asifabad district
-
ఎక్కడ ఆ పులి.. ఇక్కడ ఆడ బెబ్బులి..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్–టి మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే పరిసర ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. అయితే, అదే మండలంలోని పులిదాడి జరిగిన దుబ్బగూడ గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు ఏమాత్రం వణుకులేకుండా ఎద్దుల బండిని తోలుతూ వ్యవసాయ పనులకు వెళ్తుండటం ఆమె ధైర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి అలజడి
-
‘దారి’లేక.. ఆస్పత్రికి చేరలేక
ఆసిఫాబాద్ రూరల్/నెన్నెల, వేములవాడ రూరల్: ‘దారీ’తెన్నూ లేని పల్లెలు.. వాగులు దాటి వైద్యం అందుకోలేక గాల్లో కలుస్తున్న ప్రాణాలు.. శుక్రవారం ఒక్కరోజే వేర్వేరుచోట్ల రోడ్డు సరిగా లేక, అంబులెన్స్ల రాకకు వాగులు అడ్డొచి్చన క్రమంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివాసీ దినోత్సవం నాడే ఓ ఆదివాసీ మహిళకు పుట్టెడు గర్భశోకం మిగిలింది. కడుపులో ఇద్దరు బిడ్డలను మోస్తూ పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్తూ.. వాగు ఒడ్డునే బిడ్డను ప్రసవించింది. పుట్టిన గంటకే బిడ్డ కన్నుమూసింది. కడుపులోని మరో బిడ్డతో ఆ మహిళ చికిత్స పొందుతోంది. ఈ దారుణం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా, మరో రెండు ఘటనల్లో ఓ యువకుడు, వృద్ధురాలు సైతం సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు ప్రాణాలు మోస్తూ.. ఆసిఫాబాద్ మండలం బండగూడకు చెందిన ఆత్రం కొండు, ఆత్రం ధర్మూబాయి దంపతులు రైతులు. వీరికి రెండేళ్ల పాప ఉండగా.. ప్రస్తుతం ధర్మూబాయి ఏడు నెలల గర్భిణి. శుక్రవారం మధ్యాహ్నం నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారమిచ్చారు. గ్రామానికి వెళ్లే దారిలో వాగు అడ్డుగా ఉండడంతో 108 వాహనం వాగు ఒడ్డు వరకే వచి్చంది. స్థానికులు గర్భిణిని గ్రామం నుంచి కిలోమీటరున్నర దూరం నడిపించి వాగు దాటించారు. ఆ సమయంలో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో భయాందోళనకు గురైన ధర్మూబాయికి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి.ఈ క్రమంలోనే వాగు ఒడ్డున ఆడశిశువుకు జన్మనిచి్చంది. కడుపులో మరో శిశువు ఉన్నట్లు గుర్తించిన 108 సిబ్బంది తల్లీబిడ్డను ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే పుట్టిన శిశువు మృతిచెందింది. కడుపులోని మరో శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని అదే వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శస్త్రచికిత్స చేసి ఆ బిడ్డను కాపాడారు. పుట్టిన శిశువు బరువు 800 గ్రాములే ఉండటంతో ఎన్ఎన్సీలో ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు ఎంసీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ భీష్మ తెలిపారు. కాగా గతేడాది వర్షాకాలంలో ఈ వాగు దాటుతున్న సమయంలో వరదలో కొట్టుకుపోయి ఓ యువతి మృత్యువాత పడింది. అంబులెన్స్ వచ్చే దారిలేక.. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోణంపేటకు చెందిన జింజిరి జశ్వంత్ (17) పొలం పనులు ముగించుకుని ఇంటికొస్తూ ఒక్కసారిగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. 108 అంబులెన్స్ వచి్చనా.. బురద కారణంగా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయింది. వాహనం నిలిపిన చోటికి యువకుడిని తీసుకురావాలని అంబులెన్స్ సిబ్బంది సూచించారు. గ్రామస్తుల సహకారంతో జశ్వంత్ను ఎడ్లబండిలో తీసుకెళ్లారు. అంబులెన్స్లోకి ఎక్కించిన యువకుడిని సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతిచెందాడని చెప్పారు. రోడ్డు సరిగా ఉండుంటే జశ్వంత్ ప్రాణాలు దక్కేవని బంధువులు విలపించారు. సకాలంలో వైద్యం అందక..వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటకు చెందిన ఐత లచ్చవ్వ (65) ఆస్తమాతో బాధపడుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో ఆమె భర్త నారాయణ 108కు సమాచారమిచ్చాడు. నక్కవాగుపై వంతెన పూర్తికాకపోవడంతో వాగుకు అవతలి వైపే అంబులెన్స్ ఆగిపోయింది. లచ్చవ్వను గ్రామస్తులు ఇంటి నుంచి వాగుకు ఇటువైపు గడ్డ వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి స్ట్రెచర్పై దాదాపు 400 మీటర్ల దూరాన ఉన్న అంబులెన్స్ వరకు మోసుకొచ్చారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ.. పరిస్థితి విషమించి లచ్చవ్వ మృతి చెందింది. -
5 జిల్లాల్లో 43 డిగ్రీల పైనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, జోగుళాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 43.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డిలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్లో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలోని 18 మండలాలకు చెందిన 20 గ్రామాల్లో 43 డిగ్రీలు దాటిపోయింది. ఈ జిల్లాలోని మాడుగులపల్లి మండల కేంద్రంతోపాటు మునుగోడు మండలం గూడాపూర్లో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దామరచర్ల మండల కేంద్రం, అనుముల మండలం ఇబ్రహీంపేట, కనగల్ మండల కేంద్రం, మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామాల్లో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎండలు తీవ్రం కావడంతో వడదెబ్బ కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన గాదె జయపాల్రెడ్డి (55) గురువారం వడదెబ్బకు గురికాగా హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ తండా గ్రామానికి చెందిన ధరావత్ మంచ్యా (55) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీకి చెందిన స్వర్ణలత (45) రెండ్రోజుల క్రితం నిజామాబాద్లో పెళ్లికి హాజరైంది. ఎండల తీవ్రతతో అస్వస్థతకు గురైంది. నిర్మల్కు వచి్చన తర్వాత గురువారం రాత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. అలాగే నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన రైతు మర్రిపల్లి ఈరయ్య (70) పొలం పనులకు వెళ్లి ఎండ దెబ్బతగలడంతో గురువారం మృతి చెందాడు. -
గొంతెండిపోతోంది
ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గుడమామిడి పరిధి మాన్కుగూడ. ఇక్కడ మిషన్భగీరథ నీరు సరిగా రాకపోవడంతో బావి నీటిపైనే గ్రామస్తులు ఆధారపడుతున్నారు. వేసవిలో బావి నీరు అడుగంటడంతో ఇబ్బందులు పడుతున్నారు. పటా్నపూర్లోనూ ఇదే సమస్య ఉంది. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటికి గోస తప్పడం లేదు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో నీటి కటకట నెలకొంది. బావులు, చేతి పంపులు ఎండిపోవడంతో సుదూర ప్రాంతాల్లోని వ్యవసాయ బావులనుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా జరగాల్సి ఉన్నా.. అంతర్గత పైపులైన్లు, పంపింగ్ మోటార్ల నిర్వహణ లోపంతో పాటు లీకేజీల కారణంగా పల్లెలు అలాగే పట్టణాల్లోనూ తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది. చేతి పంపులు, బావుల నుంచి ఎడ్ల బండ్లపై నీళ్లు తెచ్చుకుంటున్నామనిఈ ప్రాంతాల ప్రజలుచెబుతున్నారు. అనేకచోట్ల అడుగంటిన బావుల నుంచి పూడిక తీస్తున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి ‘భగీరథ’నీరు సక్రమంగా రాకపోవడంతో ఉన్న ఒకేఒక చేతిపంపు వద్ద స్థానికులు నీళ్లు పట్టుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కొలాంగూడ, చిత్తగూడ, గట్టెపల్లి, సాలెగూడకు తాగునీటి సమస్య ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాలకు భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. ఇక గిరిజన ప్రాంతాలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నీటి కోసం పని మానేస్తున్నాం గట్టేపల్లి, చిత్తగూడ గ్రామాలకు నీళ్లు రావడం లేదు. ఉన్న ఒక్క చేతిపంపు,బావి నుంచి ఎడ్ల బండ్లతో నీళ్లు తెచ్చుకుంటున్నాం. అన్ని పనులు మానేసి నీటి కోసమే సమయం వెచ్చిస్తున్నాం. –కొడప కర్ణు, గట్టేపల్లి, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా బోరు నీళ్లే తాగుతున్నాం భగీరథ నీళ్లు అన్ని ఇళ్లకు రావడం లేదు. బోరింగ్ పంపు నీళ్లే తాగుతున్నాం. అయితే ఊరిలో ఒకే చేతిపంపు ఉండడంతో నీటి కోసం ఎంతో ఇబ్బంది అవుతోంది. –రాథోడ్ సరితా బాయి, లింగాపూర్, ఆసిఫాబాద్ జిల్లా -
కంటైనర్ ఢీకొని తల్లీ, కొడుకు మృతి
ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జాతీయ రహదారి నెత్తురోడింది. జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ చెక్పోస్టు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాగజ్నగర్ మండలం బట్టుపెల్లికి చెందిన తల్లి, కొడుకు సహెరాభాను(35), షేక్ ఆసిఫ్(16) దుర్మరణం చెందారు. తండ్రి సర్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. సర్వర్ తన భార్య, కుమారుడితో కలసి శనివారం ఆసిఫాబాద్ మండలం చిర్రకుంటలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం మోటార్సైకిల్పై తిరిగి బట్టుపెల్లికి బయల్దేరారు. జాతీయ రహదారి ఎగ్జిట్ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఓ కంటైనర్ లారీ.. సర్వర్ మోటార్సైకిల్పై నుంచి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కంటైనర్ వెనక టైర్ కిందికి వచ్చిన తల్లి, కొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. సర్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, బైక్పై నుంచి దూసుకెళ్లిన కంటెయినర్ లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని కూడా ఢీకొట్టింది. దీంతో ఆ లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నేషనల్ హైవేకు చెందిన 1033 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృత దేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సైలు మహేందర్, ప్రవీణ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎగ్జిట్ దారి మూసి వేయాలని ధర్నా.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాజంపేట చెక్పోస్టు మీదుగా జాతీయ రహదారికి వెళ్లే మార్గాన్ని మూసి వేయాలని స్థానికులు ప్రమాదస్థలం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని గుండి రహదారి.. ఆపై సర్విస్ రోడ్డు మీదుగా జాతీయ రహదారిపైకి వాహనాలు వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
పట్టాలిచ్చిన వారికే ‘సరిహద్దు’ ఓటు
కెరమెరి(ఆసిఫాబాద్): రెండు రాష్ట్రాల గొడవలో 15 సరిహద్దు గ్రామాలు నలిగిపోతున్నాయి. సాగు భూములకు ఇప్పటికీ పట్టాలు అందకపోవడంతో అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న జనాభాలో 20 శాతం ఉన్న గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం పోడు పట్టాలిచ్చి ‘రైతుబంధు’ అమలు చేస్తోంది. అయితే 70 శాతం ఉన్న ఎస్సీలు, 10 శాతం ఉన్న బీసీలను రెండు ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజనేతరులకు పట్టాలందించి, గ్రామాల్లో సమస్యలు పరిష్కరించిన వారికే ఓటు వేస్తామని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని వివాదాస్పద గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. రెండు రాష్ట్రాల్లో ఓటుహక్కు కలిగి ఉన్న వీరు ఈ నెల 30న తెలంగాణలో నిర్వహించే ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఓటు వేయనున్నారు. మొత్తంగా వీరి ఓట్ల సంఖ్య 3,566. సరిహద్దుల గుర్తింపు ఇలా.. 1955– 56లో ఫజల్అలీ కమిషన్ సరిహద్దులను గుర్తించింది. ఈ క్రమంలో పరందోళి, కోటా, పరందోళి తండా, శంకర్లొద్ది, లేండిజాల, మహరాజ్గూడ, ముకదంగూడ, అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఏసాపూర్, నారాయణగూడ, భోలాపటార్, లేండిగూడ, గౌరీ గ్రామాలు మహారాష్ట్రలోకి వెళ్లాయి. 1965 నుంచి ఇవి మహారాష్ట్రలోని నోకేవాడ, పుడ్యాన్మోదా జీపీల్లో ఉన్నాయి. అయితే 1990లో అక్కడి ప్రభుత్వం పరందోళి, అంతాపూర్ జీపీలను ఏర్పాటు చేసి 15 గ్రామాలను విడదీసింది. 1995లో ఇక్కడ నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓటింగ్ నమోదైంది. 1978లో మరోసారి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఉమ్మడిగా సరిహద్దులు గుర్తించాయి. ఆర్టికల్ 3 ద్వారా 15 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆ«దీనంలో ఉంటాయని ఇరురాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 1980 నుంచి ఏపీ గవర్నమెంట్ అక్కడ ఎన్నికలు నిర్వహిస్తుండగా ప్రజలు ఓటుహక్కు వినియోగించుకోలేదు. అనంతరం ఏపీ ప్రభుత్వం కూడా పరందోళి, అంతాపూర్ జీపీలను గుర్తించి 1994లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. అప్పటి నుంచి ఇరు రాష్ట్రాల్లో స్థానికులు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. 1980 నుంచి ఉద్యమం... వివాదాస్పద గ్రామాలను ఏపీలో కలపొద్దని 1980 నుంచే ఉద్యమం చేస్తున్నట్టు ముకదంగూడ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త రాందాస్ నర్వడే తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో 1983లో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. అయితే 1978లో చేసిన హద్దుల ప్రకారం గ్రామాలు ఆంధ్రప్రదేశ్కు చెందుతాయని ఆ కమిటీ నివేదించింది. 1990 జూలై 7న గ్రామాలు ఏపీకి చెందుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ మరోసారి ఉద్యమం మొదలైంది. 15 గ్రామాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్నారని, భాషా ప్రతిపాదికన నిర్ణయం తీసుకోవాలని అడ్వొకేట్, రాజూరా ఎమ్మెల్యే వాన్రావు చటప్తో కలిసి ఆందోళనలు చేపట్టారు. ఈ విషయం అక్కడి అసెంబ్లీలో చర్చకు రావడంతో మహారాష్ట్ర సర్కార్ 1993 ఆగస్టు 5న 1990లో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఆ గ్రామాలు మహారాష్ట్రలోనే కొనసాగుతాయని తేల్చిచెప్పింది. ఆ తర్వాత 1996 ఏప్రిల్ 3న ఏపీ ప్రభుత్వం దీనిపై హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రతిగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 1996 ఏప్రిల్ 30న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏపీ గవర్నమెంట్ 1997 ఆగస్టు 21న పిటిషన్ను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటివరకు 15 గ్రామాల కోసం ఎలాంటి కేసులు దాఖలు చేయలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. రెండు ఓట్లు.. రెండు రేషన్కార్డులు ఇక్కడి ప్రజలకు ఇరు రాష్ట్రాలకు చెందిన రెండు రేషన్కార్డులు, రెండు ఓట్లు ఉన్నాయి. వీరు ఇద్దరేసి సర్పంచ్లతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. రెండు ప్రభుత్వాలు పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. పరందోళి గ్రామంలో కొందరికి ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరయ్యాయి. అయితే లబ్దిదారులకు తెలియకుండా కొంతమంది బిల్లులు కాజేశారు. అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నా లబ్దిదారులకు న్యాయం జరగలేదు. ప్రస్తుతం మిషన్ భగీరథ నీరు కూడా సరఫరా చేస్తున్నారు. 2014 నుంచి ఇక్కడి రైతులకు పట్టాలు లేక రుణాలు అందటం లేదు. మరో వైపు రెవెన్యూ, అటవీశాఖ మధ్య భూవివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం గిరిజనులకు పోడు పట్టాలు అందినా గిరిజనేతరులకు ఎలాంటి భరోసా లేకుండా పోయింది. 80 శాతం ఉన్న గిరిజనేతరులకు పట్టాలిచ్చిన వారికే ఓటు వేస్తామని అక్కడి ప్రజలు తేల్చిచెబుతున్నారు. పట్టాలివ్వాలి.. 50 ఏళ్లుగా భూములు సాగుచేసుకుంటున్నా పట్టాల్లేవు. రెండు ప్రభుత్వాలు కూడా పట్టాలు అందించకపోవడంతో సంక్షేమ పథకాలు అందడంలేదు. ఇప్పటికైనా రైతులకు పట్టాలు అందించాలి. – కాంబ్డే లక్ష్మణ్, మాజీ సర్పంచ్, పరందోళి కోర్టు ధిక్కరణే.. 15 గ్రామాలు మహారాష్ట్రకు చెందినవిగా 1997లోనే సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అయినా తెలంగాణ సర్కారు ఇంకా కొనసాగిస్తోంది. ఇది కోర్టు ధిక్కరణవుతుంది. ఓట్ల కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మేం మహారాష్ట్రలోనే కొనసాగుతాం. – రాందాస్ రన్వీర్, సామాజిక కార్యకర్త, ముకదంగూడ -
చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి
కెరమెరి(ఆసిపాబాద్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం లక్మాపూర్లో బాహుబలి సినిమాలో జరిగినట్లు ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ సినిమాలో మహేంద్ర బాహుబలిని శివగామి తన చేతిలో పట్టుకుని నదిని దాటినట్లుగా.. లక్మాపూర్ వాగులో ఓ వ్యక్తి చంటి బిడ్డను ఇలా చేతుల్లో పట్టుకుని వాగు దాటాడు. గ్రామానికి చెందిన రాథోడ్ కృష్ణ, సుజాత దంపతుల కూతురు (8 నెలలు) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మరోవైపు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగుతోంది. దీంతో పాపను ఆస్పత్రికి తీసుకెళ్లే వీల్లేక మూడు రోజులు వేచి చూశారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. సాయంకోసం కృష్ణ తన తమ్ముడు సాయిప్ర కాశ్ను తీసుకుని బయల్దేరారు. అయితే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సాయిప్రకాశ్ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని గొంతు వరకు నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటారు. తర్వాత చిన్నారి తల్లిదండ్రులు కూడా వాగుదాటారు. అనంతరం ముగ్గురూ కెరమెరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. తిరిగి ఇదే రీతిలో వాగుదాటి ఇంటికి వెళ్లారు. కాగా, ఈ వాగుపై 2016లో వంతెన నిర్మాణం ప్రారంభించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని ఆ ప్రాంతవాసులు చెపుతున్నారు. దీంతో ఏటా వానాకాలంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని లక్మాపూర్ వాసులు వాపోతున్నారు. చదవండి: వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి -
క్షణక్షణం పెరుగుతోన్న ప్రాణహిత నది నీటి మట్టం!
-
Asifabad: మూడు రోజుల్లో సీఎం పర్యటన.. భోజన ఖర్చులివ్వండి!
సాక్షి, ఆసిఫాబాద్: ఎంకి పెళ్లి సుబ్బిగాడి చావుకొచ్చిందన్న చందంగా మారింది జిల్లా పోలీసుల తీరు.. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. సీఎం బందో బస్తుకు వస్తున్న దాదాపు 2,500 మంది పోలీసులకు వసతి, భోజన ఏర్పాట్లు చేయడం జిల్లా పోలీసుశాఖకు కత్తిమీద సాములా మారినట్లు సమాచారం. ఇప్పటికే వీరి వసతి కోసం జిల్లా కేంద్రం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లాడ్జీలు, ఫంక్షన్హాళ్లను తమ ఆధీనంలోకి తీసుకోనున్న పోలీసులకు, వీరందరికి భోజన ఏర్పాట్లు చేయడం తలకు మించిన భారంగా మారింది. వ్యాపారుల నుంచి పోలీసుల భోజన ఖర్చులకు విరాళాలు అడగడం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. 2,500 మందితో బందోబస్తు.. సీఎం పర్యటనకు బారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నేతృత్వంలో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ స్థాయి అధికారులతోపాటు అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఆర్ఎ స్సైలు, పీసీలు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ, మ హిళా పోలీసులతో మొత్తం 2,500 మందితో బందోబస్తు ఉండనున్నట్లు తెలిసింది. కాగా వీరంతా ఈ నెల 28న జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. వీరందరికీ వసతి, భోజన ఏర్పాట్లు జిల్లా పోలీ సుశాఖ చేపట్టింది. ఇందులో వసతి ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో ఊపిరిపీల్చుకున్న పోలీసు అధికారులకు భోజన ఏర్పాట్ల అంటేనే ఖర్చుతో కూడుకున్న అంశం కావడంతో వ్యాపారుల సాయం కోరినట్లు తెలుస్తోంది. అయితే ఒక్కో వర్తక సంఘానికి రూ.లక్ష చొప్పున టార్గెట్ విధించడంపైనే వ్యాపారుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదనే నిర్ణయానికి వచ్చే వ్యాపారులపై ఒత్తిడి తెచ్చారనే ప్రచారం సాగుతోంది. వ్యాపారుల్లో తర్జన భర్జన.. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమాలతోపాటు కుమురంభీం, కొట్నాక భీంరావు విగ్రహాల ఆవిష్కరణ తదితరాలు కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది జిల్లాకు తరలిరానున్నారు. కార్యక్రమానికి మూడు రోజుల ముందుగానే వీరంతా జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. కాబట్టి వీరందరికి వసతి, భోజన ఏర్పాట్ల బాధ్యతలు స్థానిక పోలీసు ఉన్నతాధికారులపై పడింది. దీంతో పోలీసు అధికారులు వ్యాపారులతో మాట్లాడి.. పోలీసుల భోజన ఖర్చులకు డబ్బులు సమకూర్చాలని కోరినట్లు సమాచారం. ఒక్కో వర్తక సంఘం తరఫున రూ.లక్ష ఇవ్వాలని పోలీసు సిబ్బంది కోరడంతో వ్యాపారులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అయినా ప్రభుత్వ కార్యక్రమానికి విరాళాలు అడగడం ఏంటి? అన్న చర్చ వ్యాపారుల్లో జరుగుతుండటం గమనార్హం. -
కొమరంభీం జిల్లా: మూసేసిన ఫ్యాక్టరీలో గప్చుప్గా వ్యభిచారం
సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: జిల్లా రెబ్బెన మండల పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రాస్ రోడ్లో మూసివేసిన ఓ పరిశ్రమలో వ్యభిచార గృహాలను నిర్వహించడాన్ని గుర్తించారు. నిందితుడిని జనగాం జిల్లాకు చెందిన మడసి రమేష్ కుమార్గా నిర్ధారించారు పోలీసులు. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ నుండి మహిళలను తెప్పించి గుట్టుచప్పుడు వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారం తో టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్విస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రెబ్బెన పోలీస్ స్టేషన్కి తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. -
కొత్తగూడలోపెద్దపులి సంచారం
చింతలమానెపల్లి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాసులకు పెద్దపులి భయం పట్టుకుంది. రోజుకో గ్రామంలో పులి ప్రత్యక్షమవుతూ కలవరపెడుతోంది. ఆదివారం చింతలమానెపల్లి మండలం కొత్తగూడ గ్రామ శివారులోని చెరువులో నీళ్లు తాగుతూ స్థానికులకు కన్పించింది. దీంతో వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి చెరువు వద్ద పెద్దపులి అడుగులను గుర్తించారు. పులి నీళ్లు తాగి బాబాసాగర్ గ్రామంవైపు వెళ్లినట్లు తెలుసుకున్నారు. అనంతరం స్థానికులకు అటవీశాఖ అధికారులు అవగాహన కల్పించారు. కాగజ్నగర్ ఎఫ్డీవో విజయ్కుమార్ మాట్లాడుతూ కాగజ్నగర్ డివిజన్ పరిధిలో పెద్దపులి సంచరిస్తోందని,అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయ కూలీలు, రైతులు గుంపులుగా పొలాలకు వెళ్లాలన్నారు. పెద్ద పులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం బాబాసాగర్ గ్రామంలో పులి సంచారంపై డప్పు చాటింపు వేయించారు. -
ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి.. 52 గ్రామాలకు రాకపోకలు బంద్
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలోని అందవెల్లి వద్ద పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. మంగళవారం అర్ధరాత్రి బ్రిడ్జి కూలిపోవడంతో కాగజ్నగర్, దహేగం మండలాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. దీంతో, 52 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, గత కొన్ని రోజులుగా జిల్లాలో ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో, బ్రిడ్జి ప్రమాదకరమైన స్థితికి చేరడంతో అధికారులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. కాగా, వాహనల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు.. కూలిన బ్రిడ్జిని తొందరగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. -
Photo Feature: ఏయ్ బిడ్డ.. ఇది మా అడ్డా..
కుమురంభీం జిల్లా పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని అడవులను పెద్ద పులులు అడ్డాగా మార్చుకున్నాయి. పొరుగున మహారాష్ట్రలో ఉన్న తడోబా, తిప్పేశ్వర అభయరణ్యాల నుంచి వస్తున్న పులులు.. కాగజ్నగర్ డివిజన్ పరిధిలోనిపెంచికల్పేట్ రేంజ్ పరిధిలో నిత్యం సంచరిస్తున్నాయి. గత సంవత్సరం కే8 అనే ఆడపులి పెంచికల్పేట్ రేంజ్ను ఆవాసంగా మార్చుకుని మూడు పిల్లలకు జన్మనిచ్చింది. స్థానిక పెద్దవాగు పరీవాహక ప్రాంతంలోని సాసర్పిట్లో తన బిడ్డతో సేదతీరుతూ.. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు ఇలా చిక్కింది. –పెంచికల్పేట్ -
జ్వరంతో బూరుగూడలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని మృతి
-
డిగ్రీ విద్యార్థిని మృతి.. ఉద్రిక్తత.. హాస్టల్లో ఏం జరిగింది?
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ మండలం బూరుగూడ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో సంగీత అనే డిగ్రీ విద్యార్థిని జ్వరంతో ప్రాణాలు కోల్పోయింది. కరీంనగర్లో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని చనిపోయిందంటూ మృతదేహంతో ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు, విద్యార్థి యువజన సంఘాలు ధర్నాకు దిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురు విద్యార్థినిలు జ్వరంతో మృతిచెందిన అధికారులు చర్యలు చేపట్టడం లేదని అధికారుల తీరుపై గిరిజనులు మండిపడుతున్నారు. చదవండి: భార్య పుట్టింటికి వెళ్లిందని... ట్రాన్స్ జెండర్ని ఇంటికి రప్పించి... -
అవి శివుడి గుడి స్తంభాలు.. ఇది హిడింబి ఇసుర్రాయి!
సాక్షి, హైదరాబాద్: మీటర్లకొద్దీ పొడవున్న నిలువు రాళ్లు.. ఏదో పనికోసం యంత్రంతో కోసినట్టుగా చక్కటి ఆకృతులు.. ఒకదాని తర్వాత ఒకటి పడుకోబెట్టినట్టుగా ఉన్న రాతి శిలలు.. అవి శివుడి గుడి స్తంభాలు అంటూ స్థానికంగా ఓ ప్రచారం.. ►దారిపక్కన టన్నుల బరువున్న విశాలమైన రెండు రాళ్లు.. వృత్తాకారంలో ఒకదానిపై మరొకటి పేర్చినట్టు ఆకృతి.. అది ఒకనాటి ఇసుర్రాయి అని, భారతంలో ప్రస్తావించే హిడింబి దాన్ని వాడేదని ఓ గాధ.. ►చిత్రమైన ఆకృతుల్లో, మనం నిత్యం వాడే పరికరాల ఆకారాల్లో ఉండే రాళ్లు జన బాహుళ్యంలో వింత ప్రచారానికి కారణమవుతాయి. అలాంటివే ఈ రాళ్లు. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడి మనను ఆకట్టుకుంటున్నాయి. వీటి వెనుక ఎలాంటి చారిత్రక, పౌరాణిక గాథ లేదని తేల్చిన నిపుణులు దీనిపై స్థానికులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. రాతి స్తంభాల ఆకృతిలో.. ఆసిఫాబాద్ జిల్లా బోర్లాల్గూడ అడవిలో ప్రకృతి చెక్కిన రాతి స్తంభాలు ఉన్నాయి. దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల కింద లావా ఉబికివచ్చి కడ్డీల ఆకృతుల్లో ఘనీభవించిన రాతి శిలలు అవి. కాలమ్నార్ బసాల్ట్స్గా పేర్కొనే ఈ శిలలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు తిరుపతి మిత్రబృందం గుర్తించింది. తెలంగాణలో తొలిసారిగా ఏడేళ్ల కింద ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ శాంతిపూర్ రిజర్వ్ ఫారెస్టులో కూడా ఇలాంటి రాళ్లను గుర్తించారు. తాజాగా రెండో చోట అవి బయటపడినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని భూభౌతిక స్మారక ప్రాంతంగా గుర్తించాలని కోరారు. కర్ణాటకలోని ఉడిపి సమీపంలో సెయింట్ మేరీ ద్వీపాల్లో ఇలాంటి రాతి స్తంభాలను గుర్తించిన జీఎస్ఐ.. దేశంలో గుర్తింపు పొందిన 34 జాతీయ భూభౌతిక స్మారక ప్రాంతాల్లో ఒకటిగా చేర్చిందని తెలిపారు. బోర్లాల్గూడలో ఈ లావా శిలలున్న ప్రాంతంలో పురాతన శివలింగం వెలుగుచూడటంతో.. శివుడి గుడి కోసం రూపొందించిన స్తంభాలుగా వీటి గురించిన గాథ ప్రచారంలో ఉందని వెల్లడించారు. ఇసుర్రాయి రూపంలో.. హైదరాబాద్ శివార్లలో ఇబ్రహీంపట్నానికి 2 కిలోమీటర్ల దూరంలో దండుమైలారం వెళ్లేదారిలో రోడ్డు పక్కన భారీ వృత్తాకార రాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చినట్టు ఉన్నాయి. ఇది మహాభారతంలో హిడింబి అనే రాక్షస స్త్రీ వాడిన ఇసుర్రాయిగా ఓ గాథ స్థానికంగా ప్రచారంలో ఉంది. బుద్ధవనం ప్రాజెక్టు డిజైన్ ఇన్చార్జి శ్యాంసుందర్, శిల్పి హర్షవర్ధన్తో కలిసి చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి వీటిని పరిశీలించి.. అవి సహజసిద్ధంగా ఏర్పడ్డవేనని గుర్తించారు. కోట్ల ఏళ్ల పరిణామ క్రమంలో రాళ్లు ఇలా ఒకదానిపై మరొకటి ఏర్పడటం సహజమని.. వీటిని బ్యాలెన్సింగ్ స్టోన్స్గా పిలుస్తారని తెలిపారు. వీటిని కాపాడుకుంటే ఆ ప్రాంతానికి ఓ ప్రత్యేకతగా ఉంటుందని స్థానికులకు సూచించారు. -
పులుల కోసం ఓ వంతెన
సాక్షి, హైదరాబాద్: తడోబా పులుల అభయారణ్యంలో పెద్ద పులుల సంచారం ఎక్కువ. ఇక్కడినుంచే తెలంగాణలోని అడవుల్లోకీ పెద్ద పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఉన్న అటవీ ప్రాంతం వాటికి సురక్షిత కారిడార్. ఇప్పుడు ఇదే ప్రాంతం మీదుగా నాగ్పూర్–విజయవాడ ఎక్స్ప్రెస్వే నిర్మితం కాబోతోంది. 4 వరుసలుగా నిర్మించే ఈ రహదారి పులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే అడవిని చీలుస్తూ వాటి ప్రాణానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో 150 మీటర్ల పొడవుతో ఎకో బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. అంటే వన్యప్రాణులు రాకపోకలు సాగించే సమయంలో జాతీయ రహదారిని దాటేందుకు సహజ సిద్ధ వాతావరణం కల్పిస్తూ నిర్మించే వంతెన అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల పరిరక్షణలో మంచి ఫలితాలు సాధిస్తున్న ఈ తరహా నిర్మాణం తెలంగాణలోనే మొదటిది కానుండటం విశేషం. దీనికి మరో 2 కి.మీ. దూరంలో 200 మీటర్ల పొడవుతో అండర్పాస్నూ నిర్మిస్తున్నారు. మొదటి వంతెన వద్ద వాహనాలు దిగువ నుంచి సాగితే, జంతువు లు పైనుంచి రోడ్డును దాటుతాయి. రెండో నిర్మాణం వద్ద.. వాహనాలు ఫ్లైఓవర్ మీదుగా.. జంతువులు దిగువ నుంచి దాటుతాయి. మూడు రాష్ట్రాలను కలిపే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు సాగే ఈ కారిడార్లో తెలంగాణలోని మంచిర్యాల నుంచి విజయవాడ వరకు పూర్తి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెవేగా రోడ్డును నిర్మించబోతున్నారు. దీనికి కేంద్రం నుంచి ఆమోదం వచ్చినందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. దీనివల్ల నాగ్పూర్–విజయవాడ మధ్య దూరం 180 కి.మీ. మేర తగ్గనుంది. తెలంగాణ నుంచి విజయవాడకు ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఈ రోడ్డు బిజీగా మారి ప్రమాదాలకు అవకాశం కల్పిస్తోంది. ప్రతిపాదిత కొత్త రోడ్డు మంచిర్యాల–వరంగల్–ఖమ్మం–మీదుగా విజయవాడకు చేరుకుంటుంది. హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేని వాహనాలు అటుగా మళ్లి.. ప్రస్తుత విజయవాడ జాతీయ రహదారిపై భారాన్ని తగ్గిస్తాయి. వైల్డ్లైఫ్ బోర్డు సిఫారసుతో.. ఇందులో మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్–మంచిర్యాల వరకు 2 వరుసల పాత రోడ్డు ఉంది. దాన్నే 4 వరుసలకు విస్తరిస్తారు. మంచిర్యాల నుంచి పూర్తి కొత్త రోడ్డును నిర్మిస్తారు. ఆసిఫాబాద్ మీదుగా విస్తరించే 4 వరుసల రహదారితో వన్యప్రాణులకు ఇబ్బందిగా మారడంతో అటవీశాఖతోపాటు ప్రత్యేకంగా వైల్డ్లైఫ్ బోర్డు నుంచి క్లియరెన్సు తీసుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ దరఖాస్తు చేసుకోగా, గతేడాది వైల్డ్లైఫ్ కమిటీ ప్రతినిధులు ఆ ప్రాంతాన్ని సర్వే చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప అనుమతులు సాధ్యం కాదని తేల్చారు. అనంతరం వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త బిలాల్ హబీబ్ నేతృత్వంలోని బృందం పర్యటించి మహారాష్ట్ర–ఆసిఫాబాద్ సరిహద్దు వద్ద 150 మీటర్ల మేర ఎకో బ్రిడ్జిని, ఆ తర్వాత 200 మీటర్ల మేర అండర్పాస్ కట్టాలని సిఫారసు చేసినట్టు అధికారులు చెప్పారు. నాయిస్ బారియర్స్ ఏర్పాటు ఎక్స్ప్రెస్ వే కావడంతో వాహనాలు 150 కి.మీ. వేగంతో దూసుకుపోతాయి. అప్పుడు విపరీతమైన శబ్దం వస్తుంది. అది వన్యప్రాణులను బెదరగొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకోసం ప్రతిపాదిత బ్రిడ్జి, అండర్పాస్ వద్ద వాహనాల శబ్దాన్ని వెలుపలికి బాగా తగ్గించి వినిపించేలా నాయిస్ బారియర్స్ ఏర్పాటు చేయాలని కూడా వైల్డ్ లైఫ్ బోర్డు ఆదేశించింది. దాంతోపాటు ఎకో బ్రిడ్జి మీదుగా జంతువులు దాటే ప్రాంతంలో ఎక్కడా అది ఓ కట్టడం అన్న భావన రాకుండా చూస్తారు. సాధారణ నేల, దానిపై చెట్లు ఉండేలా డిజైన్ చేస్తారు. అది మామూలు భూమే అనుకుని జంతువులు రోడ్డును సురక్షితంగా దాటుతాయి. -
న్యాయం చేయాలని ఆర్డీవో కాళ్లు మొక్కిన మహిళా సర్పంచ్
సాక్షి, ఆసిఫాబాద్: మండల కేంద్రం మీదుగా చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రెబ్బెన సర్పంచ్ బొమ్మినేని అహాల్యాదేవి, బాధితురాలు వందన శుక్రవారం ఆర్డీవో సిడాం దత్తు కాళ్లపై పడి వేడుకున్నారు. రోడ్డు విస్తరణలో ఉన్న కొద్దిపాటి గూడు కూడా కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే శాఖ ఆదీనంలో ఏడెకరాల ప్రభుత్వ మిగులు భూమిని రోడ్డు విస్తరణలో కోల్పోతున్న వాళ్లకు ఇళ్లు, దుకాణాలకు కేటాయించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. చదవండి: టూర్లకు డిమాండ్.. హైదరాబాద్ నుంచి పారిస్, లండన్, స్విట్జర్లాండ్కు -
ఒకరితో ప్రేమ, మరోకరితో పెళ్లి నిశ్చయం..అడిగితే రెండు రోజుల్లో వస్తానని చెప్పి
సాక్షి, ఆసిఫాబాద్ అర్బన్: ప్రియుడు మోసగించాడని ఓ యువతి శుక్రవారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్లో ప్రియుని ఇంటి ఎదుట భైఠాయించింది. మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన యువతి, పట్టణంలోని జన్కాపూర్ కు చెందిన ఓ యువకుడు ఏడాదికాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నాడు. దీంతో వారం రోజుల క్రితం సదరు యువతి ఆసిఫాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం మళ్లీ వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఎంతకూ రాకపోవడంతో శుక్రవారం ఆసిఫాబాద్కు వచ్చినట్లు పేర్కొంది. సదరు యువకుడికి వివాహం నిశ్చయించినట్లు తెలిసి న్యాయం చేయాలని అతని ఇంటి ఎదుట బైఠాయించింది. మహిళా సంఘాల సభ్యులు మద్దతు తెలిపారు. -
కాలమేదైనా కాలినడకే..
ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోని ‘గోవెన’గూడేలు తాగునీటికి నీటి చెలిమలే ఆధారం.. కరెంటు లేదు.. రోడ్డు లేదు.. బడి లేక పిల్లలు చదువులకు దూరం తిర్యాణి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యా ణి మండలం గోవెన గ్రామపంచాయతీ అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ పంచాయతీ పరిధిలో ఐదు గూడేలు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి గోవెనగా పిలుస్తారు. 361 మంది జనాభా ఉన్నారు. దశాబ్దాలుగా ఈ గూడేలు ఉనికిలో ఉన్నా.. ఇప్పటివరకు ఎలాంటి మౌలిక సదుపాయాలులేవు. కరెంటు సౌకర్యం లేదు. నాయకపుగూడ, కుర్సిగూడ గ్రామాలైతే అత్యంత వెనుకబడి ఉన్నాయి. పదేళ్ల క్రితం ఐటీడీఏ ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినా.. నిర్వహణ లేక ఐదేళ్ల క్రితం చెడిపోయాయి. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగం గా ఏర్పాటు చేసిన నాలుగు సోలార్ లైట్లు మాత్రమే ప్రస్తుతం వీరికి వెలుగునిస్తున్నాయి. ఈ గూడేలకు తాగునీటి సౌకర్యం లేదు. కనీసం ఒక్క చేతిపంపు కూడా వేయలేదు. మిషన్ భగీరథ ట్యాంకులు అలంకారప్రాయంగా మిగిలాయి. నాయకపుగూడ వాసులు సమీపంలోని వాగులో చెలిమ తవ్వి నీళ్లు తెచ్చుకుంటున్నారు. వానాకాలంలో వాగు లో ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు చెలిమ నీరు కూడా దొరకదు. మిగతా నాలుగు గూ డేల వారు కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. కాలినడకనే ప్రయాణం ఐదు గూడేల ప్రజలు ఏ అవసరమున్నా కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిందే. ప్రతినెలా రేషన్, పింఛన్, ఆస్పత్రి, సామగ్రి కోసం దట్టమైన అటవీ ప్రాంతంలో రెండు వాగులను దాటుకుంటూ.. ఐదు కిలోమీటర్లు నడిచి ఆసిఫాబాద్ మండలం బలాన్పూర్కు చేరుకుంటారు. లేదా ఆరు కిలోమీటర్లు నడిచి లింగాపూర్ మండలం రాఘవపూర్కు వెళ్లి.. అక్కడి నుంచి వాహనాల ద్వారా తిర్యాణికి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో పోలీసులు బలాన్పూర్ మీదుగా గోవెనకు మట్టిరోడ్డు నిర్మించినా.. వరదలతో నామరూపాల్లేకుండా పోయింది. అత్యవసర సమయంలో ఆస్పత్రులకు వెళ్లడానికి 108 వాహనం రాలేని పరిస్థితి. పంచాయతీ పరిధిలో అంగన్వాడీ కేంద్రం కూడా లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదు. నాయకపుగూడలో తలపెట్టిన పాఠశాల భవనం నేటికి అసంపూర్తిగానే ఉంది. ఇక్కడి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. మాగోస ఎవరికీ రావొద్దు: ముత్తినేని రాజమ్మ, నాయకపుగూడ మాకు సర్కారు నుంచి రేషన్ బియ్యం తప్ప ఎలాంటి లబ్ధి జరగడం లేదు. తాగడానికి నీళ్లు, కరెంటు, రోడ్డు లేవు. ఎవరూ పట్టించుకోవడం లేదు. చెలిమ నీళ్లే తాగుతున్నం. ఆపద వస్తే కిలోమీటర్ల దూరం నడిచి ఆస్పత్రులకు పోతున్నాం. కరెంటు కోసం అధికారులను అడిగితే ఫారెస్టు అనుమతులు రావట్లేదని చెప్తున్నారు. మా గోస ఎవరికీ రావొద్దు. చేతి పంపులైనా వేయాలె.. మా గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లేదు. పిల్లలకు పౌష్టికాహరం కోసం ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. కనీసం తాగునీటి కోసం గ్రామంలో చేతి పంపు అయినా వేయాలి. రోడ్డు సౌకర్యం కల్పించాలి. – కొడప లచ్చుబాయి, గోండుగూడ ఈ ఫొటోలో కంకర రాళ్ల కుప్పలా కనిపిస్తున్నది ఏమిటో తెలుసా? ఓ గ్రామానికి వెళ్లే రోడ్డు! ఇది నిజమే.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోవెన పంచాయతీకి వెళ్లేందుకు దారి ఇదే. రాత్రిపగలు.. ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా.. ఈ దారి మీదుగా కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిందే. -
సిర్పూర్ ఆదివాసీ కోటను కాపాడండి!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది గోండుల కోట. సిర్పూర్ ఒకప్పుడు గోండు (కోయ) రాజుల ఏలుబడిలో వున్న ప్రాంతం. దీనినే పూర్వ కాలంలో సూర్యపురంగా పిలిచేవారు. 9వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని గోండు (కోయ) రాజు భీమ్ బల్లాలా పాలించాడు. ఈయన కాలంలోనే సిర్పూర్ కోట నిర్మితమైంది. ఈ రాజ్యానికి సరిహద్దుగా సిరోంచా, చంద్రపూర్, ఊట్నూర్, అహేరి, ఆసిఫాబాద్ కేంద్రాలుగా గోండు రాజ్యాలుండేవి. ముస్లిం, బ్రిటిష్ సైన్యాలు దండయాత్రలు చేసి ఈ రాజ్యాలను ఆక్రమించి కొల్ల గొట్టాయి. అయినా అలనాటి గోండు రాజ్యాల ఆనవాళ్ళు నేటికీ సజీవంగానే ఉన్నాయి. అందుకు ఉదాహరణ ఊట్నూర్, సిర్పూర్ టౌన్లలో ఉన్న కోటలు. ఈ చారిత్రక కోటలు నేడు కబ్జాకోరల్లో చిక్కుకొని ఆనవాళ్ళు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. సిర్పూర్ టౌన్ కేంద్రంగా ఉన్న గోండు రాజుల కోట దాదాపుగా 10 ఎకరాల స్థలంలో సువిశాలంగా ఉండేది. ప్రస్తుతం కోటగోడ, కోట స్థలంలో ఉన్న శిథిలావస్థకు చేరిన కొలను చూడవచ్చు. ఆ కోట భూములు రికార్డుల్లో నిక్షిప్తమై ఉన్నాయి. కానీ కోట నేడు భూ కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుంది. (చదవండి: రాజకీయాలు మారేదెన్నడు?) తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ కట్టడ గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. ప్రభుత్వానికి మన చరిత్ర, సంస్కృతుల పట్ల ఉన్న మక్కువకు ఇది నిదర్శనం. అటువంటి ప్రభుత్వం ఉన్న కాలంలోనూ సిర్పూర్ కోట ఆక్రమణలకు గురవ్వడం బాధాకరం. ఇప్పుడు ఆ భూమిలో గ్రామ పంచాయితీ, హస్పిటల్, రోడ్లు, ప్రైవేట్ వ్యక్తులు ఇళ్ళు ఉన్నాయి. కోటను భూకబ్జాదారుల నుంచి కాపాడి, రాష్ట్ర పురావస్తు శాఖ పరిరక్షణ కిందికి తేవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. (చదవండి: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) – పోలేబోయి అశోక్ ఆదివాసీ చరిత్ర అధ్యయన వేదిక, సిర్పూర్ కాగజ్నగర్ -
ఒకేరోజు ఒక్కటైన 111 జంటలు
పెంచికల్పేట్(ఆదిలాబాద్): మూడు ముళ్లు.. ఏడడుగులతో అగ్ని సాక్షిగా 111 జంటలు ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో ఆదివారం ఏకమయ్యాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు కోనేరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప–రమాదేవి దంపతులు సామూహిక వివాహాలు జరిపించారు. జయమంగళ నది (పెద్దవాగు) తీరాన శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకకు కోనేరు కోనప్ప దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. వధూవరులకు తాళి బొట్టు, మెట్టెలు, పట్టు వస్త్రాలు, వంట సామగ్రి అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ సురేశ్కుమార్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
పిట్ట నడక.. చూద్దాం రండి!
సాక్షి, మంచిర్యాల: ‘‘ఓ పుల్లా, ఓ పుడకా, ఎండుగడ్డి, చిన్నకొమ్మ, చిట్టిగూడు.. పిట్ట బతుకే ఎంతో హాయి’’ అంటూ తన పాటతో పక్షుల జీవితాన్నో ఉత్సవం చేశాడు ప్రజావాగ్గేయకారుడు గోరటి. అలాంటి పక్షుల జీవితాన్ని చూడాలనుకునేవారికో మంచి అవకాశం బర్డ్వాక్ ఫెస్టివల్. సహజ సిద్ధ ఆవాసాల్లో పక్షుల కిలకిల రాగాలు, విభిన్న పిట్టల గుంపులు, జంట పక్షుల తుళ్లింతలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం అటవీశాఖ కల్పిస్తోంది. ఈ నెల 8, 9న రెండోవిడత బర్డ్వాక్ ఫెస్టివల్ను ఆసిఫాబాద్ జిల్లా అటవీఅధికారులు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల పాటు కవ్వాల్ టైగర్ రిజర్వు, ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో ఈ బర్డ్వాక్ సాగనుంది. కాగజ్నగర్ అడవుల్లో పక్షుల సందడి పాలరాపుగుట్ట సహా... తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు అడవుల్లో పక్షుల ఆవాసాలు చూడొచ్చు. దేశంలో అంతరించిపోయే స్థితిలో ఉన్న పొడుగు ముక్కు రాబంధుల ఆవాసమైన పాలరాపుగుట్టతో సహా ఎంపిక చేసిన 21 ప్రాంతాల్లో ఈ బర్డ్ వాక్ జరగనుంది. సిర్పూర్, బెజ్జూరు, పెంచికల్పేట, మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లో ఎన్నో అరుదైన పక్షులున్నాయి. 250పక్షి జాతులు సందర్శకులను కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే కర్ణాటక, నాగ్పూర్, చంద్రాపూర్, హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి వన్యప్రాణి, ప్రకృతి ప్రేమికులు, వైల్డ్ ఫొటోగ్రాఫర్లు తమ ఆసక్తిని చూపించారు. రిజిస్ట్రేషన్ ఆధారంగా అవకాశం.. కోవిడ్ నేపథ్యంలో పరిమితంగా ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి అవకాశం కల్పిస్తున్నారు. ఒకరికి రూ.2వేలు ఫీజు. వివరాలకు డీఎఫ్వో (ఆసిఫాబాద్) 9440810099, ఎఫ్డీవో(జన్నారం) 9440810103 నంబరులో సంప్రదించవచ్చు. ఈ నెల 7న కాగజ్నగర్ అటవీ ఆఫీసులో నేరుగా మధ్యాహ్నం 3నుంచి 6గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. వీక్షకులకు అంతర్గత రవాణా, వసతి సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. పక్షుల సంరక్షణకు దోహదం పక్షుల సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజెప్పడంతో పాటు కొత్త పక్షుల గుర్తింపు, అధ్యయనం కోసం ఈ బర్డ్వాక్ దోహదపడుతుంది. ఎంపిక చేసిన ప్రాం తాల్లో సందర్శకులు అధికారుల సమక్షంలో పక్షులను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. వన్యప్రాణి నిపుణులు, వైల్డ్ ఫొటోగ్రాఫర్లు, పక్షి ప్రేమికులు పాల్గొనవచ్చు. – ఎస్.శాంతారామ్, జిల్లా అటవీ అధికారి, ఆసిఫాబాద్ -
పెద్దలు పెళ్ళికి నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, ఆదిలాబాద్: పెద్దలు పెళ్ళికి నిరాకరించారని యువ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జిల్లాలోని వాంకిడి మండలం రాంనగర్ గ్రామానికి చెందిన నౌగడే శ్రీకాంత్ (22), గీత(19) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వారి ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పి వివాహం చేయమని కోరారు. దీంతో అబ్బాయి ఇంట్లో ఒప్పుకున్నప్పటికి ,గీతా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. చివరకు ఈ విషయం గ్రామ పెద్దలు వరకు వెళ్లింది. దీంతో ఇరు కుటుంబాల వారికి నచ్చజెప్పి, కొంత సమయం వేచి చూడాల్సిందిగా పెద్దలు చెప్పారు కొన్ని రోజులు వేచి చూసిన శ్రీకాంత్, గీతలు ఇక తమకు వివాహం జరపరని మనస్తాపానికి గురై గత సోమవారం ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అయితే సోమవారం పొలం పనుల కోసం అకిని గ్రామ సమీపంలోని పత్తి చేనుకు వెళ్ళిన కూలీలకు ప్రేమ జంట చెట్టుకు ఉరి వేసుకుని శవాలై కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. శవాలు కుళ్ళిన స్థితిలో ఉండటంతో 3 రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: చికిత్స సమయంలో భార్య మృతి చెందిందని డాక్టర్ను షూట్ చేశాడు! -
వర్క్ ఫ్రం హోమ్.. మరోపక్క ప్రకృతి వ్యవసాయం
రవి కుమార్, సునంద యువ దంపతులు. లాక్డౌన్ నేపథ్యంలో సొంతూరు వెళ్లిపోయారు. రసాయన రహితంగా పండించిన ఆహారంతోనే ఆరోగ్యం చేకూరుతుందన్న స్పృహతో రసాయనాల్లేని వ్యవసాయం ప్రారంభించారు. రవి ఆన్లైన్లో ఉద్యోగం చేస్తూనే 8 ఎకరాల నల్లరేగడి భూమిలో భార్య తోడ్పాటుతో ఆఫ్లైన్లో వర్షాధార సేద్యం చేస్తున్నారు. పూర్తిగా సీవీఆర్ పద్ధతిలో మట్టి సేద్యంతో తొలి ఏడాదే మంచి దిగుబడులు తీసి భళా అనిపించుకుంటున్నారు ఈ ఆదర్శ యువ రైతులు. మాదాని రవి, సునంద ఎమ్మెస్సీ చదువుకున్నారు. హైదరాబాద్లో ఉంటూ అతను ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటే, ఆమె ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తుండే వాళ్లు. వారికి ఇద్దరు పిల్లలు. రవి స్వగ్రామం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని విజయనగరం. 40 ఎకరాల భూమి కలిగిన అతని తల్లిదండ్రులు వరి, పత్తి తదితర పంటలను రసాయనిక పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. బాల్యం నుంచీ రవికి వ్యవసాయం అంటే మక్కువ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రవి, సునంద ప్రకృతి వ్యవసాయ విషయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. సుభాష్ పాలేకర్ ప్రసంగాలు విని, పుస్తకాలు, పత్రికలు చదివి, రైతుల విజయగాధల వీడియోలు చూసి స్ఫూర్తి పొందారు. వారాంతాల్లో వీలైనప్పుడల్లా స్వయంగా కొన్ని క్షేత్రాలకు వెళ్లి చూసి, వివరాలు తెలుసుకొని వచ్చేవారు. ఇంట్లో ఎవరో ఒకరికి నెలకోసారైనా ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. మార్కెట్లో దొరికే వంటనూనెలు వాడటం ఆపేసి గానుగ నూనె వాడటం మొదలు పెట్టిన తర్వాత క్రమంగా ఆస్పత్తికి వెళ్లాల్సిన అవసరం తగ్గిపోయిందని.. ఆ తర్వాత బియ్యం, పప్పులు కూడా మార్చుకున్నామని సునంద చెప్పారు. ఆ విధంగా రసాయనాల్లేని ఆహారంతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని గుర్తించిన తర్వాత.. నగర పరిసరాల్లో భూమిని కౌలుకు తీసుకునైనా వారాంతాల్లో మనమే ఎందుకు పంటలు పండించుకోకూడని ఆలోచించారు. ఆ ప్రయత్నాలు సాగుతుండగా కరోనా వచ్చిపడింది. నవారతో ప్రారంభం లాక్డౌన్ కారణంగా వర్క్ఫ్రం హోం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరిలో వీరి కుటుంబం సొంత గ్రామానికి మకాం మార్చింది. తొలుత గత ఏడాది ఫిబ్రవరిలో 3–4 సెంట్ల భూమిలో నవార విత్తారు. ‘మా అత్త మామల ద్వారా దుక్కి చేయటం, గొర్రుతో విత్తనం వేయటం వంటి ప్రతి పనినీ కొత్తగా నేర్చుకున్నాం. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడటం అక్కడి రైతులందరికీ బాగా అలవాటు. అవి లేకుండా పంటలు ఎలా పండిస్తారని ప్రశ్నించేవారు. అయినా వెనక్కి తగ్గ లేదు’ అన్నారు సునంద. మొదట వ్యవసాయం చాలా కష్టంగా అనిపించినా పట్టు వదలకుండా ముందుకు సాగారు. మొదట ఆకు కూరలు, కూరగాయలు సాగు చేశారు. వేసవిలో పెరట్లో గోంగూర మొక్కలకు పిండి నల్లి సోకినప్పుడు మట్టి ద్రావణం ఆశ్చర్యకరమైన ఫలితాలనిచ్చింది. దాంతో వ్యవసాయం అంతా పద్మశ్రీ అవార్డు గ్రహీత, సీనియర్ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) చెప్పిన విధంగా కేవలం మట్టి ద్రావణం పద్ధతిలోనే సాగు చేసి మంచి దిగుబడులు తీయొచ్చన్న నమ్మకం కుదిరింది. అదే పద్ధతి అనుసరిస్తున్నాం అని సునంద వివరించారు. పంట ఏదైనా కేవలం మట్టి ద్రావణమే ఈ ఏడాది వానాకాలంలో 8 ఎకరాల నల్లరేగడి నేలలో వర్షాధారంగా వరి, సోయాబీన్, కంది, సజ్జ, కొర్రలు, రాగి తదితర పంటలు ఎడ్ల గొర్రుతో విత్తారు. పంటలు ఏవైనా మట్టి ద్రావణమే ప్రతి 10 రోజులకోసారి పిచికారీ చేస్తుండటం విశేషం. 200 లీటర్ల నీటిలో 30 లోపలి మట్టి (భూమిలో 2 అడుగుల లోతు నుంచి తీసి ఎండబెట్టిన పొడి మట్టి), అర లీటరు అముదంను కలిపి ఈ ద్రావణాన్ని అన్ని పంటలకు 10 రోజులకోసారి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. పంట పూత/పిందె దశలో 3 పిచికారీలకు మాత్రం ఈ ద్రావణానికి రాక్ డస్ట్ 5 కిలోలు కలిపి పిచికారీలు చేయాలి. దీనితో పాటు.. 30 కిలోల లోపలి మట్టికి అర లీటరు ఆముదం కలిపి.. ఆ మట్టి మిశ్రమాన్ని పంట మొక్కల కింద 20 రోజులకు ఒకసారి ఎరువుగా వేయాలి. ఈ మట్టి మిశ్రమం వేసిన తర్వాత వారం వరకు జీవామృతం వంటి ద్రావణాలు వేయకూడదు. ఇంతే. పంటలన్నిటికీ ఇవే ఇస్తున్నామని సునంద, రవి వివరించారు. సోయా.. ఎకరానికి 11 క్విం. సునంద, రవి వానాకాలంలో 3 ఎకరాల నల్లరేగడి నేలలో వర్షాధారంగా సోయా విత్తారు. సాళ్ల మధ్య 1.5 అడుగులు పెట్టారు. కలుపు మందు చల్లకుండా నాగళ్లతో 2 సాళ్లు పైపాటు చేయించారు, ఓసారి కూలీలతో కలుపు తీయించారు. సీవీఆర్ మట్టి ద్రావణం మాత్రం పిచికారీ చేశారు. పూత, పిందె దశలో మినుము, పెసర, నవార వడ్లు, బొబ్బర్లను ఒక్కో రకం ఒక్కోసారి మొలకల ద్రావణాన్ని కూడా కలిపి పిచికారీ చేశామని సునంద వివరించారు. ఇంకేమీ వెయ్యలేదు. అయినా, సగటున ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి సాధించటం విశేషం. వత్తుగా విత్తుకొని రసాయనిక సేద్యం చేసిన వారికన్నా ఎక్కువ దిగుబడి సాధించడం సాగులో పూర్వానుభవం లేని తమకు ఎంతో సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందని సునంద, రవి ఆనందిస్తున్నారు. 2 ఎకరాల్లో కంది విత్తారు. అంతర పంటలు వేశారు. 5 క్వింటాళ్ల కొర్రలు, 2 క్లింటాళ్ల సజ్జలు (సగానికిపైగా చిలకలు తినగా మిగిలినవి), 5 క్వింటాళ్ల కొర్రల దిగుబడి వచ్చింది. ఇవి కోసిన తర్వాత కుసుమ విత్తారు. 3 ఎకరాల్లో అధిక పోషకాలతో కూడిన ఇంద్రాణి, కుజూపటాలియా, కాలాబట్టి, నవార, మాపిళ్ళె సాంబ వంటి దేశీ వరి రకాలను సాగు చేసి 30 క్వింటాళ్ల దిగుబడి పొందటం విశేషం. ధైర్యంగా మట్టి ద్రావణంతో సేద్యం చేపట్టి నలుగురూ ఇదేమి సేద్యం అని తప్పుపడుతున్నా ముందుకు సాగి.. చివరకు గ్రామస్తులతో ఔరా అనిపించుకున్నారు రవి, సునంద వ్యవసాయంలోకి రాదలచిన యువతకు మార్గదర్శకులు. – కమ్రె నరేష్, సాక్షి, కౌటాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎన్ని ఇబ్బందులున్నా ఆనందంగా ఉంది నేను ఇంటి వద్ద నుంచి ఉద్యోగం చేస్తున్నాను. నా భార్య సునంద ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఇంటి పనులతో పాటు వ్యవసాయం చూసుకుంటున్నది. నేను విధుల్లో ఉన్న సమయంలో నా భార్య సునంద పొలం పనులు చూసుకుంటుంది. ఇద్దరం కలిసి ఇష్టపూర్వకంగా సహజ వ్యవసాయం చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా ఫలితాలను చూసి మాకెంతో ఆనందంగా ఉంది. సహజ పద్ధతిలో పండించిన పంటతో మంచి ఆరోగ్యం చేకూరుతుంది. యువ రైతులందరూ సహజ పద్ధతిలో పంటల సాగు చేపట్టాలి. అప్పుడే భూమి సారవంతం కావడంతో పాటు మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. – మాదాని రవి, యువ రైతు, విజయనగరం, కౌటాల మండలం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సీవీఆర్ మట్టి సేద్య పద్ధతి చాలు! వ్యవసాయం చేయడానికి శ్రద్ధతో పాటు చాలా ఒపిక ఉండాలి. అటు ఉద్యోగం.. ఇటు పిల్లల్ని చూసుకుంటూ సహజ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నాం. ఏసీలో ఉండే మీరు ఎందుకు వ్యసాయం చేస్తున్నారు? మందులు (రసాయనిక ఎరువులు, పురుగుమందులు) వాడకుండా పంటలు ఎలా పండుతాయని చాలా మంది ఎద్దేవా చేశారు. కానీ, ఎన్నో కష్టాలు పడి పంటలు సాగు చేస్తున్నాం. పంట దిగుబడిని చూసినప్పుడు ఆనందంగా ఉంటుంది. సీవీఆర్ మట్టి సేద్య పద్ధతి ఒక్కటి అనుసరిస్తే చాలని మా అనుభవంలో శాస్త్రీయంగా నేర్చుకున్నాం. సంతృప్తిగా ఉంది. NSU Nandanam natural farms యూట్యూబ్ ఛానల్ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తున్నాం. – సునంద (77995 44705), యువ రైతు, విజయనగరం, కౌటాల మండలం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా -
ఆరు.. వణికారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇప్పటివరకు సీజన్లో నమోదైన అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత ఇదే. ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 6.2 డిగ్రీల సెల్సియస్, ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 6.4 డిగ్రీల సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధాన నగరాల వారీగా పరిశీలిస్తే.. మెదక్లో గరిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 7.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. సోమవారం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదయ్యాయని, రానున్న రెండ్రోజులూ ఇదే తరహాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. -
హడలెత్తించిన పులి
దహెగాం(సిర్పూర్): కార్తీక స్నానాలు, దేవర మొక్కులకు వెళ్లిన గ్రామస్తులను పెద్దపులి వెంబడించింది. వారికి సమీపంలోనే తిరుగుతూ హడలెత్తించింది. దీంతో పులి ఎక్కడ దాడి చేస్తుందోననే భయంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నాలుగు గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచి్చంది. తర్వాత పోలీసులు, స్థానికుల సహకారంతో ఎట్టకేలకు 30 మంది క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. కుమురంభీం జిల్లా దహెగాం మండలం లోహా సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం మధ్యాహ్నం తర్వాత చిన్నరాస్పెల్లి గ్రామానికి చెందిన 30 మంది కార్తీక స్నానాలు, దేవర మొక్కుల కోసం ఎడ్లబండ్లపై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడు వాగుల గడ్డ వద్దకు వెళ్లారు. ఎర్రవాగు, పెద్దవాగు, మరోవాగు కలిసే చోట కార్తీక స్నానాలు చేయాలని భావించి, అనువైన చోటుకోసం చూస్తుండగా అదే ప్రాంతంలో వారికి పెద్దపులి కనిపించింది. దీంతో భయపడిన గ్రామస్తులు ఒక్కచోట చేరి డప్పు చప్పుళ్లు చేయడంతోపాటు కేకలు వేశారు. అయినా పులి అక్కడి నుంచి కదల్లేదు. అక్కడే ఉంటూ గ్రామస్తుల కదలికలను గమనించసాగింది. సాయంత్రం అయినా పులి అక్కడి నుంచి వెళ్లిపోలేదు. వారికి సమీపంలోనే తిరుగుతూ కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు మండల రైతు సమన్వయ సమితి కనీ్వనర్ సంతోగౌడ్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన ఇచి్చన వివరాల మేరకు అటవీ అధికారులు, దహెగాం ఎస్సై రఘుపతి, పోలీసు సిబ్బంది, చిన్నరాస్పెల్లి నుంచి వచ్చిన గ్రామస్తులు డప్పు చప్పుళ్లు చేసుకుంటూ.. కాగడాలు పట్టుకుని వాగు వద్దకు వెళ్లారు. పోలీసులు, అటవీ సిబ్బంది వచ్చే సమయానికి పులి దూరంగా వెళ్లిపోయినా.. అది మళ్లీ ఏ దిక్కునుంచి వచ్చి దాడి చేస్తుందోనని వారంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరికి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అధికారులు వాగువద్ద చిక్కుకున్నవారిని క్షేమంగా గ్రామానికి తీసుకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గత సంవత్సరం నవంబర్లో పెద్దపులి ఇద్దరిపై దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో పత్తి తీయడానికి వెళ్లే వారు సైతం భయాందోళన చెందుతున్నారు. పులి బెదరలేదు.. దేవరను తీసుకొని చిన్నరాస్పెల్లి నుంచి లోహా సమీపంలోని మూడు వాగుల గడ్డ వద్దకు కార్తీక స్నానానికి వెళ్లినం. ఒడ్డు వద్ద పెద్దపులి ఉంది. ముందుగా కుక్క అనుకొని దగ్గరకు వెళ్లి చూస్తే పులి.. ఒక్కసారిగా భయమైంది. మెల్లగా వెనుదిరిగి వచ్చి అందరికి చెప్పిన. డప్పు చప్పుళ్లు, కేకలు వేసినా అది బెదరకుండా అక్కడే ఉంది. అఖండ దీపం పెట్టిన చోటుకు వచి్చంది. అతి దగ్గర నుంచి అందరం పెద్దపులిని చూసినం. – ప్రత్యక్ష సాక్షి వెంకటేశ్ -
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
కౌటాల (సిర్పూర్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం పిడుగుపాటుకు ముగ్గురు మృత్యువాతపడ్డారు. కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన రైతు బోర్కుట్ పున్నయ్య(52), తల్లీకూతుళ్లు డొంగ్రీ పద్మ(40), డొంగ్రీ శ్వేత(20) తమ తమ పత్తి చేన్లలో ఎరువులు వేయడానికి వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి బయల్దేరారు. వర్షం వచ్చే అవకాశం ఉందని పద్మ భర్త హŸక్టు.. పద్మ, శ్వేతలను పున్నయ్య ఎడ్లబండిపై గ్రామానికి పంపాడు. పున్నయ్య, ఆయన భార్య రషిక, కుమారుడు బాలాజీ, పద్మ, శ్వేత ఎడ్లబండిపై బయల్దేరారు. అంతలోగానే ఒక్కసారిగా ఎడ్లబండిపై పిడుగుపడింది. దీంతో పున్నయ్య, పద్మ, శ్వేత అక్కడికక్కడే మృతిచెందారు. వీరితోపాటు ఎద్దు కూడా చనిపోయింది. రషిక, బాలాజీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. -
తీజ్ సంబరాల్లో విషాదం: వ్యక్తి ఆత్మహత్య
జైనూర్ (ఆసిఫాబాద్): ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఆశేపల్లిలో జరిగిన తీజ్ వేడుకల్లో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు పండుగలో ఆనందంగా పాల్గొనగా ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఆశేపల్లి గ్రామానికి చెందిన జాదవ్ మెఘాజీ(30) శనివారం రాత్రి కుటుంబ సభ్యులు తీజ్ సంబరాల్లో ఉండగా ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మెఘాజీ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి సోదరుడు జగదీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు, నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. చదవండి: కాపురానికి రావడం లేదని సెల్టవర్ ఎక్కి భర్త హల్చల్ చదవండి: తెలంగాణ సిగలో మరో అందం: వెలుగులోకి కొత్త జలపాతం -
ఆసిఫాబాద్ జిల్లాలో వరద బీభత్సం
-
బంధువులు దూషించారని మనస్తాపంతో యువతి ఆత్మహత్య
రెబ్బెన(ఆసిఫాబాద్): ఇంటి స్థలం వివాదంలో యువతిని తోటి బంధువులు దూషించడంతో మనస్తాపానికి గురై యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం మండలం లోని లక్ష్మిపూర్ పంచాయతీలోని గొల్ల గూడలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం... మౌనిక (18) రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చ దువుతోంది. మౌనిక తండ్రి బట్టమేకల మల్లయ్యకు, సమీప బంధువైన పాపయ్యకు మధ్య వారం రోజులుగా ఇంటి స్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సర్పంచ్ సమక్షంలో పంచాయితీ నిర్వహించాలని భావించారు. పాపయ్య పంచాయితీకి రాలేదు. తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లగా మౌనిక ఇంట్లో ఉండడాన్ని గమనించిన పాపయ్యతో పా టు అతడి కుమారుడు రాజేష్, కూతుళ్లు శశికళ, సరోజ మౌనికను దూషించారు. మనస్థాపానికి గురైన మౌనిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. తల్లి సత్తక్క ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హస్తకళ కళాకారుడు న్యానేశ్వర్ కన్నుమూత
కెరమెరి (ఆసిఫాబాద్): హస్తకళ కళాకారుడు, కుమురంభీం జిల్లా కెరమెరి మండలం కేస్లాగూడకు చెందిన కోవ న్యానేశ్వర్ (70) అనారోగ్యంతో కన్నుమూశారు. ఐదురోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు బుధవారం ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండ టంతో కుటుంబసభ్యులు స్థానిక పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అ క్కడి వైద్యులు ఆదిలాబాద్కు రిఫర్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆయన తుదిశ్వాస విడి చారు. న్యానేశ్వర్కు భార్య తుర్సాబాయి,. కొడుకులు భూమేశ్, రాంచందర్, కాశీరాం, కుమార్తె సక్కుబాయి ఉన్నారు. గురువారం కేస్లాగూడలో అంత్యక్రియలు జరగనున్నాయి. జాతీయస్థాయిలో గుర్తింపు హస్తకళల్లో న్యానేశ్వర్ జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. 2016, నవంబర్ 9న ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘శిల్పిగురు’ అవార్డును అం దుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన సంప్ర దాయ డోక్రీ లోహకళలో న్యానేశ్వర్ది అందెవేసిన చేయి. లోహకళలో ఆయన ప్రదర్శించే నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు కేస్లాగూడకు వచ్చేవారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పొందిన గౌరవానికి చిహ్నంగా ఐటీడీఏ అధికారులు కేస్లాగూడ ఆశ్రమ పాఠశాలను అప్పట్లో న్యానేశ్వర్ లోహకళ తయారీ కేంద్రంగా మార్చారు. గోండీ ఆదివాసీ డోక్రీ కళకు కొత్త శైలిని జోడించి, సృజ నాత్మక కళాఖండాలు సృష్టించిన న్యానేశ్వర్ చిరస్మరణీయుడని కవి, రచయిత జయధీర్ తిరుమలరావు సంతాపం తెలిపారు. ఆయన భార్యకు పింఛన్ఇవ్వాలని తెలంగాణ హస్తకళల అధ్యయన వేదిక అధ్యక్షుడు డాక్టర్ పృథ్వీరాజ్ కోరారు. -
ఉత్సవంతో వచ్చిన కరోనా: అటవీ గ్రామాల్లో కల్లోలం
ఆసిఫాబాద్: ఆరు ఊర్లను ఉప్పెనలా ముంచింది... గడపగడపకు రోగులు.. ప్రతి ఇల్లు ఒక క్వారంటైన్ మారింది.. కాటేసే రోగం దెబ్బకు నిద్రలేని రాత్రులు గడపుతున్నారు.. పల్లెలపై కరోనా పంజా విసిరింది. హోలీ సందర్భంగా నిర్వహించిన ఉత్సవం ఆ గ్రామాలను కరోనా కొంపముంచేసింది. ప్రస్తుతం ఆరు ఊర్లు కరోనాతో అల్లాడుతున్నాయి. ఒక్క ఉత్సవం ఆ అటవీ జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చేలా చేసింది. హోలీ సందర్భంగా గిరిజనులు లేంగి ఉత్సవాన్ని లింగపూర్ మండలంలోని మోతిపటార్లో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి దాదాపు ఐదు వేల మందికి పైగా గిరిజనులు హజరయ్యారు. మహారాష్ట్ర నుంచి కూడా వందల సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు. ఆ ఉత్సవాల్లో ఆడిపాడి సరదాగా గడిపారు. అయితే ఆ ఉత్సవంలోనే మహారాష్ట్ర నుంచి వచ్చిన వారి వలన కరోనా వ్యాపించింది. మహారాష్ట్ర వారితో సోకిన కరోనా ప్రస్తుతం ప్రతి ఊరికి పాకింది. కొత్తపల్లి గ్రామంలో 1,200 మంది ఉంటే వీరిలో 400 మంది కరోనా బారిన పడ్డారు. ఇంటికి ఒకరు కరోనాతో సతమతమవుతున్నారు. ఉత్సవంలో పాల్గొన్న మిగతా గ్రామాలు మోతిపటార్,లింగపూర్, మామిడిపల్లి, మరో రెండు గ్రామాల్లో ఇదే పరిస్థితి. పరీక్షలు నిర్వహిస్తున్నా కొద్ది కేసులు పెరుగుతున్నాయి. కరోనా విస్తరిస్తుండడంతో పల్లెవాసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కరోనా ఉగ్రరూపంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ గ్రామాల్లో ప్రత్యేకంగా క్యాంపులు వేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ తెలిన వారికి హోంక్వారంటైన్ చేస్తూ వైద్యం అందిస్తున్నారు. ప్రతి ఇల్లు హోంక్వారంటైన్ మారింది. ఒక మహిళ కరోనాతో ప్రాణాలు కోల్పోయింది కూడా. కరోనా ప్రస్తుతం ఇతర గ్రామాలకు విస్తరించకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వైద్యాధికారులు మకాం వేసి రోగులు కోలుకోవడానికి వైద్యం అందిస్తున్నారు. ఉత్సవం జరిగి 22 రోజులు దాటిన తర్వాత కేసులు పెరుగుతున్నాయి. ఈ గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నారు. గ్రామాల సరిహద్దులు మూసివేశారు. ఇతర ప్రాంతాల వాళ్లు ఈ గ్రామాలకు రాకుండా.. ఇక్కడి నుంచి ఇతర గ్రామాలకు వెళ్లకుండా రాకపోకలు నిషేధం విధించారు. నిత్యావసర వస్తువులు గ్రామస్తులకు అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ఉత్సవమే కరోనా విజృంభణకు కారణంగా తెలుస్తోంది. చదవండి: సంపూర్ణ లాక్డౌన్.. రేపటి నుంచి 1వరకు -
ఆసిఫాబాద్: పురాతన నిర్మాణాల కుల్చివేత పనుల్లో అపశ్రుతి
-
అదిలాబాద్: పెద్ద పులి వేటకు సిద్ధం
-
పెద్ద పులి వేటకు రంగం సిద్ధం
సాక్షి, అదిలాబాద్ : ఉమ్మడి జిల్లాలో పెద్ద పులుల దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా అసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం పెద్ద వాగు సమీపంలో దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేష్(22) అనే ఆదివాసీ యువకుడిపై పెద్ద పులి దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విఘ్నేష్ను నోట కరుచుకున్న పులి అడవిలోకి లాక్కెళ్లింది. పులి దాడిలో గిరిజన యువకుడు విఘ్నేష్ మృతి చెందగా మరో ఇద్దరు 12లోపు పిల్లలు నవీన్, శ్రీకాంత్ పులి నుంచి దూరంగా పరుగులు తీసి ప్రాణాలను దక్కించుకున్నారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధికారి శాంతారాం, కాగజ్నగర్ డీఎఫ్వో విజయ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దివిడ గ్రామాన్ని నేడు ఎస్పీ సత్యనారాయణ సందర్శించారు. మరోవైపు పెద్ద పులిని అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో నేడు పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేయనున్నారు. చదవండి: పులి దాడిలో యువకుడి మృతి ఇదిలా ఉండగా పెద్ద పులి దాడిలో మరణించిన విఘ్నేశ్ కుటుంబానికి ప్రభుత్వం 15లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు హరీష్ రావు డిమాండ్ చేశారు. దిగిడాలో పెద్ద పులి దాడిలో మరణించిన విఘ్నేష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరామర్శించారు. కాగా ఇప్పటి వరకు అదిలాబాద్లోని పలు మండలాల్లో గొర్రెలు, మేకలు వంటి పశువులపై పెద్ద పులు దాడి చేశాయి గానీ.. ఇప్పటి వరకు మనుషులపై దాడి చేసిన ఘటనలు అరుదు. అయితే మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రాణహిత నది దాడి పులులు వస్తుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా అందేరీ అభయారణ్యంలో 160 పులులు ఉండగా.. ఈ ఏడాది పులుల దాడిలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. తరుచూ పులులు దాడి చేస్తున్న క్రమంలో 50 పులులను ఇతర ప్రాంతాల్లోకి తరలించేందుకు మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తడొబా అభయారణ్యంలో ఆవాసాలు ఇరుకుగా మారడంతో తెలంగాణలోకి పులు అడుగు పెడుతున్నట్టు సమాచారం. తెలంగాణలోని కవ్వాల్ టైగర్ జోన్ విస్తరించి ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ అటవీ ప్రాంతాలు, ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాలు, బెల్లంపల్లి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ప్రాంతాల్లో సైతం పులుల సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. గూడెం గ్రామానికి మహారాష్ట్ర బార్డర్ ఒకటే కిలోమీటర్ దూరంలో ఉండగా, ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతం బార్డర్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాజాగా గిరిజన యువకుని మృతితో గిరిజనులు జనాల భయాందోళనకు గురవుతున్నారు. -
తప్పించుకున్న భాస్కర్?
-
తప్పించుకున్న భాస్కర్?
సాక్షి, మంచిర్యాల: మన్యంలో తుపాకీ మోత మోగింది. జిల్లాలోని కాగజ్నగర్ మండలం కదంబా అడవుల్లో ఎన్కౌంటర్ ఉలిక్కిపడేలా చేసింది. శనివారం రాత్రి పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మృతిచెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజులుగా జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రాణహిత సరిహద్దు మీదుగా ప్రత్యేక బలగాలతో కూంబింగ్ కొనసాగుతోంది. రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా అనువణువు గాలిస్తున్న పోలీసులు కాగజ్నగర్ మండలంలోని కదంబా అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసువర్గాలు అనుమానిస్తున్నాయి. కేబీఎం (కుమురం భీం, మంచిర్యాల) డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతోనే.. జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ముఖ్యంగా కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని మండలాలు, ప్రాణహిత నది తీరం వెంట డీఎస్పీ స్వామి ఆధ్వర్యంలో 8 గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. నేరుగా డీఎస్పీ స్వామి మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఘా ఉంచిన పోలీసులు కదంబా అడవుల్లో మావోయిస్టులు తిరుగుతుండగా ప్రణాళికతో ముందుకు సాగినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మాత్రమే చనిపోగా మరికొందరు తప్పించుకున్నట్లు సమాచారం. తప్పించుకున్న వారిలో భాస్కర్తో పాటు లింగయ్య, వర్గీస్, ప్రభాత్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా జిల్లాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం నెలకొంది. గురువారం రాత్రి ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడను పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. అక్కడ దళ సభ్యులు తృటిలో తప్పించుకున్నారు. దీంతో పోలీసులు అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేశారు. శుక్రవారం సైతం సమీప అటవీ ప్రాంతాలతో పాటు పత్తి చేలు, ఆసిఫాబాద్ ప్రధాన రోడ్డుపై గస్తీ కొనసాగింది. దళ సభ్యులు కదంబా అడవుల వైపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిఘా పెట్టిన పోలీసులు పక్కా ప్రణాళికతో ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం. తప్పించుకున్న భాస్కర్? కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కేబీఎం(కుమురం భీం, మంచిర్యాల) డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. భాస్కర్ నేతృత్వంలోని ఆరుగురు దళ సభ్యులు ఉమ్మడి జిల్లాలో కొద్దికాలంగా సంచరిస్తున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో వలస కూలీల రూపంలో జిల్లాలోకి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలు, ప్రాణహిత తీరం వెంట సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకనుగుణంగానే తిర్యాణి మండలం టోక్కిగూడ అడవుల్లో రెండుసార్లు తృటిలో తప్పించుకున్నారు. అప్పటి నుంచి నిఘా పెట్టిన పోలీసు బలగాలు మావోల సంచారంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు అనుమానం కలిగిన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మావోయిస్టులకు భోజనం పెట్టిన తిర్యాణి మండలానికి చెందిన ఓ వ్యక్తిని సైతం అరెస్టు చేసి ఆదిలాబాద్ జైల్లో ఉంచారు. రెండుసార్లు డీజీపీ పర్యటన.. కొద్ది రోజులుగా దళ సభ్యుల సంచరిస్తున్నారనే సమాచారం ఉన్న ప్రతిచోటా గస్తీని విస్తృతం చేస్తున్నారు. ఇటీవల దళ సభ్యుల నియంత్రణలో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. ఆగస్టులో ఓసారి పర్యటించగా, ఈనెల రెండో తేదీన ఆసిఫాబాద్కు వచ్చిన ఆయన నాలుగు రోజులు మకాం వేశారు. క్షేత్రస్థాయిలో పలు విషయాలు తెలుసుకుని మావోల సంచారం నేపథ్యంలో అనుసరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. కదంబా అడవుల్లో జరిగిన తాజా ఎన్కౌంటర్తో జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎప్పుడు ఎక్కడ తుపాకీ చప్పుళ్లు వినాల్సి వస్తుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. -
ఆసిఫాబాద్లో మావోల కదలికలు
సాక్షి, మంచిర్యాల: మావోయిస్టుల జాడ కోసం పోలీసులు కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాంగం వారి కదలికలపై నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. దళ సభ్యుల సంచారం అనుమానం ఉన్న ప్రతి ప్రాంతాన్నీ జల్లెడ పడుతున్నారు. గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడను పోలీసు బలగాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయితే వారికి దళ సభ్యులు కంటపడకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అనుమానిత ప్రాంతాలను తనిఖీలు చేశారు. శుక్రవారం సైతం సమీప అటవీ ప్రాంతాలతోపాటు పత్తి చేలు, ఆసిఫాబాద్ ప్రధాన రోడ్డుపై పోలీసుల గస్తీ కొనసాగింది. దీంతో సమీప గ్రామాల ప్రజల్లో తెలియని ఆందోళన మొదలైంది. పోలీసుల బందోబస్తుతో ఆయా ప్రాంతాల్లో హైఅలర్ట్ నెలకొంది. పోలీసులు అన్ని వైపులా నిఘా మరింత పెంచారు. ఆర్నెల్లుగా అలర్ట్ కేబీఎం (కుమురం భీం మంచిర్యాల) డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని ఐదుగురు దళ సభ్యులు ఉమ్మడి జిల్లాలో సంచరిస్తున్నట్లు పోలీసులవర్గాలు గుర్తించండం తెలిసిందే. ఆర్నెళ్లుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలు, ప్రాణహిత తీరం వెంట రాత్రింబవళ్లు కూంబింగ్, తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆసిఫాబాద్, తిర్యాణి, గుండాల, జన్నారం, ఊట్నూరు సమీప అటవీప్రాంతాలతోపాటు అనుమానిత ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తిర్యాణి మండలం టొక్కిగూడ అడవుల్లో కాల్పులు జరగగా.. తృటిలో మావోలు తప్పించుకున్నారు. అంతేకాక దళ సభ్యుల సంచరిస్తున్నారనే సమాచారం ఉన్న ప్రతిచోటా గస్తీని విస్తృతం చేస్తున్నారు. ఇటీవల దళ సభ్యుల నియంత్రణలో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి ఆసిఫాబాద్లో నాలుగు రోజులు మకాం వేశారు. క్షేత్రస్థాయిలో పలు విషయాలు తెలుసుకుని మావోల సంచారం నేపథ్యంలో అనుసరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాకు ఇన్చార్జి ఎస్పీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మావోల సంచారంపై ప్రధానంగా దృష్టి సారించారు. నిత్యం పోలీసు అధికారులకు ఆదేశాలు ఇస్తూ.. దళ సభ్యుల సమాచారం తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సమీప అటవీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. -
ఆసిఫాబాద్ జిల్లా: ముగిసిన డీజీపీ టూర్..
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో డీజీపీ మహేందర్రెడ్డి పర్యటన ఆదివారం ముగిసింది. ఐదు రోజుల పాటు డీజీపీ పర్యటన కొనసాగింది. నిన్నంతా ఎస్పీ క్యాంపు కార్యాలయంలోనే సమీక్షలు జరిపారు. జిల్లా కలెక్టర్ సందీప్ ఝా, ఇంచార్జీ ఎస్పీ సత్యనారాయణ, ఓఎస్డీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎఎస్పీ సుధీంద్రలతో పాటు ఇతర అధికారులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఛత్తీస్గడ్, మహారాష్ట్రల నుంచి తెలంగాణ లోకి మావోయిస్టుల కట్టడి విషయంలో పోలీసులకు డీజీపీ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఎస్ఐ మొదలుకొని జిల్లా ఎస్పీ వరకూ అందరి పనితీరును దగ్గరుండి క్షుణ్ణంగా ఫీల్డ్ లెవల్లో ఆయన పరిశీలించారు. ఓ డీజీపీ స్థాయి అధికారి మావోయిస్టు ప్రాబల్య మారుమూల ప్రాంతాల్లో రోజుల తరబడి ఉండటం అరుదు. డీజీపీ మకాంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అలర్ట్ అయింది. ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాల విస్తృత కూంబింగ్, అనుమానిత ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. (చదవండి: సీరియస్గా ఉన్న డీజీపీ, వారే టార్గెట్) ఈ నెల 2న హెలికాప్టర్ లో ఆసిఫాబాద్ కు వచ్చిన డీజీపీ, అదే రోజు ఏజెన్సీలో ఏరియల్ సర్వే నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా మావోయిస్టు ప్రాబల్య అటవీ ప్రాంతంలో ఉండే తిర్యాని మండల పోలీసు స్టేషన్ను డీజీపీ రాత్రి పూట ఆకస్మిక తనిఖీ చేశారు. మిగతా రోజుల్లో ఆసిఫాబాద్ కేంద్రంగానే ఉంటూ మావోయిస్టు సెర్చ్ ఆపరేషన్ల పర్యవేక్షణ, సమీక్షలు నిర్వహించారు. ఆరు నెలలుగా ఆసిఫాబాద్ ఏజెన్సీని టార్గెట్ చేసుకొని కేబీఎం (కొమరం భీం మంచిర్యాల) ఏరియా కార్యదర్శి మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ దళం సంచరించడం తెలిసిందే. డివిజన్, ఏరియా కమిటీల పునర్నిర్మాణం, ఆదివాసీ యువకులే లక్ష్యంగా రిక్రూట్ మెంట్ జరుగుతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. జూలై 13, 18 తేదీల్లో తిర్యాని మండలం మంగి, తొక్కిగూడ అడవుల్లో ఎదురు కాల్పులు జరగగా, తృటిలో మావోయిస్టు అడెళ్లు దళం తప్పించుకుంది. మావోయిస్టుల కార్యకలాపాలను సీరియస్గా తీసుకున్న పోలీసు బాస్.. ఈ క్రమంలోనే రోజుల తరబడి పర్యటన చేసినట్లు తెలిసింది. క్షేత్ర స్థాయిలోనే ఉంటూ పోలీసులను అప్రమత్తంగా ఉంచడమే లక్ష్యంగా పర్యటన సాగింది. (చదవండి: మావోయిస్టు సుదర్శన్ లొంగిపోతారా..?) -
వేరే వార్డుకు తరలించకపోతే...
-
సిర్పూర్ పేపర్మిల్లులో ఘోర ప్రమాదం
-
సిర్పూర్ పేపర్మిల్లులో ప్రమాదం
కొమురం భీం (ఆసిఫాబాద్): జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నూతన బాయిలర్ నిర్మాణ కోసం పిల్లర్లు తవ్వుతున్న ప్రాంతంలో మట్టి పెళ్లలు కుప్పకులాయి. ఒక్కసారిగా మట్టిపెళ్లలు పడటంతో కూలీలు ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందగా.. గాయపడ్డ నలుగురు కూలీలను చికిత్స కోసం మంచిర్యాల, కరీంనగర్ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం, పోలీసుల సాయంతో కూలీలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో స్పామ్ కార్మికులు అంతా సురక్షితంగా ఉన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న కూలీలు బాయిలర్ నిర్మాణ పనులకు వచ్చిన వారిగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మంచిగా చెప్తే వినరురా మీరు : మహిళలు
సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కెరమెరిలో మండలంలో బెల్టు షాపు నిర్వాహకుడిపై ఆదివాసీ మహిళలు బుధవారం దాడి చేశారు. బెల్టు షాపు నిర్వహించవద్దని గతంలోనే మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. అయినా తీరు మారకపోవడంతో ఆగ్రహించిన మహిళలు నిర్వాహకుడిని చితకబాదారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఏజెన్సీలో సంపూర్ణ మద్య నిషేధం అమలవుతుండగా, గిరిజన సంఘాల తీర్మానం మేరకు ఏజెన్సీ ప్రాంతంలోని వైన్షాపులకు అధికారులు టెండర్లు పిలవలేదు. దీంతో ఏజెన్సీలో వైన్షాపులు లేవు, మద్యం అమ్మకాలు లేవు. బెల్టుషాపులు కూడా ఉండొద్దంటూ ఆదివాసీ మహిళలు ఊరూరా తిరిగి షాపులలో ఉన్న మద్యం సీసాలను అప్పుడే ధ్వంసం చేశారు. సంఘాల తీర్మానాన్ని ఎవరైనా అతిక్రమిస్తే పది వేల రూపాయల జరిమానాతో పాటు దుకాణాల మీద దాడులు తప్పవని గతంలోనే హెచ్చరించారు. -
బెల్ట్షాపు నిర్వాహకుడిపై మహిళల దాడి
-
దారుణం : భార్య చేతులు కోసిన ఎంపీడీవో
సాక్షి, ఆసిఫాబాద్ : జిల్లాలోని సిర్పూర్ (టీ) ఎంపీడీవోపై అతని భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన భర్త జగదీష్ అనిల్కుమార్ అదనపు కట్నం వేధిస్తున్నాడని ఆమె జిల్లా ఎస్పీ మల్లారెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిత్యం తాగొచ్చి శారీరకంగా వేధిస్తున్నాడని వాపోయారు. శుక్రవారం కూడా మద్యం సేవించి తనపై కత్తితో దాడిచేసినట్టు బాధితురాలు మేరీ కుమారి కన్నీటి పర్యంతమయ్యారు. రెండు చేతులపై కత్తి గాయాలను మీడియాకు చూపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన జగదీశ్ అనిల్కుమార్, గుంటూరు వాసి మేరీకుమారితో 2018లో వివాహమైంది. ప్రస్తుతం అనిల్కుమార్ కుమురం భీ అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) ఎంపీడీవోగా పనిచేస్తున్నాడు. కాగజ్నగర్లోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసముంటున్నారు. అదనపు కట్నం కోసం గతంలోనూ తనపై హత్యయత్నం జరిగిందని మేరీకుమారి చెప్పారు. -
‘సమత’ హత్యాచార కేసులో ప్రత్యేక కోర్టు
సాక్షి, హైదరాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హత్యాచారానికి గురైన ‘సమత’కేసు విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తూ న్యాయ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయ శాఖ కార్యదర్శి ఎ.సంతోష్రెడ్డి పేరిట జీవో జారీ అయింది. ఐదవ అదనపు సెషన్స్, ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమత కేసులో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ఈ నెల 9న ప్రభుత్వం హైకోర్టును కోరిన విషయం తెలిసిందే. ఈ అభ్యర్థనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ ఆమోదం తెలిపారు. కాగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పీఎస్ లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమత అనే ఆదివాసీ యువతిని షేక్బాబు, షేక్ షాబుద్దీన్, మక్లూ హత్యాచారం చేశారని కేసు నమోదైన విషయం తెలిసిందే. త్వరగా శిక్ష పడేలా చర్యలు: ఇంద్రకరణ్ సమత కేసులో ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అటవీ, న్యాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. -
'సమత' పిల్లలకు ఉచిత విద్య
సాక్షి, ఆసిఫాబాద్: గత నెల 24న లింగాపూర్ మండలంలో అత్యాచారం, హత్యకు గురైన దళిత మహిళ సమత ఇద్దరు పిల్లలకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశం లభించింది. లింగాపూర్ పోలీసులు మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని పాఠశాలలో వారిని చేర్పించారు. సమత పిల్లలకు కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలని ప్రభుత్వమిచ్చిన ఆదేశాల మేరకు.. బాధితురాలి పిల్లలు తగిన విద్యను అభ్యసించేందుకు వీలుగా పోలీసులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. అంతేకాక పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఆమె పిల్లలకు రూ. 10 వేల నగదు ఇచ్చి ఆర్థిక సహాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం నుంచి బతుకుదెరువు కోసం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్కు వలస వెళ్లిన ఒక దళిత మహిళపై హత్యాచారం జరిగింది. బుగ్గలు అమ్ముకుని జీవనం సాగించే బాధితురాలు సమత ఎప్పటిలానే బుగ్గలు అమ్ముకునేందుకు బయల్దేరి వెళ్లి.. తిరిగి శవమై కనిపించింది. ఆమెపై ఒంటిపై గాయాలు ఉండడం.. అనుమానస్పదస్థితిలో మృతి చెందడం, లైంగికదాడి చేయడంతో.. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి: ‘సమత’గా పేరు మార్పు: ఎస్పీ దారుణం: వివాహితపై అత్యాచారం.. హత్య -
‘లక్ష్మి’ నిందితులును ఉరితీయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): లింగాపూర్లో మహిళపై, వరంగల్లో యువతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవా రం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ రియాజ్ అలీకి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలన్నారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఒక్కొకరికి రూ.25లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి వాటిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు మల్లయ్య, రాజేష్, దుర్గం రవీందర్, ఉపేందర్, పోశం, సోమయ్య, దేవాజీ, పద్మ, గోపాలక్రిష్ణ, మల్లేష్, శివాజీ, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు. చదవండి: వివాహితపై అత్యాచారం.. హత్య -
చేపల వలకు చిక్కి.. జీవచ్ఛవాలుగా మారి..
చింతలమానెపల్లి (సిర్పూర్): ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి వద్ద ప్రాణహిత నదిలో జరిగిన పడవ ప్రమాదం విషాదం మిగిల్చింది. శనివారం గల్లంతైన బీట్ అధికారులు మంజం బాలకృష్ణ ((31), బదావత్ సురేష్ నాయక్ (35)ల మృతదేహాలు సోమవారం లభ్యమ య్యాయి. చేపల వలకు చిక్కి జీవచ్ఛవాలుగా కనిపించాయి. ఉదయం నుంచే చింతలమానెపల్లి, మహారాష్ట్ర పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈతగాళ్లకు ఘటనా స్థలానికి కొద్ది దూరంలో నదిలో చేపల వేటకు ఏర్పాటు చేసిన వలలో మృతదేహాలు చిక్కుకుని కనిపించాయి. ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) టీం ఇన్స్పెక్టర్ పవన్ ఆధ్వర్యంలో మృతదేహాలను బయటకు తీశారు. కాగా, ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మృతి చెందడం పట్ల అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన ఛాట్ పూజలు
-
మాలీలను ఎస్టీ జాబితాలో వెంటనే చేర్చాలి
సాక్షి, వాంకిడి(ఆసిఫాబాద్): మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి విస్మరించారని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే తెలిపారు. మాలీలను ఎస్టీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న మహాపాదయాత్ర సోమవారం వాంకిడికి చేరుకుంది. ఈ సందర్భంగా వాంకిడి మండల కేంద్రంలోని జ్యోతిబా ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాగానే మాలీలను ఎస్టీలో కలిపే బిల్లుపై తొలి సంతకం పెడతామని సీఎం కేసీఆర్ 2009లో కాగజ్నగర్లో జరిగిన ఉద్యమ సభలో ప్రకటించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక చెల్లప్ప కమిషన్ ద్వారా సర్వే చేయించేందుకు జాప్యం ప్రదర్శిస్తూ ద్వంద వైఖరీని అవలంభిస్తున్నారని మండిపడ్డారు. మాలీల పట్ల చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. మాలీల బలనిరూపణకు బెజ్జూర్ నుంచి జైనూర్ వరకూ దాదాపు 150 కిలోమీటర్ల మేర మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికైనా మాలీల స్థితిగతులపై చెల్లప్ప కమిషన్ ద్వారా సర్వే చేయించి కేంద్రానికి రిపోర్ట్ పంపాలని డిమాండ్ చేశారు. లేకపోతే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో మాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాలీలకు ఎస్టీ హోదా కల్పన కమిటీ వ్యవస్థాపకుడు నారాయణ వాడై, జిల్లా అధ్యక్షుడు నాగోసె శంకర్, డివిజన్ అధ్యక్షుడు మెంగాజీ, మండల అధ్యక్షుడు నారాయణ, తదితరులు పాల్గొన్నారు. 11న మాలీల మహాసభ.. జైనూర్(ఆసిఫాబాద్): ఈనెల 11న జైనూర్లో నిర్వహించే మాలీల మహాసభను విజయవంతం చేయాలని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే కోరారు. జైనూర్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 2న బెజ్జూర్ నుంచి జైనూర్ వరకూ మహాపాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. మహాసభలో మాలీల సమస్యలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా నుంచి మాలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, నాగోసే, ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి నందకుమార లేండుగురే, జైనూర్ మండల అధ్యక్షుడు హుస్సేన్ పేట్కులే, నాయకులు జేంగటే రాందాస్, వాటగురే హరి, దీపక్, శివాజీ, నానేశ్వర్ తదితరులున్నారు. -
ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుతో తగ్గిన దూరభారం
సాక్షి, ఆసిఫాబాద్: దేశంలోనే అత్యంత వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఆవిర్భావించి ఈ దసరాతో మూడేళ్లు కావస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలను వేరు చేస్తూ పోరాటయోధుడు కుమురం భీం పేరు మీదుగా కొత్త జిలాను ఏర్పాటు చేశారు. అప్పటి వరకూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతవాసులకు కొత్త జిల్లా ఏర్పాటుతో పాలన మరింత చేరువైంది. ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోయినా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలో మాత్రం బీజం పడింది. కుమురం భీం జిల్లా ఆవిర్భావించడంతో ప్ర ధానంగా దూర భా రం సమస్య తీరినట్లయింది. మారుమూల ప్రాంతమైన బెజ్జూరు నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఒక రోజు ముందు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లా ఏర్పాటుతో ఈ తిప్పలు తప్పాయి. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చిట్టచివరి ప్రాంతాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ తక్కువగా ఉండేది. ప్రస్తుతం రెండు నియోజవర్గాలతో కలెక్టర్, ఎస్పీ నేరుగా మారుమూల ప్రాంతాలకు వెళ్లడంతో పాటు పర్యవేక్షణ పెరిగింది. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం.. కొత్త జిల్లాల ఏర్పాటుతో స్థానికులకే ఉద్యోగాల్లో 90 శాతం అవకాశం దక్కింది. గత మూడేళ్లుగా జిల్లాలో జరిగిన కానిస్టేబుల్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, ఇతర వివిధ శాఖల్లో తాత్కాలిక పోస్టుల్లోనూ జిల్లాలో స్థానిక నిరుద్యోగ యువతకే అవకాశం కలిగింది. ఇక జిల్లా ఏర్పాటుతో భవిష్యత్లోనూ స్థానిక నిరుద్యోగులకు ఈ రిజర్వేషన్ పద్ధతి కొనసాగనుంది. అభివృద్ధికి అడుగులు.. కొత్త జిల్లా ఏర్పాటుతో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది. జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత కొత్తగా లింగాపూర్, చింతలమానెపల్లి, పెంచికల్పేట మూడు మండలాలు ఏర్పడ్డాయి. చిన్న మండలాలతో పాలన మరింత సులభమవుతోంది. అలాగే కొత్తగా తహసీల్, ఎంపీడీవో, పోలీసు స్టేషన్, తదితర మండల కార్యాలయాలన్నీ రావడంతో పాలనలో ఫోకస్ పెరిగింది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ సమీకృత భవనాల నిర్మాణాలు, పోలీసు కార్యాలయాల నిర్మాణాలు మొదలయ్యాయి. జిల్లా కేంద్రం కావడంతో ప్రతి శాఖకు సంబందించిన కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. వైద్య సేవల్లో సామాజిక ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయడం, మహిళల భద్రత కోస సఖీ కేంద్రం తదితర శాఖల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. పరిపాలనపై మరింత పట్టు పెరిగింది. సొంత జిల్లాల్లోనే బదిలీలకు ఆస్కారమేర్పడింది. కేంద్రం కొత్త జిల్లాల ప్రతిపాదికనే ఇటీవల నిధులు మంజూరుకు సుముఖం తెలపడంతో ఇక నుంచి మరింత ప్రగతి ఆశించవచ్చు. అరకొర వసతులు.. గ్రామ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు, కార్యాలయాలకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ప్రాంతం కావడంతో అధికారులకు సరైన మౌలిక వసతులు లేక ఇక్కట్లకు గురికావాల్సి వస్తోంది. జిల్లా ఏర్పడిన నుంచి అరకొర సిబ్బందితోనే పాలన సాగుతోంది. ఇప్పటికీ అన్ని శాఖల్లోనూ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్నతాధికారులకు జిల్లా కేంద్రంలో ఆవాస యోగ్యం లేకపోవడంతో కాగజ్నగర్, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. మిగతా ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ హెచ్ఆర్ఏ తక్కువగా ఉండడంతో కొందరు ఉద్యోగులు ఇక్కడి నుంచి బదిలీ చేయించుకుని వెళ్తున్నారు. ప్రధానంగా గడిచిన మూడేళ్లలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి రాలేదు. డీఎంహెచ్వో కార్యాలయంతో పాటు చాలా వరకూ కార్యాలయాలు ఇరుకు గదుల్లో, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో రోడ్డు డివైడర్లు నిర్మించారు. ఏజెన్సీలో నేటికీ అనేక గ్రామాలకు సరైన రోడ్డు వసతి లేదు. పలు సమస్యలు ఉన్నప్పటికీ జిల్లా ఏర్పాటుతో ఎంతో మేలు జరిగినట్లయిందని ప్రజలు తెలుపుతున్నారు. విద్యా వ్యవస్థ మెరుగుపడాలి కొత్త జిల్లా ఏర్పాటుతో జిల్లాకు కొన్ని గురుకులాలు మంజూరయ్యాయి. ఇది స్వాగతించాల్సిన విషయమే అయినా జిల్లాలో ప్రభుత్వ విద్యావ్యవస్థ మరింత మెరుగుపడాల్సి ఉంది. జిల్లా కేంద్రంలో ప్ర భుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలు ఏర్పా టు చేయాలి. గిరిజన విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. – దుర్గం రవీందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు నూతన జిల్లాగా ఏర్పడినా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు దూరభారంతో ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం దూరభారం తగ్గినా చాలా వరకూ పనులు జరగడం లేదు. కాగజ్నగర్ను డివిజన్గా ఏర్పాటు చేసినా గతంలో ఉన్న పరిస్థితి మాత్రమే కనిపిస్తోంది. అనేక సమస్యలు పరిష్కారానికి నోచడం లేదు. – సిందం శ్రీనివాస్, కాగజ్నగర్ పరిపాలన సౌలభ్యం పెరిగింది కుమురం భీం జిల్లా ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం పెరిగింది. ప్రభుత్వ శాఖలు, అధికారులు అందుబాటులోకి వచ్చారు. గతంలో ఆదిలాబాద్కు వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్ల వెళ్లాల్సి వచ్చేది. దీంతో చాలా వ్యయప్రయాసలకు గురికావాల్సి వచ్చేంది. కాని కుమురం భీం జిల్లా ఏర్పాటుతో చాలా వరకూ పరిస్థితి మారింది. శాఖల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ సైతం పెరిగింది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. – బొమ్మినేని శ్రీధర్, రెబ్బెన అభివృద్ధికి బాటలు పడ్డాయి.. నూతనంగా జిల్లా, మండలాల ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు పడ్డాయి. గతంలో జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో ఇబ్బందులకు గురయ్యాం. నూతన మండలాల ఏర్పాటుతో రవాణా ఇబ్బందులు తీరాయి. పరిపాలన సౌలభ్యంగా మారింది. ప్రభుత్వపరమైన పథకాలు, కార్యక్రమాల సమాచారం తెలుసుకుకోవడం నూతన మండలాలతో అందుబాటులోకి వచ్చింది. – సయ్యద్ అజీమ్, చింతలమానెపల్లి సేవలు అందుబాటులోకి చింతలమానెపల్లి మండలంగా ఏర్పడక ముందు గూడెం, డబ్బా, ఖర్జెల్లి, దిందా, అడెపల్లి, కేతిని, రుద్రాపూర్ గ్రామాలకు వెళ్లాలంటే సుమారు 30 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేంది. చింతలమానెపల్లి కొత్త మండలంగా ఏర్పాటు కావడంతో చాలా వరకూ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు దగ్గరనే ఉన్నాయి. నూతన పంచాయతీలతో సౌలభ్యంగా ఉంది. మండల కేంద్రంలో అన్ని కార్యాలయాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజలకు మెరుగైన సేవలందించాలి. – కుమ్మరి హరీశ్, చింతలమానెపల్లి -
కబ్జాలకు ‘ఖద్దరు’ నీడ
సాక్షి, ఆసిఫాబాద్: రాజకీయ అండతో సర్సిల్క్ భూముల్లో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. సర్సిల్క్ మిల్లులో పనిచేయని కార్మికేతరులు దర్జాగా కబ్జాలు చేస్తున్నారు. చట్టబద్దంగా భూములు కొనుగోలు చేసిన వారిని బెదిరించడం పరి పాటిగా మారింది. కాగజ్నగర్ పట్టణానికి ఆనుకుని కోసిని గ్రామ పరిధి సర్సిల్క్ మిల్లు భూ ములను చట్టబద్దంగా కొనుగోలు చేసిన చోట్ల ఆక్రమణలు చేయడమే కాక ఖాళీ చేయడానికి స సేమిరా అంటున్నారు. స్థానికంగా ఉన్న నాయకులను కబ్జాదారులు వాడుకోవడం గమనా ర్హం. ఇప్పటికే ఓ ప్రజాప్రతినిధి కబ్జాదారులకు అండగా ఉండగా, ఆయన సన్నిహితులు, అనుచరులు, సమీప బంధువులు యథేచ్ఛగా మిల్లు భూములను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించారు. అలాగే కబ్జాల్లో ఉన్న భూములు తమ సొంత భూములగా పేర్కొం టూ ఇతరులకు విక్రయించడం విశేషం. ఇటీవల దాడా నగర్లో అధికారులు అక్రమ నిర్మాణంగా పరిగణిస్తూ కట్టడాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. తనకు వాటా ఇవ్వలేదని.. కాగజ్నగర్ పట్టణంలో నాలుగు దశాబ్దాల క్రితం సర్సిల్క్ మిల్లు ఓ వెలుగు వెలిగింది. మిల్లు మూత పడిన తర్వాత భూములు రానురానూ కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుపోయాయి. ఇందులో కొందరు బలహీనవర్గాలు ఉండగా అధికంగా ఓ ప్రజాప్రతినిధి సన్నిహితులు, అనుచరులు ఉండడం గమనార్హం. తాను అడిగిన రోడ్డు పక్కన ఉన్న పదెకరాల భూమి దక్కకపోవడంతో తెర వెనక ఉండి తతాంగం నడిపిస్తున్నారు. మొత్తం భూములను చట్టబద్దంగా కొనుగోలు చేసిన వ్యక్తులకు చెందకుండా అడ్డు తగులుతున్నారు. ఈ మేరకు భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తం 808 ఎకరాలు.. సర్సిల్క్ భూములు మొత్తం 808 ఎకరాల వరకూ ఉంది. ఇందులో 1985లో మిల్లు మూత పడే నాటికే కొంత ఆక్రమణకు గురైంది. ఆ తర్వాత 1991లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు అధికారికంగా లిక్విడేటర్ను నియమించి మిల్లు ఆస్తులను, అప్పులను లెక్కగట్టి యాక్షన్కు పిలిచింది. ఈ యాక్షన్లో మొత్తం 14 బిడ్డింగ్ వేయగా ఇందులో మూడో బిడ్ వేసిన బి. వెంకట నారాయణరావు రూ.3 కోట్లతో అధిక భాగం 182 ఎకరాలు యాక్షన్ చేశారు. ఇందులో 156 ఎకరాలు అధికారికంగా ఇచ్చారు. అయితే అప్పటికే యాక్షన్లో కొనుగోలు చేసిన భూమి కొంత ఆక్రమణ గురవడం, నిర్మాణాలు చేపట్టడంతో వీటన్నింటిని ఖాళీ చేయించి కొనుగోలు చేసిన భూమి మొత్తం ఇప్పిస్తామని యాక్షన్ సమయంలో చెప్పారు. అప్పటి నుంచి రానురానూ స్థానిక నాయకుల అండతో కొంత మంది ఏకంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం, కబ్జాలు పెరిగిపోయాయి. దీంతో 2011లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమికి హద్దులు చూపించాల్సి ఉంది. అయినా ఇప్పటికీ హద్దులు నిర్ణయించేలా అధికార యంత్రాంగం చొరవ తీసుకోవడం లేదు. దీనిపై జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ అందరి అధికారులను కలసి వినతిపత్రాలు అందించినా ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. ఇక చేసేదేమీ లేక మళ్లీ కోర్టునే ఆశ్రయించడంతో ఇటీవల కొన్ని అక్రమ కట్టడాలను కూల్చేందుకు అధికారులు అడుగు ముందుకేశారు. అయితే అధికారులు అక్రమ కట్టడాలను తొలగించేందుకు పూనుకుంటున్న సందర్భంలో అక్కడి నాయకులు అడ్డుతగలడంతో భూమి హద్దులు తేల్చడంలో జాప్యం చేస్తున్నారు. 2014లో సర్వే చేసేందుకు రూ.14లక్షలు చెల్లించినప్పటకీ అక్కడి స్థానిక నాయకుడికి భయపడి సర్వే అధికారులు సైతం వెనకడుగు వేస్తున్నట్లు వెంకట నారాయణరావు వాపోతున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిని వదలనని పేర్కొంటు న్నారు. రాజకీయ అండతో అన్యాక్రాంతం చేయాలని ఓ ప్రజాప్రతినిధి కక్షగట్టారని వివరిస్తున్నారు. ఇటీవల హైకోర్టు నుంచి కూడా యాక్షన్లో కొనుగోలు చేసిన వారికి భూమి సరిహద్దులు చూపి ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. -
విస్తరిస్తున్న కుష్ఠు
సాక్షి, ఆసిఫాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుష్ఠు వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. కుష్ఠు వ్యాధిగ్రస్తులు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో కుమురం భీం రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. దీనికి తోడు జిల్లాలో క్షయ వ్యాధి సైతం ఆందోళనకర స్థాయిలో ఉంది. ఈ అసంక్రమిక వ్యాధులను గు ర్తించిన ప్రభుత్వం నివారణ దిశగా కృషి చేస్తోంది. కుష్ఠు, క్షయ వ్యాధిగ్రస్తులకు సరైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నేటి నుంచి సెప్టెంబర్ 13 వరకూ వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే శిక్షణ, ఇతర ఏర్పాట్లను పూర్తి చేశారు. గతంతో పోల్చితే క్షయ, కుష్టు వ్యాధిగ్రస్తుల సంఖ్య జిల్లాలో పెరుగుతోంది. దీని నివారణకు ప్రభుత్వం ఇప్పటికే పలురకాల కార్యక్రమాలను చేపట్టింది. ఖరీదైన మందులను కూడా రోగులకు అందిస్తుంది. కొందరు మధ్యలోనే మందులను మానేస్తుండడంతో వ్యాధి తీవ్రమవుతుందని జిల్లా అధికారులు పేర్కొం టున్నారు. మధ్యలో మానేసిన వారిని గుర్తించి తిరిగి మందులు వాడేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రధానంగా ప్రవేట్ ఆసుపత్రుల్లో చికి త్స పొందుతున్న వారి వివరాలను తెలియజేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రవేట్ వైద్యులు పట్టించుకోవడం లేదు. తాజాగా నిర్వహించే సర్వే ద్వారా జిల్లాలో వ్యాధిగ్రస్తుల సంఖ్య పూ ర్తిగా తెలియనుంది. గతంలో నిర్వహించిన లెక్క ల ప్రకారం జిల్లాలో 130 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు, 690 మంది క్షయ రోగులు ఉన్నారు. సర్వేకు 760 బృందాలు.. ఇంటింటా సర్వే నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 760 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక ఆశా కార్యకర్తతో పాటు స్వచ్ఛంద సంస్థ కార్యకర్త(పురుషుడు)తో ఒక బృందాన్ని ఏర్పాటు చేశా రు. వీరు ప్రతిరోజూ ఉదయం 6:30 గంటల నుంచి 9:30 గంటల వరకూ తమ పరిధిలో ఉం డే 20 నివాసాలను సందర్శిస్తారు. ఆ నివాసాల్లో ఉన్నవారి పిల్లలు మెదలు వృద్ధుల వరకూ అం దరినీ క్షుణ్ణంగా పరీక్షించి వివరాలు సేకరిస్తారు .జిల్లాలో ఉన్న 760 ఆశా కార్యకర్తలు, 114 ఏ ఎ న్ఎంలు, 35 సూపర్వైజర్లు ఈ సర్వేలో భాగసా ట్వ టములవుతున్నారు. బృందా లను పెంచే ఆస్కారముందని అధికారులు చె బుతున్నారు. సర్వే సిబ్బందికి ఒక్కొక్కరికీ రోజు కు రూ.75 చొప్పున పారితోషకం అందించనున్నారు. ఎలా పరీక్షిస్తారంటే.. మొదట కుటుంబ సభ్యుల వివరాలు సేకరి స్తారు. ఆశా కార్యకర్త మహిళను, స్వచ్ఛంద కా ర్యకర్త పురుషుల దేహాన్ని పరీక్షిస్తారు. ఎక్కడైనా మచ్చలు ఉన్నాయా అనేది చూస్తారు. ఒకవేళ కు ష్ఠు ప్రాథమిక లక్షణాలైన తెల్లమచ్చలు వీపుపై ఉంటే తెలుసుకోవడం కష్టం. ఈ మేరకు నిశీతంగా పరిశీలిస్తారు. మచ్చలు ఉన్నట్లు గుర్తిస్తే వివరాలను సదరు పీహెచ్సీకి నివేదిస్తారు. వైద్యులు మరోసారి పరీక్షించి నిర్దారణ చేస్తే చికిత్స ప్రారంభిస్తారు. ఇక క్షయ వ్యాధి లక్షణాలపై ఆరా తీస్తారు. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం జ్వరం వంటి లక్షణాలు ఉంటే తెమడ తీయడానికి ఒక డబ్బాను ఇసా ్తరు. అందులో సేకరించిన తెమడను క్షయ నియంత్రణ విభాగానికి చెందిన ల్యాబ్లో పరీక్షస్తారు. పెరుగుతున్న కేసులు.. ఇటీవల కాలంలో క్షయ కేసులు పెరుగుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. గతంతో పోల్చితే నిర్దేశించిన లక్ష్యం మేరకు పరీక్షలు నిర్వహిస్తుండగా కేసులు బయటపడుతున్నాయి. గాలి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కుష్ఠుతో పాటు క్షయ రోగుల లెక్క తెలిస్తే చికిత్స అందించవచ్చని అధికారులు తెలుపుతున్నారు. రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, దగ్గినప్పుడు రక్తంతో కూడిన తెమడ రావడం క్షయ వ్యాధి లక్షణాలు. వీటికి సంబంధించిన లక్షణాలు బయటపడితే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మందులు తీసుకోవచ్చు. వైద్యుల సలహా మేరకు రోజూ మందులతో పాటు పోషకాహారం తీసుకోవాలి. ఇంటింటా సర్వే నిర్వహిస్తాం నేటి నుంచి సెప్టెంబర్ 13 వరకూ ప్రతి ఇంటా సర్వే నిర్వహిస్తాం. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. కుష్ఠు, క్షయ వ్యాధిపై సర్వే చేయాలని తెలిపాం. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల ఆధ్వర్యంలో బృందాలు సర్వే చేస్తాయి. ఈ బృందాలను పర్యవేక్షించడానికి సూపర్వైజర్లు ఉంటారు. చికిత్సతో నయమయ్యో వ్యాధులు, అవగాహణలోపంతో బయటపడడం లేదు. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. – కుమురం బాలు, డీఎంహెచ్వో -
వీఆర్ఏపై మహిళా చెప్పుతో దాడి
సాక్షి, ఆసిఫాబాద్ : తమకు వారసత్వంగా రావాల్సిన భూమిని రెవెన్యూ అధికారులు తమ బంధువులకు పట్టాచేశారని, తమకు న్యాయం చేయాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని ఆగ్రహించిన మహిళా రైతు ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలోనే వీఆర్ఏపై చెప్పుతో దాడి చేసిన సంఘటన మంగళవారం కుమురంభీం జిల్లాలోని రెబ్బెన మండలంలో చోటు చేసుకుంది. బాధిత రైతు కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... రెబ్బెన మండలంలోని కిష్టాపూర్కు చెందిన దుర్గం సాంబయ్య తండ్రికి సుమారు 42 ఎకరాలు భూమి ఉంది. వారసత్వంగా సాంబయ్యకు అందులో సగభాగం రావాల్సి ఉంది. రెవెన్యూ అధికారుల అండదండలతో దుర్గం ప్రభాకర్, మల్లయ్య పట్టాలు చేయించుకున్నారని ఆరోపించింది. దీంతో తమకు న్యాయంగా రావాల్సిన భూమి తమకు అప్పగించాలని కోరుతూ సాంబయ్య కుటుంబ సభ్యులు రెండు సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇదే సమస్యను పరిష్కరించాలని కోరుతూ గతంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఎంతకీ తమకు న్యాయం జరగకపోవటంతో గత నెల 29న సాంబయ్య కుమారుడు దుర్గం శ్రీనివాస్ ఏకంగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి సైతం ప్రయత్నించాడు. దీంతో ఆర్డీవో సిడాం దత్తు వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చిన నేటికి పరిష్కారం లభించలేదు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన సాంబయ్య కుటుంబ సభ్యులు దుర్గం శ్రీనివాస్, మల్లయ్య, పోషయ్య, దుర్గం లక్ష్మి, దుర్గం జమున, దుర్గం అమృతలు వీఆర్వో ఉమ్లాల్తో వాగ్వివాదానికి దిగారు. ఆగ్రహానికిలోనైన దుర్గం లక్ష్మి వీఆర్ఏ జానయ్యపై చెప్పుతో దాడికి పాల్పడింది. విషయాన్ని తెలుసుకున్న ఎస్సై రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అకారణంగా దాడికి పాల్పడ్డారు: వీఆర్ఏ దుర్గం సాంబయ్య భూమి సమస్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ అకారణంగా దుర్గం లక్ష్మి తహసీల్దార్ కార్యాలయంలోనే చెప్పుతో దాడి చేసింది. 1993లో మల్లయ్య, ప్రభాకర్కు పట్టాలు అయ్యాయి. నేనేమో 2008లో ఉద్యోగంలో చేరాను. నేనే పట్టాలు చేయించానని అకారణంగా నాపై దాడి చేసి అక్కడే ఉన్న వీఆర్వో ఉమ్లాల్పై సైతం దాడి చేసేందుకు ప్రయత్నించారు. -
కలి‘విడి’గా.. ‘కారు’ ప్రచారం!
సాక్షి, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ టీఆర్ఎస్లో అంతర్గతంగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. నియోజకవర్గ పరిధిలో ఇన్నాళ్లూ పార్టీలో ఒకే వర్గం ఉండగా ఇటీవల జరిగిన పరిణామాలతో పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. బయటికి పెద్దగా కనిపించకపోయినా లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇక్కడ టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం శైలిని పరిశీలిస్తే అదే విషయం అవగతమవుతోంది. ఇందులో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు వర్గం ఒకటి కాగా, మరొకటి మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ వర్గం. టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే సక్కు పార్టీ మారిన సందర్భంలో మాజీ ఎమ్మెల్యేతోపాటు ఇతర నాయకులను కలుపుకుని పార్టీ కోసం పని చేయాలని ఇరువర్గాలకు అధిష్టానం సూచించినప్పటికీ వారి వర్గాల్లో మాత్రం సఖ్యత కుదరడం లేదు. పార్టీ లోక్సభ ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్ గెలుపు కోసం ఇరు వర్గాలు చెమటోడుస్తున్నా.. అదీ వేర్వేరుగానే! కలసికట్టుగా కాకుండా ఎవరికి పట్టున్న ప్రాంతాల్లో వారే పర్యటిస్తున్నారు.. ప్రచారం చేస్తున్నారు. కుదరని సఖ్యత మొన్నటి వరకు వేర్వేరు పార్టీల్లో ఉన్న ఇరువర్గాలు అసెంబ్లీ ఎన్నికల్లో తమ తమ నాయకుల్ని గెలిపించుకునే క్రమంలో ఢీ అంటే ఢీ అనుకున్నాయి. ఇదే తరహాలో కింది స్థాయి నాయకుల్లోనూ వైరం తారాస్థాయిలో ఉండేది. నాయకుల మధ్య వైరం ఉండటంతో ఓ వర్గంపై మరోవర్గంపై రాజకీయంగా పై చేయి సాధించేందుకు కనిపించని యుద్ధం నడిచేది. అయితే, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సక్కు గులాబీ గూటికి చేరుకోవడంతో కోవ లక్ష్మీ వర్గం కొంత ఇబ్బంది పడింది. కానీ, అధిష్టానం ఆదేశాల అనుగుణంగా పని చేయాల్సి వస్తోంది. దీంతో ఇరువురు పార్టీలో సర్దుకుపోవల్సిందేనని ఉమ్మడి జిల్లా నాయకులు సైతం చెప్పడంతో ఇరువర్గాలు తప్పక ముందుకు వెళ్తున్నారు. ఇద్దరు నాయకులు పార్టీలో సమాన స్థాయి నేతలు కావడంతో ఎవరూ బెట్టు తగ్గేలా లేరు. ప్రస్తుతం టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్గా కోవ లక్ష్మీ కొనసాగుతుండగా, ఆత్రం సక్కు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా రెండు వర్గాల్లో పార్టీపరంగా ఒకరికి ప్రాధాన్యం ఉంటే, అ«ధికారపరంగా ఇంకొకరికి ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకత్వంలోనూ ఇదే తీరు కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఎవరికి వారే ప్రచారం.. లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు వర్గాల నాయకులు ఎవరికి వారే ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ తనకు పట్టున్న ప్రాంతాల్లో పర్యటిస్తూ తన అనుచరగణాన్ని, తమ వర్గాన్ని, తన వైపున్న వారిని కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేగా ఆత్రం సక్కు తన వర్గం నాయకులతో నియోజకవర్గంలో చుట్టి వస్తున్నారు. ఇరువురు కలిసి ఒకే ప్రాంతంలో ప్రచారం చేయడానికి మాత్రం వెళ్లడం లేదు. అయితే, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్ ఇతర నాయకులు నియోజవర్గానికి వచ్చిన సందర్భంలోనే ఇద్దరూ ఒకే వేదికపై కనిపిస్తున్నారు. అలాగే నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాలు, ఇతర సందర్భాల్లోనూ ఒకే వేదికను పంచుకుంటున్నారు. కానీ, ఒకేచోట ప్రచారానికి వెళ్లిన సందర్భాలు లేవు. ఒకరు ఆసిఫాబాద్లో ప్రచారం చేస్తే మరొకరు తిర్యాణిలో ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరి వర్గం పై చేయి సాధిస్తుందోననే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ఇరువర్గాలు ఒకే అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తున్నారు గానీ.. అప్పుడు ఇరువర్గాల్లోనూ అనేక మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీ తదితర పదవుల పంపకంలో ఏ వర్గానికి పదవులు వస్తాయోనని కార్యకర్తలతోపాటు పరిషత్లో పోటీ చేసే ఆశావహులు కూడా ఎదురుచూస్తున్నారు. -
బతుకు ‘బండి’ డీలా?
సాక్షి, ఆసిఫాబాద్అర్బన్: రోజురోజుకు డీజిల్ రేటు పెరుగుతుండడంతో ఆటోవాలాల జీవనం కష్టతరంగా మారుతోంది. ఆటోనే జీవనాధారంగా చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న తమ పరిస్థితి దయనీయంగా ఉందని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి ఆటోలు కొని జీవిద్దామనుకుంటే..రోజు కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. అనునిత్యం డీజిల్ ధర పెరుగుతోంది. గతంలో రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.75కు చేరుకుంది. ఆటోలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆటోవాలాలు బెంబేలెత్తిపోతున్నారు. వచ్చే అరకొర డబ్బు డీజిల్కే పోతోందని, ప్రస్తుతం ఉన్న చార్జీలకు ఆటోలను నడిపి, నెల వచ్చే సరికి తీసుకున్న ఫైనాన్స్ కట్టలేకపోతున్నామని వాపోతున్నారు. ఆసిఫాబాద్ మండల పరిధిలో సుమారు 500 వరకు ఆటోలు ఉన్నాయి. బస్సులు లేనప్పుడు ప్రయాణికులు ఆటోలపైనే ఆధారపడి ఇంటికి చేరుతున్నారు. అయితే ఆటోలు నడిపే వా రి పరిస్థితి మాత్రం అంతా ఆశాజనకంగా లేదు. నిర్వహణ ఖర్చులతో ఉక్కిరిబిక్కిరి.. ఆటోలు నడపడానికి పలు రకాల నిర్వహణ ఖర్చులున్నాయి. అంతంత మాత్రంగా వచ్చే డబ్బుతో ఆటోలకు సర్వీసింగ్ కూడా చేయలేని పరిస్థితి వస్తోందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. దీనికితోడు అమాంతంగా పెరిగిన బీమా ధరలు, ఎఫ్సీ కాలం ముగిసిన తరువాత వేసే అపరాధ రుసుం ఆటోడ్రైవర్ల జీవనాన్ని ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. సీఐ చొరవతో ఆటోస్టాండ్ ఆర్టీసీ అధికారులు ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆటో స్టాండ్ను తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆటో యజమానులు ఇబ్బందులు పడడంతో స్థానిక సీఐ మల్లయ్య ను ఆశ్రయించారు. అందుకు వారు ఆర్టీసీ అధికా రులతో మాట్లాడి ఆటోస్టాండ్ను యథావిధిగా ఉన్న స్థలంలోనే ఏర్పాటు చేయించారు. డీజిల్ ధరలు ఇలా... సంవత్సరం డీజిల్ ధర (రూ.లలో) 2014 56 2015 58 2016 60 2017 70 2018 72 2019 75 ఇవీ డిమాండ్లు.. ఆటోడ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఆటో ఫైనాన్సర్ల వడ్డీ దోపిడీ అరికట్టాలి. ఆటోలకు భారీగా పెరిగిన థర్డ్పార్టీ బీమా తగ్గించి, 50శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి ఎంవీ, యాక్ట్ సవరణ బిల్లు రద్దు చేయాలి యాక్సిడెంటల్ బీమాను రూ.5 లక్షలను, సాధారణ, మరణాలకు అంగవైకల్యానికి వర్తింప చేయాలి. మండలకేంద్రాల్లో ఆటోలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు కేటాయించాలి ఆటో బీమా ప్రీమియం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిర్మిస్తున్న డబుల్బెడ్ రూం ఇళ్లను పేదలైన ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి. వాయిదాలు కట్టలేకపోతున్నాం అప్పుచేసి ఆటోలు కొనుగోలు చేశాం. ప్రస్తుతం డీజిల్ ధరలు, విడి భాగాల ధరలు భారీగా పెరిగాయి. చార్జీలు మాత్రం పెరగడం లేదు. చార్జీలు పెంచుదామంటే ప్రజలు అంగీకరించరు. ప్రభుత్వం చొరవ చూపి డీజిల్ ధరలు అదుపు చేయాలి. – ఎస్కె.సాజీద్, ఆసిఫాబాద్ -
ఆశ్రమ పాఠశాలలో యూనిసెఫ్ బృందం
సాక్షి, వాంకిడి(ఆసిఫాబాద్): మండలంలోని వాంకిడి గిరిజన బాలికల ఉన్నత పాఠశాల, బంబార ఆశ్రమ ఉన్నత పాఠశాలలను శుక్రవారం యూనిసెఫ్ బృందం సభ్యులు తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలో నిర్వహిస్తున్న నవోదయ, ప్రథం, వేదిక్ మ్యాథ్స్, వందేమాతరం, దిశ మోడల్ స్కూల్ నిర్వహణ విషయాలు పరిశీలించారు. అనంతరం తరగతి వారీగా విద్యార్థులకు బోధన అంశాలపై, మధ్యాహ్న భోజన నిర్వహణ, సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. యూనిసెఫ్ ఎడ్యుకేషనల్ చీఫ్ రాంచంద్రరావు బెగూర్ మాట్లాడుతూ గత నవంబర్మాసం నుంచి ఆయా పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు ప్రవేశపెట్టామని తెలిపారు. అప్పటి నుంచి కార్యక్రమాల తీరుపై పరిశీలన చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో వచ్చిన మార్పులపై వివరాల సేకరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలల పనితీరు బట్టి ఆయా పాఠశాలల్లో కావాల్సిన వసతులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతులు కల్పించడమే యూనిసెఫ్ ముఖ్యఉద్దేశమన్నారు. వారి వెంట యూనిసెఫ్ స్టేట్ ఎడ్యుకేషనల్ స్పెషలిస్టు సుకన్య, ఐటీడీఏ పీవో కష్ణ ఆదిత్య, డీటీడీవో దిలీప్కుమార్, ఏటీడీవో కనకదుర్గ, హెచ్ఎండి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి ఆసిఫాబాద్రూరల్: దిశ మోడల్ స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని గిరిజన అభివృద్ధి ప్రాజెక్టు అధికారి కిష్ట్ర ఆదిత్య అన్నారు. శుక్రవారం మండలంలోని వట్టివాగు కాలనీలో పైలెట్ ప్రాజెక్టు కింద నూతనంగా ఏర్పాటు చేసిన దిశ మోడల్ స్కూల్ను సెంట్రల్ స్టేట్ యూనిసెఫ్ ప్రతినిధి రామ చంద్రన్, డీటీడీవో దిలీప్కుమార్ సందర్శించి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఇంగ్లిష్ మీడియం బోధన సౌకర్యాలు, హాజరు శాతం, మెనూ ప్రకారం భోజనం వంటి విషయాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యా సామర్థాలు, నైపుణ్యాలు ప్రదర్శించడంతో అభినంధించారు. దీంతోపాటు గ్రామస్తులు పాఠశాల చుట్టు ప్రహరీ గోడ, కమ్యూనిటీ భవనం నిర్మించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఎసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, సీఆర్పీ రవీందర్ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. -
ఆసిఫాబాద్ జిల్లాలో మషన్ భగీరధ పైప్ లీక్
-
ఆ ఊళ్లో ఎన్నికల్లేవు.!
సాక్షి, ఆసిఫాబాద్: కొత్త పంచాయతీలుగా ఏర్పడిన సంబరం ఆ గ్రామస్తులకు లేకుండా పోయిం ది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ పదవి లేకుండా పోతోంది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏర్పడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులే పూర్తిగా ఉండి అసలు గిరిజనులే లేని పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోనున్నా యి. రెండో విడత ఎన్నికలు జరిగే 107 పం చాయతీల్లో రెండు గ్రామాలు ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. అలాగే మూడో విడత ఎన్ని కలు జరిగే 114 గ్రామ పంచాయతీల పరిధిలో ఒక పంచాయతీ ఎన్నికలకు ఆటంకం కలుగుతోంది. ఈ మూడు పంచాయతీ పరిధిలోనూ ఒకటే సమస్య. ఆ గ్రామ పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు అయినప్పటికీ ఒక్క ఎస్టీ ఓటరు లేకపోవడమే. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండడంతో భవిష్యత్లోనూ ఈ రిజర్వేషన్లు మార్చే అవకాశం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ గ్రామాలకు సర్పంచ్ ఎన్నికల జరుగుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క ఎస్టీ లేరు... పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు కావడంతో పోటీ చేసేందుకు అసలు అభ్యర్థులే లేకపోవడం సమస్యగా మారింది. జిల్లాలో మొత్తం 334 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో షెడ్యూ ల్డ్ ఏరియా పరిధిలో ఉన్నవి 162. 164 నాన్ షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోఉండగా, మరో ఎని మిది వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఈ మొత్తం పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతన్న విషయం తెలిసిందే. అయితే రెండో విడత ఎన్నికలు జరిగే ఆసిఫాబాద్ మండలం రహపల్లి, వెంకటపూర్ గ్రామ పంచాయతీలు ఎస్టీ రిజర్వు కాగా వీటిలో ఒక్క ఎస్టీ కూడా లేకపోవడంతో కనీసం సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు ఒక్క అభ్యర్థి కూడా లేకుండా పోయారు. అలాగే మూడో విడత ఎన్నికలు జరిగే వాంకిడి మండలం తేజపూర్ గ్రామ పంచాయతీలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా సర్పంచు స్థానానికి పోటీ చేసేందుకు ఎస్టీలు కరువయ్యారు. గతంలో ఈ మూడు పంచాయతీలు పాత పంచాయతీల్లో ఉండగా గిరిజనులు ఉండేవారు. కొత్తగా ఏర్పడిన ఈ పంచాయతీల్లో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేరు. దీంతో సర్పంచ్ ఎన్నిక లేకుండా పోయిం ది. ఈ మూడు పంచాయతీల్లో ఎనిమిది చొప్పున వార్డులు ఉన్నాయి. వీటిలో వెం కటపూర్ గ్రామస్తులు ఎస్టీ రిజర్వేషను వచ్చినందుకు నిరసనగా పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తు తీర్మానం చేశారు. మూడు వార్డులకు జనరల్కు రిజర్వు అయినప్పటికీ నామినేషన్లు ఎవరూ వేయలేదు. దీంతో ఇక్కడ పూర్తిగా ఎన్నికలే జరిగే అవకాశం లేకుండా పోయింది. ఇక రహపల్లి, తేజపూర్లో ఎనిమిదింటిలో ఒక్కో పంచాయతీలో నాలుగు జనరల్ స్థానాలకు చొప్పున కావడంతో ఈ వార్డులకు నామినేషన్లు రావడంతో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. ఈ రెండు పంచాయతీల్లో నాలుగింటిలో ఎన్నిక జరిగితే ఒక ఉప సర్పంచ్ ఎన్నిక జరిగే అవకాశముంది. ఉపసర్పంచ్ కోసం భారీ పోటీ.. ఎలాగు సర్పంచ్ అభ్యర్థులు లేకపోవడంతో వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఉప సర్పంచ్గానైనా గ్రామంలో చక్రం తిప్పుదామని కొంత మంది ఆశావావహులు ఆరాట పడుతున్నారు. ఇందు కోసం తనతో పాటు మరో ఇద్దరు వార్డు సభ్యులను తన వైపు చేర్చుకుంటే ఉపసర్పంచ్ పదవి దక్కే అవకాశముందని భావించి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సర్పంచ్ పదవి ఎలాగు దక్కే అవకాశం లేకపోవడంతో ఉపసర్పంచ్ పదవి కైవసం చేసుకునేందుకు బేరాసారాలు ప్రారంభమైనట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మార్చాలని కోరాం మా గ్రామంలో ఒక్కరు కూ డా ఎస్టీ ఓటరు లేరు. కాని పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీకి రిజర్వు అయింది. దీనిపై కలెక్టర్ను కలిసి రిజర్వేషన్ మార్చాలని కోరాం. అయితే ఎస్టీ రిజర్వేషన్ మార్పు మా పరిధిలో లేదని తెలిపారు. దీంతో భవిష్యత్లో ఎన్నికలు జరుగుతాయా అనేది అనుమానంగా ఉంది. – చెండి సోమేశ్వర్, మాజీ ఎంపీటీసీ, గాట్ జనగాం, తేజపూర్ ఒక్క ఎస్టీ ఓటరు లేరు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ గిరిజనులు ఎవరూ లేరు. అయితే పంచాయతీ ఎన్నికల్లో మాత్రం బీసీలు అధికంగా ఉన్న పంచాయతీలో ఎస్టీకి రిజర్వుకావడంతో సర్పంచ్ను ఎన్నుకోలేక పోతున్నాం. రిజర్వేషను మార్చాలి. – చౌదరి శంకర్, తేజపూర్ జనాభా ప్రకారం కేటాయించాలి మా గ్రామంలో ఎస్టీలు ఎవరూ లేకున్నా సర్పంచ్ ఆ కేటగిరికి రిజర్వు అయింది. దీంతో మేం సర్పంచ్ను ఎన్నుకోలేకపోతున్నాం. గ్రామంలో ఉన్న ప్రస్తుత జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి. – పెద్దపల్లి సంతోశ్, రహపల్లి, ఆసిఫాబాద్. -
తప్పనున్న పొగ తిప్పలు.!
ఆసిఫాబాద్అర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా వంటింట్లో పొగ తిప్పలు తప్పేలా కనిపిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా నిరుపేద మహిళలను అర్హులుగా చేర్చుతూ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు ఈ పథకంతో మేలు జరగనుంది. ఈ నేపథ్యంలో అర్హులను గుర్తించి సిలిండర్లు అందజేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 11,142 మందికి ఈ పథకం కింద కనెక్షన్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఉచితంగా సిలిండర్లు.. దారిద్య్ర రేఖకు దిగవనున్న కుటుంబాల్లో నేటికీ వంట చేసుకోవడానికి కట్టెలే దిక్కు. ఇలాంటి వారిని పొగ నుంచి విముక్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం ప్రవేశపెట్టింది. నేటికీ చాలా వరకు గ్రామాల్లో కట్టెల పొయ్యి దిక్కు. వంట చేసేటప్పుడు మహిళల కళ్లల్లోకి పొగ వెళ్లడంతో అనారోగ్యం పాలవుతున్నారు. ఆహారం సైతం కలుషితమవుతుంది. 2016లో ఉత్తరప్రదేశ్లోని బాల్లియాలో మొదటగా ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేశారు. దశల వారీగా దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. రూ.1600లు విలువ చేసే గ్యాస్ కనెక్షన్ పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు. గ్యాస్ పొయ్యితో పాటు రెగ్యులేటర్, మిగితా అన్ని వస్తువులను అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాయి. పథకానికి అర్హులు వీరే.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఈ పథకానికి అర్హులు. అంత్యోదయ కార్డు కలిగిన వారికి కూడా ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఇది వరకు గ్యాస్ కనెక్షన్ లేనివారికి సైతం ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రేషన్కార్డు కలిగి ఉన్న పేదలను ఈ పథకానికి అర్హులుగా ఎంపిక చేస్తున్నారు. ఉజ్వల యోజన పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ పొందాలంటే మహిళకు బ్యాంకు ఖాతా పుస్తకం ఉండాలి. రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు అవసరం. రేషన్ కార్డు ఉండాలి. మొబైల్ నంబరుతో సమీప గ్యాస్ ఏజెన్సీలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదట దరఖాస్తు గడువు ఆగస్టుతో ముగిసింది. తిరిగి మళ్లీ ఈనెల 18 నుంచి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. సద్వినియోగం చేసుకోవాలి.. గ్రామీణ ప్రాంతాల వారికి ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా జిల్లాలో 11,142 మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశాం. అర్హులు ధ్రువపత్రాలను సంబంధత అధికారులకు అందించి నేరుగా కనెక్షన్లు పొందవచ్చు. ఈ పథకం దరఖాస్తు గడువు ఆగస్టు నెలలోనే ముగిసింది. తిరిగి మళ్లీ నేటి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. – టి.సత్యనారాయణ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి -
న్యాయం చేయకుంటే రెబల్గా పోటీ
కాగజ్నగర్(కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా): సిర్పూర్ నియోజకవర్గంలో అధికంగా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఉద్యమ సమయంలో పార్టీలో పనిచేసి రెండుసార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలి పొందానని, తెలంగాణ కోసం సైతం ఒకసారి రాజీనామా చేశానని అలాంటి తనకు టికెట్ ఇవ్వకుండా టీఆర్ఎస్ హైకమాండ్ అన్యాయం చేసిందని టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014లో టీఆర్ఎస్ 63 స్థానాలు గెలుచుకొని అధికా రం చేపట్టినా ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారని వేరే పార్టీతో గెలిచిన ఆంధ్ర వ్యక్తిని తీసుకున్నారని, అప్పుడు పార్టీకి అవసరమేనని తానుకూడా ఓడిపోయానని ఊరుకున్నానన్నా రు. ఐదేళ్లుగా పార్టీ హైకమాండ్ను కలిసిన ప్రతిసారి తనకు న్యాయం చేయాలని కోరుతూ వచ్చానని, తప్పకుండ న్యా యం చేస్తామని హైకమాండ్ హామీ ఇచ్చి ఇప్పుడు తనను కాదని టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వడం బాధాకరమన్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న నియోపజకవర్గంలో బీసీని కాదని బీసీలను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే నాపై అధి ష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చారని నేనేప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్నారు. హైకమాండ్ పునరాలో చించి బీసీలకు, తెలంగాణ కోసం పోరాడిన వారికి న్యా యం చేయాలన్నారు. ఒక్కరోజు కూడా తెలంగాణ జెండా పట్టని, తెలంగాణ కోసం వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఇప్పుడు పార్టీలో ఉన్నారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనను, కేసీఆర్ను విమర్శించిన వ్యక్తికి టికె ట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆంధ్ర, తెలంగాణ వేరైనా సిర్పూర్కు తెలంగాణ రాలేదని, కోట్లు సంపాదించి దౌర్జన్యాలు, అట్రాసిసీ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకమాండ్ పునారాలోచించి నిర్ణయం తీసుకోకుంటే రెబల్గా బరిలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అనంతరం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాంటెంకి శ్రీహరి మాట్లాడుతూ దళితుల ఓట్లతో గెలిచి దళితులను అనణదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉంటారన్నారు. మాజీ మున్సి పల్ చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య సతీమ ణి కావేటి సాయిలీల మాట్లాడుతూ ఉద్యమకారులను విస్మరించడం సరైంది కాదన్నారు. అధిష్టానం మరోసారి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ పార్టీ తమకు న్యాయం చేయకుంటే బరిలో ఉండి ప్రత్యర్థిని ఓడించి తీరుతామని హెచ్చరించారు. -
‘ముందస్తు’ అలర్ట్
సాక్షి, ఆసిఫాబాద్: ముందస్తు ఎన్నికలకు జిల్లా పోలీసు యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది. ఎటువంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత పది రోజుల నుంచి జిల్లా సరిహద్దు ప్రాం తాలైన ప్రాణహిత, పెన్గంగ, పెద్దవాగు పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో స్థానిక పోలీసులతోపాటు గ్రేహౌండ్స్, స్పె షల్ ప్రొటెక్షన్ పోర్స్ దళాలతోపాటు శిక్షణ కోసం వచ్చిన దళాలు రంగంలోకి దిగా యి. ఈ బలగాలు అటవీ ప్రాంతాలన్నింటి ని రోజు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల ఎవరైనా సంచరిస్తున్నారనే అనుమానంతో నిత్యం రాత్రింబగళ్లు గస్తీ కాస్తున్నాయి. జిల్లాకు సరిహద్దు గ్రామాలైన పెంచికల్పేట మండలం లోని నందిగాం, కమ్మర్గాం, దహెగాం మండలం మొట్లగూడ, రాంపూర్, చింతలమానెపల్లి గూ డెం, ప్రాణహిత పరిసరాలు, వాంకిడి మండలం సర్కపల్లితోపాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతా లు, కెరమెరి అడవులు, తిర్యాణి మండలం మంగి, గుండాల తదితర ప్రాంతాలపై గట్టి నిఘా జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం తో సహా కాగజ్నగర్ పట్టణంలో తనిఖీలు ము మ్మరం చేశారు. బాంబ్ స్క్వాడ్తో రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేబీఎం కమిటీపై ప్రత్యేక దృష్టి గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో రెండు దళాలు చురకుగా పనిచేసేవి. అందులో ఒకటి ఇంద్రవెల్లి ఏరియా దళం, రెండోది మంగి ఏరియా దళం. అయితే కాలక్రమేణా మావోల ప్రబల్యం తగ్గిపోవడంతో ప్రస్తుతం ఇంద్రవెల్లి దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఎక్కడా ఉమ్మడి జిల్లా పరి«ధిలో ఈ దళాల సారధ్యంలో ఎటువంటి ఘటన జరగలేదు. ఇక రెండోది తిర్యాణి మండలంలోని అత్యంత మారుమూల ప్రాంతమైన మంగి ఏరియా కమిటీ. ఈ దళం కూడా పూర్తిగా తన ఉనికి కోల్పోయింది. అయితే మావోయిస్టులు ప్రస్తుతం మంగి ఏరియా కమిటీ స్థానంలో కేబీఎం(కుమురంభీం, మంచిర్యాల) కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కమిటీకి ఇన్చార్జీగా మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, అలియాస్ నర్సన్న, అలియాస్ క్రాంతి పని చేస్తున్నారు. ఈయన స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామం. ఈయనతోపాటు బండి ప్రకాశ్ అలియాస్ బీపీ అలియాస్ ప్రభాకర్ అలియాస్ బండి దాదా ఈ కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఈయన స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. వీరిద్దరూ సెంట్రల్ కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు. వీరివురు ప్రస్తుతం చత్తీస్ గడ్లో దండకారణ్యంలో ఉన్నట్లు నిఘా వర్గాల అంచనా. మైలారపు అడెల్లు ‘దండకారాణ్యం స్పెషల్ జోన్ కమిటీ’ (డీకేఎస్జెడ్సీ)ని ఏర్పాటు చేసి కొత్తవారిని మావోయిస్టు పార్టీలోని నియమిస్తూ రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలపై తమ ప్రతాపం చూపాలని ఆరాటపడుతున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. అంతేకాక ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాల్లో జిల్లా నుంచి మావోయిస్టు సానుభూతిపరులు, విప్లవ సాహితీవేత్తలు, విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కేబీఎం కమిటీ పేర ఓ ప్రకటన వెలువడింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు తెరలేపిన సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందే జిల్లా పోలీసు అప్రమత్తమైంది. గిరిజన యువత, ఆవాసాల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ ఆవాసం నుంచి పోలీసులకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశారు. కొత్తవారు ఎవరూ వచ్చిన తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు. అంతేకాక గతంలో జరిగిన సంఘటనలు, మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అధికారులు ఇతర అంశాలతో ఓ కరపత్రికను విడుదల చేయనున్నారు. అంతేకాక గోడప్రతుల ద్వారా గిరిజన గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు రూపొందించారు. పది రోజులుగా కూంబింగ్ జిల్లా అటవీ ప్రాంతాల్లో సమీప పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్సై సహా అందరూ వివిధ ఆపరేషన్లలో పాలుపంచుకుంటున్నారు. నక్సల్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, స్టేట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతోపాటు జిల్లా స్పెషల్ బ్రాంచితో ఎప్పటికప్పుడు సమచారం సేకరణ పనిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో మినహా దాదాపు మండల అన్ని కేంద్రాల్లోనూ సెల్ ఫోన్ పనిచేసేలా నెట్వర్క్ ఉంది. ఆయా మండల పోలీసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ గత పది రోజులుగా నిత్యం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. రోడ్ ఓపెనింగ్ పార్టీ(ఆర్వోపీ)తో రోడ్లకు ఇరువైపు ఉన్న ప్రాంతాలను, కల్వర్టులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బాంబ్ డిస్పోజబుల్ పార్టీ కూడా పనిచేస్తోంది. జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో తిర్యాణి మండలం దేవాపూర్ ప్రాంతంలో, మంగి మండలం పంగిడి మాదర ప్రాంతంలో పోలీసులకు తారసపడ్డారు. చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదిపై నిర్మిస్తున్న గూడెం, అహెరి బ్రిడ్జి పనులు అడ్డగిస్తూ అక్కడ పొక్లెనర్లను, ఇతర వాహనాలు తగలబెట్టారు. అంతకు ముందు మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరు చెరుకూరి రాజ్కుమార్ అలియాస్ ఆజాద్ 2010 జూలై 1న వాంకిడి మండలం సర్కపల్లి వద్ద పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇక అప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలో ఆస్థాయిలో ఘటనలు ఎప్పుడు జరగలేదు. రాష్ట్రమేర్పడినప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోనే మావోయిస్టుల ఉనికి పెద్దగా కనిపించలేదు. అయినప్పటి ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్స్టేషన్లను గుర్తించారు. వామపక్ష ప్రభావం ఉన్న పోలింగ్స్టేషన్లు 58, వామపక్ష ప్రభావం ఉన్న ప్రాంతాలు 53 వరకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటికి ఎన్నికల సమయంలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. కూంబింగ్ కొనసాగుతోంది జిల్లాలో ముందస్తు ఎన్నికల సందర్భం గా ఎటువంటి అ వాంఛనీయ ఘటనలు జరగకుండా గత పది రోజులుగా ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రాణహిత నది పరిసర ప్రాంతాలతోపాటు మంగి ఏరియాలో తనిఖీలు విస్తృతంగా సాగుతున్నాయి. ఎన్నికలు సజావుగా సాగేందుకు ముందుస్తుగా భద్రతపరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.– మల్లారెడ్డి, ఎస్పీ -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి..ఐదుగురికి గాయాలు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : వాంఖిడి మండల కేంద్రంలోని ఆర్టీఏ చెక్పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి కారును లారీ ఢీకొనడంతో ముందున్న లారీలోకి కారు చొచ్చుకుపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న మహారాష్ట్రలోని గోంద్యాకు చెందిన గోల్గామ్ వార్ రాములు (60) మృతి చెందగా..మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆ ఊరికి నాలుగు పేర్లు
ఆ ఊళ్లో కులాలు లేవు.. కుమ్ములాటలు లేవు. అందరూ ఒకటే. ఐకమత్యమే వారి బలం. అయినా విచిత్రమో విధి వైపరీత్యమో వారి ఊరికి మాత్రం నాలుగు పేర్లుంటాయి. దీంతో అందరిలో తికమక పుడుతుంది. అసలు ఏ పేరుతో పిలవాలనే విషయం ఇప్పటికీ తత్తరపాటే. ఒక్కో రికార్డుల్లో ఒక్కో పేరు ఉండడమే కారణం. అయినా వారిలో అంతరంగిక విషయాల్లో కూడా ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు లేవు. 19 కుటుంబాలున్నా ఐకమత్యమే వారి ఆయుధం. ఆత్మవిశ్వాసమే వారికి ఆభరణం. ఒక్క కుటుంబమే ఒక్కటిగా లేని నేటి రోజుల్లో అందరూ కలిసి ఉండడమనేదే గొప్ప విషయం. నాగరికత వెర్రితలలు వేసే రోజుల్లో కూడా సంప్రదాయాలకు విలువిస్తూ చక్కని నడతను పాటిస్తూ.. వారి ఐక్యత ఇలాగే కొనసాగుతూ భావితరాలకు సైతం దిక్సూచిలా మారాలని ఆకాంక్షిస్తూ.. కెరమెరి : సర్వ సాధారణంగా ఊరు ఒకటైతే.. పేరు ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా ఒకే గ్రామానికి నాలుగు పేర్లతో సంవత్సరాల కాలంగా విరాజిల్లుతోంది. మండలంలోని దేవాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్న ఓ గిరిజన పల్లె అది. 19 కుటుంబా లు, 87 మంది జనాభా ఉండే ఆగ్రామానికి నాలుగు పేర్లున్నాయి. చిత్తగూడ, గోండ్గూడ (డి), గొర్యగూడ, దేవాపూర్ గోండ్గూడగా పిలుస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో దీనికి చిత్తగూడ గా పేరున్నప్పటికీ, ఐటీడీఏ రికార్డుల్లో గోండ్గూడ (డి) గా ఉంది. ఇక స్థానికులు మాత్రం ఈ పల్లెను గొర్యగూడ, దేవాపూర్ గోండ్గూడ నామంగా పిలుస్తున్నారు. 70 సంవత్సరాల చరిత్రగల ఈ ఆదివాసీ గ్రామానికి ఆది నుంచి ఎన్నోరకాల పేర్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం పై నాలుగు పేర్లతో పిలవడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. నూతన అధికారులెవరైన ఇక్కడికి రావాలంటే తికమక చెందుతున్నారు. ఒక్కొక్కరిని అడిగితే ఒక్కో పేరు చెబుతున్నారు. ఐతే ఒకే జాతి (గోండ్) కి చెందిన వారుండడం. అందరూ ఒకరికొకరు దగ్గరి బంధువులు కావడం. నేటికీ ఏ గొడవలు లేకుండా కలిసికట్టుగా, ఐకమత్యంగా ఉండడం వీరి ప్రత్యేకత! ఐకమత్యమే మా బలం.. 19 కుటుంబాలున్నప్పటికీ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటాం. ఇదే మా ప్రత్యేకత. నేటి వరకు మా గ్రామంలో ఎప్పుడు గొడవలు కాలేదు. ఏ శుభ కార్యమైనా కలిసే చేసుకుంటాం. అందరూ ఒక్కటిగానే భావిస్తాం. ఎవరికి ఏ కష్టమొచ్చినా అందరం ఆదుకుంటాం. – కుమురం. బీర్శావు, గ్రామ పెద్ద అందరూ బంధువులే.. మా గ్రామంలో నివసించే వా రందరూ ఒకరికి ఒకరు బంధువులే. ఏదో ఓ కోణంలో చు ట్టాలవుతాం. అందుకు అంద రం ఒకే కుటుంబంలా కలిసి ఉంటాం. ఏ నిర్ణయం తీసుకో వాలన్నా అందరం కలిసి ఒక్కటవుతాం. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది. – కుమురం గోవింద్రావు -
జిల్లా ఏర్పాటు చరిత్రాత్మకం
రెబ్బెన : అన్ని రంగాల్లో వెనకబడిన ఆసిఫాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేయటం చారిత్రాత్మకమని తెలంగాణ గౌడ సంఘం నియోజక వర్గ ఇన్చార్జి మోడెం సుదర్శన్గౌడ్ పేర్కొన్నారు. జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ను గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ సన్మానించారు. ఈ సందర్భంగా సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ కుంమ్రం భీం జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ది చెందేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఇబ్బందులను గుర్తించి జిల్లాను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా ఏర్పాటులో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కృషి మరువలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో గౌడసంఘం మండల అధ్యక్షుడు అన్నపూర్ణ, సొసైటీ అధ్యక్షుడు తాళ్లపల్లి కిష్టాగౌడ్, నాయకులు చిరంజీవిగౌడ్, వెంకటేశ్వర్గౌడ్, రాజాగౌడ్, ఉమేష్గౌడ్, రాజాగౌడ్, మహేష్గౌడ్, శాంతికుమార్గౌడ్, సర్వేశ్వర్గౌడ్, శ్రీనివాస్గౌడ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.