంట అంటే 48 నిమిషాలు. ఈ గడియారం వేద సమయంతో పాటు వివిధ ముహూర్తాలను కూడా చూపిస్తుంది. ఉజ్జయినిలో క్రేన్ సాయంతో దాదాపు 80 అడుగుల ఎత్తులో వాచ్ టవర్ పై దీనిని అమర్చారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ మార్చి ఒకటిన ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ వాచ్ కానుంది. ఇది భారతీయ ప్రామాణిక సమయం (ఐఎస్టీ), గ్రీన్విచ్ మీన్ టైమ్ (జీఎంటీ) మాత్రమే కాకుండా పంచాంగంతో పాటు ముహూర్తాల గురించిన సమాచారాన్ని అందిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలే కాకుండా సూర్య , చంద్ర గ్రహణాల గురించి కూడా తెలియజేస్తుంది. కాగా వేద క్లాక్ రీడింగ్ కోసం మొబైల్ యాప్ రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని స్మార్ట్ఫోన్, కంప్యూటర్, టెలివిజన్ తదితర పరికరాలలో వినియోగించే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ వేద గడియారాన్ని వ్యవస్థాపించేందుకు ఉజ్జయినిలోని జివాజీ అబ్జర్వేటరీ సమీపంలో 85 అడుగుల ఎత్తైన టవర్ను నిర్మించారు. -
ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా మన బాస్మతి రైస్!
పలావ్ దగ్గర నుంచి బిర్యానీ వంటి వంటకాలకు కావాల్సింది బాస్మతి రైస్. పండుగలకు, వేడుకలకు వంటకాల్లో వాడే రైస్ ఇది. ఈ రైస్ అంటే ప్రతి ఒక్క భారతీయుడికి అత్యంతి ఇష్టం. పైగా ఖరీదు కూడా ఎక్కువే. అలాంటి సుగంధభరితమైన బాస్మతి ప్రపంచంలోనే అత్యత్తమ బియ్యంగా టైటిల్ని దక్కించుకని జాబితాలో తొలిస్థానం దక్కించుకుంది. ఆ బాస్మతి బియ్యం భారత్కి ఎలా వచ్చింది?. దానికి ఆ పేరు ఎలా వచ్చింది? తదితర ఆసక్తికర విషయాల గురించి చూద్దామా!. ప్రముఖ ఫుడ్ గ్రేడ్ అయిన అట్లాస్ 2023-24 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ బియంగా జాబితా విడుదల చేసింది. అందులో బాస్మతి బియ్యం అగ్ర స్థానంలో ఉంది. ఇటలీకి చెందిన ఆర్బోరియో రెండో స్థానంలో, పోర్చుగల్కు చెందిన కరోలినా రైస్ మూడో స్థానంలో ఉన్నాయి. బాస్మతి వాసన, రుచి, పెద్ద గింజరు ఉన్నప్పటికీ ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది. భారతీయ బాస్మతిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. పులావ్ నుంచి బిర్యానీ వరకు భారతదేశంలోని ప్రతి వ్యక్తి మొదటి ఎంపిక బాస్మతి బియ్యం. దీన్ని భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా పండిస్తుంటారు. బాస్మతి బియ్యం అనేది భారత్కు పెట్టింది పేరు. ఒక్క భారత్లో 34 రకాల బాస్మతి బియ్యాన్ని పండిస్తారు. వీటిని విత్తనాల చట్టం కింద 1966లో నోటిఫై చేశారు. ఆ రకాల్లో బాస్మతి 217, బాస్మతి 370, టైప్ 3 (డెహ్రాడూని బాస్మతి) పంజాబ్, బాస్మతి 1 (బౌని బాస్మతి), పూసా బాస్మతి 1, కస్తూరి, హర్యానా బాస్మతి 1, మహి సుగంధ, తారావోరి బాస్మతి (HBC 19 / కర్నాల్ లోకల్), రణబీర్ బాస్మతి, బాస్మతి 386 తదితరలు ఉన్నాయి. అంతేగాదు సౌదీ అరబ్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, యెమెన్ రిపబ్లిక్ వంటి దేశాలకు భారతదేశం బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసే ప్రధాన సంస్థ అని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) పేర్కొంది. బాస్మతి చరిత్ర.. బాస్మతి రైస్ను హిమాలయాల దిగువ ప్రాంతంలోని ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. పురాతన కాలంలో కూడా బాస్మతిని పండించినట్లు చరిత్ర చెబుతోంది. ఆహారంపై రాసిన ఆరోమాటిక్ రైసెస్ అనే పుస్తకంలో హరప్పా, మొహెంజోదారో తవ్వకాల్లో కూడా దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయని చెబుతుంది. పర్షియన్ వ్యాపారులు భారత దేశానికి వచ్చినప్పుడు తమ వెంట అనేకరకాల సుగంధ బియ్యం తెచ్చుకున్నారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. పెర్షియన్ వ్యాపారులు వ్యాపారం కోసం భారతదేశానికి చేరుకున్నప్పుడు, వారు తమతో పాటు అనేక రకాల సుగంధ బియ్యాన్ని తీసుకువచ్చారని చరిత్ర చెబుతుంది. ఈ రైస్ని సువాసనల రాణి అని కూడా.. సంస్కృత పదాలు వాస్, మయాప్ నుంచి బాస్మతి పేరు వచ్చింది. వాస్ అంటే సువాసన. మయాప్ అంటే లోతు. అయితే ఇందులో వాడిన మతి అనే పదానికి రాణి అనే అర్థం కూడా ఉంది. అందుకే దీనిని సువాసనల రాణిగా పిలుస్తారు. ఎలా గుర్తిస్తారంటే.. బాస్మతి ఎక్స్పోర్టు డెవలప్మెంట్ ఫౌండేషన్ బాస్మతి బియ్యం అసలైందో కాదో నిర్ణయిస్తుంది. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీప్రకారం 6.61 మి.మీ పొడవు. 2 మి.మీ మందంగా ఉండే బియ్యాన్ని బాస్మతిగా గుర్తించింది. (చదవండి: భారత్లో 5% మేర పేదరికం తగ్గుతోంది!) -
అనకొండకి చెందిన మరో జాతి! వెలుగులోకి షాకింగ్ విషయాలు
అనకొండనే ప్రపంచంలో అతిపెద్ద పాము జాతి అని అనుకున్నాం. అదే జాతికి చెందిని మరో జాతి అనకొండను ఈ క్వెడార్లో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఎన్నో ఏళ్లుగా ఈ అనకొండకు సంబంధించి మరో జాతి గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. శాస్త్రవేత్తల ఊహను నిజం చేస్తే మరో జాతి అనకొండ వాళ్ల కంటపడింది. ఇది 26 అడుగుల మరియు 200 కిలోల మేర బరువుంది. ఈ మేరకు శాస్త్రవేత్త విల్ స్మిత్ల బృందం రానున్న నాట్ జియాఓ సిరిస్ పోల్ టు పోల్ కోసం ఫోటో షూట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ క్కెడార్లోని అమెజాన్ నది అడుగు భాగంలో ఫోటోలు చిత్రిస్తుండగా ఈ అనకొండ కెమెరాకు చిక్కింది. ఆ సరికొత్త అనకొండను చూసి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు ఇది ఇప్పటి వరకు చూసిన అనకొండ జాతులకు చెందిందా కాదా అనే దిశగా పరిశోధనలు చేశారు. దీన్ని చూసి ఇంతకుముందు కనిపెట్టిన ఆకుపచ్చ అనుకొండకు చెందిన మరోక జాతి ఏమో అనుకున్నారు. కానీ పరిశోధనలో వేర్వేరు జాతికి చెందినదని తేలింది. ఆక్కుపచ్చలో ఉండే అనకొండ జాతి ఎక్కువగా బ్రెటిజల్ , పెరూ, బొలీవియా, ఫ్రెంచ్ గయానాలలో నివశిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్తించిన ఈ కొత్తజాతి అనకొండ తొమ్మిది దక్షిణ అమెరికా దేశాలలో బోవా గ్రూప్ సేకరించిన మిగతా అనకొండాల రక్తం, కణజాల నమూనాలతో సరిపోలలేదన్నారు. ఇది అనకొండలో కొత్త జాతిని నిర్థారించారు. దీనికి జెయింట్ అనకొండగా నామకరణం చేశారు. ఈ అనకొండ మరింత ప్రమాదకరమైనదని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. The world's largest snake has been discovered in the Amazon Rainforest: The Northern Green Anaconda measures 26 feet long and weighs 440 lbs - and its head is the same size as a human's. pic.twitter.com/XlaDk0qVYt — Denn Dunham (@DennD68) February 21, 2024 (చదవండి: శునకాల మధ్య పెరిగి ఆమె ఓ శునకంలా..ఇప్పటికీ..! మరో టార్జాన్, మోగ్లీ లాంటి కథ!) -
పిల్లల ప్రపంచం తగ్గిపోతోంది!
దాదాపు వందేళ్లుగా భూమ్మీద జనాభా విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది. ఇదిలాగే పెరిగితే ఏమవుతుందోనన్న ఆందోళనా పెరుగుతూ వ చ్చింది. కానీ ఆ టెన్షన్ను తగ్గిస్తూ.. కొన్నేళ్లుగా జననాల రేటు తగ్గుతూ పోతోంది. దీనివల్ల జనాభాలో వృద్ధుల శాతం పెరుగుతూ.. పిల్లల శాతం తరుగుతూ వస్తోంది. భూమ్మీద ఒకే సమయంలో అత్యంత ఎక్కువ మంది చిన్న పిల్లలు (ఐదేళ్ల వయసు లోపు) ఉన్న సమయాన్ని కూడా దాటేశామని నిపుణులు తాజాగా తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 2017వ సంవత్సరమే అత్యంత ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్న ఏడాది (పీక్ చైల్డ్ ఇయర్) అని.. తర్వాతి నుంచి పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని గుర్తించారు. ‘ఐక్యరాజ్యసమితి (యూఎన్) జనాభా అంచనాలు–2022 నివేదిక’ ఆధారంగా ఈ గణాంకాలను రూపొందించారు. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో చేపట్టిన జనాభా నియంత్రణ చర్యలు, ఆ దేశాల్లో పిల్లలను కనగలిగే వయసులో ఉన్నవారి శాతంలో తేడాల కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంఖ్య హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తోందని యూఎన్ నివేదిక వెల్లడించింది. ► మన దేశానికి వస్తే.. జనాభా నియంత్రణ, ప్రజల్లో అవగాహన క ల్పించే చర్యలతో 2004వ సంవత్సరం నుంచే చిన్న పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని పేర్కొంది. 2021 నాటికి దేశంలో 11.53 కోట్ల మంది చిన్నారులు ఉన్నారని.. 2100 నాటికి ఇది 6.86 కోట్లకు తగ్గుతుందని అంచనా వేసింది. ► ఇటీవలిదాకా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగిన చైనాలో అత్యధికంగా 13.82 కోట్ల మంది పిల్లలు ఉన్నది 1972లోనే. నాటి నుంచి పిల్లల సంఖ్య తగ్గుతూనే ఉంది. ఈ సంఖ్య 2000వ సంవత్సరం నాటికి 8.41 కోట్లకు, 2021 నాటికి 7.47 కోట్లకు తగ్గింది. 2100 ఏడాది నాటికి అక్కడ ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య 2.38 కోట్లలోపే ఉంటుందని యూఎన్ అంచనా వేసింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
అత్యంత ఖరీదైన కీటకం..ధర ఏకంగా రూ. 65 లక్షలు పైనే..
ఈ ప్రపంచంలో ఎన్నో జంతువులు, కీటకాలు ఉంటాయి. అందులో కొన్నింటిని మనం ఆహారంగా తీసుకుంటాం. కొన్ని మన ప్రాణాలకు ప్రమాదకరం. అయితే ఒక కీటకం ధర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలవడం విశేషం. దీని ధర ముందు బీఎండబ్ల్యూ, ఆడీ కార్లకు కూడా బలదూర్ అనిపించేలా ఉంది. అయినా ఒక కీటకం ఎందుకు అంత ధర పలుకుతుంది? దాని వల్ల ఉపయోగం ఏంటీ..? అంటే.. స్టాగ్ బీటిల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం. ఇది కేవలం 2 నుంచి 3 అంగుళాల సైజులో ఉంటుంది. చెత్తలో ఉండే ఈ కీటకాన్ని జపనీస్ పెంపకందారుడు ఏకంగా 65 లక్షలుకు విక్రయించాడు. ఇప్పుడు అది ఏకంగా కోటి పైనే పలుకుతోందట. ప్రజలు కూడా ఈ అరుదైన కీటకాన్ని కొనుగోలు చేయడానికి కోట్లు వెచ్చిస్తుండటం విశేషం. స్టాగ్ బీటిల్స్ లుకానిడే కుటుంబానికి చెందినవి, ఇందులో దాదాపు 1,200 రకాల కీటకాలు ఉన్నాయి. ఈ భూమిపై ఉన్న అత్యంత వింతైన చిన్న కీటకం ఇది. చూడటానికి నల్లగా ఉండి తల నుంచి పొడుచుకు వచ్చిన కొమ్ముల ఉంటాయి. చెత్తలో ఉండే స్టాగ్ బీటిల్స్ కుళ్లిన కలపలోన ద్రవాలు, పండ్లరసం, చెట్ల రసం వంటి వాటినే ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఎక్కువగా ద్రవాల మీద ఆధారపడతాయి. ఎందుకంటే ఇవి తినలేవు. ఈ కీటకం సుమారు 7 సంవత్సరాలు జీవిస్తుందట. అయితే ఇది స్టాగ్ బీటిల్ అని వాటి తలపై ఉన్న కొమ్ముల ఆధారంగా గుర్తిస్తారట. అయితే వీటిని వివిధ రకాల మందుల తయారీలో వినియోగిస్తారు. అందువల్లే ఇది అంత ఖరీదు. వీటిలో మగ స్టాగ్ బీటిల్స్ పెద్ద దవడలు కలిగి ఉండగా, ఆడవారి దవడలు, మగవారి కంటే బలంగా ఉంటాయి. ఇక ఆడ స్టాగ్ బీటిల్స్ తరచుగా నేలపైనే కనిపిస్తాయి. ఎందుకంటే..? గుడ్డు పెట్టేందుకు ఎల్లప్పుడూ నేలపై సంచరిస్తుంటాయి. అయితే ఈ కీటకాలు పెద్దవి అయిపోయాక గట్టి చెక్కను తినలేవట. దాంతో లార్వా కాలంలో ఏర్పడిన కొవ్వు నిల్వలపై ఆధారపడతాయి. శీతల వాతావరణం స్టాగ్ బీటిల్స్కు తగినది కాదు, ఎందుకంటే..? ఇది లార్వా ప్రక్రియను పొడిగించగలదు. శీతాకాలంలో చాలా కీటకాలు చనిపోతాయి, కాబట్టి వెచ్చని ప్రదేశాలు వాటికి ఉత్తమమైనవి. దీన్ని ఎక్కువగా ప్రమాదకరమైన వ్యాధులకు మందులు తయారు చేయడంలో ఉపయోగిస్తారట. అందువల్లే బీఎండబ్ల్యూ, ఆడీ కార్లను తలదన్నేలా అత్యంత ధర పలుకుతోంది. అయితే ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉండటం బాధకరం. (చదవండి: చాక్లెట్, కెల్లాగ్స్ చాకోస్లో పురుగుల కలకలం! అలాంటివి వెంటనే తిరిగిచ్చేసి ఉచితంగా మరొకటి..) -
ఖతార్లో ఎనిమిదిమంది భారతీయుల మరణశిక్ష రద్దు!
భారత్ దౌత్యపరంగా మరో విజయం సాధించింది. ఖతార్లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారతీయులు విడుదలయ్యారు. దీనిపై భారత ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ ఎనిమిది మంది భారతీయుల్లో ఏడుగురు భారత్కు తిరిగి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్కు చెందిన ఎనిమిది మంది మాజీ మెరైన్లు దోహాకు చెందిన అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్లో పనిచేశారు. గూఢచర్యం ఆరోపణలపై 2022, ఆగస్టులో వీరు అరెస్టయ్యారు. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీ ఖతార్ సైనిక దళాలకు, ఇతర భద్రతా సంస్థలకు శిక్షణ, ఇతర సేవలను అందిస్తుంది. ఏడాదికి పైగా జైలు జీవితం గడిపిన అనంతరం ఈ మాజీ మెరైన్లకు ఖతార్లోని దిగువ కోర్టు గత ఏడాది అక్టోబర్లో మరణశిక్ష విధించింది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం భారత్కు ఇవ్వలేదు. దీంతో ఈ నిర్ణయంపై భారత్ అప్పీల్ చేసింది. #WATCH | Delhi: Qatar released the eight Indian ex-Navy veterans who were in its custody; seven of them have returned to India. pic.twitter.com/yuYVx5N8zR — ANI (@ANI) February 12, 2024 దీనిపై విచారణ జరిగిన నేపధ్యంలో ఆ ఎనిమిది మంది అధికారుల మరణశిక్షను ఖతార్ రద్దు చేసింది. ఈ విధంగా భారతదేశం దౌత్యపరంగా మరో విజయం సాధించింది. దుబాయ్లో జరిగిన కాప్-28 కాన్ఫరెన్స్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ఖతార్లో నివసిస్తున్న భారతీయుల గురించి అమీర్తో మాట్లాడారు. #WATCH | Delhi: One of the Navy veterans who returned from Qatar says, "We are very happy that we are back in India, safely. Definitely, we would like to thank PM Modi, as this was only possible because of his personal intervention..." pic.twitter.com/iICC1p7YZr — ANI (@ANI) February 12, 2024 ఖతార్ అదుపులో కెప్టెన్లు సౌరభ్ వశిష్ఠ్, నవతేజ్ గిల్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్పాల్, సెయిలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ విశాఖ వాసి. అక్కడి ప్రాథమిక కోర్టు రెండు మూడుసార్లు మాత్రమే విచారణ జరిపి మరణ శిక్షను ఖరారు చేసింది. దీన్ని రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీంతో అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతించింది. ఎట్టకేలకు పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం మరణ దండనను జైలు శిక్షగా మారుస్తూ డిసెంబర్ 28న తీర్పునిచ్చింది. దీన్ని కూడా అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువిచ్చింది. దీంతో అందుబాటులో ఉన్న అన్ని న్యాయమార్గాలను వినియోగించుకున్న భారత్ వారి విడుదలకు విశేష కృషి చేసింది. అవన్నీ ఫలించి ఈరోజు వారు స్వదేశానికి చేరుకోవటంతో భారత్కు దౌత్యపరంగా గొప్ప విజయం లభించినట్లయింది. -
యూఎస్ ప్రతీకార దాడులు.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి!
జోర్డాన్లోని సైనిక స్థావరంపై డ్రోన్ దాడికి ప్రతిగా యూఎస్ మిలటరీ ఇరాక్లోని ఇరాన్ మద్దతు కలిగిన మిలీషియా స్థావరాలపై బాంబు దాడి చేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సిరియాలో జరిగిన యూఎస్ వైమానిక దాడుల్లో ఆరుగురు మిలీషియా ఫైటర్లు మరణించారు. వారిలో ముగ్గురు నాన్ సిరియన్లు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మద్దతు కలిగిన 85 మిలీషియా స్థావరాలపై అమెరికా ప్రతీకార వైమానిక దాడులను ప్రారంభించిందని యూఎస్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. కంట్రోల్ సెంటర్లు, రాకెట్, క్షిపణి, డ్రోన్ నిల్వల గోడౌన్లతో పాటు లాజిస్టిక్స్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని యుఎస్ సైనిక వైమానిక దాడులు జరిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. యూఎస్ దళాలు 125కు మించిన యుద్ధ సామగ్రితో 85కు మించిన లక్ష్యాలపై దాడి చేశాయి. అదే సమయంలో సిరియాలోని ఎడారి ప్రాంతాలు, ఇరాక్ సరిహద్దు సమీపంలో ఉన్న లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడిలో పలువురు మృతి చెందారని, చాలామంది గాయపడ్డారని సిరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. It is bring reported that the #US has began air strikes on #Iraq Earlier we saw 5 B1 lancers flying from US towards Middle East region pic.twitter.com/bjGntkKz9I — Free Pakistan 🇺🇦 🇷🇺 🇮🇱 🇵🇸 🇺🇸 (@ukr69h) February 3, 2024 ఈ దాడుల తరువాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఒక ప్రకటనలో అమెరికన్లకు ఎవరైనా హాని కలిగిస్తే, తాము తగిన సమాధానం ఇస్తామని అన్నారు. గత ఆదివారం జోర్డాన్లో ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులు జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారని ఆయన చెప్పారు. శుక్రవారం డోవర్ ఎయిర్ఫోర్స్ బేస్లో వీర జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. గత వారంలో జోర్డాన్లోని సైనిక స్థావరంపై జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు యూఎస్ సైనికులు మృతిచెందారు. ఈఘటనలో సుమారు 40 మంది గాయపడ్డారు. ఈ నేపధ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్రవాద గ్రూపులపై ప్రతీకార దాడులు ప్రారంభించారు. ARE WE AT WAR😳😳😳 The United States has begun a wave of airstrikes in Iraq and Syria. This is retaliation for a fatal drone attack that killed three soldiers. pic.twitter.com/JmJsM5Gpe3 — Graham Allen (@GrahamAllen_1) February 2, 2024 -
ఆర్మీలో ‘జై శ్రీరామ్’, ‘జై బజరంగబలి’ నినాదాలు ఎందుకు?
ప్రపంచంలోని ఐదు అత్యంత శక్తివంతమైన సైన్య బలగాలలో భారత సైన్యం ఒకటిగా గుర్తింపు పొందింది. ఇండియన్ ఆర్మీలో అనేక రెజిమెంట్లు ఉన్నాయి. ప్రతి రెజిమెంట్కు దాని సొంత యుద్ధ నినాదాలు ఉన్నాయి. ‘వార్ క్రై’ అంటే యుద్ధ సమయంలో సైనికునికి స్ఫూర్తినిచ్చే, ఉత్సాహభరితమైన నినాదాలు. అవి శత్రువును తరిమికొట్టేందుకు ప్రేరణ కల్పిస్తాయి. సైనికులలో ఉత్సాహాన్ని నింపడానికి పలు రెజిమెంట్లు జై శ్రీ రామ్, బజరంగబలి కీ జై, దుర్గా మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తాయని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రెజిమెంట్లలో బ్రిటీష్ కాలం నుంచి ‘జై శ్రీరామ్’ అనే యుద్ధ నినాదం వినిపిస్తే వస్తోంది. నాడు బ్రిటిషర్లుకూడా దీనికి అభ్యంతరం చెప్పలేదు. మతపరమైన యుద్ధ నినాదాలు సైనికులలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని బ్రిటీషర్లు కూడా భావించారు. భారత సైన్యం (ఆర్మీ), వైమానిక దళం, నావికాదళాల యుద్ధ నినాదం ఒకటే. అదే ‘భారత్ మాతా కీ జై’.. అయితే ప్రతి రెజిమెంట్కు ఒక్కో ప్రత్యేక నినాదం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్పుతానా రైఫిల్స్ రాజ్పుతానా రైఫిల్స్ సైన్యంలోని పురాతన రైఫిల్ రెజిమెంట్. ఇది 1921 సంవత్సరంలో ఏర్పడింది. ఆ సమయంలో ఇది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ పరిధిలో ఉంది. ‘రాజా రామచంద్ర కీ జై’ అనేది ఈ రెజిమెంట్ నినాదం. టెరిటోరియల్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ అనేది భారత సైన్యానికి సహాయక సైనిక సంస్థ. భారత సైన్యానికి సేవలను అందించడం దీని పని. ఇది 1949, అక్టోబర్ 9న ఏర్పడింది. ‘జై శ్రీరామ్’ అనేది టెరిటోరియల్ ఆర్మీ నినాదం. కుమావూ రెజిమెంట్ కొన్ని రెజిమెంట్లు ‘బజరంగబలి’ పేరుతో యుద్ధ నినాదాలు చేస్తాయి. వాటిలో ఒకటి కుమావూ రెజిమెంట్. ఇది 1922లో ఏర్పాటయ్యింది. ‘కాళికా మాతా కీ జై, బజరంగబలి కీ జై, దాదా కిషన్ కీ జై’ అనేవి కుమావూ రెజిమెంట్ యుద్ధ నినాదాలు. బీహార్ రెజిమెంట్ బీహార్ రెజిమెంట్ సైన్యంలోని పురాతన పదాతిదళ రెజిమెంట్. ఇది 1941లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం బీహార్లోని దానాపూర్లో ఉంది. ఈ రెజిమెంట్ 2020లో గాల్వాన్ వ్యాలీలో చైనీస్ ఆర్మీని మట్టి కరిపించింది. ‘జై బజరంగబలి’ అనేది బీహార్ రెజిమెంట్ నినాదం. జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ భారత సైన్యానికి చెందిన సైనిక బృందం. ఇది 1821లో ఏర్పడింది. ‘దుర్గా మాతా కీ జై' అంటూ జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ యుద్ధ నినాదాలు చేస్తుంటుంది. గర్వాల్ రైఫిల్స్ గర్వాల్ రైఫిల్స్ బెంగాల్ ఆర్మీ ఆధ్వర్యంలో 1887లో స్థాపితమయ్యింది. ఇది బెంగాల్ ఆర్మీకి చెందిన 39వ రెజిమెంట్. ఆ తర్వాత ఇది బ్రిటిష్ ఆర్మీలో భాగమైంది. స్వాతంత్య్రానంతరం ఇది ఇండియన్ ఆర్మీ రెజిమెంట్గా మారింది.దీని యుద్ధ నినాదం ‘బద్రీ విశాల్ కీ జై’. జాట్ రెజిమెంట్ జాట్ రెజిమెంట్ ఒక పదాతిదళ రెజిమెంట్. స్వాతంత్ర్యం తరువాత ఈ రెజిమెంట్కు ఐదు యుద్ధ గౌరవాలు లభించాయి. ఈ రెజిమెంట్ ఎనిమిది మహావీర్ చక్ర, ఎనిమిది కీర్తి చక్ర, 39 వీర్ చక్ర, 170 సేన పతకాలను అందుకుంది. ‘జాట్ బల్వాన్, జై భగవాన్’అనేది దీని యుద్ధ నినాదం. డోగ్రా రెజిమెంట్ డోగ్రా రెజిమెంట్ 1922లో ఏర్పడింది. డోగ్రా రెజిమెంట్కు చెందిన నిర్మల్ చందర్ విజ్ జనవరి 1, 2003న ఆర్మీ చీఫ్గా నియమితులయ్యారు. 2005 వరకు ఈ పదవిలో కొనసాగారు. ‘జ్వాలా మాతా కీ జై’ అనేది ఈ రెజిమెంట్ యుద్ధ నినాదం. ఇదే కాకుండా పంజాబ్ రెజిమెంట్, సిక్కు రెజిమెంట్, సిక్కు లైట్ పదాతిదళాల 'జో బోలే సో నిహాల్, సత్ శ్రీ అకల్’అనే నినాదాలు చేస్తాయి. దీనితో పాటు పంజాబ్ రెజిమెంట్ ‘బోలో జ్వాలా మాతా కీ జై’ అనే నినాదాన్ని అందుకుంటుంది. -
పక్షులు డైనోసార్ల వంశమా?
డైనోసార్లకు సంబంధించిన విషయాలను మనం వింటూనే ఉంటాం. డైనోసార్లు భూమిపై మనుగడసాగించిన అతిపెద్ద జంతువులనే విషయం మనకు తెలిసిందే. సుమారు ఆరున్నర బిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ ఉల్క భూమిని తాకింది. ఫలితంగా డైనోసార్ల ఉనికి తుడిచిపెట్టుకుపోయింది. అయితే డైనోసార్ల వంశం ఇప్పటికీ భూమిపై ఇంకా సజీవంగా ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోతారు. ఇది వినడానికి వింతగా అనిపించినా ఇదే నిజం. పక్షులు డైనోసార్ల వంశం అని చెబుతారు. దీని వెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పక్షులు డైనోసార్ల వంశానికి చెందినవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనిని అనుసరించి చూస్తే డైనోసార్లు ప్రపంచం నుంచి పూర్తిగా అంతరించిపోలేదు. డైనోసార్లు, పక్షులు కలిసి జీవించడమే దీనికి కారణం. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతం అయ్యాయి. అయితే పక్షులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాయి. అయితే శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి ఎటువంటి ప్రామాణిక రుజువును ఇంకా అందించలేదు. దీనిని నిరూపించడానికి భిన్నమైన సిద్ధాంతాలను వెలిబుచ్చారు. డైనోసార్ల శరీర నిర్మాణం.. పక్షుల శరీర నిర్మాణాన్ని పోలివుంటుందని తెలిపారు. నాడు జరిగిన మహా విపత్తు నుంచి పక్షులు ఎలా బతికాయనేదానికి శాస్త్రవేత్తలు ఇంకా ఖచ్చితమైన కారణం కనుగొనలేదు. అయితే గ్రహశకలం భూమిని ఢీకొన్న తర్వాత దంతాలు లేని పక్షులు మాత్రమే జీవించాయని వారు చెబుతున్నారు. దీనికి సరైన సిద్ధాంతం ఇంకా వెలువడలేదు. ఈ సిద్ధాంతాలను శాస్త్రవేత్తలు తమ పరిశోధనల నేపధ్యంలో వెల్లడించారు. -
కోవిడ్ను మించిన వ్యాధి మనల్ని కబళిస్తుందా?
మొన్నటి వరకూ ప్రపంచాన్ని కోవిడ్-19 వణికించింది. దీని నుంచి కాస్త దూరవుతున్నామనేంతలోనే ఇప్పుడు మరొక ప్రాణాంతక వ్యాధి సమస్త మానవాళిని చుట్టుముట్టేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా త్వరగా వ్యాపించగల ఈ కొత్త వ్యాధికి ‘డిసీజ్ ఎక్స్’ అనే పేరు పెట్టారు. కరోనా మాదిరిగానే ఈ వ్యాధి కూడా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ప్రాణాలను కూడా మింగేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లోనే ఈ వ్యాధి పేరును మొదటిసారి ప్రకటించింది. భవిష్యత్తుకు ముప్పుగామారిన ఈ వ్యాధి విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తీవ్రంగా హెచ్చరించింది. 2019లో కోవిడ్-19 వేగంగా వ్యాపించడం వల్ల అనేక దేశాలలో బాధితులకు సహాయం చేయడానికి తగినంత మంది వైద్యులు, నర్సులు, మందులు, పరికరాలు అందుబాటులో లేక అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికీ కోవిడ్-19 ప్రపంచానికి పెద్ద సమస్యగానే ఉంది. కొందరు శాస్త్రవేత్తలు డిసీజ్ ఎక్స్ వ్యాధి నుంచి మానవాళిని రక్షించేందుకు వ్యాక్సిన్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. కోయలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ అనే గ్రూప్ వ్యాక్సిన్ తయారీకి కృషిచేస్తోంది. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ కొత్త వ్యాధి గురించి సమగ్రంగా తెలుసుకున్న తర్వాత వ్యాక్సిన్లను తయారీ సులభమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంచనాలకు అందని డిసీజ్ ఎక్స్ డిసీజ్ ఎక్స్ ఎంత ఘోరంగా ఉండనుందో ఇప్పటికీ శాస్త్రవేత్తలు అంచనావేయలేకపోతున్నారు. ఇది తేలికపాటి జలుబు మాదిరిగా ఉండవచ్చు లేదా కోవిడ్-19 కంటే చాలా ప్రాణాంతకం కావచ్చని వారు భావిస్తున్నారు. ఏ సూక్ష్మక్రిమి దీనికి కారణంగా నిలుస్తున్నదో, దానిని ఏ విధంగా కనుగొనాలో, ఎటువంటి చికిత్స అందించాలో వైద్యులకు కూడా అంతుచిక్కడం లేదు. అందుకే ఈ వ్యాధి విషయంలో అప్రమత్తత అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. డిసీజ్ ఎక్స్ వ్యాధి సోకిన బాధితుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఆ డ్రాప్స్ ద్వారా వ్యాధి వ్యాపించవచ్చు. బాధితుడు తాకిన వస్తువులపై నిలిచిన సూక్ష్మక్రిములు ద్వారానూ ఈ వ్యాధి సంక్రమించవచ్చు. ఈ వ్యాధి క్రిములను మోసే కీటకాల నుంచి కూడా వ్యాప్తి చెందవచ్చంటున్నారు వైద్య శాస్త్రవేత్తలు. జంతువుల నుంచి.. డిసీజ్ ఎక్స్ అనేది కోతులు, కుక్కలు తదితర జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో సమాచారం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఒక ఊహాజనిత వ్యాధి. దీని కారణంగా ప్రపంచం మొత్తం మీద తీవ్రమైన అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. రాబోయే కాలంలో జంతువుల నుంచి మానవులకు సోకే పలు రకాల వ్యాధుల్లో ఇదీ ఒకటి కానుంది. అంటువ్యాధులను వ్యాప్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెబుతోంది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న పలు వైరస్లు గతంలో కంటే వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, ఇవి మనుషులపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. వాటిలో ఏదైనా వైరస్ మహమ్మారిగా రూపాంతరం చెందవచ్చని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. డిసీజ్ ఎక్స్ సోకినపుడు బాధితునికి జ్వరం, నరాల తిమ్మిరి, మెడ నొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, వికారం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ వ్యాధి వ్యాపిస్తే కోవిడ్ను మించిన ప్రమాదం వాటిల్లవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే ప్రతీఒక్కరూ పరిశుభ్రత, పోషకాహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. -
వామ్మో..నిమిషానికి అన్నికోళ్లను లాగించేస్తున్నామా? షాకింగ్ వీడియో
ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగంపై తాజాగా షాకింగ్విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది ఏకంగా 10 వేల కోట్ల జంతువులను మాంసంగా లాగించేస్తున్నారట. దీనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మానవులు బిలియన్ల కొద్దీ జంతువులను ఆరగించేస్తున్నారు. ఇందులో కోళ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రతిరోజూ 205 మిలియన్ల కోళ్లను తినేస్తున్నారంటే చికెన్కున్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రతి నిమిషానికి లక్షా 40వేలకు పైగా కోళ్లు మానవులకు ఆహారంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా పంది స్థానంలో పౌల్ట్రీ కోడి మాంసం వినియోగం బాగా పెరిగింది. గతంలో 12 శాతంగా ఉన్న వీటి (కోడి, బాతు, గూస్, టర్కీ కోడి మాసం) మాంసం వినియోగం వాటా ప్రపంచవ్యాప్తంగా తినే మొత్తంలో మూడింట ఒక వంతు పెరిగింది. ఏ దేశంలో మాంసాన్ని ఎక్కువగా తింటున్నారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) తన నివేదిక ప్రకారం అత్యంత ప్రజాదరణ పొందిన రెడ్ మీట్, గొడ్డు మాంసం, గత 50 ఏళ్లలో దాని ప్రపంచ వాటా దాదాపు సగానికి పడిపోయి 22 శాతానికి చేరింది. కానీ ఇది ఇప్పటికీ గొర్రె మాంసం కంటే దీని వినియోగం దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. ఈ డిమాండ్లో ఎక్కువ భాగం చైనా వంటి మధ్య ఆదాయ దేశాల నుండి వచ్చిందని, ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందడంతో ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం వినియోగదారుగా నిలిచింది చైనా. మరోవైపు ఐరోపా, ఉత్తర అమెరికాలో గతంతో పోలిస్తే వినియోగం మాంసం నియంత్రణలో ఉండగా, కొన్ని ప్రాంతాలలో బాగా తగ్గింది కూడా. భారత్ ఎక్కడ? జనాభాపరంగా చైనాను వెనక్కినెట్టి గత ఏడాది భారతదేశం ముందుకు దూసుకు వచ్చింది. కానీ ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగంలో మాత్రం చాలా వెనుకబడి ఉండటం గమనార్హం. Unbeliavable! Total number of animals eaten by people globally🧐 pic.twitter.com/dB1TOklZAv — Tansu Yegen (@TansuYegen) January 21, 2024 -
మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం!
అయోధ్యలోని నూతన రామాలయంలో నేడు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న నేపధ్యంలో దేశం మొత్తం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. అయోధ్యలో మారుమోగుతున్న హర్షధ్వానాల ధ్వని ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగే అద్భుత క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. హిందువులే కాదు ఇతర మతాల వారు కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. 50కి పైగా దేశాలలో వివిధ మాధ్యమాల సాయంతో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకను చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. లండన్ వీధుల్లో జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటుతుండగా, బ్రిటన్లో నిర్వహించిన కారు ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ దేశంలోని సుమారు 250 దేవాలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నేపాల్లో.. నేపాల్లోని జనక్పూర్లో గల జానకీమాత ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. జనక్పూర్ మేయర్ మనోజ్ కుమార్ సాహా.. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా అయోధ్యవాసులకు శుభాకాంక్షలు తెలిపారు నేపాల్కు భారత్తో సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. శ్రీరాముని అత్తమామల స్వస్థలం అయిన జనక్పూర్లో నేడు దీపోత్సవం జరగనుంది. ఇది కూడా చదవండి: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి? కెనడాలో.. కెనడాలోని అంటారియో పరిధిలోగల ఓక్విల్లే, బ్రాంప్టన్ నగరాల్లో నేటి రోజును ‘అయోధ్య రామ మందిర దినోత్సవం’గా ప్రకటించాయి. బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్, ఓక్విల్లే మేయర్ రాబ్ బర్టన్ మాట్లాడుతూ అయోధ్యలో జరిగే శ్రీరామ మందిర ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు సాంస్కృతికంగా, చారిత్మాకంగా ఎంతో ముఖ్యమైనదని అన్నారు. శతాబ్దాల నాటి కల సాకరమయ్యిందని మేయర్లిద్దరూ పేర్కొన్నారు. మారిషస్లో.. ద్వీప దేశమైన మారిషస్లోని అన్ని దేవాలయాలు ‘ప్రాణప్రతిష్ఠ’ సందర్బంగా దీపాలతో వెలుగులు పంచనున్నాయి. 48 శాతం హిందూ జనాభా ఉన్న మారిషస్లోని అన్ని దేవాలయాల్లో రామాయణ పారాయణం జరగనున్నది. హైకమిషనర్ హేమండోయిల్ దిలామ్ మాట్లాడుతూ ఈ ఉత్సవం భారతదేశానికే కాకుండా మారిషస్ ప్రజలకు కూడా ఎంతో ముఖ్యమైనదని అన్నారు. మారిషస్ ప్రభుత్వం నేడు హిందూ ఉద్యోగులకు రెండు గంటల సెలవులు ఇచ్చింది. ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు మారిషస్లోని 100 ప్రదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇది కూడా చదవండి: ప్రాణ ప్రతిష్ఠను ‘ప్రత్యక్షం’గా చూడటమెలా? డెన్మార్క్లో.. డెన్మార్క్లోని హిందూ స్వయంసేవక్ సంఘ్.. అయోధ్యలోని రామ మందిరంలో జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ట వేడుక సందర్భంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. డానిష్ అంబాసిడర్ పూజా కపూర్ మాట్లాడుతూ ఈ వేడుక సందర్భంగా భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయారన్నారు. దీర్ఘకాలంగా కొనసాగిన రామాలయ వివాదాన్ని పరిష్కరించి, ఆలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారికి అయోధ్య అక్షతలు పంపిణీ చేశారు. న్యూజిలాండ్లో.. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా న్యూజిలాండ్ రెగ్యులేషన్ మంత్రి డేవిడ్ సేమౌర్ మాట్లాడుతూ ‘జై శ్రీరామ్... ప్రధాని నరేంద్ర మోదీ సహా భారతీయులందరికీ అభినందనలు. 500 ఏళ్ల తర్వాత రామ మందిర నిర్మాణం సాధ్యమైంది. ప్రధాని మోదీ నాయకత్వమే దీనికి కారణం. ఈ ఆలయం చాలా గొప్పది. రాబోయే వెయ్యి సంవత్సరాల పాటు నిలిచివుంటుంది. ప్రధాని మోదీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. భారతదేశంలోని కోట్లాదిమంది ప్రజలు మోదీకి అండగా నిలిచారు’ అని పేర్కొన్నారు. ఫ్రాన్స్లో.. ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని ఈఫిల్ టవర్ కూడా ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకలకు ముస్తాబయ్యింది. ఫ్రాన్స్లోని ప్యాలెస్ డి లా చాపెల్లో నేటి మధ్యాహ్నం 12 గంటలకు భారీ రథయాత్ర బయలుదేరనుంది. ఈఫిల్ టవర్ సమీపంలోని ప్యాలెస్ డి ట్రోకాడెరో సమీపంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ రథయాత్ర ముగియనుంది. దీనికి ముందు ఉదయం 10.30 గంటలకు లా చాపెల్లే సమీపంలో విశ్వకళ్యాణ యాగం నిర్వహించనున్నారు. థాయ్లాండ్లో.. భారతదేశానికి 3,500 కిలోమీటర్ల దూరంలోని థాయ్లాండ్లోనూ మరో అయోధ్య ఉంది. దీనిని ఆ దేశంలో ‘అయుతయ’ అని పిలుస్తారు. బ్యాంకాక్లోని విశ్వహిందూ పరిషత్ సభ్యులు అయుతయతో సహా థాయ్లాండ్లోని అన్ని హిందూ దేవాలయాలలో రామ మందిర ప్రతిష్టాపన వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. దేశంలోని పలు నగరాల్లో ‘అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. -
ప్రపంచ నగరిగా అయోధ్య
సాక్షి, హైదరాబాద్: అయోధ్య.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపొందిన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు ఆ ఆధ్యాత్మిక నగరి ముస్తాబైంది. సోమవారం జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పలు దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు కూడా. ప్రపంచవ్యాప్తంగా పేరున్న చారిత్రక కూడళ్లలో భారీ తెరలు ఏర్పాటు చేసి మరీ ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఈ ఘనత ఇక్కడికే పరిమితం కాకుండా.. అయోధ్యను ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. రూ.85 వేల కోట్లతో అభివృద్ధి పనులు కొత్త రామాలయ నిర్మాణ ప్రారంభానికి ముందు అయోధ్యకు నిత్యం సగటున 2వేల మంది భక్తులు వచ్చేవారు. పనులు ప్రారంభమయ్యాక ఆ సంఖ్య 50 వేలకు చేరింది. జనవరి ఒకటిన 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఆలయంలో దర్శనాలు మొదలయ్యాక నిత్యం లక్ష మంది వరకు వస్తారని.. క్రమంగా 3 లక్షల వరకు పెరగవచ్చని అంచనా. ఇప్పుడు ఇరుకుగా ఉన్న అయోధ్య అంత తాకిడిని తట్టుకోలేదని తేల్చిన ప్రభుత్వ యంత్రాంగం.. 2031 లక్ష్యంగా ప్రత్యేక మాస్టర్ప్లాన్ సిద్ధం చేసింది. ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్ దీక్షు కుక్రేజా ఆధ్వర్యంలో దీనిపై విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేశారు. ప్రపంచస్థాయి నగరంగా అయోధ్యను రూపొందించటమే తమ లక్ష్యమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు కూడా. నగరాన్ని భారీగా విస్తరించి.. కొత్త మాస్టర్ ప్లాన్లో అయోధ్య పట్టణం, దానికి జంటగా ఉన్న ఫైజాబాద్తోపాటు సమీపంలోని దాదాపు 26 గ్రామాలను చేర్చి.. 875 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆధునిక అయోధ్యను తీర్చిదిద్దబోతున్నారు. ఇందులో భాగంగా 1,200 ఎకరాల్లో రూ.2,200 కోట్ల వ్యయంతో న్యూఅయోధ్య పేరుతో భారీ టౌన్షిప్ పనులను ఇప్పటికే మొదలుపెట్టారు. ఇది సరయూ నది కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. అందులో ఇటీవల హోటల్ కోసం ఓ ప్లాట్ను వేలం వేయగా చదరపు మీటరుకు రూ.1,09,000 చొప్పున ధర పలకడం గమనార్హం. ఇలాంటి మరికొన్ని టౌన్షిప్లకూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ► అయోధ్య పాత పట్టణంలో ఇప్పటికే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు పనులు ప్రారంభించారు. ప్రధాన రోడ్లను వెడల్పు చేస్తున్నారు. రామాలయానికి దారితీసే మూడు ప్రధాన మార్గాలను ఇప్పటికే విస్తరించారు. రూ.33 కోట్లతో ఓ మల్టీలెవల్ పార్కింగ్ను అందుబాటులోకి తెచ్చారు. ► పట్టణంలో డీజిల్ ఆటోలకు బదులు 250 ఎలక్ట్రిక్ ఆటోలు తిప్పుతున్నారు. విమానాశ్రయం నుంచి పట్టణానికి, ఆలయం వద్దకు తిప్పేందుకు 250 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేశారు. వాటి సంఖ్యను 500కు పెంచబోతున్నారు. ► అయోధ్య పట్టణం నుంచి వెలువడే మురికినీరు సరయూ నదిలోకి చేరుతోంది. దాన్ని పూర్తిగా నిరోధించి, మురికి నీటి శుద్ధికోసం ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీల)ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఎస్టీపీ అందుబాటులోకి రాగా.. మరో రెండింటి పనులు జరుగుతున్నాయి. సోలార్ సిటీగా అయోధ్య అయోధ్యలో సౌర విద్యుత్ వి్రస్తృత వినియోగం కోసం ఐదేళ్ల కాలపరిమితితో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమల రూఫ్ టాప్పై సౌర ఫలకాలను అమరుస్తున్నారు. వీటితో 8.5 మెగావాట్ల విద్యుత్ సమకూరనుంది. ఇక సరయూ నది తీరంలో 40మెగావాట్ల సోలార్ ప్లాంట్ను ఎనీ్టపీసీ ఏర్పాటు చేస్తోంది. ఇందులో 10 మెగావాట్ల ప్లాంటు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ► అయోధ్య శివార్లలో సరయూ తీరం వెంట 12.90 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారిపై సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత నిడివిలో సోలార్ లైట్లు ఉండటం రికార్డు అని, దీనికి గిన్నిస్బుక్లో చోటు దక్కనుందని యూపీ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. ► సౌర ఫలకాలతో కూడిన ‘సోలార్ ట్రీ’లను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. 1 కేవీ సామర్థ్యం ఉన్నవి 40.. 2.5 కేవీ సామర్థ్యం ఉన్నవి 18 సిద్ధమవుతున్నాయి. తాగునీటి కియోస్్కలు, మొబైల్ఫోన్ చార్జింగ్ పాయింట్లు ఈ విద్యుత్తోనే పనిచేయనున్నాయి. ► సరయూ నదిలో సౌర విద్యుత్తో పనిచేసే పవర్ బోట్లను అందుబాటులోకి తెస్తున్నారు. ప్లాస్టిక్ నుంచి ఇంధనం అయోధ్యలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వాహనాల ఇంధనంగా మార్చే రీసైక్లింగ్ యూనిట్ త్వరలో అందుబాటులోకి రానుంది. అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్తో కుదిరిన ఒప్పందం మేరకు బెంగుళూరుకు చెందిన సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది ఏటా 7,300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను ఇంధనంగా మార్చగలదు. ఉత్తర భారతంలో ఈ తరహా అతిపెద్ద ప్లాంటు ఇదే కానుంది. విస్తృతంగా వసతి సౌకర్యాలు అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున హోటల్ పరిశ్రమ కూడా విస్తృతమవుతోంది. దేశవ్యాప్తంగా ఫైవ్స్టార్ హోటళ్లను నిర్వహిస్తున్న ఓ పెద్ద సంస్థ 120 గదులతో ఒకటి, 100 గదులతో మరోటి చొప్పున రెండు స్టార్ హోటళ్ల నిర్మాణ పనులు ప్రారంభించింది. చిన్న, మధ్యస్థాయి హోటళ్లు, భోజన వసతి ఇళ్లను నిర్వహించే మరో కంపెనీ.. వెయ్యి గదులతో కూడిన 50 హోటళ్లను, భోజన నివాసాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరికొన్ని సంస్థలు 1,100 గదులతో కూడిన హోటళ్లను నిర్మించనున్నాయి. దేశవ్యాప్తంగా ఆకాశహరŠామ్యలు నిర్మిస్తున్న బడా సంస్థ 51 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,500 కోట్లతో లగ్జరీ విల్లాలు, సాధారణ ఇళ్లు, హోటళ్లను నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకుంది. -
శిఖరాలూ.. సలాం కొట్టాయ్!
బోణం గణేష్, సాక్షి ప్రతినిధి: సముద్రమట్టానికి వేల మీటర్ల ఎత్తు.. సహకరించని వాతావరణం.. అడుగడుగునా పొంచి ఉన్న ప్రమాదాలు.. గజగజలాడించే మంచు.. కానీ అతని సంకల్పానికి ఆ మహామహా శిఖరాలే తలవంచాయి. మార్షల్ ఆర్ట్స్లో అతని పట్టుదలకు అంతర్జాతీయ పతకాలు వరించాయి. ప్రపంచంలోని ఏడు అతిపెద్ద శిఖరాలను అధిరోహించిన అతని పేరు.. భూపతిరాజు అన్మీష్ వర్మ. విశాఖపట్నానికి చెందిన అన్మీష్ వర్మ తాను అధిరోహించిన ప్రతి పర్వతంపైనా జాతీయ జెండాతో పాటు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాల జెండాను ఎగురవేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అన్మీష్ గురించి విశేషాలు ఆయన మాటల్లోనే.. సరదాగా మొదలై.. శిఖరాల అంచులకు ఎగసి చిన్నప్పుడు విశాఖపట్నంలోని కొండలను సరదాగా ఎక్కేవాడిని. ఆ ఆసక్తే ఎవరెస్ట్ గురించి తెలుసుకునేలా చేసింది. దానిపైకి ఎక్కడం కష్టమని.. అధిరోహించడానికి వెళ్లిన వారు చనిపోతే శవాన్ని తేవడం కూడా కష్టమేనని తెలుసుకున్నాక దానిపైకి ఎలాగైనా ఎక్కాలని నిర్ణయించుకున్నాను. ఎవరెస్ట్ను అధిరోహించేందుకు విజయవాడలో ప్రభుత్వం సెలక్షన్స్ నిర్వహిస్తోందని తెలుసుకుని.. నేనూ వెళ్లాను. అప్పుడు వందల మంది వచ్చారు. కానీ నాతో పాటు ఐదుగురే ఎంపికయ్యారు. లేహ్, లడఖ్లో ప్రాక్టికల్ టెస్ట్ పూర్తి చేసి.. ఎవరెస్ట్ను అధిరోహించడానికి అర్హత సాధించాను. మన దేశంలోనే అత్యంత వేగవంతమైన పర్వతారోహకుడిగా గుర్తింపు సంపాదించాను. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలను అధిరోహించిన ఏకైన వ్యక్తిగా గుర్తింపు లభించింది. నవరత్నాలతో పేదలకెంతో లబ్ధి.. అలాగే తొమ్మిదేళ్లకే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నాను. ప్రపంచ చాంపియన్షిప్లలో మెడల్స్ సాధించాను. వరుసగా మూడు మెడల్స్ సాధించి రికార్డ్ సృష్టించాను. మా నాన్న వేణుగోపాలరాజు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కొన్నాళ్లు విధులు నిర్వర్తించి.. ఆ తర్వాత లారీ డ్రైవర్గా పనిచేశారు. 2014లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. నాన్న పోయిన 18 రోజులకు ఇంగ్లండ్లో కరాటే ప్రపంచ చాంపియన్షిప్కు వెళ్లి పతకం సాధించాను. ఇప్పుడు నేనే మన దేశ కరాటే టీమ్కు కోచ్గా ఉన్నాను. రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలు నాకెంతో నచ్చాయి. ఎంతోమంది పేదలకు వాటి ద్వారా లబ్ధి చేకూరుతోంది. అందుకే ఆ పథకాల లోగో ఉన్న జెండాను మన దేశ జెండాతో పాటు ప్రపంచ శిఖరాలపై ఎగురవేస్తుంటాను. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో గ్రామీణ యువత, విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం. బతికిరావడమూ కష్టమే.. అడ్వెంచర్ గ్రాండ్ స్లామ్.. అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన వారికి ఆ గ్రాండ్ స్లామ్ టైటిల్ లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ టైటిల్ దక్కించుకున్న వారి సంఖ్య 30లోపే ఉంటుంది. అంత గొప్ప టైటిల్ నాకు లభించింది. ఎవరెస్టు, ఎల్బ్రస్, కిలీమంజారో, దెనాలి, అకాంగువా, మౌంట్ విన్సన్, కోస్కియోస్కోను అధిరోహించాను. అలాగే మైనస్ డిగ్రీల సెల్సియస్లలో.. భూమి నార్త్, సౌత్ పోల్ 90 డిగ్రీల అక్షాంశానికి చేరుకున్నాను. అదో పెద్ద సాహసం. తేడా వస్తే బతికిరావడం కష్టం. ఆ చలికి రక్తం గడ్డకడుతుంది. ఒకసారి ఎవరెస్ట్ను అధిరోహిస్తున్నప్పుడు నా సహ పర్వతారోహకుడికి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టింది. ఆ పరిస్థితిలో అతన్ని వదిలేసి వెళ్లలేకపోయాను. అతన్ని కాపాడటం కోసం వెనక్కి తిరిగొచ్చేశాను. ఆ తర్వాత ఏడాది మళ్లీ ప్రయత్నించాను. ప్రాణాలకు తెగించి లక్ష్యాన్ని చేరుకున్నాను. -
ఆ ఊళ్లో అతనొక్కడే!.. ఇంకెవరూ ఉండరు!
ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే పిచ్చెక్కిపోతుంది. బాబోయ్! అనిపిస్తుంది. అలాంటిది ఎవ్వరూ ఉండని ఊరిలో ఒక్కడే ఉండటమా?. ఆ ఊహ కూడా ఇష్టపడం. కానీ ఇక్కడొక వృద్ధుడు ఒక్కడే ఒంటిరిగా నివశిస్తున్నాడు. ఈ విషయం గుప్పుమనడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. పైగా అతడిపై పలు కథనాలు వెలువడటంతో నెట్టింట అతడి కథ హాట్టాపిక్గా మారింది. ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరంటే.. ఎవరూ లేని ఆ ఊళ్లో అతనొక్కడే ఉంటున్నాడు. పాతికేళ్లుగా నీటమునిగిన ఆ ఊరు, తర్వాత అనావృష్టి పరిస్థితుల్లో శిథిలావస్థలో బయటపడింది. అప్పటి నుంచి ఈ పెద్దాయన ఒక్కడే ఒంటరిగా ఆ ఊళ్లో ఉంటున్నాడు. నీటమునిగి నరసంచారానికి దూరమైన ఆ ఊరి పేరు ఎపిక్యూయెన్. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిరిస్ ప్రావిన్స్ పరిధిలోని ఊరది. ఒకప్పుడు ఆ ఊరు పర్యాటకులను విశేషంగా ఆకర్షించేది. అప్పట్లో ఆ ఊళ్లో దాదాపు రెండువేల మంది ఉండేవారు. ఏటా ఐదువేల మందికి పైగా పర్యాటకులు వచ్చి వెళుతుండేవారు. దురదృష్టవశాత్తు ఆ ఊరికి చేరువలో ఉన్న డ్యామ్ 1985లో వచ్చిన వరదల కారణంగా ధ్వంసమైంది. ఊళ్లోకి నీరు చేరడంతో, ఊరు కనిపించకుండా పోయింది. పాతికేళ్లుగా ఈ ఊరు నీటి అడుగునే ఉంది. ఆ తర్వాత ఇక్కడ అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. నీరంతా ఆవిరైపోవడంతో 2009లో శిథిలావస్థలో ఉన్న ఊరు బయటపడింది. ఇదే ఊరికి చెందిన పాబ్లో నోవాక్ అనే ఈ పెద్దాయన తన ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడకు చేరుకున్నాడు. ఊళ్లో ఎవరూ లేకపోయినా, అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ వస్తున్నాడు. తొంబైమూడేళ్ల పాబ్లో నోవాక్ ఒంటరిగా బతుకుతున్న సంగతి ఇటీవల మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ‘ప్రపంచంలోని అత్యంత ఒంటరి మనిషి’గా అభివర్ణిస్తూ సీఎన్ఎన్ చానల్ ఇతడిపై ఒక కథనాన్ని ప్రసారం చేయడంతో మిగిలిన చానెళ్లు, పత్రికల్లోనూ ఇతడిపై కథనాలు వెలువడ్డాయి. (చదవండి: కితకితలు పెట్టగానే నవ్వు తన్నుకుంటూ ఎలా వస్తుందో తెలుసా! శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..) -
ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం! ఏకంగా 700 కార్లు..
ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబం. ఆ కుటుబంలోని వ్యక్తులంతా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వాళ్లు ఉండే ఫ్యాలెస్ ఏకంగా మూడు పెంటాగాన్ భవనాల పరిమాణంలో ఉంటుంది). సంతానం, తోబుట్లువులు కూడా ఎక్కువ మందే. పైగా అందరూ అత్యంత లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారు. ఆ కుటుంబ సభ్యులంతా ప్రముఖ కంపెనీలన్నింటిలో అత్యధిక శాతం వాటాలను కలిగి ఉన్నారు. ఇంతకీ ఆ అత్యంత ధనిక కుటుంబం ఏదంటే.. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కుటుంటం. ఆయన పేరులోని మొదటి అక్షరాలతో ఎంబీజెడ్గా పిలుస్తారు. ఈయనే కుటుంబ పెద్ద. అతని కుటుబమే అత్యంత ధనిక రాయల్ కుటుంబంగా ఉంది. ఆయనకు 11 మంది సోదరీమణులు, తొమ్మది మంది పిల్లలు, సుమారు 18 మంది దాక మనవళ్లు మనవరాళ్లు ఉన్నారు. ప్రపంచంలోని చమురు నిల్వల్లో దాదాపు ఆరు శాతం ఆ కుటుంబమే సొంతం చేసుకుంది. అలాగే మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ వంటి అనేక ప్రసిద్ధ కంపెనీల్లో అత్యధిక వాటా కలి ఉన్నారు. ఎలోన్ మస్క్ స్పెసఎక్స్ కంపెనీ నుంచి ప్రముఖ గాయకుడు బ్యూటీ బ్రాండ్ ఫెంటీ వంటి కంపెనీలన్నింటిలో ఈ రాయల్ కుటుంబ సభ్యులే వాటాలు కలిగి ఉన్నారు. అధ్యక్షుబు షేక్ మొహమ్మద్ బిన్ తమ్ముడు షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్కే ప్రపంచంలోని అతిపెద్ద ఎస్యూవీ, మెర్సిడెస్ బెంజ్, వంటి లగ్జరీ కార్లు దాదాపు 700 పైచిలుకు ఉన్నాయి. ఆ కుటుంబ సుమారు 94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద ప్యాలెస్లో నివశిస్తోంది. దాని విలువ నాలుగు వేల కోట్లు ఉంటుంది. ఆ కుటుంబానికి సంబధించని ప్రధాన ఇన్విస్టెమెంట్ కంపెనీకి ఆయన మరో సోదరుడు బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నిర్వహిస్తున్నారు. దీని విలువ గత ఐదేళ్లలో దాదాపు 2 లక్షల పర్సంటేజ్ వరకు పెరిగింది. ఐతే ప్రస్తుతం ఆ కంపెనీ విలువ లక్ష కోట్లు. ఇది వ్యవసాయం, ఇందనం, వినోదం, సముద్ర వ్యాపారాలు వంటివి నిర్వహిస్తుంది. సుమారు పదివేల మందికి ఉపాధి కూడా కల్పిస్తోంది. ఈ కుటుంబానికి యూఏఈలోనే కాకుండా పారిస్, లండన్తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అత్యంత లగ్జరీ ఆస్తులు ఉన్నాయి. ఈ యూఏఈ అధ్యక్షుడికి యూకేలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో పెద్దమొత్తంలో ఆస్తులు ఉండటంతో ఆయన్ని ‘ల్యాండ్ లార్డ్ ఆఫ్ లండన్’(లండన్ భూస్వామి) అని కూడా పిలుస్తారు. అంతేగాదు న్యూయార్క్ నివేదిక ప్రకారం 2015లో ఈ దుబాయ్ రాజకుటుంబం బ్రిటీష్ రాజ కుటుంబంతో సరితూగేలా ఆస్తులను కలిగి ఉందని పేర్కొంది. అతేగాదు 2008లో అధ్యక్షుడు ఎంబీజెడ్కి చెందిన అబుదాబి యునైటెడ్ గ్రూప్ యూకే ఫుట్బాల్ జట్టు మాంచెస్టర్ సిటీని సుమారు రెండు వేల కోట్లకు కొనుగోలు చేసింది. మాంచెస్టర్ సిటీ, ముంబై సిటీ, మెల్బోర్న్ సిటీ, న్యూయార్క్ సిటీ ఫుట్బాల్ క్లబ్లను నిర్వహిస్తున్న సిటీ ఫుట్బాల్ గ్రూపులో 81 శాతం ఈ అబుదాబి కంపెనీ యాజమాన్యంలోనే ఉంది. في كلّ ركنٍ قصة من وحي تاريخ دولة الإمارات العربية المتحدة! اكتشفوا قصص تراث الأمة الغني والعظيم وخططوا لزيارتكم إلى #قصر_الوطن اليوم. #في_أبوظبي pic.twitter.com/Uv4zQH6bXb — Qasr Al Watan (@QasrAlWatanTour) November 1, 2022 (చదవండి: అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని..57 ఏళ్ల క్రితమే ఊహించారా?) -
ప్రపంచంలో ఏకైక 10 స్టార్ హోటల్ ఎక్కడుంది?
బుర్జ్ అల్ అరబ్ ప్రపంచంలోనే ఏకైక టెన్ స్టార్ హోటల్. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంది. ఇది ఒక కృత్రిమ ద్వీపంలో ఉంది. బుర్జ్ అల్ అరబ్ ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన హోటళ్లలో ఒకటి. అయితే దాని ఎత్తులో 39 శాతం నివాసయోగ్యం కాదు. బుర్జ్ అల్ అరబ్ 1999 సంవత్సరంలో నిర్మితమయ్యింది. దీని నిర్మాణానికి ఒక బిలియన్ డాలర్లు (రూ. 8330 కోట్లు)కు మించి ఖర్చయింది. ఈ కృత్రిమ ద్వీపం జుమేరా బీచ్కు 280 మీటర్లు (920 అడుగులు) దూరంలో ఉంది. బుర్జ్ అల్ అరబ్ ఒక ప్రైవేట్ వంతెన ద్వారా ప్రధాన భూభాగానికి అనుసంధానమై ఉంది. దీనిని ఓడకు గల తెరచాపను పోలివుండేలా నిర్మించారు. దీని పైకప్పుపై హెలిప్యాడ్ కూడా ఉంది. ఇది భూమి నుండి 210 మీటర్లు (689 అడుగులు) ఎత్తులో ఉంది.బుర్జ్ అల్ అరబ్ జుమేరాలో రోజువారీ గది ధర రూ. రూ. 2,58,679 నుండి రూ. 1,055,372 వరకు ఉంది. సందర్శకులు ప్రత్యేక హెలికాప్టర్ సర్వీస్ లేదా రోల్స్ రాయిస్ ద్వారా హోటల్కు చేరుకోవచ్చు. దీనిలోని అన్ని సూట్లలో అరేబియా గల్ఫ్ అందాలు కనిపించేలా కిటికీలు ఉంటాయి. ఈ సూట్లలో ఉచిత వైఫై, వైడ్ స్క్రీన్ ఇంటరాక్టివ్ హెచ్డీ టీవీ, రియాక్టర్ స్పీకర్, ఇతర ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. బుర్జ్ అల్ అరబ్ జుమేరాలో ఎనిమిది రెస్టారెంట్లు, ఒక స్పా, పలు సీ వ్యూ గదులు ఉన్నాయి. అలాగే రూఫ్టాప్ బార్, రెండు స్విమ్మింగ్ పూల్స్, 32 గ్రాండ్ కాబానాస్, ఒక రెస్టారెంట్ ఉన్నాయి. -
సౌర వ్యవస్థలో గ్రహాలెన్ని? తొమ్మిదా? ఎనిమిదా?
మన సౌర కుటుంబంలోని గ్రహాలు ఎన్ని? తొమ్మిది అని.. అవి బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, ఫ్లూటో.. అని వెంటనే చెప్పేముందు ఒకసారి ఆగండి.. గతంలో గ్రహానికున్న లక్షణాలు లేవంటూ ఫ్లూటోను ఆ లిస్టులోంచి తీసేశారు. కొన్నేళ్ల కిందట శాస్త్రవేత్తలు..గ్రహాలకు సంబంధించిన గుర్తింపునకు దాని పరిమాణం, ఆకృతి, కక్ష్య తదితర నిబంధనలు రూపొందించారు. ఈ లక్షణాలలో కొన్నింటికి అనుగుణంగా ఫ్లూటో లేకపోవడంతో దానిని గ్రహాల లిస్టు నుంచి తొలగించి.. మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు. ఖగోళ శాస్త్రవేత్తలు 1990ల ప్రారంభంలో సౌరకుటుంబంలోని నెప్ట్యూన్కు మించిన ఖగోళ పదార్థాలను కనుగొన్నారు. వీటిని ట్రాన్స్-నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్ (టీఎన్ఓఎస్) అని పిలుస్తారు. ఇవి సౌర వ్యవస్థ అంచున ఉన్న కైపర్ బెల్ట్ను కలిగి ఉంటాయి. కైపర్ బెల్ట్ అనేది మన సౌర వ్యవస్థలో ఒక భాగం. ఇది సూర్యుని నుండి దాదాపు 30 నుండి 50 ఖగోళ యూనిట్ల దూరంలో విస్తరించి ఉంది. 2005లో ‘ఎరిస్’(మరగుజ్జు గ్రహం)ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది దాదాపుగా ప్లూటోతో సమానమైన పరిమాణంలో ఉంది. కానీ దీనిని గ్రహంగా పరిగణించరాదనే వాదనను బలపడింది. సమయం గడిచేకొద్దీ శాస్త్రవేత్తలు విశ్వం అంతటా గ్రహాలు సమృద్ధిగా ఉన్నాయని కనుగొన్నారు. దీంతో అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సమాఖ్య 2006లో గ్రహం అనే పదానికి సరికొత్త నిర్వచనం అవసరమని నిర్ణయించింది. సౌర వ్యవస్థలోని గ్రహం నిర్వచనం కోసం వారు మూడు ప్రమాణాలను సూత్రీకరించారు. ఒక గ్రహం అనేది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి. అది తప్పనిసరిగా గురుత్వాకర్షణ శక్తి కలిగి గుండ్రంగా ఉండాలి. అలాగే ఆ గ్రహం తన కక్ష్యలోని శిధిలాల మార్గాన్ని క్లియర్ చేయడానికి సొంత గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉండాలి. దీని ప్రకారం ప్లూటో మొదటి రెండు ప్రమాణాలను కలిగి ఉంది. మూడవ లక్షణం దానిలో లేదు. అందుకే ప్లూటో, ఎరిస్లతో పాటు ఇతర ట్రాన్స్-నెప్ట్యూనియన్ పదార్థాలను ‘మరగుజ్జు గ్రహాలు’గా వర్గీకరించారు. ఇప్పుడు సౌర వ్యవస్థలో గ్రహాలు ఎన్ని అనేదానికి సమాధానం చెప్పాల్సివస్తే అవి ఎనిమిది అని చెప్పాలి. ఇంతకుమించి ఏమున్నాయనే విషయానికొస్తే ప్రస్తుతం ధృవీకరించిన ఎక్సోప్లానెట్ల సంఖ్య ఐదు వేలకుపైగానే ఉంది. -
డిసెంబరులో కరోనాతో 10 వేలమంది మృతి!
కరోనా ఇన్ఫెక్షన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్నాయి ప్రత్యేకించి కరోనా జెఎన్.1 వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. సింగపూర్, అమెరికాలో కరోనా వేవ్ అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. భారతదేశంలో కూడా గడచిన 50 రోజుల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలోనే పెరిగాయి. ఇటీవలి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల్లో జనం జాగ్రత్తలు పాటించకపోవడంవల్ల ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ మరింతగా విస్తరించిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్ఓ) డైరెక్టర్ జనరల్గా టెడ్రోస్ అధనామ్ తెలిపారు. గత డిసెంబర్లో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేలమంది మరణించారని పేర్కొన్నారు. 50 దేశాల నుంచి అందిన డేటా ప్రకారం ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య కూడా 42 శాతం మేరకు పెరిగిందన్నారు. భారతదేశంలో కూడా కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని, ప్రతిరోజూ సగటున 600 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 514 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,422. దీనికిముందు అంటే బుధవారం కొత్తగా 605 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కారణంగా రోజుకు సగటున ఐదుగురు మృత్యువాత పడుతున్నారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. -
వామ్మో 2023!
భూతాపం విషయంలో 2023 కనీవినీ ఎరగని రికార్డు సృష్టించింది. అత్యంత వేడిమి డిసెంబర్ నెల ముగియక ముందే 2023 రికార్డులకెక్కడం తెలిసిందే. అయితే చరిత్రలో ఇప్పటిదాకా అత్యధికంగా 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల నమోదైన ఏడాదిగా 2023 నిలిచింది! 2016 నాటి రికార్డు కంటే ఇది ఏకంగా 0.17 డిగ్రీలు అధికం! అదే 1991–2020 మధ్య 20 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏకంగా 0.6 డిగ్రీలు ఎక్కువ!! గతేడాదికి సంబంధించిన ఉష్ణోగ్రతల గణాంకాలను క్షుణ్నంగా విశ్లేషించిన మీదట యూరోపియన్ యూనియన్ వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్ మంగళవారం విడుదల చేసిన నివేదిక ఈ మేరకు పేర్కొంది. అంతేకాదు, 2023 రెండో అర్ధ భాగంలో దాదాపుగా ప్రతి రోజూ ఎండ తీవ్రతలో కొత్త రికార్డులు నెలకొల్పినట్టు తేల్చింది! ఇది నిజంగా భయానక పరిణామమేనని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... – సాక్షి, నేషనల్ డెస్క్ 2023 నవంబర్ 17. భూ ఉష్ణోగ్రతలో ఏకంగా 2.06 డిగ్రీల పెరుగుదల నమోదైన తేదీ! మానవ చరిత్రలో ఉష్ణోగ్రతల పెరుగుదలను రికార్డు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచీ అత్యధిక పెరుగుదల అదే! అలా మానవాళి చరిత్రలో ఓ దుర్దినంగా నవంబర్ 17న నిలిచిపోయింది. తర్వాత అదే నెలలో మరోసారి ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీలను దాటేసింది. దాంతో పర్యావరణవేత్తల్లో గగ్గోలు మొదలైంది. కానీ 2023 రెండో భాగంలో, అంటే జూలై నుంచి డిసెంబర్ దాకా ప్రతి రోజూ ఎండలు కనీవినీ ఎరగని రీతిలో ప్రపంచాన్ని అల్లాడించాయని కోపర్నికస్ తాజా నివేదిక తేల్చింది. పైగా 2023లో 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవడమూ భయపెట్టే పరిణామమే. భూ ఉష్ణోగ్రతలో పెరుగుదలను పారిశ్రామికీకరణనాటి తొలినాళ్లతో, అంటే 1850–1900 సంవత్సరాల మధ్య కాలపు సగటుతో పోల్చి చెబుతారు. అప్పటితో పోలిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 1.5 డిగ్రీల కంటే దిగువకు కట్టడి చేయాలన్నది 2015 నాటి పారిస్ ఒప్పందంలో ప్రపంచ దేశాలన్నీ సంయుక్తంగా చేసుకున్న తీర్మానం. కానీ 2023లో సగటు ఉష్ణోగ్రత పెరుగుదల దాదాపుగా ఆ లక్ష్మణరేఖను తాకింది. 1850తో పోలిస్తే గతేడాది ప్రతి రోజూ ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది! 2015లో తొలిసారిగా ఒక్క రోజు ఇలా 1 డిగ్రీ పెరుగుదల నమోదైతేనే ప్రపంచమంతా విస్మయపడింది. అది కాస్తా కేవలం ఏడేళ్లకే రోజువారీ పరిణామంగా మారిపోయింది. పైగా సగటు పెరుగుదలే దాదాపుగా 1.5 డిగ్రీలను తాకేసింది. గ్లోబల్ వారి్మంగ్ అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోందనేందుకు ఇంతకు మించిన తార్కాణం అవసరం లేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన 2024లో ఉష్ణోగ్రత సరికొత్త రికార్డులు సృష్టించి భూగోళాన్ని మరింత వినాశనం దిశగా నెట్టడం ఖాయమని తాజా నివేదికలో కోపర్నికస్ కూడా అంచనా వేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జూన్లోపే సగటు భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటేస్తే ఆశ్చర్యం లేదని అది అభిప్రాయపడింది. అదే జరిగితే భూమిపై కీలక పర్యావరణ వ్యవస్థల్లో చాలావరకు అంతటి తాపాన్ని తట్టుకోలేవు. అప్పుడిక ప్రపంచంలో ఒకవైపు తీవ్ర కరువులు, కార్చిచ్చులు, మరోవైపు భయంకరమైన తుపాన్లు నిత్య సమస్యలుగా మారిపోతాయి. గతేడాది అమెరికా, కెనడా, హవాయి, దక్షిణ యూరోప్ల్లో నిత్యం కార్చిచ్చులు చెలరేగడం, పలు దేశాలు కనీవినీ ఎరగని వరదలతో, గడ్డకట్టించే చలి పరిస్థితులతో అతలాకుతలం కావడం తెలిసిందే. వాతావరణ మార్పులు, ఎల్ నినో... 2023 ఇంతగా మండిపోవడానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని కోపర్నికస్ నివేదిక స్పష్టం చేసింది. దానికి తోడు గతేడాది జూలైకల్లా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నెలకొన్న ఎల్ నినో (కరువు) పరిస్థితులు పరిస్థితిని మరింత దిగజార్చినట్టు వివరించింది. ఫలితంగా పసిఫిక్ మొదలుకుని ప్రతి మహాసముద్రమూ ఎప్పుడూ లేనంతగా వేడెక్కినట్టు పేర్కొంది. 1991–2020 సగటుతో పోలిస్తే 2023లో సముద్రాల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల ఏకంగా 0.44 డిగ్రీలుగా నమోదైంది! దాంతో మంచు ప్రాంతాలైన ఆర్కిటిక్, అంటార్కిటికాలపై దీని ప్రభావం విపరీతంగా పడటం మొదలైంది. అక్కడి మంచు ఎన్నడూ లేనంతగా కొన్నాళ్లుగా శరవేగంగా కరిగిపోతోంది. ఈ దెబ్బకు సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరిగేలా కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత మహా నగరాలు చాలావరకు నీట మునుగుతాయి. అదే జరిగితే ప్రపంచంలో కనీసం మూడో వంతు జనాభా నిర్వాసితులుగా మారతారని అంచనా. ఊహించుకోవడానికే భయం కలిగే ఇలాంటి పరిణామాలెన్నో అతి త్వరలో జరిగేలా కనిపిస్తున్నాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రపంచంలో భారీ భూకంపం ఏది? తీవ్రత ఎంత?
జపాన్లో సంభవించిన భూకంపం అందరినీ వణికిస్తోంది. ఈ విపత్తు పరిణామాలు ఒక్కొక్కటిగా వెలికివస్తున్నాయి. నిజానికి జపాన్ను భూకంపాలకు కేంద్రంగా పరిగణిస్తుంటారు. ఇటీవల జపాన్లో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇప్పుటివరకూ ప్రపంచంలో సంభవించిన అత్యంత తీవ్రత కలిగిన భూకంపం చిలీలోని వాల్డివియాలో చోటుచేసుకుంది. 1960లో వాల్డివియాలో సంభవించిన భూకంపం దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగింది. ఇది చాలా తీవ్రమైనది. ఈ సమయంలో అక్కడ సునామీ కూడా సంభవించింది. ఈ భారీ భూకంపానికి సముద్ర ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. 9.5 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం చరిత్రలో భారీ భూకంపంగా నిలిచింది. చిలీ తీర ప్రాంతం వాల్డివియాలో 1960, మే 22న ఈ భూకంపం సంభవించింది. సాధారణంగా కొన్ని సెకన్ల పాటు సంభవించే భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తాయి. వాల్డివియాలో చోటుచేసుకున్న భూకంపం నగరంలో 10 నిమిషాలపాటు భయోత్పాతాన్ని సృష్టించింది. ఆ తర్వాత చాలా శక్తివంతమైన సునామీ వచ్చింది. ఇది పలు దేశాలకు సైతం వ్యాపించింది. ఈ భూకంపం కారణంగా వాల్డివియా నగరం మొత్తం ధ్వంసమైంది. ఈ నగరంలో జనాభా అంతగా లేనందున, ఈ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య ఆరు మాత్రమేనని చెబుతుంటారు. ఇంతటి తీవ్రతతో భూకంపం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇదే ఇప్పటివరకు సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపంగా పరిగణిస్తుంటారు. ఇది కూడా చదవండి: జపాన్లో భారీ భూకంపం.. 155సార్లు కంపించిన భూమి -
2023లో ‘ఉదయ్పూర్’ ఎందుకు మారుమోగింది?
2023కు జ్ఞాపకాలతో వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. నూతన సంవత్సరానికి ఉత్సాహంతో స్వాగతం పలికేందుకు మనమంతా సిద్ధం కావాల్సిన తరుణం వచ్చేసింది. అయితే 2023 రాజస్థాన్లోని ఉదయపూర్కు మంచి పేరును తెచ్చిపెట్టింది. దీనికితోడు 2023లో ఉదయపూర్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఇష్టమైన నగరంగా కూడా పేరు తెచ్చుకుంది. ఉదయ్పూర్ జీ-20ని స్వాగతించింది. రెండు భారీ డెస్టినేషన్ వెడ్డింగ్లు కూడా ఉదయపూర్లో జరిగాయి. ట్రావెల్ అండ్ లీజర్ 2023లో విడుదల చేసిన జాబితాలో ఉదయపూర్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఇష్టమైన నగరంగా పేరు తెచ్చుకుంది. పర్యాటకుల అభిరుచి, స్థానిక సంస్కృతి, ఆహారం, షాపింగ్, వివిధ పర్యాటక ప్రదేశాల ఆధారంగా నిర్వహించిన సర్వేలో ఉదయపూర్ నగరానికి 93.33 రీడర్ స్కోర్ లభించింది. ప్రపంచంలోని నలుమూలలకు చెందిన పర్యాటకులు ఉదయ్పూర్ను ఎంతగానో ఇష్టపడుతుంటారు. భారత్ అధ్యక్షతన తొలి జీ-20 సమావేశం ఉదయపూర్లో జరిగింది. రెండవ జీ-20 సస్టైనబుల్ ఫైనాన్స్ వర్కింగ్ గ్రూప్ (ఎస్ఎఫ్డబ్ల్యుజీ) సమావేశం కూడా ఇక్కడే జరిగింది. దీనిలో 90 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయపూర్ డెస్టినేషన్ వెడ్డింగ్లకు ప్రసిద్ధి చెందింది. 2023లో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా ఇక్కడే వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్లో జరిగిన వీరి వివాహానికి సినీ పరిశ్రమకు చెందిన తారలే కాకుండా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా హాజరయ్యారు. భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ప్రేమికుల రోజున ఉదయపూర్లో నటాషాను వివాహం చేసుకున్నారు. స్టార్ హోటల్ రాఫాల్లో క్రైస్తవ ఆచారాల ప్రకారం జరిగిన ఈ వివాహానికి హార్దిక్ కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇది కూడా చదవండి: అయోధ్య విమానాశ్రయం విశేషాలివే -
2023లో ప్రధాని మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారు? ఎవరిని కలిశారు?
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు ఎప్పుడూ చర్చనీయాంశంగా నిలుస్తుంటాయి. 2023లో ప్రధాని మోదీ.. జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా, అమెరికా, ఈజిప్ట్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, గ్రీస్, ఇండోనేషియా, దుబాయ్ తదితర 11 దేశాలలో పర్యటించారు. మే 19.. జపాన్లోని హిరోషిమాలో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశం తరువాత ప్రధాని మోదీ పాపువా న్యూ గినియాను సందర్శించారు. ఇక్క జరిగిన ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడవ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సిడ్నీని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ స్థానిక భారతీయ కమ్యూనిటీతో సంభాషించారు. జూన్ 20.. జూన్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు న్యూయార్క్ చేరుకున్న ప్రధాని జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సారధ్యం వహించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ వాషింగ్టన్కు వెళ్లారు. జూన్ 22న వైట్ హౌస్ను సందర్శించారు. జూన్ 22.. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో పీఎం మోదీ ప్రసంగించారు. ఆ తర్వాత ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్-ఫత్తా అల్-సీసీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈజిప్టు పర్యటనకు వెళ్లారు. ఈజిప్టు సీనియర్ ప్రముఖులతో పాటు అక్కడుంటున్న భారతీయులతో సంభాషించారు. జూలై 13.. బాస్టిల్ డే సైనిక కవాతుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ఫ్రాన్స్లో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో అధికారిక చర్చలు జరిపారు. ఒక ప్రైవేట్ విందులో కూడా పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లి, అక్కడ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో చర్చలు జరిపారు. ఆగస్టు 22.. జోహన్నెస్బర్గ్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం గ్రీస్లో అధికారిక పర్యటన చేశారు. ఇది 40 సంవత్సరాలలో భారత ప్రధాని తొలి పర్యటన. సెప్టెంబర్ 6.. సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి కొన్ని రోజుల ముందు ప్రధాని మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు తూర్పు ఆసియా సదస్సు లో పాల్గొన్నారు. నవంబర్ 30.. ఈ ఏడాది చివరిలో వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దుబాయ్ వెళ్లారు. 200 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: అన్నీ అమ్ముకుని నౌకపై దేశాలు తిరుగుతూ... -
ఉత్తమ ఆహార నగరాల జాబితాలో ఐదు భారత నగరాలకు చోటు!
పర్యాటకులు ఏ నగరం వెళ్లినా.. ముందుగా తెలుసుకునేది ఆహారం గురించే. ఎలాంటి ఆహారం దొరుకుతుందని తెలుసుకుని అప్పుడూ స్టే చేయగలమా లేదా నిర్ణయించుకుంటారు. అలా అత్యుత్తమ ఆహారం అందించే నగరాల జాబితా తెలిస్తే పర్యాటకలుకు మరితం ఈజీ అవుతుంది. అలాంటి ఉత్తమ ఆహార నగరాల జాబితా ఒకటి ఇటీవలే విడుదలైంది. దీన్నిఆ నగర సంస్కృతిక, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్థానిక ఆహారాన్ని రుచిగా అందించే... గల్లీలోని స్టాల్స్ నుంచి ఐకానిక్ రెస్టారెంట్ల వరకు ఏం ఉన్నాయి, ఆహార ప్రియులు ఇష్టపడే నగరాలు, ఆ రెస్టారెంట్లకు ఉన్న రేట్లు తదితరాలను పరిగణలోనికి తీసుకుని మరీ ఈ ఉత్తమ ఆహార నగరాల జాబితాను ఇచ్చారు. ఈ ఉత్తమ ఆహారాల జాబితాను ట్రావెల్ ఆన్లైన్ గైడ్ అయిన టేస్ట్ అట్లాస్ ఇటీవలే విడుదల చేసింది. ఆ జాబితాలో ఐదు భారతీయ మహానగరాలు చోటు దక్కించుకోవడం విశేషం. ఆ నగరాలు ఏంటంటే ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, లక్నో టాప్ 100 జాబితాలో స్థానం దక్కించుకోగా, టాప్ 50లో ముంబై 35వ స్థానం, హైదరాబాద్ 39వ స్థానం నిలాచాయి. ఇక ఢిల్లీ 56వ స్థానానికి, చెన్నై(65), లక్నో(92) స్థానాలను దక్కించుకున్నాయి. ఇక ఈ జాబితాలో తాజా పదార్థాలతో రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధిగా రోమ్(ఇటలీ) నిలిచింది. బోలోగ్నా, నేపుల్స్, రెండు ఇటాలియన్ నగరాలు రెండు, మూడు ర్యాంక్లు దక్కించుకున్నాయి. కాగా, టాప్ 10 జాబితాలో స్థానం దక్కించుకున్న ఇతర నగరాలు వియన్నా(ఆస్ట్రియా), టోక్యో(జపాన్), హాంకాంగ్(చైనా), టురిన్ (ఇటలీ), గాజియాంటెప్ (టర్కీ) , బాండుంగ్ (ఇండోనేషియా) తదితరాలు. (చదవండి: అత్యంత తక్కువ పగటి కాలం ఉండేది ఈ రోజే! ఎందుకలా జరుగుతుందంటే..?) -
ప్రపంచ చీరల దినోత్సవం! 'చీర' అందమే అందం!
'చీర' అంటే అందం, ఆనందం. అలాంటి 'చీర' కేవలం సౌందర్యాన్ని పెంచే ఓ వస్త్రమే కాదు...భారతీయ సంస్కృతికి చిహ్నం కూడా. అందుకే అతివల దుస్తుల వరుసలో చీర ఎప్పుడూ ముందుంటుంది. ‘నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా...ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ’ అన్నాడో కవి. పట్టు చీరే కాదు...పట్టుమని వంద రూపాయలు చేయని చీరలో కూడా మగువ అందం మూడింతలవుతుంది. దక్షిణాది కంజీవరం నుంచి బెంగాల్ వారి బలుచరి వరకు... సెలెబ్రిటీలు కట్టే ఫ్యాన్సీ చీరల నుంచి పల్లె పడుచులు కట్టే నేత చీర వరకూ...చీర చీరకూ అందమే.కట్టిన ప్రతి పడతిలోనూ సౌందర్యమే. అందుకే కాబోలు సినీతారలు సైతం చీరను చిన్నచూపు చూడరు. అలాంటి గొప్ప ప్రత్యేకతను దక్కించుకున్న చీర కోసం ఓ రోజుని ప్రత్యేకంగా కేటాయించి మరీ చీర అందాన్ని తెలియజేసేలా ప్రపంచ చీర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది దీన్ని డిసెంబర్ 21న ఘనంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం ఎలా వచ్చింది? ఎందుకు జరుపుకుంటున్నాం తదితరాల గురించే ఈ కథనం!. 'చీర' అనే పదం ఎలా వచ్చిందంటే.. సంస్కృతంలో "చీర" అనే పదానికి "వస్తానికి సంబంధించిన స్ట్రిప్(చిన్న ముక్క)" అని అర్ధం. కానీ సహస్రాబ్దాలుగా పట్టు, దూది లేదా నారతో ధరించే భారతీయ స్త్రీలకు, పురుషులకు ఈ వస్త్రాలు కేవలం సాధారణ వస్త్రాలు మాత్రం కాదు. వాటిని వారు ఎంతో విలువైన వాటిగా చూస్తుంటారు. ఆ చీరతో ముడిపడి ఉన్న బంధాలు, జ్ఞాపకాలు వారి కళ్ల ముందు కదలాడుతుంటాయి. ఈ దినోత్సవం ఎలా ఏర్పడింది..? 2020లో ఫ్యాషన్ ప్రియులు సింధూర కవిటి, నిస్తుల హెబ్బార్ అధికారిక 'వరల్డ్ చీర దినోత్సవం' ఉద్యమాన్ని ప్రారంభించారు. వారు దీని గురించి ఒక ప్రత్యేక తేదీని (డిసెంబర్ 21వ తేదీ)ని సూచించారు. మన దేశ సరిహద్దులు దాటి చీరకు సంబంధించిన సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు. ఇక ఈ చీరలు లేకుంటే ప్రపంచం రంగుల మయం కాదు. చాలా ఏళ్ల నుంచి భారతీయ సంస్కృతిలో ఈ చీరలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అలాగే ఫ్యాషన్ పరంగా కూడా ఈ చీరలే అగ్రస్థానంలో ఉన్నాయి. సౌలభ్య పరంగానే కాకుండా ఆకట్టుకునే స్థాయిలో చీరదే తొలిస్థానం. ఏ పండుగైన ఒక్క చీరతో సంప్రదాయం ఉట్టిపడి నిండుదనం తీసుకురావడమే గాక అలనాటి రోజుల్లోకి తీసుకుపోతుంది. ఎందుకు జరుపుకుంటున్నాం అంటే.. ఈ పండుగ ప్రధానా ఉద్దేశ్యం వీటిని ఎంతోకష్టపడి తయారు చేసే కార్మికుల నైపుణ్యాన్ని గుర్తించడమే గాక ఎప్పటికప్పుడూ వైవిద్యాన్ని ప్రదర్శిస్తూ సరికొత్తచీరలను మన ముందుకు తీసుకొస్తున్న వారి కళ నైపుణ్యతను కొనియాడాల్సిందే. కనీసం ఈ సందర్భంగానైనా..ఒక చీర కోసం కార్మికులు పడే శ్రమ, ఎంతలా ఓపికతో చేస్తే ఓ చీర మన ముందుకొస్తుందో కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దాని గొప్పదనాన్ని గుర్తించాలి. వేల ఏళ్ల నాటి నుంచి ఉన్న మహిళల అవసరాలకు తగ్గట్టుగా ఆ చీరలో మార్పులు సంతరించుకుంటూ తన క్రేజ్ని చాటుకుంటూనే వచ్చింది. ఎన్ని రకాల ఫ్యాషన్ డ్రస్లు వచ్చినా చీర అందం ముందు బలదూర్ అని ఫ్రూవ్ చేసుకుంది. ఆధునికంగా 'చీర కట్టు' విధానం.. నిజానికి భారతదేశంలో చీర బ్లౌజ్ లేకుండా ధరించేవారు. కనీసం శారీ పెట్టికోట్లు ఉండేవి కావు. అయితే చీర మాత్రం ఓ మోస్తారు మందంతో ఉండి, మోకాలి వరకు ధరించేవారు. అయితే ఆ చీరతో బయటకు రావడం కాస్త ఇబ్బందిగా ఉండేది కూడా. అయితే ఆ రోజుల్లో మహిళలు రావడం కూడా అరుదు కావడంతో అలానే చీరలు ధరించేవారు. ఆ తర్వాత నెమ్మదిగా మార్పులు రావడం, మహిళలకు కూడా బటయకు రావడం జరిగింది. వారు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేయడంతో చీర ఆహార్యంలో మార్పులు వచ్చాయి. సౌలభ్యంగా ధరించేలా చీరలో కాలనుగుణంగా పలుమార్పులు వచ్చాయి. అయితే ఆధునికంగా చీర కట్టుకునే విధానం మాత్రం ఠాగూర్ కుటుంబం నుంచే వచ్చిందిన చెబుతున్నారు ప్రొఫెసర్-రచయిత జస్వీందర్ కౌర్. ఆయన భారతీయ వస్త్రధారణలో ఎలా కాలనుగుణంగా మార్పులు వస్తూ అభివృద్ధి సాధించిందే పంచుకుంటూ ఆదునిక చీర కట్లు విధానం గురించి మాట్లాడారు. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబసభ్యలచే ప్రాచుర్యం పొందిందని చెప్పారు. అందుకు సంబంధించిన ఓ ఆసక్తికర కథనాన్ని కూడా పంచుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కోడలు జ్ఞానదానందిని దేవి ద్వారా ఆధునిక చీర కట్టు విధానం ప్రాచుర్యం పొందిందని చెప్పుకొచ్చారు. ఠాగూర్ సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్ భాతర సివిల్ సర్వీస్ చేరిన తొలి భారతీయుడు. ఆ టైంలో భారతీయ స్త్రీలు ధరించే చీర విధానంతో బయటకు రావడం కాస్త ఇబ్బందిగా ఉండేది. దీన్ని ఆమె ఠాగూర్ విశ్వభారతి పత్రికలో కూడా ప్రస్తావించారు. అయితే కోల్కతాలో వైస్రాయి రిసెప్షన్లో సత్యేంద్రనాథ్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమె తక్షణమే వెళ్లాల్సిన పరిస్థితి అయితే అప్పుడే ఆమె హుందాగా ఆధునికంగా కొత్త పద్ధతిలో(బ్లౌజ్తో తలపై ముసుగు వేసుకుని) ధరించి వెళ్లారు. అప్పటి నుంచే అందరూ దీన్ని అనుసరించనట్లుగా ఓ ఆసక్తికర కథనాన్ని జస్వీందర్ వెల్లడించారు. అందుకే కోసం ఎన్ని రకాల విచిత్ర వస్త్రధారణ వచ్చిన చీర ధరించడం కనుమరుగవ్వలేదు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా తన క్రేజ్ని చాటుకుంటునే ఉంది. (చదవండి: డయానా ధరించిన డ్రెస్ ధర ఏకంగా రూ. 9 కోట్లు! మరోసారి రికార్డు స్థాయిలో..) -
Swarved: ఆధ్యాత్మిక బలానికి అత్యాధునిక చిహ్నం
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం(మెడిటేషన్ సెంటర్) మన భారతదేశంలోనే కొలువుదీరింది. ఈ భారీ నిర్మాణంతో భారత్ అధ్యాత్మకి వికాసానికి పెద్ద పీఠవేస్తూ శాంతియుతంగా ఉండేలా చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆ అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడ ఉందంటే..? ఆ అతిపెద్ద ధ్యాన కేంద్రం(మెడిటేషన్ సెంటర్) ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసిలో ఉంది. దీన్ని ప్రధాని మోదీ సోమవారమే ప్రారంభించారు. ఈ ధ్యాన కేంద్రం పేరు 'స్వర్వేద్ మహామందిర్'. ఆధ్యాత్మికంగా దైవత్వ వైభవానికి ఆ ధ్యాన కేంద్రం ప్రధాన ఆకర్షణ అని మోదీ పేర్కొన్నారు. ఇది భారతదేశ సామాజిక ఆధ్యాత్మిక బలానికి అత్యాధునిక చిహ్నం ఈ స్వర్వేద్ మహామందిర్. ఈ ప్రారంభోత్సవంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. ఈ మందిర్కి సంబంధించిన ఆసక్తికర విశేషాలు.. ఇది ఏడు అంతస్తుల నిలయం. దీన్ని సుమారు మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. దాదాపు 125 రేకుల తామర గోపురాల డిజైన్తో అత్యంత అద్దంగా తీర్చిదిద్దారు. అంతేగాదు ఒకేసారి 20 వేలమంది కూర్చొగలిగే సామర్థ్యం కలది. దీన్ని వారణాసి సిటీ సెంటర్కి దాదాపు 12 కి.మీ దూరంలో ఉమరహా ప్రాంతంలో నిర్మించారు. ఈ ఆలయం మకరతోరణంపై దాదాపు 3 వేలకు పైగా స్వర్వేద్ శ్లోకాలు చెక్కారు. ఈ గుడి గోడల చుట్టూ గులాబీరంగు ఇసుకరాయి మంచి అలంకరణగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తలుపులపై శిల్ప కళా నైపుణ్యం తెలియజేశాలా పలు శిల్పాలను చెక్కారు. పైగా ఇందులో దాదాపు 101 పౌంటైన్లు ఉన్నాయి. 2004లో ప్రారంభమైన ఈ మహామందిర్ నిర్మాణం 15 మంది ఇంజనీర్లు, సుమారు 600 మంది కార్మికులు కృషి ఫలితం. విహంగం యోగా వ్యవస్థాపకుడు సదాఫల్ డియోజీ మహారాజ్ రచించిన గ్రంథం స్వర్వేదానికి ఈ మహామందిరాన్ని అంకితం చేసినట్లు ఆలయ వెబ్సైట్ తెలిపింది. ఈ మహామందిర్ దాని అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రకాశంతో యావత్ మానవాళిని ప్రకాశవంతం చేయడమే గాక ఈ ప్రంపంచాన్ని సదా శాంతియుతంగా ఉండేలా అప్రమత్తం చేస్తుందని ఆలయ వెబ్సైట్ పేర్కొంది. (చదవండి: ఆ గుహలోకి వెళ్తే ..ఆత్మలను లైవ్లో చూడొచ్చట!) -
ఈ ఏటి మేటి మహిళలు వీరే!
కొద్దిరోజుల్లో 2023 ముగియబోతోంది. డిసెంబరులో సగభాగం ఇప్పటికే గడిచిపోయింది. ఈ ఏడాది ప్రపంచంలోని పలు దేశాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చర్చలలోకి వచ్చిన మహిళలు కొందరు ఉన్నారు. అత్యధిక సంపాదనతో.. టేలర్ స్విఫ్ట్: ఈ సంవత్సరం వార్తల్లో ప్రముఖంగా కనిపించారు. ఫోర్బ్స్ జాబితాలో టేలర్ స్విఫ్ట్ ఐదవ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది అక్టోబర్లో టేలర్ స్విఫ్ట్ బిలియనీర్గా మారారు. టేలర్ స్విఫ్ట్ పేరొందిన సింగర్. ఆమె తన పాటలు, నటన ద్వారా ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన మొదటి మహిళగా నిలిచారు. టేలర్ స్విఫ్ట్ తన పాటలు, రాయల్టీల ద్వారా 500 మిలియన్ డాలర్లు (ఒక మిలియన్ అంటే రూ. 10 లక్షలు) సంపాదించారు. ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ ఏడాది వార్తల్లో కనిపించారు. ఫోర్బ్స్ జాబితాలో మెలోని నాల్గవ స్థానంలో నిలిచారు. 2022, అక్టోబరు 22న మెలోని ఇటలీ పగ్గాలు చేపట్టారు. మెలోనీ ఇటలీకి తొలి మహిళా ప్రధానమంత్రి. మెలోని 2014 నుండి ఇటలీ రైట్ వింగ్ పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీకి అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. ఫోర్బ్స్ జాబితాలో మూడో స్థానం.. కమలా హారిస్ కూడా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. కమలా హారిస్ అమెరికాకు చెందిన మొదటి నల్లజాతి మొదటి మహిళ. అలాగే ఆమె అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన మొదటి దక్షిణాసియా అమెరికన్. 2021, జనవరి 20న కమలా హారిస్ యూఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఫోర్బ్స్ జాబితాలో కమలా హారిస్ మూడో స్థానంలో నిలిచారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలిగా.. క్రిస్టీన్ లగార్డ్.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలు. ఈ ఉన్నత పదవిని చేపట్టిన మొదటి మహిళ క్రిస్టీన్ లగార్డ్. ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. యూరో జోన్ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గించేందుకు ఆమె ప్రయత్నించారు. అత్యంత శక్తివంతమైన మహిళగా.. ఫోర్బ్స్ జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్లేయెన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఉర్సులా వాన్ డెర్లేయెన్ 2019, జూలైలో ఈ బాధ్యతలు చేపట్టారు. ఆమె యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా నియమితులైన మొదటి మహిళ. ఉర్సులా వాన్ డెర్లేయన్ అత్యంత శక్తివంతమైన మహిళగా పేరొందారు. ఇది కూడా చదవండి: 2023.. భారత్లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే.. -
ప్రపంచంలోని 10 అత్యంత ప్రసిద్ధ చర్చిలు (ఫొటోలు)
-
పెంట్ హౌస్ రూ.1,133కోట్లు!
వామ్మో అనుకుంటున్నారా? కానీ ఇది నిజంగా నిజం. దుబాయ్లో అత్యంత ఖరీదైన పామ్ జుమెరియా ప్రాంతంలో కడుతున్న కోమో రెసిడెన్సెస్ అనే 71 అంతస్తుల ఆకాశహర్మ్యంపై ఈ పెంట్ హౌస్ రానుంది. ఓ అజ్ఞాత కుబేరుడు దీన్ని ఏకంగా రూ.1,133 కోట్లకు కొనుక్కున్నాడు! ఈ ఐదు పడకగదుల పెంట్ హౌస్ విస్తీర్ణం 22 వేల చదరపు అడుగులు. ప్రపంచ రియల్టీ మార్కెట్లో అత్యంత ఎక్కువ ధర పలికిన మూడో పెంట్ హౌస్గా ఇది కొత్త రికార్డు సృష్టించింది. దుబాయ్ వరకూ అయితే దీనిదే రికార్డు. 2027లో కోమో టవర్ నిర్మాణం పూర్తయ్యాక ఇది కొనుగోలుదారుకు అందుబాటులోకి రానుంది! అతని వివరాలను రహస్యంగా ఉంచినట్లు నిర్మాణ భాగస్వామి ప్రావిడెంట్ ఎస్టేట్ పేర్కొంది. అయితే ‘‘ఆ కుబేరుడు తూర్పు యూరప్ ప్రాంతానికి చెందిన వ్యక్తి’’ అని ప్రావిడెంట్ ఎస్టేట్కు అసోసియేట్ పార్ట్నర్ అయిన శామ్ హొరానీ వెల్లడించారు. రియల్టీ స్వర్గధామమైన దుబాయ్లో అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, విల్లాలు, పెంట్ హౌస్ల ధరలు చుక్కలనంటడం ఇది తొలిసారేమీ కాదు. కొద్ది నెలల క్రితం మర్సా అల్ అరబ్ హోటల్ పెంట్ హౌస్ ఏకంగా రూ.956 కోట్లకు అమ్ముడైంది. ప్రత్యేకతలెన్నో... ఎన్నెన్నో ప్రత్యేకతలు కోమో రెసిడెన్స్ పెంట్ హౌస్ సొంతం ► ఇందులో 360 డిగ్రీల స్కై పూల్ ఉంటుంది. ►ఇది వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకమైన చోట రానుంది. ►దీనిపై నుంచి ఇటు చూస్తే ప్రపంచంలోకెల్లా ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా, అటు చూస్తే దానికి సాటి వచ్చే బుర్గ్ అల్ అరబ్, దుబాయ్ మరీనా వంటి ఆకాశాన్నంటే నిర్మాణాలెన్నో కను విందు చేస్తాయి. ►కోమో రెసిడెన్సెస్ టవర్ ఎత్తు 300 మీటర్ల (984 అడుగుల) పై చిలుకే. ►ఇంతా చేసి, ఈ అపార్ట్మెంట్లో ఒక్కో ఫ్లోర్లో కేవలం ఒకట్రెండు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. ►రెండు నుంచి ఏడు పడకగదులతో కూడుకుని ఉండే ఈ ఫ్లాట్లకు ప్రైవేట్ లిఫ్టులు, ప్రైవేట్ శాండీ బీచ్లు, 25 మీటర్ల లాప్ పూల్స్, రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్ వంటి చాలా ప్రత్యేకతలుంటాయి. ►ఈ ఫ్లాట్ల ధర రూ.47.5 కోట్ల నుంచి మొదలవుతుంది. ప్రపంచ రికార్డు రూ.3,670 కోట్లు మొనాకోలోని ఓడియన్ టవర్ పెంట్ హౌస్ రూ.3,670 కోట్లతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్గా రికార్డు సృష్టించింది. లండన్లోని వన్ హైడ్ పార్క్ పెంట్ హౌస్ రూ.1,975 కోట్లతో రెండో స్థానంలో ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ తాబేలు వయసు ఎంతో చెప్పగలరా?
భూమ్మీద అత్యంత పురాతన కాలం నాటి జంతువులు ఇప్పటికీ ఇంకా బతికే ఉన్నాయంటే నమ్ముతారా?. నో ఛాన్స్ అంతరించిపోయే ఉంటాయని కచ్చితంగా చెబుతాం. అది అబద్ధం... నేనింకా బతికే ఉన్నానంటోంది ఈ తాబేలు. దీని వయసెంతో వింటే కచ్చితంగా షాకవ్వుతారు. ఎందుకంటే ఇది డైనసర్ల కాలం నుంచి ఉంది. ఒకరకరంగా చెప్పాలంటే జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల కాలం నుంచి ఉన్న జీవిగా ఈ తాబేలుని పేర్కొనవచ్చు. ఆ తాబేలు ఎక్కడ ఉంది? దానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం! ఈ తాబేలు పేరు జోనాథన్. ఇది బ్రిటన్లోని సెయింట్ హెలెనాలో ఉంది. ఆ ద్వీపానికి చేరుకునేటప్పటికే ఈ తాబేలు వయసు 50 ఏళ్లు. అప్పటికే పూర్తిగి పరిణితి చెంది ఉంది. అందువల్ల ఇది సుమారు 1832లో జన్మించాడని చెబుతుంటారు దీని సంరక్షకులు. లేదా అంతకంటే పెద్దవాడైనా అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పడది తన 191వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఇప్పుడూ దీన్నే చూస్తే పురాతన కాలం నాటి కొన్ని జీవులు ఇంకా బతికే ఉన్నాయని ఒప్పుకుంటారు కదూ. అయితే తాబేలు జీవిత కాలం 60 నుంచి 150 ఏళ్లు. ఐతే కొన్ని మాత్రం 200 ఏళ్ల వరకు జీవిస్తాయని చాలా మంది చెబుతుంటారు. బహుశా ఈ జోనాథన్ తాబేలు కూడా ఆ కోవకు చెందిందేనేమో!. అయితే అలాంటి తాబేలు భారత్లోని కొలకతాలో కూడా ఉందట. దాని పేరు అద్వైత. ఇది ఏకంగా 255 ఏళ్లు జీవించినట్లు చెబుతున్నారు. తాబేలుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు శిరచ్ఛేదం చేసిన తాబేలు చనిపోదట. తల నరికిన 23 రోజుల వరకు బతికిన సందర్భాలు కూడా ఉన్నాయట. చైనా వాళ్లు దీన్ని దీర్ఘాయువుకి చిహ్నంగా భావిస్తారట. అంతేగాదు తాబేలు మెదడును శస్త్రచికిత్స ద్వారా తొలగించిన మరణించదట. పైగా మెదడును తొలగించిన ఆరు నెలల వరకు కూడా బతికే ఉంటుందట The world’s oldest living land animal - the Seychelles giant tortoise named Jonathan - has just celebrated his 191st birthday. His age is an estimate, based on the fact that he was fully mature when he arrived on the island in 1882.pic.twitter.com/t4hpd73KsE — Massimo (@Rainmaker1973) December 4, 2023 (చదవండి: దెయ్యాలకు బోజనం పెట్టే పండుగ గురించి విన్నారా?) -
చవక నగరాల్లో అహ్మదాబాద్, చెన్నై
ప్రపంచంలో తక్కువ ఖర్చుతో బతుకు వెళ్లదీయగల పెద్ద నగరాల్లో మన దేశానికి చెందిన రెండు సిటీలు అహ్మదాబాద్, చెన్నైలకు చోటు దక్కింది. ప్రఖ్యాత ‘ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లోని పెద్ద నగరాలను ఎంపిక చేసి, సర్వే నిర్వహించి ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ఆయా నగరాల్లో నిత్యావసరాల నుంచి ఇంటి అద్దెల దాకా వివిధ ధరలను పరిశీలించి.. జీవించడానికి అయ్యే ఖర్చును తేల్చామని పేర్కొంది. ఇందులో సింగపూర్, స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరాలు అత్యధిక జీవన వ్యయంలో టాప్లో నిలిచాయి. నిత్యావసరాలు, వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం గణనీయంగా ఉండటంతో యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లోని నగరాల్లో జీవన వ్యయం పెరుగుతోందని తెలిపింది. ఇక తక్కువ వ్యయం ఉండే నగరాల్లో ఆసియా ఖండానికి చెందినవే ఎక్కువగా ఉన్నా యని నివేదిక వెల్లడించింది. – సాక్షి సెంట్రల్డెస్క్ -
ప్రపంచవ్యాప్తంగా హమాస్ ఏరివేతకు ఇజ్రాయెల్ రంగం సిద్ధం!
టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం గాజాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తలదాచుకున్న హమాస్ ఉగ్రవాదులను వేటాడి హతమార్చాలని గూఢచారి సంస్థలను ఆదేశించినట్లు సమాచారం. నెతన్యాహు ఆదేశాలను అమలు చేయడానికి ఇంటెలిజెన్స్ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. టర్కీ, లెబనాన్, ఖతార్లలో హమాస్ నాయకులను వేటాడేందుకు ఇజ్రాయెల్ గూఢచారి ఏజెన్సీలు ఇప్పటికే నిఘా పెట్టాయి. హమాస్ వర్గానికి ఖతార్ సానుకూల వైఖరి ప్రదర్శిస్తోంది. రాజధాని దోహాలో హమాస్ కార్యకలాపాలను దశాబ్దంపాటు కొనసాగించేందుకు అనుమతిని కూడా ఇచ్చింది. ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కొనసాగించేందుకు కూడా ఖతార్ కీలక పాత్ర పోషించింది. ఖతార్, ఇరాన్, రష్యా, టర్కీ, లెబనాన్,లు హమాస్ కార్యకలాపాలకు అవకాశం కల్పించాయని యుఎస్ ఇప్పటికే ఏన్నోసార్లు ఆరోపించిన విషయం కూడా తెలిసిందే. ఆయా దేశాలతో దౌత్యపరమైన సంక్షోభాలను తొలగించడానికి ఇజ్రాయెల్ కూడా ఇన్నాళ్లు హమాస్ను ఇతర దేశాల్లో లక్ష్యంగా చేయలేదు. కానీ ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హమాస్ను ఏరిపారేయడానికి ఇజ్రాయెల్ ప్రస్తుతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. హమాస్ నాయకులను వేటాడి హతమార్చాలని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించడం ఇజ్రాయెల్లోని మాజీ ఇంటెలిజెన్స్ అధికారులలో చర్చకు దారితీసింది. మాజీ మొస్సాద్ డైరెక్టర్ ఎఫ్రైమ్ హేలేవీ దీనిని తప్పు నిర్ణయంగా అభిప్రాయపడ్డారు. హమాస్ నాయకులను నిర్మూలించడం వల్ల ఇజ్రాయెల్కు ముప్పు తొలగిపోదని తెలిపారు. అందుకు బదులుగా హమాస్ అనుచరులు మరింత ఘోరమైన దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇదీ చదవండి: గాజాపై మళ్లీ బాంబుల వర్షం.. 175 మంది మృతి -
ఇదో అద్భుత హెటల్: ఇక్కడ అన్నీ ఉంటాయి,, కానీ..!
ఇండోనేషియాలోని ఒక అద్భుతం కట్టడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అత్యంత తక్కువ స్థలంలో ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఒక హోటల్ ఇపుడు హాట్ టాపిక్. సెంట్రల్ జావాలోని సలాటిగా టౌన్లో ఉన్న ‘‘పిటురూమ్స్’’ హోటల్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ స్థలంలో నిర్మించిన అతి పెద్ద భవంతిగా రికార్డు సాధించింది. ఇండోనేషియా ఆర్కిటెక్ట్ ఆరీ ఇంద్ర, సహబత్ సెలోజెనే రూపొందించిన అతి సన్నని హెటల్ కేవలం 110 ఇంచుల వెడల్పు అంటే నమ్ముతారా. కాని ఇదే నిజం. సలాటిగా 2022లో నిర్మితమైన ఈ హోటల్ గరిష్ట ఎత్తు 17 మీ (55 అడుగులు) పొడవు 9.5 మీ (31 అడుగులు). ఇంటీరియర్ లేఅవుట్ గురించి ఇక చెప్పాల్సిన పనేలేదు. మొత్తం ఏడు దులు, ఒక చిన్న లాంజ్, ఒక ఎంట్రన్స్ లాబీ, భవనం పైభాగంలో చిన్న అవుట్డోర్ టెర్రస్ ఏరియాలో బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. హోటల్ గదులు మధ్య క్రిస్క్రాసింగ్ మెట్లు, వస్తువులు, ఇంకా వికలాంగుల కోసం చిన్న ఎలివేటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఈ ఏడు గదులలో ఒక్కోటి ఒక్కో రంగులో ఒక్కో ధీమ్తో ఉంటాయి. డబుల్ బెడ్, టీవీ, షవర్, సింక్ , టాయిలెట్తో కూడిన బాత్రూమ్ లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. కేవలం 9.1 x 9.8 x 7.8 అడుగులతో కాంపాక్ట్ రూమ్స్లో అన్ని ఎమినిటీస్, ఇంటీరియర్తో, వివిధ ఒరిజినల్ ఆర్ట్వర్క్లతో, విభిన్న థీమ్తో, ప్రతీమూల ఒక పెర్సనల్ టచ్తో అత్భుతమైన అనుభవాన్నిస్తుందని సహబత్ సెలోజీని తెలిపారు. ఈ కాంపాక్ట్ రూములను కలిపేలా ఫ్లోటింగ్ స్టెప్స్, 90 సెంటీమీటర్ల (2.9 అడుగుల) నారో క్యారిడార్లు కారిడార్తో ఫ్లోరింగ్గా అమర్చినట్టు తెలిపారు. ధర ఎంతో తెలుసా? జపనీస్ భాషలో పిటూ అంటే ఏడు అని అర్థం. సెంట్రల్ జావాలో ఉన్న హోటల్లో ఏడు గదులు ఉండడంతో పిటూరూమ్స్ అని పిలుస్తారట. మరి ఈ PituRoomsలో ఒక రాత్రి బస చేయాలనుకుంటే ఒక్కో రాత్రికి సుమారు రూ. 5వేలు ఖర్చు అవుతుంది. -
ప్రపంచంలోనే అత్యంత అసహ్యమైన చేప! చూస్తే భయపడాల్సిందే!
ఇటీవల కుక్కలు, పిల్లుల్లో అసహ్యమైన వాటిని గుర్తించి అవే ప్రపంచంలోనే అత్యంత అసహ్యమైనవిగా పేర్కొనడం గురించి విన్నాం. ఐతే ఇలా వెల్లడించేది అగ్లీ యానిమల్ ప్రిజర్వేషన్ సోసైటీ. ఇపుడు ఆ కోవలోకి ఓ చేప వచ్చింది. ఇదేంటి చేపల్లో కూడా అసహ్యమైనవి ఉంటాయా! అని ఆశ్చర్యంగా ఉంది కదూ!. ఔను ఓ వికారమైన చేప ఉందంటా. దీన్ని చూస్తేనే భయపడతామని చెబుతున్నారు పరిశోధకులు. ఈ చేప పేరు 2003లో ఇంటర్నెట్లో తెగ వైరల్ అయ్యింది. కానీ ఇది రియల్ కాదనే అనుకున్నారు అంతా. ఐతే అలాంటి వింత చేప ఉందని, అదే అత్యంత అసమస్యమైనదని శాస్త్రవేత్తలు చెప్పడం విశేషం. ఈ చేప ఆకారం పలు ఎమోజీల్లో కూడా ఉంటుంది. అయితే ఈ అత్యంత అసహ్యకరమైన చేపను తొలిసారిగా 1983లో న్యూజిలాండ్ తీరంలో ఓ పరిశోధన నౌక దీన్ని కనుగొంది. ఇవి సముద్రంలో సుమారు 600 నుంచి 1200 మీటర్ల అడుగుల లోతుల్లో సంచరిస్తుంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. పీడనం అధికంగా ఉండే అడుగున ఇవి ఉండటం కారణంగా వీటి ఎముకలు, కండరాలతో కూడిన మెత్తని శరీరంతో చూసేందుకు వికారంగా ఉంటాయన్నారు. శాస్త్రవేత్తలు దీన్ని బ్లాబ్ ఫిష్ అని పిలుస్తారు. ఇది సైక్రోల్యూట్స్ మైక్రోపోరోస్ కుటుంబానికి చెందడం వల్ల దీని శాస్త్రీయ నామం కూడా అలానే(సైక్రోల్యూట్స్ మైక్రోపోరోస్) వ్యవహరించారు పరిశోధకులు. అయితే దీన్ని బయటకు తీస్తే ఒత్తడి తక్కువుగా ఉండటం వల్ల దీని శరీరం విస్తరించినట్లుగా అయ్యి రిలాక్స్డ్ మోడ్లో ఉండి ముక్కు బయటకు వచ్చి ఉంటుంది. అదే సముద్రం అడుగున మాత్రం అధిక పీడనం కారణంగా అది మొత్తం ముడిచుకుపోయినట్లు ఓ జెల్లీ ఫిష్ మాదిరిగా కనిపిస్తుందిన చెప్పుకొచ్చారు. అయితే దీన్ని చూసిన వెంటనే..దాని వింత ఆకరం కారణంగా భయపడటం జరుగుతుందని అన్నారు. అందువల్లే అగ్లీ యానిమల్ ప్రిజర్వేషన్ సొసైటీ దీన్ని ప్రంపచంలోనే అత్యంత వికారమైన బ్లాబ్ ఫిష్గా పేర్కొన్నట్లు తెలిపారు. (చదవండి: బిడ్డను ఎప్పుడెప్పుడూ చూస్తానా అనుకుంది! కానీ అదే ఆమెకు..) -
అత్యంత విలాసవంతమైన నగరాలు.. ముఖ్యంగా ఆ రెండూ..!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో సింగపూర్, స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లు టాప్లో నిలిచాయి. ఈ ఏడాది మెస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్ లిస్ట్లో తర్వాతి స్థానాల్లో జెనీవా, న్యూయార్క్, హాంకాంగ్లు ఆక్రమించాయి. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఈ జాబితాను గురువారం వెల్లడించింది. స్థానిక కరెన్సీ పరంగా సగటున, 200 కంటే ఎక్కువ సాధారణంగా ఉపయోగించే వస్తువులు, సేవల కోసం ఈ ఏడాదిలో 7.4శాతం ధరలు పెరిగాయి, గత సంవత్సరం రికార్డు 8.1శాతం పెరుగుదల నుంచి కొద్దిగా తగ్గింది. కానీ ఇప్పటికీ 2017-2021లో ట్రెండ్ కంటే చాలా ఎక్కువ అని నివేదిక తెలిపింది. అలాగే పలు కేటగిరీల్లో అధిక ధరల కారణంగా సింగపూర్ గత పదకొండు సంవత్సరాల్లో తొమ్మిదవసారి ర్యాంకింగ్స్లో అగ్ర స్థానాన్ని తిరిగి సాధించింది. కార్ నంబర్లపై కఠినమైన ప్రభుత్వ నియంత్రణల కారణంగా సింగపూర్ప్రపంచంలోనే అత్యధిక రవాణా ధరలు నమోదైనాయి. దుస్తులు, కిరాణా , మద్యం లాంటి ఇతర అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి. జెనీవా , న్యూయార్క్లు మూడో స్థానంలో ఉండగా, హాంకాంగ్ ఐదు, లాస్ ఏంజెల్స్ ఆరో స్థానంలోనూ నిలిచాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆసియా సగటున తక్కువ ధరల పెరుగుదల కొనసాగింది. జపాన్లోని ఒసాకా , టోక్యోతో పాటు, చైనాలోని నాన్జింగ్, వుక్సీ, డాలియన్, బీజింగ్ - ర్యాంకింగ్లలో ఈర్యాంకింగ్స్లో పతనమైన అతి పెద్ద నగరాలు. -
80 వేల కిలోల గంటను బిగిస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి
రాజస్థాన్లోని కోటా నగరంలో చంబల్ రివర్ ఫ్రంట్లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేస్తున్నారు. అయితే దానిని బిగిస్తున్న సమయంలో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ఇంజినీరుతో పాటు మరో కార్మికుడు మృతి చెందారు. మరికొందరు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోటా జిల్లా యంత్రాంగం, రివర్ ఫ్రంట్ అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్లోని కోటాలోని చంబల్ నది ఒడ్డున 80 వేల కిలోల బరువున్న గంటను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గంట చేసే శబ్దం 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఈ గంట ప్రపంచంలోనే అతిపెద్ద గంటగా గుర్తింపు పొందింది. ఈ గంట ఐదువేల సంవత్సరాల వరకు నిలిచివుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ గంటను రివర్ ఫ్రంట్కు తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమించారు. ఈ గంటను నిర్దేశిత స్థానంలో అమరుస్తుండగా ఇంజనీర్ దేవేంద్ర ఆర్య, మరో కార్మికుడు 35 అడుగుల ఎత్తునుంచి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవేంద్ర కన్నుమూశారని వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు -
ఈ చెర్రీలు ఒక్కోక్కటే ఏకంగా..రూ. 25 వేలు!
మన దేశంలోని వివిధ నగరాల్లో సాధారణంగా చెర్రీలు కిలో రూ.400 నుంచి రూ.1200 వరకు పలుకుతాయి. జపాన్లో పండించే ఈ చెర్రీలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. వీటిని జూనో హార్ట్ చెర్రీలని, అవ్మోరీ చెర్రీలని అంటారు. మిగిలిన రకాల చెర్రీల కంటే ఇవి పరిమాణంలో పెద్దగాను, రుచిలో మరింత తీపిగాను ఉంటాయి. వీటి ఆకారం మిగిలిన చెర్రీల్లా గుండ్రంగా కాకుండా, హృదయాకారంలో ఉంటుంది. వీటిని కిలోల చొప్పున అమ్మరు. ఒక్కొక్క పండుకే ధరకట్టి ఆ లెక్కన అమ్ముతారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ చెర్రీలు ఒక్కొక్కటి 296 డాలర్ల (సుమారు 25 వేలు) వరకు ధర పలుకుతాయి. ఇవి 2.8 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వ్యాసంలో ఉంటాయి. సాధారణ చెర్రీల కంటే వీటిలో చక్కెర 20 శాతం ఎక్కువగా ఉంటుంది. (చదవండి: హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!) -
ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో 'స్మార్ట్ఫోన్' జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. డిజిటల్ ప్రపంచంలో మొబైల్స్ ఎంత వేగంగా అప్డేట్ అవుతున్నాయి, వాటికి అనుగుణంగా కొత్త కొత్త యాప్స్ పుట్టుకొచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన యాప్లలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి అనే సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. 2022లో జనాదరణ పొందిన యాప్స్ 2020లో భారత్ నిషేదించిన 'టిక్టాక్' 2022లో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ ఎంటర్టైన్మెంట్ యాప్. ఈ వీడియో ప్లాట్ఫామ్ను ఏకంగా 672 మిలియన్ యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు సమాచారం. బిజినెస్ ఆఫ్ యాప్స్ ప్రకారం దీని వార్షిక ఆదాయం 9.4 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. (భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 783 వేల కోట్ల కంటే ఎక్కువ) ఇక అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న టాప్ 5 సోషల్ మీడియా యాప్ల స్థానంలో ఇన్స్టాగ్రామ్ (547 మిలియన్స్), ఫేస్బుక్ (449 మిలియన్స్), వాట్సాప్ (424 మిలియన్స్), టెలిగ్రామ్ (310 మిలియన్స్), ఫేస్బుక్ మెసెంజర్ (210 మిలియన్స్) ఉన్నాయి. షాపింగ్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది యూజర్స్ డౌన్లోడ్ చేసుకున్న యాప్గా 'షీఇన్' (Shein) నిలిచింది. ఈ యాప్ సుమారు 229 మిలియన్ల వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ తరువాత స్థానంలో మీషో (Meesho) 210 మిలియన్స్ డౌన్లోడ్స్ పొందింది. భారతదేశంలో కూడా ఈ యాప్ ఎక్కువమంది వినియోగిస్తున్నట్లు సమాచారం. గేమ్స్ విభాగంలో ఎక్కువ మంది యూజర్లను ఆకర్శించిన యాప్ 'సబ్వే సర్ఫర్స్' (Subway Surfers). దీనిని 304 మిలియన్ల వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 'క్యాండీ క్రష్'ను ప్రపంచ వ్యాప్తంగా 138 మిలియన్ల యూజర్లు వినియోగిస్తున్నట్లు సమాచారం. మనీ ట్రాన్స్ఫర్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్స్ వాడుతున్న యాప్గా 'ఫోన్ పే' (PhonePe) నిలిచి సుమారు 94 మిలియన్ల డౌన్లోడ్స్ పొందింది. ఆ తరువాత పేపాల్ (92 మిలియన్స్), గూగుల్ పే (69 మిలియన్స్), పేటీఎమ్ (60 మిలియన్స్) వంటివి ఉన్నాయి. ట్రావెల్ విభాగంలో గూగుల్ మ్యాప్ (113 మిలియన్స్), ఫుడ్ విభాగంలో ఎంసీడోనాల్డ్ (127 మిలియన్స్), మ్యూజిక్ విభాగంలో స్పాటిఫై (238 మిలియన్స్), విద్యకు సంబంధించిన యాప్లో డుయోలింగో (98 మిలియన్స్), ఆరోగ్యానికి సంబంధించిన విభాగంలో స్వెట్కాయిన్ (52 మిలియన్స్) అగ్ర స్థానాల్లో నిలిచాయి. ఇదీ చదవండి: కోడలి గురించి 'సుధామూర్తి' మనసులో మాట - ఏం చెప్పిందంటే? ఏఐ యాప్లకు పెరిగిన ఆదరణ ప్రస్తుతం టెక్నాలజీ మరింత వేగంగా ఉంది. ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ ఉపయోగించడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. నేడు ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా వెంటనే 'చాట్జీపీటీ' మీద ఆధారపడిపోతున్నారు. రానున్న రోజుల్లో వీటి ఆదరణ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
కాలుష్యంతో ఏఏ క్యాన్సర్లు వస్తాయి? 18 ఏళ్లలో ఏం జరిగింది?
పెరుగుతున్న క్యాన్సర్ కేసులు అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీలో గత 18 ఏళ్లలో క్యాన్సర్ మరణాలు మూడున్నర రెట్లు పెరిగాయి. దీనికి కాలుష్యం కూడా ఒక కారణమని వైద్యులు భావిస్తున్నారు. వాయు కాలుష్యంతో ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే బ్లడ్ క్యాన్సర్, కంటి క్యాన్సర్, ఉదర, మూత్ర సంబంధిత క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కాలుష్యం కారణంగా 11 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ పౌర రిజిస్ట్రేషన్ డేటాలోని వివరాల ప్రకారం 2005వ సంవత్సరంలో ఢిల్లీలో క్యాన్సర్ కారణంగా రెండు వేల నుండి రెండున్నర వేల మంది బాధితులు మరణించారు. గత ఏడాది 7400 మందికి పైగా క్యాన్సర్ బాధితులు మరణించారు. పిల్లలు, యువత కూడా క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారు. గత ఏడాది క్యాన్సర్తో మరణించిన వారిలో దాదాపు నాలుగో వంతు మంది 44 ఏళ్లలోపు వారే. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవించే మరణాలు కూడా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఏటా దాదాపు 14.50 లక్షల మంది క్యాన్సర్ బారినపడుతున్నారని, అలాగే ఏటా తొమ్మిది లక్షల మంది బాధితులు మరణిస్తున్నారని ఎయిమ్స్ క్యాన్సర్ సెంటర్ రేడియేషన్ ఆంకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అభిషేక్ శంకర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు పరిశోధనలలో.. కాలుష్యపూరిత ప్రాంతాలలో నివసించే వారిలో మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది. వాతావరణంలో ఎంపీ 2.5 స్థాయి క్యూబిక్ మీటరుకు 2.5 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతుందని ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. క్యాన్సర్కు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో అస్తవ్యస్త జీవనశైలి, ధూమపానం, పొగాకు వినియోగం, మద్యపానం మొదలైనవి ఉన్నాయి. ఇది కూడా చదవండి: అక్షరాస్యతలో దేశం ఎక్కడుంది? -
ప్రపంచంలో బడా భూస్వామి ఎవరు?
ఆ ప్రముఖునికి ప్రపంచంలో అత్యధిక భూములున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, అడవులు, పట్టణ ప్రాంతాల్లో పలు భూములు, ఇళ్లు, విలాసవంతమైన మార్కెటింగ్ సముదాయాలు అతని సొంతం. సముద్ర తీరప్రాంతాలలో కూడా అతనికి ఆస్తులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతనికున్న భూములు, ఆస్తులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక కంపెనీనే ఉంది. ఈ అపార ఆస్తిపాస్తులు బ్రిటన్ రాజకుటుంబానికి సొంతం. వీటికి యజమాని బ్రిటన్ రాజు చార్లెస్- III. అతని తల్లి క్వీన్ ఎలిజబెత్- II మరణం తరువాత కింగ్ చార్లెస్ ప్రపంచంలోనే భారీ ఆస్తిపాస్తులకు యజమానిగా మారారు. ఇతను బతికి ఉన్నంత వరకూ ఈ ఆస్తిని అతని సొంత ఆస్తిగా పరిగణిస్తారు. దీనికి అతను ప్రైవేట్ యజమాని కాదు. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ప్రిన్స్ చార్లెస్ ప్రపంచవ్యాప్తంగా 6.6 బిలియన్ ఎకరాల భూమి, విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. ఈ భూములు గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలలోనూ ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం సంపదలో 16.6 శాతం ఈ బ్రిటిష్ రాజుకు చెందినదేని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ది క్రౌన్ ఎస్టేట్ అనే సంస్థ ఈ ఆస్తిపాస్తులను పర్యవేక్షిస్తుంది. ఈ బ్రిటీష్ రాజుకు ఒక లక్షా 15 వేల ఎకరాల వ్యవసాయ, అటవీ భూములున్నాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల విలువైన భూములు, ఆస్తులు, బీచ్లు, మార్కెట్లు, నివాస స్థలాలు, కార్యాలయ సముదాయాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో క్రౌన్ ఎస్టేట్ వివిధ షాపింగ్ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ రాజుకు ఇసుక, కంకర, సున్నపురాయి, గ్రానైట్, ఇటుక, మట్టి, బొగ్గు, స్లేట్ తదితర వ్యాపారాలు కూడా ఉన్నాయి. 2022 సెప్టెంబరులో కింగ్ చార్లెస్- III సింహాసనాన్ని అధిరోహించినప్పుడు అతను $46 బిలియన్ల సామ్రాజ్యానికి అధిపతి. (ఒక బిలియన్ అంటే రూ. 100 కోట్లు) ఇందులో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్లో ఉంది. ఈ ఆస్తులను క్రౌన్ ఎస్టేట్ సంస్థ పర్యవేక్షిస్తుంది. కింగ్ చార్లెస్- III తరువాత అత్యధిక భూముల కలిగిన వ్యక్తిగా సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా నిలిచారు. ఇతనికి ఎనిమిది లక్షల 30 వేల చదరపు మైళ్ల భూభాగం ఉంది. ఈ జాబితాలో తరువాతి పేరు సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా. ఇతనికి వ్యక్తిగతంగా ఎనిమిది లక్షల 30 వేల చదరపు మైళ్ల భూభాగం ఉంది. ఇది కూడా చదవండి: చైనా జిత్తులకు అమెరికా, భారత్ పైఎత్తు! -
2100 నాటికి ప్రపంచ జనాభాలో భారీ తగ్గుదల? భారత్, చైనా పరిస్థితి ఏమిటి?
పెరుగుతున్న జనాభాపై ప్రపంచంలోని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా పెరుగుదల అనేక అనర్థాలకు దారితీస్తుందని వాపోతున్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి అందించిన ‘రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022’ డేటాలోని వివరాలు మన ఊహలకు భిన్నంగా ఉన్నాయి. భవిష్యత్లో ప్రపంచ జనాభాలో తగ్గుదల కనిపించనున్నదని ఈ నివేదిక వెల్లడించింది. దీనికి వెనుకనున్న కారణాలేమిటో కూడా తెలియజేసింది. ప్రపంచంలో 2100 నాటికి మొత్తం జనాభా ఎంత ఉంటుందనే దానిపై ఈ నివేదికలో అంచనా అందించారు. దీనిలో భారతదేశంతో పాటు చైనా, పాకిస్తాన్, అమెరికా, యూరోపియన్ దేశాల జనాభాకు సంబంధించి అంచనాలున్నాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం 2021లో భారతదేశ జనాభా 153 కోట్లు. ప్రస్తుత జనాభా దాదాపు 140 కోట్లు. అంటే 2021కి.. ఇప్పటికి(2023) జనాభాలో తగ్గుదల కనిపించింది. దీని ప్రకారం చూస్తే వచ్చే 77 ఏళ్లలో అంటే 2100 నాటికి భారతదేశ జనాభా 13 కోట్ల మేరకు మాత్రమే పెరగనుంది. 2100వ సంవత్సరంలో ప్రపంచ జనాభాలో గణనీయమైన పెరుగుదల ఉండకపోవచ్చంటూ ఈ అంచనాలలో పేర్కొన్నారు. ఈ నివేదికలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం చైనాతో ముడిపడివుంది. 2100 నాటికి చైనా జనాభా 140 కోట్ల నుంచి దాదాపు 77 కోట్లకు తగ్గిపోనుంది. యూఎన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ), ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలిసిస్ (ఐఐఏఎస్ఏ)లు అందించిన డేటాలలోని అంశాలను క్రోడీకరించి 2100నాటి జనాభా అంచనాలను రూపొందించారు. ప్రపంచ జనాభా 2086 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. సంతానోత్పత్తి రేట్లు 2050కి ముందుగానే త్వరితగతిన తగ్గుతాయని ఈ అంచనాలలో వెల్లడయ్యింది. 2100కి వీటి స్థిరీకరణ జరగనుందని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు జనన రేటు తగ్గుతుంది. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడం, గర్భనిరోధకాల లభ్యత, కుటుంబ నియంత్రణకు ప్రోత్సాహం, అధిక సంతాన ఖర్చులు మొదలైనవి సంతానోత్పత్తి తగ్గుదలకు కారణాలుగా నిలుస్తున్నాయి. 2100 నాటికి వివిధ దేశాల జనాభా ఎంత ఉండవచ్చనే అంచనాలను ‘రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022’ డేటాలో అందించారు. 2100 నాటికి ఏ దేశంలో ఎంత జనాభా(అంచనా)? భారతదేశం: 153 కోట్లు చైనా: 77 కోట్ల 10 లక్షలు నైజీరియా: 54 కోట్ల 60 లక్షలు పాకిస్తాన్: 48 కోట్ల 70 లక్షలు కాంగో: 43 కోట్ల 10 లక్షలు అమెరికా: 39 కోట్ల 40 లక్షలు ఇథియోపియా: 32 కోట్ల 30 లక్షలు ఇండోనేషియా: 29 కోట్ల 70 లక్షలు టాంజానియా: 24 కోట్ల 40 లక్షలు ఈజిప్ట్: 20 కోట్ల 50 లక్షలు బ్రెజిల్: 18 కోట్ల 50 లక్షలు ఫిలిప్పీన్స్: 18 కోట్లు బంగ్లాదేశ్: 17 కోట్ల 70 లక్షలు సూడాన్: 14 కోట్ల 20 లక్షలు అంగోలా: 13 కోట్ల 30 లక్షలు ఉగాండా: 13 కోట్ల 20 లక్షలు మెక్సికో: 11 కోట్ల 60 లక్షలు కెన్యా: 11 కోట్ల 30 లక్షలు రష్యా: 11 కోట్ల 20 లక్షలు ఇరాక్: 11 కోట్ల 10 లక్షలు ఆఫ్ఘనిస్తాన్: 11 కోట్లు మొజాంబిక్: 10 కోట్ల 60 లక్షలు వియత్నాం: 9 కోట్ల 10 లక్షలు కామెరూన్: 8 కోట్ల 70 లక్షలు మాలి: 8 కోట్ల 70 లక్షలు మడగాస్కర్: 8 కోట్ల 30 లక్షలు టర్కీ: 8 కోట్ల 20 లక్షలు ఇరాన్: 7 కోట్ల 90 లక్షలు దక్షిణాఫ్రికా: 7 కోట్ల 40 లక్షలు యెమెన్: 7 కోట్ల 40 లక్షలు జపాన్: 7 కోట్ల 40 లక్షలు ఇది కూడా చదవండి: చైనా జిత్తులకు అమెరికా, భారత్ పైఎత్తు! -
మీడియాకు ముప్పుగా మారిన దేశమేది? 17 నెలల్లో ఎంతమంది బలయ్యారు?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పౌరులతో పాటు, కొందరు జర్నలిస్టులు కూడా మృతిచెందారు. అయితే ఇలాంటి పరిస్థితులు లేనప్పటికీ ఫిలిప్పీన్స్లో పలువురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ఈ దేశంలో హత్యకు గురైన జర్నలిస్టుల జాబితాలోకి మరో పేరు చేరింది. తాజాగా రేడియో బ్రాడ్కాస్టర్ ఒకరు స్టూడియోలో తుపాకీ కాల్పులకు బలయ్యారు. గడచిన 17 నెలల్లో ఫిలిప్పీన్స్లో నలుగురు మీడియా సిబ్బంది హత్యకు గురయ్యారు. కాలాంబా మునిసిపాలిటీ ప్రతినిధి కెప్టెన్ డియోర్ రాగోనియా మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. 57 ఏళ్ల రేడియో బ్రాడ్కాస్టర్ జువాన్ జుమలోన్కు చెందిన స్టూడియోలోకి చొరబడిన సాయుధ దుండగుడు అతని తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జుమాలోన్ మృతి చెందాడు. ‘డీజే జానీ వాకర్’గా పేరొందిన జుమాలోన్.. మిండానావోలోని తన నివాసంలోని స్టూడియోలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన అనంతరం ఆగంతకుడు పరారయ్యాడు. ఈ ఘటన స్టూడియోలోని సీసీ కెమెరాలో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ హత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ ఈ కేసులో నేరస్తులను త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. తమ ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టులపై దాడులను సహించబోమని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే వారి చర్యలు తీసుకుంటామని మార్కోస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా తెలియజేశారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఫిలిప్పీన్స్(ఎన్యుజేపీ) తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది జూన్లో ఫెర్డినాండ్ మార్కోస్ అధికారం చేపట్టిన తర్వాత ఫిలిప్పీన్స్లో నలుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా ఫిలిప్పీన్స్ మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ‘ప్లీజ్.. పెళ్లి చేసుకోండి’.. యువతులను వేడుకుంటున్న చైనా అధ్యక్షుడు -
వాయు కాలుష్యంతో క్యాన్సర్? ‘ఎయిమ్స్’ నిపుణులు ఏమంటున్నారు?
దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు నాణ్యత సూచిక ‘తీవ్రమైన’ విభాగంలోనే కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ నిలిచింది. ఇక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వైద్య నిపుణులు ఆరోగ్యంపై వాయు కాలుష్యానికి సంబంధించిన ప్రమాదకరమైన ప్రభావాల గురించి తెలియజేశారు. డాక్టర్ పీయూష్ రంజన్ (అడిషనల్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, ఎయిమ్స్) మీడియాతో మాట్లాడుతూ వాయు కాలుష్యం- వివిధ రకాల క్యాన్సర్ల మధ్యగల సంబంధానికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని అన్నారు. శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినడం, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కరోనరీ ఆర్టరీ వ్యాధులతో వాయు కాలుష్యానికి ప్రత్యక్ష సంబంధం ఉందని ఆయన తెలిపారు. వాయు కాలుష్యం విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే మెదడు, గుండె దెబ్బతినే అవకాశాలున్నాయని, ఇది అన్ని వయసులవారిలో సంభవించవచ్చన్నారు. ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక ఆదివారం వరుసగా నాల్గవ రోజు కూడా ‘తీవ్రమైన’ విభాగంలోనే ఉంది. ఈ పరిస్థితి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలున్నాయని, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: మహావినాశనం ముందుంది? ఖచ్చితమైన అంచనాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు! -
బోన్ఫైర్ వేడుకలు: ఒకేసారి దీపావళి, భోగి పండుగలా జరిగే సంబరం!
ఇంగ్లండ్ ససెక్స్ కౌంటీ తూర్పు ప్రాంతంలోని లెవెస్ పట్టణం ‘బోన్ఫైర్ కేపిటల్ ఆఫ్ ద వరల్డ్’గా పేరు పొందింది. ఇక్కడ ఏటా నవంబర్లో జరిగే లెవెస్ బోన్ఫైర్ వేడుకలు చూస్తే, ఒకేసారి దీపావళి, భోగి పండుగ జరుగుతున్నట్లుగా ఉంటుంది. ఈ పండుగను సాధారణంగా నవంబర్ 5న జరుపుకొంటారు. నవంబర్ 5 ఆదివారం వచ్చినట్లయితే, ముందురోజే నవంబర్ 4న జరుపుకొంటారు. ఈ వేడుకల్లో వీథి వీథినా భోగిమంటల్లాంటి చలిమంటల నెగళ్లను ఏర్పాటు చేస్తారు. ఆకాశం మిరుమిట్లు గొలిపేలా రకరకాల బాణసంచా కాల్పులతో హోరెత్తిస్తారు. సంప్రదాయ వేషధారణలతో కాగడాలు ధరించి ఊరేగింపులు జరుపుతారు. ఈ వేడుకల్లో స్థానిక ఇంగ్లండ్ వాసులతో పాటు, ఇక్కడ స్థిరపడిన ఆఫ్రికన్ జులు తెగ ప్రజలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ఈ వేడుకలు జరుపుకోవడం వెనుక ఒక చారిత్రక సంఘటన ఉంది. గన్పౌడర్ కుట్ర భగ్నం ఇంగ్లండ్ రాజు ఒకటో జేమ్స్కు వ్యతిరేకంగా 1605 సంవత్సరంలో కొందరు కుట్ర పన్నారు. రాబర్ట్ కేట్స్బీ నాయకత్వంలో కొందరు కేథలిక్ నాయకులు రాజు ఒకటో జేమ్స్ను హతమార్చాలనుకున్నారు. రాజు ఒకటో జేమ్స్ ఇతర మతాల పట్ల ఉదారంగా ఉండటం వల్లనే కేథలిక్ నాయకులు అతణ్ణి హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అందుకు వారు పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజైన నవంబర్ 5న సభ కొలువుదీరిన సమయంలో హౌస్ ఆఫ్ లార్డ్స్ను గన్పౌడర్తో పేల్చివేయాలనుకున్నారు. వీరి కుట్ర గురించి హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు ఒకరికి ముందుగానే ఒక ఆకాశరామన్న ఉత్తరం ద్వారా సమాచారం అందింది. భద్రతాధికారులకు చెప్పడంతో వారు సునాయాసంగా ఈ కుట్రను భగ్నం చేశారు. గన్పౌడర్ కుట్ర భగ్నమైన సందర్భంగా లెవెస్ పట్టణంలో ఏటా ఇలా బోన్ఫైర్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా సాగుతోంది. (చదవండి: ఆ టైంలోనే అతిపెద్ద అండర్గ్రౌండ్ ఎయిర్పోర్టు..కానీ ఇప్పుడది..) -
ఆసియాను కుదిపేసిన 10 భారీ భూకంపాలివే..
భూకంపం.. నివారించడం సాధ్యం కాని విపత్తు. అందుకే జాగ్రత్త, అప్రమత్తతే దీనికి పరిష్కారం. ముందస్తుగా సన్నద్ధం కాగలిగితే భూకంపాల తరహా విపత్తుల వల్ల కలిగే నష్టాన్ని కొంత వరకు నివారించవచ్చు. తాజాగా నేపాల్లో సంభవించిన భూకంపం కారణంగా వందలాదిమంది మృతి చెందారు. ఈ నేపధ్యంలో ఆసియా ఖండంలో సంభవించిన పది అతిపెద్ద భూకంపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో తరచూ విపత్తులకు గురయ్యే ఆసియాఖండంలో భూకంపాలు అత్యంత ప్రమాదకర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యూఎన్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ (యూఎన్ఐఎస్డీఆర్) తెలిపిన వివరాల ప్రకారం ఆసియాలోని చైనా, భారత్, ఇండోనేషియా, మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఆసియాలోని నగరాలు చాలా వరకు ప్రణాళికాబద్ధంగా లేవు. అవి నిర్మితమైనప్పుడు లోపభూయిష్టంగా ఉన్నాయని బ్యాంకాక్లోని ఆసియన్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ అర్బన్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అరంబెపోలా గతంలో తెలిపారు. కాగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపిన వివరాల ప్రకారం ఆసియాలో సంభవించిన పది అత్యంత భారీ భూకంపాలు ఇవే.. 1. ఇండోనేషియా: 2004, డిసెంబరు 26న ఇండోనేషియాలోని సుమత్రాలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు మొత్తం 2,27,898 మంది మరణించారు. ఆ తర్వాత వచ్చిన సునామీ 14 ఆసియా, తూర్పు ఆఫ్రికా దేశాలపై ప్రభావం చూపింది. ఇది జరిగిన మూడు నెలల తర్వాత ఉత్తర సుమత్రాలో 2005, మార్చి 28న 8.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించగా, సుమారు వెయ్యి మంది మరణించారు. 2. చైనా: 2008, మే 12న తూర్పు సిచువాన్లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 87,587 మంది మృత్యువాత పడ్డారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 3,74,177 మంది క్షతగాత్రులయ్యారు. 3. పాకిస్తాన్: 2005, అక్టోబర్ 8న 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 86 వేల మంది మరణించారు. రాజధాని ఇస్లామాబాద్కు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర పాకిస్తాన్లో ఈ భూకంపం సంభవించింది. 4. ఇరాన్: 1990, జూన్ 21న ఉత్తర ఇరాన్లో సంభవించిన భూకంపంలో 50 వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలొదిలారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదయ్యింది. భూకంప తాకిడికి ఇరాన్లోని మంజిల్, రడ్బర్ పట్టణాలు నేలమట్టమయ్యాయి. 5. ఇరాన్: 2003, డిసెంబర్ 26న బామ్లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 31 వేల మంది మరణించారు. ఇది రెండు వేల సంవత్సరాలలో ఈ ప్రాంతంలో సంభవించిన అతిపెద్ద భూకంపం. ఈ భూకంపం తాకిడికి నగరంలోని 70 శాతం ధ్వంసమైందని నివేదికలు చెబుతున్నాయి. 6. జపాన్: 2011, మార్చి 11న జపాన్లో సంభవించిన సునామీ భూకంపంలో 20,896 మంది ప్రాణాలు కోల్పోయారు. 8.9 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. సాండియాకు 80 మైళ్ల దూరంలో ఈ భూకంపం చోటుచేసుకుంది. 7. భారతదేశం: 2001, జనవరి 26న భుజ్లో సంభవించిన భూకంపంలో 20,085 మంది మృతి చెందారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.6గా నమోదైంది. గుజరాత్లో దాదాపు సగం జనాభా ఈ విపత్తుకు ప్రభావితమయ్యింది. 8. టర్కీ: 1999 ఆగస్టు 17న పశ్చిమ టర్కీలోని ఇజ్మిత్లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 17,118 మంది మరణించారు. ఈ భూకంపం దేశంలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్కు గణనీయమైన నష్టాన్ని మిగిల్చింది. 9. భారతదేశం: 1993, సెప్టెంబరు 30న మహారాష్ట్రలోని లాతూర్లో సంభవించిన భూకంపానికి 20 వేల మంది బలయ్యారు. ఈ భూకంప తీవ్రతకు లాతూర్ పట్టణమంతా ధ్వంసమయ్యింది. 40 సెకెన్లపాటు సంభవించిన ఈ భూకంపంలో 30 వేలమందికిపైగా ప్రజలు గాయపడ్డారు. 10. ఇండోనేషియా: జావాలో 2006 మే 27న 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 5,749 మంది మృతి చెందారు. రెండేళ్ల వ్యవధిలో ఇండోనేషియాలో సంభవించిన మూడో అతిపెద్ద విపత్తు ఇది. 2009, సెప్టెంబరు 30న దక్షిణ సుమత్రాలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 1,117 మంది మృత్యువాత పడ్డారు. ఇది కూడా చదవండి: ఏ రకమైన భూకంపం అత్యంత ప్రమాదకరం? -
బొగ్గును మించిన నల్లని నది ఏది? కారణమేమిటి?
ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ వందల కొద్దీ నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో కొన్ని నదుల నీరు శుభ్రంగా ఉంటుంది. మరికొన్ని నదుల నీరు మురికిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం బొగ్గుకన్నా నల్లగా ఉండే నది గురించి తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోనే అత్యంత నల్లని నదిగా పేరొందింది. ఈ నదిలో బొగ్గు కన్నా నల్లటి నీరు ప్రవహించడం వెనుకగల కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో రుకీ అనే నది ప్రవహిస్తుంటుంది. ఈ నదిలోని నీరు నల్లగా కనిపించడానికి కారణం.. ఆ నీటిలో కరిగిన సేంద్రియ పదార్థమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. డెయిలీ మెయిల్ తెలిపిన వివరాల ప్రకారం.. రుకీ నదిలోని నీటితో కనీసం చేతులు కడుక్కునేందుకు కూడా ఎవరూ ఇష్టపడరు. ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధకులు ఈ నదికి సంబంధించిన తమ శాస్త్రీయ అధ్యయనాన్ని ప్రపంచానికి అందించారు. నదిలోని నీటికి నలుపు రంగు రావడానికి కారణం వర్షారణ్యం నుండి సేంద్రియ పదార్థాలు వచ్చి, ఈ నీటిలో కలవడమేనని నిపుణులు చెబుతున్నారు. కాగా ఆఫ్రికన్ దేశమైన కాంగోలో స్విట్జర్లాండ్ కంటే నాలుగు రెట్లు అధికమైన డ్రైనేజీ బేసిన్ ఉంది. దీనిలో కుళ్ళిన చెట్లు, మొక్కల నుండి వచ్చే కార్బన్ సమ్మేళనాలు పేరుకుపోతున్నాయి. ఇవి వర్షాలు, వరదల కారణంగా నదులలోకి చేరుకుంటున్నాయి. నీటిలో కరిగిన ఇటువంటి కార్బన్ సమ్మేళనాల సాంద్రత అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది డార్క్ టీ మాదిరిగా కనిపిస్తుంది. దీనికితోడు రుకీ నది.. అమెజాన్ రియో నెగ్రా కంటే 1.5 రెట్లు లోతుగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నల్ల నీటి నదిగా పేరొందింది. రుకీ బేసిన్ దిగువన పెద్ద మొత్తంలో పీట్ బోగ్ మట్టి ఉంది. కాంగో బేసిన్లోని పీట్ బోగ్లలో సుమారు 29 బిలియన్ టన్నుల కార్బన్ ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? వజ్రాల వానలో తడుస్తామా? -
ఈ శాండ్విచ్ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాండ్విచ్. న్యూయార్క్లోని సెరండిపిటీ–3 అనే రెస్టారెంట్ ఈ శాండ్విచ్ను ‘నేషనల్ గ్రిల్డ్ చీజ్ డే’ సందర్భంగా ఏప్రిల్ 12 నుంచి తన మెనూలో చేర్చి, కస్టమర్లకు వడ్డిస్తోంది. ఈ గ్రిల్డ్ చీజ్ శాండ్విచ్ ఖరీదు 214 డాలర్లు (రూ.18,229). న్యూయార్క్ రెస్టారెంట్లలో పూర్తి స్థాయి భోజనం ఖరీదే 30 డాలర్లకు (రూ.2,497) మించదు. అలాంటిది ఈ శాండ్విచ్ ధరకు అమెరికన్లే కళ్లు తేలేస్తున్నారు. అయినా, కొందరు సంపన్నులు ఈ శాండ్విచ్ను రుచి చూడటానికి సెరండిపిటీ–3 రెస్టారెంట్ వద్ద క్యూ కడుతుండటం విశేషం. ఈ శాండ్విచ్ తయారీకి ఫ్రెంచ్ పల్మన్ షాంపేన్ బ్రెడ్, గడ్డిలో పెరిగే తెల్ల పుట్టగొడుగులు, అరుదైన కాషియోకవాలో పొడోలికా గ్రిల్డ్ చీజ్, తినడానికి ఉపయోగించే 23 క్యారెట్ల బంగారు రేకులు ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇందులో వినియోగించే కాషియోకవాలో పొడోలికా చీజ్ను పొడోలికా జాతి ఆవుల పాల నుంచి తయారు చేస్తారు. ఈ జాతి ఆవులు ప్రపంచంలో దాదాపు పాతికవేలు మాత్రమే ఉన్నాయి. ఇవి ఏడాదిలో కేవలం మే, జూన్ నెలల్లో మాత్రమే పాలు ఇస్తాయి. అందువల్ల వీటి పాలు, వీటి పాలతో తయారయ్యే చీజ్ వంటి ఉత్పత్తులు అత్యంత ఖరీదైనవి. (చదవండి: జపాన్లో కూడా కణకణలాడే నిప్పుల మీద నడిచే ఆచారం..!) -
ఖతార్లో అత్యాచారానికి విధించే శిక్ష ఎంత కఠినం?
ఖతార్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. భారతదేశానికి చెందిన ఎనిమిది మంది మాజీ మెరైన్లకు ఖతార్ మరణశిక్ష విధించింది. వారందరినీ కొన్ని నెలల క్రితం అరెస్టు చేశారు. వారు గూఢచర్యానికి పాల్పడ్డారని ఖతార్ దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ నేపధ్యంలో ఖతార్లో అమలయ్యే వివిధ శిక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని కఠినమైన చట్టాలను ఖతార్ అమలు చేస్తోంది. వీటిలో అత్యాచారానికి సంబంధించిన చట్టం కూడా ఉంది. ఈ శిక్ష గురించి తెలిస్తేచాలు ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఖతార్లో ఒక్కో రకమైన నేరానికి ఒక్కో రకమైన శిక్ష విధిస్తారు. ముఖ్యంగా చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలు, అత్యాచారాలకు కఠినమైన శిక్షలు అమలు చేస్తారు. దేశంలో అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. మరోమారు ఇటువంటి నేరం చేసే సాహసం చేయలేని రీతిలో శిక్ష విధిస్తారు. ఖతార్లో అత్యాచారానికి పాల్పడిన నేరస్తులపై రాళ్లతో దాడిచేస్తారు. తరువాత వారి శరీర భాగాలను కూడా నరికివేస్తారు. అంతేకాదు ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. అంటే అత్యాచారానికి పాల్పడిన తర్వాత దోషికి వీలైనంత త్వరగా శిక్ష పడుతుందన్నమాట. కాగా ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా అత్యాచారాలకు కఠినమైన శిక్షలు విధించే నిబంధనలున్నాయి. ముస్లిం దేశమైన కువైట్లో కూడా అత్యాచార నిందితులకు ఏడు రోజుల్లో మరణశిక్ష విధిస్తారు. అదేవిధంగా ఇరాన్లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని 24 గంటల్లో అంతమొందిస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కాల్చివేసే శిక్ష అమలు చేస్తారు. ఈ శిక్ష వారంలోపు విధిస్తారు. సౌదీ అరేబియాలో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జననాంగం కోయడం లేదా ఉరి శిక్ష అమలు చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాలను రూపొందించిన దేశాల జాబితాలో ఖతార్ కూడా ఉంది. ఖతార్ తొలిసారిగా ఫిఫా ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఈ చట్టాలు, నియమాలు ప్రపంచానికి మరింతగా తెలిశాయి. ఇది కూడా చదవండి: హమాస్ను మట్టికరిపించిన 13 మంది మహిళలు -
అత్యంత వృద్ధ శునకం ‘బాబి’ ఇకలేదు
లిస్బన్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా పేరున్న ‘బాబి’ 31 ఏళ్ల వయస్సులో శనివారం తుదిశ్వాస విడిచింది. పోర్చుగల్లోని కాన్క్వెయిరోస్ అనే ఊళ్లో 1992 మే 11న ఈ కుక్క పుట్టింది. అప్పటికి బాబి యజమాని లియోనల్ కోస్టా వయస్సు 8 ఏళ్లే. మంచి ఆహారం, స్వచ్చమైన గాలి, అమితమైన ప్రేమ..ఇవే బాబి ఇన్నేళ్లపాటు జీవించడానికి కారణాలని లియోనల్ చెప్పారు. బాబి మొత్తం 31 సంవత్సరాల 165 రోజులపాటు జీవించినట్లు తెలిపింది. బాబి స్వచ్చమైన రఫీరో డో అలెంటెజో జాతికి చెందింది. ఈ జాతి శునకాల సగటు ఆయుర్దాయం 10 నుంచి 14 ఏళ్లు. -
ప్రపంచంలోనే అతిపెద్ద కోట!
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కోట. ఈ కోట పాకిస్తాన్లోని సింద్ ప్రావిన్స్లో ఉంది. దీని పేరు రాణికోట. పదిహేడో శతాబ్దంలో సింద్ ప్రాంతాన్ని పరిపాలించిన తాల్పూర్ వంశ పాలకులు ఈ కోటను జమ్షోరో జిల్లా సన్ పట్టణంలో నిర్మించారు. ఈ కోట గోడ చుట్టుకొలత ఏకంగా 32 కిలోమీటర్లు. తాల్పూర్ వంశ పాలకులు ఈ కోటను 1812లో మరింత పటిష్ఠంగా పునర్నిర్మించారు. పునర్నిర్మాణం కోసం అప్పట్లో వారు 12 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కోట గోడ చుట్టూ బురుజులను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. వీటిలో మూడు పెద్దబురుజులను అర్ధచంద్రాకారంలో నిర్మించారు. మెలికలు మెలికలుగా కనిపించే ఈ కోట నిర్మాణం చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. పంతొమ్మిదో శతాబ్దిలో బ్రిటిష్ సేనలు ఈ కోటను స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత దీని పరిరక్షణ కోసం చర్యలు ప్రారంభించింది. యూనెస్కో 1993లో దీన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. (చదవండి: క్రీస్తూ పూర్వం నాటి పురాతన కట్టడాలకు వర్చువల్ త్రీడీ టెక్నాలజీతో ప్రాణం పోస్తే...)