CA
-
మాకూ ట్యాక్స్ ఆడిట్ అవకాశం కల్పించాలి: కాస్ట్ అకౌంటెంట్స్
న్యూఢిల్లీ: ప్రస్తుతం సీఏలకు మాత్రమే ఉన్న ట్యాక్స్ ఆడిటింగ్ అవకాశాన్ని తమకు కూడా కల్పించాలని కాస్ట్ అకౌంటెంట్లు కోరుతున్నారు. జీఎస్టీ చట్టంలో, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్గాను, సోషల్ ఆడిటర్లుగాను ఇద్దరికీ సమాన హోదాలనిచ్చినప్పటికీ ట్యాక్స్ ఆడిటింగ్ మాత్రం సీఏలకే పరిమితం చేయడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.కొత్త ఆదాయ పన్ను చట్టం బిల్లులో అకౌంటెంట్ నిర్వచనంలో కాస్ట్ అకౌంటెంట్ను చేర్చకపోవడమనేది గతంలో అకౌంటింగ్ వృత్తి నిపుణులందరికీ సమాన హోదా కల్పిస్తామన్న హామీకి విరుద్ధమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి తెలిపారు.ఈ అంశంపై విధాన నిర్ణేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని మూర్తి వివరించారు. అటు అకౌంటెంట్ల నిర్వచనం పరిధిలో తమను చేర్చకపోవడంపై కంపెనీ సెక్రటరీలు ఆందోళన వ్యక్తం చేశారు.పరోక్ష, ప్రత్యక్ష పన్ను చట్టాలపై కంపెనీ సెక్రటరీలకు కూడా పట్టు ఉంటుందని, ట్యాక్సేషన్ వ్యవస్థలో వారు కీలకంగా వ్యవహరిస్తారని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ప్రెసిడెంట్ ధనంజయ్ శుక్లా పేర్కొన్నారు. మరోవైపు, ఆడిట్ అనేది సీఏల పరిధిలోకి మాత్రమే వస్తుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చరణ్జోత్ సింగ్ నందా స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. -
ఇష్టంగా చదివితే ఏదీ కష్టం కాదు
సాక్షి, హైదరాబాద్: చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు.. దేశంలో ఎంతో క్లిష్టమైన చదువుల్లో వాటి లో ఒకటిగా భావించే కోర్సు. ఈ కోర్సులో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుందని చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ, సీఏ విజ యవంతంగా పూర్తిచేసినవారికి అద్భుతమైన కెరీర్ ఆహ్వనం పలుకుతుంది. ఇంత ప్రాధాన్యం ఉన్న కోర్సులో చేరి 22 ఏళ్ల వయసులోనే దానిని పూర్తి చేయటమే కాకుండా.. ఈ నెల 26న ఐసీఏఐ విడుదల చేసిన ‘ఫైనల్’ఫలితాల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు.. పలమనేరుకు చెందిన రిషబ్ ఓస్వాల్. తన విజయానికి హార్డ్ వర్క్, ప్లానింగే కీలకంగా నిలిచాయని చెబుతున్న రిషబ్ ఓస్వాల్ సక్సెస్ స్టోరీ అతని మాటల్లోనే... రాజస్తాన్ నుంచి పలమనేరుకు.. రాజస్తాన్కు చెందిన మా కుటుంబం.. వృత్తి రీత్యా చిత్తూరు జిల్లాలోని పలమనేరులో స్థిరపడింది. నాన్న రాజేశ్ ఓస్వాల్ బంగారం, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. నా స్కూల్ చదువు పలమనేరులోని ఎమ్మాస్ స్విస్ స్కూల్లోనే సాగింది. 2018లో ఐసీఎస్ఈ పదో తరగతిలో 97.5 శాతం మార్కులతో పాసయ్యాను. ఆ తర్వాత సీఏ కోర్సు అభ్యసించడానికి గుంటూరులోని మాస్టర్మైండ్స్ అకాడమీలో చేరాను. 2020లో ఇంటర్లో 96.8% మార్కులతో ఉత్తీర్ణత సాధించాను సీఏ దిశగా ఇలా..ఇంటర్మీడియెట్ పూర్తవగానే 2020లో సీఏ కోర్సులో చేరాను. 2021లో సీఏ ఇంటర్మిడియట్లో జాతీయ స్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించాను. ఆ తర్వాత ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ కేపీఎంజీలో ఆర్టీకల్íÙప్ పూర్తి చేశాను. ఒకవైపు ఆర్టీకల్ షిప్ చేస్తూనే సీఏ ఫైనల్ పరీక్షలకు ప్రిపేరయ్యాను. గత నవంబర్లో పరీక్షలకు హాజరయ్యాను. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. సీఏంఏ కూడా.. సీఏ కోర్సు కంటే ముందు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సులో చేరి.. 2020లోనే సీఎంఏ ఫౌండేషన్లో, 2021లో సీఎంఏ ఇంటర్మీడియట్లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సొంతం చేసుకున్నాను. అయితే సీఏనే నా లక్ష్యం కావటంతో 2021 నుంచి పూర్తిగా సీఏపైనే దృష్టి పెట్టాను. డైలీ ప్లానింగ్సీఏ కోర్సులో రాణించడానికి ప్రతి రోజూ దాదాపు 10 గంటలు చదివాను. పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి రోజుకు 12 గంటలు.. చివరి 15 రోజులు రోజుకు 14 నుంచి 15 గంటలు కష్టపడ్డాను. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదవడం, ప్రాక్టీస్ టెస్ట్స్కు హాజరవడం కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చాయి.‘సాక్షి’ స్పెల్–బి మెడల్ స్కూల్లో చదివేటప్పుడు కోకరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్గొన్నాను. ఈ క్రమంలో 2016లో ‘సాక్షి’స్పెల్–బి ఫైనల్స్కు చేరుకుని మెడల్ కూడా సాధించాను. దీంతోపాటు వీఐటీ స్పెల్–బిలోనూ రెండో ర్యాంకు సాధించాను. -
ఆడిట్లో లోపాలు.. రూ.2 కోట్ల జరిమానా
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) ఆడిట్లో లోపాలు జరిగినట్లు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA) గుర్తించింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆడిట్లో లోపాలకు కారణమైన డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీకి రూ.2 కోట్ల జరిమానా విధించింది. ఈ ఆడిట్లో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లపై చర్యలు తీసుకుంది.2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఆడిట్ పనులను డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీకి అప్పగించింది. సుమారు రూ.200 కోట్ల ఆడిట్(audit)లో అవకతవకలు జరిగినట్లు ఎన్ఎఫ్ఆర్ఏ గుర్తించింది. దాంతో డెలాయిట్ హాస్కిన్స్కు రూ.2 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ అనధికార లావాదేవీలను గుర్తించడం, వాటిని నివేదించడంలో ఆడిట్ సంస్థ విఫలమైందని ఎన్ఎఫ్ఆర్ఏ తెలిపింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సీఏలు ఏబీ జానీను రూ.10 లక్షలు జరిమానా(fine)తోసహా ఐదేళ్ల పాటు ఆడిట్ పనుల నుంచి నిషేధించగా, రాకేశ్ శర్మకు రూ.5 లక్షల జరిమానాతోపాటు మూడేళ్లు నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: కిరాణా దుకాణాలకు టెక్నాలజీ ప్లాట్ఫామ్డెలాయిట్ హాస్కిన్స్ & సెల్స్ ఎల్ఎల్పీ అనేది ఎకనామిక్ వ్యవహారాలు నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ సేవల సంస్థ. ఇది ఆడిట్, కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైజరీ, రిస్క్ అడ్వైజరీ, టాక్స్ సేవలతో సహా విస్తృత శ్రేణి సేవలను అందిస్తోంది. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ సర్వీసులు అందిస్తోంది. -
‘EY ఉద్యోగి చావుకు కారణం ఆ మేనేజర్ క్రికెట్ పిచ్చి’
యర్నెస్ట్ అండ్ యంగ్ (EY) సీఏ అన్నా సెబాస్టియన్ మరణం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ పని సంస్కృతిపై పెను చర్చకు దారితీసింది. ఆమె 'అధిక పని' కారణంగానే మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన అన్నా సెబాస్టియన్ పెరాయిల్ తండ్రి సీబీ జోసెఫ్ కొత్త విషయాలు చెప్పారు. ఆమె మేనేజర్కు ఉన్న క్రికెట్ పిచ్చే తమ కుమార్తెపై పని ఒత్తిడి పెంచిందంటూ ఆరోపిస్తున్నారు."ఆమె (అన్నా సెబాస్టియన్) మార్చి 18న అక్కడ (EY) చేరింది. ఒక వారం తర్వాత, ఆమె సాధారణ ఆడిటింగ్ను ప్రారంభించింది. EY పూణేలో 6 ఆడిట్ బృందాలు ఉన్నాయి. ఆమెను 6వ టీమ్లో చేర్చారు. ఆడిట్ మేనేజర్ పనిని సమీక్షించారు. ఆమె అర్ధరాత్రి వరకు పని చేయాల్సి వచ్చింది. ఆమె పీజీకి చేరుకున్న తర్వాత కూడా అదనపు పనిని చేయవలసి వచ్చింది.నిద్రించడానికి, తినడానికి కూడా ఆమెకు సమయం లేదు. ఆమె పని ఒత్తిడిని కలిగి ఉంది. మేనేజర్ సమయానికి పనిని సమీక్షించలేదు. అతను క్రికెట్ అభిమాని. మ్యాచ్ షెడ్యూల్కు అనుగుణంగా తన షెడ్యూల్ను మార్చాడు. దాని కారణంగా ఆమె తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి చాలా సేపు ఆలస్యంగా కూర్చోవలసి వచ్చింది.అంతటి ఒత్తడితో తాను అక్కడ పనిచేయలేనని ఏడ్చేది. రాజీనామా చేసి వచ్చేయాలని మేం కోరాం. కానీ ఆమె ఈవైలో కొనసాగాలని నిర్ణయించుకుంది. దురదృష్టవశాత్తు జూలై 21న ఆమె తన గదిలో కుప్పకూలిపోయి ఆసుపత్రికి చేరుకునేలోపు మరణించింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీబీ జోసెఫ్.#WATCH | EY employee's death allegedly due to 'overwork' | Ernakulam, Kerala: Father of EY employee Anna Sebastian Perayil, Sibi Joseph says, "... She joined there on March 18... After one week, she started the regular auditing. There are 6 audit teams in EY Pune and she was… pic.twitter.com/aMTabuAei0— ANI (@ANI) September 21, 2024 -
నవ్విపోదురు గాక.. మాకేటి సిగ్గు.. 'ఛీ'డీపీ అంటున్నా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘నవ్విపోదురు గాక.. మాకేటి సిగ్గు’’ అన్నట్లుంది టీడీపీ నేతల తీరు. మునిగిపోయిన టీడీపీ నావను ఎలాగైనా దారిలో పెట్టాలనే ఉద్దేశంతో నీచ రాజకీయాలకు తెర లేపుతున్నారు. జనం ఏమనుకుంటే ఏంటి.. అన్నట్లుగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా అధికార పార్టీకి అంటగడుతూ.. చివరికి అవన్నీ అవాస్తవాలని తేలాక నవ్వులపాలవుతున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ‘సంక్షేమం’ వెల్లివిరిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరిగాయి. జరుగుతున్నాయి. ఇంటి వద్దకే పథకాలు అందుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయంగానూ పెద్దపీట వేయడంతో ఆయా వర్గాల్లో ఆనందం నెలకొంది. కొన్ని రోజులుగా అధికార పార్టీ నిర్వహిస్తున్న సాధికార బస్సు యాత్రలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఓర్వలేని టీడీపీ.. సీఎం వైఎస్ జగన్కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్ష పార్టీల నేతలు రగిలిపోతున్నారు. ‘మీ బిడ్డ మంచి చేస్తేనే మళ్లీ ఆశీర్వదించండి’ అంటూ ప్రజలను నమ్ముకుని ముఖ్యమంత్రి ముందుకు సాగుతుంటే.. టీడీపీ నాయకులు మాత్రం బురదను నమ్ముకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వంపైనా, పథకాలపైనా, అధికార పార్టీ నాయకులపైనా ఏదో రకంగా బట్టకాల్చి మీద వేసిన చందంగా ప్రవర్తిస్తున్నారు. తమకు వత్తాసు పలికే ఎల్లో మీడియాలో దిగజారి అచ్చేసుకుంటున్నారు. ప్రజల్లో మరింతగా చులకనమవుతున్నారు. భార్యాభర్తలు గొడవ పడినా, అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొన్నా వైఎస్సార్ సీపీ నాయకులే కారణమంటూ ప్రజలకే వెగటు పుట్టిస్తున్నారు. ఏమైందయ్యా మీకు..? టీడీపీ నేతలు జేసీ ప్రభాకరరెడ్డి, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ ఇప్పటికే ప్రజల్లో చులకనైపోయారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు, చంద్రబాబు స్కాములు, జైలు పాలు కావడం వంటి పరిణామాలతో జిల్లాలో పార్టీ పరిస్థితి మరింతగా దిగజారి పోయింది. ఇక.. ప్రభుత్వ పరంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండడంతో వారిని ప్రజలు పట్టించుకోవడం లేదు. దీంతో ఎలాగైనా ప్రజల దృష్టి మరల్చాలనే దురుద్దేశంతో పచ్చ మీడియా తోడుగా విష ప్రచారం చేస్తున్నారు. దొంగే దొంగ అన్నట్లుగా.. • ఉరవకొండ నియోజకవర్గంలో వేలల్లో దొంగ ఓట్లు నమోదైనట్టు ఇటీవల తేలింది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో నమోదైనవే. కానీ అధికార పార్టీపై పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేసి అభాసుపాలయ్యారు. • రాయదుర్గం నియోజకవర్గంలో శనగల వ్యాపారి ఐపీ పెడితే దాన్ని మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కుటుంబానికి కాలవ శ్రీనివాసులు అంటగట్టారు.దీన్ని గురునాథ్ రెడ్డి సోదరుడు తీవ్రంగా ఖండించారు. ఉషశ్రీచరణ్ మంత్రి అయ్యాక తొలిసారి కళ్యాణదుర్గం వచ్చిన సందర్భంలో.. ఓ బాలింతకు దారి ఇవ్వక శిశువు మృతిచెందా రని కాలువ రాద్ధాంతం చేశారు. సీసీ ఫుటేజీల్లో చూస్తే ఎక్కడా అడ్డుకున్న దాఖలాలే లేవు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి దిగజారి ప్రవర్తించిన కాలవను ఆ పార్టీ కార్యకర్తలే విమర్శించారు. • విడపనకల్లులో ఉపాధ్యాయుడు మల్లేష్ ఆర్థిక కారణాలతో ఆత్మహత్యాయత్నం చేస్తే మాజీ మంత్రి పరిటాల సునీత రాద్ధాంతం చేశారు. తమను రాజకీయాలకు వాడుకోవద్దు అంటూ బాధిత కుటుంబం కాళ్లా వేళ్లా పడినా పరామర్శల పేరుతో పత్రికలకెక్కారు. • తాడిపత్రికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. సీఐ సస్పెండ్ అయినా అధికార పార్టీనే అంటారు. అభివృద్ధి పనులు అడ్డుకోవడం, కళాశాల ప్రహరీ కట్టొద్దంటూ అడ్డుకోవడం ఒకటా రెండా.. జిల్లాలో తీవ్ర వివాదాలకు జేసీ కేంద్ర బిందువుగా ఉన్నారు. ఇప్పటికే బస్సుల కొనుగోలులో ఈడీ కేసులను ఎదుర్కొంటున్న ఆయన తాను పవిత్రుడినని.. మిగతా అందరూ అవినీతి పరులని బురద జల్లుతుంటడం గమనార్హం. ఇవి చదవండి: పేద పిల్లల భవిష్యత్తుపై దెబ్బ కొట్టే రాతలు సహించం -
సీఏ విద్యార్థిని తీవ్ర నిర్ణయం! అసలేం జరిగింది?
సాక్షి, కడప: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల గ్రామంలో సీఏ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రవీంద్రబాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లెల గ్రామానికి చెందిన బలక రమేష్, సునీత దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. పొలం పనులు చేసుకుని పిల్లలను చదివించేవారు. పెద్ద కుమార్తె స్వాతి (21) గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ కళాశాలలో సీఏ చదువుతుండగా, రెండో కుమార్తె బీటెక్, చిన్న కుమారుడు 6వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సీఏ చదువు పూర్తి చేసుకున్న పెద్ద కుమార్తె స్వాతి గుంటూరు నుంచి 15 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఈ తరుణంలో గురువారం సాయంకాలం నీ చదువు కోసం రూ.లక్షలు ఖర్చు చేశాం, పరీక్షలు బాగా రాశావా తల్లీ, గతంలో లాగా కాకుండా, ఈ సారైనా పాస్ అవుతావా అని కన్నవాళ్లు స్వాతిని ప్రశ్నించారు. లేకుంటే మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తామని సున్నితంగా సూచించారు. సదరు యువతి ఏమనుకుందో ఏమో, పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో, లేదా కన్నవాళ్ల ఆశలు నెరవేర్చలేనేమో అని అనుకుందో గాని క్షణికావేశంలో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: తమ్ముడు రాయితో కొట్టాడని.. అర్ధరాత్రివేళ కిరాతకంగా మారిన అన్న.. -
డైనమిక్ అయ్యర్
సవాలును తలకెత్తుకోవడం అంటే ‘తలకు మించిన భారం’ అనుకుంటారు కొందరు. సవాలును స్వీకరించడం అనేది తమను తాము నిరూపించుకునే అపూర్వ అవకాశం అనుకుంటారు మరికొందరు. అపర్ణ అయ్యర్ రెండో కోవకు చెందిన వ్యక్తి. ‘సీఏ పరీక్ష పాస్ కావడం అంటే మాటలు కాదు’ లాంటి ప్రతికూల మాటలు అదేపనిగా వినిపించినా ‘సీఏ’ పై ఆసక్తిని ఎప్పుడూ కోల్పోలేదు. ఆ ఆసక్తే ఆమెను సీఏ బంగారు పతక విజేతను చేసింది. సవాలును చిరునవ్వుతో స్వీకరించే ఆమె ధైర్యం ‘విప్రో’ లాంటి పెద్ద సంస్థలో సీఎఫ్వో (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)గా బాధ్యతలు స్వీకరించేలా చేసింది.... లీడర్ అంటే ఎవరు? దారి తెలిసిన వారు, ఆ దారిలో ఆటంకాలు లేకుండా ప్రయాణించే వారు, అవసరమైతే కొత్త దారి చూపించేవారు. ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఎన్నో అపర్ణ అయ్యర్లో దండిగా ఉన్నాయి కాబట్టే ఆమె మల్టీనేషనల్ ఐటీ కార్పోరేషన్ విప్రోలో ఎన్నో ఉన్నతస్థానాల్లో పనిచేసింది. విప్రోతో ఆమెది రెండు దశాబ్దాల అనుబంధం. సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్గా విప్రోలోకి అడుగు పెట్టిన అపర్ణ అక్కడి ఫైనాన్స్ టీమ్తో పని చేస్తూ ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ సీఎఫ్వో స్థాయికి చేరింది. ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్, క్యాపిటల్ అలోకేషన్, ఫండ్ రైజింగ్, బిజినెస్ స్ట్రాటజీ అండ్ గ్రోత్... మొదలైన సబ్జెక్లలో అపర్ణ నిపుణురాలు. సబ్జెక్ట్లో నైపుణ్యం ఉండగానే సరిపోదు. వివిధ సందర్భాలలో ఆ నైపుణ్యాన్ని సృజనాత్మకంగా అన్వయించి మంచి ఫలితాలు సాధించగలగాలి. ఈ విషయంలో ఎప్పుడూ వెనకబడిపోలేదు అపర్ణ అయ్యర్. ఇంటర్నల్ ఆడిట్, బిజినెస్ ఫైనాన్స్, ఫైనాల్సియల్ ప్లానింగ్ అండ్ ఎనాలటిక్స్, కార్పోరేట్ ట్రెజరీ....ఇలా కంపెనీకి సంబంధించి ఎన్నో విభాగాలో కీలకపాత్ర పోషించింది. ముంబై నర్సీ మోంజీ కాలేజి నుంచి కామర్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన అపర్ణ 2002 సీఏ (చార్టెట్ ఎకౌంటెంట్) గోల్డ్ మెడలిస్ట్. ‘అపర్ణ అయ్యర్లో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. తన ముందుచూపు, సాహసోపేతమైన నిర్ణయాలతో సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది’ అంటున్నాడు విప్రో సీయివో డెలాపోర్ట్. ‘కీలకమైన సమయంలో సీఎఫ్వోగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మరిన్ని విజయాలు సాధించే లక్ష్యంతో మా ప్రయాణం కొనసాగుతుంది’ అంటుంది అపర్ణ అయ్యర్. -
19 ఏళ్లకే సీఏ..గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకుంది
విజయం గురించి కలలు కనేవారికి...విజేతల నోటి నుంచి వచ్చిన మాటలు ఆణిముత్యాలు అవుతాయి. ఆచరణకు కొత్త మెరుగులు దిద్దుకునే పాఠాలు అవుతాయి. వరల్డ్స్ యంగెస్ట్ ఫిమేల్ చార్టర్డ్ ఎకౌంటెంట్గా గిన్నిస్ బుక్లోకి ఎక్కిన నందిని అగర్వాల్ జోష్ టాక్ (ఇన్స్పిరేషనల్ టాక్స్)తో వ్యక్తిత్వ వికాస కోణంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన మాటలు చెబుతోంది... నందిని అగర్వాల్కు ఎప్పుడూ తొందరే. పరీక్షలు ఇంకో వారంరోజుల్లో ఉంటే ‘రేపే అయితే బాగుండేది’ అనుకునేది. ఈ తొందర ఆమెను రెండు క్లాసులు జంప్ చేసేలా చేసింది. అలా అన్నకు క్లాస్మేట్గా మారింది. మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాకు చెందిన నందిని అగర్వాల్ పందొమ్మిది సంవత్సరాల వయసులో సీఏ ఫైనల్ పరీక్ష ఫలితాలలో (2021)లో ఆలిండియా టాపర్గా నిలిచింది. అన్న సచిన్ అగర్వాల్కు 18 ర్యాంకు వచ్చింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్లో ఈ అన్నాచెల్లెళ్లను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒకరోజు నందిని చదువుతున్న స్కూల్కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ వచ్చారు. ఆ వ్యక్తి అపురూపంగా కనిపించారు. తాను కూడా గిన్నిస్బుక్లో పేరు సం΄ాదించాలని ఆ సమయంలోనే కల కన్నది నందిని. అప్పుడే ఆమె దృష్టి సీఏపై పడింది. అయితే సీఏ ఎంట్రెన్స్ కోచింగ్ సమయంలో తనను ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. వారి నిర్లక్ష్యం, చిన్నచూపు తనలో మరింత పట్టుదల పెంచింది. అనుకున్న లక్ష్యాన్ని అవలీలగా సాధించి ‘ఔరా’ అనిపించింది. ‘నా విజయంలో మా అన్నయ్యది ప్రధాన పాత్ర. మాక్ టెస్ట్లో నాకు అత్తరసు మార్కులు వచ్చాయి. చాలా నిరాశగా అనిపించింది. మాక్ టెస్ట్లోనే ఇలా ఉంటే రియల్ టెస్ట్లో ఎలా ఉంటుంది అని భయపడ్డాను. ఆ సమయంలో అన్నయ్య ఎంతో ధీమా ఇచ్చాడు. నువ్వు కచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోగలవు అన్నాడు. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాయి’ అంటుంది నందిని.‘నందినిలోని నాకు బాగా నచ్చిన విషయం... బాగా కష్టపడి చదువుతుంది. ఒకవిధంగా చెప్పాలంటే చెల్లి నాకు స్ఫూర్తి. నందినిని చూసిన తరువాత నేను కూడా చదువుపై బాగా దృష్టి పెట్టాను’ అంటాడు సచిన్ అగర్వాల్. ఇక నందిని అగర్వాల్ ‘జోష్ టాక్’లో ఆకట్టుకునే కొన్ని మాటలు... ►కొత్త వ్యక్తులు, కొత్తప్రదేశాలతో నిరంతర పరిచయం మన ప్రపంచాన్ని విస్తృతం చేస్తుంది. ► జీవితం సులభంగా సాగిపోవాలంటే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు వ్యక్తిగత స్వార్థంతో చేసే సహాయానికి విలువ ఉండదు. ► ‘నువ్వు ఇలాగే ఉంటావు. ఇది మాత్రమే సాధించగలవు’ అనే మాటలు అవతలి వ్యక్తుల నుంచి రాకుండా చూసుకోవాలి. మనం ఎలా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి, మనం ఏది సాధించగలమో మనకు తెలిసి ఉండాలి. ► ‘నీవల్ల ఏమవుతుంది!’ అనేది ఎంతోమంది విజేతలకు సుపరిచితమైన మాట. ఆ మాటను తేలిగ్గా తీసుకొని ‘కచ్చితంగా నా వల్లే అవుతుంది’ అని వారు అనుకోవడం వల్లే విజేతలయ్యారు. ►జీవిత సత్యాలను ఎక్కడినుంచైనా నేర్చుకోవచ్చు. చివరికి ఐస్క్రీమ్ నుంచి కూడా! ‘ఎంజాయ్ ది లైఫ్ బిఫోర్ ఇట్ మెల్ట్స్’ ► సక్సెస్ఫుల్ లీడర్లు వర్క్ను ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్న దానిపై బాగా వర్క్ చేస్తారు. ► నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే ఇతరులను ఎప్పుడూ కంట్రోల్ చేయలేవు. కలల సాధనకు కష్టాన్ని జోడించకపోతే కల కనే అర్హత కోల్పోతాం ► మన జీవితానికి హ్యాపీ వెర్షన్ ఏమిటంటే బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లడం ∙పనిలో తప్పులో చేసినా ఫరవాలేదుగానీ ఏమీ చేయకపోవడమంత తప్పు మరొకటి లేదు. ► మనం ఎక్కువగా భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటాం. గతంలో జరిగిన పొరపాట్ల గురించి అదేపనిగా పశ్చాత్తాపపడుతుంటాం. నిజానికి మనం చేయాల్సింది... వర్తమాన జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం. ► మీ టైమ్ను సేవ్ చేసుకోకపోవడం తెలియకపోతే, టైమ్ మిమ్మల్ని సేవ్ చేయదు. కలలు అనేవి మనకు ఉన్న అతి పెద్ద ఆస్తులు. ఇతరుల అసూయ, ద్వేషాలతో అవి కరిగిపోకుండా చూసుకోవాలి. From watching inspirational talks to giving one on Josh Talks! pic.twitter.com/ywULGdq3On — Nandini Agrawal (@canandini19) March 4, 2023 -
ఎవరెస్ట్ ఎక్కించిన తెలుగుపాఠం..
నిర్మల్: ఆయనో చార్టెడ్ అకౌంటెంట్. పక్షంరోజులు పనులన్నీ పక్కనపెట్టి, ఏకంగా ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడానికి వెళ్లారు. తొలిసారే అవకాశం లేదనడంతో వెనక్కి తగ్గేది లేదంటూ.. ఎవరెస్ట్ బేస్క్యాంప్ వరకూ వెళ్లారు. ఆయన హిమాలయాలకు వెళ్లడానికి, అంత ఎత్తు ఎక్కడానికి కారణం తొమ్మిదో తరగతిలో ఆయన విన్న తెలుగుపాఠం కారణం. ఎవరా సీఏ, ఏమా తెలుగుపాఠం.. వివరాలివిగో! నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ముక్క సాయిప్రసాద్ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన కరీంనగర్లోని పారామిత హైసూ్కల్లో చదువుకున్నారు. తెలుగుసార్ సన్యాసిరావు తొమ్మిదో తరగతి పాఠంలో భాగంగా ‘అటజని కాంచె భూమిసురుడు..’ అనే పద్యాన్ని చెబుతూ హిమాలయాలను అందంగా వర్ణించారు. అది సాయిప్రసాద్ మనసులో బలంగా నాటుకుపోయింది. ఎప్పటికైనా హిమాలయాలకు వెళ్లాలని, ఆ అందాలను చూడాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు. తరువాత ఉన్నత చదువులు, కెరీర్లో పడిపోయినా.. ఇరవైఏళ్ల కిందట విన్న పాఠం, హిమాలయాలకు వెళ్లాలన్న ఆలోచన ఆయన మదిలో మెదులుతూనే ఉంది. మొదటిసారి కావడంతో.. అయితే.. గతనెల 28న నేపాల్ రాజధాని ఖాట్మాండు వెళ్లిన ఆయన అక్కడి నుంచి హిమాలయాలకు చేరుకున్నారు. మొత్తం ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8,849 మీటర్లు కాగా, బేస్ క్యాంప్ 5,364 మీటర్లు ఉంటుంది. తొలిసారి ఎవరెస్ట్ ఎక్కాలనుకునేవారిని ఈ బేస్ వరకే అనుమతిస్తారు. సాయిప్రసాద్ను సైతం బేస్ వరకే అనుమతించారు. ఏడురోజుల పాటు ఎక్కుతూ ఈనెల 6న ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరుకున్నారు. తన కుటుంబం, మిత్రుల సహకారంతో ఇక్కడి వరకూ వచ్చానని సాయిప్రసాద్ చెప్పారు. తనతో పాటు ఆయన మిత్రుడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన నార్లాపురం గిరిధర్ను కూడా ఒప్పించి వెంట తీసుకెళ్లారు. హిమాలయాలు అద్భుతం.. హిమాలయాల గురించి వింటుంటాం. కనులారా చూస్తేనే వాటి అందం తెలుస్తుంది. నాకు ట్రెక్కింగ్ అనుభవం లేదు. కానీ ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇస్తాను. అదే నేను ఎవరెస్ట్ బేస్క్యాంప్ వరకు చేరడానికి ఉపయోగపడింది. అక్కడికి వెళ్లి హిమాలయాలను చూడటం మర్చిపోలేని ఫీలింగ్. మరోసారి ఎవరెస్ట్ మొత్తం ఎక్కడానికి ప్రయత్నిస్తా. – ముక్క సాయిప్రసాద్, సీఏ, నిర్మల్ -
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. హైదరాబాద్ ఆడిటర్ గోరంట్ల అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైదరాబాద్కు చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుని సీబీఐ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం గోరంట్లను ఢిల్లీకి పిలిపించిన సీబీఐ అధికారులు మంగళవారం సాయంత్రం ఆయనని అదుపులోనికి తీసుకున్నారు. బుచి్చబాబు విచారణకు సహకరించడంలేదని, అడిగిన ప్రశ్నలకు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తూ ఉండడంతో అరెస్ట్ చేసినట్టుగా బుధవారం సీబీఐ అధికారులు తెలిపారు. ఢిల్లీ కొత్త మద్యం విధానం 2021–22 రూపకల్పనలో గోరంట్ల బుచి్చబాబు పాత్ర ఉందని హైదరాబాద్కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా ఆయన వ్యవహరించారని సీబీఐ ఆరోపిస్తోంది. ప్రత్యేక కోర్టులో ఆయనని హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల 11 వరకు కస్టడీకి అప్పగించింది. బుచి్చబాబుని సీబీఐ గతేడాది ఆగస్టు, అక్టోబర్ మధ్య కాలంలో 15 సార్లు విచారించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు కూడా విచారణ జరిపింది. -
ఢిల్లీ లిక్కర్ స్కాం: గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ చేసింది. రామచంద్ర పిళ్లైకి చార్టెడ్ అకౌంటెంట్గా వ్యవహరించాడు గోరంట్ల బుచ్చిబాబు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీలో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారణ కాగా.. గతంలోనూ సీబీఐ కూడా అతని ఇంట్లో సోదాలు నిర్వహించింది. అంతేకాదు పలుమార్లు ఢిల్లీకి పిలిచి విచారించింది కూడా. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో, తద్వారా హైదరాబాద్కు చెందిన హోల్సేల్, రిటైల్ లైసెన్సీలకు లాభం చేకూర్చడంలో పాత్ర పోషించినందుకు గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసింది సీబీఐ. మద్యం విధానం రూపకల్పనలో హైదరాబాదుకు చెందిన పలు సంస్థలకు భారీగా లబ్ధి చేకూరే విధంగా బుచ్చిబాబు వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్ల రూపాయల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి చేతులు మారడంలో బుచ్చిబాబు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. వైద్య పరీక్షల అనంతరం.. అరెస్ట్ చేసిన గోరంట్ల బుచ్చిబాబును రౌస్ఎవిన్యూ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టనుంది సీబీఐ. ఆపై విచారణ కోసం కస్టడీకి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గోరంట్ల బుచ్చిబాబు గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీఏగా పనిచేసినట్లు ఆ మధ్య కొన్నికథనాలు తెరపైకి వచ్చాయి. కిందటి ఏడాది సెప్టెంబర్లో.. లిక్కర్ స్కాం లింకులతో దేశవ్యాప్తంగా నలభై చోట్ల ఈడీలు సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో దోమలగూడ(హైదరాబాద్) అరవింద్నగర్లోని శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో ఉన్న బుచ్చిబాబు కార్యాలయంలో ఈడీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది కూడా. కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి రిజస్టర్ట్ అడ్రస్కు సమీపంలోనే ఉన్న గోరంట్ల అసోసియేట్స్ ఆఫీసులో ఈ దాడులు జరగడం సరికొత్త అనుమానాలకు దారితీసింది అప్పట్లో. అంతేకాదు కవితతో కలిసి దిగిన ఫొటోలు సైతం బాగా వైరల్ అయ్యాయి. -
బిజినెస్కు ఈజీ మ్యాప్
చాలా మంది మహిళలు తమ సొంత కాళ్లమీద నిలబడటానికి ఉద్యోగమో, వ్యాపారమో చేయాలనుకుంటారు. ఉద్యోగానికైతే కొన్ని అర్హతలు ఉండాలివ్యాపారం చేయాలంటే.. పెట్టుబడి ఉంటే చాలనుకుంటారు. కానీ, కుటుంబం నుంచి అందుకు తగిన మద్దతు రాకపోతే .. నైపుణ్యాలు లేవని వెనకడుగువేస్తేపెట్టుబడి లేదని చతికిలపడితే.. హైదరాబాద్ నానక్రాంగూడలో ఉన్న కుంబజాడల సంహితను కలవచ్చు. చార్టర్డ్అకౌంటెంట్ అయిన సంహిత దిగువ, మధ్యతరగతి మహిళలు వ్యాపారంలో రాణించడానికి కావల్సిన అవగాహన తరగతులను ఉచితంగా ఇస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులచేత వర్క్షాప్స్ నిర్వహిస్తున్నారు. అనుకున్న బిజినెస్కు ఈజీ మ్యాప్ డిజైన్ చేసిస్తున్నారు.. ‘మహిళలు ఎవ్వరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు’ అని చెప్పే సంహితను తనకు కలిగిన ఈ ఆసక్తి గురించి అడిగినప్పుడు ఎన్నో విషయాలు పంచుకున్నారు. ‘‘సాధారణంగా చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్ అంటే కంపెనీ అకౌంటింగ్, ఆడిటింగ్ పనులు చూస్తారు, అంతవరకే వారి డ్యూటీ అనుకుంటారు. కానీ, ‘మీ బిజినెస్ను ఇలా ముందుకు తీసుకువెళ్లచ్చు’ అని గైడెన్స్ ఇవ్వాలనుకోరు. నేను ఉద్యోగరీత్యా ముంబై, ఢిల్లీ, చెన్నై, యు.ఎస్ లలో వర్క్ చేశాను. అన్ని చోట్లా మహిళల పని సామర్థ్యాల పట్ల అవగాహన ఉంది. వివిధ రంగాల్లో నైపుణ్యం గల స్నేహితులున్నారు. వీరితో కలిసి ‘మహిళలు వ్యాపార రంగంలో రాణించడం’ అనే అంశాల మీద చర్చిస్తున్నప్పుడే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి సరైన గైడెన్స్ ఇస్తే బాగుంటుందనే ఆలోచన చేశాను. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్లో ప్రోస్క్వాడ్ కన్సల్టింగ్ను ఏర్పాటు చేసి, నా వర్క్కు సంబంధించిన పనులు చూస్తున్నాను. అవగాహనే ప్రధానంగా.. రెండేళ్ల క్రితం ఆంధ్రాలో ఒకమ్మాయి తొక్కుడు లడ్డు 2/– రూపాయలకు ఒకటి అమ్మడం చూశాను. వాళ్లమ్మగారు ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె మరొక అమ్మాయితో కలిసి ఈ చిన్న బిజినెస్ చేస్తోంది. ఆ రోజు వాళ్లిద్దరూ 150 లడ్డూలు అమ్మారు. అంత మంచి స్వీట్, తక్కువ ధరకు అమ్ముతున్నారు. వారికి ఆ స్వీట్స్ను ఎలా మార్కెటింగ్ చేయాలో చెప్పాలనుకున్నాను. దాంతోపాటు బ్యాంకుల నుంచి పెట్టుబడులు తెచ్చుకోవడం, ప్యాకేజీ సిస్టమ్, మార్కెటింగ్ ఐడియాలు ఇవ్వడంతో ఇప్పుడు వారి వ్యాపారం లక్షల్లో నడుస్తోంది. ఆ అమ్మాయిలిద్దరూ చదువుకున్నవారు కాదు. ఒకరు టైలరింగ్ చేసేవారు, ఇంకొక అమ్మాయి ఇంట్లోనే ఉండేది. ఇప్పుడు వారిని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది. అదిలాబాద్కు చెందిన ఒకరి బిజినెస్ దాదాపు మూతపడిపోయే దశలో ఉన్నప్పుడు మమ్మల్ని కలిశారు. ఇప్పుడు వారి వ్యాపారంలో ఏ చిన్న సందేహం వచ్చినా ఫోన్ చేసి సలహా అడుగుతుంటారు. ప్రతి ఒక్కరికీ సొంతంగా ఎదగాలనే ఆలోచన ఉంటుంది. కానీ, సరైన అవగాహన లేక వెనకబడిపోతుంటారు. లేదంటే ఫెయిల్యూర్స్ చూస్తుంటారు. ఇలాంటప్పుడు సరైన గైడెన్స్ ఇచ్చేవారుంటే తిరిగి నిలదొక్కుకుంటారు. ఈ ఉద్దేశ్యంతోనే రెండేళ్ల నుంచి చిన్న, మధ్య తరగతి మహిళా వ్యాపారులకు అవగాహనా తరగతులను నిర్వహిస్తున్నాం. అందుకు విధి విధానాలను రూపొందించాను. మొదలుపెట్టిన యేడాదిలోనే వందకు పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత యేడు ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది. రిస్క్ అని వద్దనుకుంటారు.. ఏదైనా సొంతంగా వర్క్ స్టార్ట్ చేద్దామని వచ్చినవారిని ‘ముందు మీ ఇంట్రస్ట్ ఏంటి?’ అనే ప్రశ్నతో మొదలుపెడతాం. ఆ తర్వాత వారితో 2–3 సెషన్స్ నడుస్తాయి. ఎందుకంటే, ఏ చిన్న బిజినెస్ మొదలుపెట్టాలన్నా రెండు, మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇలాంటప్పుడు వారిలో ఎన్నో సందేహాలు ఉంటాయి. కుటుంబం అంత పెట్టుబడి పెట్టలేకపోవచ్చు. పైగా ‘మార్కెట్ గురించి ఏమీ తెలియకుండా పెట్టుబడి పెడితే, ఫెయిల్యూర్ వస్తే తట్టుకోలేం’ అనేది ఉంటుంది. ఇవన్నీ వారితో చర్చిస్తాం. వారిలో ఉన్న స్కిల్స్ని పరిగణనలోకి తీసుకొని, ఆ తర్వాత బిజినెస్లో ప్రోత్సహిస్తాం. ఇందుకు కన్సల్టేషన్ ఫీజు ఉండదు. బిజినెస్ చేయాలనుకునేవారి ఆలోచనకు మా గైడెన్స్ ఒక సులువైన రోడ్ మ్యాప్లా ఉంటుంది. నెమ్మదిగా ప్రయాణం.. ఇప్పటి వరకు మా దగ్గరకు వచ్చే వారి నుంచి ఇంకొంత మందికి తెలిసి, వారి ద్వారా మరికొంతమంది చేరుతున్నవారే ఉన్నారు. అలా ఇప్పటి వరకు 350 మంది క్లయింట్స్ ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది స్లో ప్రాసెస్. ‘మీరెందుకు ఫ్రీ సర్వీస్ ఇస్తారు..’ అనేవారూ ఉన్నారు. ఈ సందేహం నిజమే.. మార్కెట్లో మా గైడెన్స్తో నిలదొక్కుకున్నాక వాళ్లు ఇంకా పై స్థాయికి చేరుకోవాలనుకున్నప్పుడు ఛార్జ్ ఉంటుంది. ఈ మొత్తం మరికొందరికి గైడెన్స్ ఇవ్వడానికి సహాయపడుతుంది. మార్కెట్లో ఏ ప్రొడక్ట్కైనా ఎమ్ఆర్పీ ఉంటుంది. కానీ, మా వర్క్కి అలా ఉండదు. ఈ వర్క్కి ఎంత చార్జ్ చేయచ్చు అనేది కూడా తెలియదు. కొందరికి వారి బిజినెస్ను బట్టి ఛార్జ్ ఉంటుంది. స్వతంత్రంగా ఎదగడం, ఆర్థికంగా నిలబడాలనే విషయంలో మహిళల ఆలోచన పెరుగుతోంది. చాలా మంది మహిళలు నా కోసం నేను ఏ కొంచెమైనా డబ్బు సంపాదించుకోగలనా అని ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా మహిళల్లో మల్టీటాస్కింగ్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి, వారికి కొంత ప్రోత్సాహమిస్తే చాలు అనుకున్న స్థాయికి చేరుకోగలరు. ఆ ప్రోత్సాహమే నేను ఇవ్వాలనుకున్నది’’ అని వివరించారు ఈ చార్టర్డ్ అకౌంటెంట్. – నిర్మలారెడ్డి -
ఢిల్లీ లిక్కర్ స్కాం: సీబీఐ విచారణకు సీఏ బుచ్చిబాబు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, ఢిల్లీ రాజకీయాల్లో లిక్కర్ స్కాంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లు దూకుడు పెంచాయి. లిక్కర్ పాలసీ ముడుపుల వ్యవహారంలో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా మరికొందరికి నోటీసులు పంపించాయి. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సోమవారం విచారించింది ఈడీ. ఇదే కేసులో హైదరాబాద్ వాసి అరుణ్ రామచంద్ర పిళ్లైని సీబీఐ విచారిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబుకు నోటీసులు పంపించగా.. ఈరోజు(మంగళవారం) సీబీఐ ముందు హాజరుకానున్నారు సీఏ బుచ్చిబాబు. రాబిన్ డిస్టిలరీస్తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురికి చార్టర్డ్ అకౌంటెంట్గా పని చేశారు బుచ్చిబాబు. ఇప్పటికే ఢిల్లీలో ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు, సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్ను ఈడీ అరెస్ట్ చేసి విచారిస్తోంది. ఇదీ చదవండి: Delhi Liquor Scam: అభిషేక్ ఇచ్చిన సమాచారంతో అతడి విచారణ.. మరిన్ని అరెస్టులకు ఛాన్స్! -
AP Special: సానుభూతి వద్దు... సమాజంలో గౌరవం కావాలి
సమాజంలో మాకు తగిన గౌరవం కావాలి.. ఉద్యోగసానుభూతి వద్దు.. సమాజంలో ఉద్యోగ, వ్యాపార రంగంలో ప్రోత్సహకాలు ఇవ్వాలి.. లాక్డౌన్ కాలంలో ప్రభుత్వ పథకాలతో పూట గడుపుకుంటున్న శారీరక, మానసిక వైకల్యం ఉన్నవారూ సమాజంలో భాగస్వాములే. అందుకనే వీరిని ఇప్పుడు ‘వికలాంగులు’ అని కాకుండా ‘దివ్యాంగులు’ అని అంటున్నాం. ‘శారీరకంగా సవాలును ఎదుర్కొంటున్న వ్యక్తులు’ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, ‘మరోక విధంగా సామర్థ్యం ఉన్న వ్యక్తులు’ అని వీరికి పేర్లు. ఎవరైనా ఒక వ్యక్తి నలభై శాతానికి తక్కువ కాకుండా ఏదైన వైకల్యం కలిగి ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించినట్లయితే.. అలాంటి వ్యక్తిని అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా నిర్ధారిస్తారు. అంధత్వం ప్రతిభకు ఏమాత్రం ఆటంకం కాదని ఎందరో దివ్యాంగులు వివిధ రంగాల్లో రాణిస్తూ మరి కొందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. చిత్తూరు: తిరుపతి నగరానికి చెందిన సి.ఆర్.వి. ప్రభాకర్ విద్యారంగంలో సాధించిన తాను సాధించిన విజయానలకు అంగవైకల్యం ఏ మాత్రం ఆటంకం కాదని నిరూపించాడు. ఈయన తండ్రి సి. వెంకటేశ్వర శర్మ, తల్లి విద్యావతి. తండ్రి సి.వెంకటేశ్వర శర్మ.. టీటీడీలో సూపరింటెండెంట్గా పనిచేసి ప్రస్తుతం రిటైర్డు అయ్యారు. ఈ దంపతులకు ప్రభాకర్ రెండవ సంతానం. ప్రభాకర్.. గత 22 సంవత్సరాలుగా కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నారు. పుట్టుకతో వచ్చిన సమస్యను ఎప్పుడూ లోపంగా పరిగణించలేదు. కేవలం వీల్చైర్కే ఇతని జీవితం పరిమితమైనప్పటికీ ఎంతో కృషితో ఉన్నత చదువులు చదివారు. ఇటివల సీఏ(చార్టెర్డ్ అకౌంటెంట్) కోర్సును పూర్తిచేశారు. ప్రభుత్వం తనకు సహకారం అందిస్తే ఆత్మగౌరవంతో మరికొందరికి స్ఫూర్తి అవుతానని అభిప్రాయ పడ్డారు. అదే విధంగా.. వ్యాపార రంగంలో ప్రోత్సాహలు ఇవ్వాలని అన్నారు. మనదేశంలో అంగవైకల్య సమస్యకు సరైన మందులు, సర్జరీ సౌకర్యాలు లేవని అన్నారు. అమెరికా వంటి దేశంలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని అన్నారు. అయితే, రూ.15 కోట్ల ఖర్చు చేసిన అది తాత్కలిక వైద్యమే అన్నారు. తాను ఎంతో కష్టపడి సీఏ పూర్తి చేశానని అన్నారు. ఓ వ్యాపార సంస్థ ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నది తన జీవిత లక్ష్యమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు మరిన్నిసబ్సిడీతో కూడిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు,బ్యాంకు రుణాలు ఇవ్వాలని ప్రభాకర్ కోరాడు. తిరుత్తణి దేవ పెయింటర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పూట గడుపుతున్నాం.. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తినడానికి తిండి లేక ప్రాథమిక వైద్యం అందక అనేక ఇబ్బందులకు గురౌతున్నామని తిరుత్తణి దేవ అనే పెయింట్ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను గత 17 సంవత్సరాలుగా పెయింట్ చేస్తూ బతుకున్నానని తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలైన అమ్మఒడి, వికలాంగ పింఛను,వైఎస్సార్ ఆసరా, భరోసా వంటి పథకాల ద్వారా వ్యక్తిగతంగా లబ్ధి పొందినట్లు తెలిపారు. ఏపీ సీఎం జగన్ ఆశయం గొప్పదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక చిరు వ్యాపారాలు ప్రారంభించాలని , అనేకమార్లు ప్రయత్నించి విఫలమయ్యాయని వాపోయాడు. బ్యాంకు అధికారుల నుంచి ఎలాంటి సహకారం అందటం లేదని తెలిపారు. తనలాంటి దివ్యాంగులకు ఎలాంటి సిఫారసు లేకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని పెయింటర్ తిరుత్తణి దేవ కోరుతున్నాడు. -
చార్టెడ్ అకౌంటెంట్ సింధు మృతి పై పలు అనుమానం
-
చార్టర్డ్ అకౌంటెన్సీ, ఎంబీఏ.. ఏది బెటర్
జాబ్ మార్కెట్ వేగంగా మారిపోతోంది. కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్య కోర్సులను ఎంచుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)ల్లో.. ఏది బెటర్ అనే విషయంలో విద్యార్థులు త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ కోర్సులకున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని.. కొందరు చార్టర్డ్ అకౌంటెన్సీలో చేరుతుండగా.. మరికొందరు ఎంబీఏను ఎంచుకుంటున్నారు. సీఏ, ఎంబీఏల ప్రత్యేకతపై అవగాహన పెంచుకోవడం ద్వారా విద్యార్థులు తమకు నప్పే కోర్సులో చేరొచ్చు!! ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఉన్నత విద్య కోర్సులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రొఫెషనల్ కోర్సులకు జాబ్ మార్కెట్లో అధిక ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. సీఏ, ఎంబీఏ వంటి కోర్సులు పూర్తిచేసుకుంటే.. అవకాశాలకు కొదవలేదు. మేనేజ్మెంట్, అనాలసిస్, బిజినెస్ స్ట్రాటజీ పరిజ్ఞానంతో ఎంబీఏలు కార్పొరేట్ రంగంలో ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు. మరోవైపు సీఏ కోర్సుతో అకౌంటింగ్, ఫైనాన్స్ రంగాల్లో దూసుకుపోవచ్చు. సీఏ చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ కోర్సు. సీఏ కోర్సు ప్రధాన లక్ష్యం.. ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ విభాగాలకు అవసరమైన నిపుణులను అందించడం. మన దేశంలో ఈ కోర్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. సీఏ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి ప్రొషెషనల్ సీఏగా గుర్తింపు లభిస్తుంది. ఈ కోర్సులో చేరేందుకు కనీస అర్హత 10+2/ఇంటర్మీడియట్. ఇంటర్ తర్వాత.. ‘కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్’(సీపీటీ)కు హాజరు కావాలి. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ‘ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సు’ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.. సంక్షిప్తంగా ఎంబీఏ. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఐఐఎంలు వంటి ప్రముఖ బిజినెస్ స్కూల్స్లో ఎంబీఏ చేసినవారికి అవకాశాలు విస్తృతం. సైన్స్/హ్యూమానిటీస్/కామర్స్/ఇంజనీరింగ్.. ఇలా ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఎంబీఏలో చేరొచ్చు. డిగ్రీ తర్వాత క్యాట్/మ్యాట్/ఎక్స్ఏటీ వంటి జాతీయ స్థాయి ఎంట్రన్స్ టెస్ట్లు; ఐసెట్ వంటి రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది. ఎంబీఏ కోర్సు ప్రధాన లక్ష్యం.. కంపెనీలు, వ్యాపారాల నిర్వహణకు అవసరమైన మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మొదలైన విభిన్న నైపుణ్యాలు అందించడం. కోర్సుల వ్యవధి సీఏ కోర్సులో..ఇంటర్మీడియట్ అర్హతతో చేరి.. నాలుగేళ్లలో పూర్తిచేసుకోవచ్చు. ఇందులో సీపీటీ, ఐపీసీసీ, సీఏ ఫైనల్ ఉంటాయి. ఎంబీఏ కోర్సు వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లుగా ఉంటుంది. సీఏతో కెరీర్ సీఏ ఉత్తీర్ణులైన వారికి ఆడిటర్, ఫైనాన్స్ మేనేజర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. సీఏ కోర్సు పూర్తి చేసినవారు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీల్లో అవకాశాలు అందుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేసే అవకాశం సైతం ఉంటుంది. ఆడిటింగ్ ఫర్మ్స్, ట్యాక్సేషన్, మేనేజింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, కార్పొరేట్ లా కంపెనీల్లో కొలువుతోపాటు సీఏగా సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు. ఎంబీఏతో ఉద్యోగాలు ఎంబీఏ చేసిన అభ్యర్థులకు వివిధ కార్పొరేట్ కంపెనీల్లో మేనేజర్స్, టీమ్ లీడర్స్, హెచ్ఆర్ హెడ్ వంటి కొలువులు లభిస్తాయి. పేరున్న బీస్కూల్స్లో ఎంబీఏ ఉత్తీర్ణులైన వారికి దేశ విదేశాల్లో కార్పొరేట్ రంగంలో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మార్కెటింగ్ మేనేజర్/కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్, హెచ్ఆర్ మేనేజర్, ఐటీ/ఆపరేషన్స్ మేనేజర్, అనలిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్తోపాటు మరెన్నో విభాగాల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. నైపుణ్యాలు ► చార్టర్డ్ అకౌంటెంట్గా రాణించాలంటే.. అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్పై పట్టు అవసరం. దీంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండాలి. ► ఎంబీఏలకు నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, టైమ్ మేనేజ్మెంట్, బిజినెస్ స్కిల్స్ తప్పనిసరి. దేనికదే ప్రత్యేకం ► వాస్తవానికి సీఎ, ఎంబీఏ దేనికదే ప్రత్యేకమైనవి. కాని ఎక్కువ మంది ఈ రెండు కోర్సులను పోలుస్తుంటారు. ఏ కోర్సుతో మంచి అవకాశాలు లాభిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. సీఏ.. అకౌంటెన్సీకి సంబంధించిన కోర్సు. కాగా, ఎంబీఏ వ్యాపార నిర్వహణ విభాగానికి చెందిన ప్రోగ్రామ్. ఎంబీఏలో.. హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి పలు స్పెషలైజేషన్స్ ఎంచుకోవచ్చు. డ్యూయల్ స్పెషలైజేషన్స్ చేసే అవకాశం కూడా ఉంది. ► ఎంబీఏతో పోలిస్తే సీఏ కోర్సు పూర్తిచేసుకునేందుకు అయ్యే ఖర్చు తక్కువ. కాని సీఏ కోర్సు కొంత కఠినమైందనే అభిప్రాయం ఉంది. ఒకసారి ఎంబీఏలో చేరితే.. రెండేళ్లు పూర్తయ్యేసరికి పట్టా చేతికొస్తుంది. కాని సీఏ కోర్సులో చేరే విద్యార్థుల్లో మూడు నుంచి ఐదు శాతం మంది మాత్రమే నిర్దిష్ట సమయంలోపు కోర్సు ఉత్తీర్ణులవుతున్నారు. ► ఎంబీఏను.. ఐఐఎంలు, ఐఎస్బీ తదితర టాప్ బీ స్కూల్స్లో పూర్తిచేయాలంటే.. చాలా వ్యయం అవుతుంది. రూ.లక్షల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సులో చేరినవారిలో దాదాపు 80 శాతం మంది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. టాప్ బీ స్కూల్స్లో ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే ఆకర్షణీయ వేతనాలతో కొలువులు ఖాయం అవుతున్నాయి. -
టీమిండియాకు క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు
సిడ్నీ: ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెట్పై చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. శనివారం మూడో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు బుమ్రా, సిరాజ్లపై స్టేడియంలోని ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఆసీస్ అభిమానులు ప్రత్యేకంగా సిరాజ్ను ఉద్దేశించి మంకీ అని సంబోధించారు. దీనిపై మ్యాచ్ అంపైర్లకు కెప్టెన్ రహానేతో పాటు సిరాజ్లు ఫిర్యాదు. ఈ క్రమంలోనే నిన్న మూడో రోజు ఆటకు అంతరాయం ఏర్పడింది. (టీమిండియాకు భారీ టార్గెట్) ఎవరైతే జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారో వారిని పోలీసులు బయటకు పంపారు. ఈ ఘటనకు కారణమైన ఆరుగుర్ని మ్యాచ్ చూసే అనుమతి క్యాన్సిల్ చేస్తూ బయటకు పంపించేశారు. వారంతా మద్యం సేవించే భారత క్రికెటర్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. దీనిపై టీమిండియాకు క్రికెట్ ఆలియా(సీఏ) క్షమాపణలు తెలిపింది. మరొకవైపు దీనికి సంబంధించి మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్కు బీసీసీఐ అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఇదొక జంటిల్ మ్యాన్ గేమ్ అని, ఇక్కడ జాతి వివక్ష వ్యాఖ్యలకు చోటు లేదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. దీనిపై సీఏ సీరియస్గా దృష్టి పెట్టాలని ఆయన కోరారు. మరో రెండు వారాల్లో దీనిపై సీఏ విచారణ చేపట్టనుంది. ఇది పూర్తిగా ఆతిథ్యం దేశం బాధ్యత కాబట్టి సీఏనే విచారణ జరుపనుంది. ఇదిలా ఉంచితే, టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా 407 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. నాల్గో రోజు ఆటలో భాగంగా తమ రెండో ఇన్నింగ్స్ను ఆసీస్ 312/6 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 400లకు పైగా టార్గెట్ను టీమిండియా ముందుంచింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో లబూషేన్(73), స్టీవ్ స్మిత్(81), కామెరూన్ గ్రీన్(84)లు రాణించడంతో పాటు కెప్టెన్ టిమ్ పైన్(39 నాటౌట్) ఆకట్టుకోవడంతో ఆసీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. -
‘బీసీసీఐ మైండ్ గేమ్ ఆడుతోంది’
సిడ్నీ: సమయం దొరికినప్పుడల్లా భారత క్రికెట్ కంట్రలో బోర్డు(బీసీసీఐ)పై విరుచుకుపడే ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్.. మరొకసారి ధ్వజమెత్తాడు. గతంలో ఐపీఎల్ కంటే టీ20 వరల్డ్కప్కే తన తొలి ప్రాధాన్యత అని బీసీసీఐ వైఖరిని తప్పుబట్టిన బోర్డర్.. ఈసారి టీమిండియా మైండ్గేమ్ ఆడుతోందని విమర్శించాడు. ఎప్పట్నుంచో తమ సాంప్రదాయంగా నిర్వహిస్తున్న న్యూఇయర్ టెస్టు మ్యాచ్ విషయంలో మార్పులు చేయాలని బీసీసీఐ.. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)ను కోరడంపై మండిపడ్డాడు. ఇది సరైన వైఖరి కాదంటూ బీసీసీఐ తీరును తప్పుబట్టాడు. ఇక్కడ బీసీసీఐ మైండ్ గేమ్కు తెరలేపిందన్నాడు.ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ మార్చి నెలలో దక్షిణాఫ్రికాతో సిరీస్ను కోవిడ్-19 కారణంగా రద్దు చేసుకున్న టీమిండియాకు ఆ తర్వాత ఇదే అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్. (చదవండి: అతను చాలా డేంజరస్ ప్లేయర్: సచిన్) ఈ నెలలో టీ20 వరల్డ్కప్ ఆరంభం కావాల్సిన ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఆ ప్లేస్లో ఐపీఎల్ను నిర్వహిస్తోంది బీసీసీఐ. ఇప్పుడు ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆసీస్తో జనవరి 3వ తేదీ నుంచి ఆరంభం కావాల్సి ఉన్న న్యూఇయర్ టెస్టు మరింత వెనక్కి జరపాలని బీసీసీఐ కోరింది. జనవరి 7వ తేదీ నుంచి ఆ టెస్టును నిర్వహించాలని బీసీసీఐ తన విజ్ఞప్తిలో పేర్కొంది అయితే దీనిపై బోర్డర్ విరుచుకుపడ్డాడు. ఒక పర్యటనకు ముందు బీసీసీఐ ఇలా కోరడం మైండ్ గేమ్ కాకపోతే ఏంటని ప్రశ్నించాడు. బాక్సింగ్ డే టెస్టు, న్యూ ఇయర్ టెస్టు అనేది తమకు ఎప్పట్నుంచో వస్తున్న సాంప్రదాయమని గుర్తు చేశాడు. మరి న్యూఇయర్ టెస్టును రీ షెడ్యూల్ చేయాలని కోరడం వెనక కారణం ఏమిటని నిలదీశాడు. తమ దేశానికి పర్యటనకు వచ్చే ముందు ఇలా మైండ్ గేమ్ ఆడతారా అంటూ బీసీసీఐని విమర్శించాడు. వరల్డ్ క్రికెట్లో తాము శక్తివంతులమని బీసీసీఐ భావిస్తోందని, ఆర్థికంగా బలంగా ఉన్నా విషయాల్లో కచ్చితత్వం అనేది అవసరమని బోర్డర్ పేర్కొన్నాడు. నవంబర్ చివరి వారంలో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. డిసెంబర్-3వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది.(చదవండి: డైలమాలో సన్రైజర్స్!) -
‘టి20 ప్రపంచకప్’ ఆసీస్ చేతిలోనే ఉంది: సచిన్
న్యూఢిల్లీ: షెడ్యూల్ ప్రకారం అక్టోబర్లో టి20 ప్రపంచకప్ నిర్వహించాలా? వద్దా? అనేది క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)నే నిర్ణయిస్తుందని భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఐసీసీ కూడా ఇంకా ఈ అంశంపై స్పందించాల్సి ఉందని పేర్కొన్నాడు. ‘టి20 ప్రపంచకప్ నిర్వహణ అనేది క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఆర్థిక వ్యవహారాలతో పాటు పలు అంశాలు దీనితో ముడిపడి ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నీ ఏకమై టోర్నీ నిర్వహణకు దోహదపడతాయేమో చూడాలి. ఇది కఠిన నిర్ణయమే కానీ క్రికెట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది పెద్ద సమస్య కాబోదు’ అని టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. -
రిస్క్ చేద్దామా.. వద్దా?
ముంబై: ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగాల్సిన టీ20 వరల్డ్కప్ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనిపై ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా డైలమాలో పడింది. నిర్ణీత షెడ్యూల్లో వరల్డ్కప్ జరపడం కష్టమనే భావనకు సీఏ వచ్చేసింది. గురువారం ద్వైపాక్షిక సిరీస్లకు షెడ్యూల్ ప్రకటించిన సీఏ.. కనీసం టీ20 వరల్డ్కప్ ప్రస్తావనను ఎక్కడా తీసుకురాలేదు. ఆగస్టు నెల నుంచి ఫిబ్రవరి వరకూ జరుగనున్న 2020–21 హోమ్ సీజన్ షెడ్యూల్ను మాత్రమే ప్రకటించింది. వరల్డ్కప్ గురించి అసలు పట్టించుకోలేదు. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో వరల్డ్కప్ నిర్వహించడం సవాల్ కూడకున్న పని అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్ రాబర్ట్స్ పేర్కొన్నాడు. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో వరల్డ్కప్ నిర్వహణ అనేది అతి పెద్ద రిస్క్ మనసులో మాటను బయటపెట్టాడు.(ప్రపంచకప్ ప్రస్తావన లేకుండానే...) ‘అక్టోబర్-నవంబర్ నాటికి పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆశిద్దాం. కానీ పరిస్థితులు ఎంత అదుపులోకి వచ్చినా ఒక మెగా ఈవెంట్ను నిర్వహించడం కత్తిమీద సామే. ఒకవేళ ముందస్తు షెడ్యూల్ ప్రకారం వరల్డ్కప్ జరగకపోతే ఫిబ్రవరి-మార్చి విండోలో అది జరపడానికి కసరత్తులు చేయాల్సి ఉంటుంది’ అని రాబర్ట్స్ అన్నారు. ఇది ఐసీసీ తీసుకునే తుది నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నారు. ఇక గురువారం ఐసీసీ నిర్వహించిన సమావేశంలో కూడా వరల్డ్కప్పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వరల్డ్కప్ నిర్వహణపై నిర్ణయాన్ని జూన్ 10వ తేదీన జరిగే తదుపరి సమావేశానికి వాయిదా వేసింది. జరిగితే ఆశ్చర్చ పడాల్సిందే.. షెడ్యూల్ ప్రకారం టి20 ప్రపంచ కప్ జరగడం సందేహమేనని ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అభిప్రాయ పడ్డాడు. కోవిడ్–19 నేపథ్యంలో 16 జట్లతో మెగా టోర్నీ నిర్వహించడం అసాధ్యమని అతను అన్నాడు. ‘నిజంగా షెడ్యూల్ ప్రకారం జరిగితే మనమంతా ఆశ్చర్యపడాల్సిందే. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం కరోనా సమస్య తక్కువగా, నియంత్రణలోనే ఉందనేది వాస్తవం. అయితే ఒక చిన్న పొరపాటు కూడా ఎంతో ప్రమాదకరంగా మారిపోవచ్చు’ అని పేర్కొన్నాడు. మరి వరల్డ్కప్పై రిస్క్ చేసి షెడ్యూల్ ప్రకారం ముందుకెళతారా.. లేదా అనే మరి కొన్ని రోజులు తేలిపోనుంది. (‘భారత్ ఓడిపోతుందని అనలేదు’) -
ఆసీస్ క్రికెటర్లు.. ఇవి పాటించాల్సిందే!
సిడ్నీ: కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా పలు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని భావిస్తోంది. ఆస్ట్రేలియాలో క్రికెట్ అత్యంత ఆదరణ క్రీడ కావడంతో పలు చర్యలకు శ్రీకారం చుట్టింది. క్రికెట్ కార్యకలాపాలు పునరుద్ధించబడ్డాక లాలాజలం(సలైవా), స్వీట్ పదార్థాలను బంతిపై మెరుపు కోసం ఉపయోగించుకుండా ఉండాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే దీనికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) బంతిని షైన్ చేయడానికి సలైవాను నిషేధించాలనే కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. అదే సమయంలో అంపైర్ల సమక్షంలో ‘ట్యాంపరింగ్’కు అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందుగా తమ ప్రణాళికలను సిద్ధం చేసింది. సలైవాపై ఐసీసీ నిషేధం విధించినా, విధించకపోయినా తమ క్రికెట్ జట్టు మాత్రం అందుకు దూరంగా ఉండాలనే మార్గదర్శకాలను సిద్ధం చేసింది. (మార్చాల్సిన అవసరం ఏమిటి?: వార్నర్) ఈ మేరకు ఆస్ట్రేలియా సమాఖ్య ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా సంక్షోభం ముగిసి క్రికెట్ ఆరంభమైన తర్వాత ఇవి కచ్చితంగా పాటించాలనే నిబంధనను ప్రవేశపెట్టింది. ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్(ఏఐఎస్).. వైద్యరంగ నిపుణులతో పాటు క్రీడా సంఘాలు, ప్రభుత్వంతో చర్చించి కొన్ని నిబంధనలు సూచించింది. ఇందులో ఏ,బీ,సీలుగా మూడు కేటగిరీలను పొందు పరిచింది. లెవల్-ఎలో వ్యక్తిగత ప్రాక్టీస్ను మినహాయించి అన్ని రకాల ప్రాక్టీస్లకు దూరంగా ఉండాలని పేర్కొంది. లెవల్-బిలో నెట్ ప్రాక్టీస్లో బ్యాటర్స్ బౌలర్లను ఎదుర్కోనే క్రమంలో బౌలర్లు పరిమితంగా ఉండాలని తెలిపింది. వ్యక్తికి వ్యక్తికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో వార్మప్ డ్రిల్స్కు దూరంగా ఉండాలని పేర్కొంది. (‘బాల్ టాంపరింగ్ చేసుకోవచ్చు’) ఇక లెవల్-సిలో భాగంగా పూర్తి స్థాయి ట్రైనింగ్, కాంపిటేషన్కు సిద్ధమయ్యే క్రమంలో బంతిని సలైవాతో రుద్దకూడదనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని తెలిపింది.ఎవరైనా ఆటలోకి పునరాగమనం చేయాలంటే 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఆపై ఏ ఆటగాడైనా అనారోగ్యానికి గురైతే పునరావాస శిబిరంలోకి తరలించాలని తెలిపింది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఐసోలేషన్లోకి వెళ్లాలని పేర్కొంది. ట్రైనింగ్ సెషన్స్లో కూడా ఆటగాళ్లు అన్ని నిబంధలను అమలు చేయాలని తెలిపింది. కరోనా సోకి కోలుకున్న సదరు అథ్లెట్కు ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని స్పష్టం చేసింది. -
లబ్షేన్కు సీఏ కాంట్రాక్టు
మెల్బోర్న్: ఆసీస్ జట్టులో ఇటీవల నిలకడగా రాణిస్తున్న లబ్షేన్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సెంట్రల్ కాంట్రాక్టు కట్టబెట్టింది. అయితే స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ గైర్హాజరీలో కంగారూ జట్టును ఆదుకున్న ఉస్మాన్ ఖాజాకు సీఏ షాకిచ్చింది. 2020–21 సీజన్కుగానూ గురువారం ప్రకటించిన కాంట్రాక్టు జాబితా నుంచి అతన్ని తప్పించింది. గతేడాది యాషెస్ సిరీస్ నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని ఖాజాతో పాటు మార్కస్ హారిస్, నాథన్ కూల్టర్నీల్, పీటర్ హ్యాండ్స్కోంబ్, షాన్ మార్‡్ష, మార్కస్ స్టొయినిస్ తమ కాంట్రాక్టులు కోల్పోయారు. వీరి స్థానంలో బర్న్స్, లబ్షేన్, మాథ్యూ వేడ్, ఆల్రౌండర్ మిచెల్ మార్‡్ష, పేసర్ కేన్ రిచర్డ్సన్, స్పిన్నర్ ఆస్టన్ అగర్ సెంట్రల్ కాంట్రాక్టులు పొందారు. సీఏ ప్రకటించిన జాబితాలో మొత్తం 20 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. గతేడాది అక్టోబర్లో చివరి టి20 ఆడిన మ్యాక్స్వెల్ను జాబితాలో కొనసాగించారు. -
టాప్ ఆర్డర్ ఆటగాడికి నో చాన్స్
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించిన ఆటగాళ్ల తాజా కాంట్రాక్ట్ జాబితాలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఆసీస్ టాపార్డర్ బ్యాట్స్మన్ ఉస్మాన్ ఖవాజాను కాంట్రాక్ట్ జాబితా నుంచి సీఏ తొలగించింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఆస్ట్రేలియా టెస్టు జట్టులో చోటు కోల్పోయిన ఖవాజాకు కాంట్రాక్ట్ జాబితాలో చోటివ్వలేదు. గత జాబితాలో ఉన్న ఖవాజను కొత్త జాబితా నుంచి తప్పించడం ఆసక్తికరంగా మారింది. ఖవాజాతో పాటు పీటర్ హ్యాండ్స్కోంబ్, మార్కస్ హారిస్, షాన్ మార్ష్, నాథన్ కౌల్టర్ నైల్, మార్కస్ స్టోయినిస్లను తప్పించింది.( అక్తర్పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు) వీరిలో ఖవాజా, షాన్ మార్ష్ కాంట్రాక్ట్లను కొనసాగించకపోవడం చర్చనీయాంశమైంది. ఇక వారి స్థానాల్లో మార్కస్ లబూషేన్, ఆస్టన్ ఆగర్, మిచెల్ మార్ష్, కేన్ రిచర్డ్సన్, మాథ్యూ వేడ్లకు అవకాశం ఇచ్చింది. గతంలో ఆయా ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా 12 అప్గ్రేడ్ పాయింట్లను(మూడు ఫార్మాట్లకు కలిపి) కేటాయించిన సీఏ.. తాజాగా దానిని 8 అప్గ్రేడ్ పాయింట్లకే పరిమితం చేసింది. ఒక్కో టెస్టు మ్యాచ్కు 5 పాయింట్లు, వన్డేకు రెండు పాయింట్లు, టీ20కి ఒక్కో పాయింట్ చొప్పున కేటాయించి ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాను రూపొందించింది. ఈ మేరకు 20 మందితో కూడిన కొత్త జాబితాను ప్రకటించింది. (హిట్మ్యాన్కు స్పెషల్ డే..!) క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ జాబితా ఇదే.. ఆస్టన్ ఆగర్, జో బర్న్స్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, అరోన్ ఫించ్, జోష్ హజల్వుడ్, ట్రావిస్ హెడ్, లబూషేన్, నాథన్ లయాన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, టిమ్ పైన్, జేమ్స్ పాటిన్సన్, జహీ రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా -
ఆసీస్ వన్డే కెప్టెన్గా ధోని..
మెల్బోర్న్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. అది కూడా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ధోనికి సముచిత స్థానాన్ని కట్టబెట్టింది. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ఇచ్చే గౌరవంలో భాగంగా ఈ దశాబ్దపు ఆసీస్ వన్డే జట్టు కెప్టెన్గా ధోనిని ఎంపిక చేసింది. ఇక ధోనితో పాటు మరో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు సైతం చోటు సీఏ తమ దశాబ్దపు వన్డే జట్టులో చోటు కల్పించింది. కాగా, ఈ వన్డే జట్టులో ఒకే ఒక్క ఆసీస్ క్రికెటర్ను సీఏ తీసుకుంది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మిచెల్ స్టార్క్కు మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా చోటు ఇచ్చింది. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లున్న సీఏ వన్డే జట్టులో దక్షిణాఫ్రికా క్రికెటర్లు హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్లు ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి షకీబుల్ హసన్ ఉండగా, ఇంగ్లండ్ నుంచి జోస్ బట్లర్కు చోటు కల్పించింది. న్యూజిలాండ్ నుంచి ట్రెంట్ బౌల్ట్, అఫ్గానిస్తాన్ నుంచి రషీద్ ఖాన్లు న్నారు. శ్రీలంక నుంచి లసిత్ మలింగా చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంచితే. సీఏ ప్రకటించిన తమ దశాబ్దపు టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని ఎంపిక చేసింది. ఈ టెస్టు జట్టులో భారత్ నుంచి కోహ్లికి మాత్రమే చోటు దక్కింది. దశాబ్దపు సీఏ వన్డే జట్టు ఇదే.. ఎంఎస్ ధోని(కెప్టెన్-వికెట్ కీపర్), రోహిత్ శర్మ, హషీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, షకీబుల్ హసన్, జోస్ బట్లర్, రషీద్ ఖాన్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగా దశాబ్దపు సీఏ టెస్టు జట్టు ఇదే.. విరాట్ కోహ్లి(కెప్టెన్), అలెస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్) బెన్ స్టోక్స్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, నాథన్ లయన్, జేమ్స్ అండర్సన్ -
షేన్ వాట్సన్కు కీలక పదవి
మెల్బోర్న్: ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్కు కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్(ఏసీఏ) హెడ్గా వాట్సన్ నియమించారు. ఈ మేరకు వాట్సన్ను ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నియమిస్తూ సోమవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో నిర్ణయం తీసుకున్నారు. ఆసీస్ తరఫున ఆడిన సమయంలో తనదైన మార్కుతో ఎన్నో విజయాల్లో ముఖ్య భూమిక పోషించిన వాట్సన్పై నమ్మకం ఉంచి ఏజీఎం సభ్యులు.. సరికొత్త బాధ్యతను కట్టబెట్టారు. దాంతో షేన్ వాట్సన్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభం కానుంది. దీనిపై వాట్సన్ మాట్లాడుతూ..‘ ఇది నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవం. దాంతో పాటు ఇదొక పెద్ద బాధ్యత కూడా. ఆసీస్ క్రికెటర్ల నమ్మకాన్ని మరోసారి చూరగొంటా. నాకు ఆస్ట్రేలియా క్రికెట్ ఏమైతే ఇచ్చిందో దాన్ని తిరిగి ఈ రూపంలో తీర్చుకోవడానికి మంచి అవకాశం’ అని వాట్సన్ పేర్కొన్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్లో 59 టెస్టులు ఆడిన వాట్సన్, 190 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు విశేషమైన సేవలందించాడు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్ బోర్డులోని సభ్యులను 10 మందికి పెంచుతూ ఏజీఎం నిర్ణయం తీసుకుంది. ఇందులో మూడు కొత్త ముఖాలకు తొలిసారి అవకాశం కల్పించారు. -
‘బౌండరీ రూల్’ను సీఏ మార్చేసింది..
సిడ్నీ: వన్డే వరల్డ్కప్లో భాగంగా ఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్ను విశ్వ విజేతగా ప్రకటించడంతో ఐసీసీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ ఓవర్లో పరుగులు కూడా సమం అయిన పక్షంలో బౌండరీల లెక్కింపుతో ఇంగ్లండ్ విజేతగా నిర్ణయించారు. ఒక వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ బౌండరీ కౌంట్ రూల్ ఆధారంగా విజేతను నిర్ణయించడమనేది ఇదే తొలిసారి కూడా. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అవలంభిస్తున్న ఈ రూల్పై వచ్చే ఏడాది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ‘బౌండరీ రూల్’ స్థానంలో మరిన్ని ఓవర్ల మ్యాచ్ జరపాలనే యోచనలో ఐసీసీ ఉంది. కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)ముందుగానే బౌండరీ రూల్ను మార్చేసింది. దీనిని ఆస్ట్రేలియాలో నిర్వహించే ప్రతిష్టాత్మక బిగ్బాష్ లీగ్(బీబీఎల్) తాజా సీజన్ నుంచి అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. 2019-20 సీజన్లో జరుగనున్న బీబీఎల్లో బౌండరీ కౌంట్ రూల్ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఒక వేళ ఫైనల్ మ్యాచ్లో విజేతను తేల్చేక్రమంలో ఆ మ్యాచ్ టైగా ముగిస్తే ముందుగా సూపర్ ఓవర్ను వేయిస్తుంది. అది కూడా టైగా ముగిసిన నేపథ్యంలో మరికొన్ని సూపర్ ఓవర్ల ద్వారానే విజేతను నిర్ణయిస్తారు. ఇక్కడ పూర్తి స్పష్టత వచ్చే వరకూ సూపర్ ఓవర్లను కొనసాగించాలనే ప్రయోగానికి సిద్ధమైంది. దీన్ని పురుషుల బీబీఎల్తో పాటు మహిళల బీబీఎల్లో కూడా కొనసాగించనున్నట్లు ఆ లీగ్ చీఫ్ అలిస్టర్ డాబ్సన్ తెలిపారు. ‘ ఐసీసీ వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత బౌండరీ కౌంట్ రూల్పై పెద్ద దుమారమే నడిచింది. దాంతో పలు సూపర్ ఓవర్ల విధానాన్ని తీసుకు రావాలని భావిస్తున్నాం. ఇది సక్సెస్ అవుతుందనే ఆశిస్తున్నాం’ అని డాబ్సన్ పేర్కొన్నారు. -
విద్యాసంస్థలు లాభ రహిత విద్యనందించాలి
సాక్షి, విజయవాడ: ప్రైవేటు,కార్పొరేట్ సంస్థలు లాభ రహితంగా విద్యనందించాలన్నదే ప్రభుత్వ విధానమని రాష్ట్ర్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం ఏపీ ఛార్టెట్ అకౌంటెంట్ల రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఛార్టెట్ అకౌంటెన్సీ అద్భుతమైన వృత్తి అని.. సీఏ చేస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. సీఏ కోర్సును ఎక్కువ మంది విద్యార్థులు అభ్యసించేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సీఏకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యాసంస్థల్లో కామర్స్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఏ కోర్సు ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహణకు సహకారం అందిస్తామని చెప్పారు. -
పసలేని ఎన్నికల పండుగ
అచ్చంపేట: ఎన్నికలంటే ఓ పండగ లెక్క! దాదాపు ఇరవై రోజులపాటు నిత్యం నాయకుల మాటల పోరు.. ర్యాలీలూ.. సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభా ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది. అంతెందుకు నిన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదేజోరు సాగింది. కానీ, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రచార హోరు కనిపించకపోగా.. మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో ఈ హుషారు కనిపిస్తున్నా.. ఊళ్లో మాత్ర పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చప్పుడే లేకుండాపోయింది. కొన్నిచోట్ల మాత్రం అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు ప్రధాన అనుచరులు మరీ రాలేదనకుండా గ్రాయిల్లో ప్రచారం చేసి వస్తున్నారు. కనిపించని ఉత్సాహం గ్రామాల్లోనే కాదు.. స్థానిక నేతల్లో కూడా పెద్దగా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. ప్రధానంగా పోటీ పడుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లోనూ ఇదే స్తబ్ధత నెలకొంది. ఏ ఎన్నికలు వచ్చినా.. అభ్యర్థులు లేదా ప్రజాప్రతినిధులు మండలాలు, గ్రామాల వారీగా తమ నాయక గణానికి బాధ్యతలు అప్పగిస్తుంటారు. ప్రచార బాధ్యతలు వారే చూసుకోవాల్సి ఉంటుంది. వారిపై మరికొందరు సమన్వయం చేస్తుంటారు. కానీ ఎంపీ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ప్రచార బాధ్యతలను ఇప్పటికీ నాయకులకు అప్పగించలేదు. అభ్యర్థులకు వెన్నుదన్నుగా ఉండే అనుచరులతోపాటు ఆయా పార్టీల సర్పంచ్లు కూడా గ్రామాల్లో సందడి చేయడం లేదు. బయటకు వెళ్తే ఎక్కడ ఖర్చుల భారం మీద పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వెళ్లినా మైకుల హోరు.. ర్యాలీలు నిర్వహించడం లేదు. సాదాసీదాగా వెళ్లి గ్రామస్తులతో సమావేశం మాత్రమే నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ప్రచారం ‘మమ’ అనిపిస్తున్నారన్నమాట. అప్పుడే మస్తుగుండే.. ‘ఎంపీ ఎన్నికలంటున్నరు.. మరీ మందూ లేదు.. విందూ లేదా..’ అని చాలామంది నాయకులకు మందుబాబుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పల్లెల్లో నాయకులు ప్రచారం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఇది కూడా కారణంగా మారుతోంది. శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లో మద్యం జోరుగా సరఫరా కావడంతో.. మందుబాబులందరికీ ప్రచారం జరిగినన్ని రోజుల పండగలా సాగింది. స్థానికంగా బాధ్యతలు తీసుకున్న నాయకులు ఇంటికొచ్చి మరీ.. మద్యం సీసాలను మందుబాబులకు అప్పగించి వెళ్లారని సమాచారం.! ఇప్పడేమె అంతా స్తబ్ధుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు ఊళ్లలో ప్రచారం చేయాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ప్రచారం చేసేందుకు వెళ్లకున్నా.. పైనుంచి డబ్బులు వచ్చినా ఖర్చు పెడతలేడు.. అన్న అపవాదూ వస్తోందని వాపోతున్నారు. ఐదు రోజులే మిగిలింది.. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ఐదురోజులే మిగిలింది. ఈ నెల 11న జరగనున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రచారాన్ని ఈ నెల 9 వరకు మాత్రమే చేయాల్సి ఉంది. ఇప్పటి దాకా పల్లెల్లోకి అభ్యర్థులే ప్రచారానికి రాలేదు. కేవలం పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాలు, మేజర్ మండల కేంద్రాల వరకే తమ ప్రచారాన్ని పరిమితం చేస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రమే మేజర్ ఓట్లు ఉన్న గ్రామాల్లో కార్యకర్తలు, గ్రామస్తులు నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నా.. అందాల్సినవి అందకపోవడం వల్లే ప్రచారం మాగబోయిందనే చర్చ గ్రామాల్లో వినిపిస్తోంది. సంఘాల వారీగా.. అభ్యర్థులు శాసనసభా ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే లోక్సభ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీల నాయకులు గ్రామాల్లో కుల సంఘాల వారీగా కలుస్తున్నారు. కులం ఓట్లు గంపగుత్తగా తమకే వేసేలా వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుల సంఘాల నాయకులకు వారు కోరిన కోర్కెలకు హామీలు ఇస్తున్నారు. తాము గెలవగానే మీ హామీలను పూర్తి చేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. పార్లమెంట్ స్థానం పరిధి పెద్దగా ఉండటంతో అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. ఇక అభ్యర్థులు, పార్టీలు ఆర్థికంగా తోడ్పాటునందిస్తేనే స్థానిక నాయకులు ప్రచారానికి ముందడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. -
కన్నారంపై కమలనాథుల గురి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మోదీ మంత్రంతో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కమలనాథులు కరీంనగర్ స్థానంపై కూడా కన్నేశారు. గతంలో రెండుసార్లు విజయం సాధించిన కరీంనగర్ లోక్సభ స్థానంలో ఈసారి గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని ఆ పార్టీ భావిస్తోంది. హిందుత్వ ఎజెండాతో గత కొన్నేళ్లుగా కరీంనగర్లో కార్యకలాపాలు సాగిస్తున్న బండి సంజయ్కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కరీంనగర్లో టీఆర్ఎస్తో నువ్వా, నేనా అన్నట్టుగా సాగిన పోరులో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో రెండోస్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లే ప్రాతిపదికగా లోక్సభ అభ్యర్థులను బరిలోకి దింపిన బీజేపీ కరీంనగర్ నుంచి బండి సంజయ్ను పోటీ చేయిస్తోంది. వారం రోజులుగా లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారాన్ని ముమ్మరం చేయగా.. యువత నుంచి ఆశించిన స్పందన లభిస్తుండడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కరీంనగర్లో ప్రచార సభలో పాల్గొనేందుకు వస్తుండడం ఆ పార్టీకి కొత్త ఊపును తీసుకొస్తుందని భావిస్తున్నారు. మైనార్టీ వర్గాలు పెద్దసంఖ్యలో నివసించే కరీంనగర్లో హిందుత్వ ఎజెండాతో పాటు కేంద్రం ద్వారా విడుదలవుతున్న నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపైనే అమిత్షా ప్రసంగం సాగుతుందని సమాచారం. రెండుసార్లు గెలిచిన బీజేపీ కరీంనగర్ లోక్సభ స్థానంలో బీజేపీకి రెండుసార్లు విజయం సాధించిన చరిత్ర ఉంది. 1998 పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు లేకుండా ఒంటరిగా కరీంనగర్ నుంచి పోటీ చేసిన చెన్నమనేని విద్యాసాగర్ రావు 95వేల మెజార్టీతో టీడీపీ ప్రత్యర్థి రమణపై విజయం సాధించారు. ఇక 1999 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన విద్యాసాగర్రావు సుమారు 20వేల ఓట్లతో చల్మెడ ఆనందరావుపై గెలుపొందారు. అలాగే, 2004లో కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో ఆయన చేతిలో పరాజయం పాలైన విద్యాసాగర్ రావు తిరిగి విజయం సాధించలేదు. తెలంగాణ ఉద్యమం తర్వాత పరిణామాల నేపథ్యంలో మూడో స్థానానికి పడిపోయిన బీజేపీ గ్రాఫ్ ఈసారి పెరుగుతుందని, పూర్వ వైభవం సాధించవచ్చని భావిస్తోంది. కరీంనగర్ మినహా మిగతా ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాయకత్వ లోపంతో బాధపడుతున్న బీజేపీ పూర్తిగా యువతనే నమ్ముకుని ప్రచారం సాగిస్తోంది. అమిత్షా రాకతో పార్టీ కేడర్లో కొత్త ఊపు రావడంతో పాటు పార్టీపై ప్రజల్లో కూడా ఆసక్తి పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అమిత్షా పర్యటన తర్వాత ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని గ్రామాల్లో సైతం బలం పుంజుకుంటామని సంజయ్ ధీమాతో ఉన్నారు. సభకు ఏర్పాట్లు పూర్తి బీజేపీ చీఫ్ అమిత్షా పాల్గొనే బహిరంగసభ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరగనుంది. ఉదయం 9 గంటలకే అమిత్షా వస్తారని ప్రచారం చేస్తున్నప్పటికీ, 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ మేరకు వేదికతో పాటు ఇతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు హాజరైన వారికి ఎండ వేడి తగలకుండా విశాలమైన స్థలంలో పైకప్పుతో కూడిన షెడ్డు తరహా నిర్మాణం పూర్తి చేశారు. హైసెక్యూరిటీ రక్షణలో ఉండే అమిత్షా సభ కోసం ముందస్తుగానే వీఐపీలకు, మీడియాకు పాస్లు జారీ చేశారు. అలాగే, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పార్టీ అభ్యర్థి బండి సంజయ్తో పాటు పలువురు రాష్ట్ర నాయకులు బుధవారం మైదానాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమిత్ షా సభను విజయవంతం చేయండి కరీంనగర్ ఎస్సారార్ కళాశాల అమిత్షా విజయ సంకల్ప సభ ను జయప్రదం చేయాలని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం ఎస్సారార్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర నాయకులు పరిశీలించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, కరీంనగర్ లోక్సభ ఇంచార్జీ కామర్స్ బాల సుబ్రణ్యం, మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయలు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎస్సారార్కళాశాల మైదానంలో ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని అన్నారు. విజయ సంకల్ప సభ విజయవంతం చేసేందుకు నరేంద్రమోడీ అభిమానులు బీజేపీ నాయకులు కార్యకర్తలు బూత్ కమిటీ సభ్యులు అదిక సంఖ్యలో హజరై విజయవంతం చేయాలని కోరారు. వివిధ వ్యాపార వాణిజ్య, కార్షక కార్మిక యువతరం మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున్న హాజరుకావాలని కోరారు. -
మా ఆటగాళ్లను అవమానిస్తారా: గావస్కర్
మెల్బోర్న్ : క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. తమ ఆటగాళ్లకు ముష్టి వేసినట్లు 500 యూఎస్ డాలర్ల(రూ.35వేలు) బహుమతిగా ఇచ్చి అవమానిస్తారా? అని నిలదీశారు. మూడు వన్డేల సిరీస్ గెలిస్తే ముష్టేసినట్లు ఓ ట్రోఫీతో సరిపెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మెల్బోర్న్ వేదికగా జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్ను 2-1తో నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించగా.. సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. మ్యాచ్ అనంతరం నిర్వాహకులు ధోని, చహల్లకు ఈ ట్రోఫీలతో పాటు నగదు బహుమతిగా చెక్కులు అందజేశారు. ఈ చెక్కుల విషయమే సునీల్ గావస్కర్కు ఆగ్రహం తెప్పించింది. మరి దారుణంగా నిర్వాహకులు 500 యూఎస్ డాలర్ల(రూ.35వేలు) చెక్కులను అందజేశారు. దీనిపై గవాస్కర్ సోనీ సిక్స్తో మాట్లాడుతూ.. సీఏ, టోర్నీ నిర్వాహకులను తప్పుబట్టారు. ‘మరి కనికరం లేకుండా.. ఏందీ ఈ 500 యూఎస్ డాలర్లు. సిరీస్ గెలిస్తే భారత జట్టుకు కేవలం ట్రోఫీ మాత్రమే దక్కింది. టోర్నీ నిర్వాహకులు ప్రైజ్మనీ కూడా ఇవ్వలేకపోయారు. బ్రాడ్కాస్ట్ హక్కుల పేరిట చాలా సొమ్ముచేసుకున్నారు. అయినా ఆటగాళ్లకు మంచి నగదు బహుమతి ఎందుకు ఇవ్వలేదు? ఆటగాళ్ల వల్లనే స్పాన్సర్ వస్తారు. వారి వల్లనే డబ్బులు వస్తాయి. ఒక్కసారి వింబుల్డన్లో ఆటగాళ్లకు ఇచ్చే నగదు బహుమతిని చూడండి. ఆటగాళ్ల వల్లనే క్రీడల్లో డబ్బులు వర్షం కురుస్తోంది. వారికి గౌరవప్రదమైన క్యాష్ రివార్డ్స్ ఇవ్వండి’ అని గవాస్కర్ చురకలంటించాడు. ఇక భారత అభిమానులు సైతం గవాస్కర్ వ్యాఖ్యలకు మద్దతు పలుకుతున్నారు. సోషల్ మీడియా వేదికగా టోర్నీ నిర్వాహకులపై మండిపడుతున్నారు. ‘ఎవడికి కావాలి ఈ ముష్టి’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ముమ్మాటికి భారత ఆటగాళ్లను అవమానించడమేనని, వెంటనే సీఏ భారత ఆటగాళ్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. -
ప్రజలు మా పక్షమే
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ.. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ఏటా రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తే.. ఇప్పుడు రూ. 35 వేలు ఖర్చు చేస్తున్నాం. రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాం. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేశాం. పంటలకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్ను కళకళలాడిస్తాం. ప్రజలు మా పక్షానే ఉన్నారు. సిద్ధాంతాలను పక్కనబెట్టి ఎన్నికల కోసమే ఏకమైన మహా కూటమికి పరాభవం తప్పదు బాన్సువాడ: రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభలకు ప్రజలు స్వ చ్ఛందంగా తండోపతండాలుగా విచ్చేసి ఆశీర్వదించారన్నారు. ప్రజలు టీఆర్ఎస్ పక్షానే ఉన్నారని, సంక్షేమ పథకాల్లో దేశంలోనే ఫస్ట్ ఉన్న తమను మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. 41ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి సంక్షేమ పథకాలు చూడలేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. సమైక్యాంధ్రలో రోడ్ల అభివృద్ధికి మొత్తం 23 జిల్లా రాష్ట్రానికి సంవత్సరానికి రూ. 300 కోట్లు కేటాయిస్తే.. తెలంగాణలో ఒక్క బాన్సువా డ నియోజకవర్గానికే రూ. 300 కోట్లతో రోడ్లను మంజూరు చేశారని, ఇదే అభివృద్ధికి నిదర్శనమ ని పేర్కొన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నామని, పంటలకు పెట్టుబడిగా రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు ఏటా 8,000ను ఇస్తున్నామని, వచ్చే ఏడాది నుం చి దీనిని రూ. 10వేలకు పెంచుతామని పేర్కొన్నారు. వచ్చే ప్రభుత్వంలో లక్ష రూపాయల వరకు రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించామన్నారు. పెన్షన్ను రూ. 200 నుంచి రూ. 1000కి పెంచిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు. రాష్ట్రంలో 43 లక్షల మంది ప్రజలకు రూ. 5,600 కోట్లను పెన్షన్లుగా అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో 36 సంక్షేమ పథకాలకు రూ. 42 వేల కోట్లు కేటాయించామన్నారు. నాయకుడనేవాడు ప్రజల కోసం పని చేయాలని, వారికి ఇష్టమైన పనులు మాత్రమే చేయాలని, ప్రజలకు నచ్చిన పనులు చేస్తూ తమ ప్రభుత్వం ముందుకు సాగిందని పేర్కొన్నారు. దొంగల కూటమి.. మహాకూటమికి సిద్ధాంతాలు లేవని, ముఖ్యమంత్రిగా ఎవరుంటారో తెలియదని, మొత్తానికి అది దొంగల కూటమిగా మారిందని, దోచుకోదాచుకో అనేదే వారి సిద్ధాంతమని పోచారం విమర్శించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణాలో జరిగిందన్నారు. దేశం మొత్తం తెలంగాణ ఎన్నికలపైనే దృష్టి పెట్టిందని, డిసెంబర్ 7న టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలను చూసి పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు తాము కూడా తెలంగాణలో ఉంటే బాగుండని అనుకుంటున్నారన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించనవే కాకుండా పొందుపర్చని పథకాలను కూడా అమలు చేశామన్నారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని పనులను కేసీఆర్ చేసి చూపారని, ముందస్తుగానే పనులు చేసి ఓట్లడుగుతున్నామని పేర్కొన్నారు. ప్రజలను మరోసారి ఓటు వేయమని అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్కే ఉందన్నారు. తెలంగాణను అడ్డుకున్న పార్టీతో పొత్తా.. హామీలు ఇచ్చి అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ది అని పోచారం విమర్శించారు. ఏ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆలస్యమైందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏ సిద్ధాంతమో కోదండరాం చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకూడదని మొండిగా అడ్డం పడింది చంద్రబాబు అని, అలాంటి నాయకుని పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఆదర్శ పథకాలు రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రితో కలిసి తాను అనేక పథకాలను ప్రవేశపెట్టానని, వాటిలో రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రపంచంలోని 20 పథకాల్లో గుర్తింపు పొందడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని పోచారం అన్నారు. రాష్ట్రంలో లక్షలకోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. ఇవి పూర్తయితే రైతులకు రూ. వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూశామని, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని పేర్కొన్నారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించామన్నారు. రైతు సమన్వయ సమితుల ద్వారా రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నామన్నారు. దేశంలోనే తెలంగాణలోని రైతులు ధనికులుగా ఉండాలనేదే తనతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. రైతురాజ్యం, రైతు సంక్షేమమే ధ్యేయంగా తాము ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో రైతులకు జరిగిన మేలును గుర్తించి ముఖ్యమంత్రి తనను లక్ష్మీపుత్రుడిగా పిలుస్తున్నారన్నారు. వచ్చే ప్రభుత్వంలో మళ్లీ వ్యవసాయ శాఖతో పాటు మార్కెటింగ్ శాఖకు మంత్రిగా ఉంటారని కేసీఆర్ అన్నారని, ఇది తనకు ఇచ్చిన గుర్తింపునకు నిదర్శనమని పేర్కొన్నారు. వ్యవసాయానికి దన్ను.. రాష్ట్ర జనాభాలో 70 శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం భారీగా నిధులను కేటాయించామని పోచారం పేర్కొన్నారు. రూ. లక్షాయాభై వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాలకు సాగునీరందించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులకు ఏడాదికి రూ. 6 వేల కోట్లు ఖర్చు చేస్తే నేడు ఏడాదికి రూ. 35వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్లోకి నీటిని మళ్లిస్తామన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పంటలకు పెట్టుబడి సాయం ఇస్తున్నామని, రైతులకు బీమా సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. గుంట పంట కూడా ఎండకుండా సింగూరు నుంచి నీటిని తీసుకువచ్చామన్నారు. ప్రజల సంక్షేమం కోసం... ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తాము పని చేస్తుండడంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పోచారం అన్నారు. ప్రతి గ్రామంలో సగటున 600 ఓటర్లు ఉండగా, వారిలో 90 శాతం మంది ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధిపొందిన వారేనన్నారు. ఒక్కొక్కరు 3, 4 రకాల పథకాలను కూడా పొందినట్లు తాను చేసిన సర్వేలో వెల్లడైందన్నారు. వార్షిక బడ్జెట్ రూ. 1.76 లక్షల కోట్లలో సంక్షేమ రంగానికే రూ.42 వేల కోట్లు, నీటిపారుదల రంగానికి రూ. 35 వేల కోట్లను కేటాయించామని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయనడానికి, వారు స్వచ్ఛందంగా తమకు మద్దతు పలకడమే నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, మరిన్ని మంచి పనులు చేస్తామని పేర్కొన్నారు. -
వృత్తి.. ప్రవృత్తి నృత్య కీర్తి
ఆమె వృత్తి సీఏ... ప్రవృత్తి నాట్యం. రెండు దశాబ్దాలకుపైగా భరతనాట్య సాధన చేస్తున్నారు. దేశవిదేశాల్లో ఎన్నోప్రదర్శనలిచ్చారు.. ప్రశంసలు అందుకున్నారు. ఓవైపు చార్టడ్ అకౌంటెంట్గా రాణిస్తూనే.. నృత్య కీర్తిని చాటుతున్నారు. మరోవైపు పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ సేవాపథంలో ముందుకెళ్తున్నారు. ఆమే సుభాషిణి గిరిధర్. సెప్టెంబర్ 1నరవీంద్రభారతిలో ప్రదర్శన ఇవ్వనున్న సుభాషిణి కళా ప్రస్థానమిది... సాక్షి, సిటీబ్యూరో : సుభాషిణి గిరిధర్ది నగరంలోని కొండాపూర్. తండ్రి విజయరాఘవన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వివిధ రాష్ట్రాల్లో చదివి... చివరికి నగరంలో స్థిరపడ్డారు. అమ్మ లక్ష్మీ మంచి గాయని, సంగీత విద్వాంసురాలు. తమిళంలో ఎన్నో భక్తి పాటలు పాడడంతో పాటు స్వరపరిచారు. తల్లి పరంపరలో సుభాషిణి భరతనాట్య కళలో ప్రవేశించారు. సుభాషిణి అక్క సుగుణ బ్యాంకు ఉద్యోగి. సీఏ చేయాలని అక్క ప్రోత్సహించగా అటువైపు అడుగులేశారు. అలా 1995లో సీఏ పూర్తి చేశారు. చార్టడ్ అకౌంటెంట్గా నగరంలోని ప్రముఖ కంపెనీల్లో పని చేశారు. ప్రస్తుతం సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. సీఏ అర్హత పరీక్షకు సంబంధించి ఉచితంగా శిక్షణనిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సీఏ సదస్సుల్లో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించారు. రెండింటిలోనూ... సీఏ సవాళ్లతో కూడుకున్న వృత్తి. అలాంటి వృత్తిలో రాణిస్తూనే అంతర్జాతీయగా నృత్యకారిణిగా ఎదిగారు సుభాషిణి గిరిధర్. వృత్తి, ప్రవృత్తిని సమన్వయం చేసుకుంటూ రెండింటిలోనూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్కపూర్, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు సంజయ్ సుబ్రమణ్యం, హరికథ కళాకారిణి విశాఖ హరి తదితర ఎందరో సీఏ చేసినా... తమకు ఇష్టమైన రంగాల వైపు మళ్లి ప్రత్యేకతను చాటుకున్నారు. కానీ సుభాషిణి గిరిధర్ ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు సీఏగా పనిచేస్తూనే భరతనాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకున్నారు. వృత్తి, కుటుంబ పరంగా ఒత్తిళ్లు ఎదురైనా నాట్యాన్ని విడిచి పెట్టలేదు. ‘సుగుణ నృత్యాలయ’ ఏర్పాటు... సుభాషిణి తన సోదరి సుగుణ పేరుతో నృత్య శిక్షణాలయాన్ని ప్రారంభించారు. లాభాపేక్ష లేకుండా నామమాత్ర ఫీజుతో ఔత్సాహికులకు భరతనాట్యంలో శిక్షణనిస్తున్నారు. ఆ ఫీజుతోనూ పేద విద్యార్థులకు దుస్తులు, విద్యా ఉపకరణాలు అందిస్తున్నారు. ప్రస్తుతం సంపాదిస్తున్న మొత్తంలో సగ భాగం పేదింటి అమ్మాయిల చదవుకు వెచ్చిస్తున్నారు. సుభాషిణి ప్రతిభ, సేవను గుర్తించిన ఐసీఏఐ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టడ్ అకౌంటెంట్ ఇండియా) దేశంలో సీఏ కొనసాగిస్తూ ఇతర రంగాల్లో రాణిస్తున్న జాబితాలో సుభాషిణికి చోటు కల్పించడం విశేషం. సెప్టెంబర్ 1న ప్రదర్శన సుగుణ నృత్యాలయ 28వ వార్షికోత్సవం సెప్టెంబర్ 1న రవీంద్రభారతిలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సుభాషిణి గిరిధర్... శిష్యులతో నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. హ్యాపీగా ఉంది.. సీఏ, శాస్త్రీయ నృత్యం పొంతనలేని రంగా లు. ఈ రెండింటిలోనూ రాణించడం చాలా కష్టం. అది క్రమశిక్షణ, అంకితభావంతోనే సాధ్యం. నేను సీఏ కంటే నృత్యం నేర్చుకోవడానికే ఎక్కువ సమయం, శ్రమ వెచ్చించా ను. ఐసీఏఐ లోగో (రెక్కలు విప్పిన గరుడ పక్షి) ప్రత్యేకతను తెలియజేస్తూ నృత్యరూప కం ప్రదర్శించాను. మోకాళ్లకు శస్త్ర చికిత్స జరిగినా... ఇప్పటికీ నాట్యంలో రాణిస్తున్నందుకు ఆనందంగా ఉంది. -
అకౌంటెన్సీ వారి వారసత్వం...!
ఒకే కుటుంబం నుంచి (రక్తసంబంధీకులు) వరసగా అయిదు తరాల పాటు ఒకే వృత్తిని నిర్వహించిన ఘనత ప్రపంచంలోనే తమ పరివారానిదేనని చతుర్వేది అనే సీఏ ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. భారత వాణిజ్య రాజధాని ముంబయిలో బీఎం చతుర్వేది అండ్ కంపెనీ పేరు గల ఓ సీఏ సంస్థ అధిపతి ఈ మేరకు సవాల్ చేస్తున్నారు. గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదుకు ఈ కుటుంబపెద్ద బ్రిజ్మోహన్ చతుర్వేది దరఖాస్తు చేశారు. మూడోతరానికి చెందిన బీఎం చతుర్వేది తన మనవరాలు మోహిని చతుర్వేది(అయిదోతరం) కఠినమైన సీఏ అర్హత పరీక్షలో నెగ్గి వారసత్వంగా వస్తున్న కుటుంబ వృత్తిలో అడుగుపెట్టింది. తొలి అడుగు 1925లో... ఉత్తరప్రదేశ్ మధురకు చెందిన బిషంబర్నాథ్ చతుర్వేది (బీఎం చతుర్వేది తాత) ఢిల్లీలోని ఓ సంస్థలో శిక్షణ పొందాక 1925లో సీఏ వృత్తి చేపట్టారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మధురలోని దాదాపు 500 మంది ఛార్టెర్డ్ అకౌంటెన్సీ వృత్తిలోకే దిగారు. బిషంబర్ ఇద్దరు కొడుకులు అమర్నాథ్ (బీఎం చతుర్వేది తండ్రి), దీనానాథ్ సీఏ చేశారు. అమర్నాథ్ 1955లో ఈ వృత్తిలో చేరాక ఇరవై ఏళ్లకు బీఎం చతుర్వేది,ఇద్దరు సోదరులు కూడా అదేబాటలో పయనించారు. చతుర్వేది తోడబుట్టిన సోదరులు, సోదరీమణుల పిల్లలు, ఆయన మనవరాలు (చిన్నకుమార్తె బిడ్డ) ప్రత్యేక వారసత్వాన్ని కొనసాగించడంలో చేతులు కలిపారు. ప్రస్తుతం డేవిడ్ కుటుంబం పేరిట... ప్రస్తుతం నైజీరియాలోని డేవిడ్ ఒమ్యూయా డెఫినెన్ కుటుంబం పేరిట ఈ గిన్నెస్ రికార్డ్ నమోదై ఉంది. డేవిడ్ తర్వాతి తరంలో అయిదుమంది సీఏలు (ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు)న్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు సీఏ వృత్తిలో ఎక్కువ మంది (ఆరుగురు) కొనసాగుతున్నందున ఈ విధంగా వీరిని ప్రపంచంలోని తొలి కుటుంబంగా పరిగణిస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా 11 మంది తన రక్తసంబంధీకులు సీఏలుగా ఉన్నారని చతుర్వేది చెబుతున్నారు. వరసగా అయిదు తరాల పాటు ఒకే వృత్తిలో కొనసాగడంతోపాటు 11 మంది సీఏలు ఒకే కుటుంబం నుంచి ఉన్నందున గిన్నెస్రికార్డ్ తమకే చెందుతుందని అంటున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సీఏ ఫైనల్లో మెరిసిన తెలుగుతేజం
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/గుంటూరు ఎడ్యుకేషన్: గత ఏడాది నవంబర్లో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించిన సీఏ ఫైనల్ పరీక్షా ఫలితాల్లో తెలుగుతేజం మాదాటి ఫణీష్రెడ్డి సత్తాచాటాడు. విజయవాడ కృష్ణలంకకు చెందిన ఫణీష్రెడ్డి దక్షిణ భారతదేశంలో ఫస్ట్ ర్యాంక్, జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఫణీష్రెడ్డి ఆడిటర్ తుమ్మల రామ్మోహనరావు వద్ద ఆర్టికల్స్ చేస్తూ స్వతంత్రంగా పరీక్షకు సన్నద్ధమయ్యి ఈ ర్యాంకు అందుకున్నాడు. ఈ సందర్భంగా ఫణీష్రెడ్డికి ఆడిటర్ అభినందనలు తెలిపారు. పెరిగిన ఉత్తీర్ణత.. ఒక గ్రూపుతో లేదా రెండు గ్రూపుల్లోనూ పరీక్షలకు హాజరైన 30,054 మంది విద్యార్థులకు గాను, 6,841 మంది ఉత్తీర్ణులై 22.76 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐసీఏఐ చరిత్రలోనే ఇది రికార్డుగా నిలిచింది. కాగా, సీఏ గ్రూప్–1, గ్రూప్–2 విభాగాలను కలుపుకొని దేశ వ్యాప్తంగా 9,479 మంది సీఏ కోర్సు పూర్తి చేశారు. గ్రూప్–1 విభాగంలో దేశవ్యాప్తంగా 39,328 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వారిలో 6,257 మంది ఉత్తీర్ణులై 15.91 శాతం, గ్రూప్–2 విభాగంలో 39,753 మంది పరీక్షలు రాయగా వారిలో 6,006 ఉత్తీర్ణులు కాగా 15.11 శాతంగా నమోదైంది. గతేడాది జనవరిలో విడుదలైన సీఏ ఫైనల్ ఫలితాల్లో 11.57 శాతం ఉత్తీర్ణత నమోదవగా, ప్రస్తుతం దాదాపు రెట్టింపు శాతం నమోదైంది. జీఎస్టీ ప్రభావంతో దేశవ్యాప్తంగా సీఏలకు డిమాండ్ నెలకొన్న పరిస్థితుల్లో తాజా ఫలితాలు విద్యార్థులను సీఏ కోర్సు వైపు ఆకర్షితులను చేసే విధంగా ఉన్నాయని స్థానిక ఆడిటర్లతో పాటు శిక్షణ సంస్థలు చెబుతున్నాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే... ‘‘నేను ఆలిండియా స్థాయిలో నాలుగో ర్యాంకు సా«ధించేందుకు నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. నాన్న శ్రీనివాసరెడ్డి ప్రైవేట్ ట్రావెల్స్లో డ్రైవర్గా చేస్తారు. అమ్మ శోభారాణి గృహిణి. నేను పదవ తరగతి చదువుతున్న సమయంలో సీఏ చేయాలనే నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పగా, వారు ఎంతో ప్రోత్సహించారు. ఐపీసీసీలో 71 శాతం, సీఏ సీపీటీలో 91 శాతం మార్కులు సాధించాను. ప్రస్తుతం ఆలిండియా స్థాయిలో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. సీపీటీ, ఐపీసీసీకి ఓ విద్యాసంస్థలో శిక్షణ తీసుకున్నా. సీఏ ఫైనల్స్ విషయంలో ఆర్టికల్స్ చేస్తూ సొంతంగా ప్రిపేర్ అయ్యాను’’. – ఫణీష్ రెడ్డి -
సీఏతో క్రికెటర్ల కొత్త డీల్..
సిడ్నీ:గత కొన్ని నెలలుగా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ), ఆసీస్ క్రికెటర్ల మధ్య నెలకొన్న జీతాల వివాదానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ మేరకు గురువారం సీఏకు ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్ కు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దానిలో భాగంగా క్రికెటర్లు ఐదేళ్ల కాంట్రాక్ట్ కాలానికి సుమారు 396 మిలియన్ డాలర్లతో కొత్తగా ఒప్పంద చేసుకున్నారు. దాంతో ఇంతవరకూ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భవితవ్యంపై నెలకొన్న సందిగ్థత తొలగిపోయింది. తమ మధ్య చోటు చేసుకున్న ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్ వివాదానికి తెరపడినట్లు సీఏ చీఫ్ సుదర్లాండ్ తో పాటు, ఆసీస్ క్రికెటర్ల సంఘం చీఫ్ అలిస్టెర్ నికొల్సన్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 30వ తేదీతో ఆటగాళ్లు ఐదేళ్ల పాటు చేసుకున్న ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే. మరొకవైపు కొత్త కాంట్రాక్ట్ లో కీలక మార్పులు చేయడంతో అందుకు ఆటగాళ్లు అందుకు విముఖత వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే ఆటగాళ్లకు సీఏ మధ్య వివాదం నెలకొంది. అయితే ఎట్టకేలకు అందుకు ముగింపు పలకడంతో ఆసీస్ క్రికెటర్లు ఊపిరిపీల్చుకున్నారు. -
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: స్మిత్
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నూతన కాంట్రాక్ట్ విధానానికి తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకారం తెలబోమని ఆ దేశ క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. కొత్త వేత న చెల్లింపు విధానంలో ఆటగాళ్లదంతా ఒకే మాటగా స్మిత్ తెలిపాడు. ఈ విషయంలో తామంతా ఐక్యంగా ముందుకు సాగుదామని పేర్కొన్న స్మిత్.. దేశంలోని క్రికెటర్లకు ఆర్థికంగా లబ్ధి చేకూరడమే తమ లక్ష్యమన్నాడు. ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిపాదించిన కొత్త వేతన విధానాన్ని ఆసీస్ క్రికెర్లంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిలో భాగంగా జూలై 1వ తేదీ నుంచి ఆ దేశంలోని దాదాపు 230 క్రికెటర్లు నిరుద్యోగులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఆసీస్-ఎ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన సైతం రద్దయ్యింది. దీనిపై సోమవారం ఆటగాళ్లతో సీఏ సమావేశమయ్యే అవకాశం ఉంది. -
దోచుకున్నది కక్కిస్తాం!
ప్రజల సొమ్మును లూటీ చేసిన వారిని వదలం ► పన్ను ఎగవేసే కంపెనీలకు ప్రధాని హెచ్చరిక ► సీఏల సంతకం విలువైంది.. దుర్వినియోగం చేయొద్దు న్యూఢిల్లీ: ప్రజల సొమ్మును లూటీచేసిన వారంతా తిరిగి ప్రజలకు ఆ మొత్తాన్ని అందజేయాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇకపై తప్పుడు లెక్కలు చూపించే, పన్ను ఎగవేసే కంపెనీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నోట్లరద్దు తర్వాత అక్రమాలకు పాల్పడినట్లు తేలిన లక్షకు పైగా కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దుచేశామని స్పష్టం చేశారు. నల్లధనాన్ని దాచటంలో సహకరించినవారిపైనా కొరడా ఝుళిపిస్తామన్నారు.ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఏలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ‘మీ క్లయింట్లను పన్ను పరిధిలోనుంచి బయటపడేశామని గొప్పలు చెప్పుకోవటం కన్నా.. వారంతా పన్ను చెల్లించేలా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయాలి’ అని సీఏలకు ప్రధాని సూచించారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పథకంతోపాటుగా దేశాన్ని లూటీ చేసిన వారినుంచి భారత ఆర్థిక వ్యవస్థను స్వచ్ఛ పరిచే కార్యక్రమాన్ని కూడా చేపట్టిందన్నారు. ఓ రాజకీయ పార్టీగా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం కష్టమేనని అయితే.. దేశం కోసం ఎవరో ఒకరు చొరవతీసుకుంటేనే ముందడుగు పడుతుందని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఏలతోపాటుగా ఆర్థికమంత్రి జైట్లీ, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతా సీఏల చేతుల్లోనే! జీఎస్టీ అమల్లో తద్వారా నవభారత నిర్మాణంలో సీఏల పాత్ర కీలకమని మోదీ అన్నారు. ‘దేశాభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలి’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ‘అప్పుడు స్వాతంత్య్ర పోరాటంలో చాలా మంది న్యాయవాదులు కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు దేశ ఆర్థిక ప్రగతి ప్రయాణంలో సీఏలు కూడా మూలస్తంభంగా నిలవాలి’ అని ప్రధాని కోరారు. దశాబ్దాలుగా ప్రజల సొమ్మును లూటీ చేస్తున్న వారు.. ఆ మొత్తాన్ని తిరిగి ప్రజలకు చెల్లించాల్సిందేనన్నారు. నోట్లరద్దు నిర్ణయం వెలువడిన తర్వాత అందరికన్నా ఎక్కువగా కష్టపడి పనిచేసింది సీఏలేనని చమత్కరించారు. నల్లధనం ఉన్న వారిని గుర్తించినట్లయితే.. సీఏలు వారిని హెచ్చరించాలని మోదీ సూచించారు. ‘దేశవ్యాప్తంగా ఏడాదికి రూ.10లక్షల ఆదాయం దాటిన వాళ్లు కేవలం 32 లక్షల మందే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. కానీ కొన్ని కోట్ల మంది ఉన్నతశ్రేణి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నారు. రెండున్నరకోట్ల మంది విదేశీ పర్యటనలకు వెళ్లారు. వీరందరి సంగతేంటి’ అని మోదీ ప్రశ్నించారు. గత 11 ఏళ్లుగా దేశంలో అక్రమాలకు పాల్పడిన సీఏలపై విచారణ సందర్భంగా కేవలం 25 మందినే దోషులుగా గుర్తించారని.. కేవలం ఇంతమందే అక్రమాలకు పాల్పడ్డారా అనే అనుమానం వస్తుందన్నారు. చాలా ఏళ్లుగా సీఏలకు సంబంధించి 1,400 కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తుచేశారు. ఒక్కదెబ్బతో లక్ష కంపెనీలు ఔట్! పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత 3 లక్షలకుపైగా రిజిస్టర్ అయిన కంపెనీల లావాదేవీలు అనుమానాస్పదంగా గుర్తించామని మోదీ తెలిపారు. ‘డీమానిటైజేషన్ తర్వాత అక్రమాలకు పాల్పడినట్లు తేలిన లక్ష కంపెనీల రిజిస్ట్రేషన్ను ఒక్కదెబ్బతో రద్దుచేశాం. మరో 37వేల షెల్ కంపెనీలను గుర్తించాం. వాటిపైనా కఠినమైన చర్యలు తప్పవు’ అని మోదీ హెచ్చరించారు. సీఏలు సమాజ ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడటాన్ని బాధ్యతగా తీసుకోవాలని కోరారు. క్లయింట్లు నిజాయితీగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఏల ఒక్క తప్పుడు ఆడిట్ కారణంగా లక్షల మంది ఇన్వెస్టర్ల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ‘మీ సంతకం ప్రధాని సంతకం కంటే శక్తివంతమైంది. మీ సంతకాన్ని ప్రభుత్వం కూడా విశ్వసిస్తుంది. అందుకే దీన్ని సరిగ్గా వినియోగిస్తూ.. కోట్లమంది ప్రజల సొమ్ము అవినీతిపరుల పాలుకాకుండా కాపాడాల్సిన బాధ్యత మీదే. మీ సంతకాన్ని దుర్వినియోగం చేయకండి’ అని ప్రధాని సూచించారు. ‘స్విస్’ లో తగ్గిన జమ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8న నోట్లరద్దు చేపట్టాక స్విస్ బ్యాంకుల్లో భారతీయులు జమచేసుకునే డబ్బు 45 శాతం తగ్గిందని మోదీ వెల్ల డించారు. గతంలో కన్నా 2013లో (యూపీఏ హయాం) పెద్దమొత్తంలో భారతీయుల డబ్బు పలు అకౌంట్లలో జమైందన్నారు. వచ్చే రెండేళ్లలో స్విట్జర్లాండ్ అధికారులు భారత్కు సమాచారం ఇవ్వటం మొదలుపెట్టాక నల్లధనం దాచుకున్న వారంతా ఇబ్బందులు పడతారని మోదీ సుతిమెత్తగా హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలుగు అతిపెద్ద అకౌంటింగ్ సంస్థల్లో ఒక్క భారత సంస్థ కూడా లేకపోవటం బాధాకరమన్నారు. -
కొత్త జీతాల ఆఫర్ కు క్రికెటర్లు నో!
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్(సీఏ)కు ఆ దేశ క్రికెటర్లకు మధ్య నెలకొన్న కొత్త జీతాల వివాదం ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేటట్లు కనపించడం లేదు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన కొత్త జీతాల విధానాన్ని క్రికెటర్లు మరోసారి తిరస్కరించారు. ఆ నిబంధనను ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. పాత నిబంధన ప్రకారం.. మ్యాచ్ ల ద్వారా సీఏ ఆర్జించే ఆదాయంలో నిర్ణీత శాతాన్ని క్రికెటర్లకు అందజేసేవారు. అయితే కొత్త విధానంతో మిగులు నిధుల్లో మాత్రమే ఆటగాళ్లకు అందజేస్తామని సీఏ అంటోంది. దాంతో సీఏకు ఆటగాళ్ల మధ్య వివాదం రాజుకుంది. జూన్ 30వ తేదీతో ఆటగాళ్ల పాత కాంట్రాక్ట్లు ముగుస్తున్న తరుణంలో కొత్త కాంట్రాక్ట్ ఒప్పుకోవాలంటూ సీఏ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ కాని పక్షంలో ఆటగాళ్లు నిరుద్యోగులుగా మారక తప్పదనే హెచ్చరికలు జారీ చేసింది. అయితే దీన్ని డేవిడ్ వార్నర్ సహా సీనియర్ క్రికెటర్లంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము నిరుద్యోగులుగా మారిన ఫర్వాలేదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రస్తక్తే లేదని వారు ఎదురుదాడికి దిగారు. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారనే దానిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. -
వెనక్కితగ్గే ప్రసక్తే లేదు: వార్నర్
మెల్బోర్న్:క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఆ దేశ క్రికెటర్లకు మధ్య కొనసాగుతున్న నూతన కాంట్రాక్ట్ వివాదానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేటట్లు కనబడుటలేదు. ఆటగాళ్ల డిమాండ్ ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంతకీ పట్టించుకోకపోవడంతో అది మరింత ముదిరిపాకాన పడే పరిస్థితి కనబడుతోంది. ఈ క్రమంలోనే కొత్త కాంట్రాక్ట్ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి స్పష్టం చేశాడు. ఇందులో ఆటగాళ్లు కూడా వారి డిమాండ్లపై దిగివచ్చే ప్రసక్తే లేదని పేర్కొన్నాడు. సీఏ కొత్త కాంట్రాక్ట్ విధానం అమలు చేసిన పక్షంలో తాము నిరుద్యోగులుగా మారడానికి కూడా వెనకాడమన్నాడు. సీఏ పెద్దలు కొత్త కాంట్రాక్ట్ విధానంతో ఆటగాళ్లను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించాడు. ఇక్కడ ఏ ఆటగాడు కూడా వెనక్కి తగ్గే యోచనే లేదని బోర్డును హెచ్చరించాడు. తమ షరతులకు లోబడి అంగీకారం తెలిపిన వారికి మాత్రమే కొత్త కాంట్రాక్ట్ను ఇస్తామంటూ సీఏ కొత్త నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై గత కొంతకాలంగా ఆసీస్ ఆటగాళ్లకు-బోర్డుకు మధ్య వివాదం నడుస్తోంది. దీనికి ఆటగాళ్లు ససేమేరా అంటుంటే, సీఏ కూడా నాన్చుడి ధోరణి అవలంభిస్తోంది. -
సీఏకు వార్నర్ స్ట్రాంగ్ వార్నింగ్
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఆ దేశ క్రికెటర్లకు మధ్య కొనసాగుతున్న నూతన కాంట్రాక్ట్ వివాదం మరింత ముదురుతోంది. తమ షరతులకు లోబడి అంగీకారం తెలిపిన వారికి మాత్రమే కొత్త కాంట్రాక్ట్ను ఇస్తామంటూ సీఏ నిబంధనను ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ తీవ్రంగా తప్పుబట్టాడు. ఆ కాంట్రాక్ట్ విధానాన్ని ఎట్టిపరిస్థితిల్లోనూ ఒప్పుకునేది లేదని స్పష్టం చేశాడు. పలువురు ఆటగాళ్ల తరపున వకాల్తా పుచ్చుకున్న వార్నర్.. జూలై1వ తేదీ తరువాత తమకు కాంట్రాక్ట్ కనుక లేకపోతే క్రికెట్ ను ఆడటం ఆపేస్తాం అంటూ సీఏను గట్టిగా హెచ్చరించాడు. 'ఆసీస్ కొత్త విధానం ప్రకారం మేము నిరోద్యుగులమైతే కాంట్రాక్ట్లు కూడా ఉండవు అనేది మాకు తెలుసు.అప్పుడు క్రికెట్ ఆడటం కూడా జరగదు. మా బోర్డు కచ్చితంగా కొత్త కాంట్రాక్ట్ విధానంపై అగ్రిమెంట్ చేయాలంటూ ఆటగాళ్లకు దగ్గరకు వస్తుంది. అప్పుడు మేము నిరుద్యోగులు అవుతామనే అనుకుంటున్నా. జూలై 1 తరువాత ఏమి జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతం ఉన్న చాలా మంది కాంట్రాక్ట్ ఆటగాళ్ల కాంట్రాక్ట్ ను పునరుద్ధించేందుకు సీఏ సుముఖం లేదనేది ఈ మెయిల్స్ ద్వారా తెలుస్తుంది. ఇది చివరకు ఎక్కడ దారి తీస్తుందో అనేది కాలమే నిర్ణయిస్తుంది' అని చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ లో ఉన్న వార్నర్ మండిపడ్డాడు. -
'యాషెస్ ను బాయ్ కాట్ చేయరు'
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు ఆటగాళ్లకు నెలకొన్న కొత్త కాంట్రాక్ట్ వివాదంతో యాషెస్ సిరీస్ కు ఎటువంటి ముప్పు ఉండదనే తాను అనుకుంటున్నట్లు ఆ దేశ కోచ్ డారెన్ లీమన్ అభిప్రాయపడ్డాడు. ఆ సిరీస్ ను ఆసీస్ ఆటగాళ్లు బాయ్ కాట్ చేయరనే అనుకుంటున్నట్లు లీమన్ పేర్కొన్నాడు. త్వరలోనే బోర్డుకు క్రికెటర్లకు మధ్య చోటు చేసుకున్న వివాదానికి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. 'యాషెస్ సిరీస్ జరుగుతుందని నేను కచ్చితంగా చెబుతున్నాను. ఆసీస్ క్రికెట్ లో ప్రస్తుతం ఏమి జరుగుతున్నా నా దృష్టిలో చూస్తే అది పెద్ద సమస్యే కాదు. నేను ఆటగాళ్లతో బోర్డుతో మాట్లాడుతూనే ఉన్నా. అంత సర్దుకుంటుందనే భావిస్తున్నా. ఇందుకు పరిష్కారం వెతకమని ఆసీస్ క్రికెట్ బోర్డుకు విజ్ఞప్తి చేశా' అని లీమన్ తెలిపాడు. -
ఇక ఐపీఎల్లో ఆసీస్ క్రికెటర్లు ఆడరా?
సిడ్నీ:గత పదేళ్ల నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు.. ఈ లీగ్ కు దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆసీస్ క్రికెటర్లకు పలురకాలైన జాతీయ కాంట్రాక్ట్లు అప్పజెప్పి వారిని ఐపీఎల్ కు దూరం చేయాలనేది ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ) ఆలోచనగా ఉంది. ఐపీఎల్ కారణంగా ఆసీస్ ఆటగాళ్లు ఏడాదిలో దాదాపు రెండు నెలల పాటు దూరంగా ఉండటం ఆ క్రికెట్ బోర్డుకు రుచించడంలేదు. దానిలోభాగంగా కొత్త కాంట్రాక్ట్లు, వివిధ రకాల సుదీర్ఘ కాంట్రాక్ట్లు పేరుతో వారిని ఐపీఎల్ కు దూరం చేయాలని యోచిస్తోంది. ప్రధానంగా ఆటగాళ్లు తరచు గాయాల బారిన పడటం కూడా సీఏకు మింగుడు పడటం లేదు. దాంతో ఆసీస్ జట్టులోని కీలక ఆటగాళ్లకు మూడేళ్ల సుదీర్ఘ కాంట్రాక్ట్ను అప్పచెప్పాలని చూస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఆసీస్ క్రికెటర్లు ఆయా కాంట్రాక్ట్లతో బిజీగా ఉండటమే కాదు.. ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం కంటే కూడా కాస్త ఎక్కువగానే లబ్ది పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తో పాటు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, హజల్ వుడ్, ప్యాట్ కమిన్స్ వంటి కీలక ఆటగాళ్లకు ఈ తరహా కాంట్రాక్ట్ను కట్టబెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంచితే, ఈ కాంట్రాక్ట్ పద్ధతిని కొంతమంది ఆసీస్ క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఇదే కేవలం సీఏ పాలక వర్గానికి మాత్రమే లబ్ది చేకూర్చేదిగా ఉందని, ఇందుకు తాము సమ్మతంగా లేమంటూ ఇప్పటికే బోర్డుకు పలువురు క్రికెటర్లు స్సష్టం చేసినట్లు తెలుస్తోంది. -
కొత్త చట్టాలపై అవగాహన అవసరం
ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఫల్గుణకుమార్ రాజమహేంద్రవరంలో వర్తకులకు అవగాహన సదస్సు దానవాయిపేట (రాజమహేంద్రవరం): కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అదాయ పన్ను శాఖలో చేసిన మార్పులు చేర్పులు, ఇతర పన్నులపై వర్తకులందరూ అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇ.ఫల్గుణకుమార్ వర్తకులకు సూచించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వరంలో అదివారం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద గల చాంబర్ ఫంక్షన్ హాలులో ఆర్థికక లావాదేవీలు, పన్ను చెల్లింపులపై వర్తకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇ.ఫల్గుణకుమార్, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కో అర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు తదితరులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్తకులు తమ వ్యాపార లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు . ఒక సంవత్సరానికి రూ.10 లక్షలు మించిన వ్యాపార లావాదేవీలపై ప్రభుత్వానికి 15 శాతం సర్వీస్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. రూ.మూడు లక్షలకు మించి ఎవరైనా నగదు లావాదేవీలను నిర్వహిస్తే ఆదాయపన్ను శాఖ ద్వారా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని లావాదేవీలకు తగిన రశీదులు తప్పనిసరిగా ఏడు సంవత్సరాల పాటు భద్రపరచాలని సూచించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మాట్లాడుతూ పన్ను చెల్లించడానికి ఏ వర్తకుడికి ఇబ్బంది ఉండదని , ఐతే కొందరు అధికారులు చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకుని వర్తకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. అటువంటి అధికారులపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ఈ చట్టాలు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఈ సమావేశానికి చాంబర్ నగర అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు అధ్యక్షత వహించగా, ఏపీ ఫెడరేషన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కన్వీనర్ అశోక్కుమార్జైన్, జిల్లా అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, క్రైడాయ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, కాకినాడ చాంబర్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జి, చాంబర్ కార్యదర్శి కాలెపు రామచంద్రరావు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, వలవల దుర్గప్రసాద్(చిన్ని), టి.వీరభద్రరావు, వి.సత్యనారాయణ, కె.లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సీఏలు వృత్తి ధర్మాన్ని కాపాడాలి
ఐసీఏఐ సదస్సులో ఎంపీ కవిత హైదరాబాద్: అవినీతి రహిత సమాజం కోసం నేతలు, వృత్తి ధర్మాన్ని కాపాడేందుకు చార్టెడ్ అకౌం టెంట్లు కృషి చేయాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్(ఐసీఏఐ) గచ్చిబౌలి శాం తిసరోవర్లో ఏర్పాటు చేసిన రెండు రోజుల సద స్సును ఆమె శనివారం ప్రారంభించారు. కవిత మాట్లాడుతూ... రాజకీయ నాయకుల పేరు చెబితే అవినీతి, ఎన్నికలు, బ్లాక్ మనీ, లిక్కర్ మాఫియాగా ముద్రపడిందని.. నిజానికి వారు ప్రజాసేవకు అంకితమై పనిచేస్తున్నారన్నారు. సీఏలంటే లెక్కలు, ఆదాయం, పన్నులు వంటివి గుర్తుకు వస్తా యన్నారు. నమ్మకంగా, కష్టపడే తత్వంతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా రాణించవచ్చన్నారు. సీఏలు నిజమైన రాక్ స్టార్లన్నారు. కేంద్రం ఎన్నో సంస్కరణలను అమలు చేయడంతో అంతా... ‘మోదీ.. మోదీ’ అన్నారని, అదే పెద్ద నోట్ల రద్దుతో ‘డిమో... డిమో’ అంటున్నారన్నారు. ప్రస్తుతం 8.5లక్షల మంది సీఏ విద్యార్థులున్నారని, ఇకముం దు మహిళలకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. సీఏలు మామూలుగా 2 ప్లస్ 2 ఎంతంటే ఫోర్ అంటారు.. కానీ మా సీఏ బుచ్చిబాబును అడిగితే మీరెంతనుకుంటున్నారమ్మా అనడుగుతారన్నారు. ఐసీఏఐ చైర్మన్ దేవరాజరెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ, దాని ప్రభా వం, ఈ కామర్స్, జీఎస్టీ ఆడిటింగ్ ప్రమాణాలు, నగదురహిత ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై ఈ సదస్సులో అవగాహన కల్పిస్తామ న్నారు. ఐసీఏఐ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ బాబు అబ్రహం, ఎస్ఐసీఏఎస్ఏ చైర్మన్ వెంకట్రామ్, సదరన్రీజియన్ సభ్యుడు వెంకటేశ్వరరావు, హైద రాబాద్ చాప్టర్ చైర్మన్ రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. క.వి.త... అంటే కలలు వడ్డించే తల్లి... కవితను ఐసీఏఐ చైర్మన్ దేవరాజరెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. కవిత అనగా.. క–కలలు, వ– వడ్డించే, త–తల్లి అని, బ్లెస్సింగ్ ఇచ్చే తల్లి వంటిదని, కలసి వచ్చిన తల్లి కవిత అని.. అది కేవలం సీఎం కేసీఆర్కే కాదని, పార్లమెంట్ సభ్యురాలిగా దేశానికంతటికని ఆయన పొగడటం తో విద్యార్థులు కేరింతలు కొడుతూ చప్పట్లు చరిచారు. -
బ్లాక్ బ్యాట్పై నిషేధం!
సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో బ్లాక్ కలర్ బ్యాట్ పై నిషేధం విధించారు. ఆటగాళ్ల డ్రెస్ కోడ్ ను బట్టి బ్యాట్ కలర్ కూడా ఉండవచ్చని తొలుత పేర్కొన్న క్రికెట్ ఆస్ట్రేలియా.. దానిపై నిర్ణయాన్ని మార్చుకుంటూ నిషేధం విధించింది. పురుషుల బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ఆరంభపు మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ తరపున విండీస్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ బ్లాక్ బ్యాట్తో బరిలోకి దిగాడు. అయితే బ్లాక్ బ్యాట్ వాడకం వల్ల బంతి కలర్ దెబ్బతింటుందని మ్యాచ్ అధికారులు నివేదిక అందజేశారు. దాంతో బిగ్ బాష్ లీగ్లో బ్లాక్ బ్యాట్ను నిషేధం విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బిగ్ బాష్ లీగ్ లో బ్లాక్ బ్యాట్ వాడరాదంటూ నిబంధనలను విధించింది. 'మేము బ్లాక్ బ్యాట్ పై నిషేధం విధిస్తున్నాం. బ్లాక్ బ్యాట్ వాడటానికి ఎటువంటి ఇబ్బంది లేదని తొలుత చెప్పినా, బంతిపై నల్లని మరకలు పడుతూ ఉండటంతో ముందస్తు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం. అది బీబీఎల్ కావొచ్చు.. డబ్యూబీబీఎల్ కావొచ్చు.. ఆటగాడు రస్సెల్ కావొచ్చు.. మరెవరైనా కావొచ్చు..బ్లాక్ బ్యాట్ పై నిషేధం విధిస్తున్నాం'అని సీఏ పేర్కొంది. గత బీబీఎల్ సీజన్లో క్రిస్ గేల్ బంగారు పూత కల్గిన బ్యాట్ను వాడిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు గేల్ బ్యాట్ ను తయారు చేసిన స్పార్టాన్ కంపెనీ.. ఇప్పుడు రస్సెల్ కు బ్లాక్ బ్యాట్ను తయారు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా, గత ఈసీబీ నిర్వహించిన లీగ్ లో కూడా ఈ తరహా పరిణామమే చోటు చేసుకుంది. అసర్ జైదీ వాడిన స్ప్రే పెయింట్ బ్యాట్పై ఈసీబీ నిషేధం విధించింది. -
పన్ను ఎగవేతలను సీఏలు అడ్డుకోవాలి
-
బౌలింగ్ కోచ్గా హారిస్!
సిడ్నీ:త్వరలో దక్షిణాఫ్రికాతో కీలక సిరీస్ నేపథ్యంలో మాజీ ఫాస్ట్ బౌలర్ రియాన్ హారిస్ను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే ఆసీస్ జట్టుకు ప్రధాన కోచ్ గా ఉన్న డారెన్ లీమన్, కొత్తగా నియమించబడ్డ అసిస్టెంట్ కోచ్ డేవిడ్ సాకర్తో కలిసి రియాన్ హారిస్ తన అనుభవాన్ని పంచుకుంటాడని సీఏ తెలిపింది. ఈ తాజా నియామకంపై హారిస్ హర్షం వ్యక్తం చేశాడు. గతంలో అటు డారెన్ లీమన్తో పాటు, డేవిడ్ సాకర్ల నుంచి తాను ఎన్నోవిషయాలు నేర్చుకున్న సంగతిని గుర్తు చేసుకున్నాడు. ఇప్పడు వారితో కలిసి కోచ్ గా పని చేయడం ఒక అరుదైన అవకాశమని హారిస్ తెలిపాడు. తన జట్టుకు బౌలింగ్ కోచ్ గా చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఈ 36 ఏళ్ల మాజీ ఆటగాడు స్పష్టం చేశాడు. హారిస్ ను బౌలింగ్ కోచ్ గా నియమించడాన్ని లీమన్ స్వాగతించాడు. యువకులతో కూడిన తమ జట్టుకు ఆ ఇద్దరి సేవలు ఉపయోగపడతాయని లీమన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గతేడాది తరచు మోకాలి గాయం బారిన పడిన హారిస్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న సంగతి తెలిసిందే. తన టెస్టు కెరీర్లో 27 మ్యాచ్లాడిన హారిస్ 113 వికెట్లు తీశాడు. దాంతో పాటు గత సీజన్లో అండర్-19 ఆస్ట్రేలియా జట్టుకు హారీస్ కోచ్ గా వ్యవహరించాడు. -
దక్షిణాఫ్రికాతో సిరీస్కు స్టార్క్ దూరం
సిడ్నీ: ఈ నెల చివర్లో దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న వన్డే సిరీస్కు ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, హజల్వుడ్లు దూరం కానున్నారు. ఆ ఇద్దరి ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తాజాగా స్పష్టం చేసింది. ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనలో స్టార్క్, హజల్ వుడ్లపై భారం ఎక్కువ పడటంతో వారిద్దరికీ విశ్రాంతి అవసరమని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ రాడ్ మార్ష్ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ తమకు ముఖ్యమైనప్పటికీ, స్టార్క్, హజల్వుడ్లకు కాస్త బ్రేక్ ఇవ్వడానికి ఇదే తగిన సమయమన్నాడు. దాంతో గాయపడి తమ ఫిట్నెస్ను నిరూపించుకున్న పలువురు బౌలర్లకు ఇదీ సువర్ణవకాశమన్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్లో గాయపడిన కౌల్టర్ నైల్ తిరిగి జట్టులో చేరుతున్నట్లు మార్ష్ పేర్కొన్నాడు. -
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మృతి
సిడ్నీ:ఆస్ట్రేలియా పాతతరం క్రికెటర్ లెన్ మాడోక్స్(90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లెన్ మాడోక్స్ మృతి చెందినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 1954 నుంచి 1956 మధ్యకాలంలో అటు బ్యాట్స్మన్గా, ఇటు వికెట్ కీపర్గా ఆసీస్ తరపున బాధ్యతలు నిర్వర్తించిన మాడోక్స్ .. అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఏడు టెస్టు మ్యాచ్లు ఆడారు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో విక్టోరియా, తస్మానియా జట్లకు ప్రాతినిధ్యం వహించిన మాడొక్స్ 117 మ్యాచ్ లు ఆడారు. దాంతోపాటు ఆసీస్ జాతీయ సెలక్టర్గా కూడా పని చేసిన లెన్ మాడోక్స్... 1977లో ఇంగ్లండ్లో పర్యటించిన ఆసీస్ జట్టుకు మేనేజర్గా వ్యవరించారు. లెన్ మాడోక్స్పై క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మాడోక్స్ చేసిన సేవలు అనిర్వచనీయమని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సౌథర్లాండ్ కొనియాడారు. ఈ వారంలో ఆస్ట్రేలియా క్రికెట్ కు ఇది అత్యంత విషాదకరమైన వార్త అని సౌథర్లాండ్ సంతాపం వ్యక్తం చేశారు. -
వచ్చే వరల్డ్కప్ వరకూ అతనే కోచ్!
మెల్బోర్న్: ప్రస్తుత ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ డారెన్ లీమన్ పదవీ కాలాన్ని పొడగించారు. 2019 వన్డే వరల్డ్ కప్ వరకూ లీమన్నే కోచ్ గా కొనసాగించాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(సీఏ) నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా లీమన్ దిశా నిర్దేశంలో ఆస్ట్రేలియా సిరీస్ విజయాలను సాధిస్తూ దూసుకుపోతోంది. గత వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు లీమన్ కోచ్ గా వ్యహరించాడు. దాంతో పాటు ఇటీవల కాలంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్ వంటి పటిష్ట దేశాలపై ఆసీస్ పలు విజయాలను నమోదు చేసి సిరీస్లను కైవసం చేసుకుంది. మరోవైపు టెస్టు, వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆసీస్ కు లీమనే సరైన మార్గదర్శకుడిగా భావించిన ఆ జట్టు యాజమాన్యం అతనికే తిరిగి పర్యవేక్షక బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సీఏ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ పాట్ హోగార్డ్ తాజా ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.'ఆస్ట్రేలియా జట్టు కోచ్, అసిస్టెంట్ కోచ్లను మార్చే ఉద్దేశం ఇప్పట్లో లేదు. వచ్చే యాషెస్తో పాటు వన్డ్డే వరల్డ్ కప్ వరకూ లీమన్ కోచ్ గా కొనసాగుతాడు. మా జట్టులో విజయమంతమైన కోచ్గా లీమన్ గుర్తింపు సాధించాడు. అందుకు మరోసారి అతనికే కోచ్ పగ్గాలు అప్పజెప్పాలని జాతీయ సెలక్షన్ ప్యానెల్ నిర్ణయించింది' అని హోగార్డ్ తెలిపారు. -
లక్షలు వదిలి లక్ష్యం వైపు కదిలి
మారుతున్న యువతరం ఆలోచనలు ఉన్నత ఉద్యోగాలు వదిలి సొంతంగా ఎదిగి విజయం వైపు లక్ష్మి శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్ ఒక ఆలోచన.. ఒక లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది. అదే ఆలోచనకు దృఢ సంకల్పం తోడైతే విజయం సాధ్యమవుతుంది. ప్రపంచంలో చీకటి అంతా ఏకమైనా ఒక్క అగ్గిపుల్ల వెలుతురును దాచలేదు. లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే విజయాన్ని ఆపలేరు. ఇదే సూత్రాన్ని పఠిస్తోంది ప్రస్తుత యువత. ఉద్యోగం చేస్తే లక్షల జీతం వస్తుంది. కానీ అది వారి లక్ష్యం కాదు. తను వ్యక్తిగతంగా ఎదుగుతూ.. పది మందికి ఉపాధి కల్పించాలి. వారినీ లక్ష్యసాధన వైపు నడిపించాలి. అలాంటి కొంత మంది యువకుల పరిచయమే ఈ కథనం. - సిటీ డెస్క్ బీపీసీఎల్ నుంచి బోధన వైపు.. ‘శిఖరాగ్రాన ఉన్న వాడిని చూసి నిరాశ చెందకు. తను కూడా నీవు నిల్చొన్న చోట నుంచే మజిలీ మొదలు పెడతాడు. సంకల్పం ఉంటే సగం విజయం.’ అంటున్నారు గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మి శ్రీనివాసరెడ్డి చిలకల. తను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే. పదోతరగ తిలో 530 మార్కులు, ఇంటర్లో స్టేట్ మూడో ర్యాంక్(ఎంఈసీ), సీఏ(ఛార్టర్డ్ అకౌంటెంట్) ఫైనల్లో జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్, సీఎంఏ ఫైనల్లో జాతీయ స్థాయిలో 17వ ర్యాంక్, సీఏ- ఐపీసీసీలో 29, సీఏ- సీపీటీలో 8వ ర్యాంక్. ఇదీ స్థూలంగా శ్రీనివాసరెడ్డి ఎడ్యుకేషన్ గ్రాఫ్. భారత ప్రభుత్వ రంగ సంస్థ బీపీసీఎల్లో ఉద్యోగం. ఏడాదికి రూ.14.5 లక్షల జీతం. విలాసవంతమైన జీవితం. ఇవేమి ఆయనకు సంతృప్తి నివ్వలేదు. అందుకే ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. బోధన రంగంలో రాణించి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందివ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందుకోసం విశాఖపట్నంలో ఎస్అండ్ఎస్ సీఏ అకాడమీని మిత్రుడు శ్రీకాంత్ చౌదరితో కలిసి ప్రారంభించాడు. ఇంకా ఆయన ఏం అంటున్నారంటే... ‘సీఏ పాసవడమంటే మాటలా.. ఓ భగీరథ ప్రయత్నం.. అందరికీ సాధ్యం కాదు. టెన్త్ పూర్తవ్వగానే ఇంటర్లో ఎంఈసీ ఎంచుకున్నప్పుడు నేను విన్న మాటలు. అంత కష్టమా అనుకున్నా. కానీ ఎందులోనైనా కష్టపడనిదే ముందుకు సాగలేం. లక్ష్యం దిశగా సాగితే అదే బ్రహ్మ విద్యేమీ కాదని అనిపించింది. ర్యాంక్ గురించి ఆలోచించకుండా చదివాను. ఓ వైపు ఆర్టికల్షిప్ చేస్తూ ఖాళీ సమయాన్ని పక్కా ప్రణాళికతో సద్వినియోగం చేసుకున్నాను. ఆ ఏడాదిలో దేశం మొత్తం మీద 42 వేలమంది పరీక్ష రాస్తే.. అందులో 7 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించగలిగాను. బీపీసీఎల్ ముంబైలో జాబ్.. నెలకు రూ.14.5 లక్షల ప్యాకేజీ. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇది చాలా పెద్ద మొత్తం. 18 నెలలు పనిచేశా. కానీ నా లక్ష్యం వేరు. బోధన రంగంలో రాణించాలి. ఉద్యోగం చేస్తున్న సమయంలో సెలవు రోజుల్లో తిరుపతిలో సీఏ తరగతులు నిర్వహించాను. పూర్తి స్థాయిలో అకాడమీ నెలకొల్పి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఉద్యోగానికి రాజీనామా చేశాను. విశాఖపట్నంలో సీఏ అకాడమీ స్థాపించాను. అకాడమీని నిలబెట్టాలి. విద్యను విస్తరింపజేయాలి. ఇప్పటికే సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాను. జీవితంలో స్థిరపడ్డాక ఫౌండేషన్ స్థాపించి పేద పిల్లలకు ఉచిత విద్యనందించాలి. సొంత ఊరికి సేవ చేయాలి. ఒక లక్ష్యాన్ని ప్రేమించి, పట్టుదలతో సాధన చేస్తే ఫలితం మన చేతుల్లోనే ఉంటుంది.’ 21 ఏళ్లకే సీఏ ‘పోరాడేటప్పుడు తిరిగి పోరాడే అవకాశం రాదేమో అన్నట్టుగా పోరాడు. ఎందుకంటే రేపు ఆ అవకాశం రాకపోవచ్చు. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.’ అలానే పోరాడి 21 ఏళ్లకే సీఏ చేశాడు శ్రీకాంత్ చౌదరి. ఒంగోలుకు చెందిన ఆయన మట్టిలో మాణిక్యంలా వెలుగులోకి వచ్చాడు. పదో తరగతి, ఇంటర్, సీఏ అన్నింటిలో మొదటి ప్రయత్నంలో విజయం సాధించాడు. సీఏలో కోచింగ్ తీసుకోకుండా సొంత నోట్స్ రాసుకొని 21 ఏళ్లకే సీఏలో ఉత్తీర్ణత సాధించాడు. నోవర్టీస్, మైలాన్ తదితర మల్టీ నేషనల్ కంపెనీల్లో పనిచేశాడు. ఆడిట్ అసైన్స్మెంట్స్ మీద పది దేశాల్లో పర్యటించాడు. లక్షల్లో జీతం. కానీ ఆయన లక్ష్యం అది కాదు. బోధన అంటే ఇష్టం. అందుకే బోధన రంగంలోకి దూకాడు. మిత్రుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ఎస్ అండ్ ఎస్ అకాడమీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఆయన ఏం అంటున్నారంటే... ‘అపనమ్మకంతో పనిని మొదలు పెట్టకు. ఎందుకంటే నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. సీఏ అంటే మొదట్లో చాలా మంది భయపెట్టారు. మనం చేసే పనిని ప్రేమిస్తే.. అందులో కష్టపడితే చాలా సులువు. సీఏ సంబంధించి చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. కానీ కొత్తగా పెడితే మార్కెట్లో నిలబడతమా అనే ఓ సందేహం ఉంది. కానీ నాణ్యమైన విద్యనందించాలి. పేద విద్యార్థులకు అండగా నిలబడాలి. వ్యక్తిగతంగా మేము అభివృద్ధి చెందాలి. పేద విద్యార్థులకు రాయితీతో కూడిన విద్యనందించాలి. ఈ కాన్సెఫ్ట్తోనే అకాడమీని స్థాపించాం. -
డిగ్రీ తర్వాత ఏది బెటర్?!
గుంటూరు ఎడ్యుకేషన్: డిగ్రీ విద్య పూర్తి చేసిన తరువాతే సీఏ చదవడం ఉత్తమమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) జాతీయ అధ్యక్షుడు ఎం దేవరాజారెడ్డి విద్యార్థులకు సలహా ఇచ్చారు. ఐసీఏఐ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో బ్యాంక్ ఆడిట్పై మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చార్టర్డ్ అకౌంటెంన్సీ (సీఏ) చదవాలనే లక్ష్యం గల విద్యార్థులు ఇంటర్మీడియట్ కంటే డిగ్రీ పూర్తిచేసిన తరువాతే సీఏ కోర్సులో చేరడం మంచిదన్నారు. ఇంటర్మీడియెట్లో స్థాయిలో ఎంఈసీ కోర్సు అభ్యశించిన విద్యార్థులు ఇంటర్లో అత్యధిక మార్కులు సాధిస్తున్నప్పటికీ సీఏ-సీపీటీలో ఉత్తీర్ణత శాతం అత్యంత తక్కువగా ఉంటోందని చెప్పారు. ఇంటర్మీడియట్ దశలో విద్యార్థులు సీఏ కోర్సుపై పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోవడమే ఇందుకు కారణమన్నారు. గుంటూరు అమరావతిరోడ్డులోని ఐసీఏఐ శాఖకు సొంత భవన నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. సీఏలకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత రీతిలో ఉద్యోగావకాశాలు రానున్నాయని చెప్పారు. మార్కెట్ అవసరాలు, మారుతున్న వ్యాపార, వాణిజ్య రంగాలకు అనుగుణంగా విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఏ కోర్సు సిలబస్లో మార్పులు చేస్తున్నామని చెప్పారు. అనంతరం బ్యాంక్ ఆడిట్పై ఆడిటర్లకు అవగాహన కల్పించిన దేవరాజారెడ్డి సీఏ విద్యార్థులకు ఉపయోపడే సమాచారాన్ని అందించేందుకు ఐసీఏఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నాలెడ్జ్ కియోస్క్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్ఐఆర్సీ కౌన్సిల్ చైర్మన్ ఈ ఫల్గుణకుమార్, గుంటూరు శాఖ చైర్మన్ చేకూరి సాంబశివరావు, వైస్ చైర్మన్ చేగు అశోక్కుమార్, కార్యదర్శి కేవీ సుబ్బారావు, కోశాధికారి ఎం శ్రీనివాసరావు, సికాస చైర్మన్ ఎన్ శివరామకృష్ణ, సభ్యులు, ఆడిటర్లు, సీఏలు పాల్గొన్నారు. -
వరల్డ్ కప్కు రేపు ఆసీస్ జట్టు ప్రకటన
ఆక్లాండ్:త్వరలో భారత్ లో జరుగనున్న టీ 20 వరల్డ్ కప్ ట్రోఫీలో పాల్గొనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును మంగళవారం ప్రకటించనున్నారు. ఈ మేరకు సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా) సెలక్టర్ రాడ్ మార్ష్ స్పష్టం చేశారు. దీంతో పాటు మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ఆసీస్ జట్టును ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు మూడు వన్డేల సిరీస్ తో పాటు, రెండు టెస్టుల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. -
మౌలిక సంస్కరణలే మందు
విశ్లేషణ వ్యవసాయం రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని మౌలిక సంస్కరణల ద్వారానే పరిష్కరించగలం. అప్పుడు మాత్రమే అన్నదాతల ఆత్మహత్యలను నివారించగలుగుతాం. గత 20 ఏళ్లుగా రైతు మరణ మృదంగం మ్రోగుతూనే ఉన్నది. ప్రభుత్వాలు చేష్టలు డిగి చూస్తూనే ఉన్నాయి. రైతు చనిపోయిన తర్వాత ఇచ్చే పరిహారం రైతు మరణాలను ఎలా నిలువరిస్తుందో ఏలినవారికే తెలియాలి. ఇలాంటి సంస్కరణలు వికటించి, రైతు ఆత్మహత్యలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం ఖాయం. రైతు మరణానికి గాని, ఆత్మహత్యకు గాని సాకులు వెదకకూడదు. ఇవన్నీ వ్యవ సాయ సంక్షోభం నుండి ఉత్పన్నమైన ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగానే జరిగాయని ప్రభుత్వాలు గుర్తించాలి. ఈ సమాజంలో ఎవరు ఏయే కారణంగా ఆత్మహత్య చేసుకున్నా, అర్థంతరంగా తనువు చాలించినా ఈ సమాజాన్ని సృష్టించి, పోషిస్తున్న ప్రభు త్వాలదే బాధ్యత అని గుర్తించాలి. ప్రభుత్వాలు పలు చర్యలు చేపట్టినా రైతు ఆత్మహ త్యలు ఇంకా కొనసాగుతున్నాయంటే రైతు మరణాలకు మరికొన్ని ముఖ్య కారణాలున్నాయనే లెక్క. అవి 1) చిన్న కమతాలు, 2) ప్రైవేటు అప్పులు. చిన్న కమతాల వల్ల వ్యవసాయ ఉత్పాదకత, వ్యక్తిగత ఉత్పాదకత తగ్గుతాయి. రైతు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతా నికి, వ్యవసాయం నుండి ఇతర వృత్తి, వ్యాపారాలకు మరలే మొబిలిటీ కోల్పోతాడు. చిన్న కమతమొక గుదిబండగా తయారవుతుంది. చిన్న కమతాలలో ఎంత బాగా పండినా, పంటకు ఎంత మంచి ధర లభించినా మూడు ఎకరాలలోపు రైతులకు సాలుకు రూ.50వేలు కూడా నికరాదాయం రాదు. కుటుంబ ఖర్చులు భరిం చుకుంటూ తాను తెచ్చిన రెండు, మూడు లక్షల రూపా యల అప్పుపై 24 శాతం వడ్డీ చెల్లించడం అసాధ్యం. ఫలితంగా అప్పులు పెరుగుతూ ఉంటాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. నిస్సహాయ స్థితిలో, అవమాన భారంతో, భవిష్యత్తు శూన్యంగా తోచి ఆత్మహత్యకు పాల్పడతారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులలో 99 శాతం మంది మూడెకరాలలోపు అసాములు, కౌలు రైతులు. చిన్నకమతాల సమస్యను శాశ్వతంగా పరిష్క రించకపోతే రైతు మరణాలు జరుగుతూనే ఉంటాయి. ఇక రెండవ సమస్య ప్రైవేటు అప్పులు. బాకీ వసూలుకు ప్రైవేటు రుణదాతల విధానాలు వేరుగా ఉంటాయి. రుణగ్రహీత కూడా ఎదిరించలేడు. తాను సంతకం పెట్టిన అనేక ప్రాంసరీనోట్లు, చెక్కులు, కాగి తాలు రుణదాత వద్ద ఉన్నాయన్న స్పృహ అతడిని తల వంచేటట్లుగా చేస్తుంది. ప్రైవేటు రుణదాతల బారిన పడకుండా అన్నదాతలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు కొన్ని సూచనలు : 1) సామాజిక కార్యకర్తలతో మండలానికొక కమిటీ నియమించాలి. ఆత్మహత్య చేసుకోవాలన్న రైతు విచా రంగా ఉండటం, రాత్రులందు సరిగా నిద్రించకపో వడం, భోజనంపై ఆసక్తి చూపకపోవడం, ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయడం, సన్నిహితుల వద్ద, కుటుంబ సభ్యుల వద్ద సమస్యలకు తన చావే పరిష్కారమని వాపోతుంటాడు. ఇలాంటి వారిని కమిటీలు గుర్తించి కుటుంబ సభ్యులు వెన్నంటి ఉండేలా హెచ్చరించాలి. కౌన్సిలింగ్ నిర్వహించాలి. 2) ప్రైవేటు రుణదాతలతో సంప్రదించి, రైతు దివాలా తీసినట్లు భావించి, రుణ పరిష్కారం చేయాలి. పరిష్కారం ఒక లక్ష రూపాయలకు లోబడి చేయాలి. 3) ప్రైవేటు రుణదాతలు ఒకే రుణానికి అనేక ప్రాంసరీనోట్లు, చెక్కులు, కాగితాలపై తేదీలు, రుణ మొత్తం కూడా లేకుండా సంతకాలు తీసుకోకుండా నివారించాలంటే ప్రాంసరీ నోటును తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాల్సిన డాక్యుమెంటుగా నిర్వచించాలి. 4) సహకార వ్యవసాయ సంఘాలను ప్రోత్స హించాలి. గ్రామాల పరిధిలోని భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయాన్ని నిర్వహించే ఈ సంఘాలకు ప్రభుత్వం నుండి సబ్సిడీలు, ఎరువులు, రుణాల రూపంలో సహకారం అందించాలి. 5) ఈ రోజు పేద నుండి మధ్యతరగతి కుటుం బాల వరకు వారి సంపాదనను ఆస్తులను కూడా మింగి వేస్తున్న రెండు రంగాలు వరుసగా వైద్యం, విద్య. సామాన్య కుటుంబాలను కూడా కూలద్రోయగల స్థాయి లో వైద్య ఖర్చులుంటున్నాయి. ప్రభుత్వ విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపర్చాలి. 6) అభివృద్ధి, పారిశ్రామిక వికేంద్రీకరణ ద్వారా గ్రామాల్లో వృత్తి, ఉద్యోగ వ్యాపారాల అవకాశాలు మెరుగుపర్చడం అవసరం. 7) మూడు ఎకరాలను కనీస కమతంగా గుర్తిం చాలి. మూడెకరాలలోపు రైతు భూమిని అమ్మవలసి వస్తే పాక్షికంగా అమ్మకూడదు. పూర్తిగా అమ్మివేయాలి. రైతు మరణాల సమస్య చాలా తీవ్రమైనది. తీవ్ర వాద, ఉగ్రవాద ఉద్యమాలలో కన్నా మరే ఇతర ఉద్య మాలకన్నా, పాకిస్తాన్తో యుద్ధంలోకన్నా రైతు బలవన్మరణాల సంఖ్య ఎక్కువ. అందువల్ల తీవ్రమైన సంస్కరణలు చేయడానికి వెనుకాడకూడదు. సీపీఐ/మార్క్ఫెడ్ ద్వారా పంటలు కొనుగోలు చేసే నిర్ణయం కానీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతు లకు ప్రభుత్వం ఇచ్చే అనుమతుల నిర్ణయం కానీ ఆలస్యం అవకుండా పంట మార్కెట్కు రావడం ప్రారం భించినప్పటి నుంచే అమలులో ఉండేలా చూడాలి. చిన్న కమతాలకు పరిష్కార మార్గం చూపి, ప్రైవేటు రుణాలను నియంత్రించి, ప్రాథమిక విద్య, వైద్య రంగాలను అభివృద్ధిపరిచి, పారిశ్రామిక వికేంద్రీ కరణ చేసి, గ్రామాల్లో సౌకర్యాలు మెరుగుపర్చడం ద్వారా ముఖ్యంగా రైతులకు మనోధైర్యం కల్పించడం ద్వారా రైతు ఆత్మహత్యలను అరికట్టవచ్చు వ్యాసకర్త ఎల్ఎల్బీ, ఎఫ్సీఏ, చార్టెర్డ్ అకౌంటెంట్ ఈ. హరిబాబు, మొబైల్ : 9949911966 -
కష్టమే అయినా.. ఇష్టపడి చదివా..
interview ‘సాక్షి’తో ఐసీడబ్ల్యూఏ ఆలిండియా మూడో ర్యాంకర్ తులజ భవానీ ‘కష్టే ఫలి..’ అన్నారు పెద్దలు. ఇష్టపడి చదివితే కొంచెం కష్టమనిపించినా లక్ష్యాన్ని తేలిగ్గా చేరుకోవచ్చని నిరూపించారు నగరానికి చెందిన తులజ భవానీ. ఏం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకున్న ఆలోచనధోరణే ఆమెను శిఖరాగ్రాన నిలబెట్టింది. 2013లో ఐసీడబ్ల్యూఏ కొత్త సిలబస్లో ఆలిండియా మూడో ర్యాంక్, మహిళా విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన తులజ జాతీయస్థారుులో నగరఖ్యాతిని ఇనుమడింపజేశారు. మార్చిలో కోల్కతాలో జరిగే స్నాతకోత్సవంలో ఐసీఎంఏ నుంచి నాలుగు బంగారు పతకాలు, రెండు నగదు బహుమతులు అందుకోనున్నారు. ఈ సందర్భంగా తులజ భవానీ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ.. - భవానీపురం సాక్షి : ఐసీడబ్ల్యూఏలో దేశంలోనే మూడో ర్యాంక్ సాధించిన మీకు అభినందనలు. తులజ : ధన్యవాదాలు సాక్షి : మీ కుటుంబ నేపథ్యం.. తులజ : మాది గుంటూరు జిల్లా తెనాలి. అక్కడి మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్లోనే చదువుకున్నాను. వ్యాపారవేత్త అరుున నాన్న చంద్రశేఖర్(బాచి) నా పదేళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి గృహిణి అయిన అమ్మ తారావాణి అన్నీతానై పెంచింది. ఏనాడూ ఇది చదువు.. అది చదువు అంటూ నన్ను ఒత్తిడికి గురిచేయలేదు. అందుకేనేమో ఈ స్థాయికి చేరుకున్నా. సాక్షి : సీఏ ఎందుకు చదవాలనిపించింది? తులజ : పదో తరగతి పూర్తయ్యూక ఇంజినీరింగ్ లేదా డాక్టర్ చదివేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. మొదటి నుంచి డాక్టర్ చదవాలనుకున్న నేను పదో తరగతి పూర్తయ్యూక అందరికంటే భిన్నమైన మార్గంలో వెళ్లాలనుకున్నాను. ఇంటర్లో ఏంఈసీ తీసుకున్నా. 2010లో విజయవాడ చేరుకుని మాస్టర్ మైండ్ కాలేజీలో చేరాను. సాక్షి : అక్కడి నుంచి మీ చదువు ఎలా సాగింది? తులజ : ఇష్టపడి చదివాను.. ఇంటర్లో 966 మార్కులతో ఎంఈసీలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించాను. ఆ తరువాత సీఏ సీపీటీలో మంచి మార్కులు సాధించి అదే కళాశాలలో సీఏ పూర్తి చేశాను. సాక్షి : ఆ తరువాత... తులజ : సీఏ పూర్తయ్యాక ఐసీడబ్ల్యూఏ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాను. ఈ కోర్సును ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (ఐసీఎంఏ) వారు నిర్వహిస్తున్నారు. రెండూ వేర్వేరు కోర్సులు. ఒక్కోటి నాలుగేళ్లపాటు చదవాలి. సాక్షి : ఫలితాలొచ్చాక ఏమనిపించింది? తులజ : 2014 మార్చిలో ఫలితాలు వచ్చాయి. ఆలిండియా స్థారుులో మూడోస్థానం, మహిళల్లో మొదటి స్థానం సాధించినందుకు ఆనందంగా ఉంది. ఈ ఏడాది మార్చిలో కోల్కతాలో జరిగే స్నాతకోత్సవంలో ఐసీఎంఏ నుంచి నాలుగు బంగారు పతకాలు, రెండు నగదు బహుమతులు అందుకోనున్నాను. సాక్షి : భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? తులజ : అనుకున్నది సాధించాను. అన్నీ అనుకూలిస్తే ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నా. సాక్షి : విష్ యూ బెస్టాఫ్ లక్. -
సీఏ, సీఎస్, సీఎంఏ.. ప్రాక్టికల్ ట్రైనింగ్.. పరిపూర్ణతకు మార్గం
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ); కంపెనీ సెక్రటరీ (సీఎస్); కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్ (సీఎంఏ).. కామర్స్ రంగంలో దశాబ్దాలుగా ఆదరణ పొందుతున్న ప్రొఫెషనల్ కోర్సులు. నేటి పారిశ్రామికీకరణ, గ్లోబలైజేషన్ యుగంలో వీటికి మరింత డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు వీటి విషయంలో ఎదురవుతున్న సమస్య... నైపుణ్య లేమి. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన నియంత్రణ సంస్థలు ప్రాక్టికల్ ట్రైనింగ్కు ప్రాధాన్యమిచ్చాయి. మరే ఇతర కోర్సుల్లో లేని విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ను తప్పనిసరి చేశాయి. క్షేత్ర నైపుణ్యాలు పెంపొందించుకోవడం కరిక్యులంలో భాగం చేశాయి. ఈ నేపథ్యంలో సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల ప్రాక్టికల్ ట్రైనింగ్పై ఫోకస్.. సీఏ.. ఆర్టికల్షిప్కు అత్యంత ప్రాధాన్యం చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో ప్రాక్టికల్ ట్రైనింగ్ను ఆర్టికల్షిప్గా పేర్కొంటున్నారు. కోర్సు నియంత్రణ సంస్థ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆర్టికల్షిప్నకు అత్యంత ప్రాధాన్యమిస్తూ నిబంధనలు అమలు చేస్తోంది. మూడేళ్ల ఆర్టికల్షిప్ పూర్తి చేసినవారిని మాత్రమే కోర్సు ఫైనల్ పరీక్షల్లో హాజరుకు అనుమతిస్తోంది. సీఏ విద్యార్థులు కోర్సు రెండో దశ ఐపీసీసీలో పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచే గుర్తింపు పొందిన ఆడిటర్ లేదా ఆడిట్ సంస్థ వద్ద ఆర్టికల్ ట్రైనింగ్లో అడుగుపెట్టాలి. విద్యార్థులు తాము థియరిటికల్గా చదువుతున్న అంశాలను అప్పటికప్పుడు ప్రాక్టికల్గా అన్వయించే నైపుణ్యాలు సొంతం చేసుకునేలా చేయడమే ఈ నిబంధన ప్రధాన ఉద్దేశం. ఫలితంగా ఫైనల్ సర్టిఫికెట్ చేతికందేనాటికి విద్యార్థికి ఒక పూర్తిస్థాయి సీఏకు అవసరమైన అన్ని నైపుణ్యాలు లభిస్తాయి. ఆర్టికల్షిప్ సమయంలో ట్రైనీకి నిర్ణీత మొత్తంలో స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. అదే విధంగా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా సెలవులు ఇవ్వాలని కూడా ఐసీఏఐ స్పష్టం చేసింది. సమస్యలివే ట్రైనీలు తమ ఆర్టికల్షిప్ సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమను సదరు సంస్థ లేదా సర్టిఫైడ్ ఆడిటర్ అన్ని విభాగాల్లో పాల్పంచుకోనీయడం లేదని, దీనివల్ల అన్ని అంశాలపై అవగాహన లభించట్లేదని ట్రైనీలు అంటున్నారు. అంతేకాకుండా సీఏ పరీక్షల ప్రిపరేషన్ కోణంలో ఐసీఏఐ నిర్దేశించిన విధంగా సెలవుల మంజూరు కూడా ఉండట్లేదని చెబుతున్నారు. దీనికి ప్రిన్సిపల్ ఆడిటర్స్ స్పందిస్తున్న తీరు భిన్నంగా ఉంటోంది. ఆర్టికల్ ట్రైనీలు ఒక సంస్థలోని అన్ని కార్యకలాపాల్లో పాల్పంచుకోవాలనే విషయంలో ఆ సంస్థ లేదా ఆడిటర్ దృక్పథం ప్రధాన పాత్ర పోషిస్తుందంటున్నారు. క్లయింట్లు ఎక్కువగా ఉన్న సంస్థలో ఆడిటర్ తమ క్లయింట్లకు త్వరగా సేవలందించాలనే లక్ష్యంగా ఉంటారు. ఇలాంటి సంస్థల్లో ఆర్టికల్ ట్రైనీలకు అన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎక్కువ సమయం కేటాయించే పరిస్థితి ఉండదు. కాబట్టి అభ్యర్థులే సహజ చొరవతో పరిశీలన నైపుణ్యాలను పెంచుకుని సంస్థలో జరుగుతున్న కార్యకలాపాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. సెలవుల మంజూరు కూడా సంస్థ లేదా ఆడిటర్పైనే ఆధార పడి ఉంటుంది. ‘చిన్న సంస్థల్లో సిబ్బంది తక్కువగా ఉంటారు. అలాంటి వారు విధుల పరంగా ఆర్టికల్ ట్రైనీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతోవారికి సెలవులు మంజూరు చేయడంలో కొంత సమస్య ఎదురవుతోంది’ అంటున్నారు హైదరాబాద్లోని ప్రముఖ ఆడిట్ సంస్థ నిర్వాహకులు. ఆర్టికల్షిప్తోపాటు అదనంగా.. నిర్దేశించిన ఆర్టికల్షిప్ పూర్తయిన తర్వాత మూడు నెలలపాటు జనరల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్(జీఎంటీ) కూడా చేయాలి. అకౌంటింగ్ నైపుణ్యాలతోపాటు నిర్వహణ పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఐసీఏఐ ఈ జీఎంటీకి రూపకల్పన చేసింది. కానీ.. చాలామంది విద్యార్థులు సిలబస్ విస్తృతంగా ఉండే సీఏ కోర్సు పరీక్షలో ఉత్తీర్ణతకే ప్రాధాన్యమిస్తున్నారు. థియరిటికల్ ప్రిపరేషన్కే ఎక్కువ సమయం కేటాయిస్తూ డమ్మీ ఆర్టికల్స్ను అన్వేషిస్తున్నారనే అభిప్రాయముంది. తప్పనిసరిగా ప్రత్యక్షంగా ఆర్టికల్షిప్ పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్టికల్స్, థియరీ రెండింటికీ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగితే ప్రాక్టికల్ నైపుణ్యాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఆర్టికల్షిప్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం ఐసీఏఐను సంప్రదించవచ్చు. సీఎంఏలోనూ మూడున్నరేళ్లు.. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ).. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే కోర్సు. మారిన నిబంధనలతో సర్వీసెస్ నుంచి సాఫ్ట్వేర్ వరకు అన్ని రంగాల్లోనూ ఇప్పుడు కాస్ట్ అకౌంటెంట్ల అవసరం ఏర్పడింది. ప్రధానంగా ఉత్పత్తి సంస్థల్లో కాస్ట్ అకౌంటెంట్ల డిమాండ్ ఎక్కువ. సీఏంఏ కోర్సు నిర్వహణ సంస్థ ఐసీఎంఏఐ విద్యార్థుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలకు పెద్దపీట వేస్తోంది. సీఏ మాదిరిగానే మూడున్నరేళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్ను తప్పనిసరి చేసింది. అయితే సీఎంఏ కోర్సు విషయంలో విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా కొంత వెసులుబాటు ఉంది. సీఏలో మాదిరిగా మూడేళ్లు ఆర్టికల్ చేస్తేనే ఫైనల్ పరీక్షకు అర్హత అనే నిబంధన సీఎంఏలో లేదు. కోర్సు రెండోదశగా పేర్కొనే ఇంటర్మీడియెట్ తర్వాత ఆరు నెలలు తొలి దశ ప్రాక్టికల్ ట్రైనింగ్ను పూర్తి చేసుకుంటే.. ఫైనల్ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది. తర్వాత ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక తప్పనిసరిగా మూడేళ్లపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేయాలి. అప్పుడే సంస్థ నుంచి స్టూడెంట్షిప్ లభిస్తుంది. అంతేకాకుండా సీఎంఏ విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్కు సీఏతో పోల్చితే ఎక్కువ మార్గాలు ఉన్నాయనేది నిపుణుల అభిప్రాయం. కేవలం ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ల వద్దే కాకుండా సంస్థల్లోనూ ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేసుకునే వీలుంది. సీఎంఏ ప్రాక్టికల్ ట్రైనింగ్ విషయంలో విద్యార్థులు పేర్కొంటున్న సమస్యలు.. అన్ని విభాగాలపై అవగాహన కల్పించకపోవడం, పరీక్షలకు సెలవులు ఇవ్వకపోవడం. అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చే సంస్థ ఏదో ఒక విభాగంలో వారిని నియమిస్తోంది. దాంతో అన్ని అంశాలపై అవగాహన లభించడం లేదు. విద్యార్థులు చొరవగా ఆయా విభాగాల్లోని వారితో మాట్లాడం ద్వారా అక్కడి పనితీరును తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సీఎస్.. ట్రైనింగ్ తప్పనిసరి.. కానీ.. కంపెనీ సెక్రటరీ కోర్సు... ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా మూడు దశలుగా నిర్వహించే ఈ కోర్సులోనూ ప్రాక్టికల్ ట్రైనింగ్ తప్పనిసరి. ప్రస్తుతం ఫౌండేషన్ కోర్సు, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అనే మూడు దశలుగా సీఎస్ కోర్సు స్వరూపం ఉంది. తాజా నిబంధనల ప్రకారం- ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా ఫౌండేషన్ కోర్సు నుంచే దీన్ని ప్రారంభించొచ్చు. ఫౌండేషన్ కోర్సు నుంచి మూడేళ్లు; ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ తర్వాత రెండేళ్లు; ప్రొఫెషనల్ కోర్సు తర్వాత ఒక ఏడాది ప్రాక్టికల్ ట్రైనింగ్ (అప్రెంటీస్షిప్) పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ తాజా మార్పు విషయంలోనే ఈ రంగంలోని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎస్ తుది దశ అయిన ప్రొఫెషనల్ కోర్సు తర్వాత ఏడాది వ్యవధిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేస్తే చాలు అనే వెసులుబాటు కారణంగా.. అత్యధిక శాతం మంది అభ్యర్థులు ప్రాక్టికల్స్కు అత్యల్ప ప్రాధాన్యమిస్తారని అంటున్నారు. ముందుగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా వ్యవహరిస్తారని పర్యవసానంగా క్షేత్ర నైపుణ్యాలు కొరవడతాయని చెబుతున్నారు. ఇది భవిష్యత్ కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఔత్సాహికులు వెసులుబాట్లు గురించి అన్వేషించకుండా.. క్షేత్ర నైపుణ్యాలు పెంచుకునే విధంగా వీలైనంత ఎక్కువ సమయం ప్రాక్టికల్ ట్రైనింగ్కు కేటాయించాలి. అప్పుడే తాము అకడమిక్గా చదువుకున్న అంశాలకు సంబంధించి రియల్టైం అప్లికేషన్స్పై అవగాహన ఏర్పడుతుంది. కంపెనీల చట్టం, ఇతర న్యాయ పరమైన సబ్జెక్ట్ల ప్రాధాన్యం ఎక్కువగా ఉండే సీఎస్లో పరిపూర్ణత లభించాలంటే ప్రాక్టికల్ అప్రోచ్కు పెద్దపీట వేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాక్టికల్ ట్రైనింగ్ (అప్రెంటీస్షిప్) విషయంలో వ్యక్తిగతంగానైనా చొరవ చూపి ముందుకు సాగాలి. అప్పుడే కోర్సులో చేరిన లక్ష్యం నెరవేరడంతోపాటు సుస్థిర భవిష్యత్తు సొంతమవుతుంది. ప్రొఫెషనల్గా రూపొందాలంటే.. ప్రాక్టికల్ నాలెడ్జ్, స్కిల్ సెట్ల అవసరం సీఏ, సీఎంఏ, సీఎస్ కెరీర్కు చాలా ఎక్కువ. కారణం.. తాము చదివిన అంశాలను తక్షణమే అన్వయించాల్సిన విధంగా విధులు ఉంటాయి. దాంతో ఈ రంగంలో మంచి ప్రొఫెషనల్గా పేరు గడించాలంటే తప్పనిసరిగా ప్రాక్టికల్ అప్రోచ్ పెంపొందించుకోవాలి. పరీక్షల్లో ఉత్తీర్ణత గురించి ఆందోళన చెందకుండా అకడమిక్ సిలబస్ ప్రిపరేషన్ సాగిస్తూనే ప్రాక్టికల్ ట్రైనింగ్లో వాటిని అన్వయించే నైపుణ్యాలు పెంచుకుంటే సర్టిఫికెట్ సొంతం చేసుకోవడం ఎంతో సులభం. చేయూతనిస్తున్న ఇన్స్టిట్యూట్లు.. సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా విద్యార్థులకు సదరు నిర్వహణ ఇన్స్టిట్యూట్లు చేయూతనిస్తున్నాయి. ట్రైనింగ్ మార్గాలు అన్వేషిస్తున్న అభ్యర్థులకు సహకరిస్తున్నాయి. ఆయా ఇన్స్టిట్యూట్ల చాప్టర్లను సంప్రదిస్తే ప్రాక్టికల్ ట్రైనింగ్కు అవకాశం కల్పిస్తున్న సంస్థలు, ప్రాక్టీసింగ్ ఆడిటర్స్/సెక్రటరీస్ సమాచారం తెలియజేస్తున్నాయి. పోస్టల్ కోచింగ్ ద్వారా కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు; నాన్-మెట్రోస్లోని విద్యార్థులకు ఈ సదుపాయం ఎంతో మేలు చేస్తోంది. ప్రాక్టికల్ థింకింగ్ ఉంటేనే... సీఏ కెరీర్లో అడుగుపెట్టే విద్యార్థులు ముందుగా తమలో ప్రాక్టికల్ థింకింగ్ లెవెల్స్పై స్పష్టతకు రావాలి. ఎందుకంటే.. సీఏ కోర్సులో ప్రాక్టికాలిటీ ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ రంగంలోని సీనియర్లను, సంస్థలను, ప్రాక్టీసింగ్ సీఏలను సంప్రదించి తమ అవగాహన స్థాయి తెలుసుకోవాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఆర్టికల్ షిప్) విషయానికొస్తే.. పకడ్బందీ అన్వేషణ సాగించాలి. సదరు సంస్థ లేదా ఆడిటర్కు ఉన్న గుర్తింపు, క్లయింట్ల సంఖ్య-స్థాయి ఆధారంగా ఆర్టికల్షిప్నకు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఆర్టికల్షిప్ సమయంలో సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకునే కోణంలో కృషి చేస్తే పరిపూర్ణ అవగాహన లభిస్తుంది. ‘పరీక్షలో ఉత్తీర్ణతకే ప్రాధాన్యమిద్దాం. తర్వాత విధుల్లో చేరి ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవచ్చు’ అనే ఆలోచన సరికాదు. - ఎం.దేవరాజ రెడ్డి, చైర్మన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్,ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సీఎంఏ.. క్షేత్ర నైపుణ్యాలు ఎంతో ముఖ్యం సీఎంఏ కోర్సు విషయంలో క్షేత్ర నైపుణ్యాలు ఎంతో ముఖ్యం. అందుకే మూడున్నరేళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్ను తప్పనిసరి చేశాం. ఇదే సమయంలో విద్యార్థుల కోణంలోనూ ఆలోచించి వెసులుబాటు కల్పించాం. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. వీలైనంత వరకు ఫైనల్ పరీక్ష నాటికి అధిక శాతం ప్రాక్టికల్ ట్రైనింగ్ను పూర్తి చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ సమయంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాటు చేశాం. కాబట్టి ఒకటిరెండు సంఘటనలు చూసి ఆందోళన చెందకుండా.. నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి. - ఎ.ఎస్. దుర్గా ప్రసాద్, చైర్మన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిరంతర అవగాహనతోనే సీఎస్లో రాణింపు సీఎస్ కోర్సులో రాణించాలంటే నిరంతర అవగాహనే ప్రధానం. ఇందుకు సాధనం ప్రాక్టికల్ ట్రైనింగ్(అప్రెంటీస్షిప్). దీని విషయంలో ప్రస్తుతం పలు వెసులుబాట్లు ఉన్నాయి. ఔత్సాహిక విద్యార్థులు వాటి గురించి పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందే విధంగా అడుగులు వేయాలి. ముఖ్యంగా లీగల్ నాలెడ్జ్ ఆవశ్యకత ఎక్కువగా ఉండే సీఎస్ కోర్సులో రియల్టైం ఎక్స్పోజర్ ఎంతో అవసరం. దీన్ని గుర్తించి ఎగ్జిక్యూటివ్ దశ నుంచే ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రారంభించడం మంచిది. - డి. వాసుదేవరావు, చైర్మన్, ఐసీఎస్ఐ-హైదరాబాద్ చాప్టర్ ఎడ్యూ ఇన్ఫో విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ఏఐసీటీఈ చర్యలు భారతదేశంలోని ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్లో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా ఏఐసీటీఈ చర్యలు తీసుకుంటోంది. ఉన్నత విద్యను అంతర్జాతీయీకరణ చేయాలనే ఉద్దేశంతోపాటు, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇన్స్టిట్యూట్లలో సాంస్కృతిక వైవిధ్యం కూడా పెరుగుతుందని, ఫలితంగా మన విద్యార్థులు భవిష్యత్తులో విదేశాల్లోనూ రాణించేందుకు ఆస్కారం లభిస్తుందని ఏఐసీటీఈ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో భారత్లో చదవాలనుకుంటున్న ఔత్సాహిక విదేశీ విద్యార్థుల కోసం అమెరికాలో నిర్వహిస్తున్న స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మాదిరిగా ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేసే దిశగా ఏఐసీటీఈ వేగంగా అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి భారత్కు ఉన్నత విద్య కోసం వస్తున్న విద్యార్థుల సంఖ్య 2013 నాటికి 1.3 లక్షలు ఉండగా ప్రతి ఏటా వస్తున్న సంఖ్యను పరిగణిస్తే అది 15 శాతంలోపే ఉంటోంది. తాజాగా తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
హైదరాబాద్ జట్ల జయకేతనం
సీనియర్స్, జూనియర్స్ ట్రోఫీలు వశం సాక్షి, హైదరాబాద్: చెన్నైలో జరిగిన ఇంటర్స్టేట్ ఎమర్జింగ్ టి-20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ సీనియర్, జూనియర్ ఈసీడీజీ జట్లు విజేతలుగా నిలిచాయి. సీనియర్ విభాగంలో జరిగిన ఫైనల్లో ఎమర్జింగ్ క్రికెట్ డెవలప్మెంట్ గ్రూప్ (ఈసీడీజీ) హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో అశోక్ ఆనంద్ సీఏపై గెలిచింది. మొదట అశోక్ ఆనంద్ సీఏ 19.1 ఓవర్లలో 80 పరుగులకే ఆలౌటైంది. సంజిత్ 16 పరుగులు చేయగా, వంశీ, షాదతుల్లా చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత ఈసీడీజీ హైదరాబాద్ జట్టు 12.2 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసి విజయం సాధించింది. అభినవ్ (47) రాణించాడు. జూనియర్స్ ఫైనల్లో ఈసీడీజీ 44 పరుగుల తేడాతో కేదార్ సీఏపై నెగ్గింది. తొలుత ఈసీడీజీ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది. ప్రణవ్ 32, షాయిజన్ 31, గౌస్ 22 పరుగులు చేశారు. తర్వాత కేదార్ సీఏ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 92 పరుగులే చేయగల్గింది. ప్రసన్న 15 పరుగులు చేయగా, రిషి రెడ్డి 3 వికెట్లు తీశాడు. -
ఆసీస్ టెస్టు జట్టులో షాన్ మార్ష్
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా టెస్టు జాబితాలో లెఫ్ట్ హ్యాండెడ్ ఆటగాడు షాన్ మార్ష్ కు స్థానం దక్కింది. టీమిండియాతో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్ ల్లో భాగంగా తొలి టెస్టుకు తిరిగి షాన్ మార్ష్ కు స్థానం కల్పిస్తూ సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా) నిర్ణయం తీసుకుంది. మైకేల్ క్లార్క్ ఫిట్ నెస్ పై ఇంకా స్పష్టత రాకపోవడంతో అదనపు ఆటగాడిగా మార్ష్ ను ఎంపిక చేసినట్లు సెలెక్షన్ ప్యానెల్ తెలిపింది. ఈ నెల 9 వ తేదీ నుంచి అడిలైడ్ లో జరిగే తొలిటెస్టుకు సంబంధించి గురు, శుక్రవారాల్లో ఆస్ట్రేలియా టెస్ట్ స్వ్కాడ్ సమావేశమయ్యే అవకాశం ఉంది. -
దేశ ఆర్థిక వ్యవస్థలో సీఏల పాత్ర కీలకం
దేశ ఆర్థిక వ్యవస్థలో సీఏల పాత్ర కీలకం వార్షికోత్సవ సభలో మాగ్నజీల్ చైర్మన్ రేపాల గుంటూరు ఎడ్యుకేషన్: దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడంలో సీఏలు కీలకపాత్ర పోషిస్తున్నారని మ్యాగ్నజీల్ చైర్మన్ రేపాల రవికుమార్ చెప్పారు. సీఏ లక్ష్యంగా గల యువత లక్ష్య సాధనకు అవసరమైన శిక్షణ, ప్రేరణతో భావి జీవితంలో నెగ్గుకు వచ్చే మార్గదర్శనం చేస్తున్నామని చెప్పారు. బ్రాడీపేట 3వ లైనులోని కార్యాలయంలో మ్యాగ్నజీల్ సీఏ విద్యాసంస్థ ద్వితీయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రవికుమార్తోపాటు సంస్థ డెరైక్టర్ రేపాల భానువిజేత, విద్యార్థులతో కలిసి గాలిలోకి బెలూన్లు వదిలి సందడి చేశారు. అనంతరం కేక్ కట్ చేసిన రవికుమార్ మాట్లాడుతూ దేశానికి ప్రతిభావంతులైన సీఏ విద్యార్థులను అందించే లక్ష్యంతో రెండేళ్ళ క్రితం నెలకొల్పిన మ్యాగ్నజీల్ అదే స్ఫూర్తితో ప్రగతి పధంలో దూసుకెళుతోందన్నారు. కార్యక్రమంలో అకడమిక్ డీన్ వైఎల్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యానగర్లోని సంస్థ హాస్టల్ క్యాంపస్లో సాయంత్రం జంబోరీ పేరుతో విద్యార్థినులు డ్యాన్సులతో హోరెత్తించారు. సినీ, పాప్ గీతాలకు నృత్యాలతో హుషారెత్తించారు. పలువురు విద్యార్థినులు గీతాలాపనతో ఆకట్టుకున్నారు. -
మిల్లు అకౌంటెంట్ బిడ్డ... చార్టర్డ్ అకౌంటెంట్
భిన్నంగా ఉజ్వల భవిత ఉండే చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)గా తనను తాను మలచుకోవాలని తపించాడు. ప్రతిభా పాటవాలకు పదునుపెడుతూ... అవగాహన, విశ్లేషణ సామర్థ్యాలను ఒంట బట్టించుకున్నాడు. ఫలితం... అసలు సిసలైన సీఏ పరీక్షలో జాతీయస్థాయిలో 34వ ర్యాంకర్గా నిలిచాడు. 21 ఏళ్ల ప్రాయంలోనే చార్టర్డ అకౌంటెంట్ పూర్తి చేసిన రామాయణం సాయి సూర్యతేజ విజయ రహస్యం ఆయన మాటల్లోనే. మాది గుంటూరు జిల్లా నరసారావుపేట. నాన్న శివ నారాయణ. ఓ దాల్ మిల్లులో అకౌంటెంట్. అమ్మ విజయ. పెద్దక్క నాగలక్ష్మీ ప్రసన్న బీటెక్ చదివింది. చిన్నక్క మాధవీలత. రాజస్థాన్లో బిట్స్ పిలానీ చేసింది. ప్రస్తుతం బెంగళూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అన్నయ్య పవన్ జగదీశ్ బీటెక్ ఈసీఈ. సోనీ ఎరిక్సన్లో ఉద్యోగం వచ్చింది. వీరిని అనుసరించకుండా సీఏతో జీవితంలో బాగా స్థిర పడొచ్చని పదో తరగతిలోనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాను. చిన్నక్క సలహా: ప్రస్తుతం అందరూ మెడిసిన్, ఇంజనీరింగ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అలా కాకుండా భిన్నంగా కెరీర్ ఎంచుకోమని చిన్నక్క మాధవీ లత సూచించింది. సీఏ చేస్తే కెరీర్ బాగుంటుందని సలహా ఇచ్చింది. సీఏసీపీటీ నుంచి సీఏ ఫైనల్ పరీక్షల దాకా ప్రోత్సహించింది. ఇంటర్ ఎంఈసీలో రాష్ట్రస్థాయి రెండో ర్యాంక్ సాధించాను. అదే నాలో సీఏ చేయడానికి ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆరు సబ్జెక్టులకు కోచింగ్: హైదరాబాద్లో తుకారాం అండ్ కోలో ఆర్టికల్షిప్ చేస్తూ సీఏ ఫైనల్ పరీక్షలకు కేవలం మూడున్నర నెలల పాటు మాత్రమే ప్రిపేరయ్యాను. ఫైనల్ పరీక్షలకు మొత్తం 8 సబ్జెక్టులలో ఇస్కా (ఆరోపేపర్), డెరైక్ట్ టాక్సెస్ (ఏడో పేపర్)లను సొంతంగా ప్రిపేరయ్యాను. మిగతా ఆరింటికి కోచింగ్ తీసుకున్నాను. కష్టమనిపించిన సబ్జెక్ట్: ఆడిటింగ్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సబ్జెక్ట్ కష్టమనిపించింది. ఇందులో ఉత్తీర్ణుడవుతానో లేదో అనే భయమేసింది. దీనిపై మరింత అధికంగా దృష్టి సారించాను. నాణ్యమైన స్టడీ మెటీరియల్ను చదివాను. చదివే అంశాలను రివిజన్ చేశాను. నోట్స్లో పాయింట్లను రాసుకోవడం చేశాను. మిగతా వాటికంటే అధిక సమయం కేటాయించాను. ర్యాంక్ గురించి ఆలోచించకుండా సీఏలో ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో చదివాను. ఖాళీ సమయాన్ని సద్వినియోగపరచుకున్నాను. విశ్లేషణాత్మక ఒరవడితో ప్రతీ పేపర్ను రాసి మంచి ర్యాంక్ సాధించాను. సబ్జెక్టుల వారీ ప్రణాళిక: గ్రూప్-1లో స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కార్పోరేట్ అండ్ అలైడ్ లాస్ అడ్వాన్స్డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఉంటాయి. గ్రూప్-2లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, డెరెక్ట్ ట్యాక్స్ లాస్, ఇన్డెరైక్ట్ ట్యాక్స్ లాస్,ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్ ఉంటాయి. రోజూ అన్ని సబ్జెక్టులనూ చదివేలా ప్రణాళిక రచించుకోవాలి. ఆర్టికల్ షిప్ సమయంలో ఒక్కో సబ్జెక్టుకు రోజుకు గంట సమయాన్ని కేటాయిస్తే తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులవడం సులభం. సీఏలో 64.25 శాతం మార్కులు సాధించాను. మార్పులు గ్రహించాలి: ఆర్టికల్ షిప్ కాలంలో సబ్జెక్టులను విస్మరించకుండా జాగ్రత్త పడ్డాను. అన్ని సబ్జెక్టులు ఆర్థి క వ్యవస్థకు సంబంధించినవి కాబట్టి ఎప్పటికప్పుడు వ్యవస్థలో చోటు చేసుకుంటున్న కొత్త మార్పులను ఆకళింపు చేసుకోవాలి. ఉదాహరణకు పన్నుల చట్టాలు, కార్మిక చట్టాలు, పరిశ్రమల చట్టాలు... ఇలా పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు, నూతన ఆర్థిక పోకడలను ప్రభుత్వం అనుసరిస్తుంది. వీటిని అనునిత్యం గమనిస్తూ అదనపు సమాచారాన్ని సేకరించాలి. వాటిని సిలబస్కు జో డించి ప్రిపరేషన్ సాగించాలి. లేకపోతే ఫైనల్ పరీక్షలో విజయం సాధించడం చాలా కష్టం. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సివిల్స్ రాస్తా: సీఏగా రెండేళ్లు చేస్తా. అనంతరం సివిల్స్ రాస్తాను. ఐఏఎస్ కావాలనుంది. తర్వాత లక్ష్యం అదే. అకడెమిక్ ప్రొఫైల్: టెన్త్ (2008): 531 ఇంటర్ ఎంఈసీ: 966 (2010- రెండో ర్యాంక్) ఐసీడబ్ల్యూఏఐ ఇంటర్: 33వ ర్యాంక్ సీఏ: 34వ ర్యాంక్ (జాతీయస్థాయి) -
'సీఏ' కలను సాకారం చేసుకోండిలా..
-
సీఏ కోర్సుకున్న డిమాండ్ ఏమిటి?
-
ప్రణాళికతో చదివితే సీఏ సులభమే
=సీఏ విద్యపై శ్రీమేధ‘వి’లో అవగాహన సదస్సు =పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు తిరుచానూరు, న్యూస్లైన్ : సరైన ప్రణాళిక, కృషి ఉంటే సీఏలో సులభంగా ఉత్తీర్ణత సాధించవచ్చని శ్రీమేధ‘వి’ సీఏ కళాశాల విద్యా సంస్థల జిల్లా డెరైక్టర్ కె.షరీఫ్ పేర్కొన్నారు. సాక్షి ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి ఎయిర్ బైపాస్రోడ్డులోని శ్రీమేధ‘వి’ సీఏ కళాశాలలో సీఏ-సీపీటీ, సీఏ-ఐపీసీసీ కోర్సులపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. షరీఫ్ మాట్లాడుతూ సీఏ కోర్సు చేయడం చాలా కష్టమని ఒకప్పుడు అనుకునేవారని పేర్కొన్నారు. శ్రీమేధ‘వి’తో సులభమంగా మారిందన్నారు. రాయలసీమ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని గత విద్యా సంవత్సరంలో తిరుపతి, ఈ విద్యా సంవత్సరంలో మదనపల్లెలో శ్రీమేధ‘వి’ సంస్థను స్థాపించినట్లు పేర్కొన్నారు. తిరుపతిలో స్థాపించిన మొదటి ఏడాదిలోనే జూనియర్ ఎంఈసీలో టాప్ టెన్లో 6 ర్యాంకులు సాధించడం తమ విద్యా బోధనకు నిదర్శనమన్నారు. జులైలో వెలువడిన సీపీటీ ఫలితా ల్లో తమ విద్యా సంస్థల విద్యార్థి కే.శరత్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారని పేర్కొన్నారు. డిసెంబర్ 15న జరిగిన సీపీటీ పరీక్షలోని ఒకట్రెండు ప్రశ్నలు మినహా మిగిలిన అన్నింటికీ శ్రీమేధ‘వి’ రూపొందించిన మెటీరియల్స్ నుంచి వచ్చినవేనని తెలిపారు. సుదీర్ఘ అనుభవం కలిగిన సీఏ క్వాలిఫైడ్ అధ్యాపకులతో విజయవాడకు దీటుగా శిక్షణ ఇవ్వడం తిరుపతి శ్రీమేధ‘వి’ ప్రత్యేకతని వివరించారు. డెరైక్టర్ కె.అస్రఫ్ మాట్లాడుతూ సమాజంలో వస్తు సేవల వినియోగం ఉన్నంత కాలం, ఆర్థిక లావాదేవీలు జరిగినంత కాలం సీఏల అవసరం ఉంటుందన్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు సీఏ-సీపీటీ ప్రవేశ పరీక్షలు రాయకుండా నేరుగా సీఏ-ఐపీసీసీలో అడ్మిషన్ పొందవచ్చన్నారు. ప్రస్తుతం సీఏ-ఐపీసీసీ తరగతులు ప్రారంభమయ్యాయన్నారు. ఐపీసీసీలో చేరే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ బి.ఉదయ్కుమార్ మాట్లాడుతూ సీఏ చేయాలన్న దృఢ సంకల్పం, ఆత్మ విశ్వాసం ఉంటే తప్పకుండా సాధించవచ్చన్నారు. ఇతర కోర్సులతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో సీఏ పూర్తి చేయవచ్చన్నారు. అలాగే వంద శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశం ఉంటుందని వివరించారు. ప్రతి ఒక్కరిపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శిక్షణ ఇవ్వడం శ్రీమేధ‘వి’ సొంతమన్నారు. సీఏ కోర్సుపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు, ఇతర వివరాలకు 9581722223, 95818 22223 నంబర్లలో సంప్రదించాలని శ్రీమేధ‘వి’ విద్యాసంస్థల జిల్లా డెరైక్టర్లు కె.షరీఫ్, కె.అస్రఫ్ కోరారు. ఈ సదస్సుకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. శ్రీమేధ‘వి’ బాలుర క్యాంపస్ ప్రిన్సిపాల్ కామేశ్వరరావు, సీపీటీ అధ్యాపకులు కిరణ్, ఢిల్లీబాబు, సందీప్, ఏవో మురళీకృష్ణ, మేనేజర్ జనార్దన్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. క్రమం తప్పకుండా చదవాలి సీఏ కోర్సులో చేరడం గొప్పకాదు. ఇతర కోర్సుల్లా పరీక్షలకు ముందు ఒక నెల చదివితే కుదరదు. క్రమం తప్పకుండా తరగతులకు హాజరవ్వాలి. అధ్యాపకులు చెప్పిన పాఠ్యాంశాలను శ్రద్ధగా వినాలి. విన్నదాన్ని అవగాహన చేసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకోవాలి. అలా చేస్తే సీఏ కోర్సును సులువుగా పూర్తి చేయొచ్చు. -ఎం.వెంకటాచలం, ఫ్యాకల్టీ, లా, ఎథిక్స్, కమ్యూనికేషన్ బేసిక్స్ ముఖ్యం సీపీటీకి సిద్ధమయ్యే విద్యార్థులకు అకౌంట్స్, ఎకనామిక్స్, లా, మ్యాథమెటిక్స్లోని బేసిక్స్ క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఇంటర్ ఎంఈసీ, సీఈసీలోని కామర్స్, సీపీటీలో అకౌంట్స్ బేసిక్ తెలిసి ఉంటే ఫైనల్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లొచ్చు. అకౌంట్స్ అనే పునాదిపైనే సీఏ ఆధారపడి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. - సి.అశోక్కుమార్, ఫ్యాకల్టీ, అకౌంట్స్ సబ్జెక్టుపై అవగాహన అవసరం సబ్జెక్టుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అందుకు అధ్యాపకులు చెప్పిన విషయాలను నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా చదవాలి. చదివిన అంశాన్ని అవగాహన చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఎంతో కష్టమనుకున్న సీఏ కోర్సును సులువుగా పూర్తి చేయొచ్చు. - వి.అరుణ్కుమార్, ఫ్యాకల్టీ, కాస్ట్ అకౌంట్స్ ఉపయోగకరంగా ఉంది తిరుపతి శ్రీమేధ‘వి’లో సాక్షి ఆధ్వర్యంలో సీఏ-సీపీటీ, ఐపీసీసీ కోర్సులపై అవగాహన సదస్సు జరుగుతుందని కొందరు చెప్పడంతో కడప నుంచి వచ్చాను. సీఏ చేయాలంటే చేపట్టాల్సిన అంశాలు, పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలనే అంశాలను ఫ్యాకల్టీలు వివరించడం నాలాంటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. -ఎస్.అన్వర్, విద్యార్థి, కడప పక్కా ప్రణాళిక అవసరం సీఏ-సీపీటీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే పక్కా ప్రణాళిక ఎంతో అవసరం. సాధారణ డిగ్రీ పరీక్షలకు చదివినట్లు చదివితే కుదరదు. విద్యార్థులు క్రమం తప్పకుండా చదువుతూ పరీక్షకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. ఈ సూత్రం ఒక సీపీటీకే కాదు, సీఏ పూర్తయ్యేంత వరకు అమలు చేయాలి. ప్రతి సబ్జెక్టునూ చాలెంజ్గా తీసుకుని పూర్తి స్థాయిలో అవగాహన కలిగించుకుని చదవాలి. కోర్సు పూర్తి చేసిన వారికి బంగారు భవిత ఉంటుందనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. - ఏ.సురేష్, ఫ్యాకల్టీ, ఆడిటింగ్ వంద శాతం ఉపాధి దేశంలో సీఏల కొరత తీవ్రంగా ఉంది. ఇతర కోర్సులతో పోలిస్తే సీఏ చేసిన వారికి వంద శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సీఏ ఎంచుకున్న విద్యార్థులు ఏరోజుకారోజు నేర్చుకున్న అంశాలను షార్ట్ నోట్స్ రూపంలో తయారు చేసుకోవాలి. వాటిని సీఏ పరీక్షకు నెల ముందు రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. -సీహెచ్.నాగేందర్, ఫ్యాకల్టీ, కాస్టింగ్, ఎఫ్ఎం, సీపీటీ అకౌంట్స్ నమ్మకం కలిగింది ఈ ఏడాది జూన్లో జరిగిన సీపీటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. తర్వాత ఐపీసీసీకి సిద్ధమవుతున్నా. ఐపీసీసీకి ఎలా సిద్ధమవ్వాలనే విషయం నాకు తెలియలేదు. శ్రీమేధ‘వి’లో జరిగిన అవగాహన సదస్సులో చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను కూడా సీఏ పూర్తి చేయగలనన్న నమ్మకం కుదిరింది. - వై.డమరక్నాథ్రెడ్డి, విద్యార్థి, చిన్నగొట్టిగల్లు సీఏ చేయాలనుకుంటున్నా ఇంటర్లో ఎంపీసీ పూర్తి చేశాను. మా అమ్మానాన్నల కోరిక మేరకు డిగ్రీలో బీకాం తీసుకున్నాను. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు సీఏ చేయాలనుకుంటున్నా. సీఏ చేయలేమోనని కొంత భయమేసింది. అవగాహన సదస్సుకు వచ్చిన తర్వాత సీఏ చేయాలన్న తన ఆకాంక్ష మరింత బలపడింది. - కె.లావణ్య, విద్యార్థిని, తిరుపతి సీఏ చేయడమే లక్ష్యం సీఏ చేయడమే నా లక్ష్యం. డిసెంబరు 15వ తేదీన జరిగిన సీఏ-సీపీటీకి ఇంటి వద్ద నుంచే సిద్ధమవుతుండడంతో నేను చదివిన విక్రమ్ విద్యాసంస్థ అధ్యాపకులు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. వారి అందించిన సహకారం, అవగాహన సదస్సులో తెలుసుకున్న విషయాలతో నా ఆకాంక్ష నెరవేరుతుందనే ధైర్యం వచ్చింది. - పి.హేమలత, విద్యార్థిని, శ్రీకాళహస్తి -
సీఏలకు సగటు వేతన ప్యాకేజీ రూ.7.3 లక్షలు
న్యూఢిల్లీ: సీఏలకు ఉద్యోగావకాశాలు బావున్నాయని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) తెలిపింది. 16 నగారాల్లో ఈ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ను నిర్వహించామని 624 మందికి పైగా సీఏలకు ఉద్యోగాలు లభించాయని పేర్కొంది. రూ.4 లక్షల నుంచి రూ.24.67 లక్షల వరకూ వేతన ప్యాకేజీలను 58 కంపెనీలు ఆఫర్ చేశాయి. సగటు వార్షిక ప్యాకేజీ రూ.7.3 లక్షలుగా ఉంది. ఐటీసీ, హిందూస్తాన్ యూనిలివర్, టీసీఎస్, విప్రో, మధుర ప్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, మారియట్ హోటల్స్ తదితర కంపెనీలు పాల్గొన్నాయి. -
సెప్టెంబర్లో సీఏ క్యాంపస్ ప్లేస్మెంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక వృద్ధిరేటు క్షీణిస్తున్నప్పటికీ అన్ని రంగాల నుంచి చార్టర్డ్ అకౌంటెంట్స్కి డిమాండ్ ఉందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఐసీఏఐ నిర్వహిస్తున్న క్యాంపస్ రిక్రూట్మెంట్స్కు అన్ని రంగాలకు చెందిన కంపెనీల నుంచి మంచి స్పందన వస్తోందని, కొన్ని కంపెనీలు గరిష్టంగా రూ.16 లక్షల వార్షిక వేతనం ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నాయని ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ విజయ్ కుమార్ గుప్తా తెలిపారు. సెప్టెంబర్10 నుంచి 13వ తేది వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న క్యాంపస్ ఇంటర్వ్యూ విషయాలను తెలియచేయడానికి శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో గుప్తా మాట్లాడుతూ సీఏలకు దేశంలో నాలుగు లక్షల నుంచి రూ.16 లక్షలకు వరకు వేతనం లభిస్తోందని, అదే విదేశాల్లో అయితే రూ.21 లక్షల వరకు వేతనం లభిస్తోందన్నారు. గత సంవత్సరం సగటున రూ.7.11 లక్షల వేతనం లభించినట్లుగా గుప్తా తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్లేస్మెంట్ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్, ఎస్ఆర్బీసీ అండ్ కో, బజాజ్ ఫైనాన్స్, ల్యాంకో వంటి 130 కంపెనీలు పాల్గొంటాయని అంచనా వేస్తున్నట్లు ఐసీఏఐ హైదరాబాద్ చీఫ్ కో-ఆర్డినేటర్ ఎం.దేవరాజ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ మధ్యనే సీఏ కోర్సును పూర్తి చేసిన 5,000 మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నామని, గడిచిన సంవత్సరం జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో 1,500 మందికి ఉద్యోగావకాశాలు లభించినట్లు తెలిపారు.