Atma Nirbhar Bharat Abhiyan
-
Mission Divyastra: అమ్ములపొదిలో దివ్యాస్త్రం
బాలాసోర్/న్యూఢిల్లీ: మన అమ్ములపొదిలోకి తిరుగులేని ‘దివ్యాస్త్రం’ చేరింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మరో అద్భుతం చేసింది. ఒకటికి మించిన లక్ష్యాలను ఒకేసారి అత్యంత కచి్చతత్వంతో ఛేదించగల అత్యాధునిక ఖండాంతర అణు క్షిపణి అగ్ని–5ను తొలిసారి ప్రయోగించింది. నిర్దేశించిన ఒకటికి మించిన లక్ష్యాలను అది విజయవంతంగా ఛేదించింది! శత్రు దేశాలకు వణకు పుట్టించగల ఈ ‘దివ్యాస్త్రం’ ఆత్మనిర్భర్ భారత్కు ఊతమిచ్చేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. దీనిలో తొలిసారిగా వాడిన మలి్టపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికిల్ (ఎంఐఆర్వీ) సాంకేతికత ద్వారా ఒకే క్షిపణితో వేర్వేరు లక్ష్యాలపై అనేక వార్ హెడ్లను పూర్తి కచి్చతత్వంతో ప్రయోగించవచ్చు. 5,000 నుంచి 5,800 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను అగ్ని–5 ఛేదించగలదు. తక్కువ బరువున్న వార్హెడ్లను అమర్చే పక్షంలో క్షిపణి రేంజ్ ఏకంగా 8,000 కి.మీ. దాకా పెరుగుతుంది! ‘మిషన్ దివ్యాస్త్ర’ పేరిట జరిగిన ఒడిశా తీర సమీపంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి సోమవారం జరిగిన ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ‘‘మిషన్ దివ్యాస్త్రను దిగ్విజయం చేసిన డీఆర్డీఓ సైంటిస్టులకు హృదయపూర్వక అభినందనలు. వారి ఘనతను చూసి గరి్వస్తున్నా’’అంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అతి కొద్ది దేశాల సరసన... అగ్ని–5 పరీక్ష విజయవంతం కావడంతో ఎంఐఆర్వీ సామర్థ్యమున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ‘‘దేశ దీర్ఘకాలిక రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అగ్ని–5ని అభివృద్ధి చేశాం. భారత శాస్త్ర, సాంకేతిక నైపుణ్యానికి ఇది మచ్చుతునక. ఈ ప్రాజెక్టు డైరెక్టర్ మహిళ కావడం విశేషం. రక్షణ రంగంలోనూ దేశ ప్రగతికి నారీ శక్తి ఎంతగా దోహదపడుతోందో చెప్పేందుకు ఇది తాజా తార్కాణం’’ అని వివరించాయి. అగ్ని–1 నుంచి అగ్ని–4 దాకా ఇప్పటిదాకా అభివృద్ధి చేసిన క్షిపణుల రేంజ్ 700 కి.మీ. నుంచి 3,500 కి.మీ. దాకా ఉంది. ఇవిప్పటికే రక్షణ దళంలో చేరాయి. భూ వాతావరణ పరిధిలోనూ, దాని ఆవల కూడా ఖండాంతర క్షిపణులను ప్రయోగించడంతో పాటు విజయవంతంగా అడ్డగించే సామర్థ్యాల సముపార్జనలో భారత్ ఏటేటా ప్రగతి సాధిస్తూ వస్తోంది. మొత్తం ఆసియా ఖండంతో పాటు యూరప్లో కూడా పలు ప్రాంతాలు అగ్ని–5 పరిధిలోకి వస్తాయి! అణు దాడులు చేయడమే గాక వాటిని అడ్డుకునే సత్తా దీని సొంతం. -
‘సెమీ’ ఆశలకు సడన్ బ్రేకులు!
ఆశించిన పురోగతికి అర్ధంతరంగా బ్రేకులు పడినప్పుడు నిరాశ సహజమే! అందులోనూ అది సాక్షాత్తూ ప్రధాని గొప్పగా చెప్పిన ఆత్మనిర్భర ఆశయాలకు భంగకరమని అనిపించినప్పుడు నిరుత్సాహం మరీ ఎక్కువే! భారత దేశ సెమీ కండక్టర్ల (చిప్ల) తయారీ ఆకాంక్షలకు ఇప్పుడు అలాంటి అవరోధాలే వచ్చాయి. సెమీ కండక్టర్ల తయారీకి కలసి కృషి చేసేందుకు ఒక్కటైన తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ‘ఫాక్స్కాన్’, భారత సంస్థ ‘వేదాంత’ ఇప్పుడు దేని దారి అది చూసుకోవడం అలాంటి పరిణామమే. దీనివల్ల భారత చిప్ లక్ష్యాలకు ఇబ్బంది ఏమీ ఉండదని కేంద్రం చెబుతున్నప్పటికీ అది సంపూర్ణ సత్యమేమీ కాదు. చిప్ల తయారీ నిమిత్తం వేదాంత– ఫాక్స్కాన్లు గత ఏడాది ఉమ్మడి భాగస్వామ్యానికి దిగి, గుజరాత్ ప్రభుత్వంతో 19.5 బిలియన్ డాలర్ల విలువైన సెమీ కండర్ల కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయి. తీరా పట్టుమని పది నెలలకే ఆ గ్రూపు నుంచి వైదొలగుతున్నట్టు ఫాక్స్కాన్ ప్రకటించడం ఒక విధంగా ఆకస్మిక బ్రేకనే చెప్పాలి. ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజైన్ రంగంలో ప్రపంచ కేంద్రంగా మన దేశం ఆవిర్భవించేందుకు తగిన వాతావరణ పరికల్పనే లక్ష్యంగా పెట్టుకున్న భారత సెమీ కండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)కు ఇది శుభవార్త కానే కాదు. ‘సెమీ కండక్టర్ల ఆలోచనను నిజం చేయడానికి’ వేదాంత సంస్థతో కలసి ఏడాది పైగా కృషి చేసిన ఫాక్స్కాన్ పరస్పర అంగీకారంతో, ఈ ఉమ్మడి భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సోమవారం ప్రకటించింది. అంటే ఇక ఆ బృహత్ ప్రయత్నంలో ఫాక్స్కాన్ పేరు ఉండదు. ప్రాజెక్ట్ పూర్తిగా వేదాంత సంస్థకే సొంతమన్నమాట. తొలి ప్రకటన వచ్చిన 24 గంటలలోపే ఇటు ఫాక్స్కాన్ సైతం విడిగా తగిన సాంకేతిక భాగస్వామిని చేర్చుకొని, తనదైన వ్యూహంతో ముందుకు నడుస్తుందన్న సంకేతాలొచ్చేశాయి. కలసి అడుగులేసిన సంస్థలు ఏడాదికే ఇలా వేరు కుం పట్లయిన పరిణామానికి కారణాలేమిటన్నది అవి చెప్పలేదు. గుజరాత్లో చిప్ల తయారీకి కావాల్సిన లైసెన్స్తో కూడిన సాంకేతిక పరిజ్ఞానంకోసం వేదాంత, ఫాక్స్కాన్లు ఎస్టీమైక్రోను ఆసరాగా బరిలోకి దింపాయి. కానీ, ప్రభుత్వం మాత్రం సదరు యూరోపియన్ చిప్ తయారీ సంస్థ కూడా నిష్పూచీగా మిగలక, ఒప్పందంలో భాగస్వామిగా ఉండాల్సిందే అనడంతో చిక్కొచ్చినట్టుంది. ప్రపంచంలో 37 శాతం చిప్లు తైవాన్వే! భారత ఎలక్ట్రానిక్ చిప్ అవసరాలన్నీ ప్రధానంగా దిగుమతి ద్వారానే తీరుతున్నాయి. కొన్నేళ్ళుగా ఏటా దాదాపు 1000 కోట్ల డాలర్ల విలువైన చిప్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో సుమారు 70 శాతం చైనా నుంచి వస్తున్నవే. చిప్ల తయారీలోని ఈ అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఐఎస్ఎం ప్రారంభమైంది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, అనేక ఐరోపా దేశాలు చిప్ల తయారీ సత్తా పెంచుకుంటున్నాయి. తాజాగా భారత్ ఆ పరుగులో చేరింది. దేశంలో చిప్ల తయారీ కేంద్రాల్ని నెలకొల్పాలని వచ్చేవారికి పెట్టుబడి రూపంలో ప్రోత్సాహకాలిచ్చేందుకు సిద్ధపడింది. అమెరికా చిప్ తయారీ సంస్థ మైక్రాన్ ఇటీవలే భారత్లో చిప్ కేంద్రానికి ఆమోదం పొందింది. కేంద్ర, గుజరాత్ సర్కార్లు దానికి గణనీయంగా పెట్టుబడి సాయం చేస్తున్నాయి. ఆత్మ నిర్భరతకై ఇలాంటి యత్నాలు జరుగుతున్న వేళ భారీ ఒప్పందమైన వేదాంత – ఫాక్స్కాన్ చిక్కుల్లో పడడమే విచారకరం. కారణాలేమైనా గత ఏడాది ఫిబ్రవరి 14న ఫాక్స్కాన్– వేదాంతల మధ్య మొలకెత్తిన ప్రేమ మూణ్ణాళ్ళ ముచ్చటైంది. గుజరాత్లో చిప్ల తయారీ కేంద్రాల ఏర్పాటుకై గత సెప్టెంబర్లో చేసుకున్న రూ. 1.54 లక్ష కోట్ల మేర ఒప్పందాలు ఇరుకునపడ్డాయి. ఏ సంస్థకు ఆ సంస్థ విడివిడిగా ముందుకు పోయినా భారత సెమీ కండక్టర్ల మిషన్లో జాప్యం తప్పదనిపిస్తోంది. చిప్ల తయారీకి తగ్గ పునాది లేకున్నా చిప్ డిజైన్లో మాత్రం మన దేశం ముందంజలో ఉంది. దాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. సొంత తయారీతో పదునుపెట్టుకోవాలి. పైగా, కరోనాతో సరఫరా వ్యవస్థలకు అంతరాయం, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో వచ్చిపడ్డ అనివార్యతల రీత్యా రక్షణ, ఎలక్ట్రానిక్స్ తదితర కీలక రంగాల్లో భారత్ ఎంత త్వరగా సొంతకాళ్ళపై నిలబడగలిగితే వ్యూహాత్మకంగా అంత మంచిది. ఆ మాటకొస్తే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా పైచేయి సాధించగలిగిందీ ఈ చిప్ల వల్లేనంటారు విశ్లేషకులు. అమెరికా, చైనాల మధ్య ఇప్పుడు నడుస్తున్న భౌగోళిక రాజకీయాల తోపులాటలోకూ ఇవే కారణం. ఇవాళ దేశాలన్నీ తమ గడ్డపైనే అన్ని రకాల చిప్ల రూపకల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తోందీ, ప్రోత్సాహకాలిస్తున్నదీ అందుకే. కాబట్టి, మనకు అవసరమైన చిప్ల డిజైనింగ్ నుంచి తయారీ దాకా అన్నీ మన చేతుల్లోనే ఉండడం పోటీలో ముందు ఉండడానికో, ఆర్థిక ప్రయోజనాల రీత్యానో కాకున్నా... వ్యూహాత్మకంగా భారత్కు అత్యంత కీలకం. అందుకే, వేదాంత – ఫాక్స్కాన్ల బంధం విచ్ఛిన్నమైందన్న నిరాశను పక్కనపెట్టి, సెమీ కండక్టర్ల రంగాన్ని దృఢంగా నిర్మించేందుకు మరింతగా కృషి చేయాలి. చైనా లాంటివి పడనివ్వకుండా చేసినా పట్టుదలతో సాగాలి. వేదాంత – ఫాక్స్కాన్లకు ఇరుకున పెట్టిన ఆర్థిక, సాంకేతిక అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలించాలి. భవిష్యత్తులో ఇలాంటి మరో ప్రయత్నానికి ఆ చిక్కులు రాకుండా నివారించాలి. సెమీ కండక్టర్ల రంగంలో సాంకేతిక విజ్ఞాన బదలీని ప్రోత్సహించాలి. పరిశోధన, అభివృద్ధిలో దేశ, విదేశీ సంస్థల మధ్య సహకారాన్నీ పెంచిపోషించడమూ అంతే ముఖ్యం. ఎందుకంటే, ఐఎస్ఎం కింద రూ. 76 వేల కోట్ల కేటాయింపుతో నాలుగు పథకాలు ప్రవేశపెట్టామంటున్న ప్రభుత్వం సంస్థలకు తగిన వాతావరణం కల్పిస్తేనే ఫలితం. మేకిన్ ఇండియాకు బ్రేకులు పడకూడదంటే అది అత్యంత కీలకం. -
Roundup 2022: మెరుపులు..మరకలు
ప్రగతి పథంలో సాగుతున్న ‘స్వతంత్ర’ కవాతుకు అమృతోత్సవ సంబరాలు... ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టిన ప్రజాస్వామ్య సొగసులు... ‘ఆత్మ నిర్భర్’ లక్ష్యంతో రక్షణ రంగంలో అగ్ని, ప్రచండ, విక్రాంత్ మెరుపులు... అంతరిక్ష రంగంలో ఇతర దేశాలతో పోటీ పడేలా తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ చిమ్మిన నిప్పులు... బ్రిటన్ను దాటేసి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వడివడిగా పెట్టిన పరుగులు... కంటికి కనిపించని క్రిమిపై పోరాటంలో ప్రపంచ దేశాలకు చూపిన ఆదర్శం... ...ఇవన్నీ ఈ ఏడాది మనం సాధించిన ఘన విజయాల్లో కొన్ని. సైన్యంలో తాత్కాలిక నియామకాలకు తెరలేపిన ‘అగ్ని’పథం, మైనార్టీ మహిళల హిజాబ్ ధారణపై వివాదం ...వంటి కొన్ని మరకలు. ఎంతో ఇష్టం, కొంచెం కష్టంగా సాగిన 2022లో ముఖ్య ఘటనలపై విహంగ వీక్షణం... మెరుపులు ► దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఒక ఆదివాసీ మహిళ అత్యున్నత పదవిని అధిష్టించడం ఒక చరిత్రగా నిలిచింది. సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గి కొత్త చరిత్ర లిఖించారు. దేశ 15వ రాష్ట్రపతిగా సగర్వంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఒడిశాలో మయూర్భంజ్ జిల్లాకు చెందినవారు. ► భారత్ ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకొని యూకేను కూడా దాటేసి ప్రపంచంలోని అతి పెద్ద అయిదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని నవంబర్ 15న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) తన నివేదికలో వెల్లడించింది. ► భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ నవంబర్ 18న శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా దూసుకుపోయింది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ రాకెట్ మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకువెళ్లింది. ► దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడానికి, కాగితం కరెన్సీ నిర్వహణకయ్యే ఖర్చుని తగ్గించడం కోసం ఆర్బీఐ డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా డిజిటల్ రుపీని అమల్లోకి తీసుకువచ్చింది. ► ఆత్మనిర్భర్ భారత్కు ఊతమిస్తూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బాహుబలి యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2న కొచ్చితీరంలో జాతికి అంకితం చేశారు. రూ.20వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ నౌక క్షిపణి దాడుల్ని తట్టుకోగలదు. ఇలాంటి సామర్థ్యం కలిగిన యుద్ధనౌకలున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకొని నిల్చున్నాం. భారత వాయుసేనలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండని అక్టోబర్లో ప్రవేశపెట్టారు. ఇక అణు పేలోడ్లను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణిని డిసెంబర్ 15న విజయవంతంగా ప్రయోగించడంతో త్రివిధ బలగాలు బలోపేతమయ్యాయి. మరకలు ► సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది. యువకులకు నాలుగేళ్లు సైన్యంలో పనిచేసే అవకాశం మాత్రమే కల్పించడంతో పాటు పింఛన్ సదుపాయం కూడా లేని ఈ పథకానికి జూన్ 14న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆందోళనలు హింసకు దారితీశాయి. ► కర్ణాటకలో ఉడిపిలో కళాశాలలో జనవరిలో హిజాబ్ ధరించి వచ్చినందుకు కొందరు ముస్లిం అమ్మాయిలను తరగతి గదుల్లోకి రానివ్వకపోవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వీరికి పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ దుస్తులు ధరించి రావడంతో మతఘర్షణలకు దారి తీసింది. కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్పై నిషేధం విధిస్తే మార్చి 15న హైకోర్టు దానిని సమర్థిస్తూ తీర్పు చెప్పింది. అక్టోబర్ 13న సుప్రీంకోర్టు భిన్న తీర్పులు వెలువరించడంతో తుది నిర్ణయం భారత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ చేతుల్లోకి వెళ్లింది. ► గుజరాత్లోని మోర్బిలో అక్టోబర్ 30 కుప్పకూలిపోయిన కేబుల్ వంతెన దుర్ఘటనలో 138 మంది మరణించారు. మానవ తప్పిదాల కారణంగానే ఈ వంతెన కుప్పకూలిపోయింది. ఒకేసారి వంతెనపైకి వంద మంది వెళ్లడానికి మాత్రమే వీలుంటే, నిర్వాహకులు 500 మందిని పంపడంతో ప్రమాదం జరిగింది. ► ఢిల్లీలో నివాసముంటున్న శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ పూనెవాలె మే 18న గొంతు కోసి హత్య చేయడంతో పాటు ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి చుట్టుపక్కల అడవుల్లో పారేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. మృతదేహం ముక్కల్ని ఫ్రిజ్లో ఉంచి రోజుకి కొన్ని పారేసిన వైనం ఒళ్లు జలదరించేలా చేసింది. నవంబర్ 11న అఫ్తాబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విషాదాలు ► యావత్ భారతావనిని దుఃఖసాగరంలో ముంచేస్తూ భారతరత్న, గానకోకిల లతామంగేష్కర్ (92); పద్మవిభూషణ్, కథక్ దిగ్గజం పండిట్ బిర్జు మహరాజ్ (83) తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ► సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ములాయం సింగ్ యాదవ్ కన్నుమూయడంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉజ్జ్వల శకానికి తెర పడింది. యాత్రలు, విజయాలు, చీలికలు ► కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 150 రోజుల భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఇటీవల వంద రోజులు పూర్తి చేసుకుంది. ► గాంధీ కుటుంబానికి చెందని సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టి రికార్డు సృష్టించారు. ► ఈ ఏడాది మొదట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా; చివర్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా... ఇలా ఐదు రాష్ట్రాల్లో నెగ్గి బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ హిమాచల్తో సరిపెట్టుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా పంజాబ్లో అఖండ విజయం సాధించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నెగ్గి బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించింది. జాతీయ పార్టీగానూ అవతరించింది! ► బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. ఆగస్టులో ఎన్డీయేకి గుడ్ బైకొట్టి తిరిగి మహాఘట్బంధన్లో చేరి ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ► మహారాష్ట్రలో శివసేన కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంది. పార్టీని ఏక్నాథ్ షిండే రెండు ముక్కలు చేశారు. భారీగా ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. ► నేషనల్ హెరాల్డ్ కేసు గాంధీ కుటుంబాన్ని వెంటాడుతోంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తొలిసారిగా ఈ ఏడాది ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కేంద్ర విచారణ సంస్థలైన ఈడీ, సీబీఐ ఈ ఏడాదంతా బిజీగా గడిపాయి. పలు విపక్ష పార్టీల నేతలను విచారించాయి. పలువురిని అరెస్టు చేశాయి. దీని వెనక రాజకీయ కక్షసాధింపు ఉందంటూ విపక్షాలు మండిపడ్డాయి. చరిత్రాత్మక తీర్పులు... ► అత్యంత వివాదాస్పదమైన దేశద్రోహ చట్టంపై 124ఏ అమలుపై స్టే విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం మే 11న తీర్పు చెప్పింది. 124ఏపై కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన పూర్తయ్యేవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ► మహిళల శరీరంపై వారికే హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరూ 24 వారాలవరకు సురక్షిత గర్భవిచ్ఛిత్తికి అనుమతినిచ్చింది. సెప్టెంబర్ 29న ఈ తీర్పు చెప్పిన సుప్రీం అబార్షన్ చట్టాల ప్రకారం పెళ్లయినవారు, కాని వారు అన్న తేడా ఉండదని స్పష్టం చేసింది. ► భార్య ఇష్టానికి వ్యతిరేకంగా భర్త శృంగారం చేసినా అది అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఎంటీపీ చట్టం ప్రకారం మారిటల్ రేప్లు కూడా అత్యాచారం కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ► ఇంటి అల్లుడు ఇంటి నిర్మాణం కోసం డబ్బులు డిమాండ్ చేసినా అది కట్నం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. విశ్వవేదికపై... ► ప్రపంచంలో అత్యంత శక్తిమంతదేశాల కూటమి జీ20కి అధ్యక్ష బాధ్యతల్ని భారత్ స్వీకరించింది. 2023 నవంబర్ 30 దాకా ఈ బాధ్యతల్లో కొనసాగనుంది. 50 నగరాల్లో 200 సన్నాహక భేటీల అనంతరం 2023 సెప్టెంబర్లో ఢిల్లీలో జీ20 సదస్సును నిర్వహించనుంది. ► ఐరాస భద్రతా మండలి అధ్యక్ష హోదాలో కౌంటర్ టెర్రరిజం కమిటీ (సీటీసీ) సదస్సును అక్టోబర్ 28, 29 తేదీల్లో ముంబై, ఢిల్లీల్లో జరిగింది. ► అరుణాచల్ప్రదేశ్లో తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య డిసెంబర్ 9న ఘర్షణలు జరిగాయి. వాస్తవాధీన రేఖ దాటి చొచ్చుకొచ్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను మన బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. -
రక్షణ రంగంలో రూ.8,431 కోట్ల ఎగుమతులు
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అమలు ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ సతీష్రెడ్డి చెప్పారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం విశాఖపట్నం వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మేకిన్ ఇండియాలో భాగంగా డీఆర్డీవో నుంచి సాంకేతిక బదలాయింపుని ప్రోత్సహించడం ద్వారా రక్షణ సామగ్రి ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పెరుగుతున్న ఎగుమతులు దేశీయ తయారీ రంగానికి ఉత్తేజం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారవుతున్న ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతిచేసే స్థాయికి చేరుకున్నాం. 2014–15 నాటికి రూ.2 వేల కోట్ల కంటే తక్కువలో ఉన్న డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 2020–21 నాటికి రూ.8,431 కోట్లకు చేరుకోవడం విశేషం. పదుల సంఖ్యలో దేశాలకు ఎగుమతులు జరుగుతుండటం శుభపరిణామం. ప్రస్తుతం 334 శాతం పెరుగుదల ఉన్న ఎగుమతులు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టార్పెడోలు, రాడార్ల ఎగుమతులపై చర్చలు పలు దేశాలు మన రక్షణరంగ పరికరాలతో పాటు ఆయుధ సంపత్తిని తీసుకుంటున్నాయి. త్వరలోనే అత్యంత శక్తిమంతమైన ఆయుధాల ఎగుమతులకు కూడా ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆకాష్, టార్పెడోలు, రాడార్లతో పాటు క్షిపణుల ఎగుమతులపై ప్రభుత్వం వివిధ దేశాలతో చర్చిస్తోంది. సాంకేతిక బదలాయింపుతో ప్రోత్సాహం రక్షణ రంగానికి అవసరమైన ఇన్నోవేషన్స్ని సృష్టించే అంకుర పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ చాలెంజ్ ద్వారా సాంకేతికత బదలాయింపు జరుగుతోంది. ఇప్పటికే డీఆర్డీవో నుంచి 60 పరిశ్రమలకు దాదాపు రూ.250 కోట్లకుపైగా టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అందించాం. డిఫెన్స్ రంగం వైపు ఎక్కువ స్టార్టప్స్ అడుగులు వేస్తున్నాయి. పరిశోధనల అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లోను మార్పులు వస్తున్నాయి. క్వాంటం, హైపవర్ లేజర్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్.. ఇలా ఎన్నో పరిశోధనలు వస్తున్నాయి. వీటిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్ అండ్ డీ బడ్జెట్లో 25 శాతం వరకు పరిశ్రమలు, స్టార్టప్స్, విద్యారంగానికి కేటాయించడం చరిత్రాత్మకమైన నిర్ణయం. ఏఐపీ ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి డీఆర్డీవోకి చెందిన నేవల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (ఎన్ఎంఆర్ఎల్)లో అభివృద్ధి చేసిన ఇంధన ఆధారిత ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్(ఏఐపీ) ల్యాండ్ బేస్డ్ ప్రోటోటైప్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. త్వరలో ఇంటిగ్రేషన్ చేయాలి. ఇతర సాంకేతికతలతో పోల్చిచూస్తే ఫ్యూయల్ బేస్డ్ ఏఐపీ సబ్మెరైన్లకు ఎంతో ఉపయోగపడుతుంది. శారదాపీఠంలో సతీష్రెడ్డి పూజలు సింహాచలం: విశాఖపట్నం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠాన్ని బుధవారం కేంద్ర రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు సతీష్రెడ్డి దర్శించుకున్నారు. పీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పూజలు చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు అందుకున్నారు. -
స్వావలంబనకు స్ఫూర్తి ఖాదీ
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం గుజరాత్కు చేరుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్లోని సబర్మతీ రివర్ఫ్రంట్ వద్ద నిర్వహించిన ‘ఖాదీ ఉత్సవ్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి లక్ష్యాల సాధనకు, ఆత్మనిర్భర్ భారత్(స్వాలంబన)నకు ఖాదీ స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఒకప్పుడు మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఖాదీని దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేశారని వాపోయారు. ఖాదీ ఉత్పత్తులను విస్తృతంగా వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే పండుగ సీజన్లో బంధుమిత్రులకు ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను బహుమతులుగా అందజేయాలని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 7,500 మంది ఇక్కడ చరఖా తిప్పి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని మోదీ సైతం స్వయంగా చరఖా తిప్పారు. అహ్మదాబాద్లో నూతన ఖాదీ గ్రామోద్యోగ్ భవనాన్ని ప్రారంభించారు. సబర్మతీపై అటల్ బ్రిడ్జి ప్రారంభం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో సబర్మతీ నదిపై పాదచారులు, సైక్లిస్ట్ల సౌకర్యార్థం నిర్మించిన ‘అటల్ బ్రిడ్జి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి స్థానికులు అర్పిస్తున్న నివాళి ఈ వారధి అని చెప్పారు. అటల్ బ్రిడ్జిపై మోదీతోపాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ కాసేపు సరదాగా నడిచారు. ప్రజలకు అభివాదం చేశారు. అటల్ బ్రిడ్జి సబర్మతీ నది రెండు ఒడ్డులను అనుసంధానించడమే కాదు, విశిష్టమైన, వినూత్నమైన డిజైన్తో ఆకట్టుకుంటోందని మోదీ అన్నారు. అటల్జీని గుజరాత్ ఎంతగానో ప్రేమించిందని చెప్పారు. 1996 లోక్సభ ఎన్నికల్లో ఆయన గాంధీనగర్ నుంచి పోటీచేసి, రికార్డుస్థాయిలో ఓట్లు సాధించి, ఘన విజయం సాధించారని గుర్తుచేశారు. ► అటల్ బ్రిడ్జి పొడవు 300 మీటర్లు. మధ్యభాగంలో దీని వెడల్పు 14 మీటర్లు. ► పాదచారులు, సైకిల్ ప్రయాణికులు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ► విభిన్నమైన డిజైన్, ఎల్ఈడీ లైటింగ్తో చూపరులకు కనువిందు చేస్తోంది. ► సబర్మతీ రివర్ఫ్రంట్ పశ్చిమ భాగంలోని ఫ్లవర్ గార్డెన్ను, తూర్పు భాగంలో రాబోయే ఆర్ట్స్ అండ్ కల్చరల్ సెంటర్ను అనుసంధానిస్తుంది. ► 2,600 మెట్రిక్ టన్నుల స్టీల్ పైపులు ఉపయోగించి అటల్ బ్రిడ్జి నిర్మించారు. ► పైకప్పును రంగుల వస్త్రంతో అలంకరించారు. సబర్మతీ నదిపై అటల్ వంతెన (ఇన్సెట్లో) వంతెనను ప్రారంభిస్తున మోదీ -
కేంద్రం తీరు మారితేనే ‘ఆత్మ నిర్భర్’ ఫలప్రదం
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటు విషయంలో, ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీరు మారాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఫలప్రదం కావాలంటే కేంద్రం ఆలోచనా విధానం మారాలని ఆయన అన్నారు. ఓట్లు్ల.. సీట్లు ఉన్నాయని, పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని కేంద్రం పరిశ్రమలను ఇష్టారీతిన తరలించడం సరికాదని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్)లో సుమారు 512 ఎకరాల విస్తీర్ణంలో వెమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న సమీకృత రక్షణ వ్యవస్థల తయారీ కేంద్రానికి మంత్రి కేటీఆర్ బుధవారం భూమి పూజ నిర్వహించారు. వెమ్ టెక్నాలజీస్ చైర్మన్ వెంకటరాజు, రక్షణ శాఖ మాజీ మంత్రి పళ్లంరాజు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వెమ్ టెక్నాలజీస్ భారతదేశపు లాక్హీడ్ మార్టిన్ (అమెరికా ఆయుధ కంపెనీ)గా ఎదుగుతుందన్న నమ్మకం తనకుందని అన్నారు. హైదరాబాద్, బెంగళూరులలో ఇప్పటికే కొన్ని రక్షణ రంగ పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో.. ఈ రెండు నగరాల మధ్య రక్షణ రంగ తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేలా ఒక కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి గతంలోనే ప్రతిపాదించామని తెలిపారు. ఈ పారిశ్రామిక కారిడార్ కారణంగా తెలంగాణ మాత్రమే కాకుండా ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకూ ప్రయోజనం చేకూరే అవకాశం ఉండగా.. కేంద్రం దాన్ని ఎకాఎకిన ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని బుందేల్ఖండ్కు తరలించిందని, ఇది సరికాదని ఆన్నారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి వెమ్ టెక్నాలజీస్ నిమ్జ్లో ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీలో క్షిపణులు, ఆయుధాలు, రాడార్లు, యుద్ధ విమానాల విడిభాగాలన్నీ తయారవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్టనున్న ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా రెండు వేల మందికి, పరోక్షంగా నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ వివరించారు. ఇక్కడి పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత వెమ్ టెక్నాలజీస్ వంటి సంస్థలపై ఉందని అన్నారు. అవసరమైతే స్థానికులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిననిమ్జ్ ప్రాజెక్టుకు భూములిస్తున్న రైతులకు తగినంత పరిహారం ఇచ్చేందుకు కలెక్టర్లు అన్ని చర్యలూ తీసుకోవాలని చెప్పారు. స్వదేశీ క్షిపణి ‘అసిబల్’ తయారీకి సిద్ధం: వి.వెంకటరాజు 1988లో స్థాపితమైన వెమ్ టెక్నాలజీస్ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్షిపణిని తయారు చేసేందుకు సిద్ధంగా ఉందని ‘అసిబల్’ పేరుతో తయారయ్యే ఈ క్షిపణి ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో వాడుతున్న జావెలిన్ తరహా క్షిపణి అని వెమ్ టెక్నాలజీస్ చైర్మన్ వెంకట రాజు తెలిపారు. ప్రైవేట్ రంగంలో తొలిసారి పూర్తిస్థాయి క్షిపణిని తయారు చేసిన కంపెనీగా వెమ్ రికార్డు సృష్టించనుందని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. సృష్టికర్త బ్రహ్మ చేతి ఖడ్గం పేరు ‘అసి’ కాగా.. బల్లెం అనే అర్థంలో బల్ను ఉపయోగించి క్షిపణి పేరును అసిబల్గా నిర్ణయించినట్లు చెప్పారు. ఏడాదికి పదివేల క్షిపణులను తయారు చేసేందుకు సంస్థకు అనుమతులు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో స్వదేశీ టెక్నాలజీతో ఒక యుద్ధ విమానాన్ని, అత్యాధునిక స్నైపర్ ఆయుధాలు, డ్రోన్లు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. -
దేశీయంగా 100 యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ: ‘ఆత్మ నిర్భర్ భారత్’లో భాగంగా దాదాపు 100 అత్యాధునిక యుద్ధ విమానాలను దేశీయంగా తయారు చేసే దిశగా వాయుసేన భారీ ప్రణాళికల్ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలతో చర్చిస్తోంది. ఈ ప్రాజెక్టులో 70 శాతం భారత కరెన్సీనే వాడేలా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీని వల్ల మేకిన్ ఇండియా ప్రాజెక్టు మరింత బలోపేతం కానుందన్నాయి. ‘‘భారత్లో 96 యుద్ధ విమానాల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. 36 విమానాల తయారీకి మన కరెన్సీతో పాటు విదేశీ మారక ద్రవ్యమూ చెల్లిస్తాం. 60 విమానాల చెల్లింపులకు పూర్తిగా భారత్ కరెన్సీనే వాడతాం’’ అన్నాయి. -
ఉదయగిరి.. చరిత్రలో ప్రత్యేక స్థానం
ఉదయగిరి.. చరిత్రలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. తిరుమల గిరులను పోలిన ఎత్తైన పర్వతశ్రేణులు, ప్రకృతి సోయగాలు, జలపాతాలతో కనువిందు చేస్తున్న ఉదయగిరి దుర్గం చోళులు, పల్లవులు, రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబుల పాలనలో వెలుగు వెలిగింది. ఎంతో కళాత్మకంగా నిర్మించిన ఆలయాలు, మసీదులు, కోటలు, బురుజుల ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. తాజాగా యుద్ధ నౌకకు ఉదయగిరి పేరు పెట్టడంతో జాతీయ స్థాయిలో ఖ్యాతి లభించింది. సాక్షి, నెల్లూరు/ఉదయగిరి: జిల్లాలోని ఉదయగిరి పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. యుద్ధ నౌకకు ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టారు. మాసాయిపేట కొండపై బంగారు, రాగి, వైట్ క్వార్ట్టŠజ్ నిక్షేపాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్ పనులు ముమ్మరంగా చేశారు. ఇంకా ఇక్కడ పర్యాటక రంగ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఆ కాలంలో.. క్రీ.శ 10 నుంచి 19వ శతాబ్దం వరకు ఇక్కడ ఎంతోమంది రాజుల పాలన సాగింది. ఇందులో విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉదయగిరి దుర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. అందమైన కట్టడాలు, విశాలమైన తటాకాలు ఈయన కాలంలోనే నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు కొన్నినెలలపాటు ఉదయగిరి కోటను కేంద్రంగా చేసుకుని పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ అలనాటి రాజులు, నవాబుల పాలనకు గుర్తుగా ఉదయగిరి కొండపై అద్దాల మేడలు, ఆలయాలు, మసీదులు, కోట బురుజులు దర్శనమిస్తాయి. పేరిలా వచ్చింది సూర్యకిరణాలు ఉదయగిరి కొండ శిఖరంపై ప్రసరించి ప్రకాశవంతంగా దర్శనమిస్తుండడంతో ‘ఉదయ’గిరి పర్వతశ్రేణికి ఉదయగిరిగా పేరు వచ్చినట్లు పెద్దలు చెబుతారు. సముద్రమట్టానికి 3,079 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంటుంది. తిరుమల గిరులను ఉదయగిరి పర్వతశ్రేణి పోలి ఉంటుంది. ఇందులో 3,600కి పైగా ఔషధ మొక్కలున్నట్లుగా శాస్త్రవేత్తల పరిశోధనలో గుర్తించారు. ఉదయగిరి దుర్గం కోటలు, ఎత్తైన ప్రాకారాలు, దట్టమైన చెట్లు, పక్షుల కిలకిలరావాలు, గలగల పారే జలపాతాలతో నిండి ఉంటుంది. ఓ కోటపైన పర్షియా సంప్రదాయ రీతిలో నిర్మించిన మసీదు ఉంది. దేశంతో ప్రసిద్ధి చెందిన చెక్క నగిషీ బొమ్మల తయారీకి ఉపయోగించే దేవదారు చెక్క ఇక్కడ లభ్యమవుతుంది. పర్యాటకాభివృద్ధి కోసం.. ఉదయగిరిని పర్యాటకరంగ పరంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కలెక్టర్ చక్రధర్బాబు గతంలో ఈ ప్రాంతంలో పర్యటించి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయించారు. హార్సిలీహిల్స్, ఊటీ తరహా వాతావరణం ఉదయగిరి దుర్గంపై ఉంటుంది. అక్కడ పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు సుమారు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర పర్యాటక శాఖకు పంపారు. అభివృద్ధి చెందుతుంది ఉదయగిరి సమీపంలో బంగారు, రాగి నిక్షేపాలు నిక్షిప్తమై ఉన్నాయన్న జాతీయ సర్వే నిపుణుల ప్రకటనలతో ఉదయగిరికి ఖ్యాతి లభించనుంది. ఎక్కడో మారుమూల వెనుకబడి ఉన్న ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు వెలుగుచూడడంతో ఈ ప్రాంత అభివృద్ధిపై ఆశాభావం కలుగుతోంది. మొత్తంగా రెండు, మూడురోజల వ్యవధిలో ఉదయగిరికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం విశేషం. భవిష్యత్లో అభివృద్ధి చెందుతుందనే కాంక్ష ఈ ప్రాంతవాసుల్లో బలంగా ఉంది. – ఎస్కే ఎండీ ఖాజా, ఉపాధ్యాయుడు ఉదయగిరికి జాతీయ కీర్తి ఎంతో చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న ఉదయగిరికి జాతీయ గుర్తింపు లభించడం సంతోషం. జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఉదయగిరి దుర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. దీంతో వెనుకబడి ఉదయగిరి ప్రాంతం అభివృద్ధితోపాటు రాష్ట్రంలో ఒక గుర్తింపు తగిన పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందుతుంది. రక్షణ రంగంలో కీలక యుద్ధ నౌకకు ఉదయగిరి పేరు పెట్టడం చారిత్రాత్మకం. – గాజుల ఫారుఖ్ అలీ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యుడు ఖనిజ నిక్షేపాల కోసం.. ఉదయగిరి మండలంలోని మాసాయిపేట కొండపై ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ జరిగింది. ఈక్రమంలో ఆ కొండపై రాగి, బంగారం, తెల్లరాయి ఖనిజ నిక్షేపాలున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాథమికంగా గుర్తించింది.. ప్రస్తుతం ఆ ఖనిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. మొత్తంగా ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1,000 అడుగుల మేర డ్రిల్లింగ్ నిర్వహించి 46 నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. సుమారు రెండు వేల ఎకరాల్లో ఖనిజ నిక్షేపాలున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. అగ్రీ యూనివర్సిటీ మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్ యూనివర్సిటీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల మంత్రి వర్గ సమావేశంలో కూడా తీర్మానం చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి స్మారకార్ధంగా దీనిని నిర్మించి మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టించేలా, వ్యవసాయ రంగంపై విద్యార్థులకు కూడా మక్కువ పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్సిటీ కోసం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి సుమారు రూ.250 కోట్ల విలువైన భూములు, ఆస్తులను అప్పగించారు. ఇది ఏర్పాటైతే విద్యార్థులు అగ్రికల్చర్ కోర్సులు చదివేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. యుద్ధ నౌకకు పేరు ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ముంబైలో ప్రారంభించారు. పోరాట సామర్థ్యానికి మరింత పదును పెట్టే యుద్ధ నౌకకు ఏపీలోని నెల్లూరు జిల్లా రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టడంతో ఈ ప్రాంత ఖ్యాతి మరింత చరిత్రపుటల్లోకెక్కింది. దీనిపై నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డితోపాటు ప్రముఖులు రాజ్నాథ్సింగ్కు ధన్యవాదాలు తెలిపారు. -
ఎల్ఐసీ ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ సక్సెస్ అయ్యింది. షేరుకి రూ. 902–949 ధరలో ఈ నెల 4న ప్రారంభమైన ఇష్యూ 9న(సోమవారం) ముగిసింది. చివరి రోజుకల్లా ఇష్యూ మొత్తం 2.95 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. దాదాపు 16.21 కోట్ల షేర్లను ప్రభుత్వ ఆఫర్ చేయగా.. 47.83 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. క్విబ్ కోటాలో 2.83 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 2.91 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇక రిటైలర్ల విభాగంలో ఆఫర్ చేసిన 6.9 కోట్ల షేర్లకుగాను 13.77 కోట్ల షేర్ల కోసం(దాదాపు రెట్టింపు) దరఖాస్తులు లభించాయి. పాలసీదారుల నుంచి 6 రెట్లు, ఉద్యోగుల నుంచి 4.4 రెట్లు అధికంగా బిడ్స్ వచ్చాయి. పాలసీదారులకు రూ. 60, ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 45 చొప్పున ఐపీవో ధరలో ఎల్ఐసీ రాయితీ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయానికి ఉంచిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 20,600 కోట్లవరకూ సమకూర్చుకుంది. ఇతర హైలైట్స్ ► ఐపీవోలో భాగంగా దరఖాస్తుదారులకు ఎల్ఐసీ షేర్లను ఈ నెల 12కల్లా కేటాయించనుంది. ► బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఎల్ఐసీ ఈ నెల 17న(మంగళవారం) లిస్ట్కానుంది. ► రూ. 20,557 కోట్ల సమీకరణ ద్వారా ఎల్ఐసీ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు నెలకొల్పింది. తదుపరి ర్యాంకుల్లో రూ. 18,300 కోట్లతో పేటీఎమ్(2021), రూ. 15,500 కోట్లతో కోల్ ఇండియా(2010), రూ. 11,700 కోట్లతో రిలయన్స్ పవర్(2008) నిలిచాయి. ఆత్మనిర్భర్ భారత్ బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ అన్ని విభాగాల్లోనూ విజయవంతమైనట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే తెలియజేశారు. ఇది ఆత్మనిర్భర్ భారత్కు ఉదాహరణగా పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు ఎల్ఐసీ ఆఫర్ను సక్సెస్ చేసినట్లు తెలియజేశారు. తద్వారా విదేశీ ఇన్వెస్టర్లపైనే ఆధారపడిలేమని నిరూపణ అయినట్లు వ్యాఖ్యానించారు. ఇది దేశీ క్యాపిటల్ మార్కెట్లు మరింత బలపడేందుకు దోహదం చేయగలదని అభిప్రాయపడ్డారు. -
మన ఎగుమతులు భేష్
న్యూఢిల్లీ/సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల (రూ.30 లక్షల కోట్లు) విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన ఉత్పత్తులకు ప్రపంచమంతటా డిమాండ్ పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువుల కోసం దేశాలు ఎదురు చూస్తున్నాయని, మన సప్లై చైన్ రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతోందని అన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదాన్ని ప్రతి భారతీయుడు అందిపుచ్చుకుంటే లోకల్ గ్లోబల్గా మారడానికి ఎక్కువ సమయం పట్టదని చెప్పారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఏడాదిగా ప్రభుత్వం ఈ–మార్కెట్ ద్వారా రూ.లక్ష కోట్లకుపైగా విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసిందన్నారు. 1.25 లక్షల మంది చిన్నతరహా వ్యాపారవేత్తలు, దుకాణదారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించారని తెలిపారు. గతంలో బడా వ్యాపారులే ప్రభుత్వానికి సరుకులను విక్రయించే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు చిన్న వ్యాపారులు, దుకాణదారులకు కూడా ఆ అవకాశం లభిస్తోందని వెల్లడించారు. భారతీయులంతా చేతులు కలిపితే ఆత్మనిర్భర్భారత్ లక్ష్యసాధన సులువేనన్నారు. ఆయుష్కు అద్భుత అవకాశాలు ఆయుష్ ఉత్పత్తులకు మార్కెట్ విస్తరిస్తుండడం సంతోషకరమని మోదీ చెప్పారు. ఈ రంగంలో స్టార్టప్లకు అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయుష్ పరిశ్రమ మార్కెట్ విలువ రూ.22,000 కోట్ల నుంచి రూ.1.4 లక్షల కోట్లకు చేరిందన్నారు. మన ఉత్పత్తుల ప్రతిష్టను, గిరాకీని మరింత పెంచుకొనేలా కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. 126 ఏళ్ల వయసులో పద్మశ్రీ అందుకున్న యోగా గురువు స్వామి శివానంద జీవితం నుంచి దేశం ఎంతో స్ఫూర్తిని పొందుతోందని మోదీ అన్నారు. ప్రతి చుక్కనూ ఆదా చేసుకోవాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాలు నిర్మించుకోవాలన్నారు. ఏప్రిల్ 1న పరీక్షా పే చర్చ ఏప్రిల్ 1న ఢిల్లీ తల్కటోరా స్టేడియంలో ‘పరీక్షా పే చర్చ’లో మోదీ విద్యార్థులతో స్వయంగా మాట్లాడనున్నారు. పరీక్షల పండుగ జరుపుకుందామంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ మెట్ల బావి ప్రస్తావన తెలంగాణలోని సికింద్రాబాద్లో ఇటీవల బయటపడిన మెట్ల బావి గురించి మన్కీ బాత్లో ప్రధాని ప్రస్తావించారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన మెట్లబావి పునరుద్ధరణకు ప్రజలు చూపిన చొరవను అభినందించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి బంగినపల్లి, సువర్ణరేఖ మామిడి పండ్లు దక్షిణ కొరియాకు కూడా ఎగుమతి అవుతున్నాయంటూ ఆయన ప్రశంసించారు. -
ఎగుమతులు... కొత్త చరిత్ర!
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్లు (సుమారు రూ.30 లక్షల కోట్లు) విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఆత్మనిర్భర భారత్ మైలురాయిని అందుకోవడంలో ఇది కీలకమని చెప్పారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 9 రోజులు మిగిలి ఉండగానే ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 22 వరకు ఎగుమతులు 37 శాతం పెరిగి 400 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. భారతదేశ చరిత్రలో ఎగుమతులు 400 బిలియన్ డాలర్లను చేరుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ‘‘భారత్ 400 బిలియన్ డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని మొదటిసారి అధిగమించింది. మన రైతులు, చేనేతకారులు, ఎంఎస్ఎంఈలు, తయారీదారులు, ఎగుమతిదారులు అందరినీ ఈ విజయాన్ని సాధించినందుకు అభినందిస్తున్నాను. మన ఆత్మనిర్భర భారత్ ప్రయాణానికి ఇది కీలకం‘‘అంటూ మోదీ ట్వీట్ చేశారు. స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్కు వెళుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాల సహకారంతో.. ట్విట్టర్లోనే ప్రధాని కొన్ని గ్రాఫిక్స్ను కూడా పోస్ట్ చేశారు. రాష్ట్రాల భాగస్వామ్యం, జిల్లా అధికారులు, ఎగుమతిదారులతో సంప్రదింపులు, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం, వివిధ ఎగుమతుల మండళ్లు, పరిశ్రమల మండళ్లు, భాస్వాములతో చురుగ్గా సంప్రదింపులు చేయడం వల్లే ఈ మైలురాయిని చేరుకోవడం సాధ్యపడినట్టు గ్రాఫిక్స్ను పరిశీలిస్తే తెలుస్తోంది. ప్రతి నెలా సగటున 33 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధ్యమయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తులు..: ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరగడానికి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ గూడ్స్, తోలు, కాఫీ, ప్లా స్టిక్, రెడీమేడ్ వస్త్రాలు, మాంసం, డెయిరీ, సము ద్ర ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులు మద్దతుగా నిలిచాయి. 400 బిలియన్ డాలర్ల ఎగుమతు లు నిజం గా గొప్ప మైలురాయిగా భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు. రవాణా పరంగా ఎన్నో సవాళ్లు ఉన్నాకానీ, అదనంగా 100 బిలియన్ డాలర్ల ఎగుమతులు పెంచుకోగలిగినట్టు చెప్పారు. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలకుతోడు, పీఎల్ఐ పథకాలు ఎగుమతుల వృద్ధికి సాయపడినట్టు తెలిపారు. 37 శాతం అధికం.. దేశ చరిత్రలో మొదటిసారి ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించాయి. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర వాణిజ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 37 శాతం పెరిగి 400.8 బిలియన్ డాలర్లుగా మార్చి 21 నాటికి నమోదైనట్టు తెలిపింది. 2020–21లో 292 బిలియన్ డాలర్లు, 2018–19లో 330 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు గణాంకాలు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 21 నాటికి దిగుమతులు 589 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే 189 బిలియన్ డాలర్ల మేర వాణిజ్యలోటు ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మరికొన్ని రోజుల్లో 10–12 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు నమోదు కావచ్చని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. -
ప్రపంచ ఔషధశాల భారత్.. 100 దేశాలకు కరోనా టీకా
న్యూఢిల్లీ: ఈ ఏడాది దాదాపు 100 దేశాలకు 6.5 కోట్లకుపైగా కరోనా టీకా డోసులను ఎగుమతి చేశామని ప్రధాని మోదీ చెప్పారు. భారత ఆరోగ్యసంరక్షణ రంగం ప్రపంచ దేశాల నమ్మకాన్ని చూరగొన్నదని తెలిపారు. భారత్ను ప్రపంచ ఔషధశాలగా (ఫార్మసీ) పరిగణిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని టీకా డోసులను విదేశాలకు ఎగుమతి చేయబోతున్నామని వెల్లడించారు. ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించి తొలి ‘ప్రపంచ ఆవిష్కరణల శిఖరాగ్ర సదస్సు’ను గురువారం ప్రారంభించారు. మనదేశంలో వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు సానుకూల వాతావరణం కల్పిస్తున్నామని, ప్రోత్సాహం అందిస్తున్నామని మోదీ గుర్తుచేశారు. దీనివల్ల కొత్త ఔషధాల అభివృద్ధి, వినూత్న వైద్య పరికరాల తయారీలో భారత్ అగ్రగామిగా ఎదగడం ఖాయమని చెప్పారు. వైద్య రంగాన్ని గొప్ప స్థాయికి చేర్చగల సామర్థ్యం ఉన్న సైంటిస్టులు, సాంకేతిక నిపుణులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారని తెలియజేశారు. ఇండియాను స్వయం సమృద్ధ దేశంగా(ఆత్మనిర్భర్) మార్చడానికి దేశంలోని 130 కోట్ల మంది కంకణం కట్టుకున్నారని ప్రధాని పేర్కొన్నారు. టీకాలు, ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను దేశీయంగానే తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు ఇదే స్ఫూర్తిని చాటిచెప్పామని ఉద్ఘాటించారు. 150కిపైగా దేశాలకు ప్రాణరక్షక ఔషధాలు, వైద్య పరికరాలు అందజేశామని వివరించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఫార్మా రంగం ఎంతగానో దోహదపడుతోందని ప్రశంసించారు. డిజిటల్ విప్లవంతో కొత్త సవాళ్లు ఆస్ట్రేలియా డైలాగ్లో ప్రధాని మోదీ క్రిప్టోకరెన్సీ వాడకం ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతోందని, ఇది దుష్ట శక్తుల చేతుల్లో పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని∙మోదీ చెప్పారు. డిజిటిట్ విప్లవంతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భావ సారుప్యం కలిగిన దేశాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ‘ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూషన్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులతో గురువారం నిర్వహించిన సదస్సులో(సిడ్నీ డైలాగ్) మోదీ ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. ఆధిపత్యం చెలాయించడానికి టెక్నాలజీ ఉపయోగించుకొనే అవకాశం ఉందని గుర్తుచేశారు. ఫ్యూచర్ టెక్నాలజీలో పరిశోధనలు, అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య దేశాలు ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టాలని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసే యత్నాలను అడ్డుకొనేందుకు కృషి చేయాలని చెప్పారు. రాజకీయాలు, ఆర్థిక, సామాజిక రంగాలను డిజిటల్ యుగం పునర్నిర్వచిస్తోందని తెలిపారు. డిజిటల్ విప్లవంతో దేశాల సార్వభౌమత్వం, పరిపాలన, విలువలు, హక్కులు, భద్రత విషయంలో కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయని వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ విషయంలో అప్రమత్తత అవసరమని ఉద్ఘాటించారు. ఇది మన యువతను నాశనం చేసే ప్రమాదం ఉందన్నారు. భారత్లో డేటాను ప్రజల సాధికారత కోసం ఒక వనరుగా ఉపయోగిస్తున్నామని గుర్తుచేశారు. డిజిటల్ విప్లవంతో అభివృద్ధికి నూతన అవకాశాలే కాదు, కొత్త సవాళ్లు సైతం ఎదురవుతున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బ్రాడ్బ్యాండ్తో భారత్లో 6 లక్షల గ్రామాలను అనుసంధానించామని తెలిపారు. -
ఎకానమీకి విస్తృత వ్యాక్సినేషన్ దన్ను!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని ఆర్థిక మంత్రిత్వశాఖ తన తాజా నివేదికలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో మూల స్తంభాలు పటిష్టంగా ఉండడంతోపాటు, వేగవంతంగా వ్యాక్సినేషన్ పక్రియ జరుగుతుండడం, పండుగల సీజన్ వంటి అంశాలు దేశంలో డిమాండ్ రికవరీ పటిష్టతకు దారితీస్తున్నట్లు తెలిపారు. డిమాండ్–సరఫరాల్లో అంతరం తగ్గుతోందని, ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరగుపడుతున్నాయని కూడా ఆర్థిక వ్యవస్థ నెలవారీ సమీక్షా నివేదిక పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► భారతదేశ ఆర్థిక పునరుద్ధరణలో ఆత్మనిర్భర్ భారత్ మిషన్, వ్యవస్థాగత సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆయా కార్యక్రమాలు, చర్యల వల్ల వ్యాపార అవకాశాలు, డిమాండ్, వ్యయాలు పెరుగుతున్నాయి. ► అధిక విస్తీర్ణంలో రబీ సాగు, మెరుగైన రిజర్వాయర్ స్థాయిలు, ఎరువులు, విత్తనాల విషయంలో రైతులకు తగినంత లభ్యత వంటి అంశాలు వ్యవసాయ రంగం పురోగతికి దోహద పడుతోంది. ఆర్థిక పునరుద్ధరణలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ► వ్యవసాయ–ఎగుమతుల్లో స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఈ విభాగంలో 22 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ఆయా అంశాలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తున్నాయి. గ్రామీణ డిమాండ్ పటిష్టంగా ఉంది. 2021 సెప్టెంబర్లో ట్రాక్టర్లు, ద్విచక్ర, త్రి చక్ర వాహనాల విక్రయాలు పటిష్ట రికవరీని సూచిస్తున్నాయి. ► రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడి, మార్కెట్లో తగినంత లిక్విడిటీ (ద్రవ్య లభ్యత), బాండ్ల రేట్ల స్థిరత్వం వంటి అంశాలు ఎకానమీకి సానుకూల అంశాలుగా ఉన్నాయి. ► బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలుచేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గింపు ప్రయోజనం వ్యవస్థలో ప్రతిబింబిస్తోంది. 2020 ఫిబ్రవరి– 2021 సెప్టెంబర్ మద్య తాజా రూపీ రుణాలపై సగటు రుణ రేటు 130 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గిడం సానుకూలాంశం. ► భారత్ ఎకానమీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని 2020–21 ఎకనమిక్ సర్వే పేర్కొంటోంది. పలు రేటింగ్, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అంచనాలు 9–10 శాతం శ్రేణిలో ఉన్నాయి. -
రూ.100 లక్షల కోట్లతో ‘గతిశక్తి’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బహుముఖ అనుసంధానమే లక్ష్యంగా చేపట్టిన గతిశక్తితో రాబోయే 25 ఏళ్ల భారతావనికి పునాది పడిందని ప్రధాని మోదీ చెప్పారు. 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల ముఖచిత్రం సమూలంగా మారనుందని తెలిపారు. రూ.100 లక్షల కోట్లతో అమలు చేసే ‘పీఎం గతిశక్తి.. నేషనల్ మాస్టర్ప్లాన్ ఫర్ మల్టీ–మోడల్ కనెక్టివిటీ’ కార్యక్రమానికి ప్రధాని బుధవారం శ్రీకారం చుట్టారు. ఢిల్లీ ప్రగతి మైదాన్లో నూతన అంతర్జాతీయ ఎగ్జిబిషన్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పంతో రాబోయే 25 సంవత్సరాల భారతదేశానికి పునాది వేస్తున్నామని ఉద్ఘాటించారు. ‘పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ 21వ శతాబ్దిలో భారతదేశానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తుందని ప్రధాని మోదీ వివరించారు. ప్రగతి కోసం పని, ప్రగతి కోసం సంపద, ప్రగతి కోసం ప్రణాళిక, ప్రగతికే ప్రాధాన్యం.. ఇదే ఈనాటి మంత్రమని అన్నారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే విషయంలో దేశంలో చాలా రాజకీయ పక్షాలకు ఓ ఆలోచన లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఆయా పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో వాటికి స్థానం కల్పించడం లేదన్నారు. మౌలిక సదుపాయాల కల్పనను కొన్ని రాజకీయ పక్షాలు విమర్శిస్తుండడం దారుణమని మండిపడ్డారు. ఏమిటీ ‘గతిశక్తి’? ఈ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ను ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు. 5 ట్రిలియన్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో గతిశక్తి మాస్టర్ ప్లాన్ ఎంతో ఉపకరిస్తుందని కేంద్రం విశ్వసిస్తోంది. గతకాలపు బహుళ సమస్యలను పరిష్కరించడంతోపాటు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల భాగస్వాముల కోసం ‘గతిశక్తి’ని తీసుకొచ్చారు. ఆరు స్తంభాల పునాదితో.. ప్రాధాన్యీకరణ: దీనిద్వారా వివిధ శాఖలు, విభాగాలు ఇతర రంగాలతో సంప్రదింపుల ద్వారా తమ ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని నిర్ణయించుకోగల అవకాశం లభిస్తుంది. గరిష్టీకరణ: వివిధ మంత్రిత్వ శాఖలు తమ ప్రాజెక్టు ప్రణాళికలను రూపొందించుకోవడంలో జాతీయ బృహత్ ప్రణాళిక తోడ్పాటునిస్తుంది. ఉదాహరణకు ఒకచోట నుంచి మరోచోటికి వస్తువుల రవాణా కోసం సమయం, ఖర్చుపరంగా గరిష్ట ప్రయోజనం గల మార్గాన్ని ఎంచుకునే వీలు కల్పిస్తుంది. కాల సమన్వయం: ప్రస్తుతం మంత్రిత్వ శాఖలు, విభాగాలు వేటికవి తమ పని తాము చేసుకుంటున్నాయి. ప్రాజెక్టుల ప్రణాళిక, అమలులో సమన్వయం లోపించి, పనులు జాప్యమవుతాయి. ‘పీఎం గతిశక్తి’ వీటికి స్వస్తి పలుకుతుంది. ప్రతి విభాగం ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవచ్చు. దీంతో కాలం, శక్తి ఆదా అవుతుంది. విశ్లేషణాత్మకత: 200కిపైగా అంచెలు గల విశ్లేషణాత్మక అంతరిక్ష ఉపకరణాల ఆధారిత గణాంకాలని్నటినీ ఈ ప్రణాళిక అందుబాటులోకి తెస్తుంది. గతిశీలత: ‘జీఐఎస్’ సాయంతో అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఇతర శాఖలకు చెందిన ప్రాజెక్టులను గమనించడంతోపాటు సమీక్షిస్తూ, ప్రగతిని పర్యవేక్షించే సౌలభ్యం ఉంటుంది. ఆ మేరకు ఉపగ్రహ చిత్రాలను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అందించడమే కాకుండా ప్రాజెక్టుల ప్రగతి వివరాలు క్రమబద్ధంగా పోర్టల్లో నమోదు చేస్తారు. సమగ్రత: పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించిన ప్రస్తుత, ప్రణాళికల రూపంలో గల అన్ని ప్రాజెక్టులనూ కేంద్రీకృత పోర్టల్తో అనుసంధానిస్తారు. దీనివల్ల అన్ని శాఖలు, విభాగాలకు అన్ని ప్రాజెక్టులపై అవగాహన పెరుగుతుంది. తద్వారా ఆయా ప్రాజెక్టులను సకాలంలో, సమగ్రంగా పూర్తి చేసేందుకు వీలుంటుంది. -
‘సోలార్’.. మేమే ఇస్తాం
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్తుకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన భారీ సౌర విద్యుత్తు ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో కీలక గుర్తింపు లభించింది. అంతే కాదు ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్కు 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును తామే అందించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏటా 3 వేల మెగావాట్ల చొప్పున మూడేళ్లలో మొత్తం 9 వేల మెగావాట్ల ప్రాజెక్టును అందిస్తామని తెలిపింది. కిలోవాట్ అవర్కు రూ.2.49 చొప్పున సౌర విద్యుత్తు అందిస్తామని ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టు ఏర్పాటుకు టెండర్లు పిలిచిన విషయం కేంద్రం దృష్టికి రావడంతో ఆ ప్రాజెక్టుకు బదులుగా దీన్ని చేపట్టే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. ఈ మేరకు ‘ఎస్ఈసీఐ’ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపినట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ బుధవారం తెలిపారు. తమ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నట్లు ఎస్ఈసీఐ లేఖలో పేర్కొంది. వినూత్న విధానాలకు ప్రశంసలు.. నాణ్యమైన ఉచిత విద్యుత్తుతో రైతాంగానికి చీకు చింతా లేకుండా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వాన్ని బాగా ఆకర్షించింది. ఈ మహాయజ్ఞంలో తామూ పాలుపంచుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ) ముందుకు వచ్చింది. తక్కువ వ్యయంతో పునరుత్పాదక శక్తి వనరుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సరికొత్త విధానాలను ఎస్ఈసీఐ ప్రశంసించింది. 25 ఏళ్ల పాటు వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు ఉచితంగా విద్యుత్ అందించేందుకు 9 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ను సరఫరా చేస్తామంటూ ప్రతిపాదించింది. ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ పధకం ద్వారా సబ్సిడీలు కూడా అందిస్తామని తెలిపింది. ట్రాన్స్మిషన్ చార్జీల మాఫీ కూడా.. రాష్ట్ర ప్రభుత్వం 6,400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు టెండర్లు పిలవగా కొందరు కాంట్రాక్టర్లు కిలోవాట్ అవర్(కేడబ్ల్యూహెచ్)కు రూ.2.49 చొప్పున టారిఫ్ ప్రతిపాదించినట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే అదే టారిఫ్కు తాము 9 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ను అందిస్తామని ఎస్ఈసీఐ తెలిపింది. 9 వేల మెగావాట్లను మూడేళ్లలో అంటే 2024, 2025, 2026లో మూడు వేల మెగావాట్ల చొప్పున అందుబాటులోకి తెస్తామని ప్రతిపాదించింది. దీనివల్ల డిస్కంలకు కూడా విద్యుత్ కొనుగోలు, సరఫరాపై అంచనాకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. తమ ప్రతిపాదనకు ఏపీ అంగీకరిస్తే సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు వెచ్చించే వ్యయం రాష్ట్రానికి మిగులుతుందని, అది ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చని సూచించింది. తాము ఇప్పటికే టెండర్లు పిలిచి సోలార్ పవర్ ప్రాజెక్టులకు కాంట్రాక్టు ఇచ్చినందున దాని నుంచి ఏపీకి సరఫరా చేస్తామని తెలిపింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టం (ఐఎస్టీఎస్) చార్జీల మాఫీ కూడా ఏపీకి వర్తింపజేస్తామని పేర్కొంది. -
ఆయుధాల నవీకరణకు నిధులేవి?
దేశీయంగా ఆయుధ సేకరణ కోసం రక్షణరంగానికి చేసిన భారీ కేటాయింపు.. భారత రక్షణ పారిశ్రామిక పునాదిని విస్తృతపరుస్తుందని, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ స్థాయి పరిశ్రమలను ప్రోత్సహించడంపై బహువిధ ప్రభావం వేస్తుందని రక్షణమంత్రి ఘనంగా ప్రకటించారు. ఎంచుకున్న లక్ష్యాలను చూస్తే ఆయన ప్రకటనను తప్పుపట్టలేం. కానీ చేదు నిజం ఏమిటంటే, దేశీయంగా రక్షణ కొనుగోళ్లకు కేటాయించిన రూ. 70,221 కోట్లలో అధికభాగం గతంలో రక్షణశాఖ హామీపడిన చెల్లింపులకు ఖర్చు కావడమే. అంటే పాత చెల్లింపులు పోతే కొత్త కొనుగోళ్లకు మిగిలేది అత్యంత తక్కువ మొత్తమేనని అర్థమవుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన భారీ మొత్తాన్ని పూర్తిగా స్థానిక రక్షణ విక్రేతలకు, నూతన ఒప్పందాల కింద ఆయుధాలు, పరికరాల సరఫరాదారులకు చెల్లిస్తారని భ్రమలు పెట్టుకోవలసిన పనిలేదు. రక్షణ సామగ్రి అవసరాల్లో ఆత్మనిర్భర్ లేక స్వావలంబన సాధించటానికి అధికశాతం ఆయుధ సామగ్రిని దేశీయంగానే సేకరించబోతున్నట్లు కేంద్రప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనలో స్థానికతకు ఏమాత్రం చోటు లేదనిపిస్తోంది. ఈ ప్రతిపాదనలో కొత్త విషయమూ లేదు. అలాగని అసాధారణమైన అంశమూ లేదు. దీర్ఘకాలంగా వాయిదాలో ఉంటున్న ఈ లక్ష్య సాధనకు తోడ్పడటానికి రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయిస్తున్న ఆర్థిక కేటాయింపుల్లో అతి స్వల్పమాత్రంగానే పెంచడం అనే గత కాలపు ధోరణికి కేంద్రప్రభుత్వ తాజా ప్రకటన ఒక కొనసాగింపే తప్ప దీంట్లే మరే కొత్త విషయమూ లేదు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి దేశ రక్షణకోసం రూ.70,221 కోట్లు లేదా మొత్తం మూలధన కొనుగోలు బడ్జెట్లో 63 శాతం వరకు త్రివిధ దళాలకు దేశీయంగా సేకరించిన రక్షణ సామగ్రిపైనే వెచ్చించనున్నట్లు గత నెలలో రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దిగుమతులను బాగా తగ్గిం చుకుని మేక్ ఇన్ ఇండియా అనే ప్రభుత్వ భావనను బలోపేతం చేసే లక్ష్యం నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,35,061 కోట్ల మూలధన వ్యయంలో రక్షణ రంగంలో కొనుగోలు బడ్జెట్ కింద కేటాయించిన రూ.1,11,714 కోట్ల మొత్తం చిన్న భాగం మాత్రమే. ప్రస్తుత సంవత్సరం సవరించిన రక్షణ కొనుగోళ్ల వ్యయంలో వాస్తవానికి రూ. 2,551 కోట్లను తగ్గించడం గమనార్హం. ప్రధానంగా యుద్ధవిమానాలు, ఏరో ఇంజిన్లు, భారీ, మధ్యతరహా సైనిక వాహనాలతోపాటు త్రివిధ దళాలకు ఇతర పరికరాలను కొనడానికి ఈ మొత్తాన్ని కేటాయించారు. అనేక అధునాతన రక్షణ ప్లాట్ఫాంలు, వాటితో ముడిపడిన ప్రోగ్రామ్లు, భారతీయ వాయుసేనకు చెందిన ఇతర ప్రత్యేక ప్రాజెక్టుల కొనుగోలుకోసం ఈ కేపిటల్ అక్విజిషన్ బడ్జెట్ (సీఏబీ) నుంచి నిధులు కేటాయిస్తారు. ఈ రక్షణ కొనుగోలు బడ్జెట్ నుంచి చిన్న మొత్తాన్ని దేశీయంగా ఆయుధాల సేకరణపై వెచ్చించడం అనేది అసాధారణం కాదు. ఉదాహరణకు 2014–15 నుంచి 2018–19 (డిసెంబర్ 2019 వరకు) మధ్య కాలంలో రక్షణ రంగంపై చేసిన వ్యయం సీఏబీలో 60 శాతంగా ఉండిందని గ్రహించాలి. న్యూఢిల్లీలో ఈ సంవత్సరం ఒక వెబినార్ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించిన మొత్తం కంటే ఇది 3 శాతం మాత్రమే తక్కువ. ఈ కేటాయింపు భారత రక్షణ పారిశ్రామిక పునాదిని విస్తృతపర్చడంపై, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ స్థాయి పరిశ్రమలను ప్రోత్సహించడంపై బహువిధ ప్రభావం వేస్తుందని రక్షణమంత్రి ఘనంగా ప్రకటించారు. అలాగే రక్షణ రంగ అవసరాలను తీర్చే స్టార్టప్లు, దేశీయ ఉపాధి అవకాశాలను కూడా ఇది గణనీయంగా పెంచుతుందని మంత్రి పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాలను చూస్తే రక్షణమంత్రి ప్రకటనను తప్పుపట్టలేం. కానీ ప్రకటిత ఉద్దేశాలకు, అసలు వాస్తవానికి మధ్య కాస్త అంతరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే చేదు నిజం ఏమిటంటే, దేశీయంగా రక్షణ కొనుగోళ్లకు కేటాయించిన రూ. 70,221 కోట్లలో అధికభాగం గతంలో రక్షణశాఖ హామీపడిన చెల్లింపులకు ఖర్చు కావడమే. లేదా గతంలో కొన్న రక్షణ ప్లాట్ఫాం, ఆయుధాల కొనుగోళ్లకు చెల్లించాల్సిన అసలు చెల్లింపులకు ఈ కేటాయింపులో అధిక భాగం సరిపోవచ్చు. విశ్వసనీయ అంచనా ప్రకారం ఇలా గతంలోని కొనుగోళ్లకు చెల్లించాల్సిన మొత్తం ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రక్షణ కొనుగోళ్ల మొత్తంలో 80 నుంచి 90 శాతం వరకు ఉండటమే. అంటే పాత చెల్లింపులు పోతే కొత్త కొనుగోళ్లకు మిగిలేది అత్యంత తక్కువ మొత్తమేనని మనకు అర్థమవుతుంది. అంటే కేంద్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన రూ. 70,221 కోట్ల మొత్తాన్ని పూర్తిగా స్థానిక రక్షణ విక్రేతలకు, నూతన ఒప్పందాల కింద ఆయుధాలు, పరికరాల సరఫరాదారులకు చెల్లిస్తారని భ్రమలు పెట్టుకోవలసిన పనిలేదు. ఈ వాస్తవ పరిస్థితి గురించి మన త్రివిధ బలగాలకు స్పష్టంగా తెలుసు. 2018 సంవత్సరంలోనే అప్పటి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ నాటి రక్షణరంగంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి స్పష్టంగా ఒక విషయం తెలిపారు. సీఏబీలో భారత సాయుధ బలగాలకు కేటాయించిన అతి స్వల్ప మొత్తం కారణంగా 2018–19 ఆర్థిక సంవత్సరానికి గానూ, చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఆధునీకరణ ప్రక్రియపై భారత సైన్యం పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా హరీమన్నాయని ఆయన తేల్చిచెప్పారు. భారత సైనిక అవసరాలకు కేటాయించిన ఆర్థిక పొడిగింపు అనేది ద్రవ్యోల్బణాన్ని, పన్నుల పెంపుదలను తటస్థీకరించడానికి మాత్రమే సరిపోతుందని, మేకిన్ ఇండియా ప్రాజెక్టులకు, మౌలిక వనరుల అభివృద్ధికి, సైన్యం చెల్లించాల్సిన చెల్లింపులకు చాలా కొద్దిమొత్తమే మిగులుతుందని నాటి లెఫ్టినెంట్ జనరల్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి మొరపెట్టుకున్నారు. అంతకుమించి పొరుగు దేశంతో నిత్య ఘర్షణల నేపథ్యంలో జరూరుగా అవసరమైన మందుగుండు సామగ్రి, ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సమర్థ నిర్వహణకు ఇది తూట్లు పొడుస్తుందని శరత్ చంద్ వాపోయారు. అలాగే, సైన్యం వద్ద ఉన్న ఆయుధాల్లో 68 శాతం వరకు పురాతన కేటగిరీలో ఉంటున్నాయని, సమకాలీన అవసరాలకు సరిపోయే ఆయుధాలు 28 శాతం మాత్రమే ఉన్నాయని, అందులోనూ అత్యధునాతన ఆయుధ సామగ్రి 8 శాతం మాత్రమే భారత సైన్యం వద్ద ఉందని, ఈ పరిస్థితుల్లో రక్షణ రంగానికి కేటాయింపులు క్షీణిస్తూ పోతే భారత సాయుధ బలగాల ఆధునీకరణ ప్రక్రియనే అది సవాలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన మొత్తం ఎంత అనేది రక్షణ మంత్రి వెబినార్ సమావేశంలో పేర్కొనలేదు. రక్షణ శాఖ వద్ద ఈ సమాచారం ఉన్నప్పటికీ, పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీకి ఈ విషయం ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నప్పటికీ చెల్లించాల్సిన మొత్తం ఎంత అనేది రక్షణ శాఖ బహిరంగపర్చలేదు. రక్షణ బడ్జెట్లలో చెల్లింపులకు తక్కువ కేటాయింపులను చేస్తూ పోవడం వల్ల ఒక దశలో రక్షణ శాఖ ఇకేమాత్రం చెల్లింపులు చేయలేని స్థితికి దిగజారిపోవచ్చని రక్షణపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవలి నివేదికలో హెచ్చరించింది కూడా. దీంతో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయ రక్షణ పరిశ్రమను ప్రోత్సహించడానికి అతి తక్కువ మాత్రమే కేటాయించాల్సి వచ్చింది. భారతీయ, విదేశీ రక్షణరంగ పరిశ్రమాధిపతులకు కూడా భారత రక్షణ శాఖ బడ్జెట్ వాస్తవాల గురించిన అవగాహన ఉంది. వెబినార్లో తాజాగా రక్షణశాఖ ప్రకటన వీరిలో కాస్త ఉత్సాహాన్ని కలిగించిందంటే దానికి కారణం.. సైనిక సామగ్రి కోసం ప్రపంచ మార్కెట్లో పనిచేస్తున్న ఆయుధాల విక్రేతలు భారతీయ రక్షణరంగ చీకటి జోన్లో ఏదో ఒకరకంగా మనుగడ సాగించాల్సి ఉండటమే. వీరి పరిస్థితి ఎలా ఉంటుం దంటే ద్రవరూప ఆక్సిజన్లో వీరు కూరుకుపోయినట్లు ఉంటుంది. దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే ద్రవరూప ఆక్సిజన్ వీరిని బతకనీయదు. ఆదే సమయంలో ఆక్సిజన్ వీరిని చావనివ్వదు. ఎందుకంటే జారీ చేసిన టెండర్లు, బహుకరించిన కాంట్రాక్టుల కోసం వీరు నిరంతరం వేచి ఉండాల్సి ఉంటుంది. దశాబ్దాలుగా రక్షణ రంగ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఎలాంటి సత్ప్రయత్నాలు జరగటం లేదు. పైగా ఈ వ్యవస్థలో ఉంటున్న ప్రతి ఒక్కరూ యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఉండిపోయారు. ఓ ఒక్కరి ఆచరణలోనూ సాహసోపేతమైన అడుగులు వేయలేదు. వీరిలో చాలామంది రంగం నుంచి తప్పుకున్నారు. పరస్పర ఆరోణలతో మంత్రిత్వ శాఖలోని పౌర సైనిక విభాగాలను మరింత నిరంకుశత్వం వైపు నెట్టేశారు. ప్రతిసారీ లక్ష్య సాధనవైపు అడుగేయడం, లోపభూయిష్టమైన పథకంతో కుప్పగూలడం.. దీంతో సర్వత్రా అనిశ్చితి రాజ్యమేలడం.. జరుగుతూ వస్తున్న క్రమం ఇదే మరి. అమిత్ కౌషిశ్, ఆర్థిక సలహాదారు రాహుల్ బేడీ, సీనియర్ జర్నలిస్ట్ -
కాలం చెల్లిన చట్టాలు మనకొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కాలం చెల్లిన పురాతన చట్టాలను రద్దు చేయక తప్పదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. తద్వారా దేశంలో వ్యాపార, వాణిజ్యాన్ని మరింత సులభతరం చేయొచ్చని అన్నారు. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడానికి కేంద్ర, రాష్ట్రాలు మరింత సన్నిహితంగా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగస్వామిగా మారడానికి ప్రైవేట్ రంగానికి పూర్తి అవకాశం ఇవ్వాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆంక్షల సడలింపుపై రాష్ట్రాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. శనివారం నీతి ఆయోగ్ పాలక మండలి ఆరో సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. దేశ ప్రగతికి ప్రాతిపదిక సహకార సమాఖ్య తత్వమేనని గుర్తుచేశారు. దేశాన్ని పోటీతత్వ సహకార సమాఖ్య దిశగా మళ్లించేందుకు మేధోమథనం చేయడమే ఈ సమావేశ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారం మరింత పెరగాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి కృషి వల్లే కరోనా మహమ్మారి గడ్డు పరిస్థితిని దేశం అధిగమించగలిగిందని గుర్తు చేశారు. దేశ అత్యున్నత ప్రయోజనాలే పరమావధిగా నీతి ఆయోగ్ సమావేశ ఎజెండాను ఎంపిక చేసినట్లు వెల్లడించా రు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. పేదలకు పక్కా ఇళ్లు ‘దేశంలో ప్రతి పేద పౌరుడికీ పక్కా గృహ వసతి కల్పించే ఉద్యమం కొనసాగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో 2014 నుంచి ఇప్పటివరకు 2.40 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. జల్జీవన్ మిషన్ ప్రారంభించాక 18 నెలల్లో∙3.5 లక్షల గ్రామీణ నివాసాలకు నల్లా ద్వారా తాగునీరు అందుబాటులోకొచ్చింది. ఇంటర్నెట్తో గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి ఉద్దేశించిన ‘భారత్ నెట్’ పథకం పెను మార్పులకు మాధ్యమం కానుంది. ప్రైవేట్ రంగం శక్తిని గౌరవించాలి : ఈ ఏడాది కేంద్ర బడ్జెట్పై సానుకూల ప్రతిస్పందన వ్యక్తమయ్యింది. ఇది దేశం మనోభావాలను బహిర్గతం చేసింది. ఇక సమయం వృథా చేయకుండా వేగంగా ముందడుగు వేయాలన్న దృఢ నిర్ణయానికి దేశం వచ్చింది. ఇండియా ప్రారంభించిన ఈ ప్రగతి ప్రయాణంలో భాగస్వామ్యానికి ప్రైవేట్ రంగం కూడా ఉత్సాహంతో ముందుకువస్తోంది. ఈ నవ్యోత్సాహాన్ని, ప్రైవేట్ రంగం శక్తిని ప్రభుత్వం తనవంతుగా గౌరవిస్తూ స్వయం సమృద్ధ(ఆత్మ నిర్భర్) భారత్ ఉద్యమంలో వీలైనంత ఎక్కువ అవకాశాలు సృష్టించాలి. దేశ అవసరాల కోసమే కాకుండా ప్రపంచం కోసం కూడా ఉత్పత్తి చేయగలిగేలా భారత్ అభివృద్ధి చెందాలి. ఇందుకు స్వయం సమృద్ధ భారత్ ఉద్యమం ఒక మార్గం. ఆవిష్కరణలకు ప్రోత్సాహం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశ ఆకాంక్షల దృష్ట్యా ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం వేగంగా చేపట్టాలి. నవీన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలి. విద్యా, నైపుణ్య రంగాల్లో మెరుగైన అవకాశాల కల్పన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఎక్కువగా వాడుకోవాలి. దేశంలో వ్యాపారాలు, సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ), అంకుర సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలోని వివిధ జిల్లాల్లో వాటికే ప్రత్యేకమైన ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నాం. ఈ విధానాన్ని మండలాల స్థాయికి విస్తరించాలి. వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాల నుంచి ఎగుమతులను పెంచాలి. వివిధ రంగాల కోసం కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ప్రకటించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులు భారీగా పెరుగుతున్నాయి. స్థానిక పరిపాలన సంస్కరణల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతోపాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం. ప్రపంచ దేశాలకు మన ఉత్పత్తులు విదేశాల నుంచి వంటనూనెల దిగుమతికి ప్రతిఏటా రూ.65,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వాస్తవానికి ఈ సొమ్మంతా మన రైతులకు దక్కాల్సి ఉంది. నూనె గింజల ఉత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలి. అనేక వ్యవసాయ ఉత్పత్తులను దేశ అవసరాల కోసమే కాకుండా ప్రపంచానికి సరఫరా చేయాలి. ఇది జరగాలంటే ఉత్పత్తులను భారీగా పెంచాలి. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు ప్రాంతీయ వ్యవసాయ–వాతావరణ ప్రణాళిక వ్యూహాన్ని రూపొందించుకోవాలి. లాభార్జన కోసం కేవలం ముడి ఆహార పదార్థాలను కాకుండా, వాటి నుంచి రూపొందించిన ఉత్పత్తులను ఎగుమతి చేయాలి’ అని మోదీ అన్నారు. మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎల్జీలు, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాలక మండలి చైర్మన్గా ప్రధాని మోదీ నీతి ఆయోగ్ పాలక మండలిని కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. పాలక మండలి చైర్మన్గా ఇకపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తారు. సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి ప్రతినిధులు పాలక మండలిలో ఫుల్టైమ్ సభ్యులుగా ఉంటారు. అండమాన్ నికోబార్ దీవులు, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రత్యేక ఆహ్వానితులుగా పనిచేస్తారు. ప్రతిభ మనది.. ఉత్పత్తి మనది కాదు ‘నేను ఇటీవల ఐటీ రంగంలోని వ్యక్తులతో మాట్లాడా. తమలో 95 శాతం మంది ఇప్పుడు ఇంటినుంచే పని చేస్తున్నారని, ఉత్పాదకత పెరిగిందని చెప్పారు. నిబంధనల్లో సంస్కరణలు తేవడం వల్లే ఇది సాధ్యమైంది. జియో స్పేషియల్ డేటాకు సంబంధించిన నియమాలను కూడా సరళీకృతం చేశాం. పదేళ్ల క్రితమే చేయగలిగితే.. బహుశా గూగుల్ వంటివి భారతదేశం వెలుపల నిర్మితమయ్యేవి కావు. మన ప్రజలకు ప్రతిభ ఉంది, కానీ వారు తయారు చేసిన ఉత్పత్తి మనది కాదు’ అని అన్నారు. -
మ్యాపింగ్ పాలసీలో కీలక సడలింపులు
న్యూఢిల్లీ: భారత మ్యాపింగ్ పాలసీలో నిబంధనలను సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జియోస్పేషియల్ డేటా నియంత్రణా నియమావళిలో మార్పులు చేయడం ద్వారా ఈ రంగంలో పబ్లిక్, ప్రైవేట్ సంస్థలకు సమానావకాశాలు ఉండేలా చర్యలు తీసుకుంది. కొత్త నిబంధనల్లో భాగంగా ఈ రంగాన్ని డీరెగ్యులేట్ చేయడంతో పాటు సర్వేయింగ్, మాపింగ్, యాప్స్ అభివృద్ధికి ప్రీ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మార్పులు చేసినట్లు సైన్స్అండ్టెక్నాలజీ సెక్రటరీ అశుతోష్ చెప్పారు. దేశీయ సంస్థలు జియోస్పేషియల్ డేటా సేవలందించేందుకు ముందుకు వస్తే ఎలాంటి ముందస్తు అనుమతులు, సెక్యూరిటీ క్లియరెన్సులు, లైసెన్సులు అవసరం లేదన్నారు. జియోస్పేస్ రంగంలో నిబంధనల సడలింపు ఆత్మ నిర్భర్ భారత్లో కీలక ముందడుగని ప్రధాని మోదీ అభివర్ణించారు. హైక్వాలిటీ మ్యాప్స్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న పలు రంగాలకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని సైన్స్అండ్టెక్నాలజీ మంత్రి హర్ష వర్ధన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు సర్వే ఆఫ్ ఇండియా సైతం మ్యాపులు తయారు చేయాలంటే పలు ఏజెన్సీల అనుమతులు తీసుకోవాల్సివచ్చేదని గుర్తు చేశారు. ఇంతవరకు నిషిద్ధ జోన్గా పేర్కొనే ప్రాంతాల జియోస్పేషియల్ డేటా సైతం ఇకపై అందుబాటులోకి వస్తుందని, అయితే ఇలాంటి సున్నిత ప్రాంతాలకు సంబంధించిన సమాచార వినియోగానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ తీసుకువస్తామని తెలిపారు. ప్రజా నిధులతో సేకరించే డేటా మొత్తం దేశీయ సంస్థలకు అందుబాటులో ఉంటుందని, కేవలం సెక్యూరిటీ, లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు సేకరించిన డేటా మాత్రం అందుబాటులో ఉండదని వివరించారు. తాజా మార్పులతో 2030 నాటికి రూ.లక్ష కోట్ల విలువైన జియో స్పేషియల్ డేటా అందుబాటులోకి వస్తుందన్నారు. కొత్త నిబంధనలు ఆహ్వానించదగినవని జియోస్పేషియల్ రంగానికి చెందిన ఇస్రి ఇండియా టెక్, జెనిసిస్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు వ్యాఖ్యానించాయి. -
'టాటా' యుద్ద విమానాలు వచ్చేస్తున్నాయి!
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన టాటా గ్రూపు.. యద్ధ విమానాల తయారీలోనూ తన సత్తా చాటనుంది. ఖరీదైన రక్షణ దిగుమతులకు ప్రత్యామ్నాయంగా... స్థానికంగానే వాటి ఉత్పత్తిని ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ "ఆత్మనిర్భర్ భారత్" కార్యక్రమంలో టాటా గ్రూపు పాలుపంచుకోనుంది. అత్యంత ఎత్తులో విహరించగల ట్విన్ ఇంజన్ ఎయిర్క్రాఫ్ట్ తయారీలో తన సామర్ధ్యాలను టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్ లిమిటెడ్. బుధవారం నుంచి(ఈ నెల 3 నుంచి 5 వరకు) బెంగళూరులో జరిగే 'ఏరో ఇండియా 2021" కార్యక్రమంలో ప్రదర్శించనుంది. కంపెనీ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. రెండేళ్ళకొకసారి బెంగళూరులో ఏరో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. యుద్ధ విమానాల తయారీకి సంబంధించి మేధోపరమైన హక్కులను టాటా అడ్వాన్స్డ్ సి ఇప్పటికే సొంతం చేసుకుంది. టాటా సంస్థ రూపొందించిన మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ విజయం సాధిస్తే... ప్రైవేటు రంగంలో యుద్ధ విమానాలను తయారు చేయగల తొలి దేశీయ సంస్థగా అవతరించనుంది. ప్రభుత్వ రంగంలోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లీమిటెడ్ ఒక్కటే ఇప్పటి వరకు ఈ సామర్థ్యాలను నిరూపించుకున్న సంస్థ కావడం గమనార్హం. అంతేకాదు, భారత్లో తయారీ కార్యక్రమానికి మరింత మద్దతు కూడా లభించనుంది. టాటా నూతన యుద్ద విమానాన్ని సరిహద్దుల్లో నిఘా, సైనిక అవసరాలకు వినియోగించే అవకాశం ఉంటుందని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. -
నేటి స్టార్టప్లే రేపటి ఎమ్ఎన్సీలు
న్యూఢిల్లీ: భారత్లో నేటి స్టార్టప్లే రేపటి బహుళ జాతి సంస్థలుగా మారుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అది సాధించినప్పుడే ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారం అవుతుందని అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా వివిధ దేశాలకు చెందిన ఎంఎన్సీలు భారత్లో వ్యాపారం చేశాయని, ఇక భారత్ ఎంఎన్సీలు ఇతర దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తాయని అన్నారు. భారతదేశం లోకల్ నుంచి గ్లోబల్ వైపు అడుగులు వేయడానికి ఐఐఎం విద్యార్థులందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒడిశాలోని సంబల్పూర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) శాశ్వత భవనానికి శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. సృజనాత్మక ఆలోచనలతో అందరినీ భాగస్వాముల్ని చేస్తూ కలసి కట్టుగా ముందుకు వెళ్లడమే నిర్వహణ రంగంలో ముఖ్య సూత్రమన్నారు. భారత్ తన కాళ్ల మీద తాను నిలబడడానికి అదే కావాలన్నారు. ప్రతీ విద్యార్థి తమ కెరీర్ లక్ష్యాలను దేశాభివృద్ధికి ఉపయోగపడేలా మలచుకోవాలన్నారు. భారత్ ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండ్ కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఐఐఎం విద్యార్థులు కొత్త కాన్సెప్ట్లతో లోకల్ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ వచ్చేలా కృషి చేసి ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం చేసుకోవడానికి తోడ్పాటునందించాలన్నారు. లోకల్ నుంచి గ్లోబల్ మధ్య ఐఐఎం విద్యార్థులే వారధిగా ఉంటారని మోదీ చెప్పారు. -
కిసాన్ క్రెడిట్.. రూ.7,362 కోట్లు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద.. కిసాన్ క్రెడిట్ కార్డులపై రాష్ట్రంలో పంట రుణాలు, మత్స్య, పశు సంవర్ధక రంగాలకు కలిపి బ్యాంకులు ఇప్పటివరకు రూ.7,362.38 కోట్ల మేర రుణాలు మంజూరు చేశాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. లాక్డౌన్ నేపథ్యంలో మందగించిన ఆర్ధిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు, అలాగే రైతులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా కిసాన్ క్రెడిట్ కార్డులపై పంట రుణాలను మంజూరు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంతో కేంద్రం ఈ ప్యాకేజీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కిసాన్ క్రెడిట్ కార్డులపై 2.50 కోట్ల మంది రైతులకు పంట రుణాలను మంజూరు చేయించాలని లక్ష్యంగా నిర్ధారించింది. అలాగే దేశ వ్యాప్తంగా 1.50 కోట్ల మంది డెయిరీ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించింది. దీంతో గత ఏడాది జూన్ 1వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు రాష్ట్రంలో ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజీ కింద 7,66,827 దరఖాస్తులు అందాయి. ఇందులో అర్హత గల దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు పంపించి రుణాలు మంజూరు చేయించడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ప్యాకేజీ కింద వీలైనంత ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టగా బ్యాంకులు సైతం సానుకూలంగా స్పందించాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతో పాటు పాడి, మత్స్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో బ్యాంకులు కూడా ఆయా రంగాలకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. -
ఐఐటీ హైదరాబాద్లో టైహాన్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. నగర శివారు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ–హైదరాబాద్)లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అడుగు పడింది. మానవ రహిత విమానాలు, రిమోట్ కంట్రోల్తో నడిచే వాహనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం పరీక్షించేందుకు ఉద్దేశించిన ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫర్ అటానమస్ నేవిగేషన్ సిస్టమ్స్(టైహాన్)’ ఏర్పాటుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారం పునాది వేశారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ దిశగా వేస్తున్న అతిపెద్ద ముందంజగా ఈ ప్రాజెక్టును అభివర్ణించారు. స్వతంత్ర నేవిగేషన్ వ్యవస్థకు సంబంధించిన పలు విభాగాలు ఈ ప్రాజెక్టులో కలసికట్టుగా పనిచేస్తాయన్నారు. మానవ రహి త విమానాల నిర్వహణలో ఎదురయ్యే వాస్తవ సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. మానవ రహిత డ్రోన్లు, వాహనాలను ఎలాంటి అడ్డంకులు, ప్రమాదాలు లేకుండా పరీక్షించేందుకు ఇదో మేలైన వ్యవస్థగా రూపొందుతుం దని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీవీఎస్ మూర్తి తెలిపారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం ఐఐటీ–హెచ్కు రూ.135 కోట్లు మంజూరు చేశాయి. ప్రాజెక్టులో భాగం గా టైహాన్లో టెస్ట్ ట్రాక్లు, నిత్యజీవితంలో ఎదురయ్యే రకరకాల పరిస్థితులను తలపించేవి ఏర్పాటవుతాయి. అత్యాధునిక సిమ్యులేషన్ టెక్నాలజీలు, రహదారి వ్యవస్థలు, వీ2ఎక్స్ కమ్యూనికేషన్, డ్రోన్లు ఎగిరేందుకు, దిగేందుకు అవసరమైన రన్వేలు, ల్యాండింగ్ ఏరియాలు ఏర్పాటుచేస్తా రు. ఇటు సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్/గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, హ్యాంగర్లు కూడా ఈ ప్రాజెక్టులో ఉంటాయని ఐఐటీ–హెచ్ ఓ ప్రకటనలో తెలిపింది. -
అరకొర ఉద్దీపన
కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడి ఏడెనిమిది నెలలవుతున్నా అదింకా దారికి రాలేదు. మన దేశంతోపాటు ప్రపంచ దేశాలన్నిటా ఇప్పటికీ ఆ వైరస్ దోబూచులాడుతూనే వుంది. ఈలోగా అన్ని దేశాలూ తమ తమ ఆర్థిక వ్యవస్థలను చక్కబరుచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 2.65 లక్షల కోట్ల విలువైన ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఆమె దీన్ని ఆత్మనిర్భర్ ప్యాకేజీ 3.0 అని నామకరణం చేశారు. లోగడ వెలువరించిన రెండు ఉద్దీపన ప్యాకేజీలనూ కలుపుకుంటే ఇంతవరకూ కరోనా అనంతర ఆర్థిక వ్యవస్థను చక్క దిద్దడానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 29 లక్షల 87వేల 641 కోట్ల మొత్తాన్ని వ్యయం చేస్తున్నట్టవుతుందని(జీడీపీలో 15శాతం) ఆమె లెక్క చెప్పారు. ఇందులో ప్రభుత్వం వాటా 9 శాతంకాగా, రిజర్వ్బ్యాంకు వాటా 6శాతం. ఇది బహుశా 2021–22 బడ్జెట్కు ముందు ప్రకటించిన చివరి ఉద్దీపన అయివుండొచ్చు. మన ఆర్థిక వ్యవస్థ స్వల్పంగానైనా కోలుకుంటున్న సూచనలు కనబడుతున్నాయని ఆర్థిక నిపుణులు కొందరు సంతోషపడుతున్నారు. విద్యుత్ వాడకం పెరగడం, రైల్వేల్లో సరుకు రవాణా, ఈ–వే బిల్లులు పుంజుకోవడం, బొగ్గు ఉత్పత్తి పెరగడం, జీఎస్టీ వసూళ్ల ముమ్మరం వంటివి అందుకు ఉదాహరిస్తున్నారు. మన ఆర్థికవ్యవస్థ దాదాపు కరోనా ముందునాటి పరిస్థితికి చేరుకుంటోందని వారి అంచనా. మన ఆర్థిక వ్యవస్థకు తగిలే దెబ్బపై గతంలోని అంచ నాలను అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఈమధ్యే స్వల్పంగానైనా సవరించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే కేంద్రం ప్రకటించిన తాజా ప్యాకేజీ వారిని సంతృప్తిపరిచి వుండొచ్చు. ఈ ఉద్దీపనలు పట్టణ ప్రాంతాల్లో కార్మికుల సంఖ్యను పెంచడానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, రుణలభ్యత కోసం ఇబ్బందులు పడుతున్న రంగాలను ఆదుకోవడానికి, దేశీయ తయారీరంగం పుంజుకోవడానికి, స్థిరాస్తి రంగం మళ్లీ పరుగులెత్తడానికి తోడ్పడతాయని కేంద్రం చెబుతోంది. రైతులకు ఎరువుల సబ్సిడీగా రూ. 65,000 కోట్ల మేర ప్రకటించారు. ఇదికూడా గ్రామీణ ఉపాధికి ఆసరాగా నిలుస్తుందని భావిస్తోంది. అయితే ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీ అయినా, లోగడ ప్రకటించినవైనా ప్రభుత్వ దృష్టి ఎంతసేపూ ఉత్పత్తి వైపున్నది తప్ప గిరాకీ వైపులేదన్నది స్పష్టమవుతోంది. కొత్తగా చేర్చుకునే ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్ మొత్తాన్ని రెండేళ్లపాటు కేంద్రమే చెల్లించడం...చిన్న పరిశ్రమలు, చిరు వ్యాపారుల కోసం ఇంతకు ముందు ప్రకటించిన అత్యవసర రుణ వితరణ హామీ పథకాన్ని పొడిగించడం, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ప్రోత్సాహకాలు కల్పించడం, గ్రామీణ ఉపాధి హామీకి అదనపు నిధులివ్వడం, స్థిరాస్తి రంగంలోని బిల్డర్లకూ, కొనుగోలుదారులకూ ఆదాయ పన్ను ఉపశమనం వంటివన్నీ ఈ మాదిరివే. ఇందువల్ల ఆయా సంస్థలు పెద్దయెత్తున ఉద్యోగ, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటాయని... ఆరకంగా జనంలో కొనుగోలు శక్తి పెరుగుతుందని ప్రభుత్వం అంచనా. ఇందులో తప్పుబట్టవలసింది ఏమీ లేదు. కానీ తాము ఉత్పత్తి చేసే సరుకుకు బయట డిమాండు వుంటుందన్న హామీ వుంటే తప్ప ఏ సంస్థా రుణాలు తీసుకోవడానికి ముందుకు రాదు. ఒక్కసారి వెనక్కెళ్లి చూస్తే కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడటానికి ముందు కూడా ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా వున్న వైనాన్ని గమనించి ఎవరూ రుణాలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. తీసుకునేవారున్నా రుణాలివ్వడానికి బ్యాంకులు భయపడే పరిస్థితులున్నాయి. బయట గిరాకీ పెద్దగా లేదని తెలిసినపుడు అప్పులిచ్చేవారికీ, తీసుకునేవారికీ కూడా ఇలాంటి భయాలు సహజమే. పైగా తాజా ఉద్దీపనలో కార్పొరేట్ రంగానికి, విదేశాల నుంచి వచ్చే కంపెనీలకు పెద్ద పీట వేశారని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన వివిధ సంఘాల కన్సార్షియం సీఐఏ ఆరోపిస్తోంది. గత ప్యాకేజీల్లో ఇచ్చిన రుణ వితరణ వెసులుబాట్లకు సంబంధించిన గడువు పొడిగించడం మినహా కొత్తగా చేసిందేమిటని ప్రశ్నిస్తోంది. లక్షలాదిమందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు ప్రకటించిన రుణ వితరణ పథకాల వినియోగం తగినంతగా లేదని వస్తున్న కథనాలు ఆందోళన కలిగిస్తాయి. అందుకుగల అడ్డంకులేమిటో పాలకులు గమనించారా? లేదని ఆ సంస్థలు చెబు తున్నాయి. ఆ రుణాలకు సవాలక్ష నిబంధనలు పెడుతున్నారని ఆమధ్య కొన్ని సంస్థలు వాపోయాయి. కార్మికులకు ఉపాధి కల్పించలేకపోవడానికి కేవలం వారి ఈపీఎఫ్ మొత్తం చెల్లించే స్థోమత లేకపోవడంవల్లనేనని, రెండేళ్ల రాయితీతో అంతా సర్దుకుంటుందని కేంద్రం భావించడం సరికాదు. ఈఎంఐలపై మారటోరియం గడువు ముగిశాక మొన్న సెప్టెంబర్లో 21 శాతం చెక్కులు వెనక్కొచ్చాయని సీఐఏ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. మున్ముందు ఇదింకా పెరగొ చ్చని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. జనం కొనుగోలు శక్తి పెరిగితే ఉత్పత్తయిన సరుకుకు గిరాకీ ఏర్పడుతుంది. అందుబాటులో తగినంత మొత్తం వుంటే తమ అవసరాలు తీర్చుకోవడానికి జనం వెనకాడరు. మన ఆర్థిక వ్యవస్థకైనా, ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలకైనా ఇదే వర్తిస్తుంది. ప్రజానీకానికి నగదు బదిలీ చేస్తే పొదుపుచేస్తారు తప్ప ఖర్చు చేయరని కొందరు ఆర్థికవేత్తలు పెదవి విరుస్తున్నారు. కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం సైతం ఆమాటే అన్నారు. ప్రపంచంలో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు మొదలుకొని కొన్ని చిన్న దేశాల వరకూ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి నగదు బదిలీని ఒక మార్గంగా ఎంచుకున్నారు. అందువల్ల ఫలితాలు కనబడుతున్నాయి కూడా. ఉద్యోగ కల్పనకు సమాంతరంగా దాన్నికూడా అమలు చేస్తే మంచిది. అది అసలైన ఆత్మనిర్భరతకు తోడ్పడుతుంది. ఆ దిశగా కేంద్రం ఆలోచించాలి. -
జీడీపీ పరుగులు పెట్టేలా ప్రత్యేక ప్యాకేజీ: నిర్మల
న్యూఢిల్లీ: కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాలలో జీడీపీ నీరసించినప్పటికీ మూడో క్వార్టర్(అక్టోబర్- డిసెంబర్) నుంచి వృద్ధి బాట పట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. జీడీపీ వృద్ధిపై ఆర్బీఐ తాజాగా అంచనాకు వచ్చినట్లు తెలియజేశారు. ఇటీవల కనిపిస్తున్న డిమాండ్ తాత్కాలికమైనదికాదని..ఇకపైనా పటిష్టంగా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు నిదర్శనంగా వెల్తువెత్తిన జీఎస్టీ వసూళ్లు, గత నెలలో 12 శాతం పెరిగిన విద్యుత్ వినియోగం, రోజుకి 20 శాతం వృద్ధి చూపుతున్న రైల్వే సరుకు రవాణా, కొత్త రికార్డులను సాధిస్తున్న స్టాక్ మార్కెట్లు తదితరాలను ప్రస్తావించారు. విదేశీ మారక నిల్వలు సైతం రికార్డ్ స్థాయిలో 560 బిలియన్ డాలర్లను తాకినట్లు తెలియజేశారు. గత 11 రోజులుగా పటిష్ట రికవరీ కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఆర్థిక పురోగతికి దన్నునిచ్చేందుకు సహాయక ప్యాకేజీలో భాగంగా ఆత్మనిర్భర్-3ను ప్రకటించారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి సీతారామన్ ఇంకా ఏమన్నారంటే.. హైలైట్స్ - ఎరువుల సబ్సిడీ కింద రైతులకు రూ. 65,000 కోట్ల కేటాయింపు. - జాతీయ మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధి(ఎన్ఐఐఎఫ్)కి రూ. 6,000 ఈక్విటీ పెట్టుబడులు. తద్వారా 2025కల్లా ఎన్ఐఐఎఫ్ రూ. 1.1 లక్షల కోట్లను సమీకరించగలుగుతుంది. తద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు నిధులను సమకూర్చగలుగుతుంది. - గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి రూ. 10,000 కోట్ల అదనపు కేటాయింపులు. - రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్కు బూస్ట్- డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు పన్ను సంబంధిత ఉపశమన చర్యలు- సెక్షన్ 43సీఏలో సవరణలు! - ఆత్మనిర్భర్ తయారీ పథకంలో భాగంగా 10 చాంపియన్ రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను అందించనున్నారు. - ఈ పథకం విలువ రూ. 1,45,980 కోట్లు. - అడ్వాన్స్ సెల్ కెమిస్ట్రీ బ్యాటరీకు రూ. 18,100 కోట్లు - ఎలక్ట్రానిక్, టెక్నాలజీ ప్రొడక్టులు రూ. 5,000 కోట్లు - ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు రూ. 57,042 కోట్లు - ఫార్మాస్యూటిక్స్, ఔషధాలు రూ. 15,000 కోట్లు - టెలికం, నెట్వర్కింగ్ ప్రొడక్టులు రూ. 12,195 కోట్లు - టెక్స్టైల్ ప్రొడక్టులు రూ. 10,683 కోట్లు - అధిక సామర్థ్యంగల సోలార్ పీవీ మాడ్యూల్స్ రూ. 4,500 కోట్లు - వైట్ గూడ్స్(ఏసీలు, లెడ్) రూ. 6,328 కోట్లు - స్పెషాలిటీ స్టీల్ రూ. 6,322 కోట్లు - స్వావలంబన పథకంలో భాగంగా 12 రకాల చర్యలను ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పేరుతో పథకాన్ని ప్రకటించారు. కోవిడ్-19 కారణంగా మార్చి- సెప్టెంబర్ మధ్య కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి కొత్తగా ఉద్యోగ కల్పనకు చర్యలు. రూ. 15,000 కంటే తక్కువ వేతనాలు ఆర్జించేవారికి ఈ పథకం వర్తించనుంది. 2020 అక్టోబర్ 1 నుంచీ రెండేళ్లపాటు ఈ పథకం అమలులో ఉంటుంది. - ఈఎల్సీజీ పథకంకింద రూ. 2.05 లక్షల కోట్లను కేటాయించాం. 61 లక్షల రుణగ్రహీతలకు రూ. 1.52 లక్షల కోట్ల రుణాలు విడుదలయ్యాయి. - 21 రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలమేరకు రూ. 1681 కోట్లను పీఎం మత్స్యసంపద పథకానికి కేటాయించాం. - పాక్షిక క్రెడిట్ గ్యారంటీ పథకంలో భాగంగా రూ. 26,889 కోట్ల పీఎస్యూ బ్యాంకుల పోర్ట్ఫోలియోలను కొనుగోలు చేసేందుకు అనుమతించాం. - ప్రత్యేక లిక్విడిటీ పథకంలో భాగంగా ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీలకు రూ. 7,227 కోట్లు విడుదలయ్యాయి. - 39.7 లక్షల మంది అసెసీలకు రూ. 1,32,800 కోట్లను ఆదాయపన్ను రిఫండ్స్గా చెల్లించాం. -
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరు మారుస్తాం: మోదీ
అహ్మదాబాద్: నౌకాయాన శాఖను విస్తరించి దాన్ని రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖగా పేరు మారుస్తామని ప్రధాని మోదీ చెప్పారు. గుజరాత్లో రో–పాక్స్ ఫెర్రీ (నౌక) సర్వీసును ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇది 370 కి.మీ దూరాన్ని ఇది 90 కిలోమీటర్లకు (సముద్ర మార్గం) తగ్గిస్తుంది. ‘ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా షిప్పింగ్ శాఖ పేరును మారుస్తున్నామని చెప్పారు. నీలి ఆర్థిక వ్యవస్థ కోసం సముద్ర రవాణాను బలోపేతం చేయాల న్నారు. నోట్ల రద్దు దేశంలో నల్లధనాన్ని తగ్గించేందుకు, పన్ను వ్యవహారాల్లో క్లిష్టత తొలగిపోవడానికి, పారదర్శకతను పెంపొందించేందుకు దోహద పడిందని మోదీ చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్ చేశారు. పన్నుల వ్యవహారాలు మెరుగుపడేందుకు, మెరుగైన పన్ను, జీడీపీ నిష్పత్తికి నోట్ల రద్దు ఎలా దోహదపడిందో తెలిపే గ్రాఫిక్ను షేర్ చేశారు. -
భూముల రక్షణకు ‘స్వామిత్వ’
న్యూఢిల్లీ: ‘గ్రామీణ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేసే ‘స్వామిత్వ’ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఇది గ్రామీణ భారతాన్ని మార్చే విప్లవాత్మక కార్యక్రమం అని, ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా కీలక ముందడుగు అని పేర్కొన్నారు. ఈ కార్డులను ఉపయోగించి పల్లె ప్రజలు బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చన్నారు. అలాగే, దీంతో గ్రామస్తుల మధ్య భూ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తి తగాదాలు తొలగిపోతాయన్నారు. ఈ ‘సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(స్వామిత్వ)’ కార్యక్రమంలో వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో ప్రధాని పాల్గొన్నారు. ఆస్తిపై యాజమాన్య హక్కు దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెప్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఆస్తులకు సంబంధించి చట్టబద్ధమైన రికార్డులు ఉన్నవారు మూడింట ఒక వంతు మాత్రమేనని ప్రధాని వెల్లడించారు. ‘గ్రామాల్లోని యువత ఈ ప్రాపర్టీ కార్డులను హామీగా పెట్టి, స్వయం ఉపాధి కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. ఆస్తిపై చట్టబద్ధ హక్కును కలిగి ఉండడం వల్ల యువతలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. తద్వారా స్వావలంబన సాధించగలుగుతారు’ అన్నారు. ప్రజలు తమ ఆస్తులపై స్పష్టమైన యాజమాన్య హక్కులు కలిగి ఉండటం అవసరమని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీతో భూముల మ్యాపింగ్ చేయాలని యోచిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ప్రసంగిస్తున్న సమయంలో ప్రధాని వెనుకవైపు ఆదివారం జయంతి ఉన్న సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్, ఆరెస్సెస్ దిగ్గజం నానాజీ దేశ్ముఖ్ల ముఖచిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆ మహనీయుల సిద్ధాంతాలను ప్రధాని వివరించారు. గ్రామాల్లోని ప్రజలు తరచు ఆస్తికి సంబంధించిన వివాదాల్లో చిక్కుకుపోతే.. వారే కాకుండా, సమాజమూ అభివృద్ధి చెందబోదని నానాజీ దేశ్ముఖ్ భావించేవారిని వివరించారు. ఆ సమస్యను అంతం చేసే దిశగానే ఈ ఆస్తి కార్డుల విధానాన్ని ప్రారంభించామన్నారు. ఆస్తి కార్డుల ద్వారా బ్యాంక్ ఖాతాలను, విద్యుత్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, పక్కా ఇల్లు తదితర సౌకర్యాలు పొందవచ్చన్నారు. ప్రస్తుతం యూపీ, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరా ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 763 గ్రామా ల్లో ఈ స్వామిత్వను ప్రారంభించారు. ఈ గ్రామా ల్లోని ప్రజలు తక్షణం అవసరమనుకుంటే తమ ఫోన్లకు అధికారులు ఎస్ఎంఎస్ చేసిన లింక్ ద్వారా ప్రాపర్టీ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆస్తి కార్డుల పంపిణీని త్వరలో ప్రారంభిస్తాయి. ప్రతీ కార్డుకు ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. రానున్న మూడు, నాలుగేళ్లలో ప్రతీ కుటుంబానికి ప్రాపర్టీ కార్డులను అందజేస్తామని మోదీ తెలిపారు. వ్యవసాయ బిల్లులను వారే వ్యతిరేకిస్తున్నారు దళారి వ్యవస్థ బాగుపడాలని కోరుకునేవారే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారని ప్రధాని విపక్షాలపై విమర్శలు గుప్పించారు. మధ్యవర్తులు, దళారులు అందించిన అధికారంతోనే వారు రాజకీయాలు చేశారన్నారు. వారి కుయుక్తులకు రైతులు మోసపోరని వ్యాఖ్యానించారు. గత ఆరు దశాబ్దాల్లో విపక్ష ప్రభుత్వాలు చేయలేని గ్రామీణాభివృద్ధిని గత ఆరేళ్లలో తమ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. ‘దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంటుందని చెబుతుంటారు. కానీ గత ప్రభుత్వాలు గ్రామీణ భారతాన్ని పట్టించుకోకుండా వదిలేశాయి’ అని విమర్శించారు. ‘గ్రామాలు, పేదలు, రైతులు, కూలీలు స్వావలంబన సాధించడం చాలా మందికి ఇష్టం ఉండదు. మా సంస్కరణలు రైతుల పొట్టకొడ్తున్న దళారుల అక్రమ ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే మా సంస్కరణలపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు’ అని ప్రధాని ఆరోపించారు. ‘ఆ మధ్యవర్తులు, దళారుల వల్ల బలపడిన కొందరు కూడా ఈ వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు’ అని విపక్షాలపై పరోక్ష విమర్శలు చేశారు. -
స్క్రామ్జెట్ పరీక్ష విజయవంతం
చండీపూర్: భారత రక్షణ పరిశోధన సంస్థ మరో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. క్షిపణుల వేగాన్ని ఆరు రెట్లు ఎక్కువ చేసే స్క్రామ్జెట్ ఇంజిన్లను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఘనత సాధించిన అతితక్కువ దేశాల సరసన భారత్ను సగర్వంగా నిలిపింది. పూర్తిగా దేశీయంగానే తయారైన ఈ స్క్రామ్జెట్ ఇంజిన్లు భవిష్యత్తు అగ్ని –5, బ్రహ్మోస్ వంటి క్షిపణులను నడిపిస్తాయని అంచనా. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీ పారిశ్రామిక రంగం సాయంతో రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని లక్షిస్తున్న డీఆర్డీవో ఆ దిశగా మరో ముందడుగు వేసినట్లే. ఒడిశాలోని వీలర్ ఐల్యాండ్లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలామ్ కాంప్లెక్స్లో సోమవారం ఉదయం 11.03 గంటలకు ప్రయోగం జరగ్గా... హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వెహికల్ (హెచ్ఎస్టీటీవీ) విజయవంతంగా నింగికి ఎగసిందని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్ఎస్టీటీవీ 30 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తరువాత ఏరడైనమిక్ హీట్షీల్డ్స్ వేరుపడ్డాయని, ఆ తరువాత క్రూయిజ్ వాహనం ముందుకు దూసుకెళ్లిందని ఆ ప్రకటన వివరించింది. ముందుగా నిర్దేశించిన మార్గంలో సెకనుకు రెండు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం మొదలుపెట్టిందని, లాంచ్ వెహికల్ నుంచి వేరుపడిన వెంటనే స్క్రామ్జెట్ ఇంజిన్ పరిసరాల్లోని గాలికి ఇంధనాన్ని జోడించి మండటం మొదలుపెట్టిందని, అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేసినట్లు టెలిమెట్రీ స్టేషన్లలోని రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలు గుర్తించాయి. స్క్రామ్జెట్ ఇంజిన్ పనితీరును పరిశీలించేందుకు బంగాళాఖాతంలో ఒక ప్రత్యేక నౌకను ఏర్పాటు చేయడం గమనార్హం. దశాబ్దాల పరిశోధనల ఫలితంగా ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ ప్రయోగం విజయవంతమైందని, సంక్లిష్టమైన టెక్నాలజీలను సైతం దేశీయంగానే అభివృద్ధి చేయగలమన్న నమ్మకాన్ని పెంచిందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నో ప్రయోజనాలు... స్క్రామ్జెట్ ఇంజిన్ల వల్ల ధ్వనికి ఆరురెట్ల వేగంతో ప్రయాణించడం ఒక్కటే ప్రయోజనం కాదు. రాకెట్లు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా ఆక్సిజన్ను మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంజిన్లో తిరిగే భాగాలు ఏవీ ఉండవు కాబట్టి ప్రస్తుతం రాకెట్లలో వాడుతున్న టర్బోజెట్ల కంటే సులువుగా స్క్రామ్జెట్లను తయారు చేయవచ్చు. అందించే ప్రతి లీటర్ ఇంధనానికి ఈ ఇంజిన్లు అందుకునే వేగం సాధారణమైన వాటికంటే చాలా ఎక్కువ. వేగం కూడా చాలా ఎక్కువ కాబట్టి అంతరిక్ష ప్రయోగాలు చాలా చౌక అవుతాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయం నుంచి స్క్రామ్జెట్లను అభివృద్ధి చేసేందుకు పలు దేశాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అయితే 1991లో రష్యా తొలిసారి ఈ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంది. ఆ తరువాతి కాలాల్లో ఫ్రాన్స్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలు ఈ టెక్నాలజీని అందుకున్నాయి. ఇప్పటివరకూ అభివృద్ధి చేసిన స్క్రామ్జెట్ ఇంజిన్లు సాధించిన గరిష్ట వేగం ధ్వనికి 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 2007లో నాసా, ఆస్ట్రేలియాకు చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఈ ఘనతను సాధించాయి. ప్రధాని అభినందనలు స్క్రామ్జెట్ ఇంజిన్ను అభివృద్ధి చేసిన డీఆర్డీవోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘హైపర్సోనిక్ టెస్ట్ డెమాన్స్ట్రేషన్ వెహికల్ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవోకు అభినందనలు. మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్క్రామ్జెట్ ఇంజిన్ ధ్వని వేగం కన్నా ఆరురెట్లు అధికవేగాన్ని అందుకొంది. అతికొద్ది దేశాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది’అని మోదీ ట్వీట్ చేశారు. స్క్రామ్జెట్ ఇంజిన్ పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఓ చరిత్రాత్మక ఘనత అని వ్యాఖ్యానించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. -
ఎగుమతులు, దిగుమతుల్లో సానుకూలత
న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల ధోరణులు ఆశాజనకంగా ఉన్నాయని.. ముఖ్యంగా ఎగుమతులు ఈఏడాది ఏప్రిల్లో కరోనా కారణంగా భారీగా పడిపోయిన స్థాయి నుంచి క్రమంగా గత ఏడాది స్థాయిలకు చేరుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఈ వివరాలను వాణిజ్య శాఖ శుక్రవారం ఓ ప్రకటన రూపంలో విడుదల చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అంతర్జాతీయంగా భారత వాణిజ్యానికి సంబంధించిన అంశాలను చర్చించేందుకు మంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మర్చండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా పథకం కింద రాయితీలకు రూ.2 కోట్ల పరిమితి విధించడం 98%ఎగుమతిదారులపై ప్రభావం చూపించబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ పథకం స్థానంలో ఆర్వోడీటీఈపీ అనే కొత్త పథకాన్నిఇప్పటికే ప్రకటించడం గమనార్హం. వరుసగా ఐదో నెల జూలైలోనూ ఎగుమతులు 10% క్షీణించి 23.64 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం గమనార్హం. మోదీ సర్కారు ‘ఆత్మనిర్భర్ షిప్పింగ్’ స్థానిక తయారీ టగ్ బోట్లనే వాడాలి ∙ ప్రధాన పోర్టులను కోరిన కేంద్రం స్వావలంబన భారత్ (ఆత్మ నిర్భర్) కార్యక్రమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లే చర్యలను కేంద్రం అనుసరిస్తోంది. దేశీయంగా నిర్మించిన చార్టర్ టగ్ బోట్లనే వినియోగించాలంటూ ప్రధాన పోర్టులను (ఓడరేవులు) షిప్పింగ్ మంత్రిత్వ శాఖా తాజాగా ఆదేశించింది. తద్వారా దేశీ షిప్ బిల్డింగ్ పరిశ్రమకు పునరుత్తేజాన్ని తీసుకురావచ్చన్నది కేంద్రం ఉద్దేశ్యం. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద ఆత్మనిర్భర్ షిప్పింగ్ కోసం చేపట్టిన చర్యగా దీన్ని షిప్పింగ్ శాఖా మంత్రి మన్ సుఖ్ మాండవీయ అభివర్ణించారు. సవరించిన ఆదేశాలను ప్రధాన పోర్టులు పాటించాల్సి ఉంటుందన్నారు. టగ్ బోట్ అన్నది తొట్టి ఆకారంతో కూడిన పడవ. ఓడలు పోర్టుల్లోకి వచ్చేందుకు వీటి సాయం అవసరమవుతుంది. భారత షిప్ బిల్డింగ్ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, భారత్లో షిప్ బిల్డింగ్ కోసం కొన్ని దేశాలతో చర్చలు కూడా కొనసాగుతున్నాయని కేంద్ర షిప్పింగ్ శాఖా తన ప్రకటనలో తెలిపింది. -
అన్ని రంగాల్లోనూ ఆత్మనిర్భర్
న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ స్వావలంబ భారత్ దిశగా కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆటబొమ్మల మార్కెట్ సుమారు రూ. 7 లక్షల కోట్లు కాగా.. అందులో భారత్ వాటా చాలా తక్కువగా ఉందని గుర్తు చేశారు. భారత్లోని స్టార్టప్స్, యువ పారిశ్రామికవేత్తలు ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ ఆట బొమ్మల కేంద్రంగా భారత్ రూపుదిద్దుకోగలదని, స్థానిక ఆట బొమ్మలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ‘మన్ కీ బాత్’లో మోదీ వ్యాఖ్యానించారు. ‘దేశంలో నిపుణులైన బొమ్మల తయారీదారులున్నారు. బొమ్మల తయారీ ద్వారా దేశ ఘన చరిత్రను ప్రచారం చేయవచ్చు. గొప్ప భవిష్యత్తుకు బాటలు వేయవచ్చు’అన్నారు. ప్రత్యేకంగా భారత్పైనే, భారత్లోనే కంప్యూటర్ గేమ్స్ రూపకల్పన జరగాలని, ఆ దిశగా సమిష్టిగా కృషి చేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కోరారు. భారత దేశ సాంస్కృతిక ఔన్నత్యం, సంప్రదాయాలు కొత్త కొత్త కంప్యూటర్ గేమ్స్ తయారీకి స్ఫూర్తినివ్వగలవన్నారు. ‘మన దేశంలో చాలా విషయాలున్నాయి. మన చరిత్ర ఘనమైనది. దేశ చరిత్రపై ఆధారపడ్డ గేమ్స్ను భారత్లోనే రూపొందించాలని దేశంలోని నిపుణులైన యువతను కోరుతున్నా’అన్నారు. ప్రతీనెల చివరి ఆదివారం ‘మన్ కీ బాత్’పేరుతో ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారనే విషయం తెలిసిందే. ప్రపంచ ఆట బొమ్మల మార్కెట్లో భారత్ వాటాను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల ప్రధాని మోదీ ఒక అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆటబొమ్మల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ► కరోనా మహమ్మారి సమయంలో ఉత్సవాల నిర్వహణలో భారతీయులు గొప్ప సంయమనం, నిరాడంబరతను పాటిస్తున్నారు. ఇది అభినందనీయం. ► ఈ ఖరీఫ్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇందుకు అన్నదాతలకు అభినందనలు. గత సంవత్సరం కన్నా మొత్తంగా దాదాపు 7% సాగు విస్తీర్ణం పెరిగింది. వరి సాగు 10%, పప్పు ధాన్యాల సాగు 5%, నూనెగింజల సాగు 13%, పత్తి సాగు 3% పెరిగింది. ► 2022 నాటికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలవుతున్న నేపథ్యంలో.. స్థానిక స్వాతంత్య్ర సమరయోధుల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలి. నాడు స్థానికంగా జరిగిన ఘటనలను, కార్యక్రమాలను వారికి విశదీకరించాలి. దానివల్ల మరుగునపడిన చాలామంది స్వాతంత్య్ర యోధుల చరిత్ర ప్రపంచానికి తెలుస్తుంది. ► ఇటీవల జరిగిన ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ పోటీకి వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికం దేశంలోని చిన్న, మధ్యతరహా పట్టణాల నుంచే వచ్చాయి. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా చోటు చేసుకున్న కీలక ముందడుగుగా దీన్ని భావించవచ్చు. ► భారతీయ పండుగలకు, ప్రకృతికి మధ్య గొప్ప సంబంధముంది. ప్రస్తుత గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో చాలా ప్రాంతాల్లో పర్యావరణ హిత వినాయకుడి ప్రతిమలనే ప్రతిష్టించడం ముదావహం. ► సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా పరిగణిస్తున్నాం. ముఖ్యంగా గ్రామాల్లో అందరికీ పోషకాహారం అందించడం ఉద్యమంలా మారాలి. ► భారత వ్యవసాయ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ జిల్లాలో పండించే పంటల వివరాలు, వాటిలోని పోషకాల వివరాలు అందులో అందుబాటులో ఉంచుతాం. ► కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్దేశించిన మార్గదర్శకాలను పాటించండి. మాస్క్ ధరించండి. భౌతిక దూరం పాటించండి. వ్యక్తిగత పరిశుభ్రత కొనసాగించండి. సోఫీ.. విదా.. బలరామ్! కుక్క పిల్లలను పెంచుకోవాలనుకునే వారు ఇండియన్ బ్రీడ్ కుక్క పిల్లలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని కోరారు. భారతీయ కుక్కపిల్లలు సామర్థ్యంలో వేటికీ తీసిపోవన్నారు. చవకగా లభిస్తాయని, భారతీయ పరిస్థితులకు తట్టుకోగలవని వివరించారు. ‘ఇండియన్ బ్రీడ్స్లో ముధోల్ హౌండ్, హిమాచలి హౌండ్ శ్రేష్టమైనవి. రాజపాలాయం, కన్నీ, చిప్పిపరాయి, కొంబయి కూడా గొప్పవే. ఇంటర్నెట్లో వెతకండి. వీటి గురించి మరిన్ని ఆశ్చర్యపరిచే వివరాలు తెలుస్తాయి’అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా.. ఆగస్టు 15న ‘చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమండేషన్ కార్డ్’పురస్కారం పొందిన ఆర్మీ డాగ్స్ సోఫీ, విదాలను గుర్తు చేశారు. దేశ భద్రతలో అవి గొప్ప పాత్ర పోషించాయన్నారు. ‘అమర్నాథ్ యాత్రా మార్గంలో దుండగులు పెట్టిన పేలుడు పదార్థాలను బలరామ్ అనే శునకం గుర్తించి, అనేక ప్రాణాలను కాపాడింది’అని వివరించారు. ‘బీడ్ పోలీసులు తమతో పాటు పనిచేసిన రాకీ అనే శునకానికి గొప్పగా ఫేర్వెల్ ఇచ్చిన దృశ్యాలు మీరు టీవీలో చూసే ఉంటారు. 300 కేసులను ఛేదించడంలో పోలీసులకు రాకీ సహకరించింది’అన్నారు. కావాల్సింది పరీక్షలపై చర్చ: రాహుల్ ప్రధాని మోదీ మన్కీబాత్లో పరీక్షల గురించి మాట్లాడతారని విద్యార్థులు ఎదురు చూస్తుండగా.. ఆయన మాత్రం బొమ్మల గురించి మాట్లాడారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీట్, జేఈఈ పరీక్షలను కోవిడ్ దృష్ట్యా వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా కోరుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నోట ఏటికొప్పాక మన్కీ బాత్ కార్యక్రమంలో బొమ్మల గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఏటికొప్పాక బొమ్మల ప్రస్తావన తెచ్చారు. విశాఖకు చెందిన సి.వి.రాజు అద్భుతమైన నాణ్యతతో ఏటికొప్పాక బొమ్మలను తయారు చేస్తున్నారని కొనియాడారు. ఆయన స్థానిక బొమ్మలకు పూర్వవైభవం తెచ్చారన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిపుణులైన బొమ్మల తయారీదారులు ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కొండపల్లి, కర్ణాటకలోని చెన్నపట్నం, తమిళనాడులోని తంజావూరు, అస్సాంలోని ధుబారీ, ఉత్తరప్రదేశ్లోని వారణాసి బొమ్మల తయారీ కేంద్రాలుగా ఎదిగాయన్నారు. -
కోవిడ్ ప్రొటోకాల్తో వేడుకలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూ ఉండడంతో ఢిల్లీ ఎర్రకోటలో ఇవాళ జరిగే 74వ స్వాతంత్య్ర దిన వేడుకలకు రక్షణ శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. జాతీయ పతాకం ఎగుర వేయడం దగ్గర్నుంచి, ప్రధాని ప్రసంగం, జాతీయ గీతాలాపన వరకు ప్రతీ కార్యక్రమంలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు, పీపీఈ కిట్లు ధరించేలా మార్గదర్శ కాలను రూపొందించింది. ఎర్రకోట పరిసరా ల శానిటైజేషన్ దగ్గర్నుంచి హాజరయ్యే అతిథుల పాటించే భౌతిక దూరం వరకు ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంది. పోలీసు సిబ్బందితో వివిధ అంచెల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ప్రతీ ఏడాది జరిగే పంద్రాగస్టు వేడుకలకి, ఈసారి జరిగే వేడుకలు ఎలా భిన్నమో వివరిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరసగా ఏడోసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఎర్రకోట వేదికగా ఆయన శనివారం చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. కోవిడ్ సంక్షోభం, చైనాతో ఉద్రిక్తతలు, ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మోదీ ఏం మాట్లాడతారని ఆసక్తిగా చూస్తున్నారు. ► ఈసారి వేడుకలకి దౌత్యప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు కలిపి 4 వేల మందికి ఆహ్వా నం అందింది. ఏటా హాజరయ్యే వారిలో ఇది 20% మాత్రమే. ► పాఠశాల విద్యార్థులకు బదులుగా ఎన్సీసీ సిబ్బంది ఈసారి వేడుకల్లో పాల్గొంటారు ► ఇద్దరి అతిథుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీట్ల ఏర్పాటు. అతిథులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ► ఎర్రకోట లోపలికి వచ్చే ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు. కరోనా లక్షణాలున్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలించేలా అంబులెన్స్లు సిద్ధం. ► భద్రత విధుల్లో పాల్గొనే పోలీసులందరికీ పీపీఈ కిట్లు. ► ఈసారి వేడుకల్ని చూసే అవకాశం కరోనా వైరస్తో పోరాడి విజేతలైన 1,500 మందికి కల్పించారు. వారిలో 500 మంది పోలీసు సిబ్బంది. -
అగ్రి ఇన్ఫ్రాలో ఏపీకి తొలి విడతగా రూ.6,540 కోట్లు
సాక్షి, అమరావతి: ‘ఆత్మ నిర్బర్ భారత్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన రూ.లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక వసతుల నిధిలో ఆంధ్రప్రదేశ్కు తొలి విడతగా రూ.6,450 కోట్లు కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఇవి తాత్కాలిక కేటాయింపులు మాత్రమే. ► ఈ పథకం 2020–21 నుంచి 2029–30 వరకు అంటే పదేళ్లు అమల్లో ఉంటుంది. ► రూ.10 వేల కోట్ల చొప్పున నాలుగేళ్ల పాటు నిధులు మంజూరవుతాయని అంచనా. ► తిరిగి చెల్లింపుల కోసం.. మారటోరియం గడువు 6 నెలల నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది. ► గరిష్టంగా రూ.2కోట్ల వరకు రుణాలు ఇస్తారు. 3 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. కాల పరిమితి 7 ఏళ్లు. ఈ పథకం ఏ ప్రాజెక్టులు చేపట్టవచ్చునంటే ► ఇ–మార్కెటింగ్ ప్లాట్ఫారాలు, సప్లై చెయిన్ సర్వీసులు ► గిడ్డంగులు, గరిశలు (సిలోస్) ► ప్యాక్ హౌసులు ► పరీక్ష, తనిఖీ యూనిట్లు ► సార్టింగ్, గ్రేడింగ్ యూనిట్లు ► లాజిస్టిక్ సౌకర్యాలు (ఏదైనా ఒక పనికి సంబంధించిన లావాదేవీలన్నీ) ► ప్రాథమిక శుద్ధి కేంద్రాలు ► పండ్లు మాగబెట్టే గదులు కమ్యూనిటీ ఫార్మింగ్ అసెట్స్ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు.. ► సేంద్రియ ఉత్పాదకాల తయారీ యూనిట్లు ► జీవన ఎరువుల తయారీ యూనిట్లు ► తక్కువ ఖర్చుతో సాగు చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ► సప్లై చెయిన్కు అవసరమైన ప్రాజెక్టులు ► ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ప్రోత్సహించే ప్రాజెక్టులు ఎవరెవరు అర్హులు... ► రైతులు, అగ్రీ పారిశ్రామిక వేత్తలు ► పీఏసీఎస్, మార్కెటింగ్ కో–ఆపరేటివ్ సొసైటీలు, ఎంఎసీలు ► స్టార్టప్స్, పీపీపీ ప్రాయోజిత పథకాలు ► ఈ పథకంలో పాల్గొనదలచిన ఆర్థిక సంస్థలు నాబార్డ్, డీఏసీ ఎఫ్డబ్లు్యతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ప్రతిపాదిత పథకం అమలు బాధ్యతను జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి నియంత్రణ సంఘాలు చూస్తాయి. ఇతర వివరాలకు నాబార్డ్ లేదా వ్యవసాయ శాఖాధికారులను సంప్రదించవచ్చు. -
101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం
సాక్షి, ఢిల్లీ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ఆదివారం ట్విటర్ ద్వారా తెలిపారు. 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమానికి ఊతమిచ్చేందుకే రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆయుధాలతో పాటు ఇతర రక్షణ వస్తువులు ఇక మీదట దేశీయంగానే తయారవనున్నాయి. ఇది భారత రక్షణశాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని రాజనాథ్ తెలిపారు. ఈ నిర్ణయం భారత రక్షణ శాఖ పరిశ్రమకు ఎంతో ఉపయోగకరమని, వారి సామర్థ్యాలను పెంచుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా డీఆర్డీవో రూపొందించిన, అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడానికి ఈ నిర్ణయం గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని ఆయన అన్నారు. భారత్, చైనా మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. 2020 నుంచి 2024 మధ్య కాలంలో క్రమంగా దిగుమతులపై నిషేధాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికతో కేంద్రం ముందుకు వెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు.(రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు) రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ రూపొందించిన జాబితాను భారత సైన్యం, ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలతో చర్చించిన తరువాత తయారు చేసినట్లు రక్షణ మంత్రి చెప్పారు. ఉత్పత్తుల కోసం 2015 ఏప్రిల్ నుంచి 2020 ఆగస్ట్ మధ్య సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చినట్లు రాజనాథ్ సింగ్ తెలిపారు. రాబోయే 6 నుంచి ఏడేళ్లలో దేశీయ పరిశ్రమకు సుమారు రూ .4 లక్షల కోట్లు ఆర్డరు ఇవ్వనున్నారు. -
ఉత్పాదకతకు మరిన్ని రుణాలు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారితో కుదేలయిన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఉత్పాదక రంగాలకు తగిన రుణ సదుపాయం సకాలంలో అందించేలా బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల సీఈఓలు, ఎన్బీఎఫ్సీల చీఫ్లతో ప్రధాని బుధవారం మూడు గంటలపాటు సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉన్నత స్థాయి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం సదస్సుకు సంబంధించి కొద్ది ముఖ్యాంశాలు చూస్తే... ► ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ (స్వావలంబన భారత్), దేశం స్వయం సమృద్ధి లక్ష్యాల సాధన వంటి కీలక అంశాలను ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ విషయంలో ఫైనాన్షియల్ రంగం ప్రాముఖ్యతను వివరించారు. లక్ష్యాల సాధన దిశలో ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అన్నింటినీ అందిస్తుందని పేర్కొన్నారు. ► రుణ సదుపాయాలు, లక్ష్యాల సాధనలో అనుసరించాల్సిన మార్గాలు, టెక్నాలజీ ద్వారా ఫైనాన్షియల్ రంగంలో సాధికారత, ఈ విభాగం స్థిరత్వానికి అనుసరించాల్సిన అత్యున్నత ప్రమాణాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ► ఎస్బీఐ చైర్మన్ రజ్నీష్ కుమార్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ డైరెక్టర్ ఎస్ఎస్ మల్లిఖార్జున రావు, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ భక్షీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అదిత్య పురి, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రేణూ సూద్ కర్నాడ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ► 2019 మేలో బ్యాంక్ రుణ వృద్ధి 11.5 శాతం ఉంది. 2020 మేలో ఇది 7 శాతం క్షీణతకు పడిపోయింది. కోవిడ్–19 తీవ్రత దీనికి నేపథ్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణతలోకి వెళుతుందన్న సందేహాలూ ఉన్నాయి. రుణాలకు సంబంధించి అటు రుణ దాతల నుంచీ ఇటు రుణ గ్రహీతల నుంచీ సానుకూల స్పందన కనబడ్డం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని నిర్వహించిన సదస్సుకు ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో చరిత్రాత్మక కనిష్టస్థాయి 4 శాతానికి దిగివచ్చింది. అయినా కార్పొరేట్, రిటైల్ రుణ గ్రహీతలు రుణాలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. దీనితో బ్యాంకులు రివర్స్ రెపో మార్గంలో తమ డబ్బును ఆర్బీఐ వద్ద ఉంచుతున్నాయి. ► వ్యవస్థలో డిమాండ్ను పునరుద్ధరింపజేయడానికిగాను మేలో ఆర్థికమంత్రి ప్రకటించిన రూ.20.97 లక్షల కోట్ల ప్యాకేజీ అంశాల అమలుకు బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. -
స్వచ్ఛం.. సురక్షితం.. కచ్చితం
రేవా: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ విద్యుదుత్పత్తిలోనూ స్వావలంబన సాధించడం కీలకమైన విషయమని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తెలిపారు. మధ్యప్రదేశ్లోని రేవాలో 750 మెగావాట్ల భారీ సౌరవిద్యుత్తు ప్లాంట్ను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు రంగంలో స్వావలంబనకు సౌరశక్తి ఎంతో తోడ్పడుతుందన్నారు. సౌరశక్తి స్వచ్ఛమైంది మాత్రమే కాకుండా.. కచ్చితంగా అందుబాటులో ఉండేదని, సురక్షితమైంది కూడా అని అన్నారు. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద వనరుగా సౌరశక్తి అవతరించనుందని తెలిపారు. సౌర విద్యుత్తు విషయంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదు ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద కేంద్రమైన రేవా అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్తోపాటు ఢిల్లీ మెట్రో రైల్వేకూ విద్యుత్తు అందిస్తుందని అన్నారు. ప్రపంచమిప్పుడు పర్యావరణాన్ని కాపాడుకోవాలా? లేక ఆర్థిక వ్యవస్థనా? అన్న ద్వైదీభావంలో కొట్టుమిట్టాడుతోందని, అయితే స్వచ్ఛభారత్, ఉజ్వల, సీఎన్జీ, విద్యుత్ ఆధారిత రవాణా వ్యవస్థల ద్వారా భారత్ ఈ రెండూ పరస్పర ప్రయోజనకరమని చాటిందని అన్నారు. ప్రపంచం మొత్తమ్మీద అందుబాటులో ఉండే, పర్యావరణాన్ని కలుషితం చేయకపోగా మెరుగుపడేందుకు సాయపడే, ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగపడే సూర్యుడు స్వావలంబనకూ కీలకమని అన్నారు. ఇందుకోసం దేశం సోలార్ ప్యానెళ్లతోపాటు బ్యాటరీలు, ఇతర పరికరాలను సొంతంగా ఉత్పత్తి చేయాలని, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరారు. మధ్యప్రదేశ్లోని రేవా నర్మదా నది, తెల్లపులి కోసం చాలా ప్రసిద్ధి చెందిందని, ఇకపై ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్తు కేంద్రంగానూ ఖ్యాతి గడిస్తుందని అన్నారు. రేవా తరహాలోనే భారీ సోలార్ ప్లాంట్లను షాజాపూర్, నీమచ్, ఛత్తర్పూర్లలోనూ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, ఓంకారేశ్వర్ సమీపంలో తేలియాడే సోలార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆప్ ఇండియా సంయుక్తంగా 500 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ భారీ సౌర విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. -
ఆవిష్కరణలను ప్రోత్సహిద్దాం: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశ యువతలో, ఐటీ నిపుణుల్లో నిబిడీ కృతమై ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించేం దుకు అవసరమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని, తద్వారా ‘ఆత్మనిర్భర భారత్’లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సభాప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో స్వదేశీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎలిమెంట్స్’యాప్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం ఇతరులను అనుకరించడాన్ని పక్కనపెట్టి కొత్త ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలన్నారు. -
15 రకాల వస్తు దిగుమతులను నివారించొచ్చు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ (స్వీయ సమృద్ధి) సాధన కోసం భారీగా దిగుమతి చేసుకుంటున్న 15 వస్తువులను అసోచామ్ గుర్తించింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా వీటి విషయంలో స్వావలంబన సాధించొచ్చని పేర్కొంది. వీటిల్లో ఎలక్ట్రానిక్స్, బొగ్గు, ఐరన్–స్టీల్, నాన్ ఫెర్రస్ మెటల్స్, వంటనూనెలు, తదితర ఉత్పత్తులున్నాయి. ప్రతి నెలా 5 బిలియన్ డాలర్ల విలువైన (37,500 కోట్లు) ఈ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని.. విదేశీ మారక నిల్వలకు భారీగా చిల్లు పెడుతున్న ఈ దిగుమతులకు వెంటనే కళ్లెం వేయాలని అసోచామ్ సూచించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న మే నెలలో 2.8 బిలియన్ డాలర్ల విలువైన (రూ.21,000 కోట్లు) ఎలక్ట్రానిక్ వస్తు దిగుమతులు నమోదయ్యాయి. హెచ్ఎంఏ ప్రెసిడెంట్గా సంజయ్ కపూర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) నూతన ప్రెసిడెంట్గా సంజయ్ కపూర్ ఎన్నికయ్యారు. 2020–21 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. పలు మల్టీనేషనల్ కంపెనీలకు ఆయన కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్నారు. -
టీడీపీ అవినీతిపై నిర్మల కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అవినీతి పాలనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ ఏలుబడిలో జరిగిన అవినీతిపై విచారణ జరపడం ముఖ్యమైన వ్యవహారమని వ్యాఖ్యానించారు. నిందితులపై కేసులు పెట్టి విచారణ జరపాలని అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలోని విద్యుత్ కంపెనీలను బాగు చేయాలని నిర్మల చెప్పారు. డిస్కం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 90 వేల కోట్లు కేటాయించిందని అన్నారు. ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకొని డిస్కంలను బాగు చేయాలని కోరారు. ఎఫ్ఆర్బీఎం చట్టం పరిమితిని పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకునే అవకాశాన్ని మరింత కల్పించామని ఆమె గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి బాటలో నడిచేందుకు కేంద్రం చేయూతనిస్తుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. సహకార సమాఖ్య వ్యవస్థకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆత్మ నిర్బర ప్యాకేజీని ఉపయోగించుకోవాలని నిర్మల పేర్కొన్నారు. (చదవండి: ‘సీఎం వైఎస్ జగన్ నిజమైన బాహుబలి’) -
మానవీయ స్పర్శ ఏది?
అనుకోని ఆపద వచ్చిపడి నప్పుడు ఆందోళన పడటం కంటే ఆత్మవిశ్వాసంతో వుండటం చాలా అవ సరం. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ మూడునెలల్లో వ్యక్తుల ఆదాయాలతో పాటు వ్యవస్థల, సంస్థల ఆదాయాలు పూర్తిగా తుడి చి పెట్టుకుని పోయాయి. మన దేశంతోపాటు ప్రపంచ దేశాలన్నిటి పరిస్థితి కూడా ఇదే. ఈ కల్లోలం నుంచి ఉపశమనం కలిగించడానికి మన కేంద్ర ప్రభుత్వం తొలి విడత లక్షా 80 వేల కోట్ల రూపాయలు ప్యాకేజీగా ప్రకటించింది. ఆ తదుపరి చాలా ఆలస్యంగా మలివిడత ప్యాకేజీని భారీ అంకె లతో... అంటే రూ. 21 లక్షల కోట్లతో, ఆకర్షణీయ మైన పేరుతో–ఆత్మ నిర్భర్ భారత్ అంటూ ప్రక టించింది. తొలి ప్యాకేజీ–ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్, మలి ప్యాకే జీ–ఆత్మ నిర్భర్ భారత్ కలిసి దేశ స్థూల ఉత్పత్తిలో 10 శాతం అవుతుందని లెక్కలు చెప్పారేగానీ, ఇది రూ. 30 లక్షల 42 వేల 230 కోట్ల వార్షిక బడ్జెట్లో భాగమా అని అడిగితే బీజేపీ నేతలు నోటికి పనిచెబుతున్నారుగానీ, లెక్కలు చెప్పడానికి సిద్ధప డటం లేదు. ‘భారీ ప్యాకేజీ’ ప్రకటించినప్పటి నుంచి బీజేపీ మేధా వులు ‘ఆహా ఓహో’ అంటూ శ్లాఘిస్తున్నారు. వ్యతి రేకించిన వారిని నిందిస్తున్నా రు. కానీ ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంఘమైన భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) నిశితంగా విమర్శిస్తుంటే ఏం మాట్లాడాలో ఈ పెద్దలకు అర్థం కావడం లేదు. ఆ సంస్థ విమర్శించడంతో సరి పెట్టలేదు, కేంద్రానికి వ్యతిరేకంగా కార్మికుల్ని సంఘటితం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించింది. కరోనా వల్ల వచ్చిపడిన కష్టం నుంచి దేశాన్ని ఆర్థి కంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం మంచిదే. కానీ ఆచరణలో ‘ఆత్మ నిర్భర్’ అందుకు ఎలా ఉపయోగ పడుతుం దన్నదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దేశం ఆర్థికంగా బల పడాలంటే అన్ని రకాల ఉత్పత్తులు జరగాలి. వినిమయం పెరగాలి. అది సాధ్యం కావాలంటే ప్రజల వద్ద డబ్బు వుండాలి. అందుకవసరమైన ఆదాయ మార్గాలుండాలి. ప్రజల పొదుపు పెరగాలి. దశాబ్దాలుగా కార్మికుల రక్తం, స్వేదంతో బల పడిన బొగ్గు, రైల్వేలు, ఉక్కు, విద్యుత్, టెలికం, బ్యాంకింగ్, రక్షణ, తపాలా తదితర రంగాల్లో కొన్ని టిని గంపగుత్తగా, కొన్నింటిలో 75 శాతం వాటా ల్ని, మరికొన్నిటిలో ఇంకా గరిష్టంగా ప్రైవేటుపరం చేయడం ఒక్కటే మంచి అవకాశం అవుతుందా? ఇవి పరాధీనతకు సంకేతమా లేక స్వావలంబనకు నిదర్శనమా? దాచేస్తే నిజాలు దాగుతాయా? తొలి విడత ఉద్దీపనలో బ్యాంకులకు చెల్లించే వాయిదాలను మూడు నెలలు వాయిదా వేస్తామని, వాటిపై వడ్డీ మాఫీ చేస్తామని కేంద్రం ఇచ్చిన వాగ్దానం నెరవేరలేదు. బ్యాంకులు యథావిధిగా వాయిదాలు కట్టించుకున్నాయి. అందుకు బ్యాంకుల్ని తప్పుబట్ట లేము. అవి డిపాజిటర్లకూ, రుణ గ్రహీతలకూ మధ్యవర్తులుగా వ్యవహరి స్తాయి. కోశాగారం లోటు ఒకపక్క, కేంద్రం చేస్తున్న అప్పులు మరో పక్క పెరిగి అంతర్జాతీయ స్థాయిలో మన దేశం రేటింగ్ పడిపోయింది. 2020–21లో జీడీపీ వృద్ధి రేటు మైనస్ 1.5 శాతం వుండొచ్చునని కేంద్రమే అంచనా వేసింది. ఇది మైనస్ 1.7 శాతం వుండొచ్చునని కొన్ని సంస్థల అంచనా. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) మాత్రం ఇకపై జీడీపీకి సంబం దించిన అంచనాల జోలికి వెళ్లబోమని చెప్పింది.ఇక ‘పీఎం కేర్స్’కు జమపడిన విరాళాలెంతో బహిర్గతం చేయకపో వడం మొదలుకొని అనేక అంశాల్లో కేంద్రం పాటిస్తున్న గోప్యత ఎవరికీ అర్ధం కావడం లేదు. సమాఖ్య స్ఫూర్తి గల్లంతు కేంద్రం రాష్ట్రాలతో వ్యవహరిస్తున్న తీరు సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టుగా మారింది. మన రాజ్యాంగ నిర్మాణంలోనే సహకార ఫెడరలిజం అంతర్లీనంగా వుంది. కేంద్ర–రాష్ట్రాలు వేటికవి సర్వసత్తాక సార్వ భౌమాధికారాన్ని కలిగి ఒకదా నితో మరొకటి సహ కరించుకుంటూ జాతీయ సమైక్యతతో ముందు కెళ్లాలన్నది ఫెడరల్భావ స్ఫూర్తి. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ రాష్ట్రాల అధికారాలను క్రమేపీ తగ్గించి ఈ స్ఫూర్తిని దెబ్బతీసింది. ఎన్డీఏ కూడా దాన్నే కొన సాగి స్తోంది. ఇందువల్ల ప్రజలు తీవ్రంగా నష్ట పోతు న్నారు. మార్చి 24న కేవలం 4 గంటల వ్యవధిలో ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధిం చిన లాక్డౌన్ వల్ల ఎన్ని సమ స్యలు ఏర్పడ్డాయో మూడు నెలలుగా చూస్తూనే వున్నాం. అంతకు చాలాముందే 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిందని, కనుక ఆ వాటా ఇక పెరగ దని సాకు చూపించి అనేక కేంద్ర ప్రాయోజిత పథ కాలు నిలిపివేయడమో, కోత పెట్టడమో జరిగింది. 15వ ఆర్థిక సంఘం పరిశీలనాంశాలను కేంద్రమే రూపొందించింది. జనాభాతో ముడిపెట్టి, పన్నుల వాటాను లెక్కించే విధానం వల్ల కొన్ని రాష్ట్రాలకు నష్టం కలగడంతోపాటు, వాటి స్వతంత్ర విధాన నిర్ణయాలలో కేంద్రం జోక్యం చేసుకున్నట్టవుతుంది. జీఎస్టీ ద్వారా కూడా పన్నుల వాటాలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. విద్యుత్ సవరణ చట్టం ఈ ధోరణితో రూపొందించిందే. దీనికి పలు రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇది అమల్లో కొస్తే పేదలకు రాయితీ ధరకు విద్యుత్ అందించే రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు గండిపడుతుంది. మానవత్వమే పరమావధి సంక్షేమ రాజ్య స్థాపన రాజ్యాంగ లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేస్తూ, తగిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. అందు కోసం సున్నితత్వంతో, మానవత్వంతో వ్యవహరించాలి. కరోనా నేపథ్యంలో వలసకూలీలు ఎదుర్కొన్న కడగండ్లకు కారణం కేంద్రంలో లోపించిన ఈ సున్నితత్వమే నన్న విమర్శలొ చ్చాయి. కరోనా నేర్పిన పాఠాలతో మన గమ్యం ప్రైవేటీకరణ దిశగా కాకుండా... మెరుగైన ఆరో గ్యం, నాణ్యమైన విద్య, రైతులు, పేదల సంక్షేమం వైపుగా అన్నది స్పష్టమైంది. 2004లోనే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అందించి దేశానికి దిశా నిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ, 104, 108 పథకాలతో మారుమూల ప్రాంతాల పేదలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందిం చారు. ఫీజు రీయింబర్స్ మెంట్తో నిరుపేదల పిల్లలు ఉన్నత విద్యనభ్య సించే అవకాశం అందిం చారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృ త్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభు త్వంలో విలీనం చేసింది. ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందించడా నికి పూనుకుంది. చేతివృత్తుల వారికి ఆర్థిక సహా యం అందిస్తోంది. వలస కార్మికుల ఇబ్బందులకు చలించి, వారి ఆకలిదప్పులు తీర్చి, వారిని సగౌర వంగా గమ్యస్థానాలకు చేర్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. పాలకులు ఇలా సున్నితత్వంతో, మానవత్వంతో ఆలోచిస్తేనే పౌర సమాజానికి భరోసా కలుగుతుంది. కేంద్రం తన భారీ ప్యాకేజీలో సమూల మార్పులు తెచ్చి, ఫెడరల్ సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలి. అప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు అందుతాయి. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి -
వలస కూలీల కోసం భారీ ప్రణాళిక?
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడమే కాకుండా. స్వస్థలాలకు చేరేందుకు నానా అవస్థలు పడ్డ వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు, ప్రధాని∙మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ పథకంలోని పలు పనుల కోసం వలస కూలీలకు ఆయా రాష్ట్రాల్లోనే ఉపాధి కల్పించడం ఈ ప్రణాళికలోని ముఖ్యాంశంగా తెలుస్తోంది. జన్ధన్ యోజన, కిసాన్ కళ్యాణ్ యోజన, ఆహార భద్రత పథకం, ప్రధాని ఆవాస్ యోజన కార్యక్రమాలను వలసకూలీలను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తారు. ఇందుకోసం దేశంలో వలస కూలీలు ఎక్కువగా ఉన్న 116 జిల్లాలను ఎంపిక చేశారు. బిహార్లో 32, ఉత్తర ప్రదేశ్లో 31, మధ్యప్రదేశ్లో 24, రాజస్థాన్లో 22, జార్ఖండ్లో 3, ఒడిశాలోని 4 జిల్లాల్లోనూ అమలు చేయనున్నారు. ఈ జిల్లాల్లో వలస కూలీలను గుర్తించే కార్యక్రమం కొనసాగుతోంది. -
విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కల్లోలంతో ఏర్పడిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారత్కు అంతర్జాతీయ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలన్న అంశంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు చైనా నుంచి పెట్టుబడులను తరలిస్తున్నాయని, ఇన్వెస్ట్మెంట్ విధానాలను పునర్వ్యవస్థీకరించుకుంటున్నాయని వస్తున్న వార్తలు తాజా నిర్ణయాలకు నేపథ్యం. వాణిజ్య శాఖ ప్రకటన ప్రకారం క్యాబినెట్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలివీ... ► సెక్రటరీలతో కూడిన ఒక ఉన్నత స్థాయి సాధికార గ్రూప్ (ఈజీవోఎస్) ఏర్పాటు. దీనికి క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. ► మంత్రిత్వశాఖలు, డిపార్ట్మెంట్లలో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విభాగాలు (పీడీసీ)లు ఏర్పాటవుతాయి. పెట్టుబడుల ప్రతిపాదనల అమలు దిశలో ఉన్న అడ్డంకులను తొలగించి ఆయా అంశాలను సాధికార గ్రూప్ ముందు ఉంచుతాయి. ► ఉన్నతస్థాయి సాధికార గ్రూప్లో నీతి ఆయోగ్ సీఈఓ, డీపీఐఐటీ (డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్), వాణిజ్యం, రెవెన్యూ, ఆర్థిక శాఖల కార్యదర్శులు, ఆయా డిపార్ట్మెంట్ల చీఫ్లు సభ్యులుగా ఉంటారు. క్యాబినెట్ సెక్రటరీ చైర్పర్సన్గా ఉంటే, డీపీఐఐటీ సెక్రటరీ మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ► పెట్టుబడుల ఆకర్షణకు విధానాలు, వ్యూహాల రూపకల్పన, ఆయా ప్రాజెక్టులకు సంబంధించి విభిన్న మంత్రిత్వశాఖలు, డిపార్ట్మెంట్ల నుంచి సత్వర, సకాల ఆమోదాలు వచ్చేట్లు చూడ్డం, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లకు తగిన ఇన్ఫ్రా ఏర్పాటు సాధికార గ్రూప్ ప్రధాన విధానాలు. ► వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులు, నిర్వహణ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, సహకారం నెలకొల్పడం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్స్ (పీడీసీ) ఏర్పాటు ప్రధాన లక్ష్యం. ఒక మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి పీడీసీ ఇన్చార్జ్గా ఉంటారు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ వచ్చేలా చూడ్డం, భూ లభ్యత సమస్యల పరిష్కారం, ఆయా అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సాధికార కమిటీ దృష్టికి తీసుకువెళ్లడం పీసీడీ విధివిధానాలు. పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం భారత్లో పెట్టుబడులకు మరింత స్నేహపూర్వక వాతావరణం సృష్టించడానికి తాజా నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని వాణిజ్యశాఖ పేర్కొంది. ఆత్మనిర్భర్ భారత్ మిషన్ను మరింత పటిష్టం చేస్తుందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి వివిధ రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెంచే దిశలో ఈ నిర్ణయం కీలకమైనదని విశ్లేషించింది. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించడానికి ఇది ఒక కొత్త యంత్రాంగమనీ అభివర్ణించింది. కరోనా వల్ల అంతర్జాతీయంగా పలు కంపెనీలు తమ పెట్టుబడుల వ్యూహాలను పునర్వ్యవస్థీకరించుకునే పనిలో ఉన్నాయని సూచించింది. ► డిఫాల్టర్లకు ఊరట... ఐబీసీ సవరణ ఆర్డినెన్స్కు ఆమోదం ఇన్సాల్వెన్సీ, దివాలా కోడ్ (ఐబీసీ) సవరణకు వీలుగా ఒక కీలక ఆర్డినెన్స్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. కోవిడ్–19 మహమ్మారి కష్టనష్టాల నేపథ్యంలో బకాయిలు చెల్లించలేని వారిపై ఎటువంటి ఇన్సాల్వెన్సీ చర్యలు తీసుకోకుండా వీలుకల్పిస్తూ ఈ ఆర్డినెన్స్కు ఆమోదముద్ర వేసినట్లు ఉన్నత స్థాయి వర్గాల సమాచారం. లాక్డౌన్ విధించిన మార్చి 25 తర్వాత పరిస్థితుల నేపథ్యంలో మొండిబకాయిల (ఎన్పీఏ)పై ఐబీసీ ప్రొసీడింగ్స్ను చేపట్టకుండా ఆర్డినెన్స్ తగిన రక్షణను కల్పిస్తుంది. ఇందుకు అనుగుణంగా కోడ్లోని 7, 9, 10 సెక్షన్లను సస్పెండ్ చేసినట్లు, సెక్షన్ 10ఏను కొత్తగా ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆరు నెలల పాటు డిఫాల్టర్లపై తాజాగా ఎటువంటి దివాలా ప్రొసీడింగ్స్ను చేపట్టడం సాధ్యం కాదు. ఏడాది పాటు దీనిని పొడిగించడానికి సైతం ఆర్డినెన్స్ వీలు కల్పిస్తోంది. -
వీధి వ్యాపారులకు రూ. 10 వేలు
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సూక్ష్మ రుణ పథకాన్ని సోమవారం ఆవిష్కరించింది. దీని ద్వారా వారికి రూ. 10 వేల వరకు రుణం అందించనున్నారు. ఈ ‘ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి’ పథకం సుమారు 50 లక్షల మందికి లబ్ధి చేకూర్చనుందని కేంద్ర పట్టణ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం మార్చి 22 వరకు వీధి వ్యాపారాల్లో ఉన్నవారు ఈ పథకానికి అర్హులని పేర్కొంది. ‘వారు రూ. 10 వేల వరకు రుణం తీసుకోవచ్చు. ఆ రుణాన్ని సులభ నెలవారీ వాయిదాల్లో సంవత్సరంలోపు చెల్లించాలి. సమయానికి కానీ, ముందుగా కానీ చెల్లించినవారికి వార్షిక వడ్డీలో 7% వరకు రాయితీ లభిస్తుంది. ఆ రాయితీ మొత్తం ఆరు నెలలకు ఒకసారి వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ పథకం మార్చి 2022 వరకు అమల్లో ఉంటుంది. సమయానికి రుణ వాయిదాలు చెల్లించినవారికి రుణ పరిమితిని పెంచే అవకాశం కూడా ఉంది’ అని వివరించింది. ఈ పథకం అమలులో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని, వీధి వ్యాపారులు, బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని కోరింది. పథకం అమలు కోసం మొబైల్ యాప్ను, వెబ్ పోర్టల్ను రూపొందిస్తున్నామని వెల్లడించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు రైతులు, కూలీలు, శ్రామికుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువస్తాయని మోదీ పేర్కొన్నారు. -
గ్లోబల్ లీడర్గా భారత్!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా శనివారం దేశ పౌరులకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను హిందీలో చదివి వినిపించి తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు. కోవిడ్–19పై పోరాటంలో విజయం వైపుగా భారత్ ప్రయాణిస్తోందని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. భారత్ గ్లోబల్ లీడర్గా ఎదగాలన్న కల సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదన్న మోదీ తన లేఖలో గత ఏడాది పాలనాకాలంలో సాధించిన విజయాలను, ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను, కరోనా గడ్డు పరిస్థితుల్లోనూ భారత్ చేస్తున్న పోరాటాన్ని ప్రస్తావించారు. మోదీ లేఖలోని కొన్ని ముఖ్యమైన అంశాలు.. ఎన్నో సమస్యలకు పరిష్కారం ‘గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో మా గెలుపు భారత ప్రజాస్వామ్య చరిత్రలో స్వర్ణయుగం. కొన్ని దశాబ్దాల తర్వాత పూర్తి స్థాయి మెజార్టీతో వరసగా రెండో సారి ఒకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన శుభ సమయం. భారత్ని అత్యున్నత స్థానంలోకి తీసుకువెళ్లి గ్లోబల్ లీడర్గా చూడాలని కలలు కన్న భారతీయులు మమ్మల్ని గెలిపించారు. ఆ కల సాకారం చేసే దిశగా గత ఏడాదిలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. ఆర్టికల్ 370 రద్దు ద్వారా జాతి ఐక్యత, సమగ్రతా స్ఫూర్తిని చాటి చెప్పాం. రామజన్మభూమి వివాదానికి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పరిష్కారం లభించడం హర్షణీ యం. అత్యంత అనాగరికమైన ట్రిపుల్ తలాక్ విధానాన్ని చెత్తబుట్టలో పడేశాం. పౌరసత్వ చట్ట సవరణల ద్వారా భారత్ దయాగుణం, కలిసిపోయే తత్వాన్ని తెలియజేశాం’. రైతులు, మహిళలు, యువత సాధికారత ‘మహిళలు, యువత, రైతుల సా«ధికారతకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తాం. పీఎం సమ్మాన్ నిధి పథకం ద్వారా 9 కోట్ల 50 లక్షల మందికిపైగా రైతుల అకౌంట్లలో రూ.72 వేల కోట్లు జమచేశాం. గ్రామీణ భారత్లో 15 కోట్ల ఇళ్లకు జల్ జీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు అందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. రైతులు, రైతు కూలీలు, అసంఘటిత రంగంలో ఉన్న 60 ఏళ్లు పై బడిన వారికి నెలకి రూ.3 వేలు పింఛన్ ఇవ్వాలని హామీ ఇచ్చాం’ తొలిగిపోతున్న గ్రామీణ, పట్టణ అంతరాలు ‘పట్టణాలు, గ్రామాల మధ్య అంతరాలు తొలగిపోతున్నాయి. పట్టణాల్లో ప్రజల కంటే 10శాతం ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఇంటర్నెట్ను వాడుతున్నారు. స్వయం సహాయక గ్రూపుల్లో 7 కోట్ల మందికిపైగా గ్రామీణ మహిళలకు ఆర్థికంగా అండగా ఉంటున్నాం. ఇన్నాళ్లూ రూ.10 లక్షల రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం. ఆదివాసీ పిల్లల విద్య కోసం 400కిపైగా ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలల్ని నిర్మిస్తున్నాం’ కరోనాపై ఐక్య పోరాటం ‘ఏడాది కాలంలో తీసుకున్న ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలతో దేశం ప్రగతి పట్టాలెక్కింది. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎన్నో సమస్యలు మనకి సవాళ్లు విసురుతున్నాయి. నేను రేయింబగళ్లు కష్టపడుతున్నాను. నాలోకూడా కొన్ని లోటుపాట్లు ఉండే ఉంటాయి. కానీ మన దేశానికి లోటు లేదు. నా మీద నాకున్న నమ్మకం కంటే మీ మీద, మీ బలం మీద, మీ సామర్థ్యం మీద ఉన్న విశ్వాసం ఎక్కువ. కరోనాపై పోరులో ఐక్యతను చూసి ప్రపంచ దేశాలు విస్తుపోయాయి’ ఆత్మనిర్భర్ భారత్తో కొత్త దశ దిశ ‘లాక్డౌన్ సమయంలో మన కూలీలు, వలస కార్మికులు, చేతివృత్తుల వారు, కళాకారులు, కుటీర పరిశ్రమల్లో పనిచేసేవారు, ఇలా సాటి పౌరులెందరో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. వారిని సమస్యల నుంచి గట్టెక్కించడానికి మనందరం పట్టుదలతో, ఐక్యతగా పనిచేస్తున్నాం. స్వయం సమృద్ధ భారత్ను సాధించడం ద్వారా మనం దేని మీదనైనా విజయం సాధించగలం. ఇటీవల ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో మన దేశ దశ, దిశ మారుతుంది. ఈ ప్యాకేజీ ద్వారా రైతులు, కార్మికులు, యువత, చిన్న తరహా పరిశ్రమలు నడిపేవారు ప్రతీ భారతీయుడికి ఉపాధి దొరికి కొత్త శకం ప్రారంభమవుతుంది’. -
హృదయం లేని ఆత్మ నిర్భరం
భావగర్భితంగా చెప్పాలంటే హృదయాన్ని మానవుల సత్సంకల్పానికి, నిస్సహాయులను ఆదుకునే తత్వానికి సంకేతంగా పేర్కొం టుంటారు. శారీరక బాధలకు అతీతంగా ఉండే ఆత్మ అభౌతిక అంశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టే ఎవరైనా తమ ఆత్మనే తప్ప ఇతరుల ఆత్మను అస్సలు పట్టించుకోరు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరోనా వైరస్ సంక్షోభం నడుమ ఆత్మనిర్భర్ భారత్ (భారత స్వావలంబన) అనే ఆర్థిక ఎజెండాను ప్రకటించారు. దీనికి 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని జోడించారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం ఎలా అమలు చేయనుంది అనే అంశంపై వరుసగా అయిదు మీడియా సమావేశాలు పెట్టి మరీ వివరించారు. ఆరెస్సెస్–బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన ఆత్మనిర్భర్ పథకం మొత్తం లక్ష్యం ఏమిటి? మన దేశంలోనూ, ఇతర విదేశాల్లోనూ షేర్లు కలిగివుండి, కంపెనీలను నడుపుతున్న ప్రైవేట్ రంగం (సంపన్న పారి శ్రామికులు, బడా వాణిజ్యాధిపతులు) కరోనా సంక్షోభ కాలంలో జాతి సంక్షేమం, ప్రజా శ్రేయస్సుపై దృష్టి పెట్టకుండా లాభమే పరమావధిగా సాగుతున్నకాలంలో ఆర్థిక వ్యవస్థను మరింత మరింతగా ప్రైవేటీకరిం చడమే కేంద్ర పథకం లక్ష్యం. లాక్డౌన్ నేపథ్యంలో పట్టణ కేంద్రాల్లో జీవితం గడపడం అసాధ్యమైపోయిన భయంకరమైన పరిస్థితుల్లో వేలాదిమైళ్ల దూరం నడుచుకుంటూ స్వస్థలాలకు వెళుతున్న అసంఖ్యాక కార్మికుల జీవితాలను భారత గుత్తపెట్టుబడిదారులు ఏమేరకు ఆదుకుని ఉంటారు అన్నదే అసలు ప్రశ్న. అర్థరాత్రి దేశవ్యాప్తంగా పనిస్థలాలను మూసివేసిన నేపథ్యంలో కూడు, గూడు, నీరు లేని స్థితిలో దేశంలోని 20 కోట్లమంది వలస కార్మికుల (వీరిలో ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే) పరిస్థితి గురించి ఏమాత్రం ఆలోచించకుండానే ప్రధాని మోదీ మార్చి 24న దేశమంతటా లాక్ డౌన్ ప్రకటించారు. అలా కాకుండా లాక్డౌన్ ప్రకటనకు నాలుగైదు రోజులు ముందుగా అప్రమత్తం చేసి ఉంటే కరోనా నుంచి లాక్డౌన్ సమయంలో కాపాడిన వారికంటే ఎక్కువ సంఖ్యలో వలస కూలీలను కాపాడగలిగి ఉండవచ్చు. కరోనా వైరస్ కారణంగా చనిపోతున్న వారందరి పట్ల ప్రేమను, నిజమైన ఆందోళనను ప్రదర్శించడానికి బదులుగా పాలకవర్గాలు ప్రదర్శించిన హృదయరాహిత్యాన్ని వలస కూలీల దుస్థితి తేటతెల్లం చేస్తోంది. ఆకలిదప్పులకు గురవుతూనే నడచుకుంటూ పోతున్న పిల్లలు, మహిళలు రహదారులపై, అడవుల్లో, రైల్వే ట్రాక్లమీదే పడి కుప్పకూలిపోతున్నారు. డస్సిపోయి మరణిస్తున్న చిన్నపిల్లల ముఖాలు కేవల ఆత్మను కాకుండా మానవీయ హృదయాన్ని కలిగిన ప్రతి ఒక్కరినీ చాచికొడుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ ఆరెస్సెస్, అతిపెద్ద రాజకీయపార్టీ బీజేపీ నేతలు పూర్తిగా ఇళ్లకే పరిమితమై తమ ప్రాణాలను కాపాడుకోవడంలోనే మునిగిపోయి ఉన్నారు. ఇతర రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా కాలినడకన సాగిపోతూ, ఆకలితో అలమటిస్తూ చనిపోతున్న ప్రజలను కాపాడటానికి తమ నాయకులను కానీ, కేడర్లను కూడా పంపించిన పాపాన పోలేదు. యావత్ ప్రపంచం లాక్డౌన్లో ఉంటున్న కాలంలోనే, తనను మించినవారు లేరని గర్విస్తున్న జాతీయవాద పార్టీ పాలిస్తున్న భారతదేశంలో రహదారులన్నీ వలసకూలీల పాదాలతో రక్తమోడుతున్నాయి. ఉపాధిలేని, అంతకుమించి హృదయం లేని పట్టణ కేంద్రాల్లో కంటే గ్రామాలు ఎంతోకొంత మానవీయ వాతావరణంతో ఉంటాయని వలస కార్మికులు భావిం చారు. నిజానికి లాక్డౌన్ కాలంలో పట్టణ కేంద్రాలు వలస కార్మికులను శారీరకంగా, మానసికంగా కూడా చంపేశాయి. నగరాల్లో సురక్షితంగా బతుకుతామని లేశమాత్రం ఆశ ఉండి ఉంటే, మండువేసవిలో పిల్లలు, గర్భిణీలు, వృద్ధమహిళలతో వలసకూలీలు జాతీయ రహదారులపైకి వచ్చి ఉండేవారు కారు. దేశవ్యాప్తంగా ఆహార ఉత్పత్తిదారులు, భవన నిర్మాతల పట్ల తన హృదయరాహిత్యాన్ని హిందుత్వ నిస్సిగ్గుగా ప్రదర్శించింది. హిందుత్వ శక్తుల జాతీయవాదమే వందలాది వలసకార్మికులను రహదారులపై కరోనాకు బలి ఇచ్చింది. క్రూరమైన వైరస్ బారినపడి వలసకూలీల్లో చాలామంది చనిపోతున్నారు. మన దేశంలో దేవుళ్లు కానీ, ఈ జాతీయవాదులు కానీ వీరిపట్ల కరుణ చూపడం లేదు. భారతదేశంలో గత 95 ఏళ్లుగా ఉనికిలో ఉంటున్న ఆరెస్సెస్, బీజేపీ (గతంలో జనసంఘ్)లు భావజాలపరంగా, ఆచరణాత్మకంగా కూడా దేశంలోని కోట్లాదిమంది శ్రామికుల జీవితాన్ని మెరుగుపర్చడం గురించి ఆలోచించేవిధంగా ఎన్నడూ శిక్షణ పొందలేదు. ప్రజలను కూడగట్టడం, ఆచరణాత్మక తీర్మానాలు రాయడం, ప్రచార క్రమంలో ప్రసంగించడం అనే ఈ సంస్థల మొత్తం ప్రక్రియ మతపరమైన జాతీయవాదంతోనే సాగింది. వీరి జాతీయవాద కీలకలక్ష్యం ముస్లింలను, క్రైస్తవులను వ్యతిరేకించడమే. వారు గొప్పగా చర్చకు పెట్టిన సాంస్కృతిక జాతీయవాదం కూడా దేశంలో ముస్లింలు, క్రైస్తవుల ఉనికిని బలహీనపర్చడం గురించే మాట్లాడింది తప్ప దేశానికి అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న, భవనాలు నిర్మిస్తున్న పేదవారిని బలోపేతం చేయాలని ఎన్నడూ ప్రయత్నించలేదు. ఎందుకంటే వీరంతా దళితులు, శూద్రులు, ఓబీసీ ఆదివాసీ కుటుంబాలకు సంబంధించినవారే. వీరి జాతీయవాదం పేదవారికి పారిశ్రామికులు, బలిసిన మత గురువులతో సమానస్థాయిని ఇవ్వలేదు. అంతేకాకుండా వీరు ఒక నిర్దిష్టమైన ఆర్థిక జాతీయవాద ఎజెండాను ఎన్నడూ రూపొందించలేదు. 20వ శతాబ్ది మొదట్లో ఆరెస్సెస్ ప్రారంభమైనప్పుడు ఆర్థిక జాతీయవాదం అంటే.. ప్రధానంగా వ్యవసాయం, భూ సమస్య, చేతివృత్తులను బలపర్చడం, కుల విభేదాలను పరిష్కరించడం అనే అర్థాలతో ఉండేది. భారత జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ తమ పరిమితుల్లోనే ఈ సమస్యల్లో చాలా వాటిని చర్చించాయి. ఇక అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ వారి సహచరులు మానవ అసమానతలను తగ్గించడంతోపాటు కుల నిర్మూలన సమస్యను కూడా లేవనెత్తారు. కానీ వీరిని ఆరెస్సెస్ జాతీయవాదులు శత్రువులుగా భావించారు. ఆరెస్సెస్ సిద్ధాంతకర్తలు ఈ దేశంలోని భూస్వామ్యతత్వంపై, లేక భారత వ్యాపార పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న వడ్డీ పెట్టుబడికి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా రాయలేదు. ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు వ్యాపారాన్ని, బడా భూ ఎస్టేట్లను ఎన్నడూ నియంత్రించలేదు. ఉదాహరణకు మహారాష్ట్రలో దేశాయి, సర్దేశాయిలు భూస్వాములు. వీరు బ్రాహ్మణులు. తర్వాతికాలంలో శూద్ర మరాఠాలు భూస్వాములుగా మారడానికి ముందు బ్రాహ్మణులే భూమిపై ఆజమాయిషీ కలిగి ఉండేవారు. చాలా మీడియా రిపోర్టులు ఆత్మనిర్భర్ పథకం కూడా ఆరెస్సెస్ ఆర్థిక సిద్ధాంతకర్త దత్తోపంత్ తెంగడి (స్వదేశీ జాగరణ్ మంచ్) రూపొందించిన స్వదేశీ ఎజెండాలో భాగమేనని సూచిస్తున్నాయి. ఇక 1993లో ‘హిందూ ఎకనమిక్స్ ఎటర్నల్ ఎకనమిక్ ఆర్డర్’ అనే పుస్తకం రాసిన హిందుత్వ ఆర్థికవేత్త డాక్టర్ ఎంజీ బొకారే కూడా ఈ ఎజెండా రూపకర్తల్లో ఒకరని తెలుస్తోంది. పైగా ఆరెస్సెస్, బీజేపీలు భారత ఆర్థిక వ్యవస్థలోని విభిన్న రంగాల్లో ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన సూత్రబద్ధతను కలిగి ఉన్నాయా అనేది ప్రాథమిక ప్రశ్న. వీరికి ఉత్పత్తి, పంపిణీపై ఏదైనా సానుకూల సిద్ధాంతం కూడా ఉన్నట్లు రికార్డులేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ అనంతర ప్రైవేటీకరణ దేశ కార్మికశక్తిని మరింతగా మృత్యుశయ్యలోకి నెట్టేస్తుందని చెప్పాలి. హిందుత్వ శక్తుల దృష్టి ఎప్పుడూ మతం, సంస్కృతి చుట్టూనే తిరుగుతూవచ్చింది తప్పితే ఆర్థికంపై లేదు. మహాత్మాగాంధీ తన హింద్ స్వరాజ్లో ఉపయోగించిన స్వదేశీ భావన గురించి వీరు అస్పష్టంగా మాట్లాడుతుంటారు. భారతదేశంలో పారిశ్రామికీకరణను గాంధీ వ్యతిరేకించడమే కాకుండా వికేంద్రీకరించిన గ్రామీణ ఆర్థిక నమూనాను సమర్థించారు. చర్కా తన ఆర్థిక నమూనాకు సంకేతం. కానీ నెహ్రూవియన్ సిద్ధాంతకర్తలు, కమ్యూనిస్టులు మాత్రం తొలి నుంచి పారిశ్రామికీకరణ, పట్టణీకరణను బలపర్చేవారు. ఇక హిందుత్వ సిద్ధాంతకర్త దత్తోపంత్ ప్రతిపాదిస్తున్న ’మూడో మార్గం’కి ఏ దారీ తెన్నూ ఉన్నట్లు లేదు. కాబట్టి ఒక స్పష్టమైన ఆర్థిక మార్గం అంటూ లేని ఆరెస్సెస్, బీజేపీల ఆత్మనిర్భర భారత్ స్వరూపం ఎలా ఉండబోతోంది? ఇంతవరకు కేంద్రంలో 11 సంవత్సరాలు పాలించిన ఆరెస్సెస్, బీజేపీలు అంతి మంగా కాంగ్రెస్ అభివృద్ధి నమూనానే పాటిస్తూ వచ్చాయి. కాంగ్రెస్కు భూస్వామ్య భూసంస్కరణ వ్యతిరేక ఎజెండా ఉండేది. కానీ భూసంస్కరణపై ఎలాంటి చర్చనూ ఆరెస్సెస్, బీజేపీలు అనుమతించవు. ఇప్పుడు భూస్వామ్యవిధానం అంతరించింది. భారత ఆర్థికవ్యవస్థ ఆజమాయిషీలోని పట్టణ వ్యాపార పెట్టుబడిదారీ విధానానికి ఆరెస్సెస్ బీజేపీ అనుకూలం. భారత గుత్తపెట్టుబడి అమెరికన్–యూరోపియన్ పెట్టుబడితో మిలాఖతై ఉంది. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కూడా పూర్తిగా అమెరికన్ అనుకూల ధోరణితో ఉంది. ఇలాంటి పెద్దన్న, చిన్నన్న సంబంధంలో స్వావలంబనకు చోటెక్కడ? మరోవైపున లాక్డౌన్ సంక్షోభకాలంలో కూడా వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ శ్రామిక శక్తి వల్లే దేశం భద్రంగా ఉంది. కోవిడ్–19 సంక్షోభ సమయంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉంది. అదేసమయంలో ప్రైవేట్ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా మూతపడిపోయింది. భారత శ్రామిక వర్గం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే వైద్యం పొందే పరిస్థితుల్లో ఉంటోంది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపనలో ప్రభుత్వ వైద్యరంగానికి కేటాయించిన వాటా లెక్కలోకి కూడా రాదు. దీన్నంతా చూస్తుంటే వలస కార్మికుల మరణాలను ఫణంగా పెట్టి హృదయంలేని హిందుత్వ ఆత్మ మరింత డబ్బుకోసం వెంపర్లాడుతున్నట్లు కనిపిస్తోంది. వ్యాసకర్త : ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్, డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ అభినందనలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా చర్యలు చేపట్టడమే కాకుండా అయా దేశాలకు వైద్య సహకారం అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అభినందించారు. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీలో భాగంగా చేనేత వృత్తులకు , చేతి వృత్తిదారులకు నిధులు కేటాయించాలని కోరుతూ ప్రధానికి కోమటిరెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా కరోనా సంక్షోభంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతి పెద్ద ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘కరోనా మహమ్మారి విస్తరించకుండా విధించిన లాక్ డౌన్ కారణంగా తెలంగాణతో పాటు దేశంలో ఉన్న చేనేత, చేతి వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 2019 గణంకాల ప్రకారం 31 లక్షల కుటుంబాలు, 45 లక్షల మంది ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగానికి నిధులు కేటాయించి ఆదుకోవాలి. సంప్రదాయంగా ఇదే వృత్తిని నమ్ముకున్న చేనేత వృత్తిదారులలో ఆధిక శాతం పేదవారు ఉన్నారు. ఇందులో 67 శాతం మంది రూ.5,000 లోపు , 26.2 శాతం రూ.10,000 లోపు, 6.8 శాతం మాత్రమే రూ.10,000 పైన ఆదాయం పొందుతున్నారు. మన దగ్గర తయారైన ఉత్పత్తులను మన దేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసేవారు. లాక్ డౌన్ కారణంగా ముడి సరుకుల రవాణా లేక, పని లేక చేనేత , చేతి వృత్తిదారులకు ఉపాధి కరువైంది. ఇదే వృత్తిని నమ్ముకున్న వారంతా ఆకలితో అలమటిస్తున్నారు. వీరికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరుతున్నాను. ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే ముడి సరుకుల కొనుగోలు ద్వారా అయా వృత్తులు తిరిగి గాడిలో పడుతాయి. నెలకు రూ. 3,000ల చొప్పున మూడు నెలల పాటు ఆర్థిక సాయం, పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందించాలి. దేశంలోని 23 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు దోతిలు, చీరలు అందజేయాలని, వీటిని తయారు చేసే బాధ్యతను చేనేత, చేతివృత్తిదారులకు అప్పగించాలి’ అంటూ ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. చదవండి: భారత్పై నేపాల్ ప్రధాని షాకింగ్ కామెంట్లు! బస్సుల గోల.. కాంగ్రెస్పై అదితి ఫైర్ -
అక్కరకు రాని ప్యాకేజీలు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీలో ఏమేం వుంటాయో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరసగా అయిదు రోజులపాటు అందరికీ తేటతెల్లం చేశారు. భారీ మొత్తం అని ప్రధాని చెప్పారుగనుక... జీడీపీలో పది శాతం అన్నారు గనుక ఈ ఉద్దీపనల పరంపరపై ఆశలు కూడా అదే స్థాయిలో భారీగా వున్నాయి. చివరాఖరికి ఇవి ఎవరినీ సంతృప్తిపరచకపోగా... ఈ వంకన ప్రైవేటీకరణకు, ఇతరత్రా సంస్కరణ లకు కేంద్రం పావులు కదుపుతోందన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. దీర్ఘకాల ప్రయోజనా లను దృష్టిలో వుంచుకుని ఈ ఉద్దీపనలను రూపొందించామని మంత్రి చెబుతున్నారు. కానీ లాక్డౌన్ పర్యవసానంగా పూట గడవడం కూడా కష్టమైన జనాభాకు తక్షణం చేసేదేమిటో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై వుంది. కనీసం అంతంతమాత్రంగా వున్న జీడీపీని మందకొడిగా కదిలించడానికైనా ఈ ఉద్దీపనల పరంపర దోహదపడుతుందా అన్నది అనుమానమే. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ను మోదీ ప్రకటించిన నాటికే కేంద్రం, ఆర్బీఐ రూ. 9 లక్షల 94 వేల 403 కోట్ల విలువైన ఉద్దీపనలు ఇచ్చాయి. ఇప్పుడు ప్రకటించిన అయిదు ఉద్దీపనల విలువ రూ. 11 లక్షల 2 వేల 650 కోట్లు. ఈ రెండింటి విలువా లెక్కేస్తే అది రూ. 20 లక్షల 97 వేల 53 కోట్లు. సారాంశంలో ప్రధాని ముందుగా చెప్పిన రూ. 20 లక్షల కోట్ల కంటే ఇది దాదాపు లక్ష కోట్లు అదనం. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో తాను చాలా ఉదారంగా వున్నానన్న అభిప్రాయం కేంద్రంలో దండిగా వున్నట్టే కనబడుతోంది. ఆ అభి ప్రాయం సామాన్యుల్లో కలగజేయడానికి కూడా ప్రయత్నించివుంటే బాగుండేది. ప్రకటించినదాన్లో వాస్తవంగా నగదు రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అందరికీ అందేది ఎంతన్నదే కీలకం. ఈ ఉద్దీపనల పర్యవసానంగా బడ్జెట్పై ఎంత శాతం భారం పడుతుందన్న ప్రశ్నకు మంత్రి జవాబివ్వ లేదు. ఆ మాట చెప్తే కరోనా వల్ల కేంద్రం అదనంగా మోస్తున్న భారమెంతో తెలిసేది. అది రూ. 2.02 లక్షల కోట్లని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతుంటే... లక్షన్నర కోట్లు దాటదని మరికొందరి నిపు ణుల అభిప్రాయం. మొత్తానికి జీడీపీలో ఒక శాతం దాటదని వారు లెక్కలు కడుతున్నారు. మరి కేంద్రం చేసిందేమిటి? మొదటిరోజు నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు సంబంధించింది. వాటికి బ్యాంకుల నుంచి రూ. 3 లక్షల కోట్ల మేర రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పడంతోపాటు అందుకు ఎలాంటి హామీ చూపనవసరం లేదన్నారు. కానీ కేంద్రంలో ఆ పరిశ్రమలకు సంబంధించిన శాఖను చూస్తున్న నితిన్ గడ్కారీ చెబు తున్న లెక్క ప్రకారం ఆ సంస్థలకు ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిల విలువే రూ. 5 లక్షల కోట్లు! కనుకనే ‘మాపై అంత ఔదార్యం చూపాల్సిన అవసరం లేదు... మాకు రావాల్సిన బకాయిలేవో తీర్చండి చాల’ని ఎంఎస్ఎంఈలు మొత్తుకుంటు న్నాయి. లాక్డౌన్కు ముందే అవి నానా అగచాట్లూ పడుతున్నాయి. ఇలాంటి సమయంలో వాటికి నగదు లభ్యత పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కేంద్రం పట్టించుకోలేదు. ఈ అయిదు ఉద్దీపనల్లోనూ మొత్తంగా కేంద్రం 40 రకాల చర్యల్ని ప్రకటించింది. కానీ వీటిల్లో అత్యధికం సంస్కరణ లకు సంబంధించినవే తప్ప లిక్విడిటీని పెంచగలిగేవి కాదు. ఈ కరోనా సమయంలో అందరికీ గుర్తొస్తున్న ప్రజారోగ్యానికి ఈ ఉద్దీపనల్లో చోటు దొరికింది. కానీ అందుకు ఎంత కేటా యించదల్చుకున్నదో కేంద్రం చెప్పలేదు. ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులు మొదలుకొని రాష్ట్రాల వరకూ దాదాపు అందరికందరూ రుణాలు తెచ్చుకోవాలి తప్ప కేంద్రం తనకు తానుగా ఇవ్వదల్చు కున్నది లేదు. వలసజీవులకు రెండు నెలలపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామని, గ్రామీణ ఉపాధికి అదనంగా రూ. 40,000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం బాగానేవుంది. కానీ వలసజీవుల్లో అత్యధికులు ఇప్పుడు నడిరోడ్లపై, రైలుపట్టాలపై వున్నారు. వందలు, వేల కిలోమీటర్ల దూరాల్లో వున్న స్వస్థలాలకు రాత్రనక, పగలనక నడిచిపోతున్నారు. ఆకలిదప్పులతో అలమటిస్తు న్నారు. గుజరాత్, యూపీ, మహారాష్ట్ర తదితరచోట్ల మమ్మల్ని పోనీయమంటూ బయటికొచ్చిన వారిని చావగొడుతున్నారు. అలాంటివారికి ఇప్పుడు ప్రకటించిన ఉద్దీపనల్లోని చర్యలు ఏమేరకు దోహదపడతాయో కేంద్రం ఆలోచించిందా? దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రం మీదుగా నడిచి వెళ్తున్న వలసకూలీల కష్టాలను చూసి చలించి ఆదరించి అన్నం పెడుతోంది. వారికి చెప్పుల జతతో సహా అన్నీ అందించి, రైళ్లు, బస్సుల్లో ఉచి తంగా వారి వారి స్వస్థలాలకు పంపుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి చొరవ చూపాల్సిన అవసరం వుందని గుర్తించి, ఆ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి. కరోనా కష్టాలు మొదలైనప్పటినుంచీ దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆదాయం పడిపోయి, ఖర్చు అమాంతంగా పెరిగి అప్పు తెచ్చుకోవడానికి అనుమతించాలని కోరుతున్నాయి. తెచ్చుకునే రుణాలు జీడీపీలో 3 శాతం మించి వుండకూడదన్న నిబంధన మార్చాలంటున్నాయి. అందుకు కేంద్రం కూడా ఒప్పుకుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి దాన్ని 5 శాతానికి పెంచడానికి అంగీకరించింది. కానీ అందుకు విధించిన షరతులు విస్తుగొలుపుతాయి. మొదటి 0.5శాతం వరకూ పేచీలేదు. ఆ తర్వాత పెంచ దల్చుకున్నవాటికి సంస్కరణలతో ముడిపెట్టింది. ఆ సంస్కరణల సారాంశం జనంపై ఆర్థిక భారం మోపడం. విద్యుత్చార్జీలు, మున్సిపల్ పన్నులు వగైరాలు పెంచితే ప్రభుత్వాలు అప్పులు తెచ్చు కోవచ్చని చెప్పడం అన్యాయం, అమానుషం. దేశ జనాభాలో అత్యధిక శాతంమంది ఇప్పుడు విప త్కర పరిస్థితుల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. వారిని రక్షించడమెలాగన్న అంశంపై దృష్టి పెట్టడం ఇప్పటి అవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ సంగతి గ్రహించాలి. -
రాష్ట్రాలకు రుణ పరిమితి పెంపు..
న్యూఢిల్లీ : రాష్ట్రాలకు రుణ పరిమితి 3 నుంచి 5 శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికి మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతం పెంచుకునేందుకు ఎలాంటి షరతులు వర్తించబోవని స్పష్టం చేశారు. అయితే కొన్ని షరతులతో 3.5 నుంచి 5 శాతం వరకు రుణ పరిమితిని పెంచుకునే అవకాశం కల్పించారు. రుణ పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్లు అదనంగా అప్పులు తెచ్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. కరోనా ప్రభావం నుంచి ఆర్థిక రంగాన్ని గట్టెక్కించడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయం సమృద్ధి భారతం పేరిట రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆఖరి విడత ప్యాకేజీ వివరాలను ఆదివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. కోవిడ్ దృష్ట్యా రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకునేందకు అన్నివిధాలా చర్యలు తీసకుంటున్నామని చెప్పారు. రూ. 11,092 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను ఇప్పటికే అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. జీతభత్యాల చెల్లింపులో రాష్ట్రాలకు ఓవర్డ్రాఫ్ట్ తీసకునే అవకాశం కల్పించడంతో పాటుగా.. ఓవర్డ్రాఫ్ట్ తీసుకునే అవకాశాన్ని 52 రోజులకు పెంచినట్టు వెల్లడించారు. పన్ను ఆదాయం కింద రాష్ట్రాలకు రూ. 46 వేల కోట్ల కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే చాలా రంగాల్లో సంస్కరణలకు సంబంధించి ప్రకటనలు చేశామని నిర్మల గుర్తుచేశారు. ప్రాణం ఉంటేనే.. ప్రపంచం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలను గుర్తుచేశారు. పేదలకు ఇబ్బంది కలగకుండా మూడు నెలలకు సరిపడా రేషన్ సరఫరా చేశామని చెప్పారు. పీఎం కిసాన్ పథకం ద్వారా 8.19 కోట్ల మందికి రూ. 2వేల చొప్పున ఇచ్చామని వెల్లడించారు. జన్ధన్ ఖాతాల ద్వారా 20 కోట్ల మంది మహిళలకు నగదు బదిలీ చేశామన్నారు. నిర్మాణ రంగంలో పనిచేసే 2.20 కోట్ల మంది కూలీలకు ఆర్థిక సహాయం అందించామని.. భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో రూ. 3,995 కోట్లు జమచేశామని చెప్పారు. ఉజ్వల యోజన ద్వారా 6.81 కోట్ల ఫ్రీ సిలిండర్లు సరఫరా చేశామని మంత్రి తెలిపారు. 12 లక్షల మంది ఈపీఎఫ్ ఖతాదారులు ఒకేసారి నగదు విత్ డ్రా చేసుకున్నారని వెల్లడించారు. దేశంలో వైద్య సదుపాయాల ఏర్పాటుకు రూ. 15 వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఇప్పటికే 51 లక్షల పీపీఈ కిట్లు, 87 లక్షల ఎన్-95 మాస్క్లు సరఫరా చేశామన్నారు. వైద్య రంగంలో పనిచేసే సిబ్బంది రూ. 50 లక్షల బీమా సౌకర్యం అందిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్ రిలీఫ్ ఫండ్ కింద రాష్ట్రాలకు రూ. 4,113 కోట్లు అందజేశామని తెలిపారు. ఆర్థిక మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం కోసం ల్యాబ్ల ఏర్పాటు జిల్లా స్థాయిలో ప్రతి ఆస్పత్రిలో డిస్ఇన్పెక్షన్ సెంటర్ల ఏర్పాటు ఆన్లైన్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించడంలో భాగంగా వన్ క్లాస్, వన్ డిజిటిల్ పేరుతో డిజిటల్ పాఠాలు. త్వరలోనే టీవీ, రేడియోల ద్వారా ఆన్లైన్ పాఠాలు దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాల ఏర్పాటుకు రూ. 15 వేల కోట్లు కేటాయించాం. గ్రామీణ ఉపాధి హామీ పనులకు అదనంగా మరో రూ. 40 వేల కోట్లు -
నిర్భరమో.. దుర్భరమో!
ఎంత కర్ణపేయమైన మాట అది. ఈ కరోనా రుతువులో మన ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి ఐదోసారి చేసిన ప్రసంగంలో ఒక వీనుల విందైన మాట దొర్లింది. ఆత్మ నిర్భర భారత్! ఆ లక్ష్యసాధన కోసం కంకణం కట్టుకుందామని ఉత్తేజపూరితమైన పిలుపునిచ్చారు ప్రధాని. గతంలో మన ప్రధానులు, జాతీయ నాయకులు ఇదే మాటను ఇంగ్లిష్లో సెల్ఫ్ రిలయన్స్ అనే వారు. మనం తెలుగులో స్వావలంబన అని రాసుకునేవాళ్లం. చదువుకునేవాళ్లం. స్వతంత్రం వచ్చిన డెబ్బయ్ మూడేళ్లలో కనీసం నూటా డెబ్బయ్మూడు సార్లు మన దేశాధినేతలు మనచేత స్వావలంబన కంకణాన్ని కట్టింపజేసి ఉంటారు. కానీ, చిత్రమేమిటంటే ఇప్పటికీ చాలామందికి ఆ మాటకు అర్థం తెలియదు. అయినా చెవులు తుప్పుపట్టేంత డెసిబుల్స్ మోతను ఆ శబ్దం మోసుకొచ్చింది. తొలి భారత ప్రధానమంత్రి పండిత జవహర్లాల్ నెహ్రూ 1951లో పంచవర్ష ప్రణాళికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతూ, వీటి లక్ష్యం ‘సెల్ఫ్ రిలయన్స్’ అంటూ తొలి బాణాన్ని సంధించారు. అప్పటి నుంచి ప్రతి పంచ వర్ష ప్రణాళికలోనూ ప్రధాన లక్ష్యంగా ఈ మాట చోటు చేసు కుంటూనే ఉన్నది. ప్రతియేటా భారత రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను ప్రారంభిస్తూ ఈ లక్ష్యాన్ని నొక్కి వక్కాణిస్తూనే ఉన్నారు. ప్రతి వార్షిక బడ్జెట్ ప్రసంగంలోనూ అప్పటి ఆర్థిక మంత్రి ఈ గణపతి పూజను నిష్టగా నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రతి పంద్రాగస్టునాడు భారత ప్రధాని గాత్రంలోంచి వెలువడే ఈ మాటకు ఎర్రకోట కోరస్ పాడుతూనే వస్తున్నది. ఇన్నేళ్లుగా తపస్సు చేస్తూ వస్తున్నా సాక్షాత్కరించని స్వావలంబన శబ్దంపై ఒకరకమైన నిర్లిప్తత జనంలో ఏర్పడిపోయింది. అందువల్లనే భారత ప్రధాని మొన్నటి ప్రసంగంలో ఈ మాటను హిందీలో రీడిజైన్ చేసి వాడటంతో గొప్ప రిలీఫ్ లభించింది. నిజం చెప్పా లంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ చేసిన ‘ఉద్దీపన’ కంటే ‘ఆత్మనిర్భర్’ అనే పంచాక్షరీ వల్ల కలిగిన ఉద్దీపనే గొప్ప. నిజంగానే ఈ పంచాక్షరీ మంత్రం ఫలితమిచ్చి, కరోనా నంతర ప్రపంచ పరిణామాల్లో భారత్ స్వావలంబనను సాధిం చగలిగితే, చరిత్రలో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, డెంగ్ షియావో పింగ్ల సరసన నరేంద్ర మోదీ పేరు చేరిపోతుంది. 1929–30ల నాటి మహా మాంద్యం (గ్రేట్ డిప్రెషన్) ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అమెరికాను మరింతగా. ఈ సంక్షోభం అనంతరం అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ‘న్యూడీల్’ పాలసీతో ఆర్థిక స్థితిని చక్కదిద్దడం ప్రారంభించి రెండో ప్రపంచయుద్ధం ముగిసేవరకూ మూడు పర్యాయాలు పదవిలో కొనసాగారు. ఆ తర్వాత అమెరికా వెనుతిరిగి చూడలేదు. సైనికపరంగా కొంత కాలంపాటు సోవియట్ రష్యాతో పోటీపడవలసి వచ్చినప్పటికీ, ఆర్థికంగా మాత్రం అజేయశక్తిగానే కొనసాగుతున్నది. 1950వ దశకంలో అప్పటికి వ్యవసాయిక దేశంగా ఉన్న చైనాను ఉన్న పళంగా కమ్యూనిస్టు వ్యవస్థగా తీర్చిదిద్దడంకోసం చైర్మన్ మావో జెడాంగ్ ప్రారంభించిన ‘గొప్ప ముందడుగు’ (గ్రేట్ లీప్ ఫార్వర్డ్) అనే ఆర్థిక ఉద్యమం విధ్వంసకరంగా తయారైంది. లక్ష లాదిమంది గ్రామీణ ప్రజలు ఆకలి చావులకు బలయ్యారు. మావో ప్రారంభించిన సాంస్కృతిక విప్లవం కూడా వికటించి చైనా పెను సంక్షోభంలో కూరుకొనిపోయింది. ఈ దశలో చైనా విప్లవ అగ్ర నాయకత్రయంగా ప్రసిద్ధిచెందిన చైర్మన్ మావో, ఝౌ ఎన్లై, జనరల్ ఝూడే ఏడాదికాల వ్యవధిలో ఒకరి తర్వాత మరొకరు కన్నుమూశారు. అప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీ పగ్గాలు చేతబట్టిన డెంగ్ షియావో పింగ్ ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించి దేశంలో సోషలిస్టు మార్కెట్ ఎకానమీని ప్రారం భించి తొలిసారిగా అంతర్జాతీయ సమాజానికి చైనా తలుపులు తెరిచారు. అక్కడి నుంచి బయల్దేరిన చైనా ఆర్థిక ప్రగతి పయనం రెండో బలమైన ఆర్థిక వ్యవస్థ దశకు చేరుకున్నది. నేడు ప్రపం చంలో రెండు బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న ఈ రెండు దేశాలూ పెను సంక్షోభాల్లోంచి ఫీనిక్స్ పక్షుల్లాగా పైకెగసిన పాఠం మనముందున్నది. ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్నది కూడా పెను సంక్షోభ దశే. ఈ దశ దాటిన తర్వాత దేశ భవిష్యత్తు ఏవిధంగా ఉండబోతున్నదనేదే మిలియన్ డాలర్ ప్రశ్న. పారిశ్రామిక విప్లవం ఫలితంగానే యూరప్ దేశాలు ప్రపంచం మీద పెత్తనం చేశాయనీ, వలస దేశాలను పీల్చి పిప్పి చేసిన కారణంగానే అవి అభివృద్ధి చెందాయనే విషయాలు మనకు తెలుసు. తొలి పారిశ్రామిక విప్లవం యూరప్ కంటే కనీసం వెయ్యేళ్లు ముందుగానే భారత్లో వచ్చి ఉండాల్సిందని చాలామంది చరిత్రకారులు ఇప్పటికీ అభిప్రాయపడుతుంటారు. ఎందుకంటే, వేదకాలం నుంచే ఈ దేశంలో శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించిన అద్భుత పరిజ్ఞానం ఉంది. 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య ఆస్థానంలో కొలువుదీరిన సాయన సంస్కృతంలో మహాపండితుడు రుగ్వే దానికి భాష్యం రాశాడు. ఒక రుగ్వేద శ్లోకానికి అర్థం చెబుతూ కాంతివేగాన్ని సెకనుకు 3,25,940 కిలోమీటర్లుగా నిర్ధారించా రని పేర్కొన్నారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఆ వేగాన్ని 3 లక్షల కిలోమీటర్లుగా తేల్చింది. దాదాపు కచ్చితత్వంతో రెండువేల సంవత్సరాలు ముందుగానే భారతీయ విజ్ఞానం లెక్కతేల్చింది. ప్రస్తుత కొలమానాల ప్రకారం చూస్తే ఒక మీటర్ పరిమాణాన్ని వందకోట్ల భాగాలుగా విభజిస్తే చివరికి మిగిలే పరిమాణమే పరమాణువు అని అగ్నిపురాణం పేర్కొన్నదనీ, ఆ లెక్కను ఆధు నిక విజ్ఞానం అంగీకరించిందనీ చెబుతారు. సున్నాను ప్రవే శపెట్టి గణిత శాస్త్రాన్ని మలుపుతిప్పిన ఆర్యభట్ట అంతరిక్ష శాస్త్రానికి కూడా పితామహుడు. ఘనమైన వైజ్ఞానిక నేపథ్య మున్న దేశంలో ముందుగా పారిశ్రామిక విప్లవం ఎందుకు పురివిప్పలేదన్న అంశంపై భిన్నమైన వాదనలున్నాయి. బౌద్ధ మతం ప్రబలంగా ప్రచారంలో ఉన్నంతకాలం కులాలకు అతీ తంగా విజ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టే ప్రయత్నం చేశారు. ప్రబుద్ధ కాత్యాయనుడు ఆటమిక్ థియరీని, ఆచార్య నాగా ర్జునుడు రసాయన శాస్త్రాన్ని బోధించేవారని చెబుతారు. మనం స్వర్ణయుగంగా కొనియాడుతున్న గుప్తుల కాలం వచ్చేనాటికి బౌద్ధవ్యాప్తి క్షీణించడం మొదలైంది. వైదికం రాజ్యమతమైంది. వేదవిజ్ఞానం పూజాక్రతువుగా మారిపోయింది. సంస్కృతం కులీన వర్గానికే పరిమితమైంది. శ్రామికవర్గాలు, ఉత్పత్తి కులాల వారు పొరపాటున వేదం వింటే చెవుల్లో సీసం పోసే మనుధర్మ శాస్త్రం నాలుగు పాదాల మీద నడవడం ప్రారంభమైంది. విద్యకు, విజ్ఞానానికి ఉత్పత్తి కులాలను దూరం చేసిన ఫలితంగా ఉత్పత్తి రంగంలో నూతన ఆవిష్కరణలు సాధ్యంకాలేదు. రవి అస్తమించని భారతీయ సామ్రాజ్యం ఏర్పడే అవకాశాన్ని చెరిపి వేసి బానిస దేశంగా బతికే దౌర్భాగ్యాన్ని ఈ సామాజిక వివక్ష ప్రసాదించింది. నాడు సంస్కృతాన్ని, విద్యనూ పేదవర్గాలకు నిరాకరించినట్లే ఈనాడు ఇంగ్లిష్ విద్యను కూడా శ్రామిక కులా లకు నిరాకరిస్తే ఇకముందు కూడా ఈ దేశ భవిష్యత్తు దౌర్భా గ్యమస్తుగానే మిగులుతుంది. దేశంలో ఈనాటికీ సగం జనాభా వ్యవసాయరంగంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి వుంది. అందువల్ల ఈ రంగంలో ఉత్పాదకతను పెంచడానికి చర్యలు తీసుకుని, లాభ సాటి రంగంగా మార్చడం ద్వారానే భారత ఆత్మ నిర్భరత గమ్యంలో తొలి అడుగు వేయడం సాధ్యమవుతుంది. అగ్రికల్చర్ సెన్సస్ 2015–16 ప్రకారం దేశంలోని మొత్తం రైతు జనాభాలో 86 శాతం మంది ఐదెకరాల లోపు చిన్న రైతులే. సగటు కమతం విస్తీర్ణం రెండున్నర ఎకరాలు. ఇందులో కూడా అత్యధిక సంఖ్యా కులు ఒకటిన్నర ఎకరం వారే. ఈ ఒకటిన్నర ఎకరం రైతు కుటుంబం స్వయం సమృద్ధమైతేనే వ్యవసాయ రంగం లాభ సాటిగా మారినట్టు. అర ఎకరం విస్తీర్ణంలో రైతు కుటుంబానికి కావలసిన తిండి గింజలు, కూరగాయలను ఉత్పత్తి చేసుకొని మిగిలిన ఎకరం ద్వారా రెండు లేదా మూడు పంటలు తీసి, కోళ్ల పెంపకం, పాడి వగైరా సమీకృత విధానాల ఆచరణతో, ఖర్చులు పోను సాలీనా లక్ష రూపాయల లాభం తీస్తేనే రైతు ఆత్మగౌరవంతో జీవిస్తాడు. వ్యవసాయ రంగంలో ఆత్మనిర్భర తకు ఇదే గీటురాయి. ఈ దిశలో ఇప్పటికే అడుగులేసిన తెలుగు రాష్ట్రాల కార్యక్రమాలను కేంద్రం అధ్యయనం చేయాలి. రైతు భరోసా, రైతు బంధు పేర్లతో రెండు రాష్ట్రాలూ రైతుకు పెట్టుబడి ఖర్చులను ముందుగానే అందజేస్తున్నాయి. కేంద్రం కూడా ఆలస్యంగా రంగంలోకి దిగినా నామమాత్రంగా రెండు వేల రూపాయల చొప్పున మాత్రమే ఇస్తున్నది. ఐదెకరాల లోపు చిన్న, సన్నకారు రైతులందరికీ కనీసం పదివేలు చొప్పున పెట్టు బడి ఖర్చుల కింద కేంద్రం కూడా అందజేస్తే వ్యవసాయ రంగంలో ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడుతుంది. తెలం గాణ ప్రభుత్వం రాష్ట్రంలో పంటలు పండించే తీరుతెన్నులు, స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లపై ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో వినియోగమయ్యే ఆహార ఉత్పత్తులను సాధ్యమైనంత మేరకు రాష్ట్రంలోనే పండించే విధంగా ఒక ప్రణాళికను రూపొందించింది. ఏయే ప్రాంతంలో రైతులు ఏయే పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందో నిపుణుల చేత అంచనాలు వేయించి రైతులకు సూచించబోతున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాడు రైతుబంధు సమితి సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఉన్న రైతుబంధు సమితుల పర్యవేక్షణలో ఈసారి రైతులు క్రమబద్ధీకరించిన విధంగా పంటలు వేయబోతున్నారు. ఈనెల 30వ తేదీనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ప్రారంభం కాబోతు న్నాయి. ప్రతి గ్రామంలో ఈ ఆర్బీకేలు రైతులకు అందుబా టులో ఉంటాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు మొదలైనవన్నీ గ్రామంలోనే ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా నియోజకవర్గ కేంద్రంలో ఉన్న అగ్రీ ల్యాబ్స్ పరీక్షించి ధృవీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులనే ఆర్బీకేలలో విక్రయిస్తారు. వాటిని రైతు ఇంటికే చేరుస్తారు. ఈ కేంద్రంలో ఉండే గ్రామ వ్యవసాయ సహాయాధికారి రైతులకు అవసరమైన సలహాలు ఇవ్వడానికి అందుబాటులో ఉంటారు. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ఇప్పటికే పునరుజ్జీవం పొందిన పల్లెసీమలు ఆర్బీకేల ఏర్పాటుతో మరింత కళకళలాడబోతున్నాయి. 3 వేల సంవత్సరాల నాగరిక చరిత్ర అనంతరం చేనులో కలుపు తీసే యంత్రాన్ని కూడా దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకునే దుస్థితిలో ఉన్న భారత వ్యవసాయ రంగాన్ని ఆత్మనిర్భరత దిశగా మళ్లించాలంటే తెలుగు రాష్ట్రాలు చూపుతున్నటువంటి చొరవనే కేంద్రం కూడా చూపవలసి ఉంటుంది. అంతే తప్ప బ్యాంకుల ద్వారా అప్పు లిప్పించి, పీఎఫ్లో దాచుకున్న సొమ్మును అడ్వాన్స్గా ఇప్పించి పండుగ చేసుకోమనే ప్యాకేజీల ద్వారా వచ్చేది ఆత్మ నిర్భరత కాదు. ఆత్మ దుర్బలతో, ఆర్థిక బర్బరతో అనాల్సి ఉంటుంది. -వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
ఈపీఎఫ్: 3 నెలలు పొడిగింపు.. రూ. 2500 కోట్లు
న్యూఢిల్లీ: అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలతో చర్చించిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారత్ అని.. ఐదు మూల స్థంభాల ఆధారంగా దీనిని రూపొందించినట్లు పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ.. లోకల్ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నారు. లాక్డౌన్ కాలంలోనూ కేంద్రం అనేక సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. కాగా కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన.. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పథకం గురించి నిర్మల బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీ విధివిధానాలను ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దేశ వ్యాపార వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపి... వారిని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.(రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ) తమ ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన సంస్కరణలు.. ఇప్పుడు మంచి ఫలితాలనిస్తున్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. బ్యాంక్ అకౌంట్ల కారణంగా కరోనా కష్టకాలంలో.. పేదల అకౌంట్లలోకి నేరుగా నగదు బదిలీ చేయగలిగామని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలకు ధాన్యం, ఉచిత సిలిండర్లు అందజేశామని తెలిపారు. ఇప్పటి వరకు గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ ద్వారా ఆర్థిక ఉద్దీపన అమలు చేశామని.. స్వయం ఆధారిత భారత్కు కావాల్సిన పునాదులు ఇప్పటికే మోదీ సర్కారు పూర్తి చేసిందని వెల్లడించారు. పదిహేను రకాల ఉద్దీపన పథకాలను ఈరోజు ప్రకటించబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు... ప్రభుత్వ గ్యారంటీతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 వరకు ఎంఎస్ఎంఈలు ఈ పథకం ద్వారా అప్పులు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే విధంగా ఈపీఎఫ్ పరిధిలోని ఎంఎస్ఎంఈలకు జూన్, జూలై, ఆగస్టు నెలెల పీఎఫ్ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇందుకు గానూ రూ. 2500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీంతో దాదాపు 70 లక్షల మంది కార్మికులకు లబ్ది చేకూరుతుందన్నారు. ఇక విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 90 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు నిర్మల తెలిపారు. అలాగే ప్రస్తుతం చెల్లిస్తున్న టీడీఎస్, టీసీఎన్ను 25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించారు. మే 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుందన్నారు. ఇక కరోనా సంక్షోభంతో కుదేలైన రియల్ ఎస్టేట్ కంపెనీలు.. భవన నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు మరో ఆరు నెలల సమయం ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. నిర్మలా సీతారామన్ ప్రసంగం- ముఖ్యాంశాలు లాక్డౌన్తో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి 45 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట రూ. 3 లక్షల కోట్ల రుణాలకు ప్రభుత్వ గ్యారెంటీ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు అక్టోబరు 31 వరకు అప్పులు అత్యవసరాల కోసం చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం రూ. 20 వేల కోట్ల అప్పులు 4 సంవత్సరాల కాలపరిమితికి అప్పులు తీసుకోవచ్చు విద్యుత్ డిస్కంలను ఆదుకునేందుకు రూ. 90 వేల కోట్ల నిధులు ఈపీఎఫ్: ప్రభుత్వమిస్తున్న సాయం మరో 3 నెలల పాటు పొడిగింపు తద్వారా 70.22 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది ఇందుకోసం రూ. 2500 కోట్లు కేటాయింపు ప్రాథమిక, సెకండరీ మార్కెట్లలో పెట్టుబడులపై రూ. 30 వేల కోట్లు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లను ఆదుకునేందుకు రూ. 30 వేల కోట్లు ప్రభుత్వ రంగ సంస్థలు ఇవ్వాల్సిన బాకీలు తీరుస్తాం కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిధిలోని కాంట్రాక్టులన్నీ 6 నెలల వరకు పొడిగింపు కరోనాతో వాయిదాపడిన రియల్ ఎస్టేట్ నిర్మాణాల కాలపరిమితి 6 నెలల పాటు పొడిగింపు పనిని బట్టి కాంట్రాకట్లర్లకు డబ్బులు చెల్లింపు ఇక పన్నుల విషయానికొస్తే.. రేపటి నుంచి మార్చి 2021నాటికి చెల్లించాల్సిన టీడీఎస్, టీసీఎస్ 25 శాతం తగ్గింపు తద్వారా 50 వేల కోట్ల రూపాయలు ప్రజల చేతుల్లోనే ట్యాక్స్ రిటర్న్స్ తేదీ 31 జూలై నుంచి నవంబరు 30 వరకు పొడిగింపు చిన్న మధ్య తరహా పరిశ్రమల మూలధన పరిధిని పెంచిన కేంద్రం రూ.కోటి పెట్టుబడి, రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న ప్రతి కంపెనీ సూక్ష్మపరిశ్రమగా గుర్తింపు 10 కోట్ల పెట్టుబడి, 50 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు చిన్నతరహా పరిశ్రమలుగా గుర్తింపు రూ.200 కోట్ల విలువ వరకు గ్లోబల్ టెండరింగ్ అవసరం లేదు. -
లాక్డౌన్ 4.0 : మోదీ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : నాలుగో దశ లాక్డౌన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత బుధవారం సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు మిగతా కేబినెట్ మంత్రులంతా హాజరయ్యారు. మంగళవారం ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో నాలుగో దశ లాక్డౌన్ ఉంటుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ 4.0 నిబంధనలను పూర్తి భిన్నంగా రూపొందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. నాలుగో దశ లాక్డౌన్కు సంబంధించిన పూర్తి వివరాలను మే 18 లోపు వెల్లడిస్తామని ప్రధాని పేర్కొన్నారు. నాలుగో దశ లాక్డౌన్లో ఏయే రంగాలకు సడలింపులివ్వాలి, ఆర్థిక కార్యకలాపాలను దేశమంతటా ఎలా పరుగులు పెట్టించాలన్న దానిపై మోదీ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. -
‘ఆత్మ నిర్భర్’ ఫన్నీ మీమ్స్ వైరల్
లాక్డౌన్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించిన తర్వాత ఓ పదం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘ఆత్మ నిర్భర్’ అంటే అర్థం ఏంటో చెబుతూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఆత్మ నిర్భర్’ అంటే ‘స్వయంగా వంట చేసుకోవడం’ ‘మన పని మనం చేసుకోవడం’ అంటూ కొంత మంది కామెంట్స్ చేయగా.. మరికొందరూ ‘కొడుకును ఓ తల్లి నువ్వు పెళ్లి ఎప్పడూ చేసుకుంటావ్ అని అడిగిన ప్రశ్నకు.. కొడుకు అమ్మ నేను అత్మనిర్భర్’ అని బదులు ఇచ్చినట్లుగా నెటిజన్లు ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. మరోక ట్విటర్ యూజర్ ‘నేను నా పబ్జీ పేరు ఆత్మనిర్భర్గా మారుస్తాను.. ఇప్పుడు చూడండి నా బృందం నాకు మద్దతు ఇవ్వదు’ అంటూ సరదాగా కొత్తకొత్తగా అర్థాలు వెతుకుతున్నారు. (ప్రధాని ప్రసంగం.. అర్థం ఏంటో!) Meet Pandiyan, he has trained himself to pee in the pot. And has been working hard to be atmanirbhar much before Modiji came along & made it trend. Pandiyan's atmanirbharta is of as much consequence as today's speech. pic.twitter.com/RpdDNXChsV — Manisha (@ManiFaa) May 12, 2020 ఇక ‘మా పెంపుడు పిల్లి పాండియన్ను చూడండి. అది టాయిలేట్ వస్తే బాత్రూంకు వెళ్లడానికి శిక్షణ తీసుకుంది. అంటే ప్రధాని మోదీ ‘ఆత్మనిర్భర్’గా ఉండాలని చెప్పక మునిపే పాండియన్ ‘ఆత్మనిర్భర్’గా ఉండటానికి చాలా కష్టపడుతున్నాడు’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో అర్థాలు వెతుకుతున్నారు. కాగా దేశ వ్యాపంగా అమలవుతున్న లాక్డౌన్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఆత్మ విశ్వాసం, ఆత్మ బలంతో ప్రజలు ఉండటమే కాకుండా ‘ఆత్మ నిర్భర్ భారత్’ అనేది దేశ ప్రజల నినాదం కావాలని ఆయన పిలుపునిచ్చారు. Mom : son when will you marry ?? Son : mom , I am #Atmanirbhar !! pic.twitter.com/G3Xvc7cWEy — Last Man Standing RELUCTANT_ECONOMIST (@Mnomics_) May 12, 2020