avinash
-
మందలించారని ఉరేసుకున్నారు
యైటింక్లయిన్కాలనీ (రామగుండం)/ గోదావరిఖని: అర్ధరాత్రి బయటకు వెళ్లొద్దని తండ్రి మందలించడంతో ఒకరు, పద్ధతి మార్చుకోవాలని తల్లి హెచ్చరించడంతో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. గోదావరిఖని యైటింక్లయిన్కాలనీ సమీప పోతనకాలనీలో ఉంటూ, ఏఎల్పీ గనిలో ఎలక్ట్రీషియన్గా విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికుడు కొండిల్ల శ్రీనివాస్కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు సాయి అవినాష్ (20) డిప్లొమా చదువుతూ వార్షిక పరీక్షల్లో ఫెయిలయ్యాడు.అతడి కోరిక మేరకు తండ్రి మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐలో చదివిస్తున్నాడు. ఈనెల 29న ఇంటికి వచ్చిన అవినాష్.. ఆదివారం రాత్రి బయటకు వెళ్తానని, బైక్ కావాలని తండ్రిని అడిగాడు, రాత్రి సమయంలో బయటకు వెళ్లద్దని, బైక్ ఇవ్వనని తండ్రి చెప్పడంతో కలత చెందిన అవినాష్.. తెల్లవారు జామున ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మరో ఘటనలో తల్లిమందలించిందన్న మనస్థాపంతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన ముక్క రోహక్(16) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. రోహక్ మార్కండేయ కాలనీలో నివాసం ఉంటూ ఎస్టీపీసీలోని సచ్దేవ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సరిగ్గా వెళ్లడంలేదు. కనీసం ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా రాయలేదు. ఎప్పుడూ బయట తిరుగుతూ ఇంటికి వచ్చేవాడు కాదు. ఆదివారం కూడా బయటకు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఇలా చేస్తే కెరీర్ పాడవుతుందని, పద్ధతి మార్చుకోవాలని తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన రోహక్ పెంట్హౌస్ ఇనుపరాడ్కు ఉరివేసుకుని మృతి చెందాడు. -
విశాఖలో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసులో బీజేపీ యువ నేత
-
Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే
టాప్-5లో ఉన్న అవినాష్.. ఫినాలే ఎపిసోడ్లో తొలుత ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి బిగ్బాస్ హౌసులో కాస్తోకూస్తో ఎంటర్టైన్మెంట్ వచ్చింది అంటే అది ఇద్దరివల్లే. ఒకరు అవినాష్ కాగా మరొకరు రోహిణి. గతంలో వీళ్లిద్దరూ బిగ్బాస్లో పాల్గొన్నారు కానీ ఈసారి మాత్రం రెచ్చిపోయి మరీ తమదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. ఫినాలేకి ముందు రోహిణి ఎలిమినేట్ కాగా.. ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్గా అవినాష్ నిలిచి టాప్-5లో అడుగుపెట్టాడు. కానీ ఫినాలేకి వచ్చిన గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్తో పోలిస్తే అవినాష్కి ఓటింగ్ శాతం తక్కువే! గతంలో నాలుగో సీజన్లోనూ అవినాష్.. వైల్డ్ కార్డ్గానే హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు. టాప్-7 వరకు వచ్చాడు కానీ ఫైనల్కు రాలేకపోయాడు. ఈసారి మాత్రం కొద్దిలో ఎలిమినేట్ అయ్యేవాడు. కానీ చాకచక్యంగా ఫినాలేలో అడుగుపెట్టేశాడు.అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఐదో వారం.. బిగ్బాస్ హౌసులోకి అడుగుపెట్టిన అవినాష్ చివరివరకు ఉన్నాడు. దాదాపు 10 వారాల పాటు హౌసులో తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఒక్కో వారానికి రూ.2 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే రూ.20 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లే! -
తల్లడిల్లుతున్న పేగుబంధం..
ఖమ్మం: రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబాన్ని ఓ ప్రమాదం కోలుకోలేని దెబ్బతీసింది. చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అచేతన స్థితికి చేరగా.. కుటుంబానికి పెద్ద దిక్కయిన తండ్రి వడదెబ్బతో మృతిచెందాడు. మరో కొడుకు ఉపాధి లేక చిన్న చిన్న పనులు చేస్తున్నా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తల్లిపై పడటంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే రోడ్డుప్రమాదంలో గాయపడిన కుమారుడికి చికిత్స కోసం రూ.22 లక్షల మేర అప్పు చేసిన ఆ కుటుంబం తండ్రి మృతితో మరింత కష్టంలో పడిపోయింది.రోడ్డు ప్రమాదంలో గాయపడి..ఖమ్మం నగరంలోని 16వ డివిజన్ కొత్తూరు గ్రామానికి చెందిన వల్లెపు నరసింహారావు, నళిని దంపతులకు ఇద్దరు కొడుకులు. వీరిలో వల్లెపు అవినాష్ గతేడాది నవంబర్ 8న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. అవినాష్ను చికిత్స కోసం హైదరాబాద్లోని పలు ఆస్పత్రులకు తిప్పారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు బంధువులు, తెలిసిన వారి వద్ద రూ.22 లక్షల వరకు అప్పులు చేసి అతని చికిత్సకు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆయన వైద్యానికి రోజుకు రూ.10 వేలు ఖర్చు అవుతోంది.వడదెబ్బతో తండ్రి..ఇదే పరిస్థితితో ఇబ్బందులు పడుతుండగా.. యజమాని నరసింహారావు కూడా మరణించాడు. ఎండల్లో పనిచేయడంతో వడదెబ్బకు గురై ఈ నెల 6న మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఒక పక్క కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండగా.. ఇలా భర్త అర్ధాంతరంగా ముగియడంతో ఆమె గుండె పగిలింది. ఇక మరో కొడుకు అభిలాష్ హైదరాబాద్లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అది ఖర్చుల వరకు కూడా సరిపోవడం లేదని నళిని వాపోయింది. ప్రస్తుతం నళిని కూలీ పనులకు వెళ్తూ నెట్టుకొస్తోంది. తమను ఆదుకోవాలని వేడుకుంటోంది. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు 79896 32983 నంబర్లో సంప్రదించాలని బంధువులు కోరారు. -
యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్
యాంకర్ శ్రీముఖి పెళ్లికి రెడీ అయిందా? అంటే నిజమే అని తెలుస్తోంది. గత కొన్నేళ్లలో చూసుకుంటే లేడీ యాంకర్స్లో మంచి క్రేజ్ సంపాదించింది. ఎక్కువగా టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. అయితే గతంలోనూ ఈ బ్యూటీ పెళ్లి వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని తేలిపోయాయి. ఇప్పుడు మాత్రం ఈమె ఫ్రెండ్, జబర్దస్త్ కమెడియన్ అవినాష్ అసలు విషయం చెప్పేశాడు.(ఇదీ చదవండి: ముట్టుకుంటే రూ.20 లక్షలు.. ఫొటోకి రూ.25 లక్షలు)లేడీ యాంకర్లో సుమ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. అలా సుమ తర్వాత ఉన్నంతలో మంచి ఫేమ్ సంపాదించింది ఎవరంటే శ్రీముఖినే గుర్తొస్తుంది. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది గానీ తర్వాత పూర్తిగా యాంకరింగ్పై దృష్టి పెట్టింది. మధ్యలో బిగ్బాస్ షోకి కూడా వెళ్లొచ్చింది. 30 ఏళ్లు దాటిపోయినా సరే ఇప్పటికీ సింగిల్గానే ఉంటోంది.గతంలో శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈమె ఫ్రెండ్ అయిన అవినాష్.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీముఖి పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పేశాడు. ప్రస్తుతం వాళ్లింట్లో సంబంధాలు చూస్తున్నారని, బహుశా ఈ ఏడాదిలోనే వివాహం జరగొచ్చని అన్నాడు. దీనిబట్టి చూస్తే త్వరలో శ్రీముఖి కూడా ఏడడుగులు వేసేస్తుందనమాట.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా) -
డ్రగ్ పార్టీ.. అరెస్ట్
గచ్చిబౌలి (హైదరాబాద్): హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ వినియోగించిన కేసులో హైదరాబాద్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మంజీరా గ్రూప్ చైర్మన్ గజ్జల యోగానంద్ కుమారుడు, ఆ సంస్థ డైరెక్టర్ గజ్జల వివేకానంద్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాడిసన్ హోటల్ ఈ గ్రూప్దే కావడం గమనార్హం. కాగా ఇదే కేసులో నిర్భయ్, శెలగంశెట్టి కేదార్ అనే మరో ఇద్దరు ప్రముఖులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కేదార్కు పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో సీపీ మహంతి వివరాలు వెల్లడించారు. సొంత హోటల్లో 10 మందితో కలిసి..‘శనివారం రాత్రి రాడిసన్ హోటల్లో కొకైన్తో పార్టీ నిర్వహించినట్లు సమాచారం అందింది. దీంతో సైబరాబాద్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు హోటల్లో సోదాలు చేశారు. అయితే డ్రగ్ పార్టీలో పాల్గొన్నవారు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గజ్జల వివేకానంద్తో పాటు మరో 9 మంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జూబ్లీహిల్స్లోని నివాసంలో వివేకానంద్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వివేకానంద్, నిర్భయ్, కేదార్.. ముగ్గురికీ మెడికల్ ఎగ్జామినేషన్లో భాగంగా మూత్ర పరీక్షలు చేయగా డ్రగ్ పాజిటివ్ వచ్చింది.హోటల్లో కొకైన్ కోసం ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లు 3, డ్రగ్ వినియోగానికి ఉపయోగించిన వైట్ పేపర్లు, మూడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. మంజీరా గ్రూప్లో పనిచేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ డ్రగ్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు..’అని మహంతి తెలిపారు. హోటల్పై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, గచ్చిబౌలి సీఐ జేమ్స్బాబు తదితరులు సోదాల్లో పాల్గొన్నారు. వీఐపీలపై కేసు నమోదు రాడిసన్ హోటల్లోని 1200, 1204 గదుల్లో డ్రగ్ పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిలో బడా బాబులు, వ్యాపారవేత్తల పిల్లలు, సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఘుచరణ్, సందీప్, క్రిష్, శ్వేత, లిషీ అనే వారిపై కూడా కేసు నమోదు అయ్యింది. కేదార్ ఏవియేషన్ కంపెనీ నిర్వాహకుడిగా, జూబ్లీహిల్స్లోని హైలైఫ్, బఫెల్లో వింగ్స్ పబ్లకు డైరెక్టర్గా ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా రాడిసన్! గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ హోటల్లో కొంతకాలంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించినట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం రాడిసన్ హోటల్లో మేనేజర్గా పనిచేసిన ఓ వ్యక్తి డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. స్టార్ హోటళ్ళు, పబ్లు, ప్రైవేట్ పార్టీలలో డ్రగ్స్ వినియోగించవద్దని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సూచనలను పట్టించుకోకుండా రాడిసన్ హోటల్ యధేచ్చగా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గచ్చిబౌలి (హైదరాబాద్): హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ వినియోగించిన కేసులో హైదరాబాద్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మంజీరా గ్రూప్ చైర్మన్ గజ్జల యోగానంద్ కుమారుడు, ఆ సంస్థ డైరెక్టర్ గజ్జల వివేకానంద్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాడిసన్ హోటల్ ఈ గ్రూప్దే కావడం గమనార్హం. కాగా ఇదే కేసులో నిర్భయ్, శెలగంశెట్టి కేదార్ అనే మరో ఇద్దరు ప్రముఖులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కేదార్కు పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో సీపీ మహంతి వివరాలు వెల్లడించారు. సొంత హోటల్లో 10 మందితో కలిసి..‘శనివారం రాత్రి రాడిసన్ హోటల్లో కొకైన్తో పార్టీ నిర్వహించినట్లు సమాచారం అందింది. దీంతో సైబరాబాద్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు హోటల్లో సోదాలు చేశారు. అయితే డ్రగ్ పార్టీలో పాల్గొన్నవారు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గజ్జల వివేకానంద్తో పాటు మరో 9 మంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జూబ్లీహిల్స్లోని నివాసంలో వివేకానంద్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.వివేకానంద్, నిర్భయ్, కేదార్.. ముగ్గురికీ మెడికల్ ఎగ్జామినేషన్లో భాగంగా మూత్ర పరీక్షలు చేయగా డ్రగ్ పాజిటివ్ వచ్చింది. హోటల్లో కొకైన్ కోసం ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లు 3, డ్రగ్ వినియోగానికి ఉపయోగించిన వైట్ పేపర్లు, మూడు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. మంజీరా గ్రూప్లో పనిచేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ డ్రగ్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు..’అని మహంతి తెలిపారు. హోటల్పై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, గచ్చిబౌలి సీఐ జేమ్స్బాబు తదితరులు సోదాల్లో పాల్గొన్నారు. వీఐపీలపై కేసు నమోదు రాడిసన్ హోటల్లోని 1200, 1204 గదుల్లో డ్రగ్ పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిలో బడా బాబులు, వ్యాపారవేత్తల పిల్లలు, సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఘుచరణ్, సందీప్, క్రిష్, శ్వేత, లిషీ అనే వారిపై కూడా కేసు నమోదు అయ్యింది. కేదార్ ఏవియేషన్ కంపెనీ నిర్వాహకుడిగా, జూబ్లీహిల్స్లోని హైలైఫ్, బఫెల్లో వింగ్స్ పబ్లకు డైరెక్టర్గా ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా రాడిసన్! గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ హోటల్లో కొంతకాలంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించినట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం రాడిసన్ హోటల్లో మేనేజర్గా పనిచేసిన ఓ వ్యక్తి డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. స్టార్ హోటళ్ళు, పబ్లు, ప్రైవేట్ పార్టీలలో డ్రగ్స్ వినియోగించవద్దని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సూచనలను పట్టించుకోకుండా రాడిసన్ హోటల్ యధేచ్చగా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
మియాపూర్ సీఐ సస్పెండ్.. కారణం ఇదే..!
-
ప్రాణం తీసిన ర్యాష్ డ్రైవింగ్! క్షణకాలంలో ఇద్దరూ..
కరీంనగర్: అజాగ్రత్తగా బైక్లు నడపడంతో ఎదురెదురుగా ఢీకొని వేల్పుల అవినాశ్కుమార్(16), పూరెళ్ల అభిలాశ్(18) దుర్మర ణం చెందారు. మిత్రులతో సర్కస్ తిలకించేందుకు వెళ్లిన వీరిద్దరూ అనూహ్యంగా మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ప్రమాదం శుక్రవారం అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లోకపేటలో చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై వెంటకృష్ణ కథనం ప్రకారం.. జూలపల్లి మండలం కాచాపూ ర్కు చెందిన అవినాశ్కుమార్, పెద్దపల్లికి చెందిన అభిలాశ్, వేల్పుల రమేశ్, పంబాల మనోజ్, దాడి రామ్చరణ్, కొలిపార రాంచరణ్ మిత్రులు. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో ప్రదర్శిస్తున్న సర్కస్ చూసేందుకు ఈ ఆరుగురు మిత్రులు రెండు బైక్లపై రాత్రి బయలుదేరి వెళ్లారు. సర్కస్ తిలకించాక అవే బైక్లపై ఇంటిదారి పట్టారు. ఈక్రమంలో ఎలిగేడు మండలం లోకపేట శివా రులోని వంతెన వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఓ బైక్ అవినాశ్కుమార్, అభిలాశ్ బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అవినాశ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అభిలాశ్ను హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వీరిని ఢీకొ న్న మరోబైక్ నడుపుతున్న ముప్పిరితోటకు చెందిన మాదారపు వెంకట్రావు తీవ్రంగా గాయపడగా, కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇతడి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా స్నేహితులు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అవినాశ్ తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు కుటుంబాల్లో తీరని విషాదం.. పెద్దపల్లికి చెందిన పూరెళ్ల శ్రీనివాస్ – కవిత దంపతుల చిన్నకుమారుడు అభిలాశ్. వీరిది నిరుపేద కుటుంబం. అభిలాశ్ ఇంటర్పూర్తి చేశాడు. స్నేహితులతో సర్కస్ చూసేందుకు వెళ్లి వస్తూ మృతిచెందడంతో కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. జూలపల్లి మండలం కాచాపూర్కు చెందిన అవినాశ్ కుమార్ పెద్దాపూర్ ఆదర్శ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చిన్నతనంలోనే తల్లి మృతి చెందింది. తండ్రి మల్లేశం అన్నీ తానై చదివిస్తున్నాడు. మిత్రులతో కలిసి సర్కస్ చూసేందుకు వెళ్లి కానరాని లోకాలకు వెళ్లడంతో తండ్రి కన్నీరుమున్నీరవుతున్నాడు. ఇవి చదవండి: అనుమానాస్పదస్థితిలో యువకుడి విషాదం! -
పాత కక్షలతో మహిళను గొడ్డలితో దారుణంగా..
మహబూబాబాద్: పాత కక్షల నేపథ్యంలో ఓ మహిళపై గొడ్డలితో దాడికి పాల్పడగా ఆమె మృతి చెందింది. ఈ ఘటన మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పాత కక్షల నేపథ్యంలో అంబట్పల్లి అమరేశ్వర ఆలయంలో బుధవారం ఉదయం అయ్యప్ప మాలధారుడు పుట్ట నరసింహస్వామి.. మరో మాలధారుడు నల్ల అవినాశ్పై కత్తితో దాడికి పాల్పడగా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనను చూసిన సహా మాలధారులు ఇద్దరిని సముదాయించి ఇంటికి పంపించారు. అనంతరం నరసింహస్వామి గొడ్డలితో అవినాశ్ ఇంటికి చేరకున్నాడు. అక్కడ అతడు కనిపించకపోవడంతో ఆగ్రహం చెందిన నరసింహస్వామి.. అవినాశ్ తల్లి పద్మ (40)పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పద్మను స్థానికులు మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో పద్మ మృతదేహానికి ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి అంబట్పల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై మృతురాలి భర్త నల్ల భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కిరణ్కుమార్, ఎస్సై రాజ్కుమార్ తెలిపారు. ఇవి చదవండి: బర్త్డేకు ఇదే నా చిన్న గిఫ్ట్ అంటూ.. సెల్ఫీతో యువకుడి విషాదం! -
క్రికెట్ వరల్డ్కప్ జట్టులో పోత్గల్ కుర్రాడు.. కేటీఆర్ హర్షం! పోస్ట్ వైరల్
U19 World Cup 2024 India Squad: యువ క్రికెటర్లు అరవెల్లి అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్లకు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అభినందనలు తెలిపారు. వీరిద్దరు కెరీర్లో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కాగా దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19- ఫిబ్రవరి 11 వరకు అండర్-19 క్రికెట్ వరల్డ్కప్ టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ ఇందులో పాల్గొనబోయే భారత యువ జట్టును మంగళవారం ప్రకటించింది. ఇదే టీమ్ సౌతాఫ్రికాతో ట్రై సిరీస్లోనూ పాల్గొననుంది. పోత్గల్ కుర్రాడంటూ కేటీఆర్ హర్షం ఇక మొత్తంగా పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో హైదరాబాద్కు చెందిన అరవెల్లి అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్లకు చోటు దక్కింది. ఈ విషయంపై స్పందించిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అండర్-19 క్రికెట్ వరల్డ్కప్ జట్టు, సౌతాఫ్రికాతో ట్రై సిరీస్ ఆడే జట్టు ఎంపికైనందుకు అరవెల్లి అవినాశ్ రావుకు శుభాకాంక్షలు. ఈ యువ క్రికెటర్ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం పోత్గల్ గ్రామంలో పుట్టిపెరిగాడు’’ అంటూ అవినాశ్ సక్సెస్ పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. Hearty congratulations to Aravelly Avanish Rao on getting selected for U-19 Cricket World Cup and Tri Series in South Africa. This promising cricketer hails from Pothgal village in Rajanna Sircilla Constituency. pic.twitter.com/yGMX7YYpnd — KTR (@KTRBRS) December 14, 2023 అభిషేక్కు కూడా కంగ్రాట్స్ కాగా ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికట్లో కేటీఆర్ రాజన్న సిరిసిల్ల నుంచి శాసన సభ్యులుగా మరోసారి ఎన్నికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మరో ట్వీట్లో అభిషేక్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘హైదరాబాద్ నుంచి అండర్-19 వరల్డ్కప్ జట్టుకు సెలక్ట్ అయిన మురుగన్ అభిషేక్కు కంగ్రాట్స్. అవినాశ్, అభిషేక్ ఇద్దరూ మెగా టోర్నీలో రాణించాలని కోరుకుంటున్నా’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న అవినాశ్ వికెట్ కీపర్గా.. అభిషేక్ ఆఫ్స్పిన్ ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు. ఇక వీరిద్దరు దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ క్రమంలో అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో ఆడుతున్నారన్న సంగతి తెలిసిందే. Would also like to Congratulate another bright lad from Hyderabad, Murugan Abhishek, who made it to the U-19 squad. Best wishes to both these youngsters 👍 pic.twitter.com/SGqaA2Tr23 — KTR (@KTRBRS) December 14, 2023 అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్, రుద్రమయూర్ పటేల్, సచిన్, ప్రియాన్షు, ముషీర్ ఖాన్, అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్, ఇనేశ్ మహాజన్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి. -
హైదరాబాదీ క్రికెటర్లకు గోల్డెన్ ఛాన్స్.. ప్రపంచకప్ జట్టులో చోటు
U19 World Cup 2024 India Squad: అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో ఇద్దరు తెలుగు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్కు చెందిన అరవెల్లి అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్ ఐసీసీ ఈవెంట్లో భాగమయ్యే ఛాన్స్ కొట్టేవారు. కాగా వికెట్ కీపర్ అవినాశ్, ఆఫ్స్పిన్ ఆల్రౌండర్ అభిషేక్.. ఈ ఇద్దరూ కూడా ఆసియా కప్లో భారత్ ఆడిన 3 మ్యాచ్లలోనూ బరిలోకి దిగారు. కాగా అండర్–19 వరల్డ్కప్ టోర్నమెంట్లో పాల్గొనే యువ ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం దుబాయ్లో అండర్–19 ఆసియా కప్లో పాల్గొంటున్న జట్టునే.. ఒక్క మార్పూ లేకుండా ఈ మెగా టోర్నీ కోసం కూడా ఎంపిక చేయడం విశేషం. ఇక 15 మంది సభ్యుల ఈ ప్రపంచకప్ జట్టుకు పంజాబ్కు చెందిన ఉదయ్ సహరన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అతడికి డిప్యూటీగా సౌమీ కుమార్ పాండే వైస్ కెప్టెన్గా అవకాశం దక్కించుకున్నాడు. కాగా దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు వరల్డ్కప్ను నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్, రుద్రమయూర్ పటేల్, సచిన్, ప్రియాన్షు, ముషీర్ ఖాన్, అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్, ఇనేశ్ మహాజన్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి. చదవండి: U19 Asia Cup 2023: ఏడు వికెట్లతో చెలరేగిన పేసర్.. భారత్ ఘన విజయం -
హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలువురు సీనియర్ ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకేసారి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు సీపీలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా 1994 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస రెడ్డి నియమితులయ్యారు. సైబరాబాద్ జాయింట్ సీపీ అడ్మిన్గా పనిచేస్తున్న 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతికి సైబరాబాద్ సీపీగా బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్గా పనిచేసిన 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జి సు«దీర్బాబు రాచకొండ సీపీగా నియమితులయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్యను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్గా బదిలీ చేశారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన మాదక ద్రవ్యాల నియంత్రణ అంశంపై నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు పూర్తి స్థాయి డైరెక్టర్ను నియమించారు. ఇప్పటి వరకు సైబరాబాద్, రాచకొండ సీపీలుగా పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర, దేవేంద్రసింగ్ చౌహాన్లను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మల్టీజోన్–2 ఐజీ షానవాజ్ ఖాసీం ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం మరో ఉత్తర్వును జారీ చేశారు. ఒకేసారి భారీ మార్పులపై సీఎం కసరత్తు! కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మంగళవారం జరిగిన ఐపీఎస్ల బదిలీలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భారీ కసరత్తే చేసినట్టు తెలుస్తోంది. గతానికి భిన్నంగా అత్యంత కీలకమైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను ఒకేసారి బదిలీ చేయడం అందులో భాగమని చర్చ జరుగుతోంది. మొత్తంగా సీఎం రేవంత్రెడ్డి తన మార్క్ టీంను సెట్ చేస్తున్నారు. త్వరలోనే పలు జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సహా భారీ సంఖ్యలో ఐపీఎస్ల బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొత్తకోటకు చాలాకాలం తర్వాత కీలక పోస్టింగ్ హైదరాబాద్ సీపీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డికి చాలా ఏళ్ల తర్వాత అత్యంత కీలక పోస్టింగ్ దక్కింది. గతంలో ఆపరేషన్స్ అడిషనల్ డీజీగా పనిచేసిన ఆయన తర్వాత అడిషనల్ డీజీ ఆర్గనైజేషన్స్, లీగల్గా బదిలీ అయ్యారు. గత కొన్ని నెలలుగా అక్కడ పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం అత్యంత కీలక పోస్టింగ్లోకి బదిలీ చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్రను తప్పించిన సర్కార్ ఆయన స్థానంలో అవినాశ్ మహంతికి బాధ్యతలు అప్పగించింది. సైబరాబాద్ సీపీ పోస్టు ఐజీ ర్యాంకు అయినా..డీఐజీ ర్యాంకులో ఉన్న అవినాశ్ మహంతికి అనూహ్యంగా ఆ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇక రాచకొండ పోలీస్ కమిషనర్గా డిసెంబర్ 2022లో బాధ్యతలు తీసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్ కేవలం పదకొండు నెలలకే బదిలీ అయ్యారు. ఇదే కమిషనరేట్లో గతంలో సుదీర్ఘ కా లంపాటు పనిచేసిన సు«దీర్బాబుకు కొత్త ప్రభు త్వం పోలీస్ కమిషనర్గా అవకాశం కలి్పంచింది. శాండిల్యకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ బాధ్యతలు ఎన్నికల కమిషన్ అనూహ్య నిర్ణయంతో హైదరాబాద్ సీపీగా అసెంబ్లీ ఎన్నికల ముందు బాధ్యతలు చేపట్టిన సందీప్శాండిల్యను సైతం ప్రభుత్వం తప్పించింది. సమర్థవంతమైన అధికారిగా పేరున్న సందీప్శాండిల్యకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి దృఢ నిశ్చయంతో ఉండడంతో నిక్కచ్చిగా వ్యవహరించే సందీప్శాండిల్యకు నార్కోటిక్స్ బ్యూరో బాధ్యతలు అప్పగించినట్టు చర్చ జరుగుతోంది. -
ఈ–చలానా కేసులో ప్రధాన నిందితుడు కొమ్మారెడ్డి అవినాష్ అరెస్టు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పోలీసు డిపార్టుమెంట్లో జరిగిన ఈ–చలానా కుంభకోణంలో ప్రధాన నిందితుడు కొమ్మారెడ్డి అవినాష్ను అరెస్టు చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజు తెలిపారు. మంగళవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారం మొత్తం 2018–19లో జరిగిందని తమ విచారణలో స్పష్టమైందన్నారు. 2018లో అప్పటి డీజీపీ సాంబశివరావు ఎటువంటి టెండర్లు లేకుండానే తొమ్మిది జిల్లాల్లో మోటారు వాహనాల చలానాల వసూళ్లను డేటా ఎవాన్ సొల్యూషన్స్కు అప్పగించారని, ఆ తర్వాత 2019లో కేవలం ఒక్క రూపాయికే టెండర్ వేసిన ఆ సంస్థకు కట్టబెట్టారన్నారు. ఆడిటింగ్ జరగకుండానే టెండర్ కట్టబెట్టడంతో రూ. 36.53 కోట్లు దారి మళ్లినట్లు తమ విచారణలో తేలిందన్నారు. డేటా ఎవాన్ సొల్యూషన్స్తో పాటు రోజర్ పీఈ అనే సంస్థ ద్వారా అవకతవకలకు తెరలేపారన్నారు. చలానాల ద్వారా కలెక్ట్ అయిన మొత్తం డైరెక్ట్గా డీజీ అకౌంట్కు వెళ్లకుండా రేజర్పే ద్వారా రోజర్ పీఈకు మళ్లినట్లు గుర్తించామన్నారు. ఈ విధంగా దారిమళ్లిన సొమ్ముతో అమెజాన్ క్లౌడ్ సర్వీస్ను కొనుగోలు చేసి దాని ద్వారా 50 నుంచి 60 సంస్థలకు సర్విసులు ఇస్తున్నారని చెప్పారు. ఈ సర్వీసుల ద్వారా సుమారు రూ. 25 కోట్లు డేటా ఎవాన్ సొల్యూషన్ సంస్థకు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేసేలా కోర్టు ద్వారా చర్యలు చేపట్టామన్నారు. 2019 తర్వాత సుమారు 16 ఆస్తులను కొనుగోలు చేసినట్లు గుర్తించామని, వాటిని సీజ్ చేసి ఎటువంటి లావాదేవీలు జరగకుండా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సీరియస్గా ప్రభుత్వం.. ప్రజల సొమ్ము ఈ విధంగా దారి మళ్లడంపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని పాలరాజు చెప్పారు. 2018 నుంచి ఇప్పటివరకూ ఎంత సొమ్ము, ఏ ఖాతాలకు మళ్లింది అనే అంశాలపై ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కొంత డబ్బు పలు ప్రైవేటు ఖాతాలకు మళ్లించారని, ఆ ఖాతాలను కూడా సీజ్ చేశామని చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రస్తుత డీజీపీ అంతర్గత విచారణకు ఆదేశించారన్నారు. టెండర్ కట్టబెట్టడంలో ఎవరు బాధ్యులనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. భవిష్యత్లో ప్రైవేటు సంస్థల ద్వారా ఈ–చలానా వసూలు చేయకుండా, ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్ఐసీ ద్వారా వసూలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కేసు విషయంలో కంపెనీలోని మిగిలిన డైరెక్టర్ల పాత్రపై కూడా విచారణ జరిపి వారి తప్పు ఉంటే అరెస్టు చేస్తామని ఐజీ పాలరాజు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న ముక్కు అవినాష్
‘జబర్దస్త్’, ‘బిగ్ బాస్’ షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అవినాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్’. రాకేష్ దుబాసి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయికుమార్, సంగీత, రియాజ్, రూప ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డెక్కన్ డ్రీమ్ వర్క్స్పై నబీ షేక్ నిర్మిస్తున్న ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్’ మూవీ హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ కోదండ రామిరెడ్డి క్లాప్ ఇచ్చారు. రాకేష్ దుబాసి దర్శకత్వం వహించారు. దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమా టైటిల్ లోగోని లాంచ్ చేయగా, దర్శకుడు వీరభద్రం చౌదరి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ అతిథులుగా పాల్గొన్నారు. నబీ షేక్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ, స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘మా సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుకుంటారు.. భయపడతారు.. థ్రిల్ అవుతారు’’ అన్నారు అవినాష్. ‘‘నబీ షేక్గారి లాంటి నిర్మాత ఉంటే యువ ప్రతిభ పరిశ్రమలోకి వస్తుంది’’ అన్నారు రాకేష్ దుబాసి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహాదేవ్. -
NBDA : మరోసారి అధ్యక్షుడిగా అవినాష్ పాండే
న్యూస్ బ్రాడ్కాస్టర్స్ & డిజిటల్ అసోసియేషన్ (NBDA) 2023-2024 సంవత్సరానికి కార్యవర్గం ఎన్నిక తాజాగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏబీపీ నెట్వర్క్ సీఈవో అవినాష్ పాండే తిరిగి ఎన్నికయ్యారు. అలాగే మాతృభూమి ప్రింటింగ్ & పబ్లిషింగ్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ శ్రేయాంశ్ కుమార్ ఎన్బీడీఏ వైస్ ప్రెసిడెంట్గా తిరిగి ఎన్నికయ్యారు. ఇక న్యూస్24 బ్రాడ్కాస్ట్ ఇండియా లిమిటెడ్ చైర్పర్సన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్ అనురాధ ప్రసాద్ శుక్లా గౌరవ కోశాధికారిగా కొనసాగనున్నారు. న్యూస్ బ్రాడ్కాస్టర్స్ & డిజిటల్ అసోసియేషన్ను గతంలో న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్గా పిలిచేవారు. ఇది దేశంలోని వివిధ న్యూస్ టెలివిజన్ బ్రాడ్కాస్టర్లకు సంబంధించిన ప్రైవేట్ అసోసియేషన్. ఇందులో రజత్ శర్మ, ఎమ్కే ఆనంద్, రాహుల్ జోషి, ఐ వెంకట్, కల్లి పూరీ భండాల్, సోనియా సింగ్, అనిల్ కుమార్ మల్హోత్రా ఇతర సభ్యులుగా ఉన్నారు. NBDA గురించి న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ & డిజిటల్ అసొసియేషన్ అనేది ప్రైవేట్ టీవీ ఛానళ్లు, కరెంట్ అఫైర్ ఛానళ్లు, డిజిటల్ బ్రాడ్ కాస్టర్ల కోసం ఏర్పడిన NBAకి కొత్త రూపం. ఇది పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దీని నిర్వహణ పూర్తిగా సభ్యులే నిర్వహించుకుంటారు. ప్రస్తుతం NBDAలో 27 పెద్ద న్యూస్ ఛానళ్లతో పాటు మొత్తమ్మీద 125 న్యూస్, కరెంట్ అఫైర్స్ ఛానళ్లు ఉన్నాయి. న్యూస్ ఛానల్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ అంశాన్నయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగే వశ్వసనీయమైన సంస్థ NBDA. టీవీ న్యూస్ ఛానళ్లకు సంబంధించిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం, వాక్ స్వతంత్ర హక్కును నిలబెట్టడం, మీడియాకు సంబంధించిన తాజా అంశాలను చర్చించడం, కచ్చితమైన సమాచారాన్ని ప్రజల ముందుంచడం దీని బాధ్యతలు. తన సభ్యులైన వివిధ టీవీ (న్యూస్, కరెంట్ అఫైర్స్) ఛానళ్లకు సంబంధించిన న్యాయ వివాదాల పరిష్కారంలో NBDA కీలక భూమిక పోషిస్తోంది. -
Mukku Avinash Wife Anuja Baby Shower Pics: జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ భార్య అనూజ సీమంతం వేడుకలు (ఫోటోలు)
-
పల్లెటూరి వినోదం
తెలంగాణ నేపథ్యంలో రూపొందిన పల్లె కథా చిత్రం ‘తురుమ్ ఖాన్లు’. శివ కల్యాణ్ దర్శకత్వంలో ఎండీ ఆసిఫ్ జానీ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని ‘రంగు రంగుల చిలక...’ అంటూ సాగే తొలి పాటను దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేశారు. ‘‘పల్లెటూరి పగ, ప్రతీకారాలతో వినోదాత్మకంగా, మహబూబ్ నగర్ స్లాంగ్లో రూపొందిన చిత్రం ఇది’’ అని యూనిట్ తెలిపింది. నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, రియాన్. ∙ఆసిఫ్ జానీ, నక్కిన త్రినాథరావు, శ్రీరామ్ -
చంద్రబాబుకు దేవినేని అవినాష్ కౌంటర్
-
ముగ్గురు పల్లెటూరి పిల్లగాళ్ల కథే తురుమ్ ఖాన్ సినిమా
నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి హీరోలుగా, పులి సీత, విజయ, శ్రీయాంక హీరోయిన్లుగా నటించిన పల్లెటూరి రివెంజ్ కామెడీ డ్రామా ఫిల్మ్ ‘తురుమ్ ఖాన్లు’. శివకల్యాణ్ దర్శకత్వంలో ఆసిఫ్ జానీ నిర్మించిన చిత్రం ఇది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శివకల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఆధునిక యుగంలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్ అనే ముగ్గురు యువకులు ఒకే ఊరిలో పుట్టి, పెరిగి సరదాగా ఒకరినొకరు ఎలా ఆటపట్టించుకుంటారు? ఒకర్ని ఒకరు ఎలా ఏడిపించుకుంటారు? అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘తురుమ్ ఖాన్లు’ చిత్రం చిన్న సినిమాగా విడుదలైనా రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు నిర్మాత ఆసిఫ్. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, సహనిర్మాత: కె. కల్యాణ్ రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవరాజ్ పాలమూర్. -
పెళ్లికి రెడీ అవుతున్న అరియానా! వరుడు ఎవరంటే..
యాంకర్గా కెరీర్ను ఆరంభించి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిపోయింది అరియానా గ్లోరీ. ఆర్జీవీ చేసిన ఒక్క ఇంటర్వ్యూ ఈ బ్యూటీకి క్రేజ్ సంపాదించి పెడితే బిగ్బాస్ ద్వారా తనెంటో ప్రూవ్ చేసుకుంది. సీజన్-4లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన ముక్కుసూటితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. పలు సెలబ్రిటీలు కూడా ఈ అమ్మడి యాటిట్యూడ్కి ఫిదా అయ్యి స్వయంగా సోషల్ మీడియాలో ఈమెకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అరియానాకు చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..త్వరలోనే ఈ బ్యూటీ మిసెస్ అరియానాగా మారనుందట. అయితే ఈమె పెళ్లాడే ఆ వరుడు ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మరోవైపు ఈ ఏడాదిలోనే తన పెళ్లి ఉంటుందని ప్రకటించాడు అవినాష్. మంచి ముహుర్తాలు ఉంటే పెళ్లికి రెడీ అంటూ ఓపెన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అరియానా పెళ్లి మ్యాటర్ వెలుగులోకి రావడంతో ఫ్యాన్స్లో సందేహాం మొదలైంది. కొంపదీసి వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. బిగ్బాస్ షో నుంచి ఎంతో క్లోజ్గా మూవ్ అయిన అరియానా-అవినాష్లపై ఇప్పటికే పలు పుకార్లు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వాటిని కొట్టిపారేస్తూ తాము జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొనే ఈ జంట మరి ఈ వార్తలపై స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. చదవండి : షణ్ముఖ్తో దీప్తి సునయన.. అక్కడేం చేస్తుంది? యాంకర్ రవి కారులో.. సీక్రెట్స్ బయటపెట్టేసిన లాస్య -
37 ఏళ్ల జాతీయ రికార్డు బద్దలు
భువనేశ్వర్: మూడున్నర దశాబ్దాలకుపైగా చెక్కు చెదరకుండా ఉన్న జాతీయ అథ్లెటిక్స్ రికార్డు శుక్రవారం బద్దలైంది. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భాగంగా పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో సర్వీసెస్ తరఫున బరిలో దిగిన అవినాశ్ ఈ రికార్డును తిరగరాశాడు. 1981 టోక్యో అథ్లెటిక్స్ మీట్లో గోపాల్ సైనీ (8ని.30.88 సెకన్లు) నెలకొల్పిన రికార్డును తాజాగా ఈ 24 ఏళ్ల అథ్లెట్ సవరించాడు. అవినాశ్ 8 నిమిషాల 29.80 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. రాకేశ్ కుమార్ స్వామి 8ని. 47.31 సెకన్లలో... దుర్గా బహదూర్ 8ని. 48.29 వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. -
అంజలి ప్రేమలేఖ
కార్తికేయ, హిమాన్సి, శుభాంగి పంత్, అనంత్, సైదులు వెంకీ, అవినాష్ ముఖ్యతారలుగా నవీన్ మన్నేల స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఇట్లు..అంజలి’. ఈ సినిమా ఫస్ట్ లుక్ను సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘హీరోకి నటనలో పట్టు ఉంది. నాయిక కూడా జాతీయ స్థాయిలో భరతనాట్యంలో పేరు తెచ్చుకున్న అమ్మాయి. నవీన్ బాగా తెలుసు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి’’ అన్నారు. ప్రేమలేఖ ఆధారంగా తెరకెక్కించిన థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. అంజలి అనే అమ్మాయి రాసిన ప్రేమలేఖ, అదే పేరు గల మరో అమ్మాయి జీవితాన్ని ఎలా మార్చేసింది? అనేది ఈ సినిమాలో ఆసక్తికరం’’ అన్నారు నవీన్ మన్నేల. ఈ సినిమాకు కెమెరా: వీకే రామరాజు, సంగీతం: కార్తీక్ కొడగండ్ల, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్. ఆర్ట్: ఎస్వీ మురళి. -
జబర్దస్త్ హాస్యనటుడి పై కేసు
బంజారాహిల్స్: వినోద కార్యక్రమం చేస్తానని అడ్వాన్స్ తీసుకొని కార్యక్రమానికి హాజరుకాకుండా మోసం చేసిన కమెడియన్ మాస్ అవినాష్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..కర్నూలు జిల్లాకు చెందిన వేణుగోపాల్రెడ్డి కేటీ క్రియేషన్స్ పేరుతో ఈవెంట్స్ నిర్వహిస్తుంటాడు. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 24న కార్యక్రమం నిర్వహించేందుకు బుల్లితెర కమెడియన్ మాస్ అవినాష్తో ఒప్పందం కుదర్చుకొని ఈనెల 14న రూ.10 వేలు అడ్వాన్స్గా ఇచ్చాడు. అయితే ఒప్పందం ప్రకారం అతను కార్యక్రమానికి హాజరుకాకపోగా సెల్ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసుకున్నాడు. ఈ కారణంగా అతిథులు నిరాశకు లోనయ్యారని, తమ ఈవెంట్ కంపెనీకి చెడ్డపేరు వచ్చిందని బాధితుడు తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ఫీ సరదాతో ఇద్దరు మృతి
ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని అన్నోజిగూడలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ సరదాతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తార్నాకలోని నారాయణ జూనియర్ కాలేజ్కు చెందిన అవినాష్(16), పీడీఎస్ చరణ్(16)లు స్థానికంగా ఉండే ఓ నీటి గుంత వద్ద సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అదుపుతప్పి ప్రమాదవశాత్తూ నీటిగుంతలో పడిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ట్రంప్ ప్రమాణ ఈవెంట్లో తెలుగు వ్యక్తి
అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అరిజోనా రిపబ్లికన్ పార్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఇరగవరపు అవినాశ్ హాజరయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచారం చేసి, ఆయన విజయంలో కీలకపాత్ర పోషించిన కొద్దిమందిలో అవినాశ్ ఒకరు. రిపబ్లికన్ పార్టీ నేత అవినాశ్ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు కావడం విశేషం. వాషింగ్టన్ నుంచి అవినాశ్ మాట్లాడుతూ.. ఒబామా కేర్ను సమూలంగా మార్చి, ఇందులో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే దానిపై ట్రంప్ కి ఇప్పటికే ఒక అవగాహన ఉందని అవినాశ్ తెలిపారు. ఉగ్రవాదులకు, అక్రమ శరణార్థులకు సమస్యలు తప్పవని.. చైనా యే పెద్ద ప్రమాదంగా ట్రంప్ భావిస్తున్నారని చెప్పారు. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో న్యూఢిల్లీలో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతకుముందు బెంగళూరు, హైదరాబాద్ లోనూ పనిచేసిన అవినాశ్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి తరఫున పనిచేశానని వివరించారు. -
ట్రంప్ తొలి లక్ష్యం ‘ఒబామాకేర్’!
అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రాథమ్యాలు ఏమిటి? ఎన్నికల ప్రచారంలో చెప్పినవి చేస్తారా? చెప్పనివి కూడా చేస్తారా? ప్రధాన మీడియా చేసిన ‘వ్యతిరేక ప్రచారం’, హిల్లరీ ‘పాజిటివ్ వేవ్’ను తట్టుకుని ఎలా గెలవగలిగారు? చైనా, రష్యాలతో ఎలా వ్యవహరించబోతున్నారు? భారత్ పరిస్థితి ఏమిటి? మనవాళ్ల భయాలేమిటి? ఇలాంటి ఎన్నో సందేహాలు.. వీటన్నిటి గురించి ట్రంప్ విన్నింగ్ టీమ్లోని ఇరగవరపు అవినాశ్ వివరించారు. అరిజోనా రిపబ్లికన్ పార్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న అవినాశ్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించారు. ఇంటర్వ్యూలో అవినాశ్ చెప్పిన విశేషాలివీ.. ఒబామా కేర్ మారనున్నది: ఎన్నికల ప్రసంగాలలోనూ, ప్రణాళికలోనూ హామీ ఇచ్చిన విధంగా ఒబామా కేర్ను సమూలంగా మార్చి కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఇందులో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే దానిపై ట్రంప్ కి ఇప్పటికే ఒక అవగాహన ఉంది. ప్రచారంలో చెప్పిన విధంగా మార్పులు తీసుకురాబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే అనేక మార్గాల ద్వారా అభిప్రాయసేకరణ జరిపారు. అలాగే ఉగ్రవాదంపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారు. ఆర్థిక వ్యవస్థను పరుగుపెట్టించడం కూడా ట్రంప్ ప్రాథమ్యాలలో ఉంది. అక్రమ శరణార్థులకే సమస్య : ఇమ్మిగ్రేషన్ చట్టాలకు అనుగుణంగా అనుమతులు ఉన్నవారికి ఏమీ కాదు. అక్రమంగా వలస వచ్చిన వారికి మాత్రమే ఇబ్బంది. తప్పుడు ధృవపత్రాలతో ఇక్కడికి వచ్చినవారికి మాత్రం కష్టాలు తప్పవు. అయితే ప్రచారంలో చెప్పినంత కఠినంగా పరిపాలన ఉంటుందని అనుకోవడం లేదు. హెచ్1బీ వీసాలు రద్దయిపోవు: హెచ్1బీ వీసాలు ఉన్నఫళంగా రద్దయిపోతాయని, భారత్కు అవకాశాలు లేకుండా పోతాయని భయపడనవసరం లేదు. హెచ్1బి వీసాలపై అధ్యక్షుడొక్కరే నిర్ణయం తీసుకోలేరు. దానికి సంబంధించి ఏ నిర్ణయమైనా అమెరికా చట్ట సభ కాంగ్రెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత సులభమని నేను అనుకోవడం లేదు. అందువల్ల భారతీయులు అంతగా భయపడాల్సిన పనిలేదు. చైనా, భారత్, రష్యాలతో సంబంధాలు : చైనా యే పెద్ద ప్రమాదంగా ట్రంప్ భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ల ఉత్పత్తుల వల్ల అన్ని దేశాలతో పాటు అమెరికా మార్కెట్ కూడా దెబ్బతింటోంది. చైనాకు చెక్ పెట్టాలన్నా పాకిస్తాన్కు చెక్ పెట్టాలన్నా అమెరికాకు భారత్ చాలా అవసరం. ఎలా చూసినా మనకు మంచి రోజులేనని భావించాలి. రిపబ్లికన్ అడ్మినిస్ట్రేషన్ రానున్న నాలుగేళ్లు భారత్తో సానుకూలమైన వైఖరినే అనుసరిస్తుందని భావించాలి. రష్యా విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. మెక్సికో సరిహద్దు గోడ : నేను ఉంటున్న అరి జోనా రాష్ట్రం మెక్సికో సరిహద్దులోనే ఉంటుంది. గోడ కొత్తగా కట్టబోవడం లేదు. ఇప్పటికే అక్కడ గోడ ఉంది. అయితే ఉండాల్సినంత మేర లేదు. కొన్ని చోట్ల ఫెన్సింగ్, మరికొన్ని చోట్ల ఖాళీగా ఉంది. అలా ఉండబట్టే అక్రమ చొరబాట్లు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు ట్రంప్ మెక్సికో వెళ్లినపుడు ఆ దేశాధ్యక్షుడిని కలసిన సందర్భంగా ఈ గోడ ప్రతిపాదనపై చర్చ జరిగింది. ఇద్దరూ కలిసే ఆ ప్రకటన చేశారు. బాల్యం, చదువు : తూర్పుగోదావరి జిల్లా రాజ మండ్రిలో నా బాల్యం, చదువు సాగాయి. పుట్టింది రావులపాలెం సమీపంలోని ముమ్మిడివరప్పాడు. అమ్మ నాన్న హైదరాబాద్లో స్థిరపడ్డారు. విజయవాడలో ఇంటర్, విశాఖలో డిగ్రీ చేశాను. లక్నో ఐఐ ఎంలో ఎంబీఏ పూర్తిచేశాను. తర్వాత బెంగళూరు, హైదరాబాద్లో పనిచేశాను. 2014 ఎన్నికలలో వైఎస్సార్సీపీ తరఫున పనిచేశాను. ఇంతకూ ఎలా గెలిచామంటే: సర్వేలు, మీడియా అన్నీ ట్రంప్కు వ్యతిరేకం. అందుకే మేం ‘గ్రౌండ్ గేమ్’పై దృష్టిపెట్టాం. ఒక దశ దాటిందంటే మీడియా ఎంత చెప్పినా అది గందరగోళమే. జనం నమ్మరు. క్లింటన్ వ్యతిరేక అంశాలను ప్రధాన మీడియా పట్టించుకోకపోవడాన్ని జనం గమనిం చారు. అది కూడా మాకు కలసి వచ్చింది. వాటిపై మేం సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేశాం. ట్రంప్ ఇంతకు ముందు రాజకీయాలలో లేకపోవడం అనే అంశాన్ని ఎక్కువ చూపించాం. ‘మనలో ఒకడు –మార్పు తీసుకురాగలడు’ అనేది బాగా ప్రచారం అయ్యింది. జనాభాలో వయసు, అభిరుచులు, జీవన సరళి గణాంకాల ప్రకారం మా ప్రచారవ్యూహాన్ని తయారుచేశాం. ఎవరికి ఏ అంశంపై ఆసక్తి ఉంటుందో వారికి ఆ వివరాలు చేరేలా చేశాం. ఎవరు ఏది సౌకర్యంగా భావిస్తారో.. (అంటే ఉత్తరాలు పంపడం, ఫోన్లో వివరించడం, కలసి మాట్లాడడం వంటివి) వారిని ఆ విధంగానే చేరుకున్నాం. ఇదంతా ఏడాదిన్నర క్రితం నుంచే ప్రణాళికా బద్ధంగా చేస్తూ వచ్చాం. అంటే ట్రంప్ నామినీ అని తేలకముందే రిపబ్లికన్ పార్టీ ప్రచారం క్షేత్రస్థాయిలో జరుగుతూ వచ్చింది. ఏ పార్టీకీ చెందనివారు 30శాతం వరకూ ఉంటారు. వారినే లక్ష్యంగా చేసుకుని పనిచేశాం. ఇంటర్వ్యూ : పోతుకూరు శ్రీనివాసరావు -
హు... హ... హు?
ఈ పిల్లవాడెవరు? చిందులేస్తాడు.. ఎగురుతాడు.. తంతాడు.. కరాటే నేర్చుకోకపోయినా బ్లాక్బెల్డ్లా హు...హ.. హు.. అంటాడు. పదేళ్ల బిడ్డకు అంత నైపుణ్యం ఎలా వచ్చింది? ఎక్కడ నుంచి వచ్చింది? గత జన్మనుంచా? హు.. హ.. హు..?? (who) ‘‘అక్కా, అవినాశ్ మూసిన కన్ను తెరవడం లేదు. నాకు భయంగా ఉంది. నువ్వు తొందరగా రా!’’ అంది పద్మ ఫోన్లో. పద్మ గొంతులో ఆందోళన గమనించిన అక్క రజిత ‘‘ఏమైందే? నిన్న బాగానే ఉన్నాడు, స్కూల్ కెళ్తున్నాడు అని చెప్పావుగా!’’ అంది ఆదుర్దాగా!‘‘అవన్నీ నువ్వొచ్చాక చెబుతా! రా ముందు’’ ఏడుపు గొంతుతో అంది పద్మ. ‘‘సరే, టెన్షన్ పడకు. వస్తున్నా!’’ అంది రజిత.గంటలో పద్మ ఇంటి ముందుంది రజిత. లోపల చడీచప్పుడు లేదు. కొంచెం ఆందోళన గానే బెడ్రూమ్లోకెళ్లింది. పద్మ ఏడుస్తూ బెడ్మీద కూర్చుని ఉంది. బెడ్ మీద అవినాశ్ పడుకుని ఉన్నాడు. ఇంట్లో మరిది శ్రీనివాస్ లేనట్టున్నాడు. పద్మకు ఒక్కడే కొడుకు అవినాశ్. ఐదవ తరగతి చదువుతున్నాడు. దగ్గరగా వెళ్లి ‘‘పద్మా! ఏమైందే!’’ అని భుజంపై చెయ్యి వేసి అడిగింది రజిత. అక్కను చూడగానే ఆమెను పట్టుకొని బావురుమంది పద్మ.‘‘వాడేమైపోతాడోనని భయంగా ఉందే!’’ అని ఏడుస్తూనే ఉంది. అవినాశ్ ఒంటిమీద చెయ్యి వేసి చూసింది రజిత. ఒళ్లు బాగా కాలిపోతోంది. ఒంటి మీద చర్మం కమిలిన గుర్తులు కనిపించాయి. ‘‘ఏమైంది? శ్రీనివాస్ ఎక్కడ?పిల్లవాడికి ఇలాగుంటే ఎక్కడికెళ్లాడు?’’ అందోళనగా అడిగింది రజిత. పద్మ ఏడుస్తూనే ఉదయం జరిగిన విషయం అంతా చెప్పుకొచ్చింది. రోజూ గొడవలే! ‘‘వీడితో రోజూ ఏదో సమస్య వచ్చి పడుతూనే ఉందక్కా. ఉదయం స్కూల్ నుంచి ఫోన్ రావడంతో నేను మీ మరిది వెళ్లాం. ‘మీ అబ్బాయిని తీసుకెళ్లండి, టీసీ ఇచ్చేస్తాం’ అన్నారు ప్రిన్సిపల్. క్లాస్మేట్తో గొడవ పడ్డాడట. ఆ పిల్లవాడిని వీడు కొట్టడంతో తలకు దెబ్బతగిలిందట. ఆసుపత్రిలో చేర్చారు. ఎప్పుడు చూసినా క్లాస్రూమ్లో కరాటే ఫీట్లు చేస్తాడట. ఈ కరాటే పిచ్చి ఎక్కడ పట్టుకుందో, ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. నీకు తెలుసు కదా! ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతే. వీడు చేసిన పనికి ఆ పిల్లవాడి తల్లితండ్రులు వచ్చి మమ్మల్ని తిట్టారు. దీంతో శ్రీనివాస్ ఆవేశంలో వీడిని చితకబాదాడు. అడ్డు వచ్చిన నన్ను కూడా తోసేశాడు. బిడ్డకు ఒళ్లంతా వాతలు తేలాయి. బాగా భయపడ్డాడు. జ్వరం వచ్చేసింది. కోపంలో పొద్దుననగా వెళ్లిన శ్రీనివాస్ ఇప్పటిదాకా రాలేదు. ఫోన్ చేస్తే.. ‘ఛస్తే.. చావనీ’ అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. నాకేం తోచక నీకు ఫోన్ చేశాను’’...ఏడుస్తూనే చెప్పింది పద్మ. అవినాశ్ విషయం రోజూ రజితకు తెలుస్తూనే ఉంటుంది. మూడేళ్ల వయసు నుంచే ‘హ.. హు....’ అంటూ కరాటే ఫైట్లు చేసేవాడు. అడ్డున్న వస్తువులు వాడి ఫీట్లకు ముక్కలవ్వాల్సిందే! స్కూల్కి వెళ్లమంటే మాత్రం చుక్కలు చూపించేవాడు. కరాటే స్కూల్లో చేర్పించమంటే శ్రీనివాస్ వినేవాడు కాదు. చదువుపై శ్రద్ధ ఉండదు వేరే వ్యాపకాలుంటే బుద్ధిగా చదువుకోమని హెచ్చరించేవాడు. అవినాశ్ మొండిగా ప్రవర్తించేవాడు. విసిగినప్పుడల్లా తిడుతూనో, కొడుతూనో వాడిని అదుపులో పెట్టాలనుకునేవాడు శ్రీనివాస్. ఆలోచనల నుంచి తేరుకున్న రజిత ‘ఆసుపత్రికెళ్దాం పద’ అని బయల్దేరదీసింది. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకునేసరికి శ్రీనివాస్ వచ్చి ఉన్నాడు. కొడుకు పరిస్థితి చూసిన శ్రీనివాస్కు కళ్లనీళ్లు ఆగలేదు. కోపంలో ఎంతగా కొట్టిందీ గుర్తు తెచ్చుకొని మరీ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు.‘‘వీడు ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడంలేదొదినా! అన్నీ టైమ్కి అమర్చి పెడుతున్నా చదువుకోకుండా ఈ పిచ్చిపనులేంటో’’ అన్నాడు శ్రీనివాస్. ‘‘శ్రీనివాస్! నేను చెప్పిన చోటుకి వాడిని తీసుకొస్తే సమస్యేంటో మీకూ, వాడికీ తెలుస్తుంది. అప్పుడీ గొడవలూ, ఏడ్పులూ ఉండవు’’ అంది రజిత. ‘‘అక్కా! ఏదైనా చేయి. ఎక్కడకు రమ్మన్నా వస్తాం. వాడు బాగుపడితే అంతే చాలు!’’ అంది రజిత చేతులు పట్టుకొని పద్మ. వెలుగు చూపిన ప్రయాణం అవినాశ్ చుట్టూ ఆసక్తిగా చూస్తున్నాడు. తల్లీ తండ్రి అక్కడ ఉన్న అతనితో తన గురించి చెబుతుంటే మౌనంగా వింటున్నాడు. అన్నీ విన్న కౌన్సెలర్ అవినాశ్కు దగ్గరగా వచ్చి అతణ్ణి మెత్తని వాలు కుర్చీలో కూర్చోబెట్టాడు. ‘‘అవినాశ్! ఇక్కడ నీకు నచ్చినట్టే ఉండు. అమ్మా నాన్న ఏమీ అనరు. వాళ్లు ఏమైనా అన్నా మేం ఊరుకోం. మేం చెప్పినట్టు చేస్తావా?’’ అని అడిగాడు. ‘చేస్తాను’ అన్నట్టు తల ఊపాడు అవినాశ్. ‘‘అవినాశ్! కళ్లు మూసుకొని ప్రశాంతంగా పడుకో. ఏ భయాలూ పెట్టుకోకు. నేను అడిగినప్పుడు నీ కళ్ల ముందు ఏమేం కనిపిస్తాయో, అనిపిస్తున్నాయో అవన్నీ చెబుతూ ఉండు..’’ కౌన్సెలర్ చె ప్పాడు. ఎదురుగా కౌన్సెలర్, అమ్మనాన్న, పెద్దమ్మ.. వారందరినీ చూసి కళ్లు మూసుకొన్నాడు అవినాశ్. పది నిమిషాలు నిశ్చల స్థితిని అనుభవించేంత సమయం ఇచ్చిన కౌన్సెలర్ అవినాశ్కు సూచనలివ్వడం ప్రారంభించాడు. అవినాశ్ అంతర్ చేతనలో తను ఎక్కడ ఉన్నది, ఏమేం చేస్తున్నది, దృశ్యంగా కనిపిస్తున్నవి ఏంటి... వరుసగా చెబుతున్నాడు. పద్మ, రజిత, శ్రీనివాస్లు మౌనంగా చూస్తున్నారు. అవినాశ్ చెబుతున్నాడు.. ‘అమ్మ దగ్గర ఆడుకోవడం, అమ్మమ్మ ఊరికి వెళ్లడం బాగుంది. ఈ స్కూల్ అంటే ఇష్టం లేదు. చదువంటే భయం. నా కంపాస్ బాక్స్ కిశోర్ లాక్కున్నాడు. అడిగితే నన్ను కొట్టాడు. నేను ఒక్క ‘కిక్’ ఇచ్చాను. అంతే, గొడకు కొట్టుకొని దెబ్బ తగిలింది. టీచర్ నన్నే కొట్టింది. నేను ఆ టీచర్కీ కిక్ ఇచ్చాను. నాన్న నన్ను కొడుతున్నాడు. నాన్నా... నన్ను కొట్టద్దు నాన్నా! ప్లీజ్ నాన్నా!’ అంటున్న అవినాష్ బుగ్గల మీద ధారాపాతంగా కన్నీళ్లు. అవినాశ్ స్థితిని చూస్తున్న పద్మ, రజిత, శ్రీనివాస్లు విలవిలలాడిపోయారు. కౌన్సెలర్ సూచనలు అవినాశ్కు ఇంకా అందుతున్నాయి. ‘‘నీకు ఇంకా ఏం ఇష్టం, ఇంకా వెనక్కి వెళ్లగలవు. అది నీ గత జీవితం అవుతుంది. ప్రయత్నించు’’ అని చెప్పాడు. అవినాశ్ కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు. అంతా విచిత్రంగా చూస్తున్నారు. ‘నా ఊరు చైనాలో ఉంది. నాకు ‘నింజా’ అనే కరాటే స్కూల్ ఉంది. నేను టీచర్ని. శిష్యులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నాను. మార్షల్ ఆర్ట్స్ అంటే నాకు ప్రాణం. నేను ముసలోడినైపోయాను. నా స్కూల్ పాడైపోతోంది, ఎవరూ పట్టించుకోవడంలేదు. నేను అక్కడికే వెళ్లిపోతాను’ ...పలవరిస్తున్నట్టుగా చెబుతున్నాడు అవినాశ్. అవగాహనతో సాధన థెరపీ పూర్తయింది. అవినాశ్ను విశ్రాంతి తీసుకోమని చెప్పి పద్మ, శ్రీనివాస్లను బయటకు తీసుకువచ్చారు కౌన్సెలర్. ‘‘శ్రీనివాస్! మీరూ విన్నారుగా అవినాశ్ అంతర్చేతనంలో ఎలాంటి భావాలున్నాయో! అవి ఇప్పటివి కాదు. అతని గత జన్మలోనివి. కరాటే అంటే అతనికి ప్రాణం. అతని కల తీరకుండానే మరణించి, అదే ఊపిరిగా తిరిగి జన్మించాడు. తను ఏం చేయాలనుకొని ఈ భూమ్మీదకు వచ్చాడో ఆ పనికి అడ్డుపడకండి. పెద్దలుగా మీకున్న కలలు మీ బిడ్డ మీద రుద్దకుండా అతడికి ఏమవ్వాలని ఉందో దాంట్లో తర్ఫీదు ఇప్పించండి. మీ బిడ్డ జీవితం మెరుగవుతుంది’’ అన్నారు కౌన్సెలర్. ‘తప్పకుండా’అన్నారు శ్రీనివాస్, పద్మ మనస్ఫూర్తిగా. ఇప్పుడు అవినాశ్కి పధ్నాలుగేళ్లు. 8వ తరగతి చదువుతున్నాడు. కౌన్సెలర్ సూచనల ప్రకారం అవినాశ్ను కరాటే స్కూల్లో చేర్పించాడు శ్రీనివాస్. కరాటేలో రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. చదువు ఇష్టం లేదన్నా, మెల్లగా తన మనసును అక్షరాలపై కుదిరేలా చేసుకున్నాడు. నేషనల్ ఛాంపియన్ అవ్వాలనే ధ్యేయంతో సాధన చేస్తున్నాడు. 3 వేల మంది పిల్లలపై పరిశోధన డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ అమెరికాలో ప్రముఖ సైకియాట్రిస్ట్. వర్జీనియా విశ్వవిద్యాలయంలో 50 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది. 40 ఏళ్ల వయసులో ప్రపంచంలోని 3000 మంది పిల్లల నుంచి రిగ్రెషన్ థెరపీ ద్వారా వారి గత జీవితం తాలూకు విశేషాలను రాబట్టారు. దీని బట్టి, ‘చేతన’ ప్రయాణం ఎప్పటికీ ఆగిపోదని బలంగా చెప్పారు అయాన్. బాల మేధావులెందరో..! కొంతమంది పిల్లల్లో అసాధారణ కళ, నైపుణ్యం ఆశ్చర్యపరుస్తుంటుంది. కిందటి జన్మలో ఆ కళ పట్ల వారికి అపారమైన అనుభవం, అభిమానం ఉండి ఉంటాయి. దాన్ని పూర్తి చేసుకో లేక తమ పుట్టుకతో పాటూ ఈ జన్మకూ మోసుకువస్తారు. తమకు నచ్చిన ఆ కళనే సాధన చేస్తుంటారు. అంతః చేతనలో ఉండే ఆ కళను వారు దర్శించగలిగితే సాధనమార్గాలు సులువు అవుతాయి. నైపుణ్యం పెరుగుతుంది. - డాక్టర్ లక్ష్మీ న్యూటన్, పాస్ట్లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్, లైఫ్ రీసెర్చి అకాడమీ, హెదరాబాద్ జ్ఞాపకాల గని కరోల్ బౌమ్యాన్ పాస్ట్ లైఫ్ థెరపిస్ట్. పరిశోధకురాలు. పిల్లల గత జీవిత జ్ఞాపకాలను వెలికి తీసి ‘చిల్డ్రన్ పాస్ట్ లైవ్స్’ (పిల్లల గత జీవితాలు) పేరుతో పుస్తకం రాశారు. ఈ పుస్తకం ప్రపంచంలో 22 భాషల్లో అనువాదమైంది. మొజార్ట్ కూడా అంతే! మొజార్ట్ ఆస్ట్రియావాసి. కీబోర్డ్, వయొలిన్ అంటే పిచ్చి. ఎవరూ అతనికి సంగీతనం నేర్పించలేదు. కానీ, సమర్థంగా రాగాలను పలికించేవాడు. 5 ఏళ్ల వయసులోనే యురోపియన్ రాజవంశీయుల ముందు తన సంగీత ప్రతిభను చూపి ప్రశంసలు అందుకున్నాడు. సంగీతంలో ప్రపంచ ప్రసిద్ధుడయ్యాడు. - నిర్మల చిల్కమర్రి -
ట్రంప్ విజయంలో మనోడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం వెనుక ఒక తెలుగు తేజం హస్తముంది. ట్రంప్ ప్రచారంలో పక్కా వ్యూహాలు రచించి ఆయన గెలుపు కోసం శ్రమించిన అవినాశ్కు రాజకీయాలంటే అమితాసక్తి. రాజకీయ ప్రచార వ్యూహాల్లో దిట్ట. లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందిన ఆయన ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ పాలుపంచుకున్నారు. ఢిల్లీలో హెచ్సీఎల్ టెక్నాలజీస్లో ఉద్యోగాన్ని వదులుకొని ఆయన వైఎస్సార్సీపీ కోసం పనిచేశారు. రాజకీయాలంటే ఇష్టం ఉండటంతో అమెరికాలోనూ వాటిని వదలలేకపోయారు. అవినాష్ భార్య అమెరికాలోని అరిజోనాలో ఇంటెల్లో పనిచేస్తుండగా, సెలవుల కోసం ఆయన అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అరిజోనాలో గవర్నర్ ఎన్నికలు జరుగుతున్నారుు. ఆ ఎన్నికలకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత డగ్ డూసీ అనే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ప్రచారంలో అవినాశ్ పాలుపంచుకున్నారు. విసృ్తత సమాచార సేకరణ చేసి దాన్ని క్రోడీకరించారు. భారీగా ఓట్లు పొందడానికి సమగ్ర ప్రణాళిక రచించారు. ఇదంతా డూసీకి కలిసొచ్చింది. ఆయన అవలీలగా విజయం సాధించారు. దీంతో అవినాశ్ పొలిటికల్ డెరైక్టర్గా పదోన్నతి పొందారు. కొద్దికాలంలోనే ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్గా ఎదిగారు. తర్వాత అవినాశ్ డొనాల్డ్ ట్రంప్ ప్రచార శిబిరంలో చేరారు. అనంతరం అరిజోనా రాష్ట్రం బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఆయన ట్రంప్ గెలుపు కోసం మంచి వ్యూహాలు రచించారు. అంతిమంగా ట్రంప్ విజయం సాధించారు. -
పోలీసులకు షాకిచ్చిన కేడీ మోనిక!
జడలో పూలు, మెడలో నగలతో ఆడవేషం ధరించి చాలా గ్యాంగ్ స్టర్ నయీం పోలీసులను బోల్తా కొట్టించిన సంగతి తెలిసిందే. అచ్చం నయీం లాగే ఈ కేడీ మోనిక పోలీసులను బోల్తా కొట్టించింది. పెదవులకు లిప్స్టిక్, బుగ్గలకు మేకప్, సన్నని కనుబొమ్మలు, వయ్యారంగా చీర కట్టి అచ్చం మహిళలాగా వ్యవహరిస్తూ.. అక్రమ దందాలకు తెరతీసింది. మహిళలకు ఏమాత్రం తీసిపోనిరీతిలో ముస్తాబై మోనిక సాగిస్తున్న నకిలీ పత్రాల రాకెట్ను తాజాగా బిహార్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ రాకెట్ను నడిపిస్తున్నది మోనిక కాదు.. ఆ పేరుతో ఆడవేషంలో తిరుగుతున్న అవినాష్ అని తెలిసి పట్నా పోలీసులు షాక్ తిన్నారు. తవ్వితీస్తున్న కొద్దీ ఎన్నో అక్రమాలు వెలుగుచూస్తుండటంతో వారు నివ్వెరపోతున్నారు. మోనిక పేరుతో అవినాష్ అలియాస్ గోల్డీ ముఠా చాలా అక్రమాలే సాగిస్తున్నది. ఆధార్ కార్డులు మొదలు పదో తరగతి, డిగ్రీ, పీజీ, డిప్లమా, బీఈడీ, జేఈ, ఐటీఐ ఇలా ఏ నకిలీ పత్రం కావాలన్నా మోనికా ముఠా చిటికెలో సృష్టిస్తూ మోసం చేస్తున్నది. ఇందుకోసం రూ. 500 నుంచి రూ. 20వేల ఈ ముఠా తీసుకుంటుంది. అంతేకాదు బిహార్లో సంపూర్ణ మద్యనిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరికైనా మద్యం కావాలంటే ఈ ముఠానే అందిస్తున్న ఉన్నది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకునే యువత లక్ష్యంగా ఈ రాకెట్ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలా ముఠా చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి.. మోనికా అమ్మాయి కాదు.. పరుషుడు అంటూ ఇచ్చిన సమాచారంతో అతని గుట్టు రట్టయింది. ప్రస్తుతం అవినాష్ను అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘టాలెంట్ సెర్చ్’ విజేత అవినాష్
పాపన్నపేట: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్(ఎన్టీఎస్ఇ)లో పాపన్నపేట మండలం అర్కెల గ్రామానికి చెందిన చిట్యాల అవినాష్ ఎంపికయ్యాడు. ఇతను హైదరాబాద్లోని శ్రీ చైతన్యలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో రెండు దశల్లో జరిగిన ఈ పరీక్షలో తెలంగాణ నుంచి మొత్తం 24 మంది ఎంపిక కాగా అందులో అవినాష్ ఒకరు. పీజీ పూర్తి అయ్యే వరకు అవినాష్కు స్కాలర్షిప్ వస్తుందని, అదేవిధంగా ట్రిపుల్ ఐటీలో డైరెక్టుగా అడ్మిషన్ లభిస్తుందని అతని తల్లిదండ్రులు అమృతరావు, వినోద తెలిపారు. -
బాసరలో భక్తుడి హఠాన్మరణం
బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణానికి చెందిన అవినాష్ (24) శనివారం ఉదయం అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. తర్వాత గుట్టపై ఉన్న వ్యాసుడి గుహ చూసేందుకు వెళుతున్నపుడు గుండెపోటు రావడంతో ఆకస్మాత్తుగా కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు భక్తుడి మృతిచెందిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని ముధోల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం అందించారు. -
అమిత్షావన్నీ మాయమాటలు
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్ విమర్శ విజయవాడ సెంట్రల్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా మరోమారు రాష్ట్ర ప్రజల్ని మాయ చేసే విధంగా హామీలు గుప్పించారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. ఆంధ్రరత్న భవన్లో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్షా మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు రూ.1.40 లక్షల కోట్లు ఇస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వడంలో విఫలమైన బీజేపీ, బడ్జెట్లోనూ సక్రమంగా నిధులు మంజూరు చేయలేదని మండిపడ్డారురు. రూ.30 వేల కోట్ల రూపాయలు అవసరమయ్యే పోలవరం ప్రాజెక్ట్కు రూ.100 కోట్లు మంజూరు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. విభజన చట్టంలో హామీల ప్రస్తావన సభలో చేయలేదని, నిరుద్యోగ భృతి, ఉపాధి అవకాశాల కల్పనపై ఎలాంటి హామీ ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 12లో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అదే రోజు ఆంధ్రరత్న భవన్లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయాన్ని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, యువజన కాంగ్రెస్ నాయకులు కిషోర్, చైతన్య పాల్గొన్నారు. -
భార్యకు నివాళిగా అలా చేశాడు..
ముంబై: భార్య కోసం తాజ్మహల్ కట్టించిన మొగల్ చక్రవర్తిని సైతం తోసి రాజన్నాడు మహారాష్ట్రలోని ఓ వ్యక్తి. భార్య ఆకాంక్ష కోసం ఆమె అంత్యక్రియల అనంతరం చేయాల్సిన క్రతువులను పక్కనబెట్టి ఓ మంచి కార్యానికి శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలిచాడు. ప్రాణప్రదమైన భార్యకు అరుదైన నివాళి అర్పించాడు. మహారాష్ట్ర లోని అకోలాకు చెందిన అవినాష్ నాకత్(35) రూపాలి దంపతులది ఆదర్శవంతమైన జీవితం. సమృద్ధి, ఆనంది అనే ఇద్దరు కూతుళ్లతో సంతోషంగా జీవిస్తున్న కుటుంబం. వృత్తిరీత్యా అతనిది పెస్ట్ కంట్రోల్ బిజినెస్. దీంతో పాటుగా రైతుహక్కుల కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొనేవాడు. రూపాలి కూడా ఈ కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామిగా ఉండేది. ఇంతలో క్యాన్సర్ మహమ్మారి ఆ కుటుంబానికి అశనిపాతంలా తగిలింది. ఆమెకు అక్యూట్ లుకేమియా సోకిందని, మెదడులోని కణాలు దెబ్బతిన్నాయని ఫిబ్రవరి 3న వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్యంకోసం ప్రయత్నిస్తుండగానే బ్రెయిన్ హేమరేజ్తో ఫిబ్రవరి 5న ఆమె కన్నుమూసింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అంతా అయిపోయింది. భార్య మరణం కృంగదీసినా, సామాజిక కార్యకర్తగా తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నాడు. క్రతువుల పేరుతో డబ్బును వృధాగా ఖర్చు చేయడం తనకు ఇష్టంలేదని గ్రామం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నానని అంత్య్రక్రియల అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతే గ్రామస్తులు, బంధువులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు, బెదరించారు. చివరికి రూపాలి తల్లిదండ్రుల ద్వారా ఒత్తిడి తేవాలని ప్రయత్నించారు. అయినా అవినాష్ వెనుకడగువేయలేదు. తన గ్రామం కోసం ఏదైనా మంచి పనిచేయాలని ఆశపడ్డ తన భార్య మాటలను మననం చేసుకున్నాడు. తన నిర్ణయానికి కట్టుబడి, తను చదువుకున్న తాండ్లిలోని జిల్లా పరిషత్ స్కూలు సంస్కరణకు నాంది పలికాడు. సుమారు లక్షన్నర రూపాయలు వెచ్చించి, గోడలకు సున్నం వేయించడం దగ్గరనుంచి పాఠశాలకు డిజిటల్ రూపం తీసుకురావడం దాకా అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. యువరాష్ట్ర స్వచ్ఛంద సంస్థ సభ్యుల సహకారంతో అతికొద్ది సమయంలోనే పూర్తిచేసాడు. ముందు వ్యతిరేకించిన గ్రామస్తులంతా తర్వాత అవినాష్ ను అభినందలతో ముంచెత్తారు. గ్రామస్తుల ఆనందోత్సాహాల మధ్య పూర్తి డిజిటల్ గా మారిన పాఠశాలను ఈ నెల 22న తన తల్లి చేతులు మీదుగా ఆవిష్కరింపచేశాడు. దీంతో ఆ స్కూల్లో విద్యనభ్యస్తున్న పిల్లల మొహాల్లో కొత్త వెలుగులు పూయించాడు. ఇక్కడ చదువుకునే వారంతా పేదరైతుల బిడ్డలే కావడం గమనార్హం. అంతేకాదు స్కూలు కోసం వాటర్ ప్యూరిఫయర్ ను దానం చేయడానికి కొంతమంది ముందుకొచ్చారు. 'నేను దేవుడిని నమ్ముతాను కానీ మూఢ సంప్రదాయాలను గుడ్డిగా నమ్మను. ఇంతవరకూ లక్షల రూపాయలు వెచ్చించి చేసిన ఇలాంటి సంప్రదాయ క్రతువుల వల్ల గ్రామానికి ఒరిగిందేమీ లేదు. నేను వేసిన ఈ తొలి అడుగుతో గ్రామస్తుల్లో ఆలోచన మొదలైంది. నా అడుగుజాడల్లో మరింత ముందుకు రావడం సంతోషంగా ఉంది' అని అవినాష్ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. -
సూల్క్ బస్సు ఢీ కొని విద్యార్థి మృతి
-
సూల్క్ బస్సు ఢీ కొని విద్యార్థి మృతి
విశాఖపట్నం : విశాఖపట్నం నగరంలోని సింహాచలం గోశాల వద్ద విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీ కొని 10వ తరగతి విద్యార్థి అవినాష్ అక్కడికక్కడే మరణించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. అయితే స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్తున్న తమ్ముడికి నోట్ బుక్ అందించేందుకు వచ్చి... ఇలా విగత జీవిగా మారడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అవినాష్ ఆచూకీ లభ్యం
హైదరాబాద్: హైదరాబాద్లోని మియాపూర్లో కిడ్నాప్ అయిన తొమ్మిదో తరగతి విద్యార్థి అవినాష్ ఆచూకీ దొరికింది. విజయవాడలో అవినాష్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతను సురక్షితంగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. అవినాష్ను విజయవాడ నుంచి హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
అధికార పార్టీకి అవినాష్ మకిలి
మరోసారి బట్టబయలైన టీడీపీ అంతర్గత పోరు తనపై కుట్ర జరుగుతోందనుకుంటున్న రాజప్ప (లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి) :అవినాష్ దేవ్చంద్ర...గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్గా నిలిచిన పేరది. హోంమంత్రిత్వశాఖను పర్యవేక్షి స్తున్న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువును, మానవహక్కుల సంఘం అంతర్జాతీయ చైర్మన్ను అంటూ అవినాష్ పాల్పడిన అక్రమాలు ఈ వారం తీవ్ర సంచలనానికి కారణమయ్యాయి. పలు ప్రాంతాల్లో అమాయకులకు పదవుల ఎరవేసి లక్షలు గుంజి, వారు తిరిగి అడిగిన పాపానికి చిత్రహింసలకు గురిచేసిన దృశ్యాలు ప్రసారమాధ్యమాల్లో రావడంతో కలకలం రేగింది. నిందితుడితో రాజప్పకు బంధుత్వం లేదని విచారణ అనంతరం జిల్లా ఎస్పీ రవిప్రకాష్ స్పష్టం చేసినా ఈ ఘటనతో అధికారపార్టీ ప్రతిష్ట బజారునపడిందని చెప్పొచ్చు. పెద్దాపురంలో బచ్చు ఫౌండేషన్ను సందర్శించిన సందర్భంలో అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించి ఆధారాలు లేవంటూ ఆనక వదిలేసిన దగ్గర నుంచి అవినాష్ను అరెస్టుచేసే వరకు పోలీసుల తీరు సందేహాస్పదంగానే నిలిచింది. పెద్దాపురంలో అదుపులోకి తీసుకున్నప్పుడే పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఈ పరిస్థితి ఎదురయ్యేదే కాదంటున్నారు. అతడిపై నమోదైన కేసులు తేలికపాటివే కావడం కూడా ప్రజల ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అతడిని కాపాడటంలో ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్న చందంగా జరుగుతున్న పరిణామాలు పోలీసు వ్యవస్థకే మచ్చతెచ్చిపెట్టారుు. ప్రాథమికంగా పెద్దాపురం సీఐ, ఎస్ఐలకు చార్జిమెమోలు ఇచ్చిన ఎస్పీ ఇలాంటి ఉదంతాల్లో పోలీసు ప్రతిష్ట మంటగలసి పోకుండా పోలీసుల వ్యవహార శైలిలోనే మార్పునకు కృషి చేయాల్సి ఉంది. జిత్తులమారి అవినాష్ దౌర్జన్యాలను చూసి జిల్లా ప్రజలు పక్కలో బాంబు పేలినంత భయానికి గురయ్యారు. ఈ మాయలోడి మోసాలకు ఎందరో బలవుతున్నా చాప కింద నీరులా అతని అక్రమా సాగారుు. నాలుగు రోజుల తరువాత అవినాష్ పోలీసులకు లొంగిపోవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అవినాష్ తొలినుంచీ హోంమంత్రి బంధువునని చెప్పుకోవటంతో ఈ కేసులో రాజప్ప కేంద్ర బిందువు అయిపోయారు. అమలాపురంలో అసాంఘిక శక్తులకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్న వ్యవహారంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య కోల్డ్ వార్ గత వారం చర్చనీయాంశమైంది. తాజాగా అవినాష్ ఉదంతం జిల్లా టీడీపీ నేతల మధ్య నడుస్తున్న మరో వార్ ను తెర మీదకు తెచ్చింది. హోం మంత్రి రాజప్ప.. అవినాష్ వ్యవహారం తనపై కొందరు చేస్తున్న కుట్రేనని, అది కూడా కాకినాడ కేంద్రంగా సొంత పార్టీ నుంచే నడుస్తోందని భావిస్తున్నారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ బురదను ఒకరిపై ఒకరు జల్లుకునేందుకు అంతర్గతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బడ్జెట్తో ఆశాభంగం రాష్ట్ర బడ్జెట్ను జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్పై జిల్లాలో పలు వర్గాలు పెదవి విరిచాయి. జిల్లాకు నిర్దిష్టంగా ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి అన్నట్టుగానే బడ్జెట్ కేటాయింపులున్నాయని సామాన్యులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ గోదావరి పుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామంటోంది. ముఖ్యమంత్రి సహా ఉభయగోదావరి జిల్లాల మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, పైడికొండల మాణిక్యాలరావు వందల కోట్లు కేటాయిస్తున్నామంటూ ఊరూవాడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష దగ్గర నుంచి ఇదేరకంగా ప్రచారం చేస్తున్నారు. తీరా బడ్జెట్లో కేటాయింపులు చూస్తే బాబు సర్కార్ చెప్పేదొకటి, చేసేదొకటి అన్నదానికి అద్దం పడుతోంది. రూ.1638 కోట్లతో పుష్కరాల పనులు చేస్తున్నామని ప్రభుత్వం ఘనతగా చెప్పుకొన్న యనమల బడ్జెట్లో రూ.200 కోట్లతో మమ అనిపించారు. బిల్లులు వస్తాయా, రావా అనే అనుమానంతో పుష్కరాల పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ధైర్యంగా ముందుకు రాలేని పరిస్థితి. కలెక్టర్ అరుణ్కుమార్, ప్రత్యేకాధికారి మురళి సమీక్షలపై సమీక్షలు నిర్వహిస్తున్నా ఆశించిన స్థాయిలో పనులు మొదలు కావడంలేదు. నెలకొకసారి ముఖ్యమంత్రి నేరుగా సమీక్షిస్తారని చెప్పినా ప్రగతి కనిపించకపోవడం పుష్కరాలకు వచ్చే లక్షలాది భక్తులకు ఏర్పాట్లు ముందుగా చేయగలుగుతారా అనే సందేహం కలుగుతోంది. రైతులకు, డ్వాక్రా మహిళలకు నిరాశ బడ్జెట్లో రుణమాఫీకి నిధులు భారీగా కేటాయిస్తారనుకుని ఎదురు చూసిన రైతులు, డ్వాక్రా మహిళలు నిరాశ చెందారు. కాకినాడ పోర్టు విస్తరణ, ఎల్ఎన్జీ టెర్మినల్, జీఎంఆర్ పోర్టు వంటి పారిశ్రామికీకరణకు ఇచ్చిన ప్రాధాన్యం రైతు, మధ్యతరగతికి ఇవ్వలేదనే ఆవేదన ఆ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఉద్యోగం లేని వారికి నిరుద్యోగభృతి అన్ని చంద్రబాబు బడ్జెట్లో కేటాయింపుల వైపు కన్నెత్తిచూడకపోవడం జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులకు తీరని ఆవేదన మిగిల్చింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్కు వరించనుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి బోస్ను ఎంపిక చేశారు. ఆయన ఎంపిక జిల్లాలో పార్టీ కేడర్లో ఉత్తేజాన్ని నింపింది. పదవులను తృణప్రాయంగా త్యజించిన బోస్ ఈ నెల 16న నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని చంద్రబాబు బీసీలలో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యంకు గతంలో మాట ఇచ్చారు. కానీ ఆ మాట నిలబెట్టుకోకుండా తన సామాజికవర్గ నేతకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుండడంపై తెలుగుతమ్ముళ్లు రుసరుసలాడుతున్నారు. బాబు నిర్ణయం టీడీపీ బీసీ నేతల్లో నిస్తేజాన్ని నింపింది. -
అవినాష్ కు 14 రోజుల రిమాండ్
-
అవినాష్ కేసులో మావాళ్లపై చర్యలు: ఎస్పీ
కాకినాడ(రాజమండ్రి): ఘరాన మోసాగాడు పేరాబత్తుల అవినాష్ దేవ్చంద్ర డీజీపీ ఎదుట లొంగిపోలేదని.. మీడియాను తప్పుదోవ పట్టించాడని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినాష్ను వదిలేసిన పెద్దాపురం పోలీసులపై పూర్తిస్థాయిలో విచారణ చేయలేదని దర్యాప్తులో తేలిందని అన్నారు. పెద్దాపురం పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమయం లేకపోవడం వల్ల అవినాష్ను పూర్తిస్థాయిలో విచారించలేకపోయామని రవిప్రకాష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణలో కూడా అవినాష్ పలు స్కూళ్లపై దందా చేశాడనే అనుమానం కలుగుతోందని చెప్పారు. అవినాష్ నేర చరిత్ర గురించి తెలంగాణ పోలీసులకు కూడా తాము లేఖ రాశామని ఎస్పీ రవిప్రకాష్ పేర్కొన్నారు. కాగా, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పేరాబత్తుల అవినాష్ దేవ్చంద్రను శుక్రవారం పోలీసులు కోర్టుకు ముందు హాజరు పరిచారు. దాంతో అవినాషకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
అవినాష్ కు 14 రోజుల రిమాండ్
కాకినాడ: ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నపేరాబత్తుల అవినాష్ దేవ్చంద్రకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శుక్రవారం అవినాష్ ను పోలీసులు కోర్టుకు ముందు హాజరు పరిచారు. గురువారం డీజీపీ జేవీ రాముడు ముందు అవినాష్ లొంగిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం అతణ్ని నార్త్ కోస్టల్ ఐజీ అతుల్ సింగ్ ప్రత్యేక ఎస్కార్ట్తో తూర్పు గోదావరి జిల్లాకు పంపించారు. చినరాజప్ప బంధువునంటూ పలువురికి టోకరా వేయడమే కాకుండా, అతనిని నిలదీసిన బాధితులపై దాడికి పాల్పడినట్లు అవినాష్ పై పలు ఆరోపణలు వెలుగుచూశాయి. -
పోలీసుల అదుపులో అవినాష్ అనుచరులు
-
పోలీసుల అదుపులో అవినాష్ అనుచరులు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పేరాబత్తుల అవినాష్ దేవ్చంద్ర అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవినాష్ అనుచరులు రామకృష్ణ, వేణుగోపాల్లను కాకినాడ పోలీసులు శుక్రవారం కృష్ణాజిల్లా చిల్లకల్లు టోల్గేట్ వద్ద అరెస్ట్ చేశారు. కాగా అవినాష్ నిన్న డీజీపీ జేవీ రాములు ఎదుట లొంగిపోయిన నేపథ్యంలో వీరిద్దరూ హైదరాబాద్ పరారవుతున్నట్లు సమాచారంతో కాకినాడ పోలీసులు వారిని చేజ్ చేసి పట్టుకున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. అవినాష్ అనుచరులను మీడియా కంట పడకుండా చిల్లకల్లు నుంచి కాకినాడకు తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు లొంగిపోయిన అవినాష్ను నార్త్ కోస్టల్ ఐజీ అతుల్ సింగ్ ప్రత్యేక ఎస్కార్ట్తో తూర్పు గోదావరి జిల్లాకు పంపించారు. -
డీజీపీ ఆఫీసులో లొంగిపోయిన అవినాష్
ఉప ముఖ్యమంత్రితో సంబంధం లేదని వెల్లడి సాక్షి, హైదరాబాద్: హోం శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పేరాబత్తుల అవినాష్ దేవ్చంద్ర గురువారం ఓ మీడియా చానల్ ద్వారా పోలీసులను ఆశ్రయించి డీజీపీ జేవీ రాముడు ముందు లొంగిపోయాడు. అతణ్ని నార్త్ కోస్టల్ ఐజీ అతుల్ సింగ్ ప్రత్యేక ఎస్కార్ట్తో తూర్పు గోదావరి జిల్లాకు పంపించారు. అవినాష్ ఓ బాధితుడిని గదిలో బంధించి, చిత్రహింసలకు గురి చేస్తున్న వీడి యో బహిర్గతమవడంతో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. అవినాష్పై పలు కేసులు నమోదు కావడం, అతని వ్యవహారం సంచలనం సృష్టించడంతో అరెస్టు చేయడం కోసం తూ.గో. జిల్లా అధికారులు 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. డీజీపీ ఎదుట లొంగిపోవడానికి ముందు అవినాష్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఉప ముఖ్యమంత్రితో సంబంధాలు లేవని, కేవలం ఓ కార్యక్రమంలో అనుకోకుండా ఆయన పక్కన కూర్చున్నప్పుడు దిగిన ఫొటోనే మీడియాలో వచ్చిందన్నాడు. తాను ఉపముఖ్యమంత్రి పేరును ఎక్కడా వాడలేదని వివరించాడు. గతంలో తనకు సహాయం చేసిన ఓ మహిళా టీచర్ ద్వారా కొందరు కావాలనే వివాదంలోకి లాగారని అవినాష్ ఆరోపించాడు. రాష్ట్రంలో తాను నేతృత్వం వహిస్తున్న అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఢిల్లీలో ఉందని, దాని పూర్తి రికార్డులు తన వద్ద ఉన్నాయని తెలిపాడు. మీడియాలో హల్చల్ సృష్టించిన ‘దాడి వీడియో’ రెండేళ్ల క్రితం నాటిదని చెప్పాడు. ఈ వ్యవహారానికి సంబంధించి పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్బాబు, ఎస్సై శివకృష్ణలకు ఉన్నతాధికారులు చార్జిమెమోలు జారీ చేశారు. -
డీజీపీ ఆఫీసులో లొంగిపోయిన అవినాష్
-
ఏ ఎండకా గొడుగు
అమలాపురం టౌన్/ పెద్దాపురం : మానవ హక్కుల పరిరక్షణ ముసుగులో అవినాష్ పాల్పడిన మోసాలు, అక్రమ వసూళ్లపై జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ఆ టక్కరికి సంబంధించిన ఏ చిన్ని ఆధారం దొరికినా వదలకుండా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో జిల్లాలో అవినాష్ ఎక్కడెక్కడకు వెళ్లాడు, ఎవరెవర్ని కలిశాడు... అని కూపీ లాగుతున్నారు. అతడి బంధువులు, స్నేహితులనే కాదు.. పరిచయస్తులను కూడా వదలకుండా విచారణ చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆరు పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. అవినాష్ అన్వేషణలో ఓ బృందం హైదరాబాద్ వెళ్లగా నిడదవోలు, కొవ్వూరు, భద్రాచలం, పెద్దాపురం, కోనసీమలకు తలో బృందం వెళ్లింది. అవినాష్ది ఏ ఎండకా గొడుగు పట్టే స్వభావం. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు తన దందాలు, అక్రమ వసూళ్ల కోసం ఎన్ని అవతారాలైనా ఎత్తుతాడు. ఎంతటి వారితోనైనా సంబంధాలు పెట్టుకుంటాడు. లేని బంధుత్వాలు సృష్టించుకుంటాడు. నాలుగేళ్ల కిందట స్మగ్లర్ అవతారం ఎత్తి కొందరు అటవీ అధికారలతో అనుబంధం పెంచుకుని అక్రమాలకు పాల్పడ్డాడు. తర్వాత ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ అవతారం ఎత్తి ఉద్యోగాలు వేయిస్తానని మోసాలకు దిగాడు. రాజప్ప బంధువునని చెప్పుకుంటూ గత అక్టోబరు నుంచి బెదిరింపులకు, దందాలకు దిగాడు. ఇదే సమయంలో 2015 సంవత్సరానికి హ్యూమన్ రైట్స్ చైర్మన్ హోదాతో ఖరీదైన రంగురంగుల పేజీలతో క్యాలెండర్ ముద్రించాడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోని ముఖ్యనేతలతో, రాష్ట్రానికి చెందిన ప్రముఖులతో దిగిన ఫొటోలను ఆ క్యాలెండర్లో ముద్రించాడు. తానో దాతనని చెప్పుకునేందుకు పేదలకు ఏవో పంపిణీ చేస్తున్న పలు ఫోటోలు కూడా ముద్రించేశాడు. క్యాలెండర్లో మన జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలతో దిగిన ఫోటోలను కూడా ప్రచురించుకున్నాడు. ఏదో ఒక సందర్భంలో ప్రముఖులను కలిసినప్పుడు వారితో తీరుుంచుకున్న ఫొటోలను క్యాలెండర్లో ముద్రించి వారితో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ, రాజప్ప బంధువునంటూ, హ్యూమన్ రైట్స్ చైర్మన్నంటూ ఆ క్యాలెండర్లతో కాకినాడలోని జిల్లాస్థాయి కార్యాలయాలకూ వెళ్లాడు. డీఎస్పీలు, ఆర్డీఓలకు కూడా విజిటింగ్ కార్డుల్ని, క్యాలెండర్లిచ్చి రాజప్పతో తన బంధుత్వం, తన పదవి గురించి గొప్పగా చెప్పుకుని పరిచయాలు చేసుకున్నాడు. అలా జిల్లా అధికార యంత్రాంగంతో పరిచయం పెంచుకున్నాడు. తాను ఏదైనా పని చేయించుకోవాలన్నా, అక్రమ వసూళ్లకు వల విసరాలన్నా తెచ్చిపెట్టుకున్న అధికార దర్పంతో, మాటల గారడీతో బురిడీ కొట్టించేవాడు. రాజమండ్రిలో హక్కుల సదస్సు.. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ హోదాలో అవినాష్ గత ఏడాది ఆగస్టు 22న రాజమండ్రిలోని ఓ స్టార్ హోటల్లో మానవహక్కుల పేరిట జాతీయ సదస్సు నిర్వహించాడు. దానికి సంస్థ హెచ్ఆర్ఓ ఎన్.బి.నజీర్ అతిథిగా వచ్చాడు. ఇదే వేదికపై మానవహక్కుల రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా రాజమండ్రి ప్రాంతానికి చెందిన రాజేశ్వరి అనే మహిళకు నియామక పత్రం కూడా అవినాష్ అందజేశాడు. ఆ సదస్సులో తమ సంస్థ బాలకార్మికుల నిర్మూలన, మహిళల అక్రమ రవాణా, బాల్యవివాహాలు, గృహహింస వంటి సమస్యలపై పోరాడుతుందని ఆర్భాటంగా చెప్పాడు. పోలీసుల అదుపులో నలుగురు.. అవినాష్ మోసాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు బుధవారం జిల్లాలో నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల పెద్దాపురం పోలీసులు అవినాష్పై అనుమానం వచ్చి విచారిస్తున్నప్పుడు అతడికి మద్దతుగా వెళ్లిన మీడియా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని, అవినాష్తో వారికున్న సంబంధాలను ఆరా తీస్తున్నారు. అంబాజీపేట మండలానికి చెందిన అవినాష్ స్నేహితుడు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్కూల్లో ఓవర్యూక్షన్పై ప్రత్యేకాధికారి విచారణ అవినాష్ గతనెల 25న హ్యూమన్ రైట్స్ చైర్మన్ హోదాతో భద్రతా సిబ్బంది, ఎర్రబుగ్గ కారుతో పెద్దాపురంలోని లూథరన్ హైస్కూలును సందర్శించినట్లు పోలీసు దర్యాప్తులో మంగళవారమే గుర్తించారు. అవినాష్ బచ్చు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కోటేశ్వరరావుతో కలిసి ఆ హైస్కూల్ను సందర్శించి పారిశుధ్యం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రధానోపాధ్యాయుడు ఇజ్రాయిల్ నుంచి ఈ మేరకు పెద్దాపురం పోలీసులు మంగళవారమే స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ క్రమంలో ప్రత్యేకాధికారి, ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఆ హైస్కూల్లో బుధవారం విచారణ చేపట్టారు. అక్కడ అవినాష్ ఓవర్ యాక్షన్పై ఆరా తీసి, సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేశారు. కాగా భద్రాచలం వెళ్లిన బృందం అక్కడికి సమీపంలోని మామిడిగూడెంలో అవినాష్ తల్లి, బంధువులను విచారించారు. -
అవినాష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సుమోటోగా కేసు నమోదు చేసిన మానవ హక్కుల కమిషన్ కాకినాడ: ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ పలువురికి టోకరా వేయడమే కాకుండా, అతనిని నిలదీసిన బాధితులపై దాడికి పాల్పడి, చిత్రహింసలకు గురి చేసిన పేరాబత్తుల అవినాష్ దేవ్చంద్ర చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇతని వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు. గతంలో అవినాష్ను పట్టుకుని వదిలేసిన వ్యవహారంలో పెద్దాపురం సీఐ శ్రీధర్బాబు, ఎస్సై శివకృష్ణలకు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మంగళవారం చార్జి మెమోలు ఇచ్చారు. విచారణ అనంతరం వీరి పాత్ర ఉన్నట్టు తేలితే సస్పెండ్ చేస్తామని చెప్పారు. ఈ వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులను ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. అవినాష్ దురాగతాలపై ఏప్రిల్ 6 నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్లో అవినాష్?:ఇతడిని పట్టుకునేందుకు ఎస్పీ రవిప్రకాష్ ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడు హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని అవినాష్ నివాసానికి ఓ బృందం వెళ్లింది. పెద్దాపురానికి చెందిన లూథరన్ హైస్కూల్ కరస్పాండెంట్ ఇజ్రాయిల్ ఫిర్యాదు మేరకు అవినాష్పై కేసు నమోదు చేశారు. మరోపక్క బాధితులను చిత్రహింసలు గురి చేసిన వీడియో దృశ్యాల అధారంగా సుమోటోగా మరో కేసు నమోదైంది. కాకినాడకు చెందిన ఒక మహిళకు మానవ హక్కుల కమిషన్ రాష్ర్ట మహిళా విభాగం చైర్పర్సన్ పదవి ఇప్పిస్తానంటూ అవినాష్ రూ. 14 లక్షలు కాజేశాడన్న ఆరోపణలున్నాయి. దీనిపై కాకినాడ టూ టౌన్ పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. మరోవైపు మంగళవారం ఈ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇటువంటి వ్యక్తికి గతంలో గన్మెన్ను ఎందుకు కేటాయించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నాడు స్మగ్లర్...నేడు చీటర్: అవినాష్ స్మగ్లింగ్కు కూడా పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నాలుగేళ్ల కిందట భద్రాచలం సమీపాన కారులో పులి చర్మాలను తరలిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో అవినాష్పై కేసు కూడా నమోదైంది. -
ఏపీ సీఎస్, డీజీపీలకు నోటీసులు
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాలో హోంమంత్రి చినరాజప్ప బంధువునని చెప్పుకుని అవినాష్ చేసిన ఆగడాలపై రాష్ట్ర మానవహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తహం చేసింది. పత్రికలు, టీవీ ఛానళ్లలో వచ్చిన కథనాలను చూసిన మానవ హక్కుల సంఘం దీనిని సుమోటోగా స్వీకరించింది. ఈ నేపథ్యంలో ఏపీ చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీ, డీజీపీలకు మంగళవారం నోటీసులు ఇచ్చింది. వీరితో పాటు సంబంధిత జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీచేసింది. ఏప్రిల్ ఆరోతేదీలోగా నివేదిక ఇవ్వాలని మానవ హక్కుల సంఘం వారందరికి సూచించింది. (చదవండి:: ఇదేందప్పా.. రాజప్పా) -
ఇదేందప్పా.. రాజప్పా
-
ఇదేందప్పా.. రాజప్పా
కాకినాడ: హోంమంత్రి చినరాజప్ప బంధువునని, ఉద్యోగాలు.. పదవులు ఇప్పిస్తానని అమాయకులను నమ్మించి ఒక మోసగాడు లక్షల్లో దోచుకున్నాడు. బండారం బయటపడటంతో ఈ విషయమై నిలదీసిన బాధితుల్ని హాకీ స్టిక్కుతో ఇష్టమొచ్చినట్టుగా చితకబాదాడు. విషయం పోలీసుల దృష్టికి రాగా విచారించి ఎవరూ ఫిర్యాదు చేయలేదంటూ నిందితుణ్ణి విడిచిపెట్టేశారు. ఓవైపు హోం మంత్రి పేరు చెప్పుకుని ఈ దురాగతాలకు పాల్పడటం, మరోవైపు పోలీసులు అతన్ని అరెస్టు చేసిన కొద్దిసేపటికే విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై టీవీ చానెళ్లలోనూ కథనాలు ప్రసారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజమండ్రి ఎ.వి.అప్పారావు రోడ్డుకు చెందిన ఎ.అవినాష్ అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్ అంటూ, తనది కేబినెట్ హోదా అని చెప్పుకుని పలువుర్ని నమ్మించాడు. పెద్ద కారు, ప్రైవేటుగా గన్మెన్లను నియమించుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడు. అప్పారావు రోడ్లో మానవహక్కుల కమిషన్ కార్యాలయాన్ని కూడా తెరిచాడు. ఖరీదైన కారు, ఆ కారుకు ఎర్రబుగ్గ, ఆ కారుపై ‘అవినాష్ ఛైర్మన్, ఇంటర్నేషనల్ హ్యూమన్రైట్స్ అని పెద్ద పెద్ద అక్షరాలతో నేమ్బోర్డు ఏర్పాటుచేసి తిరుగుతూ ఈ మోసాలకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో వివిధ విద్యాసంస్థలు, ఎన్జీవోల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఈ మేరకు ఆరోపణలు రావడంతో ఫిబ్రవరి 27న పెద్దాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రాజకీయపరమైన ఒత్తిళ్లతో వదిలేశారు. ఆగడాలు కొనసాగించిన అవినాష్ నిలదీసిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. ఓ దళిత కుటుంబాన్ని కూడా ఇంట్లో బంధించి విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీశాడు. తనను ప్రశ్నిస్తే మీకూ ఇదే గతి పడుతుందని పలువురి బాధితులకు ఆ వీడియో పంపి హెచ్చరించాడు. బాధితుల్లో ఒకరు సదరు వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అవినాష్ ఆగడాలు బయటకు పొక్కినట్లు కూడా కథనం ప్రచారంలో ఉంది. ఇవే వీడియో క్లిప్లింగులను పలు టీవీ చానె ళ్లు సోమవారం రోజంతా ప్రసారం చేశాయి. అవినాష్పై కాకినాడకు చెందిన ఒక మహిళ సోమవారం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన హోంమంత్రి చినరాజప్ప ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని పేర్కొంటూ ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. -
అందివస్తారనుకొంటే...కడతేరారు !
తెనాలిరూరల్/కొల్లిపర, న్యూస్లైన్: విద్యార్థుల ఈత సరదా మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. చేతికి అంది వస్తున్నారనుకున్న కుమారులను నది రూపంలో మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులు పుత్రశోకంతో తల్లడిల్లుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన బాధిత తల్లిదండ్రులు కష్ట నష్టాల కోర్చి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. మరి కొద్ది సంవత్సరాల్లో ఉన్నత స్థితికి చేరుకుని కుటుంబాలకు అండగా నిలుస్తారని ఆశపడుతున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. కొల్లిపర-మున్నంగి గ్రామ పరిధిలో వున్న కృష్ణానది రేవులో శుక్రవారం ఈత కొట్టడానికి దిగిన విద్యార్థులు మురళీధరరెడ్డి, జస్వంత్, అవినాష్లు కొద్ది నిమిషాల వ్యవధిలోనే మృత్యు ఒడికి చేరడం ఆయా కుటుంబసభ్యులను, తోటి విద్యార్థులను కలచివేసింది. మృతుల్లో ఒకరైన మున్నంగి గ్రామానికి చెందిన ఔతు మురళీధరరెడ్డి(17) వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడు. తండ్రి వేణు మాధవ రెడ్డి వ్యవసాయం చేస్తూ భారమైనా కుమారుడు, కుమార్తెను ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివిస్తున్నాడు. తల్లి మాధవి గృహిణి. మురళీ విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివి, రెండో సంవత్సరం తెనాలిలో చదువుతానంటే కాదనకుండా చేర్పించారు. మరొకరు కమ్మ అవినాష్ చౌదరి(17). తెనాలికి చెందిన ప్లంబింగ్ కార్మికుడు కమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు. పెద్దవాడైన అవినాష్చౌదరిని తన ఆర్థికస్థితి సహకరించకున్నా ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. పదో తరగతి వరకు తెనాలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివించి, ప్రస్తుతం హైదరాబాద్లోని నెట్టూరు టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్లో ఎలక్ట్రానిక్స్ విభాగంలో శిక్షణ ఇప్పిస్తున్నాడు. అవినాష్ తల్లి సుధారాణి గృహిణి.మరో మృతుడు కొండూరు జస్వంత్ అఖిల్(17) తండ్రి వెంకటేశ్వరరావు పోలీసు శాఖలో కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. 2011 వరకు తెనాలి వన్ టౌన్ స్టేషన్లో చేసిన ఆయన ఆ తరువాత రేపల్లెకు బదిలీ అయ్యారు. కుటుంబంతో ఇక్కడి కొత్తపేటలోని పోలీస్ క్వార్టర్స్లో నివసిస్తూ ప్రతి రోజు డ్యూటీకి వెళ్లి వస్తుంటారు. ఆయనకు ఇరువురు కుమారుల్లో అఖిల్ పెద్దవాడు, భార్య నాగమల్లేశ్వరి గృహిణి. రెండో కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల నుంచి మంచి మిత్రులు మురళీధర్రెడ్డి, అఖిల్, అవినాష్ ముగ్గురూ పదోతరగతి వరకు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. అప్పటి నుంచి వారి స్నేహం కొనసాగుతోంది. ముగ్గురూ తమ ఇతర మిత్రులతో కలసి సంక్రాంతి సెలవులను ఉల్లాసంగా గడుపుతున్నారు. అఖిల్ అమ్మమ్మ ఊరు మున్నంగి కావడంతో స్నేహితులు మురళీధర్రెడ్డి, అవినాష్లు కలసి మరో ఐదుగురి మిత్రులను గ్రామానికి ఆహ్వానించారు. సాయంత్రం వరకు గ్రామ పరిసరాల్లో గడిపి, రేవులో ఈతకు దిగారు. మురళీ, జస్వంత్, అవినాష్ల ముందు రేవులో గుంత వుండడంతో మునిగిపోయారు. తోటి మిత్రులు బయటకు లాగేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు మృత్యువు పాలయ్యారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీకి తరలివచ్చారు. వైద్యశాల ఆవరణలో వారి రోదనలు మిన్నంటాయి. మృతులు ముగ్గురూ మూడు కుంటుంబాల్లోనూ ప్రథమ సంతానం కావడం గమనార్హం. -
పుత్ర ప్రేమతో సోనియా రాష్ట్రాన్ని విభజిస్తున్నారు
-
అనంతపురం జిల్లా కదిరిలో లక్షగళ ఘోష
-
శోధన - వేదన
-
జులై 8న వైయస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ