arts
-
భారత పాదరక్షలు, తోలు పరిశ్రమకు ఊతం
భారత పాదరక్షలు, తోలు పరిశ్రమంలో ఉత్పాదకత, నాణ్యత, పోటీతత్వాన్ని పెంపొందించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025 సందర్భంగా కీలక ప్రకటన చేశారు. పాదరక్షలు, తోలు పరిశ్రమ వివిధ అంశాలకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన కేంద్రీకృత ఉత్పత్తుల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ పథకంలోని ప్రధాన అంశాలు కింది విధంగా ఉన్నాయి.డిజైన్ సామర్థ్యం: సృజనాత్మక, అధిక-నాణ్యత పాదరక్షలను సృష్టించడానికి డిజైన్ సామర్థ్యాలను పెంచడం.కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్: నాన్ లెదర్ క్వాలిటీ పాదరక్షలకు అవసరమైన కాంపోనెంట్స్ ఉత్పత్తికి మద్దతు ఇవ్వడం.యంత్రాలు: లెదర్, నాన్ లెదర్ పాదరక్షల ఉత్పత్తికి అవసరమైన అధునాతన యంత్రాలకు అనుమతులను సులభతరం చేయడం.ఈ పథకం ద్వారా 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రూ.400 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని, రూ.1.1 లక్షల కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతాయని అంచనా.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్బొమ్మల రంగానికి ప్రయోజనాలుపాదరక్షలు, తోలు పరిశ్రమపై దృష్టి పెట్టడంతో పాటు బొమ్మల రంగం అభివృద్ధిపై చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. బొమ్మల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను నిర్మించినట్లు చెప్పారు. బొమ్మల తయారీకి భారత్ను గ్లోబల్ హబ్గా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీనివల్ల బొమ్మల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి ప్రత్యేక క్లస్టర్లను సృష్టించనున్నారు. అధిక నాణ్యత, సృజనాత్మక బొమ్మలను ఉత్పత్తి చేయడానికి కార్మికుల నైపుణ్యాలను పెంపొందిస్తారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ బ్రాండ్కు ప్రాతినిధ్యం వహించే సుస్థిర తయారీ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తారు. -
ప్రతిభా భూషణాలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్, అనంత్,నాగ్, నటి శోభన, దర్శకుడు శేఖర్ కపూర్లకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.పట్టుదలే పద్మభూషణ్ వరకూ...అజిత్ తండ్రి సుబ్రమణి తమిళనాడులో పుట్టారు. అయితే కేరళ మూలాలు ఉన్న కుటుంబం. తల్లి మోహినిదిపాకిస్థాన్ లోని కరాచీ. కోల్కతాలో స్థిరపడ్డ సింధీ కుటుంబం. కాగా కోల్కతాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో మోహినితో ప్రేమలో పడ్డారు సుబ్రమణి. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సికిందరాబాద్లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఇక్కడ ఐదేళ్లు ఉంది ఆ కుటుంబం. వీరికి ముగ్గురు కుమారులు. అజిత్ రెండో కొడుకు. అజిత్కి ఏడాదిన్నర వచ్చాక చెన్నైలో స్థిరపడ్డారు. చదువులో లాస్ట్... అజిత్కి పెద్దగా చదువు అబ్బలేదు. అయితే క్రికెట్లో బెస్ట్. ఎన్ సీసీలోనూ మంచి ర్యాంకు సంపాదించాడు. కానీ సరిగ్గా చదవకపోవడంతో స్కూలు యాజమాన్యం అజిత్ని పదో తరగతి పరీక్షలు రాయడానికి అనుమతించకపోవడంతోపాటు స్కూలు నుంచి పంపించేసింది. ఆ తర్వాత రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు షోరూమ్లో మెకానిక్ అప్రెంటిస్గా చేరడం, తల్లిదండ్రుల ్రపోద్భలంతో గార్మెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో చేరడం, అవి చేస్తూనే రేసుల్లోపాల్గొనడం, ఇలా సాగింది. ఇక ఎవరో ఇచ్చిన సలహాతో సినిమాల్లో ప్రయత్నించాలనుకున్నారు అజిత్. ప్రముఖ నటుడు–రచయిత–దర్శకుడు గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘ప్రేమ పుస్తకం’ సినిమా ఆరంభమైంది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పడంతో నిర్మాత పూర్ణచంద్రరావు అజిత్ని హీరోగా తీసుకున్నారు. అయితే శ్రీనివాస్ మృతి చెందడంతో షూటింగ్ ఆగింది. ఆ తర్వాత ఆ చిత్రాన్ని మారుతీరావు పూర్తి చేశారు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు.‘ఆశై’తో హిట్ ట్రాక్: ఎస్పీబీయే తమిళ దర్శకుడు సెల్వకి చెప్పి, అజిత్కి ‘అమరావతి’లో హీరోగా నటించే చాన్స్ ఇప్పించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతోపాటు లుక్స్, నటన పరంగా అజిత్కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఓ రేసుకి సంబంధించిన ట్రయల్కి వెళుతుండగా జరిగిన ప్రమాదంలో వెన్నెముకకి సర్జరీ జరిగింది. ఆ తర్వాత ‘ఆశై’ (1995)తో అజిత్ కెరీర్ హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత చేసిన ‘కాదల్ కోటై్ట’ (ప్రేమ లేఖ), ‘వాలి’ వంటివి సూపర్ హిట్. సినిమాలు చేస్తూనే బైక్, కారు రేస్లకూ వెళుతుంటారు. ఇటీవల కారు రేసులో అజిత్ టీమ్ విజయం సాధించింది. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రాల్లో ‘విడాముయర్చి’ తెలుగులో ‘పట్టుదల’గా విడుదల కానుంది. జీవితంలోనూ అజిత్కి పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదలే నేడు ‘పద్మభూషణ్’ వరకూ తీసుకొచ్చింది. ఇక ‘అమర్కలమ్’ (1999) సినిమాలో నటించినప్పుడు అజిత్, హీరోయిన్ షాలిని ప్రేమలో పడ్డారు. 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.యాక్టివ్గా యాక్టింగ్ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ (76) గురించి నేటి తరానికి చెప్పాలంటే ‘కేజీఎఫ్’ సినిమా చాలు. ‘ప్రేమ లేఖలు’ (1977), ఆ తర్వాత ‘శాంతి క్రాంతి’, ‘శంఖారావం’ వంటి చిత్రాలతో నాటి తరం తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు బాగా గుర్తింపు ఉంది. ఇక నేటితరం తెలుగు ప్రేక్షకులకు ‘కేజీఎఫ్’ (2018) ద్వారా దగ్గరయ్యారు అనంత్ నాగ్. ఈ సినిమాలో ఆయన రచయితపాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘సంకల్ప’ (1973) చిత్రంతో కన్నడంలో నటుడిగా పరిచయం అయ్యారు అనంత్ నాగ్. ఆ చిత్రం పలు అవార్డులు సాధించడంతోపాటు నటుడిగానూ గుర్తింపు తెచ్చిపెట్టింది. 50 ఏళ్ల నట జీవితంలో దాదాపు రెండువందల కన్నడ చిత్రాల్లోనూ, హిందీ, మరాఠీ, తెలుగు, మలయాళం, ఆంగ్లంలో దాదాపు వంద చిత్రాలు... మొత్తంగా మూడ వందల చిత్రాల్లో నటించారు అనంత్ నాగ్. కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. పలు టీవీ షోల్లోనూ నటించారు. 76 ఏళ్ల వయసులోనూ యాక్టివ్గా ఉంటూ... సినిమాలు చేస్తున్నారు.కొత్త పంథాకి భూషణంశేఖర్ కపూర్ భారతీయ సినిమా రంగానికి, ముఖ్యంగా బాలీవుడ్కి మ్యాజికల్ టచ్ ఇచ్చిన నిన్నటి తరం దర్శక–నిర్మాత. చేసినవి కొన్ని సినిమాలే అయినా, సంపాదించిన కీర్తి, భారతీయ సినిమాకి తెచ్చిపెట్టిన గౌరవం గొప్పవి. ఇప్పటిపాకిస్థాన్లోని లాహోర్లో జన్మించారు. సినిమాల మీద మక్కువతో ముంబయి చేరుకున్నారు. మొదట నటుడుగా ప్రయత్నాలు చేశారు. దేవానంద్ ‘ఇష్క్ ఇష్క్ ఇష్క్’లో నటించారు. దూరదర్శన్ తొలిదశలో వచ్చిన ‘ఖాన్ దాన్’ మొదలైన టీవీ సీరియల్స్లో ప్రేక్షకులకి గుర్తుండిపోయే కొన్నిపాత్రలు చేశారు. ‘మాసూమ్’తో డైరెక్టర్గా...‘మాసూమ్’ సినిమాతో డైరెక్టర్గా తన కెరీర్ని కొత్త దారి పట్టించారు. ‘ది మేన్, విమెన్ అండ్ చైల్డ్’ అనే ఇంగ్లిష్ నవల ఆధారంగా శేఖర్ కపూర్ తీసిన సినిమా అది. భారతీయ సినిమాకి తెలియని కొత్త కథేమీ కాదు. కానీ సెన్సిబుల్గా కథని చెప్పారు. దాంతో శేఖర్ కపూర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.స్టయిల్ మార్చేశారుఇండియాలో అన్ని వర్గాల ఆడియన్స్కి శేఖర్ కపూర్ని ఓ బ్రాండ్గా మార్చిన సినిమా ‘మిస్టర్ ఇండియా’. ‘ది ఇన్విజిబుల్ మేన్’ అనే కామిక్స్ స్ఫూర్తితో ‘మిస్టర్ ఇండియా’ కథ రూపొందింది. హిందీలో అదృశ్య వ్యక్తి హీరోగా అంతకు మునుపు కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఈ ఐడియానిపాపులర్ పల్ప్ ఫిక్షన్ చేసిన ఘనత శేఖర్ కపూర్దే. కమర్షియల్ కథలను కొత్తగా చెప్పే డైరెక్టర్ వచ్చాడని బాలీవుడ్ మురిసిపోయినంత సేపు పట్టలేదు – శేఖర్ కపూర్ తన స్టయిల్ మార్చేశారు.బాండిట్ క్వీన్కి అడ్డంకులు... అవార్డులుచంబల్ లోయకి చెందిన బందిపోటు పూలన్ దేవి జీవిత గాథ ఆధారంగా ‘బాండిట్ క్వీన్’ సినిమా తీశారు శేఖర్. సెన్సేషనల్ హిట్ అయిన ఆ సినిమా పలు సెన్సార్ సమస్యలు ఎదుర్కొంది. రిలీజ్ అయ్యాక చాలా అవార్డులు గెలుచుకుంది. శేఖర్ కపూర్ దృక్పథాన్ని మార్చింది. బ్రిటన్ మహారాణి జీవితం ఆధారంగా ‘ఎలిజిబెత్’ సినిమా తీశారు. అంతర్జాతీయంగా శేఖర్ కపూర్ పేరు మారుమోగిపోయింది. ఆ చిత్రం ఆస్కార్ అవార్డ్స్లో ఏడు నామినేషన్లు దక్కించుకుంది. ఆ తర్వాత ఆయన ‘ది ఫోర్ ఫెదర్స్’ (2002), ‘ఎలిజెబెత్’కి సీక్వెల్గా ‘ఎలిజెబెత్: ది గోల్డెన్ ఏజ్’ (2007)ని తెరకెక్కించారు. ఎన్నో ఏళ్ళ క్రితమే భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన శేఖర్ కపూర్ పద్మ భూషణుడు కావడం చిత్రసీమకు లభించిన గిఫ్ట్.– తోట ప్రసాద్, ప్రముఖ సినీ రచయితఆమె కెరీర్ శోభాయమానంకేరళలోని త్రివేండ్రంలో (ప్రస్తుతం తిరువనంతపురం) 1970 మార్చి 21న జన్మించారు శోభన. ఆమె పూర్తి పేరు శోభనా చంద్రకుమార్ పిళ్లై. నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభనకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా అక్కినేని నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్’ (1986) సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు శోభన. ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్బాబు, రజనీకాంత్, మోహన్ లాల్, రాజేంద్ర ప్రసాద్, శరత్ బాబు, కార్తీక్ వంటి హీరోల సరసన నటించారు.మాతృభాష మలయాళంతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సినిమాలు చేసిన శోభన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ‘రుద్రవీణ, అభినందన, అల్లుడుగారు, అప్పుల అప్పారావ్, రౌడీగారి పెళ్లాం, రౌడీ అల్లుడు’ వంటి పలు తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. నటనలోనే కాకుండా నాట్యంలో కూడా అద్భుతంగా రాణించారు. చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ పొందిన ఆమె క్లాసికల్ డ్యాన్సర్గానూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఆమె దగ్గర నటనలోనూ, నాట్యంలోను శిక్షణ తీసుకుంటుండటం విశేషం. 1994లో ‘కళార్పణ’ అనే సంస్థను నెలకొల్పారు శోభన. ప్రస్తుతం ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని కళకు అంకితం చేశారు. ఓ వైపు దేశ విదేశాల్లో క్లాసికల్ డ్యాన్స్ షోలు చేస్తూ.. మరోవైపు డ్యాన్స్ స్కూల్ నడిపిస్తున్నారామె.నటసింహ కీర్తి కిరీటంలో...నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయస్సు 14 ఏళ్లు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.‘సాహసమే జీవితం’తో హీరోగా1984 జూన్ 1న రిలీజైన ‘సాహసమే జీవితం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత ‘డిస్కో రాజా, జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబరు 7న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. దీంతో సోలో హీరోగా స్థిరపడ్డారాయన. ఆ తర్వాత ‘కథానాయకుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, సమర సింహారెడ్డి, నరసింహæనాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, లయన్, పైసా వసూల్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. 50 ఏళ్ల నట ప్రస్థానంలో...‘భైరవ ద్వీపం, శ్రీకష్ణార్జున విజయం,పాండురంగడు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగానూ నిరూపించుకున్నారు బాలకృష్ణ. నటుడిగా పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారాయన. ఇప్పటివరకు 110 సినిమాల్లో నటించారు. వాటిలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణకి భార్య వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. -
నేటి ఆధునిక గృహాలలో నాటి ప్యాలెస్ కళ
మహారాజా ప్యాలెస్ల నుండి ఇకత్ డిజైన్ల వరకు ఆధునిక ఇళ్లలో భారతీయ కళల ప్రభావం అంతర్లీనంగా ఉంటోంది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ నమూనాల నుండి గ్రాండ్ ఆర్కిటెక్చరల్ మోటిఫ్ల వరకు, మనదైన వారసత్వం ఇంటీరియర్ డిజైన్లో కొంగొత్త నిర్వచనాన్ని చూపుతుంది.భారతీయ కళలు మ్యూజియంలు, గ్యాలరీలకు మించి విస్తరిస్తున్నాయి. ఇవి మనం నివాసం ఉండే ప్రాంతాలనూ ప్రభావితం చేస్తున్నాయి. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ నమూనాల నుండి గ్రాండ్ ఆర్కిటెక్చరల్ మోటిఫ్ల వరకు, భారతీయ వారసత్వంలోని ఈ అంశాలు ఆధునిక ఇంటీరియర్ డిజైన్ను సరికొత్తగా చూపుతున్నాయి. భారతీయ కళ, సంప్రదాయాన్ని గౌరవించే సేకరణలు సమకాలీన గృహాలలోకి ప్రవేశించి, కలకాలం నిలిచేలా రిఫ్రెష్గా భావించే ఇంటీరియర్లను సృష్టిస్తున్నాయి. వారసత్వ ప్రేరేపిత డిజైన్లు సంప్రదాయంతో ఎంతో గొప్పగా ఉంటాయని రుజువు చేస్తున్నాయి. మహారాజ ప్యాలెస్–ప్రేరేపిత ఇంటీరియర్స్భారతీయ చరిత్ర మొత్తం వైభవంతో కూడిన కథలతో నిండి ఉంటుంది. హస్తకళతో పాటు ఎన్నో అంశాలకు ఉదాహరణలుగా నిలిచే రాజభవనాలు ఉన్నాయి. ఈ రీగల్–ప్రేరేపిత డిజైన్లు గ్రాండ్ మహారాజా ప్యాలెస్ల ఆర్చ్లు, మోటిఫ్లు, విలాసవంతమైన అలంకారాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే ఇవి నేటి కాలపు అందానికి ప్రతీకగానూ ఉంటాయి. చికన్కరి సొగసుఇంటీరియర్ నిపుణుడు, మెరినో ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ మనోజ్ లోహియా మరింత వివరిస్తూ, ‘రీగల్ శ్రేణిలో గజముద్ర, వసంత, సంస్కృతి వంటి డిజైన్ లు ఉన్నాయి. ప్రతి ఒక్క అంశమూ రాజ వైభవంతో అలరారుతుంటుంది. ఆ తర్వాత భారతదేశ విభిన్న కళారూ΄ాలలో చికన్కరీ ఎంబ్రాయిడరీ ఓ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ డిజైన్లు అల్లికలతో ఉంటాయి. చేతితో తయారైన ఈ అల్లికలు సాగసుగానూ, అందుబాటులో ఉంటాయి. అలంకృత్ ఒక అలంకారమైన ఆభరణాన్ని పోలి ఉంటుంది. కర్ణిక భారతీయ చెవి΄ోగుల నుండి స్ఫూర్తిని పొందింది. సాంప్రదాయ హవేలీలలో కనిపించే ఈ తోరణాల కళ నేటి ఆధునిక ఇళ్లలోనూ కనిపిస్తుంది. వాస్తుశిల్పం కూడా ఆధునిక అమరికలో చక్కగా ఇమిడిపోయి గొప్ప వారసత్వ కళతో ఆకట్టుకుంటున్నాయి’ అని ఆయన వివరించారు.ఇకత్ వీవింగ్ డిజైన్స్ఇకత్ అనేది దాని అద్భుతమైన నమూనాలు, సజీవ రంగులకు ప్రసిద్ధి చెందిన ఒక శక్తివంతమైన కళారూపం. కొత్త మెటీరియల్లలో ఈ నమూనాలను పునఃరూపకల్పన చేయడం ద్వారా, ఆధునిక డిజైన్ సేకరణలు అదే శక్తి, చైతన్యంతో నింపుతున్నాయి. ఇంటీరియర్ డిజైనర్ శ్రీ మనోజ్ మాట్లాడుతూ– ‘ఇకత్ హస్తకళకు కేంద్రంగా ఉండే ఒక థ్రెడ్వర్క్. సముద్రపు అలల నమూనాలను తలపిస్తోంది. ప్రశాంతతను కలిగిస్తుంది. తరంగ్ పుష్పం సున్నితమైన అందాన్ని మిళితం చేస్తుంది. ఈ డిజైన్లు ఒక గదికి శిల్పకళాపరమైన అందాన్ని తీసుకువస్తాయి. సాంస్కృతిక వారసత్వం, ఆధునిక సౌందర్యాల మధ్య అంతరాన్ని తగ్గిస్తాయి’ అని తెలిపారు. (చదవండి: తప్పుని ఎత్తిచూపడం కంటే.. చక్కదిద్దడమే ఉత్తమం) -
లడఖ్ కళలను పరిరక్షిస్తున్న నూర్ జహాన్
దాదాపు పద్నాలుగేళ్ల క్రితం వేసవికాలం... నూర్జాహాన్కు మరపురాని రోజులవి. ఆమె కాలేజీలో చదువుతున్న ఢిల్లీ నుండి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. లేహ్ పాత పట్టణం ఆవరణలో కొంతమంది విదేశీయులు తారసపడ్డారు. వారు సమీపంలోని బౌద్ధ దేవాలయంలో పరిరక్షణ పనిని నిర్వహిస్తున్న బృందంలో ఉన్నారు. వారితో మాట్లాడిన కొన్ని మాటలు నూర్జాహాన్ జీవిత గమనాన్ని మార్చేశాయి. నూర్జాహాన్ కళా పరిరక్షణ రంగం గురించి చదవడం ప్రారంభించింది. 2017లో లేహ్లో తన కజిన్ వజీదా తబస్సుమన్తో కలిసి ‘షెస్రిగ్ లడఖ్’ అనే తన స్టూడియోను ప్రారంభించి, లడఖ్లోని మొదటి తరం ఆర్ట్ కన్జర్వేటర్లలో భాగమైంది.‘ఈ రంగంలోకి అనుకోకుండా ప్రవేశించాను. కళ లేదా వారసత్వానికి సంబంధించిన స్పృహ జీవితంలో చాలా ఏళ్ల తర్వాత వచ్చింది. కానీ ఒకసారి అనుకున్నది తారసపడితే గతంలోని చాలా చుక్కలను కనెక్ట్ చేయగలను’ అని భారత జాతీయ ఐస్ హాకీ జట్టుకు గోల్ కీపర్గానూ చేసిన 34 ఏళ్ల నూర్ చెబుతారు.లోతైన పరిశోధన‘‘లడఖ్లో కళల పరిరక్షణను ఎప్పుడూ వృత్తిగా పరిగణించలేదు. స్థానికుల కోసం కాదు. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టుల కోసం వచ్చి వెళ్లి΄ోవడం చూస్తుంటాం. అందుకే దీన్నే ఒక సబ్జెక్ట్గా ఎంచుకున్నాం. సుమారు రెండు దశాబ్దాల క్రితం లడఖ్లో జీవితం చాలా కఠినంగా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం లేదా కాంట్రాక్టర్గా జీవనోపాధి పొందడం ఇక్కడ ప్రాధాన్యతగా ఉండేది. నేను స్కూల్లో చేరగానే యువత దృష్టి డాక్టర్లు, ఇంజనీర్లుగా మారడం వైపు మళ్లింది. కళల పరిరక్షణ, పునరుద్ధరణ ఎప్పుడూ జీవనోపాధికి సంబంధించిన సాధనంగా పరిగణించబడలేదు. దీంతో ఈ రంగంలో ఎక్కువగా బయటి వ్యక్తులే ఉన్నారు.సవాల్గా నిలిచే రంగంలేహ్ సమీపంలోని సుమ్దా చు¯Œ లోని 13వ శతాబ్దానికి చెందిన గేట్వే స్థూపంపై నెల రోజుల΄ాటు పని చేయడం అంటే, అక్కడి స్థానికులతో కలిసి జీవించడం. గోల్డెన్ టెంపుల్ లోపల పెయింటింగ్స్పై పని చేయడంలో నిచ్చెనపై గంటల తరబడి గడిపేవాళ్లం. డిస్కిట్ సమీపంలోని సన్యాసిని ఆలయాన్ని పునరుద్ధరించడానికి, ఒక లోయలో వారాలు గడపడానికి ముగ్గురు మహిళల బృందం అవసరం అయ్యింది. విరిగిన జనరేటర్, వన్య్రప్రాణుల నుండి ఆహార నిల్వలను కాపాడుకోవడం ప్రతిదీ ఓ సవాల్గా ఉండేది. నా జీవితమంతా పట్టణ వాతావరణంలో జీవించాను కాబట్టి ఈ వాతావరణంలో పని చేస్తున్నప్పుడు చాలా సవాళ్లు ఎదుర్కొన్నాను. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్లో పీహెచ్డీ డిసెర్టేషన్పై పనిచేస్తున్నప్పుడు సొంత ప్రాక్టీస్ ప్రారంభించాలనుకున్నాను పాత పట్టణం లేహ్లో మా పూర్వీకుల శిథిలమైన ఇంటిని స్టూడియోగా మార్చాను. తంగ్కా పెయింటింగ్లు, పాత పెయింటెడ్ ఫర్నిచర్, చెక్క కళాఖండాలు, పాత గ్రంథాలు, మాన్యుస్క్రిప్టులు, మెటీరియల్లను, ముఖ్యంగా గడ్డకట్టే చలికాలంలో విషయావగాహనకు, పరిధిని విస్తరించడానికి ఇటువంటి సౌకర్యం చాలా ముఖ్యమైనది. షెస్రిగ్ లడఖ్ను స్థాపించిన ఐదేళ్ల వరకు ఇంటిని పునరుద్ధరించడం, స్టూడియో పనిని పూర్తి చేయగలిగాం. సంరక్షణ దిశగా పనులుమా బృందంలో నలుగురు ఆడ, ఒక మగ. ఐదుగురం కలిసి లడఖ్ చుట్టుపక్కల ఉన్న స్థానిక కమ్యూనిటీలు, వ్యక్తిగత ఆసక్తి ఉన్నవారిని సంప్రదించాం. నిధులు నిరంతరం సమస్య. ప్రతి ్ర΄ాజెక్ట్కు కొత్త సవాళ్లు ఉండేవి. ఉదాహరణకు,19వ శతాబ్దం మధ్యలో డోగ్రా దండయాత్ర సమయంలో, వారి సైన్యం ముల్బెఖ్ ఆలయంలో స్థావరాన్ని ఏర్పాటు చేసి దానిలో వంట చేసింది. కాబట్టి, సాధారణ పునరుద్ధరణ పనులతో పాటు, పెయింటింగ్స్పై మిగిలి΄ోయిన ధూళిని కూడా మేం శుభ్రం చేయాల్సి వచ్చింది. సంవత్సరాలుగా, వాతావరణ మార్పులు, మానవ కార్యకలాపాల కారణంగా అనేక కట్టడాలు శిథిలమయ్యాయి. గత దశాబ్దంలో లడఖ్లో అధిక వర్షపాతం వల్ల సంప్రదాయ మట్టి నిర్మాణాలకు ముప్పు కలిగింది. నిర్మాణ, అభివృద్ధి పనులు కూడా వారసత్వ ప్రదేశాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. పాత ఆలయాన్ని సంరక్షించడం కంటే కొత్త ఆలయానికి నిధులు సేకరించడం సులభమని గ్రహించిన సందర్భాలూ ఉన్నాయి.కొంతమంది మా పనిని అర్థం చేసుకుంటారు. కానీ పని పూర్తయ్యాక విషయాలు కొత్తగా కనిపిస్తాయని ఆశించే వారు చాలా మంది ఉన్నారు. పరిరక్షణ, పునరుద్ధరణ అంటే చాలా మందికి తెలియదు. కాబట్టి, మేం ఒక ప్రాజెక్ట్లో పనిచేసినప్పుడల్లా, ఆ కమ్యూనిటీని, ముఖ్యంగా పిల్లలను వచ్చి మమ్మల్ని చూడమని ఆహ్వానిస్తాం. వారసత్వంపై అవగాహన, ప్రజలు దానిని ఎలా గ్రహిస్తారు అనేది రాబోయే కాలంలో ఈ సమాచారం అత్యంత కీలకం అవుతుంది’ అని వివరిస్తారు నూర్. -
వీకెండ్ ఆర్ట్.. వారాంతాల్లో కళాత్మకతకు పదును!
పాటరీ వర్క్షాప్స్: ఈ మధ్య కాలంలో పాటరీ వర్క్షాప్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. మొత్తని మట్టితో చిన్న చిన్న కళాకృతమైన కుండలు, బొమ్మలు, ఇంట్లో అలంకార వస్తువులను తయారు చేయడంపై శిక్షణ అందిస్తారు. గ్రామీణ మూలాల్లోంచి కొనసాగుతున్న కళ కావడం, అంతేగాకుండా ఈ పాటరీకి ప్రస్తుతం మార్కెట్లో మంచి ఆదరణ ఉండటంతో ఈ వర్క్షాప్స్కు ఔత్సాహికులు నిండిపోతున్నారు. తయారు చేసే సామాగ్రి, పనిముట్లు తదితరాలను నిర్వాహకులే సమకూరుస్తున్నారు.మ్యూజిక్ సైన్స్..సంగీతాన్ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో.. అయితే.. ఈ సంగీతాన్ని ఆస్వాదించడం పోయి వాయించడం అభిరుచిగా మార్చుకుంటున్నారు నగరవాసులు. గిటార్, వయోలిన్, డ్రమ్స్, ఫ్లూట్ ఇలా ఏదో ఒక సంగీత వాయిద్యంపై పట్టు పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఓ వైపు ఐటీ జాబ్స్ చేస్తూనే ఇలాంటి ఆర్ట్స్పై అవగాహన పెంచుకుంటూ మ్యూజిక్ బ్యాండ్స్లో సైతం సభ్యులుగా మారుతున్నారు. వీటి శిక్షణ కోసం పలు సంగీత శిక్షణ కేంద్రాలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖా ఆధ్వర్యంలోని కేంద్రాలు సైతం ఉన్నాయి.థియేటర్ ఆర్ట్స్..కొంతకాలంగా సిటీలో థియేటర్ ఆర్ట్స్కు ఔత్సాహికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నటనలో, నాటకాల్లో శిక్షణ పొందుతూ.. థియేటర్ ప్లేలు ప్రదర్శిస్తూ వినూత్న ఒరవడికి నాంది పలుకుతున్నారు. వీటి కోసం రవీంద్రభారతి, తెలుగు యూనివర్సిటీ కళాప్రాంగణం, రంగభూమి వంటి వేదికలు ఆవకాశాలను కలి్పస్తున్నాయి. రంగస్థలంపై రాణించిన యువతకు సినిమాల్లో అవకాశాలు సైతం వస్తుండటంతో థియేటర్ ఆర్ట్స్ మోడ్రన్ యాక్టివిటీగా మారింది. అన్ని రంగాల్లో జాబ్స్ చేస్తున్న వారు ఇందులో భాగస్వామ్యం అవుతుండటం విశేషం.గార్డెనింగ్.. మోడ్రన్ ఆర్ట్..ఈ మధ్య మొక్కలు పెంచడం కూడా ఓ కళగా మారింది. ఇందులో ఇంటీరియర్, ఎక్స్టీరియర్, టెర్రస్ గార్డెనింగ్ అంటూ విభిన్న రకాలుగా ఉన్నాయి. నగరంలోని కొందరు మొక్కల ప్రేమికులు సోషల్ యాప్స్లో గ్రూపులుగా మారి ఈ గార్డెనింగ్పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా నగర జీవనశైలి దృష్ట్యా టెర్రస్ గార్డెనింగ్ ఔత్సాహికలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ప్రత్యేకంగా మీట్స్ ఏర్పాటు చేసుకుని మొక్కలను, వాటి విత్తనాలను ఒకరికొకరు పంచుకుంటున్నారు. ఇదే వేదికలుగా ప్లాంటేషన్పై అనుభవజు్ఞలు, నిపుణులచే అవగాహన పొందుతున్నారు.నిత్యం ఒత్తిడి పెంచే సిటీ లైఫ్లో గార్డెనింగ్ అనేది వినూత్న కళగా అవతరించింది. ఇవేకాకుండా పెయింటింగ్, రెసిన్ ఆర్ట్స్, హ్యండ్ క్రాఫ్ట్, పేపర్ క్రాఫ్ట్, మైక్రో ఆర్ట్స్, జుంబా వంటి విభిన్న కళా అంశాలపై శిక్షణ పొందుతూ తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. వారి కళాత్మకతను సోషల్ మీడియా వేదికగా రీల్స్, షేర్లు, పోస్టులతో ప్రమోట్ చేసుకుంటూ సోసల్ సెలబ్స్గా మారుతున్నారు. -
Hyderabad: పటోలా ఆర్ట్స్.. వస్త్ర ప్రదర్శన ప్రారంభం!
సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్లోని లేబుల్స్ పాప్–అప్ స్పేస్ వేదికగా కొలువుదీరిన ’డి సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన’ను ప్రముఖ సామాజికవేత్త బినా మెహతా ప్రారంభించారు. విభిన్నమైన హ్యాండ్లూమ్ చీరలతోపాటు పటోలా ఆర్ట్ చీరలు, డిజైనర్ వేర్ వ్రస్తోత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు. వస్త్ర ఉత్పత్తులను ఫ్యాషన్ప్రియులకు నేరుగా అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు.డి సన్స్ పటోలా ఆర్ట్స్ ఎక్స్పో నిర్వాహకులు భవిన్ మక్వానా మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు మంచి మార్కెట్ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ లక్ష్యమని వివరించారు. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో రాజ్కోట, పటోలా దుపట్టా, పటోలా శాలువాలు, సింగిల్ పటాన్ చీరలు, సింగిల్ పటోలా దుప్పట, పటాన్ పటోలా చీరలు, సిల్క్ టిష్యూ పటోలా వంటి 2 వేల రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.35 మంది కళాకారులు.. 70 చిత్రాలు!– ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైన చిత్రప్రదర్శనమాదాపూర్: కళాకారులు వేసిన చిత్రాలు సందేశాత్మకంగా ఉన్నాయని తెలంగాణ టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్ అన్నారు. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్గ్యాలరీలో సోమవారం ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శనను ఆమె ప్రారంభించారు.మున్ముందు చిత్రకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. 35 మంది కళాకారులు వేసిన 70 పెయింటింగ్ చిత్రాలు అందుబాటులో ఉన్నాయని ఈ నెల 25వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలికేరి, ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్షి్మ, టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఎం.డి. ప్రకాశ్రెడ్డి, టూరిజం డైరెక్టర్ ఇలా త్రిపాఠి, భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కళాకారులు పాల్గొన్నారు. -
మహిత.. తానొెక సూక్ష్మ లిఖిత!
అన్నం మహిత... చిన్నప్పుడు పెన్సిల్తో బొమ్మలు వేసింది. ఇప్పుడు పెన్సిల్ మీద గ్రంథాలు చెక్కుతోంది. మహనీయుల జీవిత చరిత్రలను పెన్సిల్ మీద రాస్తోంది. ఇప్పటి వరకు ఆమె రాసిన జీవిత చరిత్రలు, మహాగ్రంథాల జాబితా ఆమె వయసుకంటే పెద్దదిగా ఉంది. ఆంధ్రప్రదేశ్, బాపట్ల జల్లా, కారంచేడు మండలం, స్వర్ణ గ్రామానికి చెందిన మహిత... తాను సాధన చేస్తున్న మైక్రో ఆర్ట్ గురించి ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్న వివరాలివి..‘‘చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఇష్టం. ఇంటర్ పూర్తయి డిగ్రీలో చేరినప్పుడు కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. ఆ ఖాళీ టైమ్లో బియ్యం మీద వినాయకుడు, జాతీయ పతకాలను చెక్కాను. ఆ తర్వాత మినుములు, పెసలు, బొబ్బర్లు మీద బొమ్మలు చెక్కాను. వాటిని చూసి మా నాన్న మహాభారతం ట్రై చెయ్యి, నీ సాధనకు గుర్తింపు వస్తుందన్నారు. సంస్కృత భాషలో మహాభారతంలోని 700 శ్లోకాలను 810 పెన్సిళ్ల మీద చెక్కాను. మొత్తం అక్షరాలు 67, 230, పదాల్లో చె΄్పాలంటే 7,238.కళను సాధన చేయడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే... ఒకటి పూర్తయిన తర్వాత మరొకటి చేయాలనిపిస్తుంది. మహాభారతం తర్వాత వాసవీ కన్యకాపరమేశ్వరి జీవిత చరిత్ర, పుట్టపర్తి సాయిబాబా చరిత్ర, అనేకమంది ప్రముఖుల జీవితచరిత్రలను పెన్సిల్ ముక్కు మీద రాశాను. జాతిపిత మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అమరజీవి ΄÷ట్టి శ్రీరాములు, నెల్సన్మండేలా, ప్రధాని నరేంద్రమోదీ, స్వర్గీయ ఎన్టీఆర్, వైఎస్సార్, అంబేద్కర్, కరుణానిధి, కేసీఆర్, నరేంద్రమోదీ, ఎంఎస్రెడ్డితో΄ాటు ఏఎన్ఆర్ ఇంకా అనేక మంది సినీ ప్రముఖుల జీవితచరిత్రలను చెక్కాను. మన జాతీయగీతాన్ని ΄ాస్తా మీద చెక్కాను.కర్ణాటక రాష్ట్ర అవతరణ చరిత్రను కూడా రాశాను. నా కళకు గుర్తింపుగా చీరాల రోటరీ క్లబ్తో మొదలు ఉత్తరప్రదేశ్ ఆర్ట్ కాంపిటీషన్ వరకు అనేక పురస్కారాలందుకున్నాను. ఈ కళాసాధనను కొనసాగిస్తాను’’ అన్నారు అన్నం మహిత. సూక్ష్మ కళ ఆసక్తి కొద్దీ సాధన చేసే వాళ్లతోనే మనుగడ సాగిస్తోంది. ప్రభుత్వం నుంచి శిక్షణ అవకాశం లభిస్తే ఎక్కువ మంది కళాకారులు తయారవుతారని ఈ సందర్భంగా మహిత తన అభిలాషను వ్యక్తం చేశారు. – వంగూరి సురేశ్కుమార్, సాక్షి, బాపట్ల జిల్లా -
Sahaya Sharma: తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ..
బామ్మ జీవితం నుండి ప్రేరణం పొంది అబ్స్ట్రాక్ట్ ఆర్టిస్ట్గానూ తల్లి సంగీత పరిజ్ఞానాన్ని ఒంటపట్టించుకొని సంగీత కళాకారిణిగానూ ఒకేసారి రెండు కళల్లోనూ రాణిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది ఢిల్లీవాసి సహాయ శర్మ. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ యువతరపు ఆలోచనలకు అద్దం పడుతుంది.‘‘నా ఎదుగుదలలో సంగీతం పాత్ర చాలా పెద్దది. మా అమ్మ సంగీత కళాకారిణి. తను పాడుతుండటాన్ని నా చిన్ననాటి నుంచి వింటూ, నేనూ పాడుతూ పెరిగాను. సంగీత ప్రపంచం నుంచి నాదైన సొంత శైలిని కనుక్కోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉండేదాన్ని. స్కూల్, కాలేజీ రోజుల్లో ఎప్పుడు సెలవులు వచ్చినా రకరకాల పాటల్ని డౌన్లోడ్ చేసుకొని, ఒక ప్రత్యేకమైన జాబితా తయారు చేసేదాన్ని.సొంతంగా ఆల్బమ్స్ విడుదల..కిందటేడాది ముంబయిలో కిందటేడాది మా ఫ్రెండ్ మ్యూజిక్ స్టూడియోని సందర్శించాను. అక్కడ నేను రాసిన ఒక పాటను ప్లే చేశాను. ఆ పాట విన్నాక, వారు తమతో కలిసి పనిచేయవచ్చని చెప్పారు. దీంతో కిందటేడాది జూలై నాటికి అనుకున్న పాటను పూర్తి చేశాను. ఈ యేడాది మార్చిలో ‘ఫెడెక్స్ ఫెడప్’ ని విడుదల చేశాను. నా వ్యక్తీకరణను ప్రపంచంతో పంచుకోవడానికి ఇది సరైన సమయం అని భావించాను. గొడవల నుంచి పాటలు..రెండేళ్ల క్రితం మా కుటుంబసభ్యులతో చాలా గొడవ పడ్డాను. భగవద్గీత ఒక శ్లోకంలో కోపానికి, భయానికి మూలకారణం అనుబంధమే అని చెబుతోంది. దీనినుంచే నా ఆల్బమ్ పుట్టిందని చెప్పవచ్చు. ఒక సమయంలో జీవితం స్తంభించుకు΄ోయినట్టుగా అనిపిస్తుంది. అలాంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి మ్యూజిక్ ఆల్బమ్ చేశాను.96 బిపిఎమ్ అనేది నాన్నతో గొడవ తర్వాత రాశాను. ఈ గొడవ తర్వాత స్త్రీ ప్రవర్తన నాకు కొత్తగా అర్థమయ్యేలా చేసింది. జీవితంలోని ఆచరణాత్మక దృక్పథాన్ని, భగవంతుని పట్ల ఉండే భక్తి అన్నీ బలమైన మనిషిగా తీర్చిదిద్దాయి. నా పాటలోని సాహిత్యం అంతా ఇలాగే ఉంటుంది. ‘నేను మళ్లీ కలుస్తూనే ఉంటాను. రౌండ్ అండ్ రౌండ్గా తిరుగుతూనే ఉంటాను...’ అని సాగుతుంది. ఇప్పటికి మూడు ఆల్బమ్స్ విడుదలయ్యాయి.చిత్రకళలో ఓదార్పు..రంగులలో లోతైన ఓదార్పును, శాంతిని కనుక్కోవడానికి ఉపయోగపడేదే పెయింటింగ్. సంగీతం ద్వారా నన్ను నేను బయటకు వ్యక్తపరుచుకుంటే పెయింటింగ్లో నన్ను నేను వెతుక్కోగలిగాను. ఇలా ఈ రెండు కళలు నన్ను కొత్తగా ఆవిష్కరింపజేశాయి. మా బామ్మ తన చీరలపై రకరకాల పెయింటింగ్స్ను చిత్రిస్తుండేది. వాటిని చూస్తూ నేనూ సాధన చేసేదాన్ని. అలా రంగుల ప్రపంచం నాకు పరిచయం అయ్యింది. అంతేకాదు, మా ఇల్లు రకరకాల పెయింట్స్, శిల్పాలతో ఒక ఆర్ట్ మ్యూజియంలా ఉంటుంది.మా నాన్న అంత అందంగా తీర్చిదిద్దారు ఇంటిని. ఇది కళాకారిణిగా నా విజువల్ కార్టెక్స్లోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేసింది. అక్కడి కళాకృతుల సేకరణలో అమ్మ అభిరుచి, మన దేశీయ సంస్కృతి... నాలో లోతైన గాఢత నింపాయి. ఆ ఇష్టంతోనే సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశాను. రంగులతో ఆధ్యాత్మిక ప్రపంచాలను సృష్టిస్తుంటాను. సోలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుంటాను. భార తదేశం, న్యూయార్క్, లండన్, బోస్టన్, దుబాయ్, హాంకాంగ్లోని కేఫ్లు, కోర్టులు, హోటళ్లు, గెస్ట్ హౌజ్ గోడలను నా పెయింటింగ్స్ అలంకరించాయి. మార్చిన ప్రయాణాలు..అమ్మానాన్నలతో కలిసి దేశమంతా తిరిగిన రోడ్డు ప్రయాణాలు, జంగిల్ సఫారీలు, ట్రెక్కింగ్ ఏరియాలు నన్ను ప్రకృతికి దగ్గర చేశాయి. నా తల్లితండ్రులు ప్రయాణంలో సంగీతం, కళ, కథలు, సంస్కృతిని పరిచయం చేశారు. అప్పటినుంచి అందమైన ప్రకృతి దృశ్యాలను నా పెయింటింగ్స్ లో చూపించడం అలవాటు చేసుకున్నాను.కరోనా సమయంలో జీవితం ఎంత చిన్నదో కదా అనిపించింది. అప్పుడు భౌతికంగా, ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. విలాసవంతమైన జీవనం అవసరమా అనేది తెలుసుకున్నాను. నా వాస్తవికత ఏమిటో అర్థమయ్యాక నేనేం సృష్టించాలో తెలుసుకున్నాను. అందువల్ల మ్యూజిక్ ఆల్బమ్స్, పెయింటింగ్స్ నన్ను కొత్తగా మార్చాయి’’ అని వివరిస్తుంది సహాయ. -
NRI: హాంగ్కాంగ్లో జేమీ లీవర్ పండించిన నవ్వుల డోలలు!
మే 1979లో ఒక సొసైటీ గా నమోదు చేయబడిన ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ అనేది లాభాపేక్ష లేని సంస్థ. సభ్యులు మరియు సాధారణ ప్రజల కోసం భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, సభ్యులలో నాటకం, సంగీతం, నృత్యం, సాహిత్యం మరియు దృశ్య కళలపై ఆసక్తిని పెంపొందించడం మరియు ఇలాంటి సంస్థలతో సహకరించడం దీని లక్ష్యాలు. స్థానిక ప్రతిభావంతులకు అవకాశాలను అందించడానికి ఈ బృందం ప్రతి సంవత్సరం రెండు కార్యక్రమాలను నిర్వహిస్తుంది మరియు భారతదేశం నుండి ప్రఖ్యాత కళాకారులను కూడా ఆహ్వానిస్తుంది. భారత కాన్సుల్ జనరల్ మరియు శ్రీమతి పూర్విజ్ ష్రాఫ్ గౌరవ పోషకులు, మరియు శ్రీ జి.టి. గుల్ సర్కిల్ యొక్క శాశ్వత సలహాదారుగా సేవలు అందజేస్తున్నారు.కోవిడ్ తరువాత అంటే నాలుగు సంవత్సరాల తరువాత మొదటి సారి, ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ ఈ సంవత్సరం మన తెలుగు అమ్మాయి జేమి లీవర్ ని హాంగ్ కాంగ్ కి ఆహ్వానించారు. "గూన్జ్ సితారోన్ కి" అనే సాంస్కృతిక వినోద కార్యక్రమం 18 ఏప్రిల్ న స్థానిక సిటి హాల్ లో నిర్వహించారు. పూర్వ చైర్ పర్సన్ శ్రీమతి రాణి సింగ్ , చైర్ పర్సన్ శ్రీమతి రానూ సింగ్ , ఉపాధ్యక్షుడు సర్దార్ నవ్తేజ్ సింగ్ మరియు కార్యదర్శి శ్రీమతి జయ పీసపాటి మరియు ఇతర కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. చైర్ పర్సన్ శ్రీమతి రానూ సింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించటానికి భారత కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీమతి సత్వంట్ ఖనాలియా గారిని ఆహ్వానించి సన్మానించారు. సత్వంత గారు ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలను మరియు కళారులకి ఒక చక్కని వేదికని అన్జేస్తున్నందుకు,వారిని ప్రోత్సహిస్తున్నందుకు ప్రశంసించారు. స్థానిక కళాకారుల బాలీవుడ్ , హిప్ హాప్, జానపద , నృత్యాలతో మరియు అలనాటి మధుర గీతాలతో ప్రారంభమైన ‘గూన్జ్ సితారోన్ కి” ని ప్రేక్షకులు ఆనందిస్తూ కరతాళ ధ్వనులతో కళాకారులని ప్రోత్సహించారు. అప్పుడు జేమీ లీవర్ ఎంట్రీ ఇచ్చారు … ఇంకా అప్పటినుంచి నవ్వుల పువ్వుల పండిస్తూ జేమీ మిమిక్రీ తో కామిడి చేస్తూ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ హేమ మాలిని , మలాయికా, దీపికా పడుకోన, కంగనా రనౌత మో వారిని అనుకరిస్తూ తనకు ప్రత్యెక గుర్తింపు తెచ్చిన ప్రముఖ గాయని ఆశా భోంస్లే , కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ మరియు తన తండ్రి జాని లీవర్ ల మిమిక్రీ తో ఉత్తేజభరితమైన వాతావరణo ప్రేక్షకులని ఆనందోత్సాహాలతో ముంచేసింది. హాస్యంలో మిమిక్రి, గానం, నృత్యంమేళవించి ఒక గంట సేపు నవ్వుల మారథాన్ చేసారు జేమి!! ప్రముఖ సిని నటుడు, కమెడియన్ జాని లీవర్ అసలు పేరు జాన్ ప్రకాష్ రావు జనుముల, అయితే ఆయన హిందూస్తాన్ లేవేర్స్ లో పని చేస్తూ స్టాండ్ అప్ కామెడి పండించి స్టాఫ్ ని నవ్వుల డోలలూగించినప్పుడు, యాజమాన్యం వారు ఆయనకీ 'లీవర్' అని పేరు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఇంటి పేరే 'జానీ లీవర్' పాపులర్ అయ్యింది. తెలుగు హిందీ చిత్రరంగం లో కమెడియన్ గా పేరొందిన ప్రముఖ నటులు తండ్రి జానీ లీవర్ ప్రతిభని పుణికి పుచ్చుకుంది అని జెమీ లీవర్ గురించి చెప్పడం అతిశయోక్తి కాదేమో ! హాంగ్ కాంగ్ కళా ప్రేమికుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాయించుకున్న జేమి తను ఇంత ఉత్సాహభరితమైన ప్రేక్షకుల మధ్య ప్రదర్శించడం తనకి ఎంతో ఆనందంగా వుందని హర్షం వ్యక్తం చేసారు. స్థానికంగా విచ్చేసిన ప్రముఖులు , భారతీయ కన్సులార్ శ్రీ కుచిభోట్ల వెంకట్ రమణ గారు తదితరులు జేమి కి తమ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆమె స్టాండ్ అప్ కామెడి లో గొప్ప శిఖరాలను అందుకోవాలని త్వరగా మరల హాంగ్ కాంగ్ రావాలని స్థానికులు ఆశ వ్యక్తం చేసారు అందుకు జేమి తన చెరగని చిరునవ్వుతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ జేమీ గౌరవార్ధం విందు భోజనం ఏర్పాటు చేసి అభినందించారు. జేమి ఇంస్టా లింక్ మీకోసం https://www.instagram.com/p/C58BqvivjhS/https://www.instagram.com/p/C5qEy7FoTut/?img_index=1ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ ఇంస్టా లింక్ https://www.instagram.com/p/C58IYSFy8qR/ -
వెలుగులు చిమ్మిన నందులు
‘కళలు ఉన్నంతకాలం నా గుండెను వేదిక చేస్తా కళాకారుణ్ణి బతికిస్తా...’ ఇది ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కళాకారులకు ఇచ్చిన భరోసా. డిసెంబర్ 23 నుంచి 29 వరకు గుంటూరు నగరంలో రాష్ట్ర ప్రభుత్వ 2022 వ సంవత్సర ‘నంది’ నాటకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండీ వందల సంఖ్యలో కళాకారులు ఏడురోజులూ ఉత్సాహంగా వీటిలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ‘చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ’ ఆధ్వర్యంలో స్వర్గీయ బలిజేపల్లి లక్ష్మీకాంతం కళాప్రాంగణం (శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం – ఎ.సి.) ఇందుకు వేదికైంది. ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి పర్యవేక్షణలో విజయ కుమార్ రెడ్డి, శేషశాయి ఇత్యాది ఉన్నతాధికారులు, సిబ్బంది చేసిన ఏర్పాట్ల పట్ల కళాకారులు సంతుష్టి వ్యక్తం చేశారు. కళాకారులకు, అతిథులకు, ప్రదర్శన లకు చేసిన ఏర్పాట్లు తదితర అంశాల్లో ఈ ఉత్సవాలకూ గతంలో జరిగిన ఉత్సవాలకూ హస్తిమశకాంతరం ఉందనీ, ఇంత ఘనంగా, ఎంతో పారదర్శకంగా... మరీ ముఖ్యంగా టైమ్ ప్రకారం – గతంలో ఎన్నడూ జరగ లేదని పలువురు కళాకారులు అన్నారు. ఆర్టిస్టులకు, అతిథులకు స్టార్ హోటళ్లలో బస ఏర్పాటుచేశారు. అల్పాహార, భోజన సదుపాయం పట్ల కూడా అందరూ ఆనందం వ్యక్తం చేయడం విశేషం. రెండు మూడు తరగతులు చదువుతున్న బుడతల నుండి... జీవితాన్ని కాచి వడపోసిన... డెబ్భైలు దాటిన సీనియర్ మోస్ట్ కళాకారుల వరకూ పాల్గొనడం ఈ ఉత్సవాల ప్రత్యేకత. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ‘2022 నంది నాటక ఉత్సవా’లను ఇప్పుడు నిర్వహించారు. వివిధ విభాగాలకు సంబంధించి 115 ఎంట్రీలు రాగా ప్రాథమిక పరిశీలన అనంతరం– పద్య నాటకాలు 10 (ప్రదర్శన పారితోషికం రూ. 50 వేలు), సాంఘిక నాటకాలు 6 (రూ. 40 వేలు); సాంఘిక నాటికలు 12 (రూ. 25 వేలు); బాలల విభాగంలో 5 (రూ. 25 వేలు); కాలేజీ, యూనివర్శిటీ విద్యార్థుల విభాగంలో 5 (రూ. 25 వేలు) మొత్తం 38 నాటక, నాటికలను ప్రద ర్శించారు. మొత్తం 72 బహుమతుల కోసం దాదాపు పన్నెండొందల మంది కళాకారులు హోరాహోరీ తల పడ్డారు. పద్య నాటక విభాగంలో మాధవవర్మ – విజయవాడ (ప్రథమ రూ. 80 వేలు, బంగారు నంది), శ్రీకాంత కృష్ణమాచార్య – విశాఖ (ద్వితీయ రూ. 60 వేలు, రజిత నంది); వసంతరాజీయం – హైదరాబాద్ (తృతీయ రూ. 40 వేలు, కాంస్య నంది) విజేతలుగా నిలిచాయి. అలాగే.. సాంఘిక నాటకాల విభాగంలో ఇంద్ర ప్రస్థం – గుంటూరు (రూ 70 వేల నగదు, బంగారు నంది), ఇంపోస్టర్స్ – హైదరాబాద్ (రూ. 50 వేల నగదు, రజత నంది); కలనేత – హైదరాబాద్ (రూ. 30 వేల నగదు, కాంస్య నంది); సాంఘిక నాటికల విభా గంలో అస్తికలు – పెదకాకాని (రూ. 40 వేల నగదు, బంగారు నంది), కమనీయం – గుంటూరు (రూ. 30 వేల నగదు, రజత నంది), చీకటిపువ్వు – కరీంనగర్ (రూ. 20 వేల నగదు, కాంస్య నంది); బాలల విభాగంలో ప్రపంచతంత్రం – విజయవాడ (రూ. 40 వేల నగదు, బంగారు నంది), బాధ్యత – రాప్తాడు (రూ. 30 వేల నగదు, రజత నంది), మూడు ప్రశ్నలు – విజయవాడ (రూ. 20 వేల నగదు, రజత నంది); యువజన విభాగంలో ఇంకానా..? – విజయవాడ (రూ. 40 వేల నగదు, బంగారు నంది), కపిరాజు – గుంటూరు (రూ. 30 వేల నగదు, రజత నంది), ఉద్ధంసింగ్ – తిరుపతి (రూ. 20 వేల నగదు, కాంస్య నంది) బహుమతులను గెలుచుకున్నాయి. నాటకరంగంపై రచనల్లో ‘రాయలసీమ నాటక రంగ వికాసం’ (రచయిత డా. మూల మల్లికార్జునరెడ్డి) ఉత్తమ రచనగా ఎంపికైంది. ‘ఎన్టీఆర్ స్మారక రంగస్థల పురస్కారా’న్ని డా. మీగడ రామలింగస్వామి – విశాఖకు (రూ. 1.5 లక్షల నగదు, ప్రత్యేక జ్ఞాపిక), ‘వైఎస్సార్ స్మారక రంగస్థల అవార్డ్’ను యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్–కాకినాడ (రూ. 5 లక్షల నగదు, ప్రత్యేక జ్ఞాపిక)ను అందించారు. దర్శకత్వం, రచన సహా పలు అంశాల్లో వ్యక్తిగత అవార్డులు, నగదు బహుమతులు అందజేశారు. వ్యక్తిగత బహుమతుల నగదు మొత్తాన్ని ఐదురెట్లు పెంచుతున్నట్లు చైర్మన్ పోసాని ప్రకటించడంతో కళా కారుల ఆనందానికి అవధుల్లేవు. మైక్, లైటింగ్ సిస్టం అద్భుతంగా పనిచేయడం ఉత్సవాల విజయానికి దోహదపడింది. పక్కా ప్రణాళికతో... ఎప్పటికప్పుడు ప్రాక్టికల్ సమీక్షలతో మొత్తం కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేశారంటూ పోసాని టీమును ఆర్టిస్టులు, అతిథులు మనఃపూర్వకంగా అభినందించడం ఈసారి ’నంది’ పండగ హైలైట్. – జి.వి. రంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ -
కళలు అనే వర్షం కావాలి! అప్పుడే..
అన్నార్భవంతు భూతాని... అసలు ప్రాణుల పుట్టుకకు, మనుగడకు అన్నం కావాలి. అన్నం దొరకాలంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. ఆకాశంలో నుంచి పడిన వర్షంతో భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్లు, ఒక దేశసంస్కృతి నిలబడాలంటే కళలు.. అనే వర్షం కావాలి. కళల ద్వారా సంస్కృతి పెరుగుతుంది. సంస్కృతి పెరిగితే ప్రజల ఆచార వ్యవహారాలు, జీవనశైలి, నడవడిక, ఆ దేశపు కీర్తిప్రతిష్ఠలు నిర్ణయింప బడతాయి. కళలు... అంటే కవిత్వం, శిల్పం, నృత్యం, వాద్యం.. ఎప్పుడూ అవతలివారికి సంస్కృతిని కల్పించేవి అయి ఉంటాయి. ఇవన్నీ కళలు కాబట్టి ఇవి వర్షం లాంటివి. అవి సంస్కృతిని మొలకెత్తించడానికి కారణం కావాలి. మన దేశానికి ఇన్ని కీర్తిప్రతిష్ఠలు రావడానికి కారణం ఏమిటి? భగవద్గీత పుట్టిన భూమి. రామాయణం, భారతం, భాగవతం వంటివి పుట్టిన భూమి. గంగానది ప్రవహిస్తున్న భూమి. ఒకనాడు తాళంకప్ప అవసరం తెలియని భూమి. సంస్కృత భాషలో తాళం కప్ప అన్నదానికి పదం లేదు.. ఆ అవసరం రాలేదు. కారణం – పరద్రవ్యాణి లోష్ఠవత్... రహదారిమీద రాయి దొరికితే నాది కాదు అని ఎలా అంటామో అలాగే నాది కానిదేదీ, పరవాడివస్తువు ఏదయినా నాకు దొరికితే నాది కాదు కాబట్టి అది నాకు రాయితో సమానమే... అన్న భావన. అదీ ఈ దేశ సంస్కృతి. ఇది ఎక్కడినుంచి వచ్చింది? రామాయణంలో నుంచి, భారతంలోంచి.. వచ్చింది. నీదికానిది నీవు కోరుకుంటే .. పతనమయి పోతావన్న హెచ్చరిక... దాని జోలికి వెళ్ళనీయదు. కళలు ఈ దేశపు సంస్కృతిని ప్రతిబింబించేవి అయి ఉంటాయి. మీరు ఏది వింటున్నా, ఏది చూస్తున్నా, మనశ్శాంతికి కారకమైన భగవంతుని తత్త్వాన్ని ఆవిష్కరింపచేసేవిగా ఉంటాయి. ఒక నృత్యం జరుగుతోంది. ‘కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభమ్ నాసాగ్రే నవమౌక్తికమ్...’ అంటూ సాగుతున్న కీర్తనకు నర్తకి అభినయిస్తుంటే నర్తకి క్రమేణా కనుమరుగై కృష్ణపరమాత్మ కనబడడం మొదలవుతుంది. పాట అభినయంగా మీకు శ్రీకృష్ణ దర్శనం చేయించి, మీ ఉద్వేగాలను శాంతపరుస్తుంది. పాలగిన్నె కింద అగ్నిహోత్రం పెడితే పాలు పొంగుతాయి. నీళ్ళు చల్లితే పొంగు చల్లారుతుంది. అలా మనదేశంలో ఉన్న కళలు మన భావోద్వేగాలను అణచి ప్రశాంతతను, మనశ్శాంతిని కల్పించడానికి ఉపయుక్తమయ్యాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని, ఆదరణనూ పొందాయి. ఈ కళలన్నీ శాంతిని ప్రసాదించగల దివ్యత్వాన్ని సంతరించుకున్నాయి. ఇవన్నీ కూడా వేదాలకు ఉపవేదాలయినటువంటి వాటి నుంచి వచ్చాయి. సామవేదానికి గాంధర్వ వేదం ఉపవేదం. మిగిలినవి ఇతర వేదాలకు ఉపవేదాలు. వేదానాం సామవేదోస్మి... అన్నాడాయన. ఎందుకు అంతస్థాయిని పొందింది? అంటే తినడం ఒక్కటే కాదు, శరీరం పెరగడం ఒక్కటే కాదు ప్రధానం, అది ఎంత అవసరమో, మనసు సంస్కారవంతంగా తయారు కావడం కూడా అంతే ప్రధానం. (చదవండి: మెట్ట వేదాంతం..?) -
మొక్కలు రావాలంటే భూమికి తడి తగలాలి..సంస్కృతి నిలబడాలంటే..
ఊపిరి వాక్కుగా మారిన కారణంగా శరీరం పడిపోయినా, కీర్తి శాశ్వతంగా నిలబడిపోతుంది. నిజానికి మనకు సనాతన ధర్మంలో గొప్పది వేదం. వేదం అపౌరుషేయం. ఈశ్వరుడిచేత చెప్పబడినది. ఈశ్వరుడు ఎంత సనాతనుడో వేదం అంత సనాతనమైనది. నా ఊపిరి రెండు కాదు, ఊపిరి తీస్తున్నంతసేపే ‘నేను’ నేనుగా ఉన్నాను. ఊపిరి తీస్తూ మాట్లాడమంటే మాట్లాడలేను. ఊపిరి విడిచి పెడుతున్నప్పుడు అది వాక్కుగా మారుతుంది. తీసిన ఊపిరులను సమాజ శ్రేయస్సు కోసం వాక్కులుగా మార్చిన వారున్నారు. తామేదీ ఆశించకుండా కేవలం సమాజ శ్రేయస్సే కోరుకున్నారు వారు. భగవంతుడిచ్చిన ఊపిరిని వాక్కుగా మార్చి మాట్లాడుతున్నాను, అది నన్ను శాశ్వతుడిని చేస్తుందన్నాడు పోతన. శాశ్వతమైనది పరబ్రహ్మము. దానిలో చేరిపోతాను... అన్నాడు. శంకరాచార్యులవారు శివానందలహరి చేస్తూ..అసలు భక్తికి చివరి మాట ఏది అన్నదానికి సమాధానంగా ... ‘‘అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచికా/ సాధ్వీ నైజ విభుం లతా క్షితి రుహం సింధు స్సరిద్వల్లభమ్/ ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదార వింద ద్వయమ్/ చేతో వృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే ’’ అంటారు. నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక నదికి రంగు, రుచి ఇవేం ఉండవు. అటువంటి త్యాగమయ జీవితాన్ని గడిపి భగవంతునిలో ప్రవేశించాడు, నది సముద్రంలో కలసిపోయినట్లు కలిసిపోయాడు. కానీ ఆయన మాత్రం లోకంలో చిరస్థాయిగా ఉండిపోయాడు. ఎలా ... వాక్కు కారణంగా. భారతం ద్వారా నన్నయ అలా ఉండిపోయాడు. ఎర్రాప్రగడ, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, రామదాసు... వీళ్ళందరూ అలాగే వాక్కుల కారణంగా ఉండిపోయారు. ఆ వాక్కును కొందరు పద్యరూపంగా, కొందరు గద్యరూపంగా, శ్లోకంగా, పాటగా చెప్పారు. పాటకున్న లక్షణం .. అది సంస్కృతికి మూలకందమై నిలబడుతుంది. భూమినుంచి మొక్కలు పుట్టాలి... అంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. అందుకే గ్రీష్మం తరువాత వర్షరుతువు వస్తుంది. దానిముందు ఆషాఢమాసం ప్రవేశించగానే ప్రతి ఊరిలోనూ అధిష్ఠాన దేవతయిన గ్రామదేవతను దర్శించుకుని నైవేద్యం పెడతారు. ఎందుకు! ఆమె అనుగ్రహంతో నేను ఈ ఊరిలో ఉండి అన్నం తినగలుగుతున్నా... కాబట్టి ఏడాదికొక్కసారి నేను ఆమెకు నైవేద్యం పెట్టాలి. ఆమె భూమికి ఆర్ద్రత కలిగిస్తుంది, వర్షరూపంలో. తడి తగలగానే ఏడాదికి సరిపడా నేను తినగలిగిన అన్నం నాకు దొరుకుతుంది... అన్న భావన. భూమికి తడి తగలకపోతే, ఎండి పడిపోయిన జామ గింజలు, బత్తాయి గింజలు, ధాన్యపు గింజలు ఏవీ మొక్కలుగా పైకి లేవవు. తడి తగలగానే గడ్డిపరకనుంచి మొదలుపెట్టి, భూమికి చేరిన గింజలన్నీ మొక్కలై పెరుగుతాయి. అంటే ఆర్ద్రత ఉండాలి. ప్రాణుల మనుగడకు అది ఆధారం. అలాగే ఒక దేశ సంస్కృతి నిలబడాలంటే... భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్టు, కళలుండాలి. కళలద్వారా సంస్కృతి పెరుగుతుంది. (చదవండి: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? శ్రావణంలో వచ్చే రెండో శుక్రవారం ప్రత్యేకత ఏంటి?) -
సీతాఫలంపై మహాత్ముల బొమ్మలు
-
ఆర్ట్స్లోనే కామర్స్ కూడా.. ఏపీ హైకోర్టు ముందుకు ఓ ఆసక్తికర కేసు..
సాక్షి, అమరావతి : బీకాం కోర్సు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగం కిందకు వస్తుందా రాదా అంటూ హైకోర్టు ముందుకు ఓ ఆసక్తికర కేసు వచ్చింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. బీకాం కోర్సు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగం కిందకే వస్తుందని తీర్పు చెప్పింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు బీకాంను ఈ విభాగం కిందే బోధిస్తున్నాయని గుర్తు చేసింది. బీకాం, ఆర్ట్స్ విభాగం కిందకు రాదనేందుకు ఆధారాలేవీ అధికారులు సమర్పించలేదంది. కామర్స్ కోర్సు ఆర్ట్స్ కిందకు వస్తుందని యూజీసీ సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇచ్చిందని వివరించింది. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ (గ్రేడ్–2) పోస్టుకు బీకాం చదివిన వారు అర్హులు కాదనడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారు ఈ విధులు నిర్వర్తించలేరన్న అధికారుల వాదనను తోసిపుచ్చింది. నోటిఫికేషన్లో ఈ ఉద్యోగులు ఎలాంటి విధులు నిర్వర్తించాలో ఎక్కడా ప్రస్తావించలేదని, ఆర్ట్స్ నేపథ్యం ఉన్న వారు మాత్రమే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారని కూడా చెప్పలేదంది. క్రీడాకారులు, ఎక్స్ సర్విస్మెన్, ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వారికి అవకాశం ఇచ్చారని, వయో పరిమితిని సైతం సడలించారని గుర్తు చేసింది. వీరంతా వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తించగలిగినప్పుడు, బీకాం చదివిన వారూ అర్హులవుతారని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, సర్టీఫికెట్ల పరిశీలన సమయంలో అనర్హులుగా తేల్చిన అభ్యర్థులను ఆ పోస్టుకు అర్హులుగా పరిగణించాలని అధికారులను ఆదేశించింది. పిటిషనర్లను ఆ పోస్టుకు పరిగణనలోకి తీసుకుని, నియామకాలు చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్ తదితరులతో కూడిన ధర్మాసనం గత వారం తీర్పు వెలువరించింది. విచారణ ద్వారా తేల్చాలన్న సింగిల్ జడ్జి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టుకు పురపాలక శాఖ 2019లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు బీకాం చదివిన వారూ దరఖాస్తు చేయగా, వారిని అధికారులు రాతపరీక్షకు అనుమతించారు. సర్టీఫికెట్ల పరిశీలన సమయంలో బీకాం కోర్సు ఆర్ట్స్, హ్యుమానిటీస్ విభాగం కిందకు రాదని, పోస్టుకు అర్హులు కారని అధికారులు తిరస్కరించారు. దీనిపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అధికారులకు పూర్తిస్థాయి వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది. దానిపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అధికారులకు చెప్పింది. అభ్యర్థులు పురపాలక శాఖ కమిషనర్కు వినతిపత్రం సమర్పించగా, దానిని తిరస్కరిస్తూ కమిషనర్ 2020లో ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. పిటిషనర్లు చదివిన బీకాం కోర్సు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కిందకు వస్తుందో లేదో తేల్చాలని అధికారులను ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. చదవండి: Fact Check: దగా చేసింది ఎవరో తెలియదా రామోజీ ? ఈ అప్పీళ్లపై జస్టిస్ సోమయాజులు ధర్మాసనం విచారణ జరిపింది. అభ్యర్థుల తరఫున న్యాయవాది జొన్నలగడ్డ సుదీర్ వాదనలు వినిపిస్తూ.. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు బీకాం ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కిందకే వస్తుందని యూజీసీ సమాధానం ఇచ్చిందంటూ, ఆ వివరాలను కోర్టు ముందుంచారు. రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాలు బీకాంను ఆర్ట్స్ విభాగం కింద పేర్కొంటూ ఇచ్చిన డిగ్రీ సర్టీఫికేట్లను ధర్మాసనం ముందుంచారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, యూజీసీ 2014లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామన్నారు. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టు అణగారిన వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిందని, కార్పొరేట్ అకౌంటింగ్ తదితర సబ్జెక్టులు ఈ పోస్టు కింద నిర్వర్తించే విధులకు సరిపోవన్నారు. అందువల్ల పురపాలక శాఖ నిర్ణయంలో ఎలాంటి తప్పులేదని తెలిపారు. -
ప్రపంచంలోని టాప్ 20 అత్యంత ప్రసిద్ధమైన పెయింటింగ్స్
-
ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్
ఆర్టిఫిషియల్ ఇమేజెస్ హవా మామూలుగా లేదు. ఏఐ ద్వారా ఇప్పటికే సినిమా, క్రీడారంగానికి చెందిన సెలబ్రిటీల ఫోటోలను వివిధ రకాలుగా చిత్రించిన ఏఐ ఆర్టిస్ట్ తాజాగా మరికొన్నింటిని సృష్టించారు. మిడ్ జర్నీని టూల్తో ఏఐ ఆర్టిస్ట్ SK MD అబూ సాహిద్ అందమైన స్టార్లను వృద్ధులుగా మార్చేసారు. ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రా తదితర విమెన్ యాక్టర్స్ సీనియర్ సిటిజెన్స్ అయితే ఎలా ఉంటారో అన్న ఊహ వీటికి ప్రాణమిచ్చింది. అంతేకాదు శ్రద్ధాకపూర్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, అలియా భట్, కృతి సనన్, అనుష్క శర్మ లాంటి ఫోటోలను కూడా మార్చివేయడంతో ఇవి వైరల్గా మారాయి. అవేంటో మీరూ ఒకసారి చూసేయండి . ఇదీ చదవండి: టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు ముడతలు పడిన చర్మం, నల్లటి వలయాలతో భయంకరంగా కనిపిస్తున్నారంటూ ఫ్యాన్స్ గుండెలు బాదుకుంటున్నారు. "బాప్ రే కృతి సనన్ నా బామ్మగా కనిపిస్తుంది." ఒకరు ఆందోళన వ్యక్తం చేయగా, "శారీరక సౌందర్యం తాత్కాలికం, కానీ అంతర్గత సౌందర్యం శాశ్వతమైనది" ఇలా ఒక్కో పిక్పై ఒక్కో రకంగా హిల్లేరియస్ కమెంట్స్తో యూజర్లు సందడి చేస్తున్నారు. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) కాగా 23 వేల ఇన్స్టా ఫాలోయర్లతో ఏఐఆర్టిస్ట్ సాహిద్ సోషల్ మీడియాలో ఏఐ పిక్స్తో బాగా పాపులర్ అవుతున్నాడు. క్రికెటర్లను ముసలివాళ్లుగా, స్థూల కాయులుగా, ఫుట్బాల్ క్రీడాకారులుగా, బిలియనీర్లను బిచ్చగాళ్ళుగా, షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జీలను శిశువులుగా, మెట్ గాలాలో సందడి చేసిన బిలియనీర్లు, డిస్నీ సినిమాల్లో బాలీవుడ్ నటులు ఇలా ఆయన పోస్ట్ చేసిన వెంటనే ఏఐ పిక్స్ వైరల్ కావడం కామన్గా మారిపోయింది. (Dr.Vandana Lal Success Story: రూ. 3వేల కోట్ల నికర విలువతో రిచెస్ట్ విమెన్: ఆసక్తికర విషయాలు) View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్
న్యూఢిల్లీ: దేశంలో యాపిల్ స్టోర్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో యాపిల్ సీఈవో దేశంలో ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబైలలో పర్యటిస్తున్నారు. ముందుగా ముంబైలోని యాపిల్ స్టోర్ ప్రారంబించిన అనంతరం కుక్ దేశ రాజధాని ఢిల్లీలో సందడి చేశారు. గురువారం ఢిల్లీలోని యాపిల్ స్టోర్ను కుక్ ప్రారంభించనున్నారు. లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్లోని మంత్రముగ్ధుల్ని చేసే కళాత్మక చిత్రాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన కళాకారులు.. 62 ఏళ్ల భారతీయ జీవితాన్ని చాలా శక్తి వంతంగా చిత్రీకరించారంటూ స్టేట్ ఆర్టిస్ట్ ఫౌండేషన్ ఆర్టిస్టులను అభినందించారు. ముఖ్యంగా ఐప్యాడ్లో కుడ్య చిత్రాలను ఎలా డిజైన్ చేస్తారో తనకు చూపించిన దత్తరాజ్ నాయక్కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. కాగా ఇండియాలోకి యాపిల్ఎంటరై 25ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోనే తొలి అధికారిక యాపిల్ స్టోర్ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యాపిల్ సీఈవో హాజరు కావడంతో అభిమానులు సందడి చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, నటి మౌనీ రాయ్, నిర్మాత బోనీ కపూర్, అలనాటి అందాల హీరోయిన్ మాధురి దీక్షిత్, నేహా ధూపియా, రకుల్ ప్రీత్ సింగ్, తదితర సెలబ్రిటీలు కుక్ను కలవడం విశేషంగా నిలిచింది. 1984 నాటి వింటేజ్ కంప్యూటర్ మానిటర్తో ఒకయాపిల్ అభిమాని అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు యాపిల్ సెకండ్ స్టోర్ ను ఏప్రిల్ 20న (రేపు) ఢిల్లీలో ఓపెన్ చేయనున్నారు. Delhi’s Lodhi Art District is a remarkable public space. Congratulations to the St+art India Foundation and so many amazing artists for capturing Indian life so powerfully. And thank you to Dattaraj Naik for showing me how you design your murals on iPad. pic.twitter.com/5JuzlHRvPC — Tim Cook (@tim_cook) April 19, 2023 -
కళాశాలల్లో ఇక ‘కళా గురువులు’
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న యాంత్రిక పద్ధతిని నివారించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నడుం బిగించింది. ప్రస్తుత విద్య ఒత్తిడితో కూడుకుని యాంత్రికంగా మారుతుండటంతో విద్యార్థులకు విద్యపై ఆసక్తి సన్నగిల్లుతోంది. దీన్ని మార్చి విద్యార్థులు ఇష్టంతో విద్య నేర్చుకునేలా యూజీసీ చర్యలు చేపట్టింది. చదువులను ఆహ్లాదకరంగా మార్చడానికి వివిధ కళారూపాలను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వివిధ కళల్లో లబ్ధప్రతిష్ట లైన వారిని కళాశాలల్లో కళా గురువులుగా నియమించనుంది. వీరి ద్వారా హస్తకళలు, సంగీతం, నృత్యం, జానపదాలు, థియేటర్, తోలు»ొమ్మ ప్రదర్శనలు, ఫొటోగ్రఫీ, కాలిగ్రఫీ, యోగా, పెయింటింగ్, ఇంద్రజాలం (మ్యాజిక్) వంటి వాటిని సహ పాఠ్య కార్యక్రమాలుగా ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు యూజీసీ తాజాగా ముసాయిదా ప్రతిపాదనలు విడుదల చేసింది. సృజనాత్మకతను పెంపొందించే ఈ సంప్రదాయ కళారూపాలు ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించేందుకు దోహదపడతాయని యూజీసీ భావిస్తోంది. దీనివల్ల విద్యార్థుల్లో కళాత్మక ఆలోచనలకు, సృజనాత్మకతకు అవకాశం ఉంటుందని, చదువుల్లోనూ వారు మరింత ఉత్సాహంగా ఉంటారని అభిప్రాయపడుతోంది. అదే సమయంలో మరుగునపడిపోతున్న కళారూపాలకు మళ్లీ కొత్త జీవం పోసినట్లు అవుతుందని తలపోస్తోంది. ఏకకాలంలో రెండు ప్రయోజనాలు.. మన దేశం గొప్ప కళా, సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ప్రాచీన కాలం నుంచి అనేక అద్భుతమైన కళారూపాలు ఉన్నాయి. వీటిని కళాకారులు సంరక్షించుకుంటూ వస్తున్నారు. అయితే వీటికి విద్యా వ్యవస్థతో సంబంధం లేకుండా పోవడంతో కొత్త తరానికి ఈ కళల గురించి అవగాహన లేదు. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు, కళలకు మధ్య చాలా అంతరం ఏర్పడింది. దీన్ని తగ్గించడానికి ఈ కళాగురువుల విధానానికి యూజీసీ శ్రీకారం చుట్టింది. దీనివల్ల ఈ కళా రూపాలను సంరక్షించుకునే వీలు కలుగుతుంది. అదే సమయంలో ఒత్తిడితో యాంత్రికంగా మారిపోయిన విద్యా విధానం నుంచి విద్యార్థులు బయటపడటానికి.. ఆహ్లాదకరంగా విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కళాశాలల్లో విద్య, బోధన, పరిశోధన ఇతర విద్యా కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగిన కళా గురువులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించనున్నారు. ఉన్నత విద్యా విధానంతో హస్త కళలు, నృత్య రూపకాలు, సంగీతం, లలిత కళలు మొదలైనవాటిని అనుసంధానం చేస్తారు. తద్వారా విద్యార్థుల అభ్యసన ప్రక్రియను మెరుగుపరచనున్నారు. మూడు విభాగాల్లో కళా గురువులు.. ఆయా కళల్లో స్థానిక కళాకారులను గుర్తించి ఎంప్యానెల్ చేయడానికి ఆయా విద్యాసంస్థలు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమిటీ.. కాంపిటెంట్ అథారిటీకి సిఫార్సులను అందించాలి. కళా గురువులను మూడు విభాగాల్లో ఎంపిక చేయనున్నారు. పరమేష్టి గురువు, పరమ గురువు, గురువు అనే విభాగాల్లో వీరిని నియమించనున్నారు. పరమేష్టి గురువుగా నియమితులు కావాలంటే పద్మ అవార్డు లేదా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు పొంది ఉండాలి. కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. పరమ గురువుకు కనీసం ఒక జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ గుర్తింపు పొందిన అవార్డు, లేదా తత్సమాన అవార్డు తప్పనిసరి. అనుభవం 10 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. ఇక గురువుకు.. పరమేష్టి, పరమ గురువుల కేటగిరీల్లో లేని మాస్టర్లుగా పేరు తెచ్చుకున్న కళాకారులను ఎంపిక చేయొచ్చు. అనుభవం 5 ఏళ్లకన్నా తక్కువ ఉండరాదు. అయితే అంతర్జాతీయ, జాతీయ, ప్రభుత్వ గుర్తింపు పొందిన కచేరీల్లో పాల్గొని ఉండాలి. ఎంప్యానెల్ అయిన కళా గురువులకు కార్యకలాపాలను నిర్వహించడానికి తగిన వేదికను ఏర్పాటు చేస్తారు. అవసరమైన ఇతర సహాయంతో పాటు సౌకర్యాలు అందిస్తారు. ప్రయాణ ఖర్చులు, వసతి, నిబంధనల ప్రకారం గౌరవ వేతనం ఇస్తారు. కళారూపాల జాబితా ఇలా.. హస్త కళలు: కుండలు, వెదురు ఆకృతులు, చెక్క పని, టెర్రాకోట, మధుబని, పిచ్వాహి, చరఖా నేయడం, మొఘల్ ఉడ్ ఆర్ట్, స్టోన్, కాంస్యం పని, మీనాకారి పని, నేత, అద్దకం, బ్లాక్ ప్రింటింగ్, మినియేచర్ పెయింటింగ్, ఉడ్ కారి్వంగ్, ప్రింటెడ్ టెక్స్టైల్స్, నేచురల్–ఆర్గానిక్ డైస్ ప్రిపరేషన్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, కార్పెట్ నేత, కాలిగ్రఫీ, దడ్తాన్ గోయ్ తదితరాలు. శాస్త్రీయ సంగీతం: హిందుస్థానీ గాత్రం, హిందుస్థానీ వాద్యం, కర్ణాటక గాత్రం, కర్నాటిక్ ఇన్సŠట్రుమెంటల్, గుర్బానీ, సుఫియానా సెమీ క్లాసికల్, లైట్, మోడ్రన్ మ్యూజిక్, తుమరి/ దాద్రా/కజ్రీ, గజల్, గీత్, భజన్, సూఫీ తదితరాలు. సోపాన సంగీతం: ఖవాలీ, భక్తి– భజన, రామాయణం, శ్రీమద్భాగవత్ పఠనం తదితరాలు, రవీంద్ర సంగీతం, ఫ్యూజన్/జుగల్బందీ/తల్వాధ్య, ఆర్కె్రస్టా/కోరల్, రాక్, బ్యాండ్/జాజ్, కోయిర్ గానం తదితరాలు. డ్యాన్స్: సంప్రదాయ నృత్య రూపకాలైన కథక్, ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, మణిపురి, మోహినీయాట్టం, ఛౌ, సత్త్రియ, యక్షగానం, పాండ్వానీ తదితరాలు. జానపద నృత్యం: భాంగ్రా/గిద్దా, గర్బా, రౌఫ్, ఘూమర్, బిహు, లావణి, విలాసిని నాట్యం, ధిమ్సా, బగురుంబా, అలీ ఐ లిగాంగ్, కోలాటం, నాట్యం, అజిలాము, రొప్పి, ఫోనింగ్, కజారి, ఝుమారి, దండారి, గెండి, పంతి, కర్మ, దమ్కాచ్, మాండో, తల్గారి, సువారి, దసరవదన్, కుంబీ, ఫుగాడి, రాస్, భావాయి, తిప్పానీ, గుగ్గ, ఖోరియా, కులు నాటి, నామ్గెన్, హికత్, ఛమ్, దుమ్హాల్, కుడ్, భంద్ జషన్, ఫాగువా, కృష్ణ పారిజాత, నాగమండల, భూత ఆరాధన, కైకొట్టికలి, తుంబి తుల్లాల్, కర్మ, గౌర్ మారియా, కక్సర్, అహిరి, పావ్రీ, ధంగారి గజ, ఖంబ థోయిబి, పుంగ్ చోలోమ్, నోంగ్క్రెమ్, చెరావ్, ఖుల్లం, చంగ్లో–సువాలువా, ఘుమురా, రుక్ మార్, గోటిపువా, ఝుమర్, కుచి్చఘోడి, కల్బేలియా, భావాయి, సపేరా నృత్యం, సింఘీ చామ్, ఖుకూరి, తలచి, కరగాట్టం, మయిల్అట్టం, కుమ్మి, కావడి, గరియా, హోజాగిరి, రాస్లీల, చర్కుల, బరదానాటి, చాపెలి, లాంగ్వీర్, గంభీర, కలికాపటడి, డోమ్ని, కలరిపట్టు, ఒట్టంతుల్లాలెట్ తదితరాలు. వృత్తిపరమైన కళారూపాలు: పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, టెక్స్టైల్, డ్రాయింగ్, స్కల్ప్చర్, సిరామిక్, కాలిగ్రఫీ, ఫొటోగ్రఫీ, జానపద థియేటర్, నౌతంకి, యోగా, ఇసుక కళ, మెహందీ, ఫ్లోర్ ఆర్ట్ (రంగోలి/మందన/కోలమెట్సీ), కథకులు, మ్యాజిక్ షో, పప్పెట్ షో, కామిక్ ఆర్ట్ తదితరాలు. -
బొమ్మేస్తే అచ్చు దిగాల్సిందే..!
బొమ్మలు గీయడమంటే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. అచ్చు గుద్దినట్లు సహజత్వం ఒట్టిపడేలా చిత్రాలు తీర్చిదిద్దడంలో ఆయన దిట్ట. చిన్నప్పటి నుంచి త్రలేఖనంపై మక్కువ కలిగిన ప్రసాదరావు కష్టపడి ఆర్ట్స్ టీచర్ ఉద్యోగం సంపాదించాడు. తన లాగే చిత్ర లేఖనంలో ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించి మేటిగా రాణించేందుకు కృషి చేస్తున్నారు. కొనకనమిట్ల(ప్రకాశం జిల్లా): కొనకనమిట్ల మండలం వెలిగొండ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆర్ట్స్ టీచర్గా పనిచేస్తున్న కొమ్ము ప్రసాదరావు విభిన్న శైలి. సామాజిక స్పృహపై అరుదైన చిత్రాలు వేస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. సామాజిక స్పృహ కలిగించే చిత్రాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రసంసించే చిత్రాలు.. సామాజిక రుగ్మతలు, దేశ, రాష్ట్ర నాయకులు, పర్యావరణ కాలుష్యం, మంచినీటి సమస్య, పరిసరాల పరిశుభ్రత, విజృంభిస్తున్న అంటువ్యాధులు, బాల కార్మిక నిర్మూలనం వంటి అంశాలపై చిత్ర లేఖనం ద్వారా నలుగురికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతు భరోసాతో జై కిసాన్ అంటూ రైతు శ్రమను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల మోములో ఆనందహేలలు నింపుతున్న దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు కొమ్ము ప్రసాదరావు తీర్చిదిద్దారు. గ్రామీణ ప్రజల్లో చైతన్యం తెచ్చేలా చిత్రాలు వేసి ప్రదర్శిస్తున్నారు. నీటి వృథా, స్వచ్ఛ భారత్, కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత అంశాలతో పాటు కరోనా మహమ్మారిపై విద్యార్థులు గీసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. భూగర్భజలాల ఆవశ్యకత, కాలుష్య కారకాలు, చెట్ల పెంపకం వల్ల కలిగే లాభాలు, కందకాలు తీయడం ద్వారా నీటి వృథాను అరికట్టవచ్చనే విషయాలపై చిత్రాలు వేస్తూ రాష్ట్ర, జాతీయస్థాయిలో చిత్రలేఖనం పోటీలకు ఎంపిక కావటంతో పాటు ఉత్తమ చిత్రాలకు అవార్డులు, బహుమతులు సాధించారు. ఆర్టు అకాడమీలో ప్రశంసలు.. ఆర్టు అకాడమీ నిర్వహిస్తున్న పెయింటింగ్ ప్రదర్శనల్లో పాల్గొంటూ ప్రముఖుల మన్ననలు పొందుతున్నారు. ఈ నెల 8వ తేదీన ఒంగోలులో ‘సృష్టి ఆర్ట్ అకాడమీ’ వారు నిర్వహించిన పెయింటింగ్ ప్రదర్శనలో పలు రాష్ట్రాల నుంచి 87 మంది ప్రముఖ ఆర్టిస్టులు పాల్గొని చిత్రాలు ప్రదర్శించారు. వారిలో ప్రసాదరావు ప్రదర్శించిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, దృశ్య కళల అకాడమీ చైర్మన్ సత్యశైలజ, అమృత హాస్పిటల్ వైద్యులు కేశవ, ప్రఖ్యాత చిత్ర కళాకారులు కళాసాగర్ చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు పొందటంతో పాటు ఘనంగా సన్మానించారు. తమ పాఠశాల ఆర్ట్స్ టీచర్ అద్భుతంగా సందేశాత్మక చిత్రాలను పెయింటింగ్ ద్వారా రూపొందించి జాతీయ యిలో ప్రదర్శించి అవార్డులు సొంతం చేసుకోవటం అభినందనీయమని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు అన్నారు. -
పండగ కళ పదింతలు.. ఆదుర్దా వద్దు.. ఇలా చేయండి!
పండగ వేళ ఇల్లు కళగా వెలిగిపోవాలంటే ఏం చేయాలా అని ఎక్కువ ఆదుర్దా పడనక్కర్లేదు. సింపుల్గా అనిపిస్తూనే, ఎక్కువ శ్రమ లేకుండా కొన్ని వస్తువులతో అలంకరణ ద్వారా పండగ కళను రెట్టింపు చేసుకోవచ్చు. దశమి నాడు పది విధాల మేలైన కళ ఇది. 1. ఇత్తడి, రాగి పాత్రలు ఇవి ఉంటే చిటికెలో పని అయిపోయినట్టే. అందులోనూ దేవతా రూపాలతో ఉన్న వస్తువులైతే అలంకరణ మరింత సులువు అయిపోతుంది. మర చెంబులు, వెడల్పాటి ప్లేట్లు ఉన్నా.. వీటిలో నీళ్లు పోసి పువ్వులు వేస్తే చాలు పండగ కళ వచ్చేసినట్టే. 2. డిజైనర్ రంగోలీ ముంగిట్లో ముచ్చటైన రంగవల్లికలు అందం. అలాగని పెద్ద పెద్ద ముగ్గులు వేసే టైమ్ లేదు అనుకునేవారికి సింపుల్ చిట్కా.. మార్కెట్లో డిజైనర్ రంగవల్లికలు రెడీమేడ్గా దొరుకుతున్నాయి. సాయంకాలపు వెలుగుకు ఈ ముగ్గులు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. 3. పువ్వులు–ఆకులు ముగ్గుల స్థానంలో పువ్వులు, ఆకులతో ఇలా ముచ్చటైన డిజైన్లుగా రూపుకట్టవచ్చు. ఈ అలంకరణ ఎప్పుడు చేసినా పండగ నట్టింట్లో కొలువుదీరినట్టే. 4. డిజైనర్ తోరణం మామిడి, బంతిపూలతోనే కాదు ఇవి కూడా డిజైనర్ తోరణాలే. ఎంబ్రాయిడరీ జిలుగులు, అద్దకం, కుందన్స్ మెరుపులతో తీర్చిదిద్దిన అందమైన తోరణాలు ఎన్నో. వాటిని ఒకసారి తెచ్చుకుంటే ప్రతి పండగకూ మెరిపించవచ్చు. ఇలా అందమైన కళను తీసుకురావచ్చు. 5. వాల్ హ్యాంగింగ్స్ టెర్రకోట గంటలు, ఫెదర్ తో కూడిన పక్షుల బొమ్మలు .. ఇలా రకరకాల హ్యాంగింగ్స్ తెచ్చి గుమ్మం ముందు వేలాడదీస్తే ఎంత కళను తెచ్చిపెడతాయో కళ్లారా చూడాల్సిందే. 6. పువ్వుల హ్యాంగింగ్ ఎన్ని పూల దండలను వేలాడదీస్తే అంత అందంగా కనిపిస్తుంది ఇల్లు. అయితే, ఎక్కడ ఎలా అలంకరించాలో మాత్రం ఎవరి అభిరుచి వారిదే. 7. డెకార్ కుషన్స్ చిన్న చిన్న పిల్లోస్ లేదా కుషన్స్ సోఫా– దివాన్ల మీద వేస్తూ ఉంటారు. వాటికి రంగు రంగుల కాంబినేషన్లో ఉన్న కవర్స్ వేస్తే పండగ కళ అదిరిపోయిందనే కితాబు రాకుండా ఉండదు. 8. బొమ్మలు దసరా పండగ అంటే చాలామంది బొమ్మల కొలువులతో అలరిస్తుంటారు. అన్ని బొమ్మలు లేకపోయినా ఈ పండగ నాడు కొన్న కొన్ని బొమ్మలతో షోకేస్ని అలంకరిస్తే చాలు. వాటిలో మన దేశీయ హస్త కళాకృతులను చేరిస్తే మరింత అందం వస్తుంది. దసరా పండగను పురస్కరించుకుని వచ్చిన వాల్ స్టిక్కర్స్ను కూడా ఉపయోగించవచ్చు. 9. పూజా ప్లేట్ పూజలలో వాడే ప్లేట్ని కూడా అందంగా అలంకరించుకోవచ్చు. డిజైనర్ థాలీ పేరుతో ఇవి మార్కెట్లో లభిస్తున్నాయి. పువ్వులు, ఆకులు, నెమలి ఈకలు.. మొదలైనవాటిని ఉపయోగించే పూజా ప్లేట్స్ లేదా అలంకరణ ప్లేట్లను తయారు చేసుకోవచ్చు. 10. నీటిపైన పువ్వులు అలంకరణకు ఏ వస్తువులూ లేవని చింతించనక్కర్లేదు. కొన్ని రకాల పువ్వులను ఒక పెద్ద పాత్రలో ఉంచి గుమ్మానికి ఒక వైపున లేదా ఇంటిలోపల గుమ్మానికి ఎదురుగా అలంకరించినా చాలు... పండగ కళ రెట్టింపుగా మిమ్మల్ని పలకరిస్తుంది. -
మీ కోసం 'వెదురు' చూసే బొమ్మలం!
వేలేరుపాడు: జీవనది గోదావరి చెంతన పాపికొండలుకు వెళ్లే మార్గంలో విహార యాత్రా స్థలంగా ప్రసిద్ధి చెందిన గిరిజన గ్రామం పేరంటపల్లి (పేరంటాలపల్లి). పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో గల ఈ గ్రామంలో శ్రీరామకృష్ణ మునివాటం ఆలయం ఉంది. అక్కడ శివుణ్ణి దర్శించి.. పచ్చని ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాలను.. గుడి వెనుక రాళ్ల నుంచి పారే నీటిని వీక్షించే పర్యాటకులు పరవశించిపోతారు. కొండ గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కితే 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠించబడిన సీతారామలక్ష్మణ ఆంజనేయ సుందర విగ్రహాలు దర్శనమిస్తాయి. సీతారామ లక్ష్మణ అంజనేయస్వామి వార్లు సజీవంగా మన ఎదుట ప్రత్యక్షమైన అనుభూతి కలుగుతుంది. ఆ పక్కనే ఉండే వాలి, సుగ్రీవుల గుట్టలు కనువిందు చేస్తాయి. ఆ గ్రామంలో సుమారు 60 కొండరెడ్డి గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి. అందరిదీ ఒకే వృత్తి. వెదురు బొమ్మల తయారీలో వారంతా నిష్టాతులే. కొండకోనల్లో దొరికే ములస వెదురు వీరికి ఉపాధినిస్తోంది. ఆకట్టుకునే కళాకృతులు తమచుట్టూ క్రూర మృగాలుంటాయని తెలిసినా అక్కడి గిరిజనులు ప్రమాదం అంచున జీవనం సాగిస్తుంటారు. అక్కడి గిరిజనులు దారీతెన్నూ లేని గుట్టల్లో ప్రయాణించి వెదురు బొంగులను సేకరిస్తారు. వాటితో వివిధ కళాకృతులు తయారు చేస్తుంటారు. తామర, గులాబీ పువ్వులు, వివిధ అంతస్తుల భవనాలు, లాంచీలు, బోట్లు, ఫైల్ ట్రే తదితర నమూనాల రూపంలో కళాకృతులను తయారు చేస్తున్నారు. వీటివల్ల నిరంతరం ఇళ్ల వద్దే వీరికి ఉపాధి దొరుకుతోంది. ఆదివారం, సెలవు రోజులతో పాటు దసరా, శివరాత్రి, సంక్రాంతి పండుగలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి వెదురు కళాకృతులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వీటిని కొనుగోలు చేసి జ్ఞాపికలుగా తీసుకెళ్తుంటారు. ఒక్కో బొమ్మ సైజును బట్టి రూ.50 నుంచి రూ.350 వరకు ధర పలుకుతున్నాయి. పన్నెండేళ్ల క్రితం ఐటీడీఏ ఇచ్చిన శిక్షణ కొండరెడ్ల కళా నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చింది. వెదురు వస్తువులే మా జీవనం వెదురు బొమ్మల తయారీతోనే మేం జీవిస్తున్నాం. పర్యాటకులు వచ్చే సీజన్లో నిత్యం 5 నుంచి 10 బొమ్మలు అమ్ముతా. రోజుకు రూ.500 వరకు ఆదాయం వస్తోంది. – కోపాల యశోద, పేరంటపల్లి వీటితోనే మా కుటుంబం గడుస్తోంది నేను రోజుకు రూ.600 వరకు సంపాదిస్తున్నా. పర్యాటకులు బాగానే కొంటున్నారు. రోజుకు 15 బొమ్మలు అమ్ముతున్నాను. వీటి తయారీ, విక్రయం ద్వారానే మా కుటుంబం గడుస్తోంది. – కెచ్చెల అనురాధ, పేరంటపల్లి -
పిల్లల భవిష్యత్తు కోసం...
తల్లిదండ్రులకు పిల్లలంటే పంచ ప్రాణాలు. వారి కోసం ఏ త్యాగానికి అయినా సిద్ధంగా ఉంటారు. చెప్పలేనంత ప్రేమ కురిపిస్తారు. ఇవన్నీ సహజమే. వారి మెరుగైన భవిష్యత్తుకు మీరు ఏమి చేయగలరు? ఇది అత్యంత కీలకమైన విషయం. ‘పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి విద్య’ అని వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు. కనుక పిల్లలపై ప్రేమతో మీరు ఏం చేసినా అది నాణేనికి ఒక కోణమే. వారికి నాణ్యమైన విద్య అందించడం రెండో కోణం అవుతుంది. దీనికి ముందు చూపు కావాలి. పక్కా ఆచరణతో నడవాలి. మెరుగైన ప్రణాళిక కావాలి. దీనికి క్రమశిక్షణ తోడవ్వాలి. అప్పుడే కల నెరవేరుతుంది. భవిష్యత్తుకు సంబంధించి ఏ లక్ష్యాలు సాధించాలని అనుకుంటున్నారు? వాటికి ఎంత వ్యవధి ఉంది? వీటిపై ముందు స్పష్టత తెచ్చుకోవాలి. పిల్లలకు సంబంధించి భవిష్యత్తు లక్ష్యాల్లో ముందుగా వచ్చేది విద్యా అవసరాలే. తర్వాత వివాహం. సాధారణ ద్రవ్యోల్బణం కంటే విద్యా ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా ఉంటోంది. ఫీజులు ఏటా 10–15% చొప్పున పెరుగుతున్నాయి. కనుక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో విద్యకు అయ్యే వ్యయంపై అంచనాలకు రావాలి. ఉన్నత విద్యా ఖర్చుల కోసం ముందు నుంచి సన్నద్ధం కావాలి. వివాహ ఖర్చు అన్నది మీ చేతుల్లో ఉండేది. పరిస్థితులకు అనుగుణంగా కొంత తగ్గించుకోగలరు. ముందు విద్యకు ప్రాధా న్యం ఇచ్చి, ఆ తర్వాత వివాహ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. విద్యా ఖర్చుకు సంబంధించిన అంచనాల్లో ఎక్కువ మంది బోల్తా పడుతుంటారు. ఆ సమయం వచ్చే సరికి కావాల్సినంత సమకూరదు. కనుక పెరిగే ఖర్చులకు తగ్గట్టు పొదుపు ప్రణాళికలు ఉండాలి. అధిక నాణ్యమైన విద్యను అందించే సంస్థలు, అత్యుత్తమ బోధనా సిబ్బంది, వసతులు, విదేశీ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు కలిగినవి సహజంగానే విద్యార్థులను ఆకర్షిస్తుంటాయి. ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే ఈ తరహా విద్యా సంస్థల ఫీజులు అధికంగా ఉంటుంటాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఇవి గరిష్ట ఫీజులను వసూలు చేస్తుంటాయి. చదువుతోపాటు ఇతర కళలు విద్యతోపాటే సమాంతరంగా పిల్లలకు నేర్పించే ఇతర నైపుణ్యాలు కూడా ఉంటాయని మర్చిపోవద్దు. క్రీడలు, సంగీతం, కళలు తదితర వాటిల్లో ఏదైనా ఒక విభాగంలో మీ చిన్నారిని చాంపియన్గా తీర్చిదిద్దాలనుకోవచ్చు. కనుక ఈ తరహా నైపుణ్యాల కోసం చేసే ఖర్చు అదనంగా ఉంటుంది. దీనికితోడు విడిగా ట్యూషన్ చెప్పించాల్సి రావచ్చు. ఆ ఖర్చును కూడా తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకోవాలి. వ్యయ అంచనాలు శిశువుగా ఉన్నప్పుడే పిల్లలకు సంబంధించి ప్రణాళిక మొదలు పెడితే.. పెట్టుబడులకు ఎంతలేదన్నా 15–20 ఏళ్ల కాలవ్యవధి మిగిలి ఉంటుంది. ఈ కాలంలో ద్రవ్యోల్బణం సగటున ఎంత ఉంటుందన్న అంచనాకు రావాలి. ఒకవేళ ఉన్నత విద్య కోసం పిల్లలను విదేశీ విద్యా సంస్థలకు పంపించాలనుకుంటే అప్పుడు ద్రవ్యోల్బణంతోపాటు.. రూపాయి మారకం విలువను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సగటు విద్యా ద్రవ్యోల్బణం 8–10 శాతం మధ్య ఉంటోంది. ఐదేళ్ల క్రితం ఇది 6 శాతం స్థాయిలోనే ఉంది. కనుక భవిష్యత్తులోనూ 8–10 శాతం వద్దే ఉంటుందని అనుకోవడానికి లేదు. ఇంకాస్త అదనపు అంచనా వేసుకున్నా నష్టం ఉండదు. భవిష్యత్తులో ఏ కోర్సు చేయాలన్నది పిల్లల అభిమతంపైనే ఆధారపడి ఉంటుంది. అది ముందుగా తెలుసుకోలేరు. కనుక తల్లిదండ్రులు తమ ఇష్టానుసారం ఒక కోర్సును అనుకుని దానికి సంబంధించి ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఈ అంచనాకు 10 శాతం అదనంగా సమకూర్చుకునే ప్రణాళికతో ముందుకు సాగిపోవాలి. విదేశీ విద్య అయితే.. గతంతో పోలిస్తే విదేశాల్లో గ్రాడ్యుయేషన్, ప్రోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వారి సంఖ్య పెరిగింది. విదేశీ విద్యతో విదేశాల్లోనే మెరుగైన అవకాశాలు సొంతం చేసుకుని అక్కడే స్థిరపడాలన్న ధోరణి కూడా పెరుగుతోంది. తల్లిదండ్రులుగా మీ పిల్లలను విదేశాలకు పంపించాలనుకుంటే.. లేదా పిల్లలు భవిష్యత్తులో విదేశీ ఆప్షన్ కోరుకునే అవకాశం ఉందనుకుంటే.. అందుకోసం పెద్ద నిధి అవసరం పడుతుంది. ఐఐఎంలో చేసే కోర్సు వ్యయంతో పోలిస్తే హార్వర్డ్ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కోర్సు వ్యయం నాలుగైదు రెట్లు అధికంగా ఉంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కోర్సులను అందించే దేశీయ ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ కోర్సుల వ్యయాలు అధికంగానే ఉన్నాయి. విదేశీ విద్య అయితే అక్కడ నివాస వ్యయాలు కూడా కలుస్తాయి. ఇవి ఎక్కువగా ఉంటాయి. దేశీయంగా అయితే నివాస వ్యయాలు తక్కువగా ఉంటాయి. పేరున్న విద్యా సంస్థల్లో అధిక ఫీజులు ప్రైవేటు విద్యా సంస్థల్లో కోర్సులకు అధిక ఫీజులు చెల్లించాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చౌకగా పూర్తవుతుందనే అభిప్రాయం ఉంటే దాన్ని తీసివేయండి. ప్రభుత్వంలోనూ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు చాలానే ఉన్నాయి. వీటిల్లో కోర్సుల వ్యయాలు ప్రైవేటుకు ఏ మాత్రం తీసిపోవు. ఐఐటీలు, నిట్లు, ఏఐఐఎంఎస్, ఐఐఎస్సీ, ఐఐఎంల్లో ప్రవేశాలకు ఏటా డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇక్కడ సరఫరా తక్కువ డిమాండ్ ఎక్కువ. కాకపోతే వీటిల్లో కోర్సులకు ‘హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ’ నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. వీటిల్లో చాలా ఇనిస్టిట్యూషన్స్ సొంతంగానే వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కనుకనే ఎప్పటికప్పుడు ఇవి ఫీజులను సవరిస్తున్నాయి. ప్రాథమిక విద్య నిర్లక్ష్యం వద్దు.. పిల్లల భవిష్యత్తు విద్యా అవసరాలకు ప్రణాళిక వేసుకునే సమయంలో పాఠశాల విద్యను తక్కువ అంచనా వేసుకోవద్దు. కొన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నత విద్యా కోర్సుల స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. పిల్లల విద్య ఖర్చు భరించలేక అప్పులు చేసే వారు చాలా మంది ఉన్నారు. ముందు చూపు లేకపోవడం వల్ల వచ్చే సమస్యే ఇది. ముందు నుంచే కావాల్సినంత మేర పొదుపు, మదుపు చేస్తూ వస్తే రుణాల అవసరం ఏర్పడదు. ఒకవేళ కొంచెం అంచనాలు తప్పినా పెద్ద ఇబ్బంది ఏర్పడదు. విద్యా రుణాలను ఉన్నత విద్య సమయంలో తీసుకోవడం తప్పు కాదు. అది పూర్తగా వారికొచ్చే వేతనం నుంచి చెల్లింపులు చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ, పాఠశాల విద్యకు సొంత వనరులే మార్గం కావాలి. మొదటి నుంచే రుణ బాట పడితే.. 15 ఏళ్ల తర్వాత భారీ వ్యయాలు అయ్యే కోర్సుల్లో చేరటం కష్టమవుతుంది. పెట్టుబడుల పోర్ట్ఫోలియో పిల్లల విద్యకు సంబంధించి పెట్టుబడుల విషయంలో భావోద్వేగాలకు చోటు ఇవ్వొద్దు. తమ అవసరాలకు సరిపడే ఉత్పత్తులను ఎక్కువ మంది ఎంపిక చేసుకోకపోవడాన్ని గమనించొచ్చు. పిల్లల కోసం పెట్టుబడి, తమకు ఏదైనా జరగరానికి జరిగితే బీమా రక్షణ కలగలసిన ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటుంటారు. కానీ, బీమా, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈ రెండూ విడిగా లభించే సాధనాలు. అటువంటప్పుడు రెండింటినీ కలపాల్సిన అవసరం ఏముంటుంది? అందుకుని ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్ను తగినంత కవరేజీతో తీసుకోవాలి. ఏదైనా ఊహించనిది జరిగితే ఎంతో ప్రేమించే తమ కుటుంబం ఇబ్బందుల్లో పడకుండా టర్మ్ ప్లాన్ ఆదుకుంటుంది. కుటుంబ వ్యయాలు, పిల్లల విద్యా వ్యయాలు, ఇతర అవసరాలను కలిపి టర్మ్ కవరేజీ ఎంతన్నది నిర్ణయించుకోవాలి. ఆరోగ్య అవసరాలు, రుణ అవసరాలు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముందే ఆరంభిస్తే కాంపౌండింగ్ కలిసొస్తుంది. రిస్క్ తీసుకుని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు లభిస్తుంది. ఎక్కువ పెట్టుబడులను ఈక్విటీకే కేటాయించుకోవచ్చు. తద్వారా అధిక రాబడులు అవకాశం ఉంటుంది. ఈక్విటీల్లో స్వల్ప కాలంలోనే (3–5ఏళ్లు) రిస్క్. దీర్ఘకాలంలో కళ్లు చెదిరే రాబడులు ఉంటాయి. అదే ఆలస్యంగా మొదలు పెడితే రిస్క్కు అవకాశం ఉండదు. కనుక డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. వీటిల్లో రాబడి 8 శాతం మించదు. ద్రవ్యోల్బణం కూడా ఇదే స్థాయిలో ఉంటుంది కనుక నికరంగా వచ్చే రాబడి ఏమీ ఉండదు. కనీసం ఐదేళ్లకు పైబడిన కాలానికే ఈక్విటీలను ఎంపిక చేసుకోవచ్చు. ఐదేళ్లలోపు కోసం అయితే ఈక్విటీలు సూచనీయం కాదు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలన్నది నిపుణుల సూచన. బీమా, ఈక్విటీలతో కూడిన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, వీటిల్లో వ్యయాలు ఎక్కువ. రాబడులను సమీక్షించుకోవడం మ్యూచువల్ ఫండ్స్ పథకాలతో పోలిస్తే కొంచెం క్లిష్టం. కనుక మెరుగైన ఈక్విటీ ఫండ్స్ను ఎంపిక చేసుకోవడమే మంచి మార్గం అవుతుంది. ఒకవేళ పిల్లల విదేశీ విద్య కోసం అయితే.. విదేశీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా కరెన్సీ మారకం విలువ మార్పులకు హెడ్జ్ చేసుకున్నట్టు అవుతుంది. డెట్ సాధనాల్లో అయితే సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెల కోసం), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ను పరిగణనలోకి తీసుకోవచ్చు. పొదుపు... చిన్న అడుగులు పొదుపు ముందే ప్రారంభిస్తే లక్ష్యం సులభం అవుతుంది. ఆలస్యం చేసిన కొద్దీ అది భారంగా మారుతుంది. 5 ఏళ్లు ఆలస్యం చేసినా, చేయాల్సిన పొదుపు రెట్టింపు అయిపోతుంది. అందుకనే చిన్నారి జన్మించిన వెంటనే పొదుపు, పెట్టుబడి ఆరంభించాలి. ఆలస్యం చేసినా మొదటి పుట్టిన రోజు నుంచి అయినా ఈ ప్రణాళికను అమలు చేయాలి. అప్పుడే అనుకున్నంత సమకూర్చుకోగలరు. ఉన్నత విద్య కోసం సాధారణంగా 18 ఏళ్లు ఉంటుంది. ప్రాథమికోన్నత పాఠశాల విద్య కోసం 10 ఏళ్ల వ్యవధి ఉంటుంది. అందుకని ఉన్నతవిద్య, ప్రాథమిక విద్యకు వేర్వేరుగా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. విద్యా రుణం ఇది చివరి ఎంపికగానే ఉండాలి. విద్యా రుణం చాలా సులభంగా లభిస్తుంది. ఫీజులకు చాలకపోతే రుణం తీసుకోవచ్చులేనన్న భరోసాతో పెట్టుబడులను నిర్లక్ష్యం చేయవద్దు. నిజాయితీ పెట్టుబడులు చేస్తూ, చివర్లో కావాల్సిన మొత్తానికి తగ్గితే (రాబడుల అంచనాలు మారి) లేదా అంచనాలకు మించి కోర్సుల వ్యయాలు పెరిగిపోతే అప్పుడు ఎలానూ అదనంగా సమకూర్చుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో విద్యారుణం బాట పట్టొచ్చు. లేదా ఉద్యోగం లేదా ఉపాధి పరంగా సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. అటువంటి పరిస్థితుల్లో విద్యా రుణాన్ని ఆశ్రయించొచ్చు. అది కూడా ఉద్యోగం పొందిన తర్వాత పిల్లలు చెల్లించే సౌలభ్యం పరిధిలోనే ఉండేలా చూసుకోవడం మర్చిపోవద్దు. -
ప్రేమించడానికి రోజుకో కారణం!
‘‘నిన్ను (శంతను హజారిక) ప్రేమించడానికి, గౌరవించడానికి నాకు రోజూ ఓ కొత్త కారణం దొరుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్ శ్రుతీహాసన్ అన్నారు. శ్రుతి బాయ్ఫ్రెండ్ శంతను చిత్రకారుడు అనే సంగతి తెలిసిందే. తాజాగా శంతను కొన్ని ఆర్ట్స్ను డిజైన్ చేశారు. ఈ డిజైన్స్ను చూసి తెగ మురిసిపోతూ, శంతను గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు శ్రుతీహాసన్. ‘‘నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ అద్భుత (ఆర్ట్ ఎగ్జిబిషన్) సాయంకాల సమయాల్లో నన్ను భాగస్వామిని చేసినందుకు నా మనసు ఆనందంతో పులకరించిపోతోంది’’ అన్నారు శ్రుతి. ఈ ఎగ్జిబిషన్లో శ్రుతీ తన మ్యూజికల్ టీమ్తో కలసి పాడారు. -
సైన్స్లో సోనాలి కామర్స్లో సుగంధ ఆర్ట్స్లో భారతి
ఇంటర్ పరీక్షల నిర్వహణలో బిహార్ బోర్డు ఈసారి అన్ని రాష్ట్రాల కన్నా ముందుంటే, బిహార్ పరీక్షా ఫలితాల్లో అమ్మాయిలు ముందున్నారు. అమ్మాయిలు ముందుండటం అన్నీ రాష్ట్రాల్లోనూ యేటా అదొక సంప్రదాయంగా వస్తున్నప్పటికీ, కరోనా పరిస్థితుల్లో మనోబలాన్ని సడలనివ్వకుండా చక్కగా చదివి.. ఆర్ట్స్, కామర్స్, సైన్స్.. ఈ మూడు స్ట్రీమ్లలోనూ అమ్మాయిలే టాపర్లుగా నిలవడం విశేషం. సైన్స్లో సొనాలి కుమారి 94.2 శాతం మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చింది. సైన్సే కష్టం అనుకుంటే, ఆమె కుటుంబ పరిస్థితులు ఇంకా కష్టమైనవి. రెండు కష్టాల మధ్య విజేతగా చదువును లాక్కొచ్చొని సొనాలి తండ్రి రిక్షా పుల్లర్! సోనాలికి స్వీట్ తినిపిస్తున్న కుటుంబ సభ్యులు. చిత్రంలో జీత్ సార్, సోనాలి తల్లిదండ్రులు (కుడి చివర) మార్చి 26 శుక్రవారం బిహార్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు వెల్లడయ్యాయి. మూడు విభాగాల్లో టాపర్గా విజయ కేతనాన్ని ఎగరేసిన వారు ముగ్గురూ అమ్మాయిలే! బిహార్లోని ఖగరియాకు చెందిన మధు భారతి 92.6 శాతం మార్కులతో ఆర్ట్స్లో, ఔరంగాబాద్కు చెందిన సుగంధ కుమారి 94.2 శాతం మార్కులతో కామర్స్లో స్టేట్ టాపర్లుగా నిలిచారు. సైన్స్లో టాప్ ర్యాంక్ కొట్టిన సోనాలి 500 కు 471 మార్కులు సాధించి తండ్రి కష్టానికి తగ్గ ఫలితాన్ని సాధించింది. సోనాలి నలందలోని శ్రీమతి పరమేశ్వరీ దేవి ఉఛ్తార్ మాధ్యమిక పాఠశాల విద్యార్థిని. బిహార్ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 13 వరకు జరిగాయి. మొత్తం 13.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వాళ్లల్లో 10.45 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణశాతం 78.04. ఆ శాతం కంటే కూడా ఈ ముగ్గురు అమ్మాయిలు వ్యక్తిగతంగా సాధించిన శాతమే ఎక్కువ. ముగ్గురూ 90 అంకెను దాటేశారు. సోనాలి చదివిన పాఠశాలకు సమీపంలో బిహార్ షరిఫ్ అనే ప్రాంతంలో ఒక బస్టాండ్ ఉంది. ఆ బస్టాండ్లోనే తోపుడు బండిపై తినుబండారాలను అమ్ముతారు సోనాలి తండ్రి చున్నులాల్. ఆ సంపాదనే వారి కుటుంబానికి జీవనాధారం. ఓపిక ఉన్నప్పుడు ఆయన రిక్షాబండి లాగుతారు. గత ఏడాది లాక్డౌన్ అన్ని బతుకు బండ్ల ఇరుసులను లాగేసినట్లే సోనాలి తండ్రి జీవికనూ కనాకష్టం చేసేసింది. మరో వైపు సోనాలి పంతం పట్టినట్టుగా చదివింది. లాక్డౌన్ సమయం మొత్తాన్ని చదువుకే అంకితం చేసింది. ‘‘నాన్న కష్టపడేవారు. జీత్ సర్ కష్టపడి నన్ను చదివించేవారు. అమ్మ కష్టపడి నాకు అన్నీ అమర్చేది. జీత్ సార్ టెన్త్లో కూడా దగ్గరుండి మరీ నా డౌట్లు తీర్చేవారు. లాక్డౌన్లో సార్ మా ఇంటికే వచ్చి నాకు సబ్జెక్ట్లు టీచ్ చేసేవారు. ఆన్ లైన్ స్టడీస్ కోసం అప్పుడప్పుడు తన సెల్ఫోన్ను నాకు ఇచ్చేవారు. అమ్మ ఎప్పుడూ నా ఆకలిని కనిపెట్టుకుని ఉండేది. ఇంతమంది పడిన కష్టం మందు నేను ర్యాంకు సాధించడం పెద్ద విషయం కాదు అనిపిస్తుంది నాకు’’ అంటోంది సోనాలి! జీత్సార్కి, అమ్మకు నాన్నకు థ్యాంక్స్ చెబుతోంది. సోనాలి ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అవాలని కలగంటోంది. ‘‘భవిష్యత్తులో యు.పి.ఎస్.సి. పరీక్షకు ప్రిపేర్ అవుతాను. నాకెప్పుడూ సమాజానికి, పేదవాళ్లకు సాయం చేయాలని ఉంటుంది. నాలా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం కూడా ఐ.ఎ.ఎస్. అధికారిగా నేను తప్పకుండా ఏదైనా చేసి తీరుతాను. ప్రతి విద్యార్థిలో ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభ వెలుగులోకి రాకుండా పేదరికం అడ్డుపడుతుంటుంది. కడుపులో పేగుల్ని ఆకలి మెలిపెడుతుంటే పుస్తకం ముందేసుకుని చదవగలడం కూడా ఆ పూటకు సాధించిన ర్యాంకే నా దృష్టిలో..’’ అంటోంది సోనాలి. -
సంప్రదాయ కళలకు జీవం పోస్తున్న కళాకారులు
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ పల్లెలు ఓనాడు కళలకు నిలయాలు. ఆనాటి పాటలు, ఆటలు, బాలనాగమ్మ, భక్తసిరియాల, హరిచంద్ర, అల్లిరాణి నాటకాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించేవి. ఆ కళాప్రదర్శనలు చూసేందుకు ఊరంతా ఒకచోటుకే చేరేవారు. పల్లెల్లో వాటికి ఆదరణ ఉండడంతో భాగవతాలు, యక్షగాణాలు, చిరుతల రామయాణాలు వంటి నాటికలు, భాగవత ప్రదర్శనలు జోరుగా ఉండేవి. ఎప్పుడైతే సినిమాలు, టీవీలు అందుబాటులోకి వచ్చాయో ఆనాటి పల్లెకళలు, నాటకాలు, భాగవతాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. నాటి కళలను ఈనాటి వారికి పుస్తకాల ద్వారానో, టీవీల ద్వారా చూపించే ఈ రోజుల్లో పల్లెకళలు ఇంకా బతికే ఉన్నాయిని చెబుతున్నారు దండేపల్లి మండలానికి చెందిన పలువురు కళాకారులు. మండలంలోని పలు గ్రామాల నుంచి.. దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి, వెల్గనూర్, కొర్విచెల్మ, కొండాపూర్, కాసిపేట, నంబాల, నర్సాపూర్ గ్రామాల్లో చాలా మంది కళాకారులు ఉన్నారు. వీరంతా భజన బృందాలుగా ఏర్పడి, ఇప్పటికీ పలు పండుగలు, పబ్బాలు, శ్రావణం, కార్తీక మాసాల్లో, మహశివరాత్రి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి పండుగల రోజుల్లో ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీటితో పాటు గ్రామాల్లో పూజలు జరుపుకునే వారి ఇళ్లలో కూడా రాత్రి వరకు భజనలు చేస్తుంటారు. అంతేకాకుండా కృష్ణాష్టమి, దీపావళీ, శ్రీరామనవమి, శివరాత్రి పండుగలతో పాటు ఇతర పండుగల్లో సందర్భాన్ని బట్టి నాటికలు, భాగవతాలు, యక్షగాణాలు, చిరుతల రామాయణం వంటి కళాప్రదర్శనలు నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అప్పుడప్పుడు నిర్వహిస్తుంటారు. వీటిని వీక్షించేందుకు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్లి ఆనాటి కళప్రదర్శనలు ప్రజలు ఆసక్తిగా తిలకిస్తూ మురిసి పోతున్నారు. పుణ్య క్షేత్రాల్లో భజనలకు.. గ్రామాల్లో గల భజన బృందాలు సాకాకుండా, తిరుమల, తిరుపతి, దేవస్థానాలు, భద్రాచలం, బాసర, కొండగట్టు, గూడెం, ఆలయల్లో నిర్వహించే భజన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా రవీంద్రభారతిలో నిర్వహించే సంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తమ కళా ప్రదర్శనలు ప్రదర్శిస్తుంటారు. అప్పుడప్పుడు ప్రదర్శిస్తున్నం నేను నేర్చుకున్న నాటికలు, బాగవతాలను ఇప్పటికీ మా గ్రామంలో పలు పండుగ సమయాల్లో ప్రదర్శిస్తుంటాం. దీంతో ఇప్పటి వారికి ఆనాటి కళలను గుర్తు చేసిన వాళ్లం కావడంతో పాటు, పల్లె కళలు ఇంకా బతికే ఉన్నాయని తెలియజేస్తున్నం. మా గ్రామంలో చాలా మంది కళాకారులు ఉన్నారు. కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి. – ముత్యం శంకరయ్య, రెబ్బనపల్లి -
సరయు : డాన్స్, ఫైట్స్, ఆర్ట్స్
ఆ బాలిక కుంచె పట్టుకుంటే ‘చిత్రమై’న అనుభూతినిచ్చే సూర్యోదయం ఆవిష్కృతమవుతుంది. గజ్జె కట్టుకుంటే సంప్రదాయం ఘల్లు మంటుంది. యాహూ అని కేక పెట్టిందంటే ఈవ్ టీజర్లకు వణుకుపుడుతుంది. జన్మతః అమెరికా వాసి అయినా సనాతన భారతీయ కళలపై తరగని ఇష్టంతో పాటు నవతరం అభిరుచులకు తగ్గట్టుగా చిత్రకళ, మార్షల్ ఆర్ట్స్... ఇలా సకల కళల్లోనూ రాణిస్తోంది సరయు. అంతేకాదు... ఎంతగా కళలపై ఆసక్తి పెంచుకుంటే అంతగా ఇటు చదువులోనూ మంచి ఫలితాలు వస్తాయంటోంది. ‘‘ఆధ్యాత్మిక భావాలు, చారిత్రక మూలాలు తెలిపే నాట్యం ఓ వైపు మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చింది. మరోవైపు చదువులోనూ రాణించేందుకు ఉపకరించింది’’అని చెప్పింది సరయు (15). సాఫ్ట్వేర్ ఉద్యోగులైన తల్లిదండ్రులు విజయ్, గీతల ఇద్దరు సంతానంలో ఒకరైన సరయు... అమెరికాలో ఉంటున్న భారతీయ చిన్నారుల సంప్రదాయ అభిరుచులకు నిదర్శనం కరాటే కిక్ కొట్టినా.. కాళ్లకు గజ్జకట్టినా... ‘‘ఎంత నాట్యం నేర్చుకోవాలనుకున్నా కాలిఫోర్నియాలో శిక్షకుకులు దొరకడం కష్టంగా మారింది. అయినా పట్టు వదలకుండా ఉన్న నన్ను చూసి అమ్మా నాన్నలు ఎలాగోలా నాట్య గురువును పట్టుకున్నారు’’ అంటూ చెప్పింది సరయు. పద్యాలకు అర్ధమే తెలియని ఐదేళ్ల వయసులో ప్రారంభమైన ఆమె నాట్యాభ్యాసం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఎన్నో బృంద ప్రదర్శనల్లో పాల్గొన్న ఆమె... ఈనెల 20న బెంగుళూర్లో సోలో ప్రదర్శన ద్వారా ఆరంగేట్రం చేయాలనుకుంటోంది. మరోవైపు కరాటేలో కూడా సరయు ప్రతిభ చాటుతోంది. సెకండ్ డిగ్రీ బ్లాక్ బెల్ట్ను స్వంతం చేసుకుంది. నాట్యం సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కైతే.. మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్కి అంటుందీ బాలిక. తెలుగు, ఇంగ్లీషు భాషలతో పాటు స్పానిష్ భాష కూడా ప్రావీణ్యం సంపాదించింది. చిత్రకళలోనూ రాణిస్తూ అనేక బహుమతులు అందుకుంటోంది. తాను గీసిన చిత్రాలను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడం విశేషం. బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టెన్నిస్ క్రీడల్లోనూ ప్రవేశమున్న సరయు... ఇదంతా కూడా చదువే అంటుంది. డెర్మటాలజిస్ట్ కావాలని..! ఒత్తిడితో కూడిన సంక్లిష్టమైన ఇంటర్నేషనల్ బ్యాక్కల్యూరేట్ (ఐబి) కరిక్యులమ్కీ, తన సకల కళాభ్యాసానికి మధ్య ఆమె విజయవంతంగా బ్యాలెన్స్ చేసుకుంది. గత మే నెలలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన గ్రేడ్ టెన్ ఐబి పూర్తి చేసుకుంది. డెర్మటాలజిస్ట్ కావాలనేది ఆమె లక్ష్యం. తనను తాను మాత్రమే కాకుండా తన సంస్కృతీ సంప్రదాయాలను కూడా ఇతరులకు తెలియజెప్పడంలో నాట్యం ఒక ప్రధాన మార్గం అంటుంది. – ఎస్.సత్యబాబు -
మూడు కళల్లో రాణిస్తూ..
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ప్రతీ మనిషికో కళ ఉంటుంది. ఆ కళనే నమ్ముకుని రాణిస్తున్న వారు చాలా మంది ఉంటారు. కానీ ఒకే మనిషికి రెండు, మూడు కళలుండి మూడు రంగాల్లో రాణిస్తున్న వారు మాత్రం కొంతమందే ఉంటారు. పైగా మహిళలు ఉండడం చాలా అరుదు. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రం ఆర్యనగర్కు చెందిన పారిపల్లి గౌరిశ్రీ అందులో ఒకరని చెప్పవచ్చు. 2014 నుంచి కళా రంగాల్లో రాణిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. లఘు చిత్రాల్లో నటిగానే కాకుండా రచయిత్రిగా పనిచేస్తూ ఉనికిని చాటుతున్నారు. ఇప్పటి వరకు కారుణ్య హత్య, మార్పు, ప్రథమ పౌరుడు, ఏది పవిత్ర యుద్ధం, దటీజ్ రావుగారు, మేఘా నాయకుడు, మరణం లేని మనిషి, మరణానికి దారేది, హృదయం, అనాథ శవాల ఆపద్భాందవుడు లాంటి లఘు చిత్రాలకు పనిచేశారు. వీటిలో కారుణ్య హత్య లఘు చిత్రంలో న్యూస్ రీడర్గా ఇమిడిపోయి, మార్పు లఘుచిత్రంలో న్యాయవాదిగా జీవించి, హృదయం లఘు చిత్రానికి గాత్రం(వాయిస్) అందించి మంచి పేరు సంపాదించారు. కాగా మూడింటికి రచయితగా, ఆరింటికి సహాయ రచయితగా పనిచేశారు. గౌరిశ్రీ నటించిన, రచించిన లఘు చిత్రాలు యూట్యూబ్లో ఎంతో మంది నుంచి ప్రశంసలు పొందాయి. బుల్లితెర నటులు సైతం చిత్రాలను వీక్షించి అభినందించారు. అయితే పీజీ పూర్తి చేసిన గౌరిశ్రీ మహిళల చైతన్యం కోసం కూడా పాటుపడుతున్నారు. లఘు చిత్రాల్లో మహిళలకు ఉపయోగపడే, చైతన్యం కలిగించే విధంగా నటనతో పాటు రచనలు చేశారు. సేవారంగంలో కూడా.. గౌరిశ్రీ లఘు చిత్రాలకు నటిగా, రచయిత్రిగానే కాకుండా సమాజానికి సేవకురాలిగా కూడా పరిచయం అయ్యారు. సేవా రంగంలో సైతం తనవంతుగా పాత్ర పోషిస్తూ న్యాయం చేస్తున్నారు. నేనుసైతం స్వచ్ఛంద సంస్థ మహిళా విభాగం ఇన్చార్జిగా ఉంటూ బాలోవ్సవ్ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహించి నిరుపేద బాలికలకు నోటు పుస్తకాలు, ఇతర సహాయ సహకారాలు అందించడంతో పాటు వారిలో నైపుణ్యాన్ని బయటకు తీస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా ఉంటూ... మహిళలను, విద్యార్థినులను చైతన్య పరుస్తున్నారు. భర్తనే ఆదర్శంగా తీసుకున్నా.. నటన, రచన, సేవా రంగాల్లోకి రావడానికి ప్రధాన కారణం నా భర్త రవిశ్రీనే. ఎందుకంటే తాను సమాజానికి ఉపయోగపడే, సందేశాన్ని ఇచ్చే విధంగా లఘు చిత్రాలు ఎంతో తాపత్రయపడి తీస్తున్నారు. ఇందులో నేను కూడా భాగస్వామిని కావాలనే ఉద్దేశంతో లఘు చిత్రాల్లో నటనతో పాటు చిత్రాలకు రచనలు చేయడం ప్రారంభించాను. అలాగే పేద విద్యార్థినులకు సేవ చేయడం, వారిని చైతన్య చర్చడం నాకు ఎంతగానో సంతృప్తిని ఇస్తోంది. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాతో పాటుగా మంచి సందేశాత్మక లఘు చిత్రాల్లో నటించడమే కాకుండా రచనలు చేయాలని ఉంది. – గౌరిశ్రీ, ఆర్యనగర్, నిజామాబాద్ -
12 దేశాలు.. 200 ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: విభిన్న సామాజిక అంశాలు, కళలు, భాషలు,సంస్కృతుల సమ్మేళనంగా రాష్ట్ర రాజధాని నగరం బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్స్కూల్లో 3 రోజులు నిర్వహించిన హైదరాబాద్ సాహితీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. దేశ,విదేశాలకు చెందిన సాహితీప్రియులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు, పాత్రికేయులు, ప్రొఫెసర్లు, వివిధ రంగాల నిపుణులు 12 దేశాల నుంచి 200 మంది విదేశీ ప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. చైనా అతిథిదేశంగా హాజరవడం విశేషం. సాహితీ ఉత్సవంలో సుమారు 30 అంశాలపై సదస్సులు జరిగాయి. చివరిరోజు ప్రముఖ నటి షబానా ఆజ్మీ తన తండ్రి కైఫి ఆజ్మీ శతాబ్ది జన్మదినం సందర్భంగా ఆయన రాసిన కవితలు,ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆమె సంతోషం వ్యక్తంచేశారు. సులభతర పన్నులతో చేయూత: గురుచరణ్ సులభతర పన్నులవ్యవస్థ ఆర్థికరంగానికి చేయూత నిస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త గురుచరణ్దాస్ అన్నారు. ఆదివారం ‘మనీమ్యాటర్స్’అన్న అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశ ఆర్థికవ్యవస్థ ప్రస్థానం, యురోపియన్ దేశాల్లో పన్ను ల వ్యవస్థ పరిణామ క్రమం తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థిక నిపుణులు విక్రమ్,వివేక్కౌల్ తదితరులు పాల్గొన్నారు. హౌ సేఫ్ ఈజ్ అవర్ మనీ: వివేక్ కౌల్ డబ్బు, ఆర్థిక వ్యవస్థ మీద పుస్తకాలు వెలువరిస్తూ, ప్రసంగాలు చేసే వివేక్ కౌల్ పాల్గొన్నారు. నగదు రద్దు క్రమంలో డబ్బు దాచుకోవటం ఎంత ప్రమాదకరమో వివరించారు. బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ ఏమాత్రం సురక్షితం కావని అన్నారు. మేధావుల మౌనం నష్టమే : మల్లికాసారాభాయ్ దేశంలో మేధావులు,విద్యావంతులు వివిధ సామాజిక సమస్యలు,అంశాలపై మౌనంగా మారడం సమాజానికి తీరని నష్టం కలిగిస్తోందని ప్రముఖ సామాజికవేత్త మల్లికాసారాభాయ్ అన్నారు. మంచికోసం,సమాజంలో మార్పుకోసం ప్రతీఒక్కరూ పోరాడాలని,చుట్టూ జరుగుతున్న అన్యాయాలపై రాజకీయనేతలు,అధికారులను ప్రశ్నించే తత్వం అలవరచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణా ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్ తదితరులు పాల్గొన్నారు. దళిత మహిళా రచయితలపై వివక్ష కొనసాగుతోంది: మెర్సీ మార్గరెట్ దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవ మహిళా రచయితలపై వివక్ష కొనసాగుతోందని ప్రముఖ రచయిత్రి,సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మెర్సీ మార్గరెట్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘తెలంగాణ సాహితీసంస్కృతి’అన్న అంశంపై ఆమె మాట్లాడారు. జాతీయ ఉర్దూవర్సిటీ ప్రొఫెసర్ బేజ్ ఎజాజ్ మాట్లాడుతూ..హైదరాబాద్ విశిష్ట సంస్కృతీ,సంప్రదాయాలను వివరించారు. ప్రముఖ జర్నలిస్ట్ టంకశాల అశోక్ మాట్లా డుతూ..సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని అనువాద రచనల్లో తాను అందిస్తోన్న విధానాన్ని వెల్లడించారు. కామ– ది రిడిల్ ఆఫ్ డిజైర్ తాను ఇటీవల వెలువరించిన పుస్తకం ‘కామ– ది రిడిల్ ఆఫ్ డిజైర్ ’గురించి దాని రచయిత గురుచరణ్దాస్ ప్రసంగించారు. ఆధునిక జీవితంలో ధార్మిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, స్వీయ జీవితం పట్ల దృష్టి తగ్గిస్తున్నామన్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని, కామదేవ దివస్గా నిర్వహించుకోవాలని తాను, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఒక ఉద్యమం ప్రారంభించాలనే యోచనలో ఉన్నామని, ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం నుంచే దీన్ని ప్రారంభిస్తామన్నారు.హిందూత్వ భావజాలానికి ఇక కాలం చెల్లుతుందన్నారు. -
ఆ రంగాలను కుదిపేస్తోన్న ‘మీటూ’
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీటూ’ ఉద్యమం ఇప్పుడు కర్ణాటక సంగీతం, భరత నాట్య రంగాలను కూడా కుదిపేస్తోంది. అసభ్యంగా తడమడం నుంచి బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, లైంగికంగా లొంగతీసుకోవడం వరకు పురుష పుంగవుల నుంచి అనుభవాలను ఎదుర్కొన్న వందల మంది కళాకారిణులు తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలను బాహ్య ప్రపంచానికి వెల్లడించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ ఉద్యమంలో బాధితులంతా కలిసికట్టుగా ముందుకు రావాలంటూ దాదాపు 200 మంది కళాకారిణులు సంతకాలతో కూడిన ఓ ప్రకటనను కూడా మీడియాకు విడుదల చేశారు. ‘ఇటు కర్ణాటక సంగీతం, అటు భరత నాట్యంలోనూ మహిళలు, ముఖ్యంగా యువతులకు, టీనేజర్లకు విద్యను నేర్పేటప్పుడు గురువులు అసభ్యంగా తాకడం సర్వ సాధారణం. ఆధునిక ప్రపంచంలో సినిమా తారల స్థాయికి ఎదగాలంటే ఇలాంటి, అలాంటి భంగమల్లో నృత్యం చేయాలంటూ అసభ్య భంగిమలు పెట్టించేందుకు ప్రయత్నించడం, అసభ్యంగా తాకడం కూడా మామూలే. మాస్టారు! దూరంగా ఉండి భంగిమల్ని చూపించమంటే...నృత్యం మీద దృష్టిని కేంద్రీకరించండంటూ మరీ గట్టిగా హత్తుకుంటారు. సంగీత మాస్టార్లు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. వారికి పడక సుఖం అందించకపోతే కర్ణాటక సంగీతంలో కరీర్ను దెబ్బతీస్తున్నారు. దెబ్బతీస్తామని హెచ్చరిస్తున్నారు. మహిళా కళాకారుల ముందే బూతు జోకులు వేయడం, వేసుకోవడం, వెకిలి చేష్టలు చేయడం వారికి అలవాటు. ఇక విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఒకే చోట విడిది చేస్తాం కనుక, మహిళల ముందే వారు కంప్యూటర్లలో, టీవీల్లో నీలి చిత్రాలు చూస్తారు. ఆడ, మగ పడుకోవడం, పడక సుఖాన్ని పంచుకోవడం చాలా సహజమైన విషయం అన్నట్లుగా మాట్లాడుతారు, కవ్వించేందుకు ప్రయత్నిస్తారు. నెత్తిన విభూతి బొట్టు, సిల్క్ పంచకట్టు మాటన తమ అసభ్య ప్రవర్తను దాచేందుకు గురువులు ప్రయత్నిస్తారు. తోటి మగ కళాకారుల నుంచి కూడా మాకు లైంగిక వేధింపులు ఉన్నాయి. అయితే అవి గురువుల స్థాయిలో లేవు. ఈ రెండు రంగాల్లో పురుషులది, అగ్రవర్ణాలదే ఆధిపత్యం కనుక వారి ఆగడాలకు అంతులేకుండా పోతోంది’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని సంగీత, భరత నాట్య రంగాలకు చెందిన పలువురు కళాకారిణులు వాపోయారు. వారు అకాశరామన్న ఖాతాల ద్వారా ఇప్పటికే ట్విట్టర్, ఫేస్బుక్ల్లో తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఇంకా షేర్ చేసుకుంటున్నారు. ఈ రంగాల్లో కూడా ‘మీటూ’ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ఓ సాంస్కృతిక సంస్థ ‘ఏక్ పుత్లీ రేతి కీ’ ఈ నెల 21వ తేదీన, ఆదివారం చెన్నైలో ‘బహిరంగ విచారణ–సంప్రతింపులు’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆత్మవంచనా ప్రపంచాలే! శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ భరత నాట్యం రెండూ కూడా భారత్లో భయంకరమైన ఆత్మవంచనా ప్రపంచాలని ఓ సంగీత విద్వాంసుడి చేతుల్లో ఏడేళ్ల క్రితం లైంగిక దాడికి గురైన పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని మరో కళాకారిణి ఆరోపించారు. నుదుట విభూతి, సిల్కు పంచె, భక్తి మాటున దాగిన రాక్షసులు వీరని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ‘సైబర్ సెక్స్ నీకు ఇష్టమా ? అంటూ శిష్యురాళ్లను అడిగిన గురువులను కూడా చూశానని ఆమె చెప్పారు. తన కళ్ల ముందు తోటి కళాకారుడితో పడుకోవాలంటూ తన గురువు బలవంతం చేస్తున్నాడంటూ, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందంటూ ఓ విద్యార్థిని ఏడుస్తూ వచ్చి తనను గట్టిగా వాటేసుకోవడం తనకు తెలుసునని ఆ కళాకారుణి చెప్పారు. ఇదంతా బహిరంగ రహస్యమే! భారత శాస్త్రీయ కళా రంగాల్లో లైంగిక వేధింపులనేవి బహిరంగ రహస్యమేనని ప్రముఖ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు, కాలమిస్టు టీఎం కృష్ణ వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనల గురించి ఎప్పటి నుంచో గుసగుసలు, కబుర్లు వింటున్నాం. వీటి పట్ల నాతో సహా పలువురు కళాకారులు మౌనం పాటిస్తూ వచ్చాం. ఈ గొడవలు, సంబంధాలు వాటంతటవే సాధారణం కావాలని, సర్దుకుపోవాలని ఆశించామని ఆయన చెప్పారు. పైగా జరిగినదానికి తాము మహిళలనే దూషించామని కూడా ఆయన చెప్పారు. ఈ విషయంలో మహిళల పక్షాన నిలబడలేక పోయినందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. ముందుగా మనం చేయాల్సిందిల్లా సంగీత విద్వాంసులను, గురువులను దైవ స్వరూపులుగా చూడడం, భావించడాన్ని మానుకోవాలని ఆయన అన్నారు. ఈ రంగాల్లో పురుషాధిక్యం, అగ్రవర్ణాల ఆదిపత్యం కొనసాగుతుండడం వల్ల అధికారం, అహంకారంతో కూడా ఈ లైంగిక దాడులు జరుగుతున్నాయని గాయకురాలు సుధా రఘునాథన్ అభిప్రాయపడ్డారు. ముందునుంచే తెలుసు: సింగర్ జయశ్రీ కర్ణాటక సంగీత రంగంలో లైంగిక దాడి, అనుచిత ప్రవర్తన ఉందనే విషయం ముందు నుంచే కర్ణాటక కమ్యూనిటీకి తెలుసని గాయకురాలు బాంబే జయశ్రీ చెప్పారు. కళాకారులుగా మేమంతా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్న వాళ్లమేనని అన్నారు. ‘మనమంతా వీటి గురించి మాట్లాడాలి. అందుకు స్పష్టత, ధైర్యం ఉండాలని కోరుకుంటున్నాను. ఉందనే భావిస్తున్నాను. ఇందులో మన గురించే ఆలోచించరాదు. అందరి గురించి ఆలోచించాలి. ఆలోచించి అడుగేయాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది’ అని ఆమె వ్యాఖ్యానించారు. -
ఐఐటీల్లో నయా జోష్..!
దేశంలో శాస్త్ర సాంకేతిక విద్యకు దిక్సూచిలవి.. యావత్ యువతరం చోటు కోసం కలలుగనే, పోటీ పడే విద్యా కుసుమాలవి... విద్యార్థులను బట్టీ చదువులు, మార్కుల యంత్రాలుగా మార్చడంపై కాకుండా యువ మస్తిష్కాలను నూతన ఆవిష్కరణలవైపు నడిపించే ‘ఫ్యాక్టరీ’లవి... ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి, ‘గూగుల్’ సుందర్ పిచాయ్, ‘ఫ్లిప్కార్ట్’ సచిన్ బన్సల్, ‘సాఫ్ట్ బ్యాంక్’ నికేష్ అరోరా వంటి ఎందరినో ప్రపంచానికి అందించిన కేంద్రాలవి... అవే...దేశ అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా కీర్తిప్రతిష్టలు అందుకుంటున్న ఐఐటీలు (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు). ఇప్పుడు ఈ సంస్థలు పూర్వ వైభవానికి మరిన్ని హంగులు అద్దుకుంటూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దేశంలోని 23 ఐఐటీలలో ఉన్న సీట్లు దాదాపు ఏడు వేలు! కానీ పోటీ పడే విద్యార్థుల సంఖ్య మాత్రం లక్షలకు లక్షలు! ఈ ఒక్క విషయం చాలు దేశంలో ఐఐటీలకు ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకునేందుకు. అయితే దశాబ్దాలుగా ఒకే రకమైన కోర్సులు, సిలబస్తో నడుస్తున్న ఈ సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా అడుగులేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలు అనుసరించే బోధనా పద్ధతులు పాటించడంతోపాటు వేర్వేరు సమస్యల పరిష్కారానికి వేర్వేరు శాస్త్ర విభాగాలు కలసికట్టుగా పరిశోధనలు చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సైన్స్ ఇంజనీరింగ్లతోపాటు కళలు, హ్యుమానిటీస్ అంశాల్లోనూ కోర్సులు ప్రారంభిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసే విషయంలో విద్యార్థులకు స్వేచ్ఛ, సౌలభ్యం అందించేందుకు చర్యలు చేపట్టాయి. ఫలితంగా యువతరం మోసుకొచ్చే కొత్త ఆలోచనలు, పద్ధతులతో పరిశోధనలూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రొఫెసర్లుగా యువతకు ప్రాధాన్యం... ఐఐటీ ప్రొఫెసర్లంటే తల నెరసిన వారే ఉంటారన్న పాతకాలపు ఆలోచనలకు తెరదించుతూ యాజమాన్యాలు యువతరానికి పెద్దపీట వేస్తున్నాయి. దీంతో ఐఐటీ అధ్యాపకుల సగటు వయసు 1980 ప్రాంతంలో 60 ఏళ్లు కాగా.. ఇప్పుడు అది 40కు తగ్గిపోయింది. గత ఐదేళ్లలో స్వదేశానికి తిరిగొచ్చిన యువ శాస్త్రవేత్తల్లో అత్యధికులు ఐఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లలో చేరుతున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 2007–12తో పోలిస్తే ఆ తరువాతి ఐదేళ్లలో విదేశాల నుంచి తిరిగొస్తున్న శాస్త్రవేత్తలకు ఇచ్చే ఫెలోషిప్లు 70 శాతం పెరిగాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. కలివిడిగా.. వడివడిగా... పరిశోధనలంటే సామాన్యులకు ఉపయోగపడేవి కావన్న ఒకప్పటి అంచనాను తారుమారు చేస్తూ ఐఐటీ, ఐఐఎస్సీలు దేశానికి వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ప్రాజెక్టులతోపాటు పరిశ్రమల సమస్యలను పరిష్కరించేందుకు, టెక్నాలజీతో సామాన్యుడి కష్టాలు తీర్చేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఫలితంగా మునుపటి కంటే వేగంగా ఐఐటీ కేంద్రంగా కొత్త స్టార్టప్లు, కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఐఐఎస్సీ గతంలోనే వేర్వేరు శాస్త్ర విభాగాలు కలసికట్టుగా పనిచేసేలా వాతవరణ మార్పులపై ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇదే తరహాలో ఇంధనం, నీటి సమస్యల పరిష్కారానికీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు ధ్వనికంటే వేగంగా దూసుకెళ్లే విమానాల కోసమూ ప్రత్యేక కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఐఐటీ మద్రాస్లోనూ 2014లో కంబషన్ (ఇంధనం మండే ప్రక్రియ)పై మొదలుపెట్టి.. నానో మెటీరియల్స్, కంప్యూటేషనల్ బ్రెయిన్ రీసెర్చ్, బయోలాజికల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, డేటా సైన్సెస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లోనూ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరిన్ని కేంద్రాల ఏర్పాటు ఆలోచనలతో ముందుకొచ్చిన వారికి రూ. 2 కోట్ల నగదు బహుమతి కూడా ఇస్తోంది. ముందు వరుసలో ఐఐటీ బాంబే... ఐఐటీ బాంబే 2017లో తొలిసారి ఖగోళ శాస్త్రంలో కోర్సును ప్రారంభించింది. ఇదే సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి విదేశాల్లో ఖగోళశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించిన వరుణ్ భలేరావును చదువు చెప్పేందుకు ఎంపిక చేసుకుంది. ఏడాది తిరిగేలోగా మరో నలుగురు మాజీ ఐఐటీయన్లు ఆయనకు జతకూడారు. వేర్వేరు అంశాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వీరు ఇప్పుడు ఖగోళశాస్త్రంలో కొత్త ఆవిష్కరణలకు పునాదులు వేస్తున్నారు. లడాఖ్లోని 18 ఏళ్ల పురాతన ఆప్టికల్ టెలిస్కోప్ దానంతట అదే పనిచేసేలా సరికొత్త ఆటోమేషన్ సాఫ్ట్వేర్ను వారు రూపొందిస్తున్నారు. అంతేకాదు... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో కలసి గురుత్వ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలూ చేపట్టారు. భలేరావు మాదిరిగానే.. న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆంథ్రోపాలజీ చదివిన అనూష్ కపాడియా.. ఇప్పుడు ఐఐటీ బాంబేలో సామాజిక శాస్త్రాల్లో విద్య నేర్పుతున్నారు. ఐఐటీ, ఐఐఎస్సీల్లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న వినూత్న పరిశోధనల్లో కొన్ని... ► మానవ మెదళ్ల మాదిరిగా పనిచేసే మైక్రోచిప్ల తయారీపై ఐఐటీ ఢిల్లీలో మనన్ సూరీ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తున్నారు. అతితక్కువ ఖర్చుతో సమాచారాన్ని దీర్ఘకాలంపాటు నిల్వ చేసుకోగల మెమరీని అభివృద్ధి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. నానో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీలపై ఫ్రాన్స్లో పీహెచ్డీ చేసిన మనన్ సూరికి మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) గతేడాది 35 ఏళ్ల వయసులోపు ఉన్న అద్భుత శాస్త్రవేత్తగా అవార్డు అందించింది. ► జల విద్యుత్ తయారీలో కీలకమైన టర్బైన్లను ప్రస్తుత పరిమాణంకంటే పదిరెట్లు తక్కువ సైజులో, అది కూడా వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న కార్బన్ డయాక్సైడ్తో పనిచేయించేలా ప్రయోగాలు జరుగుతున్నాయి. 2012లో బెంగళూరులోని ఐఐఎస్సీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరిన ప్రమోద్ కుమార్ కార్బన్ డయాక్సైడ్ను ఒక ప్రత్యేక స్థితికి తీసుకెళ్లడం ద్వారా టర్బయిన్లలో వాడుకోవచ్చునని అంటున్నారు. ద్రవ, వాయు స్థితులకు మధ్యలో ఉండే ఈ ప్రత్యేక స్థితిలో కార్బన్ డయాక్సైడ్ను వాడినప్పుడు తక్కువ సైజున్న టర్బయిన్లతోనే సమర్థంగా విద్యుదుత్పత్తి చేయవచ్చని అంచనా. ఈ టర్బయిన్ సంప్రదాయేతర ఇంధన వనరులతోపాటు అణు రియాక్టర్లలోనూ అత్యంత కీలక పాత్ర పోషించనుందని అంచనా. ► 2007లో ఐఐటీ బాంబే నుంచి పట్టభద్రుడైన నిషాంత్ డోంగరి ప్రస్తుతం హైదరాబాద్ ఐఐటీలో పనిచేస్తూ క్షిపణి రక్షణ వ్యవస్థలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇప్పటికే వినూత్న సౌరశక్తి పరికరాల తయారీతోపాటు రూఫ్టాప్ సోలార్ ప్యానళ్ల సమర్థ వినియోగం వంటి అంశాల్లో సేవలందించేందుకు ‘ప్యూరెనర్జీ’ పేరుతో కంపెనీ స్థాపించారు. ► స్మార్ట్ఫోన్లలో ఇంటర్నెట్ వేగాన్ని పదుల రెట్లు ఎక్కువ చేసే 5జీ టెక్నాలజీకి తగిన ప్రమాణాలను రూపొందించే విషయంలో ఐఐటీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కూచి కిరణ్ విజయం సాధించారు. గతేడాదే ఈ టెక్నాలజీపై పేటెంట్కు కిరణ్తోపాటు ఇతర శాస్త్రవేత్తలు దరఖాస్తు చేశారు. — సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చరిత్రకు చిత్రిక పట్టారు!
సాక్షి, హైదరాబాద్: చెరువులు.. పట్టణాలు.. ఆలయాలు (త్రిబుల్ టీ) స్ఫూర్తితో పాలన సాగించిన కాకతీయుల చరిత్రను ప్రస్తుత తరాలకు కళ్లకు కట్టినట్లు తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. వ్యవసాయం, అనుంబంధ వర్గాలకు చేయూత నిచ్చేలా పాలించిన కాకతీయుల వైభవాన్ని చిత్రాల రూపంలో అందరికీ తెలియజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాకతీయుల పరిపాలన కేంద్రం ఖిలా వరంగల్లోని ప్రస్తుత గృహాలపై వారి పరిపాలన ప్రస్థానాన్ని, వైభవాన్ని చిత్రీకరించనున్నారు. పర్యాటక శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో జవహర్లాల్ నెహ్రూ హస్తకళల విశ్వవిద్యాలయం (జేఎన్ఏఎఫ్ఏయూ) విద్యార్థులు భాగస్వాములవనున్నారు. 120 ఇతివృత్తాలు ఖిలా వరంగల్లో కాకతీయుల నాటి సంఘటనలు గుర్తుకు తెచ్చేలా 120 ఇతివృత్తాలను పర్యాటక శాఖ ఎంపిక చేసింది. వీటి ఆధారంగా ఇళ్లపై బొమ్మలను తీర్చిదిద్దనున్నారు. రాజస్థాన్ జోధ్పూర్లోని ఇళ్లన్నీ ఒకేలా కనిపిస్తూ పర్యాటకులను ఆలరిస్తాయి. అదే తరహాలో ఖిలా వరంగల్లోని నిర్మాణాలపై నీలిరంగుతో కాకతీయ ఘట్టాలను బొమ్మలుగా వేయనున్నారు. పరుసవేది లభించడం నుంచి ప్రతాపరుద్రుడి పరాజయం వరకు సంఘటలను చిత్రించనున్నారు. ఖిలా వరంగల్, కాకతీయ కీర్తితోరణాలు, ఖుష్ మహల్ చూసేందుకు వచ్చే పర్యాటకులకు కాకతీయ యుగంపై అవగాహన వచ్చేలా ఈ చిత్రాలు కనువిందు చేయనున్నాయి. తొలిదశలో పడమర కోట ముఖద్వారం నుంచి ఖుష్మహల్ వరకు ఉన్న ఇళ్లను ఎంపిక చేశారు. రోడ్డు వైపు ఉన్న గోడలపై కా>కతీయుల చరిత్రను తెలిపేలా చిత్రాలు వేయనున్నారు. పడమర కోట ముఖ ద్వారంలో ప్రయోగాత్మకంగా 3 చిత్రాలు వేశారు. త్వరలోనే ఈ పనులు పూర్తిస్థాయిలో మొదలుకానున్నాయి. ఏకశిల గుట్ట.. ఐనవోలు తోరణం.. కాకతీయుల రాజ్య స్థాపకుడు గుణ్యన నుంచి మొదలు రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వరకు కీలక ఘట్టాలను పర్యాటక శాఖ ఎంపిక చేసింది. కాకతీయులు జైనం నుంచి శైవంలోకి మారారు. వేలాది శివాలయాలు నిర్మించారు. శైవారాధన చేసే చిత్రాలు, కాకతీయ కళా తోరణం, హన్మకొండ ప్రవేశద్వారం, హన్మకొండ కోట, ఎండ్ల బండ్ల వరుస, భూమిలో బండి కూరుకుపోవడం, ఇనుప కమ్మి బంగారంలా మారడం, రాజుగారికి తెలియజేయడం, ప్రోలరాజు గురువులతో కలసి రావడం, పరుసవేది శివలింగం, కోట నిర్మాణం ప్రారంభం, పరుసవేది ప్రతిష్టాపన, స్వయంభూ ఆలయ నిర్మాణం, 7 కోట గోడలు, మట్టి ఆకారం కోసం అగడ్తల తవ్వకం, తోరణ స్తంభాల ఏర్పాటు, మట్టికోట–రాతికోట–ఇటుక కోట–పుట్టకోట నిర్మాణాలు, గొలుసుకట్టు చెరువులు, మెట్ల బావుల నిర్మాణం, సైనికుల శిక్షణ, వ్యవసాయం, చేనేత, కళలు, తోటలు, రెండు అంతస్తుల బంగ్లాలు, ఏకశిల గుట్ట, ఐనవోలు తోరణం, జైన–శైవ–వైష్ణవ, భైరవ పూజ, పేరిణి నాట్యం, సింహద్వారం, మోటుపల్లి రేవు, వెయ్యి స్తంభాల ఆలయం, రామప్పలోని నంది, కుష్ మహల్, రుద్రమదేవి అబ్బాయిగా వేషధారణ వంటి ఎంపిక చేసిన ఘట్టాలను బొమ్మలుగా వేయనున్నారు. -
నాటకం..రసాత్మకం
- కర్నూలులో జాతీయ స్థాయి నాటిక పోటీలు ప్రారంభం కర్నూలు(హాస్పిటల్): నాటకాలను ప్రజలు ఆదరించాలని, అప్పుడే కళాకారులకు మనుగడ ఉంటుందని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం జాతీయ స్థాయి నాటిక పోటీలను జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటకం రసాత్మకమైనదన్నారు. అయితే దీనిని ఆదరణ తగ్గడం ఆవేదన కలిగిస్తోందన్నారు. 11 సంవత్సరాల నుంచి లలిత కళాసమితి నాటకాలను ప్రోత్సహిస్తూ నగర ప్రజలకు వినోదాలను అందిస్తోందని తెలిపారు. ఈ నాటికలు సకుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉన్నాయన్నారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ.. కావ్యం రెండు రకాలని, ఒకటి దృశ్య, రెండోది శ్రవ్య కావ్యమన్నారు. ఈ నాటికలు శ్రవ్య నాటికలని చెప్పారు. ఇవి చక్కటి సందేశాలను ఇచ్చే విధంగా ఉన్నాయని కొనియాడారు. అనంతరం నాటిక దర్శకులు శ్రీజ సాదినేని, భాస్కర్నాయక్లను సన్మానించారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, సభ్యులు డి. ఈశ్వరయ్య, శ్రీనివాసరావు, క్రిష్టఫర్, టీవీ రెడ్డి పాల్గొన్నారు. డబ్బు విలువ తెలిపే సందడే సందడి శ్రీ జయ ఆర్ట్స్(హైదరాబాద్) వారి సందడే సందడి నాటిక విశేషంగా ఆకట్టుకుంది. శ్రీజా సాదినేని రచన, దర్శకత్వం వహించిన ఈ నాటికలోని ఇతి వృత్తం ఇది. సులభంగా డబ్బు సంపాదించాలని ముందు, వెనకా ఆలోచించకుండా ప్లాట్లు, ఫ్లాట్లు కొనేయడం,,రిజిస్టర్ కాని చిట్ఫండ్ కంపెనీల్లో, మోసపూరితమైన బ్యాంకుల్లో ధనాన్ని పెట్టడం ఎంత ప్రమాదమో ఈ నాటిక వివరిస్తుంది. దైనందిక జీవితంలో టీవీని ఒక ప్రధాన భాగంగా మార్చుకున్న సుశీల తన భర్తను రకరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటుంది. భార్యపై పిచ్చి ప్రేమతో ఆమె భర్త చంద్రశేఖర్ ఆమె మాటను కాదనలేడు. సుశీల తమ్ముడు భగవాన్ తన తెలివితేటలతో అక్కను, భావను ఎలా మార్చాడన్నదే ఈ కథ. హాస్య ప్రదానంగా సాగే కథనం సామాజిక ఇతివృత్తాన్ని చాపకింద నీరులా నడిపిస్తుంది. భారతీయ వివాహ వ్యవస్త గొప్పతనాన్ని తెలిపే సప్తపది శ్రీ అంజన రాథోడ్ థియేటర్స్ వారి సప్తపది నాటిక భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థ గొప్పతనం గురించి చెబుతుంది. తాళాబత్తుల వెంకటేశ్వరరావు ఈ నాటికను రచించారు. బలహీనమైన ఆలోచనలతో, చిన్న చిన్న కారణాలతో విడాకుల పేరుతో విలువైన వైవాహిక జీవితాన్ని భగ్నం చేసుకుంటున్నారని, మన వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని, సప్తపదుల పవిత్రత మహోన్నతమైనవని గుర్తు చేస్తూ ఈ నాటిక సాగుతుంది. నేటితరం సప్తపదుల సాక్షిగా చేసిన వాగ్దానాన్ని గౌరవిస్తూ, వైవాహిక జీవితాన్ని ఆనందంగా సాగిస్తూ ఆదర్శదంపతులుగా వర్దిల్లాలని సందేశమిచ్చేదే ఈ నాటిక సారాంశం. -
కాలేజీ మైదానమే.. వాణిజ్య సముదాయం..
-విద్యార్థులే వ్యాపారవేత్తలు –ఆర్ట్స్ కళాశాలలో ‘మెగా మార్కెట్ ఫెస్ట్’ –30 స్టాళ్లతో మూడు రోజులు నిర్వహణ కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : వారు చదివేది వాణిజ్యశాస్త్రం. క్షేత్రస్థాయిలో వివిధ వ్యాపారసంస్థల కార్యకలాపాలను పరిశీలించడమూ వారి కోర్సులో భాగమే కావచ్చు. అయితే రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఓ అడుగు ముందుకేసి తామే వ్యాపారులుగా మారారు. కళాశాల ప్రాంగణమే వారి వ్యాపార సముదాయమైంది. విద్యార్థులకు వ్యాపారదృక్పథాన్ని నేర్పే విధంగా కళాశాల వాణిజ్య, కామర్స్ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మెగా మార్కెట్ ఫెస్ట్’ను సోమవారం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రారంభించారు. మూడురోజులు జరిగే ఈ ఫెస్ట్లో ఏమి వ్యాపారం చేయాలో ముగ్గురు నుంచి 10 మందితో ఏర్పడ్డ బృందాలు ముందే నిర్ణయించుకున్నాయి. తలో కొంత సొమ్ము పెట్టుబడి పెట్టి మార్కెట్కు వెళ్లి అందుకు అవసరమైన వస్తువులను కొన్నారు. వాటికి ఒక ధర నిర్ణయించి ఫెస్ట్లోనిఽ స్టాల్స్లో అమ్మకాలు ప్రారంభించారు. ఈ విధంగా 30 స్టాల్స్ ఏర్పాటు చేశారు. లాభాలతో శభాష్ అనిపించుకుంటాం.. ఆడవాళ్లకు ఇష్టమైన ఫ్యాన్సీ వస్తువుల వ్యాపారం ఏ ప్రాంతంలో పెట్టినా లాభదాయకంగా ఉంటుందని ఆ వ్యాపారం ఎన్నుకున్నాం. ఏడుగురం రెండేసి వందల చొప్పున వేసుకుని రూ.1400లతో గాజులు, చెవిదిద్దులు, డిజైన్ దండలు, పట్టీల వంటివి హోల్సేల్గా కొన్నాం. మార్కెట్కనుగుణంగా ధర నిర్ణయించి, స్టాల్లో అమ్ముతున్నాం. ఇప్పటివరకు రూ.700 వచ్చింది. మిగిలిన రెండు రోజుల్లో కచ్చితంగా లాభాలు తెచ్చి అందరితో శభాష్ అనిపించుకుంటాం. –టి.భవానీ, మహాలక్ష్మీ, దుర్గాభవాని, పవిత్ర, బీకాం ప్రథమ సంవత్సరం )మహిళల వస్తువులపై దృíష్టిసారించాం ప్రతి మహిళా ఫంక్షన్కో, బయటకో వెళ్లాలంటే కచ్చితంగా హ్యాండ్బ్యాగో, చిన్నపర్సో ఉంటాయి. అందుకే వాలెట్స్ వ్యాపారం బాగుంటుందనిపించింది. 13 మందిమి రూ.13 వేలు కూడబెట్టాం. దానితో సరుకులు కొనుగోలు చేశాం. ముందుగా మార్కెట్లో తిరిగి అవగాహన పెంచుకున్నాం. వినియోగదారునికి మొదట కావల్సింది వస్తువులో నాణ్యత. ఆ దిశగా సరుకులు కొన్నాం. నాణ్యత ద్వారా వినియోగదారుల్ని ఆకర్షించవచ్చు. –యు.గీత, ఎం.లలిత, ఎం.లావణ్య, ఎస్.శిరీష, ఎంకాం విద్యార్థులు లాభంతో పాటు తృప్తి ఇటీవల అందరూ ఇళ్లలో మొక్కలను పెంచుతున్నారు. ఆ వ్యాపారం బాగుందని కొందరు మిత్రుల ద్వారా తెలుసుకున్నాం. అందరం కలిసి చర్చించుకున్నాం. అతి తక్కువతో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. ముగ్గురం కలిసి రూ.1500 తో మొక్కలు కొనుగోలు చేశాం. పెట్టుబడికి రెండింతలు లాభాలు తీసుకువస్తాం. వీటి అమ్మకం వల్ల మాకు లాభాలు, వ్యాపార అవగాహనతో పాటు పర్యావరణ పరిరక్షణలో మేమున్నామనే తృప్తి కూడా మిగులుతుంది. –భార్గవ్, డి.స్వాతి, ఎస్.పుష్ప, ఎంకాం విద్యార్థులు నష్టం ప్రసక్తే లేదు.. మార్కెట్లో రెడీమెడ్ డ్రెస్ల అమ్మకాలు బాగున్నాయన్న ఆలోచనతో వాటిని కొనుగోలు చేసాం. ఇప్పటివరకు రెండు డ్రెస్సులు అమ్మాం. ఈ వ్యాపారంలో ఒక మంచి వి«ధానముందని తెలిసింది. వ్యాపారం చేసేందుకు ముందుగా పెట్టుబడికి రుణమొత్తం అవసరం లేదు. కొంత సొమ్ము ఇస్తే హోల్సేల్ వ్యాపారులు మాకు కొంత సరుకు ఇచ్చారు. అమ్మలేనివి తిరిగి ఇవ్వవచ్చన్నారు. ఆ విధానంతో ఆ వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉండదనే ఆలోచన వచ్చింది. –పి.మహేష్, మోహిన్, సాయి, తేజ, బీకాం విద్యార్థులు అవగాహన లేక నష్టం.. ఆటలు, ఆహారం అనే విధానం కొత్తరకంగా అనిపించింది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు ఆశించవచ్చనుకున్నాం. అయితే ఇది చాలా తెలివితో చేయాల్సిన వ్యాపారమని స్టాల్ పెట్టాక తెలిసింది. ఒక చాక్లెట్ ఇస్తాం..దాన్ని ఒక నిమిషంలో చప్పరించి తినేస్తే ఒక బహుమతి ఇస్తాం. ఎగ్జిబిషన్లలో మాత్రమే ఉండే ఈ విధానంపై అవగాహన లేకపోవడంతో తొలిరోజు నష్టం చవిచూశాం. మరో రెండురోజులుంది కాబట్టి దీనిపై అవగాహన పెంచుకుంటాం. –ఎం.సీత, సుప్రియ, రమ్య, వినయ్, బీకాం విద్యార్థులు వాస్తవికత తెలుస్తుంది.. విద్యార్థులు పాఠ్యాంశాల్లో నేర్చుకున్నది వేరు. వాస్తవం తెలుసుకోవడానికి మెగా మార్కెట్ ఫెస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అమ్మకం, నైపుణ్యం, ఖాతాదారులను ఆకట్టుకోవడం వంటివి తెలుసుకుంటారనే దీన్ని ఏర్పాటు చేశాం. దీని ద్వారా విద్యార్థులకు వ్యాపారం అంటే ఎలా ఉంటుందో కళాశాలలోనే అర్థమౌతుంది. –డాక్టర్ ఆర్.డేవిడ్కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ నవకల్పనలు చేయాలి.. మార్కెట్లో సృజనాత్మక ఉత్పత్తులు తయారుచేసి ప్రదర్శనకు ఉంచి అమ్మడం ద్వారా ఆ వస్తువు తయారీ, అమ్మకం ధర బేరీజు వేసుకోవచ్చు. రాబోయే కాలంలో నవకల్పనలతో కూడిన వస్తువులు తయారుచేసి అందుబాటులోకి తేవాలి. విద్యార్థులు వ్యాపార మెళకువలు నేర్చుకునేందుకు ఫెస్ట్ దోహదం చేస్తుంది. –ఆకుల సత్యనారాయణ, నగర ఎమ్మెల్యే విద్యార్థి దశలోనే తెలుసుకోవాలి వ్యాపారం చేయడం ముఖ్యం కాదు. దానినిర్థి దశనుంచే అలవాటు చేసుకోవాలి. అప్పుడే అందులో మెళకువలు తెలుసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. దీనికోసం విద్యార్థులు ముందుగా అవగాహన పెంపొందించుకోవాలి. ఆ దిశగానే మెగా మార్కెట్ ఫెస్ట్ ఏర్పాటు చేశాం. మంచి ఫలితమిస్తుందని ఆశిస్తున్నాం. –కె.రత్నమాణిక్యం, మెగా మార్కెట్ ఫెస్ట్ కో ఆర్డినేటర్ -
చిత్రలేఖనంలో సత్తాచాటిన పారిశుద్ధ్య కార్మికుడు
అవార్డు’ను దక్కించుకున్న రేలంగి నాగేశ్వరరావు అమలాపురం టౌన్ : స్థానిక మున్సిపాలిటీలో కార్మికుడిగా పనిచేస్తున్న రేలంగి నాగేశ్వరరావుకు ప్రముఖ అంతర్జాతీయ అవార్డు లభించింది. ఈ ఏడాది కోనసీమ చిత్ర కళా పరిషత్ జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్ర లేఖన పోటీల్లో నాగేశ్వరరావు కలోజ్ ప్రక్రియలో రూపొందించిన దేవాలయం చిత్రానికి ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారుడు పికాసో పేరు మీద చిత్రానంద అవార్డు దక్కింది. నాగేశ్వరరావు కుంచెలు, రంగులతో చిత్రాలు గీయటంలోనే కాదు కలోజ్ వర్క్తోనూ భావ గర్భిత చిత్రాలు రూపాందించడంలో దిట్ట. ఉదయం పారిశుధ్య పనుల్లో తలమునకలయ్యే నాగేశ్వరరావు రాత్రి సమయాన్ని తనకు ఇష్టమైన చిత్ర లేఖనం కోసం కేటాయిస్తాడు. 2017 జనవరి 22న అమలాపురంలో జరిగే కోనసీమ చిత్ర కళా పరిషత్ జాతీయ చిత్ర కళాపోటీల బహుమతి ప్రదానోత్సవ సభలో ఈ అవార్డు అందుకోనున్నట్టు కోనసీమ చిత్ర కళా పరిషత్ వ్యవస్థాపకుడు కొరసాల సీతారామస్వామి తెలిపారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుడు నాగేశ్వరరావును మున్సిపల్ చైర్మ¯ŒS చిక్కాల గణేష్, కమిషనర్ సీహెచ్ శ్రీనివాస్, మున్సిపల్ పారిశుధ్య అధికారి తమ్ములపల్లి ప్రకాష్ అభినందించారు. -
కళలను పోషిద్దాం
మంత్రాలయం : హిందూ సంస్కృతి, ఆచారాలను సృషించే కళలను పోషించడానికి ప్రతిఒక్కరూ తమ వంతు కృషి చేయాలని శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు పిలుపునిచ్చారు. కార్తీక మాసం పురస్కరించుకుని గురుసార్వభౌమ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీమఠంలో హరిదాస సమ్మేళనం ప్రారంభించారు. ముందుగా పీఠాధిపతి జ్యోతులు వెలిగించి కార్యక్రమానికి అంకురార్పణ పలికారు. స్వామీజీ మాట్లాడుతూ దైవ చింతనకు దాస సాహిత్యం ఎంతో దోహద పడుతుందన్నారు. హరికథలు, సంగీత విభావరి, భక్తికీర్తనలు భక్తుల్లో ప్రశాంతతను నెలకొల్పుతాయన్నారు. ప్రతి భక్తుడూ హరిదాసులను ఆదరించాలన్నారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాసరావు, సంస్కృత పాఠశాల ఉప కులపతి పంచముఖి, ప్రధానాచార్యులు వాదిరాజాచార్ పాల్గొన్నారు. -
కళా సాహితీ సేవలకు ఉత్తమ పురస్కారాలు
కర్నూలు (కల్చరల్): కర్నూలు జిల్లాలో కళా, సాహిత్యరంగాలో్ల ఉత్తమ సేవలందించిన వారికి ఈనెల 16న ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఉత్తమ సేవా పురస్కారాలు అందజేయనున్నదని ఆ సంస్థ కార్యాధ్యక్షులు రాయపాటి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా రంగాలలో సేవలందించిన వారు ఈనెల 13వ తేదీ లోపల ఫోటోలతో కూడిన తమ బయోడేటాలను శ్రీరామ థియేటర్ పక్కనున్న నైస్ కంప్యూటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు సెల్: 93968 61308 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు. -
సంప్రదాయ కళలను ప్రోత్సహిద్దాం
కర్నూలు (కల్చరల్): భారతీయ సంప్రదాయ కళలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక బిర్లాగేట్ సమీపంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్హాలులో ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి నృత్య పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీ పౌండేషన్ వారు ప్రతి సంవత్సరం శాస్త్రీయ జానపద నృత్య పోటీలను నిర్వహిస్తూ కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఎస్వీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా ఎస్వీ ఫౌండేషన్ రాష్ట్రస్థాయి నృత్య పోటీలను నిర్వహిస్తూ కళాకారులను ఉత్తమ కళాకారులుగా రాణించేందుకు అవకాశం కల్పిస్తోందన్నారు. ఆకట్టుకున్న శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు: ఎస్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీలక్ష్మి ఫంక్షన్హాలులో జరిగిన రాష్ట్రస్థాయి నృత్య పోటీలల్లో వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రధానంగా చిన్నారులు చేసిన స్వాగత నృత్యం, దుర్గామాత తదితర నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ కేంద్ర క్రమశిక్షణా సంఘం సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎస్వీ ఫౌండేషన్ కార్యాధ్యక్షులు రాయపాటి శ్రీనివాస్, కర్నూలు శారదా సంగీత కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రన్, పోటీల న్యాయ నిర్ణేతలు విజయలక్ష్మి, నాగసాయి ప్రదీప్, ఎలమర్తి రమణయ్య, పల్లె గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
జానపద కళలను ఆదరించండి
ముగిసిన రాష్ట్ర స్థాయి జానపద నృత్యపోటీలు సత్తుపల్లి : జానపద కళలను అందరు ఆదరించాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్కుమార్ అన్నారు. సత్తుపల్లి బస్టాండ్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల రాష్ట్ర స్థాయి జానపద నృత్యాలు, పాటలు, కోలాటం, తాళంభజన పోటీలు మంగళవారం రాత్రి ముగిశాయి. ఈ పోటీలలో విజేతలకు రాషే్ట్రతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు కోడూరు శ్రీనివాస్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో తహశీల్దార్ దొడ్డా పుల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నంధ్యాల నాగేశ్వరరావు, దొడ్డా శ్రీనివాసరెడ్డి, ఈఓ శివరామకృష్ణ, గ్రాండ్ మౌలాలి, చిత్తలూరి ప్రసాద్, రంగపూరి వెంకటేశ్వరరావు, పి.సాయి శ్రీనివాస్, తమ్మిశెట్టి గణేష్, బత్తుల పూర్ణచంద్రరావు, చల్లారి వెంకటేశ్వరరావు, కూసంపూడి అచ్యుతవాణి, పాటిబండ్ల రామకృష్ణ, పెద్దిరాజు, గంగా, మధు పాల్గొన్నారు. పోటీలలో విజేతలు వీరే.. తాళం భజన పోటీలలో అభయాంజనేయ భజనమండలి, సీతారామ భజన మండలి ప్రథమ, ద్వితీయ బహుమతులను అందుకున్నారు. జానపద నృత్య పోటీలలో తల్లాడ బాలవెలుగు పాఠశాల, ఖమ్మం క్రియేటీవ్ గ్రామర్ స్కూల్లు, జానపద పాటల పోటీలలో ఎస్.హుస్సేన్, ఎ.నందు, కోలాటం పోటీలలో మంగాపురం శ్రీలక్ష్మీతిరుపతమ్మ కోలాటబృందం, లంకపల్లి బృందావన కోలాట బృందంలు ప్రథమ, ద్వితీయ బహుమతులను సాధించారు. ఈ పోటీలకు శివనాగులు, సంస్కాృతిక శ్రీకాంత్, శరత్, బాలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. -
‘కూచిపూడి’ని కాపాడాలని...
ఢిల్లీ సంస్థ ఆధ్వర్యంలో భామా కలాపాం షూటింగ్ కూచిపూడి : అంతరించిపోతున్న కళలను కాపాడడానికి, అలాగే భావితరాలకు అందచేయటానికి ఢిల్లీకి చెందిన న్యూస్ వరల్డ్ ఆఫ్ ఇండియా అనే సంస్థ దేశంలోని 15 పురాతన కళలపై డాక్యుమెంటేషన్, కాఫీ టేబుల్బుక్ ప్రచరణకు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు రమణ్ తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం కూచిపూడి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో 14వ శతాబ్ధంలోని సిద్ధేంద్రుడు రచించిన భామా కలాపం నృత్యరూపకాన్ని డాక్యుమెంటేషన్ రూపంలో నిర్మిస్తున్నారు. ఇందులో బిస్మిల్లా ఖాన్యువ పురస్కార అవార్డు గ్రహీత వేదాంతం వెంకట నాగ చెలపతి సత్యభామగా, సూత్రధారునిగా పసుమర్తి రత్తయ్య శర్మ ప్రదర్శించారు. వీరికి పసుమర్తి హరినాధ శర్మ హరినాధ శాస్త్రి మృదంగంపై, పాలపర్తి అంజనేయులు వయోలిన్ పై, పసుమర్తి పాపని ఆత్రంతో సహకరించారు. -
ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా డేవిడ్కుమార్
‘నాక్’ ‘ఎ’ గ్రేడ్ పొందగలమని ధీమా వర్సిటీ హోదా దక్కుతుందన్న ఆశాభావం కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ ఆర్.డేవిడ్కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ప్రిన్సిపాల్గా పనిచేసిన సీహెచ్ మస్తానయ్య హైదరాబాద్ ఉన్నతవిద్యాశాఖకు వెళ్లిపోయారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డేవిడ్కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నతే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. నాక్ ఏ గ్రేడ్ పొందగలన్న ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల అధ్యాపకుల బదిలీలు అధికసంఖ్యలో జరిగిన నేపథ్యంలో ఖాళీగా ఉన్న స్థానాలను హెచ్ఆర్డీ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. యూనివర్సిటీ హోదాపై గత ఏడాది జరగాల్సిన సమావేశం ఇంకా జరగలేదని, అది అయిన వెంటనే వర్సిటీకి అడ్డంకులు తొలగినట్టేనని అన్నారు. బదిలీ గురించి ముందే చెప్పిన ‘సాక్షి’ కాగా ఆర్ట్స్ కళాశాలకు డేవిడ్కుమార్ ప్రిన్సిపాల్గా రానున్నట్టు ‘సాక్షి’ ముందే చెప్పింది. ‘విశ్వహోదాపై నీలినీడలు’ పేరిట కొద్దిరోజుల క్రితం ప్రచురితమైన కథనంలో కళాశాల వర్సిటీగా మారుతున్న సమయంలో ప్రిన్సిపాల్ బదిలీ కొంత ఇబ్బందేనని, కచ్చితంగా ఐదేళ్లు ప్రిన్సిపాల్గా పనిచేయాల్సిన మస్తానయ్య మూడేళ్లకే ఉన్నత విద్యాశాఖకు బదిలీ అవుతున్నారని తెలిపింది. ఆ స్థానంలో హైదరాబాద్లో అదే శాఖలో పనిచేస్తున్న డేవిడ్కుమార్ రానున్నారని తెలిపింది. అయితే.. అవేమీ కాదని అప్పట్లో మస్తానయ్య కొట్టిపారేసినా ప్రిన్సిపాల్ బదిలీపై ‘సాక్షి’ చెప్పిందే జరిగింది. కళాశాలకు కొత్త ప్రిన్సిపాల్ వచ్చారన్న విషయం కూడా బుధవారం ఉదయం వరకూ ఎవరికీ తెలీదు. దీంతో అ«ధ్యాపకులు సైతం నోరెళ్లబెట్టారు. నూతన ప్రిన్సిపాల్ డేవిడ్ను కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కె.రమేష్బాబు, చిక్కం సత్యనారాయణ, కె.రత్నమాణిక్యం, కామేశ్వరరావు, డాక్టర్ సునీత, అ«ధ్యాపకులు కలిసి అభినందనలు తెలియజేశారు. -
'మృగాళ్ళ' ముందు మార్షల్ ఆర్ట్స్ విఫలం!
నోయిడాః మానవత్వం లేని మృగాళ్ళ ముందు మార్షల్ ఆర్ట్స్ కూడా పనికి రావడం లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా... మహిళల్లో అవగాహన పెరిగినా రాక్షసత్వానికి బలవంతులూ బలైపోతున్నారు. రాజధాని నగరంలో సంచలనం రేపిన నిర్భయ ఘటన అనంతరం.. అటువంటి ఘటనలే పునరావృతం అవుతున్నా కఠిన చట్టాలు మాత్రం అమల్లోకి రావడంలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ బులంద్ షహర్ లో జరిగిన గ్యాంగ్ రేప్ లో బాధితురాలు 13 ఏళ్ళ మైనర్ బాలిక మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది ఉండటంతో 30 నిమిషాలపాటు దుండగులతో పోరాడి చివరికి దారుణానికి బలైన ఘటన.. అందర్నీ ఆలోచింపజేస్తోంది. దేశంలో గ్యాంగ్ రేప్ లు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ కాన్పూర్ జాతీయ రహదారిపై దోపిడీ దొంగల ముఠా.. అటుగా ప్రయాణిస్తున్న కుటుంబంపై దాడిచేసి, ఓ మహిళ సహా ఆమె కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలసిందే. అయితే బాధిత 13 ఏళ్ళ బాలిక మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది ఉండటంతో సుమారు అరగంట పాటు దుండగులతో పోరాడినట్లు తెలుస్తోంది. అయితేనేం చివరికి సామూహిక దాడిని ఎదుర్కోలేక, మానవ మృగాల పైశాచికత్వానికి బలవ్వాల్సిన దుస్థితి ఎదురైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నోయిడానుంచీ షాజహాన్పూర్ కు కారులో వెడుతున్న కుటుంబాన్ని అడ్డగించిన ఆరుగురు సభ్యుల దోపిడీ దొంగల ముఠా... కారులోని ఇతర కుటుంబ సభ్యులను తాళ్ళతో కట్టి, వాహనంలోని మహిళను, 13 ఏళ్ళ కుమార్తెను బయటకు లాగి పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అంతేకాదు వారివద్ద ఉన్న నగలు, నగదు, సెల్ ఫోన్లు సైతం దోచుకెళ్ళారు. అయితే తమ కుమార్తె మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిందని, దుండగులను ఎదుర్కొనేందుకు సుమారు అరగంటపాటు తీవ్రమైన పోరాటం జరిపిందని బాధితురాలి తండ్రి తెలిపారు. చివరికి ఆమెను ఎదుర్కోలేని దుండగులు.. తనపైనా, అన్నగారిపైనా కాల్పులకు పాల్పడ్డంతో వారి క్షేమాన్ని కోరి... తమ బిడ్డ దుండగులకు లొంగిపోయినట్లు ఆయన వివరించారు. ఘటన అనంతరం పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకోగా వారిని బాధితులు గుర్తించినట్లు తెలిపారు. ఇటువంటి దుర్ఘటనలు ఉత్తరప్రదేశ్ లోని శాంతి భద్రతల వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. కుటుంబ సభ్యులతో వెడుతున్న మహిళలకే భద్రత లేకపోతే ఇంకెవరికుంటాయంటూ ప్రశ్నిస్తున్నాయి. -
కళలతో మనో వికాసం
విజయవాడ కల్చరల్: భారతీయ సంప్రదాయ కళలలను ప్రపంచానికి చాటిచెప్పాలని నాట్యాచార్యుడు పశుమర్తి కేశవప్రసాద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ, విద్యాభారతి సంస్కృతీ సంస్థాన్ సంయుక్తంగా దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్యకళాశాలలో రెండురోజులుగా నిర్వహిస్తున్న భారతీయ కళల శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. విద్యార్థులు విలువలతో కూడిన జీవితం గడపాలని, దేశ భవిష్యత్ వారిమీదనే ఆధారపడివుందని, కళలు మనోవికాసాన్నిస్తాయని తెలిపారు. విధ్యాభారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డీ.లక్ష్మీపతిరాజు మాట్లాడుతూ భారతీయ కళలు భరతమాత నుదుట సింధూరపు బొట్టుగా అభివర్ణించారు. విజ్ఞానవిహర్ కార్యదర్శి మాట్లాడుతూ రెండురోజుల శిక్షణ శిబిరంలో 25 పాఠశాలలనుంచి 800 బాలబాలికలు పాల్గొన్నారని వివరించారు. పాఠశాల విద్యతోపాటు భారతీయ కళలను బాలబాలికలు అందిపుచ్చేకోవాలని సూచించారు. విద్యాభారతి కోశాధికారి గోవిందరావు భారతీయ సంప్రదాయ విలువలు, కళల గురించి ప్రసంగించారు. శిక్షణ లో పాల్గొన్న బాలబాలికలకు ప్రశంసాపత్రాలను అందించారు. విజ్ఞానవిహార్ విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలతో మంత్రముగ్ధుల్ని చేశారు. -
వీఏకే రంగారావుకు నాట్యవిశారద బిరుదు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రముఖ విమర్శకుడు, నృత్య కళాకారుడు వీఏకే రంగారావు నాట్య కళావిశారద బిరుదును అందుకున్నారు. శ్రీకృష్ణ గానసభ మంగళవారం నాట్యకోవిదులు సీవీ చంద్రశేఖర్ చేతుల మీదుగా రంగారావును ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ కళలకు జీవితాన్నే అంకితం చేసిన వ్యక్తి రంగారావు అని కొనియాడారు. అనేక రంగాల్లో ప్రవేశం కలిగిన రంగారావుకు సకల కళావిశారదుడు అనే బిరుదును ప్రదానం చేయడం సముచితమని శ్రీకృష్ణ గానసభ కన్వీనర్ స్వప్న సుందరి అన్నారు. వీఏకే రంగారావు మాట్లాడుతూ వివిధ రంగాల్లో తన ప్రవేశానికి బాటలు వేసి స్ఫూర్తిగా నిలిచిన మల్లాది రామకృష్ణశాస్త్రి, ఆరుద్రలకు ఈ సందర్భంగా పాదాభివందనం చేస్తున్నానన్నారు. సంగీత, సాహిత్య, సాంస్కృతిక ఇలా ప్రతి రంగంలోనూ వంద శాతం పరిపూర్ణత సాధించేందుకు తపిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి శ్రీకృష్ణగాన సభ కార్యదర్శి వై.ప్రభు అధ్యక్షత వహించారు. -
రెక్కల కాన్వాసుపై చక్కని చిత్రాలు
రవిగాంచని స్థలమును కవిగాంచున్ అన్నారు పెద్దలు. కళాహృదయం, తపన ఉండాలేగానీ చిత్తరువులు గీయడానికి బోర్డులతో, కాన్వాసులతో పనేముంది. తోచినచోట వేసేయొచ్చు. సరిగ్గా అదే పనిచేశాడు మెక్సికోకి చెందిన కళాకారుడు రమోస్. తొలుత మిఠాయిలు, పేస్టులపై కళాఖండాలను చెక్కి ఔరా అనిపించుకున్న రమోస్కి ఓ సరికొత్త ఆలోచన వచ్చింది. అదేమిటంటే సీతాకోకచిలుకల రెక్కలపై సిత్రాలు గీయాలని. వచ్చిందే తడవుగా సీతాకోకచిలుకల రెక్కలను సేకరించి పని ప్రారంభించాడు. 12 సెంటీమీటర్ల పొడవున్న రెక్కలపై 56 గంటలపాటు శ్రమించి చెక్కిన చిత్రాలు చూపరుల్ని కట్టిపడేశాయి. చిన్నప్పటి నుంచి తనకు సీతాకోకచిలుకలంటే ఇష్టమని, వాటి రంగులను చూసి మైమరిచిపోయేవాడినని రమోస్ చెప్పాడు. ఆ ఇష్టమే తనను వాటి రెక్కలపై చిత్రాలు గీసేలా చేసిందన్నాడు. పైగా ఇలా సీతాకోకచిలుకల రెక్కలపై పెయింటింగ్ వేసిన ప్రపంచంలోనే తొలి చిత్రకారుడిని తానేనని గర్వంగా చెప్పుకున్నాడు. -
అసమానతలు రూపుమాపేందుకు కళలు దోహదం
సినీనటుడు పరుచూరి వెంకటేశ్వరరావు ముగిసిన రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు తెనాలిటౌన్ : సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపేందుకు, యువకులను చైతన్య పరిచేందుకు కళలు, క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ప్రముఖ సినీనటుడు, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. రూరల్ మండలం కొలకలూరు గ్రామంలోని కొలకలూరు గ్రామ కళాపరిషత్ ఆధ్వర్యంలో ప్రథమ రాష్ర్టస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు మంగళవారం రాత్రి ముగిశాయి. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ సినీ, నాటక రచయిత మోదుకూరు జాన్సన్తో తమకు ఉన్న పరిచయాలను గుర్తు చేశారు. జాన్సన్ స్వగ్రామమైన కొలకలూరులో కళాపరిషత్ను ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయి నాటిక పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రంగస్థల రచయిత, నంది అవార్డుగ్రహీత డాక్టర్ కందిమళ్ల సాంబశివరావును శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సభకు నటులు పొన్నెకంటి పోతురాజు అధ్యక్షత వహించారు. నటులు సుద్దపల్లి శరత్వెంకయ్య స్వాగతోపన్యాసం చేశారు. పరుచూరి వెంకటేశ్వరరావును పరిషత్ నిర్వాహకులు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఉత్తమ ప్రదర్శనలు.. నాటిక పోటీలలో ఉత్తమ ప్రదర్శనగా మణికంఠ ఆర్ట్స్-ఫిఠాపురం వారి ఆచంద్రార్కం నాటిక , ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక-గుంటూరు వారి అక్షయ నాటిక, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా మూర్తి కల్చరల్ అసోసియేషన్-కాకినాడవారి సంచలనం నాటిక ఎన్నికైనట్లు న్యాయనిర్ణేతలు ప్రకటించారు. వ్యక్తిగత విభాగాలలో దర్శకునిగా, రచయితగా చెలికాని వెంకట్రావు(ఆచంద్రార్కం), నటుడిగా శ్రీను(ఆచంద్రార్కం), నటిగా అమృతవర్షిణి(అక్షయ), క్యారెక్టర్ నటుడిగా ప్రసాద్(పృథ్వీసూక్తం), ప్రతి నాయకునిగా రఘు(ఆచంద్రార్కం), హాస్యనటునిగా శివప్రసాద్ (అంతభ్రాంతియే), డైలాగ్ ఆర్టిస్ట్గా జానకినంద్ (సంచలనం), సంగీతం లీలామోహన్(అక్షయ), రంగ అలంకరణ నాగు(ఆచంద్రార్కం), ఆహార్యం శేషగిరి(సంచలనం) ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పోరేషన్ ఈడీ బాలాజీ నాయక్, నటుడు గోపరాజు రమణ తదితరులు పాల్గొన్నారు. -
నవయువ జక్కన
కాన్వాస్పై రంగులు అద్ది మనోహర దృశ్యాలను ఆవిష్కరించడమంటే అంత సులువు కాదు. ఇందులో అద్భుతాలు సాధిస్తూనే... చెక్క, మైనం తదితరాలతో ముచ్చటైన బొమ్మలు రూపొందించడం ఎంతమందికి సాధ్యం! రెండూ రెండు కళలు. ఒకటి కుంచెతో వర్ణాలద్దుకున్న భావ చిత్రం... మరొకటి మనసులోని ఆలోచనలకు ‘ప్రతి’రూపం. దేనికదే ప్రత్యేకం. రెండింటిలో రాణిస్తూ... తనలోని కళకు మెరుగులు అద్దుతున్నాడు సాయిప్రసాద్. కళాభిమానుల ప్రశంసలు అందుకొంటూ ముందుకు సాగుతున్న సాయితో ‘సిటీ ప్లస్’ ముచ్చట్లు... సనత్నగర్ బీకే గూడలో మా నివాసం. నాన్న కార్పెంటరీ వర్క్ షాప్ కూడా అక్కడే. ఇందులో పనిచేసేవారిని చూసి నాకు బొమ్మలు తయారు చేయాలనిపించింది. మొదటి సారిగా ఆరో తరగతి చదువుతున్నప్పుడు చాక్పీస్తో శివలింగం చేశా. ఆ తరువాత చాక్పీస్, చాక్ పౌడర్తో మరిన్ని వస్తువులు చేయడం అలవాటయింది. బాపు బొమ్మలా... బొమ్మలు తయారు చేయడం వేరు. గీయడం వేరు. కానీ నాకు రెండూ ఆసక్తే. అందుకే అప్పుడప్పుడు బొమ్మలు గీసేవాడిని. ‘బాగా వేస్తున్నావ్’ అని అనిపించుకున్నాక అదే కంటిన్యూ చేశా. కార్టూన్స్, మహనీయులు, ప్రకృతి, దేవుళ్లతో పాటు తంజావూరు బొమ్మలు వేయడం కూడా నేర్చుకున్నా. కానీ అన్నింటికన్నా నాకు బాపు బొమ్మలంటే ఇష్టం. ఆయన శైలిని అనుకరిస్తూ కూడా బొమ్మలు వేశాను. రకరకాలుగా... చాక్పీస్తో బొమ్మలు వేయడం మొదలుపెట్టిన తరువాత ఆ తరువాత పెన్సిలిడ్స్, వుడ్, క్యాండిల్తో అనేక రకాల బొమ్మలు చేశా. ఆపై ప్లాస్టిక్ పైపులకు వాడే ఎమ్సిల్, న్యూస్ పేపర్స్, ఎరైజర్స్, వాక్స్, మట్టితో బొమ్మలు తయారుచేశా. కొన్ని వస్తువులను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి కొన్నా. ఇంకో విషమేమిటంటే వీటిని తయారు చేసేందుకు కావలసిన టూల్స్ని కూడా నేనే తయారు చేసుకున్నా. మై గ్యాలరీ ఎనిమిదేళ్లుగా నేను వేసిన బొమ్మలన్నీ భద్రపరిచా. మొత్తం 250 బొమ్మలు, 50 పేపర్ డ్రాయింగ్స్ ఉన్నాయి. చెక్కతో చేసిన పైరేట్స్ షిప్, షాట్ గన్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం చెక్కతో ఛత్రపతి శివాజి కత్తి చేస్తున్నా. అలాగే ఎరైజర్తో స్పైడర్మ్యాన్, మైఖేల్ జాక్సన్తో పాటు అష్ట వినాయకులు, లక్ష్మీదేవి, శివుడు, ఆంజనేయుడు తదితర దేవతామూర్తులు రూపొందిస్తున్నా. చాక్పీస్తో సెవన్ వండర్స్, వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్స్, జుమ్మా మసీదు, బుద్ధుడు, క్రికెట్ వరల్డ్ కప్స్ వంటివి రూపొందించా. ఎమ్సిల్ను ఉపయోగించి బాల కృష్ణుడు, మహా విష్ణువు, సింహం వంటి విగ్ర హాలు, పేపర్, వ్యాక్స్తో బొజ్జవినాయకుడిని రూపొం దించా. ఏటా వినాయకచవితికి నేనే వినాయకుడిని తయారుచేస్తా. ఇష్టపడే బీటెక్లో మెకానికల్ తీసుకున్నా. టూల్ డిజైనింగ్ నాకిష్టం. భవిష్యత్లో మంచి టూల్ డిజైనర్ కావాలన్నది లక్ష్యం. ఎస్.శ్రావణ్జయ ఫొటోలు: ఎన్.రాజేష్రెడ్డి -
కళారంగానికి కళాకౌముది విశిష్టసేవలు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి రాజంపేట : రాజంపేట పట్టణంలో కళారంగానికి కళాకౌముది సేవా సంస్థ విశిష్ట సేవలందించిదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధరెడ్డి గుర్తు చేశారు. శనివారం రాత్రి స్థానిక కాకతీయ విద్యాసంస్థ కళావేదికలో కళా కౌముది సంస్థ అధ్యక్షుడు పోలా వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో సంస్థ 24వ వార్షికోత్సవం సభకు ఆకేపాటి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 1992లో కళా కౌముది సంస్థ వివిధ రకాలుగా కళ,సాహిత్య రంగాలను పెంచి పోషించే విధంగా ముందుకు నడిచిందన్నారు. కళాకౌముది సంస్థ అంటే గుర్తుకొచ్చేది దివంగత టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ ఆకేపాటి చెంగల్రెడి అని పేర్కొన్నారు. కళాకౌముది సంస్థను చెంగలరెడ్డి స్థాపించారని, నేటికీ ఆ సంస్థ తన మనుగుడ విషయంలో రాజీ పడకుండా ముందుకువెళుతోందని పేర్కొన్నారు. తాను ఈ సంస్థ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. సంస్థ గౌరవ అధ్యక్షుడు రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆకేపాటి రజనీకాంత్రెడ్డి మాట్లాడుతూ కళాకౌముది సంస్థ సభ్యుల సహకారంతో 24యేళ్లపాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వీడన్ ప్రొఫెసర్ ఆకేపాటి వరప్రసాద్రెడ్డి మాట్లాడుతూ కళాకౌముది సంస్థను దిగ్విజయంగా నిర్వహించడంలో సమష్టి కృషి దాగి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు, కాకతీయవిద్యాసంస్థల అధినేత పోలా శ్రీనివాసులరెడ్డి , పీ.రాధాకృష్ణారెడ్డి, ప్రముఖ వైద్యుడు సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడు మలిశెట్టి సుబ్బరాయుడు, కార్యదర్శి ఎన్.శివరాజు, పర్యవేక్షకుడు దరూరి హరినాధ్చౌదరి, పట్టణానికి చెందిన కెఎంఎల్ నరసింహులు, పాపినేని విశ్వనాధరెడ్డి, డీలరు సుబ్బరామిరెడ్డి, రాఘవరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, తెలుగుభాష సంరక్షణసమితి ప్రతినిధులు కాకర్లరాముడు, గంగనపల్లె వెంకటరమణ, విద్యాన్ చిన్నయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం యుపీ రాయుడు కళాబృందంచే అద్భుత ఇంద్రజాల ప్రదర్శన, హాస్యవల్లరి వేణుగోపాల్ చే నిర్వహించి కార్యక్రమం సభికులను అలరించింది. శ్రీచక్ర యూపీ స్కూలు, సరస్వతీ విద్యామందిర్, చక్రశుభ నివాస్ స్కూల్ విద్యార్థుల నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
గృహమే కదా కళాసీమ
ద్వార ‘బంధాన్ని' పటిష్టపరిచే రెండు తలుపులు, ఓవైపు గొళ్లేనికి వేలాడుతున్న తాళం, వాటి ఎదురుగా ఇద్దరు మహిళలు... పాల క్యాన్లు... ఓరగా తెరచి ఉన్న తలుపులో నుంచి కనపడే తులసి మొక్క... ఇదంతా చూస్తే మన కళ్లకి మామూలుగానే అనిపించవచ్చు కానీ... ‘కళ'లు ‘కనే' కళ్లకు మాత్రం అద్భుతమైన ఆలోచనలను అందిస్తుంది. ఆ స్ఫూర్తి నుంచి రూపం దాల్చిన తలుపులు, మరెన్నో అపు‘రూపాలు’ బంజారాహిల్స్లోని గ్యాలరీ స్పేస్కు వచ్చే కళాభిమానులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఎస్.సత్యబాబు/ శ్రావణ్జయ ‘చెన్నైలో ఉండగా మా వీధిలో నుంచి వెళుతుంటే దారిలో కనపడే ఇళ్లకు ఉన్న తలుపుల అందాలు నాలో సరికొత్త తలపులు పుట్టించేవి’ అంటారు శాంతనా కృష్ణన్. బహుశా అందుకేనేమో ఇప్పుడు ఆయన్ని డోర్మ్యాన్ అని సన్నిహితులు సరదాగా ఆట పట్టిస్తుంటారు. గత 18 సంవత్సరాలుగా ఆయన తలుపుల మీద తనకున్న ఇష్టాన్ని కాన్వాస్ సాక్షిగా ప్రకటిస్తూనే ఉన్నారు. ఆయన కేవలం తలుపుల తలపుల్నే తన కుంచె కదలికలకు ప్రాణంగా భావిస్తుంటే... ఇంటిలో వినియోగించే పలు వస్తువుల నుంచి స్ఫూర్తి పొందే చిత్రకారులు ఇంకా చాలా మందే ఉన్నారు. ‘అబ్జెక్ట్స్ మీద సిటీలో జరుగుతున్న తొలి చిత్రకళా ప్రదర్శన ఇది’ అని గ్యాలరీ స్పేస్ నిర్వాహకుడు టి.హనుమంతరావు చెప్పారు. కాదేదీ అనర్హం... మిక్స్డ్ మీడియాలో పురుడు పోసుకున్న ‘ది డోర్’ గ్యాలరీ గోడల మీద వైవిధ్యంగా కొలువుదీరితే... గణేషుడు-హనుమాన్ థీమ్తో రాచఠీవి ఒలకబోసే రాయల్ చైర్స్ను నగర చిత్రకారుడు రమేష్ గొర్జాల తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. బెడ్ల్యాంప్లో వెలగాల్సిన లైట్కు బదులు పెయింటింగ్ను ఉంచిన మరో సిటీ ఆర్టిస్ట్ ఫవాద్ తమాకాంత్ ల్యాంప్షేడ్... చిత్రాలు లిఖించడానికి ప్రతిసారీ కాన్వాస్ మాత్రమే వేదిక కానక్కర్లేదని నిరూపిస్తుంది. చెక్కతో తయారైన పాత్రల తరహాలో పాతకాలం నాటి వంటిళ్లలో ఉండే ‘ఉర్లి' (గుజరాత్, మహారాష్ట్ర పల్లెల్లో) ఆర్టిస్ట్ జయాబహేతికి స్ఫూర్తినిచ్చింది. ‘వంటింటికీ పెయింటింగ్కి... ఒక మహిళగా, చిత్రకారిణిగా సేవలు అందించడం నాకు సంతోషాన్నిస్తుంది’ అంటారామె. నగరానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారులు, తండ్రీ కూతుర్లయిన లక్ష్మణ్ ఏలె, ప్రియాంక ఏలె... మహిళనే థీమ్గా తీసుకుని చిత్రాలు ఆవిష్కరించారు. గ్రామాల్లో మహిళలు ముద్దుగా పిలుచుకునే ‘బొట్టుపెట్టె’ (సిటీలో డ్రెస్సింగ్ టేబుల్) లక్ష్మణ్ ఏలె కుంచె తగిలి ‘చిత్ర’మైన అపురూపంగా మారిన వైనం మనసుకు హత్తుకుంటుంది. ‘క్లోజెట్’ పేరుతో తాను గీసిన చిత్రాల గురించి చెబుతూ... ‘కొబ్బరినూనె, దువ్వెన, పౌడరు... వంటి వస్తువుల్ని ఉంచుకునేందుకు గ్రామీణ మహిళలు వినియోగించే మేకప్ వార్డ్రోబ్’ అంటూ బొట్టుపెట్టె విశేషాల్ని వివరిస్తారు. ఈ చిత్రంలో గ్లాస్ డోర్స్ మిర్రర్స్ పాత్ర పోషించాయి. చల్లని నీటికి నిలయమైన కుండ మీద అంతే చల్లని మనసున్న దేవతలు దుర్గ, సరస్వతి రూపాలతో తాను అందించిన పెయింటింగ్ పర్యావరణానికి, మహిళకు జరుగుతున్న అన్యాయాల్ని సరిపోల్చుతుందని అంటారు ప్రియాంక. ముంబయికి చెందిన గౌతమ్ ముఖర్జీ పాత కాలం నాటి గ్రామ్ఫోన్ రికార్డ్తో పాటు అప్పటి ‘పాట’ జ్ఞాపకాలను కూడా మనకు గుర్తుకు తెస్తారు. ఇంకా చిప్పా సుధాకర్ చైర్స్, ల్యాండ్స్కేప్ పెయింటింగ్తో భాస్కరావు టేబుల్... ఇంట్లో వినియోగించే ఇలాంటి వస్తువులనెన్నింటినో కళారూపాలుగా మన ముందుకు మోసుకొచ్చిన ఈ ‘ఈస్థటిక్స్ అండ్ యుటిలిటీ’ ప్రదర్శన ఆద్యంతం వైవిధ్యంగా అనిపిస్తుంది. హైదరాబాద్తో పాటుగా విభిన్న నగరాలకు చెందిన ఆర్టిస్ట్లు పాల్గొన్న ఈ ప్రదర్శన ఈ నెల 25 వరకూ కొనసాగుతుంది. -
పల్లె అల్లం... పట్నం బెల్లం!
* ప్రాంతాల్లోని కళాశాలల్లో చదివేందుకు విముఖత * నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కళాశాల్లో చేరేందుకు ఆసక్తి * ఎంబీయే చదువు కోసం ఢిల్లీ, ఎన్సీఆర్కే మొదటి ఓటు * తర్వాతి స్థానాల్లో బెంగళూరు, పుణే, ముంబై నగరాలు న్యూఢిల్లీ: ఉపాధి కోసమే కాదు.. చదువుకునేందుకు కూడా జనం ఇప్పుడు పట్నంబాట పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కళాశాలలు ఉన్నా పట్టణాలు, నగరాల్లోని కళాశాలల్లో చేరేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను రూపుమాపేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నా వాటిలో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఇష్టపడడం లేదు. పట్టణాలు, నగరాల్లోని కళాశాలల్లో సరైన సదుపాయాలు, బోధించే ఉపాధ్యాయులు లేకపోయినా అందులోనే చేరుతున్నారు. ప్రతి వంద మంది విద్యార్థుల్లో 66 మంది పట్టణాల్లో చదివేందుకే ప్రాధాన్యతనిస్తున్నారని శిక్షా డాట్ కామ్ సంస్థ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సర్వే ద్వారా వెల్లడైన వివరాల్లోకెళ్తే... రాజధాని రమ్మంటోంది... సాంకేతిక విద్య బాటపట్టే విద్యార్థులు... ప్రత్యేకించి ఎంబీఏ చదవాలనుకుంటున్న విద్యార్థుల్లో ఎక్కువమంది ఢిల్లీ, రాజధాని ప్రాదేశిక ప్రాంతం(ఎన్సీఆర్)లోని కళాశాల్లో చేరేందుకే తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 21.1 శాతం మంది విద్యార్థులు ఎంబీఏ చదివేందుకు ఢిల్లీ, ఎన్సీఆర్కే తొలి ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత 17.58 శాతం మంది బెంగళూరు కళాశాలలకు, 10.63 మంది పుణే కళాశాలలకు, 8.4 శాతం మంది ముంబైలోని కాలేజీలకు తమ ఓటు వేశారు. అనేక కారణాలు... రాజధాని ఢిల్లీలోని కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు తొలి ప్రాధాన్యత ఇవ్వడానికి అనేక కారణాలున్నాయని శిక్షా డాట్ కామ్ బిజినెస్ హెడ్ మనీశ్ ఉపాధ్యాయ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాల్లో సరైన వసతులు లేకపోవడం, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు అంతగా అందుబాటులోకి లేకపోవడం వంటివి విద్యార్థులను హస్తినవైపు చూసేలా చేస్తున్నాయన్నారు. రాజధానిలో అయితే ఉద్యోగం చేసుకుంటూ కూడా చదువుకునే అవకాశముందనే అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేశారన్నారు. అంతేకాక తామ చదువుతున్న కోర్సుకు సంబంధించి కోచింగ్ వంటివి అందుబాటులో ఉన్నాయని, అదే ఇతర ప్రాంతాల్లో కష్టమేనని చెబుతున్నారు. ఇంజ నీరింగ్ విద్యార్థులేకాదు ఆర్ట్స్, సైన్స్, కామర్స్, డిజైన్ అండ్ మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న విద్యార్థులు కూడా ఇదే అభిప్రాయంతో ఢిల్లీ, ఎన్సీఆర్లోని కళాశాలల్లో చేరామన్నారు. -
కళల సాగు..
పంటలు అందరూ సాగు చేస్తారు. కానీ జపాన్లోని ఇనాకదాతే గ్రామస్తులు పంటలతోపాటు కళలను సాగు చేస్తారు. ఈ చిత్రమే అందుకు నిదర్శనం. ఇక్కడ కళలు, పంటలు జోడెద్దుల్లా కలిసి నడుస్తాయి. ఈ గ్రామం వరి పంటకు ప్రసిద్ధి. ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. ఇక్కడి వరి వంగడాలు 2 వేల ఏళ్ల పురాతనమైనవని 1990ల్లో వీరికి తెలిసింది. ఈ ఘనతకు గుర్తుగా ఏదైనా చేయాలని గ్రామస్తులు అనుకున్నారు. దీంతోపాటు తమ గ్రామానికి పర్యాటకపరంగా గుర్తింపు తేవాలనుకున్నారు. అప్పుడు మొదలైంది ఈ కళల సాగు. చేనును కాన్వాసుగా మలిచారు. మామూలుగా వరి పచ్చగా ఉంటుంది. వీటి మధ్యన పెయింటింగ్కు తగ్గట్లు వేరే రంగులు వచ్చే వరి వంగడాలను నాటారు. అంతే.. అద్భుతమైన కళాఖండాలు సిద్ధమయ్యాయి. వీరి పెయింటింగ్లలో ఏదీ రిపీట్ కాదు. ప్రతిసారీ కొత్తది వేస్తారు. అది సరిగా వచ్చేందుకు ముందుగా కంప్యూటర్లో డిజైన్ చేసుకుంటారు. ఇనాకదాతేను చూసి.. జపాన్లోని మరో వంద గ్రామాలు దీన్ని మొదలుపెట్టాయి. అయితే, ఇనాకదాతే ఇందులో చాంపియన్. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ అలరించే ఈ రైస్ ఆర్ట్ను చూడటానికి ఏటా రెండు లక్షల మంది ఈ గ్రామానికి వస్తారు. -
కదలికే కళారూపం
కదలికే కళారూపం... ఔను! ఆమె మదిలోని ప్రతి కదలికా కళారూపమే. ప్రజల కన్నీళ్లు, కేరింతలు, ఆవేదనలు, హర్షాతిరేకాలు ఆమెను కదిలిస్తాయి. అలాంటప్పుడే ఆమె కుంచె చేతపట్టుకుంటారు. అంతే! ఒక కళాఖండం రూపుదిద్దుకుంటుంది. అలా రూపుదిద్దుకున్న కళాఖండమే ‘గివింగ్ బర్త్ టు మీ’. ఈ చిత్తరువుతోనే రమాదేవికి పేరు వచ్చింది. చిత్తరువంటే, ఇది చిత్తరువు మాత్రమే కాదు, కళాకారిణిగా నిలదొక్కుకోవడానికి ఏళ్ల తరబడి ఆమె పడిన శ్రమ ఫలితం. కడుపులోని బిడ్డ అడ్డం తిరిగి, కాళ్లు బయటకు వచ్చి, బాహ్య ప్రపంచంలోకి రావడానికి పడే జీవన్మరణ పోరాట రూపమే ఈ కళాఖండం. ఈ చిత్రంలోని చెట్టు తల్లి గర్భానికి సంకేతం. కనిపిస్తున్న పాదాలు కడుపులో అడ్డం తిరిగిన బిడ్డవి. నిజాం నాటి వారసత్వం... బతుకు తెరువు కోసం టీచర్గా పనిచేస్తున్న రమాదేవి వృత్తిపరంగా కళాకారిణి. పాతబస్తీ దూద్బౌలికి చెందిన ఆమె, పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటోంది. కళ ఆమెకు తాతముత్తాతల నుంచి అబ్బిన వారసత్వం. రమాదేవి తాతముత్తాతలంతా నిజాం ప్రభువుల వద్ద పనిచేసిన వారు. వారిది ‘నఖాషి’ (బొమ్మలు చెక్కడం) కులం. నిర్మల్ పెయింటింగ్స్కు పేరు ప్రఖ్యాతులు తెచ్చింది వారే. స్వతహాగా కళాప్రియులైన నిజాం ప్రభువులు వివిధ దేశాల్లో తాము చూసిన డిజైన్లను రాజమహల్కు, వస్తువులకు వేయించేందుకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లోని కళాకారుల కుటుంబాలను హైదరాబాద్ రప్పించారు. అప్పటి నుంచి ఆ కుటుంబాలు ఇక్కడే స్థిరపడ్డాయి. ఒకప్పుడు గోడలపైనే... నిర్మల్ పెయింటింగ్స్ ఒకప్పుడు గోడలపైనే వేసేవారు. స్వాతంత్య్రం తర్వాత నిజాం ప్రభువుల అధికారం పోయాక ఈ పెయింటింగ్స్ చీరలపైకి పాకాయి. రమాదేవి తండ్రి ఇప్పటికీ తాను పెయింటింగ్ చేసిన చీరలను ‘లేపాక్షి’ సంస్థకు ఇస్తుంటారు. చీరలపై పెయింటింగ్స్ వేయడంలో చిన్నప్పటి నుంచి తండ్రికి చేదోడుగా ఉన్న రమాదేవి క్రమంగా కళపై ఆసక్తి పెంచుకుంది. పాతబస్తీలో చిత్రలేఖనం నేర్పే ప్రముఖ ఆర్టిస్ట్ డోంగ్రే వద్ద ల్యాండ్స్కేప్, స్టిల్లైఫ్ చిత్రాలు గీయడంలో మెలకువలు నేర్చుకుంది. తర్వాత జేఎన్టీయూలో బీఎఫ్ఏ పూర్తి చేసింది. అదయ్యాక ఎంఎఫ్ఏలో చేరడానికి ఇంట్లో వాళ్లు వ్యతిరేకించారు. వాళ్లకు తెలియకుండా ఎంఎఫ్ఏ సీటు సంపాదించి, ఇంట్లో చెప్పింది. ఇక చేరమనక వారికి తప్పలేదు. అలా ఎంఎఫ్ఏ పూర్తి చేసింది. పర్యావరణ రక్షణపై పలు ఫొటోలు తీసింది. మహిళల సమస్యలపై లెక్కలేనన్ని బొమ్మలు గీసింది. - తాయమ్మ కరుణ -
టీటీడీ నిర్ణయాలతో తిరుమల 'కళ' తప్పుతుందా..?
-
సంగీతానికి మంగళం
సంగీత కళాశాలలో చారిత్రక కోర్సులకు ముగింపు అధికారుల అనాలోచిత నిర్ణయాలు సంగీత ప్రియుడు శ్రీవేంకటేశ్వరునికి నిత్య స్వరార్చన చేయడంలో ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులది కీలకపాత్ర. శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోస్తున్న కళాశాలను టీటీడీ నిర్వహిస్తోంది. అరుుతే అధికారులు, కొందరు అధ్యాపకుల అనాలోచిత నిర్ణయూలతో ఈ సంగీత కళాశాల మూతపడే పరిస్థితులు నెలకొంటున్నారుు. తిరుపతి రూరల్, న్యూస్లైన్: ఆధ్యాత్మిక భావాలు, కళలపై ఆసక్తి ఉండడంతో అప్పటి టీటీడీ ఈవో చెలికాని అన్నారావు 1959లో సంగీత కళాశాలను ఏర్పాటు చేశారు. కళాశాల ప్రారంభంలో సంగీత విశారద, సంగీత ప్రవీణ కోర్సులను ప్రవేశపెట్టారు. అరుుతే 55 ఏళ్ల నుంచి ఉన్న ఈ చారిత్రక కోర్సులకు టీటీడీ అధికారులు మంగళం పాడేందుకు నిర్ణయించారు. శాస్త్రీయ కళలు, సంగీతంపై అవగాహన లేని, ఆధ్యాత్మిక చింతనలేని ఓ అధికారి ఈ చారిత్రక తప్పిదానికి కారణమయ్యాడు. కళాశాలలో ఈ కోర్సుల్లో మాత్రమే అత్యధికంగా విద్యార్థులు ఉంటారు. అలాంటి ఈ కోర్సులకు మంగళం పాడాలని నలుగురు అధ్యాపకులు కంకణం కట్టుకున్నారు. వీరి ప్రతిపాదనలను ఆమోదిస్తూ అధికారులు కోర్సులకు మంగళం పలికేందుకు పచ్చజెండా ఊపేశారు. తొలగింపు కోర్సుల ఫైల్ చక చక నడిపేస్తున్నారు. దీనిపై వచ్చే పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. టీటీడీ విద్యాలయూల్లో కలికితురాయి ఎస్వీ సంగీత నృత్య కళాశాల టీటీడీ విద్యాలయూల్లో కలికితురాయిగా నిలిచింది. దేశంలో మరెక్కడా లేనన్ని వసతులు, కోర్సులతో విరాజిల్లుతోంది. శాస్త్రీయ సంగీతానికి పుట్టినిల్లుగా ఉన్న తమిళనాడులోనూ ఇన్ని సౌకర్యాలతో పగటి పూట సంగీత కళాశాల లేదు. అలాంటి కళాశాలలో ప్రక్షాళన పేరుతో సంగీతం గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది. విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే మరే కళాశాలకు దీనికి పోటీ ఉండదు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా శ్రీవారికి నిత్య సంగీత కైంకర్యం జరుగుతోందంటే అది సంగీత కళాశాల ఘనతే. శ్రీవారి సేవలు, ఉత్సవాల్లో పెద్ద ఎత్తున సంగీత కైంకర్యాలు కళాశాల నిర్వహణలోనే జరుగుతున్నాయి. అలాంటి కళాశాలలో కోర్సుల ఎత్తివేత నిర్ణయంతో మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది. గత ఈవోలు సంగీత కళాశాల నిర్వహణకు వెనకడుగు వేయలేదు. మిగతా విద్యాసంస్థల నిర్వహణ వేరు... ఈ కళాశాల నిర్వహణ వేరు అని భావించి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చేవారు. కళాశాలకు ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. అసలు కళాశాల ఉండడమే దండగని భావిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కళాశాలను మూసే కుట్ర దశలవారీగా కళాశాలను మూత వేసేందుకు కుట్ర జరగుతోంది. ఈ కుట్రలో నలుగురు అధ్యాపకులు ఓ అధికారితో భాగస్వామి అయ్యారు. తొలుత కోర్సుల తగ్గింపు, తరువాత దశల వారీగా కోర్సులను ఎత్తివేత ద్వారా విద్యార్థులను తగ్గించవచ్చు అని భావిస్తున్నారు. తద్వారా విద్యార్థులు లేరని కళాశాలకు శాశ్వతంగా తాళం వేసే కుట్ర శరవేగంగా జరిగిపోతోంది. డే కళాశాలలో మెత్తం 10 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సంగీత విశారద, ప్రవీణ కోర్సుల్లో(3 సంవత్సరాలు కలిపి) 182 మంది ఉన్నారు. బీమ్యూజిక్, ఎంఏ మ్యూజిక్ కోర్సుల్లో కేవలం 64 మంది విద్యార్థులు ఉన్నారు. అధికారులు నిర్ణయించినట్టు విశారద, ప్రవీణ కోర్సులకు మంగళం పలికితే కళాశాలలో విద్యార్థుల సంఖ్య పూర్తిస్థాయిలో పడిపోతుంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల తొలగింపే లక్ష్యంగా... సంగీత కళాశాలలో 28 మంది పర్మినెంట్, 20 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. విశారద కోర్సులను తొలగిస్తే మిగిలే విద్యార్థుల సంఖ్య కేవలం 64 మంది మాత్రమే. వీరికి 48 మంది అధ్యాపకులు అవసరమా అని యాజమాన్యం ఆలోచించక తప్పదు. తద్వారా కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగించవచ్చనేది టీటీడీ అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగించే కుట్రలో భాగంగా కోర్సులను ఎత్తివేయడానికి ప్రయత్నించడం బాధాకరం. -
మార్షల్ ఆర్ట్స్లో మెరికలు
మెదక్, న్యూస్లైన్: అవనిలో సగం.. ఆకాశంలో సగం.. అంటూ మహిళాలోకం ఘోషిస్తుంటే.. చదువుల్లో, ఆట పాటల్లో సైతం మేమే అంటున్నారు మెదక్లోని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు. పుస్తకం పడితే చదువుల తల్లులం. కత్తి పడితే వీరనారులం. గొంతు విప్పితే..గానకోకిలలం, నృత్యం చేస్తే..నాట్య మయూరలం.. ఆటలాడితే.. ఘనాపాటిలం.. అందుకే అన్నింటా మేమే మేటి అంటూ తమ సత్తా చాటుతున్నారు ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఈ చిట్టితల్లులు. మెదక్ పట్టణ శివారులో బోధన్-రామాయంపేట చౌరస్తాలో 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వెలిసింది బాలికల గురుకుల పాఠశాల. ఇందులో 5నుంచి 10వ తరగతి వరకు 470 మంది విద్యార్థినులు ఆవాసం పొందుతూ చదువుతున్నారు. గతంలో తెలుగు మాధ్యమంలో ఉన్న ఈ పాఠశాల రెండేళ్ల క్రితం ఆంగ్ల మాధ్యమంలోకి మారింది. నిపుణులైన ఉపాధ్యాయుల సుశిక్షణలో వందలాది మంది విద్యార్థినులు పరిపూర్ణ విద్యావంతులుగా తయారవుతున్నారు. 2007నుంచి పదో తరగతి వార్షిక పరీక్షల్లో వరుసగా వందశాతం ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటుతున్నారు. 2011-12లో 9.7 గ్రేడింగ్, 2012-13లో 9.5 గ్రేడింగ్ సాధించి మెదక్ డివిజన్లో మేటిగా నిలిచారు. క్రమశిక్షణకు మారుపేరుగా... ఆట పాటలకు వేదికగా.. విద్యార్థి సంపూర్ణ వికాసానికి లోగిలిగా నిలుస్తున్న ఈ సరస్వతీ నిలయంలో ప్రవేశం దొరకడమంటే విద్యార్థులు తమ అదృష్టంగా భావిస్తారు. దేశంలో అక్కడక్కడ మహిళలపై దాడులు...అఘాయిత్యాల్లాంటి దుర్ఘటనలు జరుగుతున్న నేపధ్యంలో ఈ చిన్నారులను వీరనారులుగా తీర్చిదిద్దేందుకు ప్రిన్సిపాల్ రమణమ్మ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక కరాటే మాస్టర్ నగేష్ కేవలం నామమాత్రపు ఫీజుతో విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య వందమందికి పైగా విద్యార్థినులు కఠోర శిక్షణలో పాల్గొంటున్నారు. ఈ మెరికలు ప్రదర్శించే విన్యాసాలు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. బలమైన వ్యక్తులను సైతం సెకండ్ల వ్యవధిలో మట్టి కరిపించే సత్తా వీరి సొంతం. ఆటల్లో మెరుపులు ఎక్కడ పోటీలు జరిగినా ఈ పాఠశాల విద్యార్థులు మెజార్టీ బహుమతులు గెలుపొందుతుంటారు. తెలుగు మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ క్రీడాల్లో ఈ పాఠశాల విద్యార్థులకు 51 బహుమతులు వచ్చాయి. 2010-11లో ఈ పాఠశాల విద్యార్థిని స్వరూప హ్యాండ్బాల్ విభాగంలో జాతీయస్థాయికి ఎంపికై కాశ్మీర్లో జరిగిన పోటీలో పాల్గొన్నారు. పైకా, స్కూల్గేమ్స్లో వీరే టాపర్స్గా నిలుస్తున్నారు.