Charanjit Singh Channi
-
కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు!
పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు భగవంత్ మాన్ బుధవారం ప్రమాణం చేశారు. పంజాబ్లో ఆప్ ఘన విజయం సాధించడంతో ఆయన సీఎం అయ్యారు. అయితే తాజా ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు హేమాహేమీలను మట్టికరిపించి సంచలనం సృష్టించారు. సామాన్య పౌరులు.. కాంగ్రెస్ సీఎంతో సహా సీనియర్ నాయకులను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించారు! చన్నీకి ఉగోకే చెక్ పంజాబ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఘోరంగా ఓడిపోవడం అతిపెద్ద సంచలనం. ఆయన ఓడించింది సీనియర్ నాయకుడు కాదు.. సామాన్య యువకుడు. చిన్న మొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్త లాభ్ సింగ్ ఉగోకే అనే యువకుడు బదౌర్ నియోజకవర్గంలో చన్నీపై 34,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఉగోకే తండ్రి డ్రైవర్ కాగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్గా సేవలు అందిస్తోంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఉగోకేకు హీరో హోండా మోటార్సైకిల్ మాత్రమే ఉంది. డాక్టర్ సాబ్కే జై చమ్కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి కూడా చన్నీకి ‘ఆప్’చేతిలో చుక్కెదురైంది. వృత్తిరీత్యా వైద్యుడైన 55 ఏళ్ల చరణ్జిత్ సింగ్ ఇక్కడ నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ చన్నీకి వ్యతిరేకంగా ఆప్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 12,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినప్పటికీ నియోజకవర్గాన్ని వదలిపెట్టకుండా, ప్రజల మధ్యే ఉంటూ వారి మన్ననలు పొందారు. ఈసారి 7,942 ఓట్ల తేడాతో చన్నీని ఓడించగలిగారు. నవజ్యోత్ వర్సెస్ జీవన్ జ్యోత్ ప్రజల దృష్టిని ఆకర్షించిన మరో ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్. పంజాబ్ ఎన్నికల్లో ఇద్దరు ప్రముఖ నాయకులను ఆమె ఓడించారు. అమృత్సర్ తూర్పు నుంచి కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బిక్రమ్ మజిథియాలపై 6,750 ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీలో వలంటీర్గా చేరి, పార్టీ జిల్లా అర్బన్ అధ్యక్షురాలిగా మారడానికి ముందు.. కౌర్ సామాజిక కార్యకర్తగా చురుగ్గా పనిచేశారు. ‘షీ’అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి మహిళలకు రుతుక్రమ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. శానిటరీ ప్యాడ్ల వాడకం, రుతుక్రమ పరిశుభ్రత తెలియజేస్తూ 'ప్యాడ్వుమన్'గా ఆమె ప్రాచుర్యం పొందారు. (క్లిక్: సోనియా సీరియస్ ఆదేశాలు.. దిగొచ్చిన సిద్ధూ.. పదవికి గుడ్ బై) కౌర్ చేతిలో సింగ్లా చిత్తు సంగ్రూర్లో ఆప్ యువనేత నరీందర్ కౌర్ భరాజ్.. సిట్టింగ్ కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాతో పోటీ పడి భారీ విజయాన్ని అందుకున్నారు. సింగ్లాను 36,430 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించి తానేంటో నిరూపించుకున్నారు. కోట్లకు పడగెత్తిన వ్యాపారవేత్త, బీజేపీ అభ్యర్థి అరవింద్ ఖన్నా మూడో స్థానానికి పరిమితమయ్యారు. (క్లిక్: మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం..) లా గ్రాడ్యుయేట్ అయిన కౌర్ జనవరిలో ఎన్నికల సమయంలో తన తల్లితో కలిసి స్కూటర్పై వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అప్పట్లో ఈ వీడియోలో తెగ వైరల్ అయింది. రూ. 24,000 విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నట్టు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ఆమె.. ద్విచక్ర వాహనంపైనే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎవరెంత హేళన చేసినా లెక్కచేయక పోటీలో నిలబడి ఘన విజయం సాధించారు. బాదల్కు జగదీప్ బ్రేక్ శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కంచుకోట జలాలాబాద్లో ఆప్ పాగా వేసింది. 2009 నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న బాదల్కు ఆప్ అభ్యర్థి జగదీప్ కాంబోజ్ బ్రేక్ వేశారు. కాంగ్రెస్ నాయకుడైన జగదీప్ గతేడాది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. తాజా ఎన్నికల్లో బాదల్పై దాదాపు 31,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టిక్కెట్ నిరాకరించడంతో మూడేళ్ల క్రితం కాంగ్రెస్ను వీడిన కాంబోజ్ 2019 ఉపఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసినా 5,000 ఓట్లకు మించి సాధించలేకపోయారు. ఈ ఎన్నికల్లో ఆప్ మరో ‘జెయింట్ కిల్లర్’అజిత్పాల్ సింగ్ కోహ్లి. అకాలీదళ్ మాజీ నాయకుడైన అజిత్పాల్.. పటియాలా నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించాడు. గతంలో మేయర్గా పనిచేసిన ఆయన పెద్దగా అంచనాలు లేకుండానే పోటీకి దిగి విజయం సాధించడం విశేషం. -
సీఎంపై గెలిచి ఎమ్మెల్యే అయిన కొడుకు.. తల్లి మాత్రం స్వీపర్గానే.. ఎవరామె..?
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ పార్టీలకు షాకిస్తూ భారీ మెజార్టీతో విజయం సాధించింది. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఈనెల 16వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భదౌర్ నియోజకవర్గం నుంచి సీఎం అభ్యర్థి చరణ్జీత్ సింగ్ చన్నీపై ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ పోటీ చేసి 37వేలకు పైగా మెజారిటీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా లాభ్ సింగ్ ఫేమస్ అయ్యాడు. కాగా, తన కొడుకు ఎమ్మెల్యే అయ్యాడని ఊరంతా సంబురాలు జరుపుకుంటుడగా.. ఆయన తల్లి మాత్రం సాదాసీదాగా తన పని తాను చేసుకుంటోంది. ఎమ్మెల్యే లాభ్ సింగ్ తల్లి బల్దేవ్ కౌర్ ప్రభుత్వ పాఠశాలలో కొన్నేళ్లుగా స్వీపర్గా పని చేస్తోంది. తన కొడుకు ఎమ్మెల్యే అయినప్పటికీ తాను ఇదే వృత్తిలో కొనసాగుతానని పేర్కొంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. తన కొడుకు ఎన్నికల్లో గెలుస్తాడని మొదటి నుంచి ధీమాగానే ఉన్నట్టు తెలిపింది. రానున్న రోజుల్లో లాభ్ సింగ్ కచ్చితంగా పంజాబ్లో మార్పులు తీసుకొస్తాడని చెప్పింది. అతడు అందరికీ వైద్యం, విద్య అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తన కొడుకు ఎమ్మెల్యే అయినా తాను స్వీపర్గా పని చేస్తానని స్పష్టం చేసింది. లాభ్ సింగ్ తండ్రి దర్శన్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా తన కొడుకు పనిచేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాగా, లాభ్ సింగ్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటూ కొద్దికాలంలోనే కీలక నేతగా ఎదిగాడు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఇది చదవండి: ఆ సినిమాకు ప్రధాని మోదీ ప్రశంసలు.. -
Sakshi Cartoon: ఓడిపోవడానికే సీఎం పదవి చేపట్టారేమోననిపిస్తుంది సార్!
ఓడిపోవడానికే సీఎం పదవి చేపట్టారేమోననిపిస్తుంది సార్! -
రాజ్భవన్లో గవర్నర్ పురోహిత్ను కలిసిన చన్నీ
-
పంజాబ్ ప్రజలు మార్పు కోరుకున్నారు: చరణ్జిత్ సింగ్ చన్నీ
-
సీఎంను ఓడించిన సామాన్యుడు.. ఎవరతను?
ఎన్నికల ముందు వరకు అతడో సామాన్య యువకుడు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిని మట్టికరిపించి అసామాన్యుడిగా నిలిచాడు. ఈరోజు వరకు అతడి గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలీదు, కానీ ముఖ్యమంత్రిని ఓడించడంతో అతడి పేరు పతాక శీర్షికలకు ఎక్కింది. పంజాబ్ రాజకీయాల్లో సంచలనాలకు తెరతీసిన అతడి పేరు లభ్ సింగ్ ఉగోకే. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బర్నాలా జిల్లా బదౌర్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి లభ్ సింగ్ గెలుపొందారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ ఛన్నీపై 37 వేల పై చిలుకు మెజారితో ఘన విజయం సాధించారు. లభ్ సింగ్కు 63 వేలకు పైగా ఓట్లు తెచ్చుకోగా, ఛన్నీకి కేవలం 26 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఎవరీ లభ్ సింగ్? 35 ఏళ్ల లభ్ సింగ్ సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. 12 తరగతి వరకు చదువుకుని మొబైల్ రిపేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. అతడి తండ్రి డ్రైవర్ కాగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్నారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో వలంటీర్గా లభ్ సింగ్ చేరారు. తాజా ఎన్నికల్లో తనను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ప్రజల మధ్య ఉంటూ ఇంటింట ప్రచారం సాగించారు. ఎమ్మేల్యేగా తనను గెలిపిస్తే దౌర్ నియోజకవర్గ ఓటర్ల సమస్యలను పరిష్కరించే బాధ్యతను భుజాన వేసుకుంటానని అని చెప్పి ప్రజల నమ్మకాన్ని పొందారు. తనపై పోటీ చేస్తున్నది ముఖ్యమంత్రి అయినా కూడా లభ్ సింగ్ ఏమాత్రం భయపడలేదు. నిరాడంబరంగా తన ప్రచారం సాగించి విజయాన్ని అందుకున్నారు. లభ్ సింగ్ విజయాన్ని కేజ్రీవాల్ ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందనలు తెలిపారంటే.. ఈ గెలుపు ప్రాముఖ్యత అర్థమవుతోంది. ఆప్ కంచుకోట.. బదౌర్ బదౌర్ నియోజకవర్గంలో రెండు పట్టణాలు, 74 గ్రామాలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి పిర్మల్ సింగ్ ధౌలా ఇక్కడ విజయం సాధించారు. అయితే గతేడాది ఆయన కాంగ్రెస్లో చేరారు. 2012లో బదౌర్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. 1997, 2002, 2007లో శిరోమణి అకాలీదళ్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాగా, బదౌర్ నియోజకవర్గం తమ పార్టీకి కంచుకోట అని, ముఖ్యమంత్రి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని ఎన్నికలకు ముందు లభ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. సామాన్యుడికి పట్టంకట్టి సీఎంను ఓడించారు బదౌర్ ఓటర్లు. (క్లిక్: గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?) ఆమెకు డిపాజిట్ గల్లంతు పంజాబ్ డిప్యూటీ స్పీకర్, మలౌట్ ఎమ్మెల్యే అజైబ్ సింగ్ భట్టి భార్య మంజిత్ కౌర్.. బదౌర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా ఆమెకు డిపాజిట్ కూడా దక్కలేదు. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సత్నామ్ సింగ్ రాహి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. (క్లిక్: కమెడియన్ నుంచి సీఎం స్థాయికి..) -
కాంగ్రెస్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతోంది
ఫతేపూర్: కాంగ్రెస్ పనిగట్టుకొని ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఇలా విభేదాలను రెచ్చగొట్టే పార్టీలకు పరిపాలించే అధికారం ఉండదన్నారు. యూపీ, బిహార్, ఢిల్లీకి చెందినవారంతా ఒక్కటేనని వారిని పంజాబ్లోకి అడుగు పెట్టనివ్వకూడదంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తన స్వప్రయోజనాల కోసం ఒక ప్రాంతం వారిని మరో ప్రాంతంపైకి ఉసిగొల్పుతూ ఉంటుందని నిందించారు. పంజాబ్ అబోహర్లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ చన్నీ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. చన్నీ అలా మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న ప్రియాంకా గాంధీ చప్పట్లు కొడుతున్నారని యావత్దేశం దీనిని చూసిందన్నారు. యూపీలోని ఫతేపూర్లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎంతో స్వార్థంతో ఆలోచిస్తాయని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ని రద్దు చేస్తూ చట్టం తెస్తే విపక్షాలన్నీ ఏకమై వ్యతిరేకించాయని గుర్తు చేశారు. అయితే తన నిర్ణయానికి ముస్లిం మహిళలు అంతా అండగా ఉన్నారని, వారి బతుకులు బాగు చేసినందుకు కృతజ్ఞతలు వెల్లడించారని మోదీ పేర్కొన్నారు. -
దౌబాలో నువ్వా నేనా?
ముక్కోణ, చతుర్ముఖ పోటీలు దౌబాలో చాలా స్థానాల్లో త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొంది. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న చమ్కౌర్ సాహిబ్ నుంచి సీఎం చన్నీ నాలుగోసారి బరిలో దిగారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఆప్ అభ్యర్థి డాక్టర్ చరణ్జిత్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక జలంధర్ కాంట్లో పంజాబ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, విద్యా, క్రీడల మంత్రి పర్గత్ సింగ్ మూడోసారి బరిలో దిగారు. అకాలీదళ్ నుంచి జగ్బీర్ బ్రార్, బీజేపీ నుంచి సరబ్జిత్ సింగ్ మక్కర్, ఆప్ నుంచి సురీందర్ సింగ్ సోధి ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. హోషియార్పూర్, ఫగ్వారా, నవాన్షహర్ సహా పలు అసెంబ్లీ స్థానాల్లో హోరాహోరీ పోటీ ఖాయంగా కన్పిస్తోంది. దళితులను బాగా ప్రభావితం చేయగల డేరాలను ప్రసన్నం చేసుకునేందుకు కూడా పార్టీలు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నారై బెల్ట్గా పేరున్న పంజాబ్లోని దౌబా ప్రాంతంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు నెగ్గేందుకు కాంగ్రెస్, అకాలీదళ్, ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దళిత ప్రాబల్య ప్రాంతం కావడంతో ఆ వర్గాన్ని ఆకట్టుకొనేందుకు జోరుగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే వారికి రకరకాల వాగ్దానాలు చేశాయి. అకాలీదళ్ తన కుల సమీకరణాలను సరిదిద్దుకొనేందుకు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. దళితులకు డిప్యూటీ సీఎం పదవి ప్రకటించింది. బీజేపీ అయితే వారికి సీఎం పదవే హామీ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ దళితుడైన చరణ్జిత్ సింగ్ చన్నీని మళ్లీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. జలంధర్, కపుర్తలా, హోషియార్పూర్, నవాన్షహర్ జిల్లాలతో కూడిన దౌబాలో 23 అసెంబ్లీ స్థానాలున్నాయి. 20న పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీఎస్పీ చీఫ్ మాయావతి తదితరులు ఇప్పటికే దోబాలో ప్రచారం చేశారు. దోబాలో దళితుల రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడి జనాభాలో 45 శాతం దాకా దళితులున్నారని అంచనా. వీరు ప్రధానంగా రెండు వర్గాలు. గురు రవిదాస్ అనుయాయులైన రవిదాసియాలు ఒక వర్గం కాగా, వాల్మీకులు మరో వర్గం. ఇక్కడ రవిదాసియాలది ఆధిపత్యం. దౌబాలోని హోషియార్పూర్, జలంధర్ లోక్సభ సెగ్మెంట్లను ఎస్సీలకు రిజర్వ్ చేశారు. వీటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో వారి ఆధిపత్యం మరింతగా ఉంది. సన్యశ్యామల ప్రాంతం కావడంతో దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దౌబాలోని దళితులు ఆర్థికంగా బలంగా, ప్రభావశీలంగా ఉన్నారు. ఏ ఎన్నికల్లోనూ వీరు ఒకే పార్టీకి ఏకమొత్తంగా ఓట్లు వేసిన దాఖలాల్లేవు. గత ఎన్నికల్లో దౌబాలో 15 సీట్లు నెగ్గి ఆధిపత్యం ప్రదర్శించిన కాంగ్రెస్కు ఈసారి గట్టి పోటీ ఎదురవుతోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
కేజ్రీవాల్ను ఆంగ్లేయులతో పోల్చిన సీఎం.. దోచుకోవడానికే వస్తున్నాడంటూ..
ఛండీగఢ్ : అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్లో మాటల తూటాలు పేలుతున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈసారి పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆదీ పార్టీ(ఆప్) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనపై లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ఓ అబద్దాల కోరు అంటూ విరుచుకుపడ్డారు. తనపై చేసిన ఆరోపణలన్నీ తప్పని తేలాయని, నిజాలేంటో బయటకు వచ్చాయని పేర్కొన్నారు. గతంలో భారతదేశాన్ని దోచుకోవడానికి ఆంగ్లేయులు ఎలాగైతే దేశానికి వచ్చారో.. ఇప్పుడు పంజాబ్ను దోచుకోడానికి క్రేజీవాల్తో సహా మరికొందరు నేతలు వస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి గురించి పంజాబ్ ప్రజలకు బాగా తెలుసు అలాంటి వారికి ఓటర్లు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. చదవండి: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్కు ఓటేయొద్దు.. -
కాంగ్రెస్కు పోటీయే లేదు.. పంజాబ్ మళ్లీ మాదే
కాంగ్రెస్దే గెలుపన్న ఆత్మవిశ్వాసం. కలిసికట్టుగా పనిచేస్తే ఎవరూ పోటీకి రాలేరన్న ధీమా, కేజ్రివాల్పై విమర్శలు, భగవంత్ మాన్పై వ్యక్తిగత దాడి.. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్జిత్ సింగ్ చన్నీ ఒక చానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ఇలా బయటపెట్టారు. ప్రశ్న : సీఎం అభ్యర్థి కోసం పోటీ పడినపీసీసీ అధ్యక్షుడు సిద్ధూతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? జవాబు: ముఖ్యమంత్రి అభ్యర్థిగా హైకమాండ్ ఎవరిని ఎంపిక చేసినా కట్టుబడి ఉంటానని సిద్ధూ చెప్పారు. అధిష్టానం నన్ను ఎంపిక చేసింది. ఇక మా మధ్య విభేదాలు ఎందుకుంటాయి? మేము ఈ ఎన్నికల్లో కలిసి పని చేస్తాం. టీమ్ వర్క్ చేసి మూడింట రెండు వంతుల మెజార్టీ సాధిస్తాం. ప్రశ్న : కాంగ్రెస్ గెలిస్తే మీరు మరబొమ్మ సీఎంగా మారిపోతారని మాయావతి అంటున్నారు? దళితులు ఢిల్లీ చేతుల్లో ఉండాలా అన్న ఆమె ప్రశ్నలకు మీ సమాధానం? జవాబు: మాయావతి పంజాబ్లో కేవలం 20 స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు. మిగిలిన అన్ని సీట్లలోనూ శిరోమణి అకాలీదళ్ పోటీ పడుతోంది. అంటే దళితులు ఎవరి చేతుల్లో ఉన్నారు? ఈ విషయం ఆమె తెలుసుకోవాలి. నాకు ఈ కులాల రాజకీయాలు తెలీవు. పార్టీలో నాకు మద్దతు ఉందని సీఎం అభ్యర్థిని చేశారు. దళితుడినని చెయ్యలేదు. ప్రశ్న : ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ దూకుడుని అడ్డుకోగలరా ? జవాబు: అరవింద్ కేజ్రివాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారు. మొదట్లో ఆయన ఆబ్కీ బార్ కేజ్రివాల్ పేరిటప్రచారానికి రూ.200–400 కోట్లు ఖర్చు చేశారు. ప్రజలు దానిని ఆమోదించకపోవడంతో భగవంత్ మాన్ను తీసుకువచ్చారు. కేజ్రివాల్ కన్న కలలు పంజాబ్లో నెరవేరవు. ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్తో పాలించే నాయకుల్ని ప్రజలు తిరస్కరిస్తారు. ప్రశ్న : భగవంత్ మన్ మీతో పోటీ పడగలరా ? జవాబు: భగవంత్ మన్ నాకు ఎప్పటికీ పోటీ కాలేరు. పన్నెండో తరగతి పాస్ కావడానికి ఆయనకు మూడేళ్లు పట్టింది. నేను పీజీ చేశాను. ఇప్పుడు పీహెచ్డీ చేస్తున్నాను. ఆయన తాగుడు మానేశానని అంటున్నారు. ఒక్కసారి సాయంత్రం 4 గంటల తర్వాత ఆయనకి ఫోన్ చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. -
చన్నీ మంత్రం ఫలించేనా?
అందరి దృష్టీ ఉత్తర ప్రదేశ్ (యూపీ), పంజాబ్ల మీదే నెలకొన్న వేళ... కాంగ్రెస్ పార్టీ తన సాధారణ పద్ధతికి భిన్నంగా పంజాబ్లో ముందుగానే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. రకరకాల ఊహాగానాలొస్తున్న నేపథ్యంలో మరో తడవ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న దళిత ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీనే సీఎంగా కొనసాగించనున్నట్టు ఆ పార్టీ ఎట్టకేలకు ఆదివారం ప్రకటించింది. సొంత పార్టీలోనే సీఎం పీఠాన్ని ఆశిస్తున్న మిగతా పోటీదారుల సమక్షంలో కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ ఈ ప్రకటనతో తాంబూలాలు ఇచ్చేశారు. దీంతో పార్టీలో కుమ్ములాటలు ఏ మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ‘టీమ్ పంజాబ్ కాంగ్రెస్’ సమష్టిగా ఎన్నికల పోరాటం చేస్తుందని పైకి చెబుతున్నా, పార్టీలో ప్రకంపనలు ఆగడం లేదు. అభ్యర్థిగా చన్నీని ప్రకటించిన కాసేపటికే, రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు – సీఎం కావాలని తపిస్తున్న మరో ఆశావహుడు సునీల్ జాఖడ్ క్రియాశీల రాజకీయాలకు గుడ్బై కొడుతున్నానన్నారు. అయిదు నెలల క్రితమే సీఎం మార్పు వేళ కూడా తన పేరును పరిశీలించ లేదని అలిగిన జాఖడ్ మళ్ళీ అలకపాన్పు ఎక్కేశారు. పార్టీ ఇచ్చిన పని చేస్తానంటూనే, పంజాబ్లో సీఎం కాగల సత్తా ఉన్న నేతలు చాలామంది ఉన్నారంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తన మనసులోని ఇదే బాధ సిద్ధూకు కూడా ఉంటుందంటూ, ఆయననూ గిల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి, అధిష్ఠానానికి కావాల్సిందల్లా ఢిల్లీ నుంచి తాము చెప్పినట్టల్లా ఆడే బలహీన ముఖ్యమంత్రి మాత్రమేనంటూ పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధూ శనివారమే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కానీ, ఆదివారం నాటి సభలో మాత్రం రాహుల్ ముందు కాస్తంత తగ్గి, తనకు కావాల్సింది పదవి కాదు, పంజాబ్ ప్రజల జీవితాల బాగు అని ప్లేటు తిప్పారు. ఆయన ఈ మాటకు కట్టుబడి ఎన్నాళ్ళు సొంత పార్టీ, సొంత సీఎంపై బాణాలు సంధించకుండా ఉంటారో ఎవరూ చెప్పలేరు. ఆ మాటకొస్తే ప్రతిక్షణం పాదరసంలా జారిపోయే సిద్ధూ కూడా చెప్పలేరు. కాకపోతే, ఈ సరిహద్దు రాష్ట్రంలోని దాదాపు ప్రధాన పార్టీలన్నిటితోనూ ఖటీఫ్ చెప్పి, కాంగ్రెస్కు వచ్చిన సిద్ధూకు ఇప్పటికిప్పుడు పెద్దగా ప్రత్యామ్నాయాలు లేవు. ప్రస్తుతానికి తాను పోటీ చేస్తున్న అమృత్సర్ తూర్పు స్థానంలో గెలిచి, సమయం కోసం వేచి చూడడమే కీలకమని ఆయనకూ తెలుసు. పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ అయిన సునీల్ జాఖడ్ కారులోనే చన్నీ, సిద్ధూలతో కలిసొచ్చి మరీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం ద్వారా అందరూ కలిసే ఉన్నారని సంకేతించాలని రాహుల్ శ్రమించారు. అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నా, దళిత సీఎం చన్నీని కాదని మరొకరి పేరు ప్రకటిస్తే, మొదటికే మోసం వస్తుందని ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి బాగా తెలుసు. అధికారంలో ఉన్న కాసిన్ని రాష్ట్రాలనూ కాపాడుకోవడానికీ శతవిధాల ప్రయత్నిస్తున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికలు ఓ అగ్నిపరీక్ష. మునుపటి దామోదరం సంజీవయ్య, భోలా పాశ్వాన్, జగన్నాథ్ పహాడియా, సుశీల్ కుమార్ షిండేల వరసలో చన్నీతో దళిత బాంధవ పార్టీగా నిలవాలనీ, పంజాబ్లోని 31 శాతం ఉన్న దళిత ఓటర్ల మనసు గెలవాలనీ కాంగ్రెస్ ఆలోచన. ఇక, గత ఏడాది సెప్టెంబర్ 20న పంజాబ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 58 ఏళ్ళ చన్నీకేమో ఇది ఊహించని అవకాశం. షెడ్యూల్డ్ కులాల వర్గం నుంచి పంజాబ్ పీఠమెక్కిన తొలి వ్యక్తిగా ఆయనకు రికారై్డతే దక్కింది. కానీ, రామ్దాసియా, రవిదాసియా అని పంజాబీ దళితుల్లో రెండు వర్గాలున్నాయి. తొలి వర్గానికి చెందిన చన్నీ అందరినీ ఆకట్టుకొని, అయిదు నెలలైనా కాక ముందే పార్టీని గెలిపించడం అత్యవసరమైంది. గ్రామీణ పంజాబ్లోని పేద కుటుంబం నుంచి పైకొచ్చిన ఈ మృదుభాషికీ కాంగ్రెస్ సంస్కృతిలో భాగమైన అసమ్మతి సహజగుణమే. మునుపటి కాంగ్రెస్ సీఎం అమరీందర్ సింగ్పై ధ్వజమెత్తినవారిలో చన్నీ కూడా ఉన్నారు. తీరా అమరీందర్ స్థానంలో తనకే సీఎం పీఠం వస్తుందని ఆయన ఊహించలేదు. గద్దెనెక్కాక ఇంటిపోరు ఆయనకూ అనుభవంలోకి వచ్చింది. ఒకే విడతలో ఫిబ్రవరి 20న జరిగే పంజాబ్ ఎన్నికల ప్రధాన ప్రచారకర్తల జాబితాలో తన పేరు మినహాయించడం లోక్సభ కాంగ్రెస్ ఎంపీ మనీశ్ మల్హోత్రాకు కినుక తెప్పించింది. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన వేళ ఏర్పడ్డ భద్రతా వైఫల్యంపై మనీశ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ కథనానికి దగ్గరగా ఉండడమే అందుకు కారణమని కథనం. ఆయనా ఇప్పుడు తిరుగుబాటు జెండా పట్టే పనిలో ఉన్నారు. ఈ అనైక్యతా రాగం చన్నీ మాటెలా ఉన్నా పార్టీని ఇరుకున పెడుతోంది. దీనివల్ల విజయావకాశాలు దెబ్బ తింటే చన్నీకి పెద్దగా పోయేదేమీ లేదేమో కానీ, పార్టీకే నష్టం. అనైక్యతను భరిస్తూ, ఎన్నికల్లో గెలుపు చన్నీకి సవాలే. మరోపక్క చన్నీ సన్నిహితగణంపై కేంద్ర దర్యాప్తు సంస్థల తాకిడీ మొదలైపోయింది. చన్నీ మేనల్లుణ్ణి ఇసుక అక్రమ తవ్వకాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. వీటన్నిటి మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ, కొందరు రైతుల కొత్త జెండా ఎస్ఎస్ఎం, బీజేపీ– అమరీందర్ సింగ్ల పీఎల్సీ, అకాలీదళ్ – బీఎస్పీలతో బహుముఖ పోరులో చన్నీ విజేతగా బయట పడగలరా? దారిద్య్రం నుంచి పైకొచ్చిన చన్నీకి ప్రజల కష్టాలు తెలుసన్నారు రాహుల్. ప్రజలదే కాదు... ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ని బాధిస్తున్న అధికార దారిద్య్రం కూడా ఆయనకు తెలుసు. పంజాబ్లో పార్టీని మరోసారి గెలిపించి, ఆ దారిద్య్రాన్ని ఆయన పోగొట్టగలరా అన్నదే శేషప్రశ్న. -
సిద్ధూ త్యాగం.. చన్నీ పాదాభివందనం
Punjab Assembly Elections 2022: పంజాబ్లో క్లిష్టమైన సమస్యగా భావించిన ముఖ్యమంత్రి ఎంపిక.. ప్రకటనను ఎట్టకేలకు పూర్తి చేసింది కాంగ్రెస్. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న నవజోత్ సింగ్ సిద్ధూను ఎలాగోలా పార్టీ చల్లబర్చింది. ప్రస్తుత సీఎం చరణ్జిత్సింగ్ చన్నీనే.. సీఎం అభ్యర్థిగా ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అంతకు ముందు కొన్ని గంటలపాటు పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా.. అభ్యంతరం లేదని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ సిద్ధూ ప్రకటించడంతో ఆసక్తికరంగా మారింది సీన్. ఈ తరుణంలో.. స్టేజ్పై సీఎం అభ్యర్థిగా చన్నీ పేరును ప్రకటించిన వెంటనే ఆసక్తికర దృశ్యం కనిపించింది. సిద్ధూ చన్నీ కుడి చెయ్యిని పైకి ఎత్తగా.. ఆక్షణంలోనే చన్నీ తన ఎడమ చేతితో సిద్ధూకి పాదాభివందనం చేశాడు. ‘సిద్ధూజీ.. మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసేయండి. మీ మోడల్ కచ్చితంగా అమలు అయ్యి తీరుతుంది’ అని చన్నీ ఆ వెంటనే వ్యాఖ్యానించడం విశేషం. లూథియానా: ఇక పంజాబ్లో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు పార్టీ నేత రాహుల్ గాంధీ పెద్ద షాక్ ఇచ్చారు. పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జిత్సింగ్ చన్నీ పేరును రాహుల్ ఆదివారం పంజాబ్లో వర్చువల్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించి.. ప్రసంగించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రావాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. పేదరికాన్ని, ఆకలిని అర్థం చేసుకున్నవారే కావాలని అంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. ‘‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. దాన్ని మీరు సులభతరం’’ చేశారు అని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అనంతరం చన్నీ, సిద్ధూ, పార్టీ నేత సునీల్ జాఖర్ను రాహుల్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మీడియా, టీవీ చర్చా కార్యక్రమాల్లో నాయకులు పుట్టుకురారని తెలిపారు. కొన్ని సంవత్సరాల పోరాటంతోనే వ్యక్తులు నాయకులుగా ఎదుగుతారని వివరించారు. గొప్ప నాయకులకు తమ పార్టీలో లోటు లేదన్నారు. ప్రజల కోసం నిలబడే నాయకులు కాంగ్రెస్లో ఉన్నారని పేర్కొన్నారు. చన్నీ, సిద్ధూల రక్తంలో పంజాబ్ ఉందన్నారు. సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై కాంగ్రెస్ నాయకత్వం పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది. ప్రజల మనోభావాలను కూడా తెలుసుకుంది. ఇందుకోసం అటోమేటెడ్ కాల్ సిస్టమ్ను ఉపయోగించుకుంది. దళిత సిక్కు నాయకుడైన చరణ్జిత్సింగ్ చన్నీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు. వర్చువల్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఆయన ప్రధానమంత్రిగా కాదు, ఒక రాజులాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ రోడ్లపై ఎవరికైనా సాయం చేయడం ఎప్పుడైనా చూశారా? ఆయన ప్రజల మధ్య ఉండడం ఎప్పుడైనా గమనించారా? అని ప్రజలను ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్పై కూడా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పదవుల కోసం పాకులాడలేదు: సిద్ధూ తాను ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్సింగ్ సిద్ధూ అన్నారు. ఆయన లూథియానాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. గత 17 ఏళ్లుగా రాజకీయ జీవితం కొనసాగిస్తున్నానని, పదవులపై ఎప్పుడూ ఆశపడలేదని పేర్కొన్నారు. పంజాబ్ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని మాత్రమే కోరుకున్నానని వివరించారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. గత ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా చేశారని కొనియాడారు. మార్పునకు సమయం ఆసన్నమైందని వెల్లడించారు. పంజాబ్ అభివృద్ధి కంటే తనకు కావాల్సింది ఇంకేమీ లేదని వ్యాఖ్యానించారు. సీఎం అభ్యర్థి ప్రకటనపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సిద్ధూ ట్వీట్ చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. బీజేపీ శ్రుతులకు అనుగుణంగా అమరీందర్ డ్యాన్స్ చేస్తున్నారని ఆరోపించారు. పంజాబ్ను లూటీ చేసిన నాయకులు ఇప్పుడు డబల్ ఇంజన్ ప్రభుత్వం అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ అధికారం రాహుల్కు ఎక్కడిది?: బీజేపీ చండీగఢ్: పంజాబ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అధికారం రాహుల్ గాంధీకి ఎక్కడుందని బీజేపీ నేత, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదివారం ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్లో రాహుల్కు ఎలాంటి హోదా లేదని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఏ అధికారంతో సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని నిలదీశారు. పేరు చివర ‘గాంధీ’ అన్న ఒక్క అర్హత మాత్రమే రాహుల్కు ఉందని ఎద్దేవా చేశారు. -
పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తుండటంతో పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ప్రస్తుత సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ వైపే మొగ్గుచూపింది. లుధియానాలో ఆదివారం జరిగిన వర్చువల్ ఎన్నికల ప్రచారంలో పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఈ మేరకు ప్రకటించారు. ‘సీఎం అభ్యర్థిని నిర్ణయించడం ఇబ్బందికర పరిస్థితే. అయితే, పేదల కష్టాన్ని ఓ పేద బిడ్డ మాత్రమే అర్థం చేసుకుంటారని పంజాబ్ ప్రజలు భావిస్తున్నారు. అందుకనే చన్నీనే పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. (చదవండి: ఆరునెలల్లోనే సీఎం అభ్యర్థి రేంజ్కి.. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ) -
పంజాబ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి పై నెలకొన్న ఉత్కంఠ!!
చండీగఢ్: పంజాబ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఇద్దరూ ఉంటారంటూ వస్తున్న పుకార్లను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. అంతేకాదు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒకరి పేరును మాత్రమే ప్రకటిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పంజాబ్లోని కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవీ కోసం పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్సింగ్ చన్నీ, నవజ్యోత్ సిద్ధూ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్గాందీ లూథీయానాలో ఈ ఇద్దర్ని పంజాబ్ ముఖ్యమంత్రులు ప్రకటిస్తున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు ఈ ప్రచారం ఊపందుకున్న తర్వాత రోజే అక్రమ కేసుల తవ్వకాల్లో చన్నీ మేనల్లుడు భూపేంద్ర సింగ్ హనీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముందంజలో చన్నీ ఉన్నందున సిద్దూ తన సొంత పార్టీపై దాడిని పెంచారు. మరోవైపు చన్నీ మేనల్లుడు అరెస్టు కావడంతో ప్రత్యక్ష విమర్శదాడులకు దిగారు. ఈ మేరకు సిద్దూ పార్టీ నిజాయితీ, క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉన్న వారిని ఎన్నుకోవాలంటూ పిలుపునిచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు మెగ్గుచూపుతున్నట్లుగా పలు సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలు ఏ నాయకుడికి అనుకూలంగా ఉన్నారో ఎంచుకోవడానికి ఐవీఆర్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) కాల్ల ద్వారా పబ్లిక్ సర్వేను కూడా నిర్వహిస్తోంది. అయితే చన్నీ బంధువు అరెస్టు కావడంతో సిద్దూ తన వాదనను వినిపించేందుకు దీన్ని ఒక అవకాశంగా వినియోగించుకున్నారు. అంతేకాదు చన్ని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి నామినేట్ అవ్వడం, మరోవైపు బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా చన్నీకి మరో అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీని కోరడం వంటి తదితర కారణాలతో చన్నీయే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే ఊహాగానాలకు తెర తీసింది. మరోవైపు సిద్ధూ కూడా తనను తాను అభ్యర్థిగా చెప్పుకోవడానికి పదేపదే ప్రయత్నించడం గమనార్హం. (చదవండి: ‘సీఎం అభ్యర్థి చాయిస్.. చాన్స్ కాదు’) -
దళితుల చేతిలోనే.. పంజాబ్ అధికార దండం
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా పంజాబ్లో అత్యధికంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. కానీ వీరి చేతిలో 2.3 శాతం భూమి మాత్రమే ఉండటం గమనార్హం. ఛండీఘడ్: పంజాబ్లో రాజకీయం పంచముఖ పోరుగా మారడం, కాంగ్రెస్కు మారుపేరుగా నిలిచిన కెప్టెన్ అమరీందర్సింగ్ హస్తం పార్టీకి గుడ్బై కొట్టి... బీజేపీతో జట్టుకట్టడంతో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మరోవైపు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీతో ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసుకున్న శిరోమణి అకాలీదళ్–కొత్తగా మాయావతి పార్టీ బీఎస్పీతో పొత్తపెట్టుకోవడం, ఆమ్ ఆద్మీ పార్టీ... దళిత ఎమ్మెల్యే హర్బాల్ సింగ్ (దిర్బా నియోజకవర్గం)ను అసెంబీల్లో ఆప్ పక్ష నేతగా నియమించడం... ఇలా ఇప్పుడు పంజాబ్ రాజకీయమంతా దళితుల చుట్టూనే తిరుగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే... పంజాబ్ రాజకీయాల్లో జాట్ సిక్కులదే ఆధిపత్యమైనప్పటికీ... ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉంది. రాష్ట్ర జనాభాలోని 60 శాతం సిక్కుల్లో జాట్ల వాటా 21 శాతమే అయినప్పటికీ అదే ఆధిపత్య వర్గం. రాజకీయ నాయకత్వమంతా దశాబ్దాలుగా ఈ వర్గం చేతిలోనే కేంద్రీకృతమవుతోంది. ఆయా పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుకు దళితుల ఓట్లు తోడైతేనే ఏ పార్టీ అయినా ప్రస్తుతం పంజాబ్ సీఎం పీఠాన్ని అందుకోగలుగుతుంది. ఎందుకంటే పంజాబ్ జనాభాలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏకంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. మూడింటి ఒకవంతున్న దళిత ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు రాజకీయపక్షాలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 10 నెలల కిందటే మొదలుపెట్టిన బీజేపీ మూడు నూతన వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దీర్ఘకాలిక భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయేను వీడటంతోనే కమలదళం అప్రమత్తమైంది. ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రమైన పంజాబ్లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో (ఫిబ్రవరి 20న జరగనున్నాయి) తాము గెలిస్తే దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని గత ఏప్రిల్లోనే ప్రకటించడం ద్వారా బీజేపీ ఈ వర్గంలో కొత్త ఆశలు రేకెత్తించింది. అమరీందర్ సింగ్– సిద్ధూల మధ్య గొడవ తలకుమించిన భారం కావడంతో కాంగ్రెస్ గత ఏడాది సెప్టెంబరులో తెగించేసింది. జాట్ సిక్కు అయిన కెప్టెన్ అమరీందర్ స్థానంలో రవిదాసియా వర్గానికి చెందిన దళితుడైన చరణ్జిత్సింగ్ చన్నీని సీఎంగా నియమించి అందరికంటే ముందుగానే దళిత ఛాంపియన్ అనిపించుకునే ప్రయత్నం చేసింది. గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకొని... ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న కాకుండా మరో ఆరురోజులు ముందుకు జరిపి ఈ నెల 20 నిర్వహించాలని పంజాబ్ సీఎం చన్నీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. మిగతా రాజకీయపక్షాలన్నీ ఆయన డిమాండ్కే మద్దతు పలకడంతో ఈసీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ చర్య దళితుల్లో చన్నీ గ్రాఫ్ను అమాంతంగా పెంచేసిందని రాజకీయ పండితులు విశ్లేషణ. అయితే అధికార వ్యతిరేకతను అధగమించడం, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ కొట్టే సిక్సర్లను తట్టుకోవడం లాంటి పనులతోనే పాపం చన్నీ బిజీగా గడపాల్సి వస్తోంది. దళితుల్లోనూ మళ్లీ రెండు వర్గాలు పంజాబ్లోని దళితుల్లో... హిందు దళితులు, సిక్కు దళితులుగా రెండు వర్గాలున్నాయి. హిందు దళితుల శాతం ఎప్పటికప్పుడు మారుతూ ఉండటానికి కారణం... వీరిలో చాలా మంది సిక్కు మతంలోకి మారిపోవడం, రవిదాసియా, ఆది ధర్మిలు మాత్రం తమను ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్లు వినిపిస్తున్నారు. 2018 సామాజిక సాధికార శాఖ గణాంకాల ప్రకారం పంజాబ్ దళితుల్లో మొత్తం 39 ఉపకులాలున్నాయి. వీటిలో ఐదు ప్రముఖమైనవి. రాష్ట్రంలోని 32 శాతం దళిత జానాభాలో వీటి వాటాయే 80 శాతం దాకా ఉంటుంది. మజ్హబీ సిక్కులు అత్యధికంగా 30 శాతం ఉండగా... తర్వాత రవిదాసియాలు 24 శాతం మేరకు ఉంటారు. కాగా ఆది ధర్మీలు 11 శాతం ఉంటారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే... దౌబాలో 37 శాతం, మాల్వాలో 31 శాతం, మజ్హాలో 29 శాతం దళితులున్నారు. మొత్తం 117 అసెంబ్లీ సీట్లున్న పంజాబ్లో 34 సీట్లు ఎస్సీలకు రిజర్వు చేశారు. 2017లొ ఈ 34 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 21 నెగ్గగా, ఆప్ 9 సీట్లు గెల్చుకుంది. డేరాల ప్రభావం క్షీణించినట్లేనా! గతంలో దళిత ఓటర్లపై డేరా సచ్చా సౌదా (సమానత్వాన్ని ప్రబోధించే ధ్యాన కేంద్రా)ల ప్రభావం తీవ్రంగా ఉండేది. డేరాసచ్చా సౌదా అధిపతి రామ్రహీమ్ సింగ్ అత్యాచారం, హత్య కేసులో అరెస్టయి జైల్లో ఉండటంతో దళితులపై ఈ డేరాల ప్రభావం మునుపటి స్థాయిలో లేదు. 69 సీట్లున్న మాల్వా ప్రాంతంలో గత ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా దెబ్బతింది. అకాలీ దళిత ఓటు బ్యాంకు కాస్తా కాంగ్రెస్ బదిలీ అయింది. ఐక్యత లేదు.. పంజాబ్లో జనాభాలో దళితులు ఏకంగా 32 శాతం ఉన్నప్పటికీ... వారి మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యత లేకపోవడమే వీరిని దెబ్బతీస్తోంది. ఏదో ఒక ఆధ్యాత్మిక బోధకుడి సూక్తులకు కట్టుబడి ఉండకపోవడం, భిన్నమైన ఆచారాలు, సంస్కృతులు ఉండటం మూలంగా పంజాబ్ దళితుల్లో ఐక్యత లోపించి బీఎస్సీ ఇక్కడ దారుణంగా విఫలమైందని, గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కనీసం ఒక్క సీటును కూడా గెలవకపోవడానికి ఇదే కారణమని పంజాబ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ప్రమోద్ కుమార్ విశ్లేషించారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
పంజాబ్ సీఎం చన్నీ మేనల్లుడు అరెస్ట్
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ అలియాస్ హనీని మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం అరెస్టు చేసింది. అక్రమ ఇసుక మైనింగ్కు సంబంధించి హనీకి మనీల్యాండరిం గ్తో సంబంధాలున్నాయని ఈడీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి చాలా సేపు హనీని విచారించి అనంతరం పీఎంఎల్ చట్టం కింద అదుపులోకి తీసుకొన్నామని తెలిపారు. విచారణలో సహకరించనందుకే హనీని అరెస్టు చేసినట్లు తెలిసింది. ఆయన్ను పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఐదురోజుల ఈడీ కస్టడీ విధించింది. గతనెల 18న హనీ నివాసాలపై ఈడీ దాడులు జరిపి రూ. 8 కోట్ల నగదు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ప్రత్యర్థులకు అస్త్రం హనీ అరెస్టుతో పంజాబ్ ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీలకు, సొంతపార్టీలోని వ్యతిరేకులకు చన్నీ మేనల్లుడి అరెస్టు వరంలా మారనుందని నిపుణుల అంచనా. ఈనెల 6న పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి పేరును రాహుల్ గాంధీ ప్రకటించే నేపథ్యంలో చన్నీకి చాన్సు లభించడంపై ఉత్కంఠ నెలకొంది. హనీ అరెస్టు రాజకీయ గిమ్మిక్కని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే చన్నీ బంధువుల్లో ఒక్కరే 111 రోజుల చన్నీ పాలనలో కోట్లు కూడబెడితే, ఆయన చుట్టాలంతా కలిసి ఎంత పోగేసి ఉంటారో ఊహించవచ్చని ఆప్ పార్టీ దుయ్యబట్టింది. ఈ విషయంలో చన్నీ సమాధానం చెప్పాలని శిరోమణి అకాలీదళ్ నేత మజితియా డిమాండ్ చేశారు. -
సాక్షి కార్టూన్
గట్టి నమ్మకం ఉంటేనే పోటీ చేయండి! లేకుంటే మరో రెండు స్థానాల్లో కూడా పోటీకి దిగటం బెటర్!! -
సేఫ్సైడ్ కోసం.. రెండు చోట్లా పోటీ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్సింగ్ చన్నీని కాంగ్రెస్ సేఫ్పైడ్గా రెండో నియోజకవర్గంలోనూ పోటీకి దింపింది. బదౌర్ (ఎస్పీ రిజర్వుడు) స్థానం నుంచి చన్నీ పోటీ చేస్తారని ప్రకటించింది. చన్నీతో కలిపి ఆదివారం మొత్తం ఎనిమిది మందితో కూడిన తుది జాబితాను కాంగ్రెస్ విడుదల చేనింది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చింది. నామినేషన్లకు మరో రెండు రోజులు గడువు మిగిలి ఉందగనా... కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీ సర్వే ప్రకారం చన్నీ చమకౌర్ నియోజకవర్గంలో ఓడిపోతున్నారని తేలిందని, అందుకే కాంగ్రెస్ ఆయన్ను మరోచోటు నుంచి పోటీకి నిలిపిందని ఆప్. చదవండిః ఒక వైపు నామినేషన్లు.. మరోవైపు రాజీనామాలు -
Charanajit Singh Channi: గాడ్ ఫాదర్ లేరు.. అయితేనేం..
పంజాబ్కు తొలి దళిత ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ. ఆయన ఒక నిత్య విద్యార్థి. మూడు పీజీ డిగ్రీలున్న విద్యాధికుడు. చదువులోనైనా, రాజకీయాల్లోనైనా స్వయంకృషినే నమ్ముకున్నారు. కెప్టెన్ అమరీందర్ నిష్క్రమణతో ఆయనకి అనుకోకుండా పంజాబ్ అత్యున్నత పీఠం అధిష్టించే అవకాశం వచ్చింది. విద్యార్థిగా ఉన్నప్పుడే చన్నీ రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. రాజకీయ రంగంలో గాడ్ ఫాదర్ ఎవరూ లేనప్పటికీ ఓటమి ఎరుగని నాయకుడిగా పేరు సంపాదించారు చదువుకోవడం, ప్రజలతో కలిసి తిరగడం ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన అంశాలు. ముఖ్యమంత్రి అయిన ఈ కొద్ది రోజుల్లోనే నిరుపేదల సీఎం అన్నపేరు తెచ్చుకోవాలన్న ఆశతో అడుగులేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా నవజోత్ సింగ్ సిద్ధూతో పోటీపడుతున్న చన్నీకి కూడా ప్రజల్లో మంచి ఆదరణే ఉంది. ►పంజాబ్లో చంకూర్ సాహిబ్ జిల్లాలోని మకరోనా కలన్ గ్రామంలో ఒక దళిత కుటుంబంలో 1963 సంవత్సరం మార్చి 1న జన్మించారు. ►చన్నీకి చదువంటే ప్రాణం. మూడు పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేశారు. రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ కూడా చదువుకున్నారు. ►చదువుకి వయసుతో పని లేదని నమ్మడమే కాదు ఆచరించి చూపించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎంబీఏ చదివారు. 2016లో సీఎల్పీ నాయకుడిగా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూనే పొలిటికల్ సైన్స్లో పీజీ చేశారు. ►చన్నీ తండ్రి హర్షసింగ్ ఖరార్ గ్రామ సర్పంచ్గా ఉండడంతో ఆయన ప్రభావంతో రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. ►విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. చండీగఢ్ గురుగోవింద సింగ్ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నప్పుడే యూనియన్ నాయకుడిగా ఎన్నికయ్యారు. 2002లో ఖరార్ మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ►చన్నీ భార్య కమల్జిత్ కౌర్ డాక్టర్. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ►2007 సంవత్సరంలో తొలిసారిగా పంజాబ్ శాసనసభకు చంకూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. ►2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ పడి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ►2015లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా ఒక ఏడాది పాటు సమర్థవంతమైన పాత్ర పోషించారు. ►2017లో జరిగిన ఎన్నికల్లో చంకూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కెప్టెన్ అమరీందర్ నేతృత్వంలో సాంకేతిక విద్య మంత్రిగా వ్యవహరించారు. ►అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసి, పార్టీని వీడటంతో చరణ్జిత్ సింగ్ చన్నీ 2021 సెప్టెంబర్లో పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. పంజాబ్కు తొలి దళిత ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. ►ఈసారి ఎన్నికల పోలింగ్కు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించమని చన్నీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం చన్నీ, సిద్ధూల మధ్య ఈ పదవి కోసం పోటీ ఉంది. ఎవరి పేరు ప్రకటించినా అందరూ సమష్టిగా కలిసి పని చేస్తామంటూ ఇరువురు నాయకులు రాహుల్కు హామీ ఇవ్వడం విశేషం. ►పంజాబ్లో దాదాపుగా 32 శాతం దళిత జనాభా ఉంది. ఈ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొనే దళితుడైన చన్నీని కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ సీఎంగా నియమించింది. ►ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలని రాహుల్ గాంధీ అనుచరుడు నిఖిల్ ఆల్వా ట్విట్టర్లో పోలింగ్ నిర్వహించగా చన్నీకి అనుకూలంగా ఏకంగా 69 శాతం ఓట్లు వచ్చాయి. ►యువతని ఆకట్టుకోవడానికి సీఎం చన్నీ ప్రయత్నిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏడాదిలోనే యువతకి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, విదేశాలకు వెళ్లేందుకు ఉచితంగా శిక్షణ, ఉన్నత విద్యాభ్యాసానికి రుణం లేని వడ్డీలు వంటి హామీలెన్నో ఇచ్చారు. ►రాష్ట్రంలో దళితుల్ని ఆకర్షించడానికి గురు రవిదాస్ బోధనల్ని ప్రచారం చేయడం కోసం అతి పెద్ద కేంద్రాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ►సీఎం పదవిని చేపట్టిన మూడు నెలల్లోనే పాలనలో తన ముద్ర వేశారు. కేవలం మూడు నెలల్లోనే 60కి పైగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దళితుడైనప్పటికీ ఆ సామాజిక కార్డు తీయకుండా తాను పేదల సీఎం అన్న ముద్ర వేయించుకోవాలన్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి కూలీల సమస్యలు అడిగి తెలుసుకోవడం, ఆటో రిక్షా డ్రైవర్లను పలకరించడం, గురుద్వారకు వెళ్లి అక్కడి వారితో కలిసి భక్తి పాటలు పాడడం వంటివి చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
చన్నీ, సిద్ధూలు పంజాబ్ ప్రజలను దోచుకున్నారు: అరవింద్ కేజ్రీవాల్
చండీగఢ్: కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్ ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాహుల్ గాంధీ జలంధర్ పర్యటనపై పలు వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ప్రజలకు రాహుల్ మొహం చూపించలేక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పర్యటిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గత 60 ఏళ్లలో పంజాబ్ను దోచుకుందని ఎద్దేవా చేశారు. చన్నీ,సిద్దూలు ప్రజలను మోసం చేసిన రాజకీయా ఏనుగులే అన్నారు. ప్రజలను దోచుకున్నారని తెలిపారు. ఒక వ్యక్తి సత్యమార్గంలో నడిచినప్పుడు గిట్టని వారు తిట్టడం సహజమే అన్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. కాగా, తమ సీఎం అభ్యర్థి బిక్రమ్ మజిథియా అమృత్సర్ ఈస్ట్ నుంచి ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు. People are tired of Congress & SAD. Why will people vote for Majithia or Sidhu? Both are political elephants who have crushed people. Our candidate(from Amritsar East) is a common woman who will be available for people always: Delhi CM & AAP national convenor Arvind Kejriwal pic.twitter.com/ghW7Gn4R1B — ANI (@ANI) January 27, 2022 చదవండి: చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య వివాదం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు -
చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య వివాదం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీ పంజాబ్ ప్రజలకు తీపికబురు అందించింది. త్వరలోనే పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. రాహుల్ గాంధీ పంజాబ్లోని జలంధర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సభలో.. పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాల్గోన్నారు. కాగా, తాము.. సీఎం పదవి కోసం ఆశపడబోమని ఆ సభలో బహిరంగంగా హమీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. అదే విధంగా ఒకరు నాయకత్వం వహిస్తే మరొకరు వారికి సహకారం అందిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ లేదా పంజాబ్ కోరుకుంటే త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు’. ఈ ప్రకటనతో చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య పోటీకి తెరపడినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు నాయకత్వం వహించలేరు.. ఒకరు మాత్రమే సరైన నాయకుడిగా ఉండగలరని ఆయన అన్నారు. సీఎం అభ్యర్థిని ఎవరు ఉండాలనే దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలనే అడుగుతామన్నారు. అయితే, చన్నీ, నవజ్యోత్ సింగ్ ఇద్దరు నాయకులు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తారని తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. క్రమశిక్షణ కల్గిన కాంగ్రెస్ సైనికుడిలా పనిచేస్తానని అన్నారు. తనను ‘షోపీస్’లా ట్రీట్ చేయోద్దని అన్నారు. ‘ మనమంతా పంజాబ్లో కాంగ్రెస్ను అధికారంలో తేవడానికి ఐక్యంగా పోరాడదామన్నారు’. ఇదే వేదికపై ఉన్న చన్నీ కూడా.. సిద్ధూ దగ్గరకు వెళ్లి తమ ఐక్యతను చూపే ప్రయత్నం చేశారు. ఈ సభలో సీఎం చన్నీకూడా మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి పదవికి ఎవరి పేరును ప్రతిపాదించిన అభ్యంతరంలేదన్నారు.’ ఎవరి పేరు ప్రతిపాదించిన ప్రచారం కోసం పనిచేసే మొదటి వ్యక్తి తానేనని చన్నీ స్పష్టం చేశారు. ఆ తర్వాత చన్నీ.. అరవింద్ కేజ్రీవాల్పై ఫైర్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత పోరు ఉందని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని చురకలంటించారు. చదవండి: ఉత్తరాఖండ్లో కాంగ్రెస్కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే -
యువతను ఆకట్టుకునేలా హాలీవుడ్ సినిమా రేంజ్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్
Punjab Chief Minister Charanjit Singh Channi portrayed as superhero Thor: కరోనా మహమ్మారి సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఎలక్షన్ కమిషన్ రోడ్ షోలు, ర్యాలీలను నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తమదైన వ్యూహాలతో ప్రజలను ఆకర్షించేలా ప్రచారాలకు సనద్దమయ్యారు. అందులో భాగంగానే పంజాబ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ని స్ఫూర్తిగా తీసుకుంది. అయితే మార్వెల్ కామిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ హాలీవుడ్ చిత్రంలో క్రిస్ హేమ్స్వర్త్, మార్క్ రుఫాలో, క్రిస్ ఎవాన్స్, తదితర నటులు నటించారు. ఈ మేరకు ఈ అవెంజర్స్ చిత్రంలో థోర్స్ పాత్రలో చరణ్ జిత్ సింగ్ చన్నీ ముఖాన్ని, రాహుల్ గాంధీని బ్రూస్ బ్యానర్ అకా ది హల్క్గా ఒక యుద్ధ సన్నివేశానికి సంబంధించిన వీడియోని చిత్రీకరించారు. అయితే ఇందులో నవజ్యోత్ సింగ్ సిద్ధూని కెప్టెన్ అమెరికాతో పోల్చారు. అంతేకాదు ఈ అవెంజర్స్ సినిమాలో దేవుళ్ల సినిమాల్లో ఉన్నట్టుగా ఉరుములు మెరుపులతో కూడి యుద్దం చేస్తున్న సన్నీవేశాన్ని చిత్రీకరించారు. ఆ వీడియోలో నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖాలను గ్రహాంతరవాసుల పాత్రలతో వారిని శత్రువులుగా చిత్రీకరించారు. పైగా పంజాబ్లో లోక్ కాంగ్రెస్ అనే తన సొంత పార్టీని స్థాపించిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ (సీఏడీ) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్లను దుష్ట గ్రహాంతరవాసులు పాత్రలుగా చిత్రీకరించారు. బ్యాక్ గ్రౌండ్లో థీమ్ సాంగ్తో మిస్టర్ చన్నీ ఎంట్రీ అయ్యి స్టార్మ్బ్రేకర్(గొడ్డలి ఆకారంలో ఉండే ఆయుధం)ని ఉపయోగించి గ్రహాంతరవాసులందరి గొంతులను కోస్తున్నట్టుగా వీడియో రూపోందించారు. పంజాబ్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దుష్టశక్తుల నుండి తమ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఏమైన చేస్తాం అని వీడియో చివరలో వినిపిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు హాలీవుడ్ అవెంచర్స్ మూవీలోని యుద్ధ సన్నివేశాన్ని ఎడిట్ చేసిన క్లిప్పింగ్ వీడియోతోపాటు "పంజాబ్లో కాంగ్రెస్ మాత్రమే అధికారంలోకి వస్తుంది" అనే క్యాప్షన్ని జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ హాలీవుడ్ మూవీకి భారతదేశంలో విపరీతమైన అభిమానులు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ పంజాబ్లోని యువత ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాన్ని ఎంచుకుంది. ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బాలీవుడ్ పాట 'మస్త్ కలందర్'ను ఎడిట్ చేసిన వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. We will do whatever it takes to redeem our beloved state from the clutches of evil forces working against the interest of Punjab and its people. #CongressHiAyegi pic.twitter.com/6lVxqkN4VC — Punjab Congress (@INCPunjab) January 24, 2022 -
చన్నీకి మరొక్కసారి అవకాశం ఇవ్వాలి: సోనూసూద్
Punjab Assembly Election 2022: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీకి సుదీర్ఘకాలం పదవిలో ఉండి సేవలందించే అవకాశం లభింనందున అతనికి మరొక్క అవశాశం ఇవ్వాలని బాలీవుడ్ నటుడు సోనూసూద్ అన్నారు. చన్నీ ముఖ్యమంత్రిగా చాలా తక్కువ సమయమే పని చేసినప్పటికీ చాలా ప్రశంసించదగ్గ పనులు చేశారని చెప్పారు. అంతేకాదు పంజాబ్ రాష్ట కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మంచి నిజాయితీ పరుడు, హృదయ పూర్వకంగా మాట్లాడతారని అన్నారు. కాంగ్రెస్ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని, పైగా ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందన్న విషయన్ని కూడా నొక్కి చెప్పారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ని తాను చాలా ఏళ్ల క్రితం ఒక కళాకారుడిగా మాత్రమే కలిశానని చెప్పారు. ఆయన రాజకీయనాయకుడిగా ఎలా ఉంటారనే విషయం గురించి తనకు తెలియదని సోనూ సూద్ తెలిపారు. సోనూ సూద్ సోదరి 38 ఏళ్ల మాళవిక సూద్ సచార్ కాంగ్రెస్ అభ్యర్థిగా తమ పూర్వీకుల ఊరు మోగా నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన పంజాబ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తన సోదరితో కలిసి ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, చాలా కాలంగా సామాజిక సేవలో పాల్గొంటున్న తన సోదరికి మాత్రమే మద్దతు ఇస్తున్నానని సూద్ నొక్కి చెప్పారు. మొగాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ధర్మశాలలు మా కుటుంబమే నిర్మించిందని ఈ సందర్భంగా చెప్పారు. పైగా వ్యవస్థలో భాగమైతే చాలా పనులు జరుగుతాయని మాళవికను ప్రజలే రాజకీయాల్లోకి తీసుకొచ్చారని సూద్ అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పంజాబ్లోని మోగా నియోజకవర్గంలో మంచి పనులు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిందన్నారు. అంతేకాదు తమ మానిఫెస్టోని అమలు చేయగల పార్టీగా కాంగ్రెస్ని విశ్వస్తున్నాని, అందువల్ల తమ సోదరి కాంగ్రెస్లో చేరడం మంచిదని భావించానని చెప్పుకొచ్చారు. పైగా తనకు వివిధ పార్టీ నుంచి ఆఫర్లు వచ్చాయని కూడా చెప్పారు. అయితే తాను వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వస్తానని, కాకపోతే తనవద్ద తగినంత పెద్ద టీమ్ లేదని అన్నారు. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అనంతరం జరిగిన ఆదాయపు పన్ను శాఖ రైడ్ విషయం కూడా సెటిల్ అయ్యిందని సోనూ సూద్ చెప్పారు. (చదవండి: పాటియాలా నుంచి అమరీందర్.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల) -
పంజాబ్ ఎన్నికల్లో అందరిదీ సేఫ్ గేమే!..
వచ్చే నెలలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజాలు ఈసారి సేఫ్గేమ్ ఆడుతున్నారు. అన్ని పార్టీల్లోని పెద్ద నేతలంతా ఒకరిపై ఒకరు పోటీ చేయొద్దన్న ధోరణితో బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, ప్రస్తుత ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ సహా అనేకమంది బాదల్ కుటుంబంపై పోటీ చేసేందుకు ముందుకు వచ్చి చేతులు కాల్చుకోవడంతో ఈసారి మాత్రం ఒకరిపై ఒకరు పోటీచేసేందుకు వెనక్కి తగ్గారు. మిగతా కొందరి ప్రముఖుల స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎవరు ఎక్కడి నుంచి.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ: కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పాత సీటు అమృత్సర్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి సిద్ధూ మజీఠా సీటులో బిక్రమ్ మజీఠియాపై లేదా పాటియాలా స్థానంలో కెప్టెన్ అమరీందర్ సింగ్పై పోటీ చేస్తారని ముందుగా ఊహించారు. బిక్రమ్ మజీఠియా: మజీఠా సిట్టింగ్ ఎమ్మెల్యే, శిరోమణి అకాలీదళ్ యువనేత అయిన బిక్రమ్ మజీఠియాకు పోటీగా కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు పెద్ద నేతలను నిలబెట్టలేదు. ఇక్కడ నుంచి ఆప్ తరఫున లాలీ మజీఠియా, కాంగ్రెస్ నుంచి జగ్గా మజీఠియాలు బరిలో ఉన్నారు. చరణ్జిత్ చన్నీ: చమ్కౌర్ సాహిబ్ స్థానం నుంచి సీఎం చరణ్జిత్ చన్నీ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేసేలా చర్చలు జరిగినా, పార్టీ అధిష్టానం అందుకు అంగీకరించలేదు. చదవండి: (Punjab Assembly Election 2022: వ్యూహకర్త బాదల్) కెప్టెన్ అమరీందర్ సింగ్: కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాలా అర్బన్ నుం చి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆయన తన సొంత జిల్లా పాటియాలాను వదిలి వేరే దగ్గర పోటీ చేసే పరిస్థితి లేదు. అయితే కెప్టెన్ అమృత్సర్ ఈస్ట్ నుంచి సిద్ధూపై పోటీ చేస్తారనే ప్రచారం గతంలో జరిగింది. సుఖ్బీర్ బాదల్: అకాలీదళ్–బీఎస్పీ కూటమి సీఎం అభ్యర్థి అయిన సుఖ్బీర్ బాదల్ ఈసారి కూడా జలాలాబాద్ నుంచి పోరాడుతున్నారు. ప్రస్తుత ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ 2017 ఎన్నికల్లో సుఖ్బీర్ బాదల్పై పోటీ చేసి ఓడిపోయారు. భగవంత్ మాన్: ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన ధురి నుంచి ఆధిక్యం సాధించారు. అందుకే ఆయనకు ఎలాంటి ఆటంకం రాకుండా పార్టీ అధిష్టానం సేఫ్ సీటు ఎంపిక చేసింది. అయితే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దల్బీర్ గోల్డీ, అకాలీదళ్ నుంచి ప్రకాశ్ చంద్ గార్గ్లను ఆ రెండు పార్టీలు రంగంలోకి దింపాయి. – సాక్షి, న్యూఢిల్లీ -
కేజ్రీవాల్పై పరువు నష్టం దావా వేస్తా: పంజాబ్ సీఎం చన్నీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై పరువు నష్టం దావా వేస్తానని పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ అన్నారు. పరువు నష్టం దావా వేయడానికి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు నిర్వహించిన నేపథ్యంలో పంజాబ్ సీఎం చన్నీని ఉద్దేశించి కేజ్రీవాల్ ‘నిజాయితీ లేని వ్యక్తి’ అంటూ విమర్శించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై స్పందించిన చన్నీ.. తర్వలోనే పరువు నష్టం దావా వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇతరుల పరువు, ప్రతిష్టలకు భంగంకలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం కేజ్రీవాల్కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. గతంలో కూడా నోటికొచ్చినట్లు మాట్లాడి.. తర్వాత క్షమాపణలు చెప్పిన ఘటనలు కూడా చూశామని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు పలువురు నేతలపై ఇష్టమోచ్చినట్లు వ్యాఖ్యలు చేసి.. తర్వాత క్షమాపణలు చేప్పి అక్కడి నుంచి పారిపోతారని ఎద్దేవా చేశారు. అయితే ఈ సారిగా ఊరుకునే ప్రసక్తే లేదని.. కేజ్రీవాల్పై పరువు నష్టం దావా వేస్తానని స్పష్టంచేశారు. భూపిందర్ సింగ్ హనీ నివాసంలో జరిగిన దాడుల్లో రూ.10 కోట్ల నగదు, 21 లక్షలకు పైగా విలువైన బంగారం, రూ. 12 లక్షల విలువైన రోలెక్స్ వాచ్ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని తమ పార్టీ నేతలపై ఈడీ దాడులు జరుపుతూ ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. పంజాబ్లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరగనుంది. ఫలితాలు మార్చి 10న వెల్లడికానున్నాయి. -
చన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు.. సిద్ధూని సీఎం అభ్యర్థిగా ప్రకటించినా ‘నోప్రాబ్లమ్’
చండీగఢ్: పంజాబ్లో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం చన్నీ, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్లు తమ ఆధిపత్యం కోసం పోటాపోటీగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, సీఎం చన్నీ ఒక మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో.. ‘త్వరలో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ సీఎం అభ్యర్థిగా.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూని పేరుని యోచిస్తుందా ’ అని ప్రశ్నించారు. దీనిపై చన్నీ తనదైన శైలీలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి తాను ఒక సేవకుడినని.. అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు. సిద్ధూ తనకు సోదరుడు లాంటి వాడని, దీనిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా చన్నీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్పై ఆరోపణలు గుప్పించారు. కాగా, ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్మాన్ పేరును ప్రకటించడంపై కూడా స్పందించారు. కేజ్రీవాల్ పంజాబ్ నుంచి నాయకుడిగా ఎదగాలన్నారు. పంజాబ్ ప్రజల నుంచి తగినంత మద్దతు కనబడకపోవడంతో చివరి నిమిషంలో భగవంత్ మాన్ పేరును ప్రతిపాదించారని తెలిపారు. కాగా, చన్నీ తాను పోటికి దిగుతున్న చామ్కౌర్ సాహిబ్ స్థానం నుంచి ఓడిపోతారని కేజ్రీవాల్ విమర్శించారు. అదే సమయంలో చన్నీ మేనల్లుడి ఇంట్లో కోట్లాది రూపాయలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలంగా మారిన విషయం తెలిసిందే. పంజాబ్లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. చదవండి: ప్రధాని మోదీ అరుదైన రికార్డు.. బైడెన్ కంటే -
ఈడీ దాడుల కలకలం.. పంజాబ్ సీఎం మేనల్లుడి ఇళ్లల్లో సోదాలు
చండీగఢ్: ఎన్నికల వేళ పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ బంధువుల నివాసంతో పాటు పలు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం దాడులు జరిపింది. ఇసుక మాఫియా మనీ లాండరింగ్ (హవాలా) వ్యవహారాలపై విచార ణలో భాగంగా అక్రమ మైనింగ్తో సంబంధం ఉన్న పలు కంపెనీలు, వ్యక్తులకు చెందిన ప్రదేశాలపై దాడులు చేసినట్లు ఈడీ అధికారులు చెప్పారు. చండీగఢ్, మొహాలి, లుధియానా, పఠాన్కోట్ సహా రాష్ట్రవ్యాప్తంగా డజనుకుపైగా ప్రదేశాల్లో సోదాలు నిర్వహించామన్నారు. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) నిబంధనల్లో భాగంగా దాడులు నిర్వహించామని చెప్పారు. దాడుల్లో ఈడీ అధికారులకు సీఆర్పీఎఫ్ బలగాలు తోడుగా ఉన్నాయి. నవాన్షమర్కు చెందిన కుద్రత్ దీప్ సింగ్ చెందిన ఒక కంపెనీకి భూపీందర్ సింగ్ అలియాస్ హనీ డైరెక్టర్గా ఉన్నారు. చరణ్ జిత్ సింగ్ మరదలి కుమారుడైన ఈ హనీకి పంజాబ్ రియల్టర్స్ పేరుతో ఒక కంపెనీ ఉంది. 2018లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 30 ట్రక్కులను పోలీసులు పట్టుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే సమయంలో దీప్సింగ్, హనీల కంపెనీలపై పలు ఫిర్యాదులు అనేక స్టేషన్లలో నమోదయ్యాయి. 2018లో నవాన్షహర్ ఎఫ్ఐఆర్తో పాటు పలు కంపెనీలు, వ్యక్తులపై ఇతర స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ విచారణ ఆరంభించింది. కుద్రత్దీప్ సింగ్తో హనీకి ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీస్తోంది. కొన్ని కోట్ల విలువైన ఇసుక మైనింగ్ కాంట్రాక్ట్ను చిన్న కంపెనీ పొందలేదని, కేవలం నల్లధనం పెట్టుబడిగా పెట్టడం వల్లనే హనీ కంపెనీకి కాంట్రాక్ట్ లభించిఉండవచ్చని ఈడీ అనుమానిస్తోంది. పంజాబ్లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్రమ మైనింగ్పై సీఎం చన్నీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా దాన్ని సమ ర్థించుకున్నారని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు. చన్నీ, ఆయన కుటుంబం అక్రమ మైనింగ్లో భాగస్వాములని, ఇలాంటి వారి చేతిలో పంజాబ్ భవితవ్యం బాగుపడదని దుయ్యబట్టారు. చదవండి: పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్ ఈ దాడులు పూర్తిగా కక్షపూరితం. బెంగాల్ ఎన్నికల వేళ అక్కడి సీఎం మమతాబెనర్జీ బంధువులపై దాడులు జరిగాయి. పంజాబ్లో కూడా కేంద్రం ఇదే ధోరణి అవలంబిస్తోంది. ఈడీ దాడులతో నాపై, నా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులపై ఒత్తిడి తెచ్చే యత్నాలు చేస్తున్నారు. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు – పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ చదవండి: బీజేపీ ఇవ్వనంటోంది! ఇతర పార్టీల నుంచి ఆఫర్లు.. -
సీఎం చన్నీ సోదరుడికి కాంగ్రెస్ టికెట్ నిరాకరణ
న్యూఢిల్లీ: పార్టీ తరఫున పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదలచేసింది. 86 మంది పేర్లున్న ఈ జాబితాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ సోదరుడు మనోహర్ సింగ్కు స్థానం దక్కలేదు. దీంతో బస్సీ పఠానా(ఎస్సీ) స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. చదవండి: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20కి వాయిదా మనోహర్ వృత్తిరీత్యా వైద్యుడు. గత ఏడాది ఆగస్ట్లో ప్రభుత్వం ఉద్యోగానికి రాజీనామా చేశాక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాగా, చంకౌర్ సాహిబ్ స్థానం నుంచి సీఎం చన్నీ బరిలో నిలుస్తున్నారు. నవ్జోత్ సింగ్ సిద్ధూ అమృతసర్(తూర్పు) నుంచి పోటీచేయనున్నారు. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్లు నిరాకరించింది. నటుడు సోనూసూద్ సోదరి మాళవిక మోగా నుం చి పోటీచేస్తారు. దీంతో మోగా సిట్టింగ్ ఎమ్మెల్యే హర్జోత్ కమల్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ఆరు రోజులు వాయిదా వేయండి చండీగఢ్: గురు రవిదాస్ జీ జయంతి(ఫిబ్రవరి 16న) వస్తున్న నేపథ్యంలో పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను ఆరు రోజులు వాయిదావేయాలని బీజేపీ, దాని మిత్రపక్షాలు పంజాబ్ లోక్ కాంగ్రెస్(పీఎల్సీ), శిరోమణి అకాలీదళ్(సంయుక్త్)లు ఈసీని ఆదివారం కోరాయి. ఈ మేరకు ఈసీకి లేఖ రాశాయి. బీఎస్పీ, కాంగ్రెస్ నేత, రాష్ట్ర సీఎం చన్నీలు సైతం పోలింగ్ను ఆరు రోజులు వాయిదా వేయాలని కోరడం తెల్సిందే. ఫిబ్రవరి 14కు బదులు పోలింగ్ను 20న నిర్వహించాలని కోరారు. -
పంజాబ్లో ఎన్నికలు ఆపాలంటూ సీఎం డిమాండ్, లేదంటే 20 లక్షల మంది కష్టమే!
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్జిత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. గురురవిదాస్ జయంతి వేడుకల నేపథ్యంలో బెనారస్ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలంటూ దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఆ వర్గానికి చెందినవారు దాదాపు 32 శాతం ఉన్నారన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు ఉత్తర్ప్రదేశ్లోని బెనారస్లో జరగనున్న గురురవిదాస్ జయంతి వేడుకలకు పంజాబ్ నుంచి దాదాపు 20 లక్షల మంది వెళ్లే అవకాశం ఉన్నట్టు సీఎం తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేరని, అందుకోసం కనీసం ఆరు రోజులపాటు వాయిదా వేసి తదుపరి నిర్వహించాలని లేఖలో కోరారు. (చదవండి: నన్ను కాదని సోనూసూద్ సోదరికి సీటిచ్చారు..! అందుకే ) అంతకుముందు పంజాబ్ బీఎస్పీ చీఫ్ జస్వీర్ సింగ్ గర్హి కూడా ఎన్నికలను రీ షెడ్యూల్చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. గురురవిదాస్ జయంతి (ఫిబ్రవరి 16) వేడుకల అనంతరం ఫిబ్రవరి 20న ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. కాగా, 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్లో ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలు మార్చి 10న వెలువడతాయి. (చదవండి: అవినీతి రహిత పాలన మా డీఎన్ఏలోనే ఉంది: కేజ్రీవాల్) -
గాయపడిన యువకుడి కోసం.. కాన్వాయ్ ఆపి మరీ సహాయం చేసిన సీఎం
చండీగఢ్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ బైకర్కు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ సహాయం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. చండీగఢ్లో ఓ ప్రాంతానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఓ వ్యక్తికి యాక్సిడెంట్ ఆయింధి. దీంతో అటుగా వెళ్తున్న సీఏం చన్నీ తన కాన్వాయ్ను ఆపి నడుచుకుంటూ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి తన పరిస్థితి అడిగి మరీ తెలుసుకున్నారు. అంబులెన్స్ పిలిపించి అతనికి సకాలంలో వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. జనవరి 5న ఎన్నికలు జరగనున్న రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భద్రత ఉల్లంఘనపై కేంద్రం, పంజాబ్ ప్రభుత్వం మధ్య రాజకీయ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసింది. సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ ఈ వ్యవహారంపై విచారించనున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రాష్ట్రం, కేంద్రం వణికిపోతున్నాయి. Seeing an Accident in Chandigarh today, CM Channi rushed to the injured man and helped him @CHARANJITCHANNI pic.twitter.com/OLkaxU41XE — INC TV (@INC_Television) January 10, 2022 -
ప్రజలెన్నుకున్న ప్రభుత్వ ఉసురు తీసే యత్నం: చన్నీ
టాండా (పంజాబ్): ప్రాణ హానిని ఎదుర్కొన్నానని ప్రధాని మోదీ అనడాన్ని పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ గిమ్మిక్కుగా అభివర్ణించారు. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ప్రధాని గౌరవనీయ దేశ నాయకుడని, ఆ స్థాయి వ్యక్తి ఇలాంటి అల్ప నాటకానికి దిగడం ఆయన హోదాకు తగదని చన్నీ పేర్కొన్నారు. ‘రైతులు ఏడాది పొడవునా ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ప్రతికూలతల నడుమ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కొనసాగిస్తే పట్టలేదు కాని 15 నిమిషాలు ప్రధాని రోడ్డుపై వేచి ఉండాల్సి వస్తే ఇంత రాద్దాంతమా? ఇవెక్కడి ద్వంద్వ ప్రమాణాలు’ అని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవ్జోత్సింగ్ సిద్ధూ ధ్వజమెత్తారు. మోదీ పాల్గొనాల్సిన ఫిరోజ్పూర్ ర్యాలీకి కేవలం 500 మంది మాత్రమే వచ్చారన్నారు. -
ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీంకోర్టులో విచారణ!
PM Modi Security Breach ఢిల్లీ: ప్రధాని పర్యటనపై భద్రతా వైఫల్యంపై బుధవారం దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు లాయర్స్ వాయిస్ సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్ను రేపు (శుక్రవారం) ఉన్నత న్యాయస్థానం విచారించనుంది. నిన్న (బుధవారం) ఫిరోజ్పూర్లో కొంత మంది నిరసనకారులు ప్రధాని నరేంద్రమోదీ కాన్వాయ్ను ఫ్లైఓవర్పై 20 నిముషాలపాటు అడ్డుకోవడంతో ప్రధాని ర్యాలి రద్దయ్యింది. భటిండా విమానాశ్రయం నుంచి హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారక స్థూపం వద్దకు ప్రధాని మోదీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పంజాబ్లో ప్రధాని కాన్వాయ్కు భద్రతా వైఫల్యంపై అత్యున్నతస్థాయి విచారణ కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలయ్యింది. పంజాబ్ పాలకులు దురుద్దేశంతోనే భద్రతా వైఫల్యం సృష్టించారని, దేశ భద్రతకే ఇది తీవ్రమైన విఘాతమని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని కాన్వాయ్లో చీఫ్ సెక్రటరీ, డీజీపీ కూడా ఉండాలని, కానీ వారిద్దరూ లేరని అన్నారు. భద్రతా ఏర్పాట్లపై ఆధారాలను భఠిండా జిల్లా జడ్జి వద్ద ఉంచేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కేసు విచారణ తక్షణమే చేపట్టాల్సిందిగా సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. పంజాబ్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ, క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారంటూ కేంద్ర హోం మంత్రిత్వ అమిత్ షా ఆరోపించారు. ప్రధాని ప్రయాణించే మార్గం గురించిన సమాచారం లీక్ అయిందా? అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఘటనపై విచారం వ్యక్తం చేసినప్పటికీ బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని కాన్వాయ్ రోడ్డు మార్గం గుండా వెళ్తున్నట్లు తమ ప్రభుత్వానికి సమాచారం అందలేదన్నారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో జరిగిన పొరపాట్లపై విచారణకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ప్యానెల్ను ఆదేశించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. చదవండి: Inspirational Story: నా కొడుకుకు కళ్లులేకపోతేనేం.. నా కళ్లతో లోకాన్ని పరిచయం చేస్తా! -
పంజాబ్ పర్యటన రద్దు.. ప్రధాని మోదీ తీవ్ర అసహనం
న్యూఢిల్లీ: పంజాబ్లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'ఎయిర్పోర్టుకు ప్రాణాలతో తిరిగి రాగలిగా.. పంజాబ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. భఠిండా ఎయిర్పోర్ట్ అధికారులతో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ ఉదయం భఠిండా చేరుకున్నారు. చదవండి: (ఆకస్మికంగా ప్రధాని మోదీ పర్యటన రద్దు..) అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వేదిక వద్దకు వెళ్లాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే మోదీ ప్రయాణిస్తోన్న కాన్వాయ్ మార్గంలో ఓ ఫ్లైఓవర్ వద్ద ఆందోళనకారులు రహదారిని బ్లాక్ చేశారు. దీంతో ప్రధాని కాన్వాయ్ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పైనే ఉన్న ప్రధాని.. తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి ఎయిర్పోర్ట్కు వెళ్లిపోయారు. చదవండి: (ప్రధాని పర్యటన రద్దు.. స్పందించిన పంజాబ్ ప్రభుత్వం) -
ప్రధాని పర్యటన రద్దు.. స్పందించిన పంజాబ్ ప్రభుత్వం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం నేపథ్యంలో పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఫైర్ అయ్యింది. ఉద్దేశపూర్వకంగానే ప్రధాని ర్యాలీని అడ్డుకున్నారంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ధ్వజమెత్తారు. పోలీసులు నిరసనకారులలతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ నిరాకరించారని జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పందించిన పంజాబ్ ప్రభుత్వం ప్రధాని మోదీ కాన్వాయ్ అడ్డగింత ఘటనపై పంజాబ్ ప్రభుత్వం స్పందించింది. ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని.. 10వేలమంది పోలీసులతో పటిష్ట సెక్యూరిటీ ఏర్పాటు చేశామని సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ తెలిపారు. హెలికాఫ్టర్ ద్వారా రావాల్సిన ప్రధాని మోదీ.. ముందస్తు సమాచారం లేకుండా రోడ్డుమార్గంలో వచ్చేశారని .. అదే సమస్యకు కారణమైందని పేర్కొన్నారు. రోడ్డును క్లియర్ చేయాలని నిరసనకారులను తాను స్వయంగా అభ్యర్థించినట్టు సీఎం చన్నీ తెలిపారు. చదవండి: (ఆకస్మికంగా ప్రధాని మోదీ పర్యటన రద్దు..) -
ఆ నిందితులను బహిరంగంగా ఉరితీయాలి: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
చంఢీఘడ్: పంజాబ్లోని స్వర్ణదేవాలయం, కపుర్త ఘటనలకు సంబంధించిన కుట్రదారులను బహిరంగంగా ఉరితీయాలని పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు. ఆయన మాలేర్కోట్లలో జరిగిన సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొంత మంది కావాలనే మత విద్వేశాలు రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసేలా కుట్రలతో.. పంజాబ్లో అశాంతిని సృష్టిస్తున్నారన్నారు. ఇప్పటికే స్వర్ణదేవాలయం ఘటనపై సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. నిన్న సీఎం చన్నీ(డిసెంబరు 19)న స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. వరుస ఘటనలతో ఆయా ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు భద్రతను పెంచాయి. ప్రజలు సంయమనం పాటించాలని సీఎం కోరారు. కాగా, స్వర్ణదేవాలయంలోని నిశిద్ధ ప్రాంతం, కపుర్త జిల్లా నిజాంపూర్ లోని గురుద్వారా పైకెక్కి పవిత్ర జెండా (నిషాన్ సాహిబ్)ను తొలగించడానికి ప్రయత్నించిన వ్యక్తులు స్థానికుల మూకదాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలను ఇప్పటికే పలు రాజకీయపార్టీలు ఖండించాయి. ఈ ఘటనపై ఇప్పటికే సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. చదవండి: 'పార్టీ కోసం నా జీవితం అర్పించా.. కాషాయం విడిచేది లేదు' -
సిద్ధూకు తలొగ్గిన చన్నీ సర్కార్
ఛండీగఢ్: సొంత పార్టీలోనే నిరసన గళం వినిపించే నవ్జ్యోత్సింగ్ సిద్ధూ డిమాండ్కు పంజాబ్లోని కాంగ్రెస్ సర్కార్ తలొగ్గింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీని మార్చింది. ఇక్బాల్ ప్రీత్ సింగ్సహోతాను తొలగించి, సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి శాశ్వత ప్రాతిపదికన డీజీపీని నియమించేంతవరకు ఛటోపాధ్యాయ కొనసాగుతారని పేర్కొంది. ప్రస్తుతం విజిలెన్స్ బ్యూరో చీఫ్ డైరెక్టర్గా ఉన్న సిద్ధార్థ్ ఆ బాధ్యతల్లోనూ కొనసాగుతారు. సెప్టెంబర్లో చరణ్జిత్సింగ్ చన్నీ సీఎంగా ప్రమాణం చేయగానే ఐపీఎస్ అధికారి సహోతాను డీజీపీగా నియమించారు. అయితే తన మీద వచ్చిన ఆరోపణల విచారణకోసం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందానికి నాయకత్వం వహించిన సహోతాను డీజీపీగా నియమించడాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకించారు. డీజీపీగా సిద్ధార్థ్ను నియమించాలని ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. -
కాంగ్రెస్లో చేరిన వివాదాస్పద గాయకుడు..
చంఢీఘడ్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య పరస్పర ఆరోపణలు, రాజీనామాల తర్వాత.. కాంగ్రెస్లో అనేక పలు ఆసక్తికర మార్పులు సంభవించిన విషయం తెలసిందే. తాజాగా, పంజాబ్ వివాదాస్పద గాయకుడు సిద్ధూ మూసేవాలా కాంగ్రెస్లో చేరారు. ఆయన పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ ఛన్నీ, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. మూసేవాలా.. గతంలో ‘సంజు’ అనే పాటల వీడియోలో తుపాకీలను ఉపయోగించారు. ఆ పాట వివాదాస్పదంగామారి, పలు కేసులు కూడా నమోదయ్యాయి. మూసేవాలా చేరికపై సీఎం ఛన్నీ స్పందించారు. మూసేవాలా.. ప్రజల మనస్సులు గెలుచుకున్నారని తెలిపారు. ఆయన తండ్రి మాజీ సైనికాధికారి, తల్లి మాన్సా గ్రామానికి సర్పంచ్గా పనిచేశారని తెలిపారు. అదే విధంగా, మూసేవాలా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మూసేవాలా మాట్లాడుతూ.. తాను మూడేళ్ల కిందట పాటలను పాడటం ఆరంభించానని తెలిపారు. ప్రస్తుతం ఒక కొత్త మార్పు రావాలనే సంకల్పంతో.. ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. మాన్సా గ్రామం చాలా వెనుక బడి ఉందని, గ్రామాభివృద్ధి కోసమే.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. మూసేవాలా.. కాంగ్రెస్ పార్టీని గర్వపడేలా చేస్తారనే నమ్మకం ఉందని ఛన్నీ అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. మూసేవాలాను ‘చాంప్’ గా కూడా అభివర్ణించారు. కాగా, సిద్ధూ మూసేవాలా అసలు పేరు.. శుభ్ దీప్ సింగ్ సిద్ధూ. ఆయన ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. సంగీతం నేర్చుకున్నారు. సిద్ధూ మూసేవాలా తన స్వగ్రామమైన మాన్సా నుంచి బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
నేను నలుపే.. కానీ నా ఆలోచనలు తెలుపు: సీఎం
న్యూఢిల్లీ: 200 ఏళ్ల తెల్ల వారి పాలనలో మగ్గిన ఫలితమో.. లేక పాశ్చత్య సంస్కృతి మీద మోజో తెలీదు కానీ మన వారికి తెల్లని శరీర ఛాయ అంటే మహా మోజు. నల్లగా ఉన్న వారిని అంటరాని వారిగా చూస్తారు. శాస్త్ర సాంకేతికపరంగా ఎంత ఎదిగినా.. సంస్కారం పరంగా మరింత దిగజారిపోతున్నాం. ఇక నల్లని శరీర ఛాయ ఉన్న వారు ఎదుర్కొనే అవమానాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేరారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి.. నల్ల ఆంగ్లేయులు అని సంబోధించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. (చదవండి: ప్రతి మహిళకు నెలకు రూ.వేయి ఇస్తాం.. సీఎం ప్రకటన) వచ్చే ఏడాది పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బరిలో దిగేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నాయి. దానిలో భాగంగా పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ బుధవారం ప్రసంగిస్తూ.. ‘‘కేజ్రీవాల్ చర్మం రంగు నలుపు. కానీ ఆయన తన ఆలోచనలు న్యాయపరమైనవని చెప్పడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. 2022లో గెలవడానికి నల్ల ఆంగ్లేయులు తెగ ప్రయత్నిస్తున్నారు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: గతంలో నేనూ ఆటో డ్రైవర్నే.. పెండింగ్ చలాన్లు రద్దు చేస్తా: సీఎం) చన్నీ వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘‘నేను నలపు కావొచ్చు. కానీ నా ఆలోచనలు మాత్రం తెలుపు.. అంటే స్వచ్ఛంగా ఉంటాయి’’ అని తెలిపారు. తిరంగ యాత్రలో భాగంగా పఠాన్కోటలో పర్యటిస్తున్న కేజ్రీవాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘నేను వారికి (కాంగ్రెస్) ఒక విషయం సూటిగా చెప్పాలనుకుంటున్నాను. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాధారణ దుస్తులు ధరించి, నల్లగా ఉన్న వ్యక్తి అన్ని హామీలను నెరవేరుస్తాడని తెలుపుతున్నాను. నేను తప్పుడు ప్రకటనలు, తప్పుడు వాగ్దానాలు చేయను’’ అని తెలిపారు. చదవండి: మీకు నేనున్నా.. హామీ ఇస్తున్నా: కేజ్రీవాల్ -
గతంలో నేనూ ఆటో డ్రైవర్నే.. పెండింగ్ చలాన్లు రద్దు చేస్తా: సీఎం
చండీగఢ్: ఆటోడ్రైవర్లపై వరాల జల్లు కురిపించారు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ. వారి ఆటోలపై ఉన్న పెండింగ్ చలాన్లు అన్నింటిని రద్దు చేసి.. వారికి కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తానని ప్రకటించారు. సోమవారం లూథియానాలోని గిల్ చౌక్ ప్రాంతంలోని ధాన్యం మార్కెట్కు వెళ్తున్న చన్నీ.. మార్గ మధ్యంలో తన వాహనాన్ని ఆపి.. ఆటోడ్రైవర్లతో భేటీ అయ్యాడు. వారితో పాటు చెక్కమీద కూర్చుని.. టీ తాగి.. వారి సమస్యలను విన్నారు సీఎం చన్నీ. ఈ సందర్భంగా సీఎం చన్నీ మాట్లాడుతూ.. ప్రారంభంలో రాజకీయాల్లోకి రాకముందు తాను ఆటో డ్రైవర్గా పని చేశానని తెలిపాడు. వారి నిజమైన డిమాండ్లను సానుభూతితో పరిగణలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఆటోల మీద ఉన్న పెండింగ్ చలాన్లు అన్నింటిని రద్దు చేస్తానని ప్రకటించాడు. అంతేకాక అధికారుల వేధింపులను అరికట్టేందుకు త్వరలోనే కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తానని ప్రకటించారు. (చదవండి: ఆ ఆహ్వానం నచ్చింది... అందుకే ఈ రాత్రికి అక్కడికి వెళ్తా!!) ఈ సందర్భంగా ఆటోడ్రైవర్లు ట్రాఫిక్ నియమానలు పాటించాలని సీఎం చన్నీ సూచించాడు. ఇక రోడ్డు మీద ఆటో రిక్షాలు నడపడానికి ప్రత్యేకంగా పసుపు గీత గీసి స్థలాన్ని కేటాయించాలని కోరిన ఆటో డ్రైవర్ల విజ్ఞప్తిని చన్నీ అంగీకరించాడు. ఈ పర్యటనలో చన్నీతో పాటు సిద్ధూ, మంత్రులు మన్ప్రీత్ సింగ్ బాదల్, భరత్ భూషణ్ అషు, ఎమ్మెల్యేలు కుల్దీప్ సింగ్ వైద్, సంజయ్ తల్వార్, లఖ్బీర్ సింగ్ లఖా కూడా ఉన్నారు. (చదవండి: పిలవకుండానే పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించిన సీఎం) అయితే చన్నీ చర్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే.. త్వరలోనే కేజ్రీవాల్ పంజాబ్ ఆటో డ్రైవర్లతో ఆటో సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దానికి ముందే చన్నీ వారితో భేటీ అయ్యి.. చలాన్లు రద్దు చేస్తానని ప్రకటించి.. కేజ్రీవాల్కు షాక్ ఇచ్చారు. చదవండి: రాహుల్ చెప్పిందే నిజమయ్యింది.. వైరలవుతోన్న ట్వీట్ -
ప్రతి మహిళకు నెలకు రూ.వేయి ఇస్తాం.. సీఎం ప్రకటన
చంఢీఘర్: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీపై విమర్శలు గుప్పించారు. ఆయన పంజాబ్లోని మోగా జిల్లాలో మాట్లాడుతూ.. పంజాబ్ ఎన్నికలకు సంబంధించి ఆప్ ఇచ్చిన హామీలను చరణ్జిత్ కాపీ కొట్టారని మండిపడ్డారు. ‘మీ చుట్టు ఓ నకిలీ వ్యక్తి తిరుగుతున్నాడు. నేను పంజాబ్ ప్రజలకు ఇచ్చిన హామీలను రెండు రోజుల తర్వాత.. వాటినే తమ పార్టీ హామీలను సీఎం చరణ్జిత్ ప్రకటించారు. ఏ హామీలను తీర్చలేడు.. ఆయనో నకిలీ వ్యక్తి’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పంజాబ్లోని 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు వేయి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. ఇది ప్రపంచంలోని చాలా పెద్ద పథకమని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు అడగకుండా మహిళలు అర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ పథకం ప్రజయోజనం కలిగిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. -
Navjot Singh Sidhu: పంజాబ్లో పంతం నెగ్గించుకున్న సిద్ధూ
Punjab Advocate General Who Sidhu Wanted Out Resigns: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ తన పంతం నెగ్గించుకున్నారు. సిద్ధూ డిమాండ్లకు ముఖ్యమంత్రి చరణ్జిత్ చన్నీ తలొగ్గారు. ఎట్టకేలకు అడ్వకేట్ జనరల్ (ఏజీ) రాజీనామాను ఆమోదించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని నియమించాలనే నిర్ణయాన్ని ప్రకటించడంతో పంజాబ్ కాంగ్రెస్లో ప్రతిష్టంభన ముగిసినట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై చున్నీ మాట్లాడుతూ.. ఏజీ కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు. ఇవాళ కేబినెట్ ఆమోదించింది. గవర్నర్ ఆమోదం కోసం పంపుతున్నాము. ఈరోజు ఆమోదం పొందితే రేపు కొత్త ఏజీని నియమిస్తామన్నారు. అంతేకాకుండా డీజీపీ పోస్టుకు చట్టప్రకారం 30 ఏళ్ల సర్వీసు ఉన్నవారి ప్యానెల్కు పంపి.. కొత్త డీజీపీని కూడా నియమిస్తాం' అని తెలిపారు. కాగా, పంజాబ్ అడ్వకేట్ జనరల్ పదవికి ఏపీఎస్ డియోల్, డీజీపీగా ఇక్బాల్ ప్రీత్సింగ్ సహోటా రాజీనామా చేసే వరకు పీసీసీ బాధ్యతలు స్వీకరించబోనని సిద్ధూ మొండికేసిన సంగతి తెలిసిందే. -
petrol prices: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.10 తగ్గింపు
ఛండిఘర్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరలపై ప్రభుత్వం భారీ అదనపు తగ్గింపును ప్రకటించింది. లీటర్ పెట్రోల్పై రూ.10, డీజిల్పై రూ.5 తగ్గిస్తున్నట్లు సీఎం చరణ్జిత్ చన్నీ ఆదివారం ప్రకటించారు. గత 70 ఏళ్లలో చమురు ధరలు ఇంతస్థాయిలో తగ్గించడం ఎప్పుడు జరగలేదని, ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. చదవండి: Money Laundering Case: ఈడీ కస్టడికీ అనిల్ దేశ్ముఖ్ ఢిల్లీతో పోల్చుకుంటే ప్రస్తుతం పంజాబ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.9 తక్కువగా లభిస్తుందని అన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా లీటర్ పెట్రోల్పై రూ.10, డీజిల్పై రూ.5 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయంతో పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు చమురు ధరలపై వ్యాట్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. -
దీపావళి బొనాంజా.. నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్
చంఢీగడ్: రాష్ట్రంలోని భవన, ఇతర నిర్మాణ కార్మికులకు దీపావళి కానుక అందించనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ కారణంగా నిర్మాణ పనులు తగ్గటంతో వేలాది మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారికి ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఆర్థిక సాయం అందిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ బుధవారం ప్రకటించారు. బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు(BOCW)లో రిజిస్టర్ అయిన ప్రతి కార్మికుడికి దీపావళి పండగను పురస్కరించుకొని రూ.3,100 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ట్వీటర్లో పేర్కొన్నారు. సీఎం ప్రకటనతో భవన, ఇతర నిర్మాణ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 3.17 మంది కార్మికులు అధికారికంగా బీఓసీడబ్ల్యూలో రిజిస్టర్ అయి ఉన్నారు. అయితే ఈ ఆర్థిక సాయం నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాలో చేరనుంది. On the eve of Diwali, My Govt. announces financial relief of Rs.3100 each for construction workers registered with BOCW Welfare Board (3.17 lakh workers across the State). A "Shagun" for workers as they have suffered immense losses in the wake of Covid Pandemic. pic.twitter.com/xpnLQRsVDt — Charanjit S Channi (@CHARANJITCHANNI) November 3, 2021 -
పంజాబ్కు 13 పాయింట్ల ఎజెండా
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకి, సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీకి మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇదే ఆఖరి అవకాశం అంటూ 13 పాయింట్ల ఎజెండాను సూచిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సిద్ధూ లేఖ రాశారు. 2017 ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేలా పంజాబ్ ప్రభుత్వాన్ని కదిలించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అక్టోబర్ 15న రాసిన ఆ లేఖను ఆదివారం సిద్ధూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ 13 పాయింట్ల ఎజెండాపై సోనియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని సిద్ధూ వెల్లడించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న పంజాబ్అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు, ఇసుక మాఫియా, విద్యుత్, రవాణా రంగాల్లో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. -
రాజీనామా ఉపసంహరించుకున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని కలుసుకున్న అనంతరం తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. సిద్ధూ తన రాజీనామా ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. (చదవండి: ‘అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు) కాగా, రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో తాను లేవనెత్తిన సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తన విధులను యథావిధిగా తిరిగి కొనసాగిస్తునున్నట్లు పేర్కొన్నారు. చరణ్ జిత్ సింగ్ చన్నీ క్యాబినేట్లోని అధికారుల నియమాకాలపై తీవ్ర అసంతృప్తితోపాటు, ఇటీవల చన్నీ కుమారుడి వివాహానికి కూడా సిద్ధూ దూరంగా ఉండటం తదితర పరిణామాలన దృష్ట్య కాంగ్రెస్లో అంతర్గత ఉద్రిక్త వాతావరణం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మేరకు "సిద్ధూ కూడా తాన తన పదవికి రాజీనామా చేసిన గానీ ‘తాను గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రీల సిద్ధాంతాలను పాటిస్తాను. తాను కాంగ్రెస్ పార్టీలో పదవి ఉన్నా.. లేకున్నా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల పక్షాన నిలబడతాను వ్యతిరేక శక్తులు నన్ను కిందకు తోయాలని చూసినా అంతకు మించిన ఆశావాదంతో పంజాబ్లో ప్రతి పౌరుడి గెలుపు కోసం కృషి చేస్తాను" అంటూ ట్విటర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. (చదవండి: "నా స్టార్ట్ప్ బిజినెస్కి పెట్టుబడి పెట్టండి ప్లీజ్") -
వారిద్దరు మాట్లాడుకోవడం లేదు.. ఇదిగో సాక్ష్యం..!
చండీగఢ్: పంజాబ్ రాజకీయాల్లో నెలకొన్న అస్థిరత ముగిసప్పటికి.. నేతల మధ్య ఇంకా సఖ్యత కుదిరినట్లులేదు. తాజాగా జరిగిన ఓ సంఘటన చూస్తే ఇది నిజం అనిపిస్తుంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. నవ్జోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్ష పదవికి అనుహ్యంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనేక సార్లు చర్చలు, డిమాండ్లకు అంగీకరించిన తర్వాత సిద్ధూ శాంతించాడు. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకరించాడు. అయితే సిద్ధూ, చన్నీల మధ్య దూరం అలానే ఉంది. ఇందుకు సాక్ష్యంగా నిలిచే సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. (చదవండి: మరణావస్థలో కాంగ్రెస్!: సిద్ధూ) ఆదివారం పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ కుమారుడు వివాహం జరిగింది. గురుద్వారాలో చాలా సాధారణంగా జరిగిన ఈ వేడుకకు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కానీ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ మాత్రం ఈ వివాహవేడకకు హాజరు కాలేదు. ప్రస్తుతం సిద్ధు వైషో దేవిని దర్శించుకునేందుకు జమ్మూ కశ్మీర్ వెళ్లారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చన్నీ కుమారుడి వివాహవేడుకకు సిద్ధూ హాజరుకాకపోవడంతో.. ఈ ఇద్దరి మధ్య ఇంకా సఖ్యత కుదలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చన్నీ కుమార్ నవ్జిత్ ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ సిమ్రన్ధీర్ కౌర్ను వివాహం చేసుకున్నారు. Darshan of the primordial mother during Navratras is synergising ... Washes away all the dirt from the soul !! Blessed to be at the lotus feet of Mata Vaishno Devi#JaiMataDevi pic.twitter.com/MP5VcDzy9F — Navjot Singh Sidhu (@sherryontopp) October 10, 2021 చదవండి: ఆ రోజు పంజాబ్లో ఆరోనది పారింది! అసలేం జరిగిందంటే.. -
హైడ్రామా నడుమ రాహుల్ పరామర్శ
లక్నో: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాం«దీ, తన సోదరి ప్రియాంక గాం«దీతో కలిసి లఖీమ్పూర్ ఖేరిలో బాధిత రైతు కుటుంబాలను పరామర్శించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ చన్నీ, ఛత్తీస్గఢ్ సీఎం బఘేల్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, సూర్జేవాలేలతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి లక్నో విమానాశ్రయానికి రాహుల్ చేరుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి యూపీ ప్రభుత్వం అనుమతినిచి్చనప్పటికీ పోలీసులు రాహుల్ సొంత వాహనంలో వెళ్లడానికి అంగీకరించలేదు. పోలీసు వాహనంలో వెళ్లాలని చెప్పారు. దీంతో లక్నో విమానాశ్రయంలో రాహుల్ ధర్నా చేశారు. ‘నాకు వాహనం ఏర్పాటు చేయడానికి మీరెవరు? నేను నా సొంత వాహనంలో వెళతాను’ అంటూ పోలీసులు, భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా వాహనంలో వెళ్లడానికి అనుమతించేవరకు నేను ఇక్కడే కూర్చుంటాను. రైతుల్ని అణిచివేస్తున్నారు. వారిని దోచేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను ఎవరి కోసం చేశారో అందరికీ తెలుసు’’ అని రాహుల్ అన్నారు. రాహుల్ ధర్నాతో దిగొచి్చన యూపీ పోలీసులు సొంత వాహనంలో వెళ్లడానికి అనుమతించారు. లక్నో నుంచి సీతాపూర్ గెస్ట్హౌస్లో ఉన్న ప్రియాంక గాంధీని ఆయన కలుసుకున్నారు. మూడు రోజులుగా నిర్బంధంలో ఉన్న ప్రియాంక గాం«దీని విడుదల చేస్తున్నట్టు అదనపు మెజిస్ట్రేట్ ప్రకటించారు. ఆ తర్వాత రాహుల్, ప్రియాంక కలిసి కాల్పుల్లో మరణించిన లవ్ప్రీత్ సింగ్, రమన్కాశ్యప్ కుటుంబాలను పరామర్శించారు. అనతంతరం మరో బాధితుడు నచార్ సింగ్ ఇంటికి బయలుదేరారు. రాహుల్, ప్రియాంక కన్నా ముందు ఆప్ పారీ్టకి చెందిన నేతల బృందం బాధిత కుటుంబాలను పరామర్శించారు. గురువారం అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ నేత మిశ్రాలు బాధిత కుటుంబాల పరామర్శకు రానున్నారు. అమిత్షాతో అజయ్ మిశ్రా భేటీ రైతు మరణాలకు నైతిక బా«ధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్లు ఊపందుకున్న నేపథ్యంలో బుధవారం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలుసుకున్నారు. రైతులపైకి వాహనాన్ని అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ నడిపాడని ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాకి మిశ్రా వివరణ ఇచ్చారు. ఘటన జరిగిన సమయంలో తాను కానీ, తన కుమారుడు కానీ అక్కడ లేరని చెప్పుకొచ్చారు. సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు సీజేఐ నేతృత్వంలో విచారణ ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరీలో రైతుల నిరసన సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది. ఈ మేరకు కేసులిస్టును సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీ సభ్యులుగా ఉన్నారు. 8 మంది మరణానికి కారణమైన లఖీమ్పూర్ ఖేరీ హింసపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒక పథకం ప్రకారం రైతులపై దాడులు దేశంలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని, నియంతృత్వమే రాజ్యమేలుతోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులపై ఒక పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం లక్నోకు బయలుదేరే ముందు ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం లక్నోకి వచ్చినప్పటికీ లఖీమ్పూర్ ఖేరికి వెళ్లడానికి తీరిక దొరకలేదని అన్నారు. యూపీలో కొత్త తరహా రాజకీయాలు నెలకొన్నాయని, క్రిమినల్స్ తమ ఇష్టారాజ్యంగా దారుణాలకు తెగబడి యధేచ్ఛగా తిరుగుతున్నారని, బాధితులకి న్యాయం చెయ్యమని అడిగితే నిర్బంధిస్తున్నారన్నారు. -
రూ.50 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించిన పంజాబ్, చత్తీస్గఢ్ ప్రభుత్వాలు
లక్నో: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ లఖీమ్పూర్ ఖేరి ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఆ ఘటనలో జర్నలిస్ట్ కశ్యప్ తోపాటు చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని బుధవారం ప్రకటించారు. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కూడా మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించారు. కాగా, ఉత్తర్ ప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరి వద్ద ఆందోళనకారులపైకి కేంద్ర మంత్రి కుమారుడి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అంతేకాదు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్, ఎస్యూవీ వాహనంలోల ఒకదానిపై కూర్చుని నిరసనకారుల మీదకు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వెలువెత్తడంతో ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలతో బీజేపీ ప్రభుత్వం పై దాడి చేస్తున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చన్నీ, బాఘేల్ ఇద్దరూ కూడా లక్నో పర్యటనలో ఉన్నారు. ఇదిలాఉండగా... ఉత్తర ప్రభుత్వం కూడా చనిపోయిన రైతు కుటుంబాలకు 45 లక్షల పరిహారంతోపాటు ప్రభుత్వం ఉద్యోగం, గాయపడిన వారికి రూ. 10 లక్షల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
శాంతించిన సిద్ధూ..!
న్యూఢిల్లీ/చండీగఢ్: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్ష పదవికి అనుహ్యంగా రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మనసు మార్చుకున్నట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఆయన గురువారం చండీగఢ్లోని పంజాబ్ భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీతో భేటీ అయ్యారు. పంజాబ్లో డీజీపీ, అడ్వొకేట్ జనరల్ నియామకంపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక నియామకాన్ని నిలిపివేస్తామని సీఎం చన్నీ హామీ ఇవ్వడంతో సిద్ధూ మెత్తబడినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలాగే ఒక సమన్వయ కమిటీని(కో–ఆరి్డనేషన్ ప్యానెల్) ఏర్పాటు చేసుకోవాలని ఇరువురూ నిర్ణయానికొచి్చనట్లు తెలిసింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూతోపాటు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి ఒకరు సభ్యులుగా ఉంటారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా తొలుత కమిటీలో చర్చిస్తారు. ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇద్దరు నేతల మధ్య 2 గంటలపాటు భేటీ జరిగింది. భేటీ తర్వాత చన్నీ, సిద్ధూ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. అతిత్వరలో సీడబ్ల్యూసీ సమావేశం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం అతిత్వరలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా గురువారం చెప్పారు. పార్టీలో ఇటీవలి కాలంలో లుకలుకలు, అసంతృప్త గళాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడానికి సీడబ్ల్యూసీ భేటీ తక్షణమే నిర్వహించాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్లో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన సీడబ్ల్యూసీ సమావేశంపై అధినేత సోనియా గాంధీ ఇటీవలే సంకేతాలిచ్చారని రణదీప్ సూర్జేవాలా చెప్పారు. సీనియర్ నేత కపిల్ సిబల్ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. మరోవైపు, పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అస్థిరత సృష్టిస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గురువారం ఆరోపించారు. -
Navjot Singh Sidhu: ముగిసిన పంజాబ్ సీఎం, సిద్ధూ భేటీ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత సిద్ధూ.. సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీతో తొలిసారి భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య సుదీర్ఘ సమావేశం జరగ్గా, సిద్ధూ డిమాండ్లను సీఎం చన్నీ అంగీకరించినట్లు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం నవజ్యోత్ సింగ్ సిద్ధూ మట్లాడుతూ.. పార్టీ, ప్రభుత్వం కలిసిమెలిసి పనిచేయాలని అన్నారు. నిజాయతీ, నమ్మదగిన అధికారులను నియమించాలని అన్నారు. మంగళవారం పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు సిద్ధూ. తన రాజీనామా లేఖలో పరోక్షంగా అమరీందర్ సింగ్ను వ్యవహరాన్ని ప్రస్తావించారు. చదవండి: Punjab Crisis: బీజేపీలో చేరికపై అమరీందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు -
పార్టీనే సుప్రీం.. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందాం: చన్నీ
చండీగఢ్: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నవజోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్లో అలజడి మొదలైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ మీదే వదిలేసిది అధిష్టానం. ఈ క్రమంలో చన్నీ అత్యవసరంగా కేబినెట్ భేటీ నిర్వహించారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. (చదవండి: Charan Singh Channi: సిద్ధూ రాజీనామాపై నాకు సమాచారం లేదు) పార్టీనే సుప్రీం అని.. ఎవరైనా సరే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చన్నీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సిద్దూతో ఆయన ఫోన్లో మాట్లాడారు. పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ.. ‘‘ఏది కావాలని చేయలేదు. ఏదైనా నియామకానికి సంబంధించి ఎవరికైనా అభ్యంతరం ఉంటే.. నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను. నాకు ఎలాంటి ఈగో సమస్యలు లేవు.. పార్టీనే సుప్రీం అని సిద్ధూకి స్పష్టం చేశాను. కూర్చుని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందాం’’ అన్నారు. (చదవండి: ఇక ఈ అవమానాలు నావల్లకాదు: పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం?) సిద్ధూ రాజీనామా అనంతరం పలువురు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఆయన నివాసానికి వెళ్లి రాజీనామాను వెనక్కి తీసుకోవాల్సిందిగా సిద్ధూని కోరారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం సిద్ధూ రాజీనామాను అంగీకరించలేదు.. దీనిపై అతడితో చర్చింలేదని సమాచారం. చదవండి: Punjab: నిజం కోసం చివరి శ్వాస వరకు పోరాడుతా: నవజోత్ సింగ్ సిద్ధూ -
సిద్దు ఒంటరివాడు... జట్టుగా పనిచేయలేడు
-
Charan Singh Channi: సిద్ధూ రాజీనామాపై నాకు సమాచారం లేదు
చండీగఢ్: నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాల్లో ఒక్కసారిగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ ఛన్నీ స్పందించారు. సిద్ధూ రాజీనామాపై తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. నవజ్యోత్ సింగ్పై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు. సిద్ధూ రాజీనామాపై మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. నవజ్యోత్ సింగ్ నిలకడలేని వ్యక్తని.. తాను ఎప్పుడో చెప్పానని ఘాటుగా విమర్శించారు. పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రానికి సిద్ధూ సరైన వ్యక్తి కాదని అన్నారు. అయితే, ప్రస్తుతం పంజాబ్లో ఇద్దరు కీలక నేతల రాజీనామాలతో కాంగ్రెస్పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: కాంగ్రెస్కు మరో షాక్: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా -
వివాహ వేడుకకు అనుకొని అతిథి..
-
పిలవకుండానే పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించిన సీఎం
చండీగఢ్: సాధారణంగా ముఖ్యమంత్రి అంటే.. కట్టుదిట్టమైన భద్రత.. ఆయన చుట్టుపక్కల ఒక పెద్ద హడావిడితో కూడిన వాతావరణం ఉంటుంది. సీఎం చుట్టు ఉండే భద్రత సిబ్బంది.. ఆయన అపాయింట్ మెంట్ లేకుండా ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లనివ్వరనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఒక్కొసారి ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా సీఎం భద్రత దృష్ట్యా.. సెక్యురిటీ సిబ్బంది నుంచి చేదు అనుభవం ఎదుర్కోవడం మనం చూస్తునే ఉంటాం. కొంత మంది ముఖ్యమంత్రులు మాత్రం దీనికి భిన్నంగా అవకాశం చిక్కినప్పుడల్లా ప్రజలతో మమేకమవ్వటానికి ప్రయత్నిస్తుంటారు. ప్రజలు జరుపుకునే పండుగలకు, శుభకార్యాలకు హజరవుతుంటారు. ఆ కోవకు చెందిన వారే ఇటీవల పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చరణ్ జీత్ సింగ్ ఛన్నీ. ఆయన తాజాగా ఒక వివాహ వేడుకలో వధువరులను ఆశీర్వదించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల పంజాబ్ 16 వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చరణ్జీత్ సింగ్ చన్నీ బటిండా జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన.. తన కాన్వాయ్ రోడ్డు మండి కలాన్ అనే గ్రామంనుంచి వెళ్తుండగా.. ఒక వివాహ వేడుక జరుగుతోంది. వెంటనే సీఎం తన కాన్వాయ్ని ఆపించారు. ఆ తర్వాత కిందకు దిగి .. నూతన దంపతులను పలకరించారు. పెళ్లికుమారుడిని హత్తుకొని మరీ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా ఆ వేడుకలో పెళ్లివారు ఇచ్చిన స్వీట్(పారట్) స్వీకరించి వారిని ఆనందపర్చారు. కాగా, సాక్ష్యాత్తూ.. ఒక సీఎం పిలవకుండా ఆగి.. తమకు శుభాకాంక్షలు తెలిపినందుకు వధువరులు ఆనందంతో ఉప్పోంగిపోయారు. వారితో సీఎం కొద్దిసేపు మాట్లాడారు. వధువరులను సీఎం చరణ్ జీత్ సింగ్ మనసారా ఆశీర్వదించారు. కాగా, దీన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. అయితే, గతంలో చరణ్ జీత్ సింగ్ విద్యార్థులతో కలిసి కపూర్తలాలో చేసిన భాంగ్రా ఫోక్ డ్యాన్స్ వైరల్గా మారిన విషయం తెలిసిందే. చదవండి: Charanjit Singh Channi: భాంగ్రా డ్యాన్స్తో హల్చల్ -
పంజాబ్ కేబినెట్లో ఏడు కొత్త ముఖాలు
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన చరణ్జీత్ సింగ్ చన్నీ తొలిసారిగా ఆదివారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 15 మందిని కేబినెట్లో చేర్చుకున్నారు. వీరిలో ఏడుగురు కొత్త మంత్రులు ఉన్నారు. మంత్రులతో పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఐదు నెలల్లో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం చన్నీ మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతూకం పాటించినట్లు స్పష్టమవుతోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ మంత్రివర్గంలో పనిచేసిన పలువురికి మరోసారి అవకాశం కల్పించారు. బ్రహ్మ మోహింద్రా, మన్ప్రీత్సింగ్ బాదల్, త్రిప్త్ రాజీందర్సింగ్ బాజ్వా, అరుణా చౌదరీ, సుఖ్బీందర్ సింగ్ సర్కారియా, రజియా సుల్తానా, విజయిందర్ సింగ్, భరత్ భూషణ్ అషూ, రాణా గుర్జీత్ సింగ్ తదితరులు మరోసారి మంత్రులయ్యారు. అమరీందర్సింగ్కు గట్టి మద్దతుదారులుగా పేరున్న రాణా గుర్మిత్ సింగ్ సోదీ, సాధు సింగ్ ధరంసోత్, బల్బీర్సింగ్ సిద్దూ, గురుప్రీత్సింగ్ కంగర్, సుందర్శామ్ అరోరాకు ఈసారి నిరాశే ఎదురయ్యింది. తమను పక్కనపెట్టడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము చేసిన తప్పేమిటో చెప్పాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీశారు. ఈ ఐదుగురు అమరీందర్కు అత్యంత సన్నిహితులు. చదవండి: (కాంగ్రెస్లోకి కన్హయ్య, జిగ్నేష్.. ముహుర్తం ఖరారు) అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హరీష్ రావత్ ప్రయత్నించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ నామినేటెడ్ పదవులు కట్టబెడతామని ఊరడించారు. సామాజిక, ప్రాంతీయ సమతూకం పాటిస్తూ మంత్రివర్గంలో యువతకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. పంజాబ్ ఉప ముఖ్యమంత్రులుగా సుఖ్జిందర్ సింగ్ రంధావా, ఒ.పి.సోనీ గత సోమవారమే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో నిబంధనల ప్రకారం మొత్తం 18 మంది మంత్రులు ఉండాలి. తాజా విస్తరణతో సీఎంతో కలిపి మంత్రుల సంఖ్య 18కి చేరింది. చదవండి: (ఎన్నికల ప్రేమకథ) Congress MLAs Brahm Mohindra and Manpreet Singh Badal take oath as Cabinet ministers of Punjab Govt, at Raj Bhavan in Chandigarh pic.twitter.com/hbInrGHcNG — ANI (@ANI) September 26, 2021 -
భాంగ్రా నృత్యంతో పంజాబ్ సీఎం హల్చల్
చండిగఢ్: పంజాబ్ నూతన ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ చాలా ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో చన్నీ ఇటీవల పదవీ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో "భాంగ్రా" నృత్యంతో సందడి చేశారు. (Charanjit Channi:తొలి మీడియా సమావేశంలో భావోద్వేగం) కపూర్తలాలోని ఐకే గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మ్యూజియం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఒక ఈవెంట్లో వేదికపై ఉన్న కళాకారులతో జత కలిశారు. వారితో పాటు ఉత్సాహంగా స్టెప్పులేసి అక్కడున్న వారందరిలో జోష్ నింపారు. కాగా సీఎంగా జలంధర్లో జిల్లాలో తన తొలి పర్యటన సందర్భంగా, 101పైగా ఎకరాల విస్తీర్ణంలో గురు రవిదాస్ చైర్ ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి సుఖ్జీందర్ సింగ్ రాంధవా , కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి పర్గత్ సింగ్తో ఇక్కడ పర్యటించారు డేరా సఖండ్ బల్లన్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం, రవిదాస్ చైర్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. రానున్న పది సంవత్సరాల పాటు దీని నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చూస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. #WATCH | Punjab Chief Minister Charanjit Singh Channi breaks into Bhangra at an event in Kapurthala. (Source: Information Public Relations Punjab) pic.twitter.com/4xg7iDKorW — ANI (@ANI) September 23, 2021 -
పంజాబ్ కొత్త సీఎం హామీలు: ఉచితంగా నీరు.. విద్యుత్ చార్జీలు తగ్గింపు
చండీగఢ్: పంజాబ్లో పేద కుటుంబాలకు ఉచితంగా నీరు సరఫరా చేస్తామని, విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తామని నూతన ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రకటించారు. పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. తనను తాను ఆమ్ ఆద్మీ(సామాన్యుడు)గా అభివర్ణించుకున్నారు. తాను గతంలో రిక్షా లాగానని, తన తండ్రి టెంట్ హౌస్ నడిపించారని గుర్తుచేశారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చన్నీ సోమవారం పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్లోని రాజ్భవన్లో గవర్నర్ భన్వరీలాల్ ఆయనతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డుకెక్కారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన సుఖ్జిందర్ సింగ్ రంధావా, ఓ.పి.సోని ప్రమాణ స్వీకారం చేశారు. వారిద్దరినీ ఉప ముఖ్యమంత్రులుగా నియమించనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం చరణ్జిత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడారు. 200 లోపు చదరపు గజాల్లోపు ఉన్న ఇళ్ల నుంచి నీటి చార్జీలు వసూలు చేయబోమని అన్నారు. విద్యుత్ టారిఫ్ సైతం తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా సీఎంగా అమరీందర్ చక్కగా పనిచేశారని చన్నీ కితాబిచ్చారు. పంజాబ్ ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం చన్నీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని మోదీ ట్వీట్ చేశారు. చన్నీ, సిద్ధూ సారథ్యంలో ఎన్నికల్లో పోటీ సిద్ధూ ఆధ్వర్యంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ పంజాబ్ పార్టీ ఇన్చార్జి హరీష్ రావత్ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. ఓట్ల కోసమే దళితుడైన చన్నీని సీఎం చేశారని విమర్శలొచ్చాయి. దీంతో పంజాబ్లో రాబోయే ఎన్నికల్లో చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూల సారథ్యంలో తమ పార్టీ పోటీకి దిగుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తాజా ప్రకటన చేశారు. చదవండి: తొలి మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన సీఎం -
ఎన్నికల ప్రేమకథ
దేశంలోనే అత్యధికంగా దళితులున్న రాష్ట్రమది. అక్కడ నూటికి 32 మంది దళితులే. కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు నిండినా, ఇప్పటి దాకా ఒక్క దళితుడైనా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు. మరో అయిదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలనగా ఇప్పుడయ్యారు. పంజాబ్ రాష్ట్రానికి తొలి దళిత సీఎంగా కాంగ్రెస్ నేత చరణ్జిత్ సింగ్ చన్నీ సోమవారం పదవీ ప్రమాణం చేశారు. ఇన్నేళ్ళకు సాధ్యమైన ఈ పరిణామాన్ని స్వాగతించాల్సిందే. కానీ 5 నెలల్లో ఎన్నికలనగా చూపిన ఈ ప్రేమ, చేసిన ఈ మార్పు దళితుల సాధికారికతకు చిహ్నమా? లేక ఎన్నికల వ్యూహమా అన్నది ప్రశ్న. అధ్యక్ష పదవిలో లేకున్నా పార్టీపై అపరిమిత అధికారం ఉన్న రాహుల్ గాంధీ స్వయంగా ఈ తాజా పదవీ ప్రమాణానికి హాజరయ్యారు. బీజేపీ అధినాయకుడైన ప్రధాన మంత్రి మోదీ విపక్ష దళిత సీఎంపై అభినందనల వర్షం కురిపించారు. ఎన్నికల క్షేత్రంలో దళిత ఓటర్ల ప్రాముఖ్యాన్ని ఏ పార్టీ విస్మరించదలుచుకోలేదని, ఓట్ల వేటలో కులాల వారీ ప్రేమకథ నడుపుతోందనీ అర్థమవుతోంది. 117 స్థానాల అసెంబ్లీలో 80 సీట్లు గెలిపించి, 2017 నుంచి ఇప్పటి దాకా అన్ని ఎన్నికలలోనూ పార్టీని గెలిపించిన చరిత్ర తాజా మాజీ సీఎం అమరిందర్ది. జనంలో పేరున్న నమ్మకస్థుడైన ఈ పార్టీ సైనికుడిని కాదనుకొని, కాంగ్రెస్ అధిష్ఠానం సెల్ఫ్గోల్ చేసుకుంది. రెండు నెలల క్రితం పీసీసీ అధ్యక్షపదవి దక్కించుకున్న సిద్ధూకూ, అమరిందర్కూ మధ్య ఆధిపత్య పోరులో చివరకు సిద్ధూదే పైచేయి అయింది. 2019లో పర్యాటక శాఖ మంత్రిగా రాజీనామా చేసినప్పటి నుంచి విమర్శలు, ప్రతివిమర్శలతో వారి మధ్య పోరు బహిరంగ రహస్యం. ఇప్పుడు మరో అయిదు నెలల్లోనే ఎన్నికలు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడానికి అంతకన్నా తక్కువ టైమే ఉంది. వెరసి, పాలనలో తనదైన ముద్ర వేయడానికి కొత్త సీఎం చన్నీకి నిండా 100 రోజులే. అధికారులపై అతిగా ఆధారపడి, ఎమ్మెల్యేలకైనా అందుబాటులో లేకుండా ఫామ్హౌస్లోనే గడిపారనీ, ఎన్నికల వాగ్దానాలు అనేకం నెరవేర్చలేదనీ అమరిందర్పై విమర్శ. పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవాలంటే, ఓటర్లలో ఆ వ్యతిరేకతని తగ్గించాలి. క్యాబినెట్లో ఉంటూనే అమరిందర్ను విమర్శించిన చన్నీ సీఎం పదవి చేపట్టగానే గ్రామాలలో నీటి, విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది అందుకే! అయితే, 52 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ, ‘‘అవమాన భారంతో’’ నాటకీయంగా సీఎం కుర్చీ వీడారు 79 ఏళ్ళ అమరిందర్. పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాకఢ్ సహా ఇలాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలతో పోలిస్తే చన్నీ వయసులో చిన్నవాడు. ఎమ్మెల్యేగా, విధాన సభలో ప్రతిపక్ష నేతగా, నిన్నటి దాకా అమరిందర్ క్యాబినెట్లో మంత్రిగా అనుభవం ఉంది. అదే సమయంలో ఆయనపై కొన్ని వివాదాలూ లేకపోలేదు. అయితే, అమరిందర్ స్వతంత్ర ధోరణి రాహుల్కు కొంతకాలంగా నచ్చట్లేదు. ప్రియాంకా గాంధీ సైతం సిద్ధూకు అనుకూలంగా నిలిచారు. ఈ పరిస్థితుల్లో సీఎం మార్పుపై అధిష్ఠానం కొద్ది నెలలుగా ఊగిసలాడింది. పరిస్థితులు గమనించినా, అమరిందర్ దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. చివరకు అధిష్ఠానం అనేకానేక పేర్లు పరిశీలించి, ఏవేవో పేర్లు లీక్ చేసి, అనూహ్యంగా చన్నీకి ఓటేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఎన్నుకుందని చెబుతూనే, ఇందిరా గాంధీ నాటి సీల్డు కవర్ సంప్రదాయంలో, దళిత కార్డుపై చన్నీకి పట్టం కట్టింది. దేశంలో మినీ ఎన్నికల పోరాటం మొదలైపోయినట్టు కనిపిస్తోంది. వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల వేడి, దానికి తగ్గట్టే కుల, మత రాజకీయాల జోరు పెరిగాయి. ఎన్నికలు జరగాల్సిన ఉత్తర ప్రదేశ్ మొదలు గుజరాత్, పంజాబ్ దాకా అన్ని చోట్లా కుల, మత సమీకరణాలే అన్ని పార్టీల వ్యూహాలనూ శాసిస్తున్నాయి. ఇన్నేళ్ళలో తొలిసారిగా పంజాబ్లో దళితుడు సీఎం అయ్యారంటే దాని చలవే. అయితే, రానున్న పంజాబ్ ఎన్నికలు సిద్ధూ సారథ్యంలోనే జరుగుతాయని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరీశ్ రావత్ నోరు జారడంతో, ప్రతిపక్ష అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు విమర్శించడానికి వీలు చిక్కింది. ‘దళిత సీఎం అనేది ఎన్నికల ముందు చేసిన గిమ్మిక్కు’ అంటూ కాంగ్రెస్పై విరుచుకుపడుతున్నాయి. మరోపక్క రాజకీయ అపరిపక్వత, పదవీకాంక్ష నిండిన సిద్ధూ ‘జాతి వ్యతిరేకి’ అంటూ స్వయంగా అమరిందరే వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ విపక్షాలకు అవి అంది వచ్చిన అస్త్రాలు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో పొత్తు అకాలీదళ్కు కలిసొచ్చినా రావచ్చు. దేశం మొత్తం మీద మూడే రాష్ట్రాలలో అధికారంలో మిగిలిన కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో తాజా మార్పులతో పెను జూదమే ఆడింది. సీఎం మార్పు అనివార్యమనుకున్నా ఆ మార్పు చేసిన విధానమే అంతా కలగాపులగమైంది. ఇక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలోనూ సీఎంలతో ఉన్న చిక్కుల్ని కాంగ్రెస్ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. బీజేపీ జయపతాక మోదీ తమ పార్టీ సీఎంలను మార్చినట్టు, విజయాల ట్రాక్ రికార్డు లేని రాహుల్ అండ్ కో చేద్దామనుకుంటే చిక్కే. ఏమైనా ఆరు నెలల క్రితం ఇట్టే గెలుస్తామనుకున్న పంజాబ్లో ఆ పార్టీ ఇప్పుడు వెనకబడింది. ఆత్మహనన ధోరణి నిర్ణయాలతో ప్రతిపక్షాలకు సందు ఇచ్చింది. అధికారానికి కొత్త అయిన చన్నీ ఇప్పుడు పార్టీలోని అన్ని వర్గాలనూ సమన్వయం చేసుకుంటూనే, పాలనను గాడిలో పెట్టాలి. 2022 ఎన్నికలలో పార్టీని గెలిపించాలి. అందుకు ఆయన దళిత కార్డు ఒక్కటే సరిపోతుందా? సిద్ధూ సారథ్యంలోనే ఎన్నికలన్న వ్యాఖ్యలను బట్టి చూస్తే, చన్నీ తాత్కాలిక ముఖ్యమంత్రేనా? ఒకవేళ రేపు కాంగ్రెస్ మళ్ళీ గెలిస్తే, చన్నీనే సీఎంను చేస్తారా? ఎన్నికల దళిత ప్రేమకథలో ఇప్పటికైతే ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. -
తొలి మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన సీఎం
చండీగఢ్: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్జిత్ సింగ్ చన్నీ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఒక సామాన్య వ్యక్తిని సీఎంగా చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రానికి మొదటి దళిత సీఎంగా చన్నీ నిలిచిన సంగతి తెలిసిందే. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్మధ్య నెలరోజుల పాటు సాగిన సంకక్షోభం నేపథ్యంలో కెప్టెన్ పదవినుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అనూహ్యంగా చరణ్జిత్ సింగ్ చన్నీని కొత్త సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. దీంతో చన్నీ సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తక్షణమే సాండ్ మాఫియాపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు రైతు పోరాటానికి పూర్తిగా మద్దతు ప్రకటించారు. స్వయంగా రిక్షా పుల్లర్ని అయిన తాను వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే నల్ల చట్టాలను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానన్నారు. అటు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరైన ఈ వేడుకకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాకపోవడం గమనార్హం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చన్నీకి కాంగ్రెస్ పెద్దలు, పలువురు నేతలతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకూడా శుభాకాంక్షలు అందజేశారు. #WATCH Punjab CM Charanjit Singh Channi gets emotional while addressing his first press conference in Chandigarh says "Congress has made a common man the chief minister." pic.twitter.com/4QNV990OR7 — ANI (@ANI) September 20, 2021 Congratulations to Shri Charanjit Singh Channi Ji on being sworn-in as Punjab’s Chief Minister. Will continue to work with the Punjab government for the betterment of the people of Punjab. — Narendra Modi (@narendramodi) September 20, 2021 -
ఆయన్ను తొలగించండి: పంజాబ్ సీఎంకు మీటూ సెగ
చండీగఢ్: అనూహ్య పరిణామాల మధ్య పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. రాష్ట్రానికి మొదటి దళిత సీఎంగా ఇంకా పూర్తి బాధ్యతలు చేపట్టకముందే ఛన్నీపై గతంలో చెలరేగిన మీటూ వివాదాల సెగ తాకింది. మీటూ ఆరోపణలొచ్చిన చన్నీని సీఎంగా ఎంపిక చేయడంపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవికి ఆయన అనర్హుడని, ఆయనను తొలగించాలని సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు. 2018 లో చన్నీపై వచ్చిన మీటూ ఆరోపణలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిందని రేఖా శర్మ గుర్తు చేసుకున్నారు. దీనిపై ఆందోళన చేసినా చర్యలేవీ లేకపోగా, తాజాగా అలాంటి వ్యక్తిని సీఎంగా ఎంపిక చేయడం శోచనీయమన్నారు. ఒక మహిళ (సోనియా గాంధీ) నేతృత్వంలోని పార్టీలో ఈ పరిణామం తీవ్ర ద్రోహమన్నారు. ఈ చర్య మహిళల భద్రతకు ముప్పు అని రేశాఖర్మ వ్యాఖ్యానించారు. దీనిపై సమగ్రవిచారణ జరిపి, బాధిత మహిళ స్టేట్మెట్ను పరగణనలోకి తీసుకుని, చన్నీపై చర్యలు తీసుకోవాలని ఆమె సోనియాను కోరారు. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్మధ్య మధ్య నెలరోజుల పాటు సాగిన సంక్షోభం నేపథ్యంలో కెప్టెన్ పదవినుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు సీఎంగా చరణ్జిత్ సింగ్ చన్నీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఇసుక మాఫియాపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరైన ఈ వేడుకకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ గైర్హాజరు కావడం గమనార్హం. కాగా 2018లో తనకు చరణ్జీత్ అసభ్య మెసేజ్లు పంపారంటూ ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఆరోపణలు గుప్పించారు. అయితే తనపై ఆరోపణలు చేసిన అధికారిణికి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అక్కడితో ముగిసినట్టు అంతా భావించారు. Today, he has been made Punjab CM by a party that is headed by a woman. It is betrayal. He is a threat to women safety. An enquiry should be conducted against him. He is not worthy to be CM. I urge Sonia Gandhi to remove him from the CM post: NCW Chairperson Rekha Sharma (1/2) pic.twitter.com/56kjw4XG7F — ANI (@ANI) September 20, 2021 -
పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్జిత్ సింగ్ చన్నీ
-
పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్జిత్ సింగ్ చన్నీ
చండీగఢ్: పంజాబ్ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం చన్నీ కెప్టెన్ అమరీందర్ను కలవనున్నారు. (చదవండి: ఎవరీ చన్నీ? ) పంజాబ్లో దళిత వర్గానికి సీఎం పదవి దక్కడం ఇదే ప్రథమం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్జిత్ సింగ్ చన్నీ 1972 ఏప్రిల్ 2న పంజాబ్లోని మక్రోనా కలాన్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అజ్మేర్ కౌర్, హర్సా సింగ్. దళితుల్లో రామదాసియా సిక్కు (చర్మకారులు) వర్గానికి చెందిన వారు. (చదవండి: Amarinder Singh: కెప్టెన్ కథ కంచికి చేరిందిలా!) చన్నీ చాంకౌర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.2015-16లె పంజాబ్ విధానసభలో విపక్షనేతగా ఉన్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో సాంకేతిక విద్య, పారిశ్రామిక శిక్షణశాఖ బాధ్యతలు నిర్వహించారు. చదవండి: విందుకు అందని పిలుపు.. వివాదానికి ఆజ్యం పోసిన ప్రమోషన్ -
పంజాబ్ కొత్త సీఎంగా చరణ్ జిత్ సింగ్ చన్నీ
-
ఎవరీ చన్నీ?
పంజాబ్ సీఎంగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న దళిత సిక్కు నాయకుడు చరణ్జిత్ సింగ్ చన్నీ 1972 ఏప్రిల్ 2న పంజాబ్లోని మక్రోనా కలాన్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అజ్మేర్ కౌర్, హర్సా సింగ్. దళితుల్లో రామదాసియా సిక్కు (చర్మకారులు) వర్గానికి చెందిన వారు. చన్నీ తండ్రి హర్సా సింగ్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా, బ్లాక్ సమితీ సభ్యుడిగా పనిచేశారు. తండ్రి నుంచి చన్నీ రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నారు. స్కూల్ యూనియన్ నాయకుడిగా ఎన్నికయ్యారు. పాఠశాల విద్య తర్వాత చండీగఢ్లోని గురు గోవింద్సింగ్ కాలేజీలో చేరారు. అనంతరం పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. తర్వాత జలంధర్లోని పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. చండీగఢ్లోని పంజాబ్ వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. హ్యాండ్బాల్ క్రీడలో ఆయనకు మంచి ప్రావీణ్య ఉంది. ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ మీట్లో బంగారు పతకం సాధించడం విశేషం. మున్సిపల్ కౌన్సిలర్ నుంచి.. చరణ్జిత్ సింగ్ చన్నీ తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా 2007లో చామ్కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012, 2017లోనూ అదే స్థానం నుంచి వరుసగా గెలిచారు. అంతకంటే ముందు మూడు పర్యాయాలు ఖరారా మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచారు. రెండుసార్లు కౌన్సిల్ అధ్యక్షుడిగా పని చేశారు. 2015–16లో పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2017 మార్చిలో అమరీందర్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉన్నత పదవుల్లో, ప్రభుత్వ పోస్టుల్లో దళితులు అవకాశాలు దక్కడం లేదంటూ సొంత ప్రభుత్వంపైనే నిరసన గళం వినిపించి అసమ్మతి నేతగా ముద్రపడ్డారు. సీఎంను మార్చాలంటూ కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి పెంచిన మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఉన్నారు. 2018లో ఓ మహిళా ఐఏఎస్ అధికారికి అనుచితమైన మెసేజ్ పంపించినట్లు చన్నీపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పంజాబ్లో ‘మీ టూ’వివాదంలో ఆయన కేంద్ర బిందువుగా మారారు. సదరు ఐఏఎస్ అధికారిణి ఆయనపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. తర్వాత వివాదం పరిష్కారమైందని నాటి సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. అయితే, ‘మీ టూ’వ్యవహారంలో సమాధానం చెప్పాలంటూ ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్ మహిళా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. జ్యోతిష్యంపై గురి ఎక్కువ... జ్యోతిష్యాన్ని బాగా విశ్వసించే చన్నీ రాజకీయాల్లో వెలిగిపోవడానికి పూజలు, యాగాలు అధికంగా చేస్తుంటారని ఆయన సన్నిహితులు చెప్పారు. 2017లో మంత్రివర్గంలో చేరిన వెంటనే ఓ జ్యోతిష్యుడి సూచన మేరకు చండీగఢ్లోని తన ఇంటికి తూర్పు దిశగా రాకపోకల కోసం ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పార్కులో నుంచి అక్రమంగా రోడ్డును నిర్మించుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ రోడ్డును కార్పొరేషన్ అధికారులు మూసివేశారు. అలాగే ఓ జ్యోతిష్యుడి సలహాతో చన్నీ ఖరార్లోని తన ఇంటి ప్రాంగణంలో ఏనుగుపై ఊరేగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. – నేషనల్ డెస్క్, సాక్షి సీఎం పదవి వద్దన్నాను: అంబికా సోని న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న ఆఫర్ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోని ఆదివారం చెప్పారు. ఆ సూచనను సున్నితంగా తిరస్కరించానని, సిక్కు నాయకుడే పంజాబ్ సీఎంగా ఉండాలన్నదే తన అభిప్రాయమని తెలిపారు. శనివారం రాజీనామా చేసిన అమరీందర్ వారసుడి ఎంపిక కోసం కాంగ్రెస్ నాయకత్వం విస్తృతంగా చర్చలు జరిపింది. పార్టీ నేత రాహుల్ గాంధీతో శనివారం రాత్రి, ఆదివారం అంబికా సోనితో భేటీ అయ్యారు. కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టాలంటూ పార్టీ పెద్దలు తనను కోరిన మాట నిజమేనని ఆమె మీడియాతో చెప్పారు. కానీ, పంజాబ్లో గత 50 ఏళ్లుగా సిక్కు నాయకులే ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారని, ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు. దేశంలో సిక్కు సీఎం ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబేనని పేర్కొన్నారు. -
పంజాబ్ నూతన సీఎంగా చరణ్జీత్ సింగ్ చన్నీ
చండీగఢ్: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్జీత్ సింగ్ చన్నీకి అవకాశం దక్కింది. ఆదివారం సమావేశమైన కాంగ్రెస్ శాసన సభా పక్షం సీఎంగా చన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ మేరకు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి హరీష్ రావత్ ట్విటర్లో వెల్లడించారు. చన్నీకి సీఎం బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. చదవండి: Amarinder Singh: కెప్టెన్ కథ కంచికి చేరిందిలా! ఇక తాజా మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాల కారణంగా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తలెత్తిన సంగతి తెలిసిందే. మరోవైపు అధిష్టానం కూడా కెప్టెన్ రాజీనామాకే మొగ్గు చూపిందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం రాజీనామా చేశారు. ఆయనతో పాటు మంత్రులు కూడా గవర్నర్కు రాజీనామా సమర్పించగా ఆయన ఆమోదించారు. చరణ్ జీత్ సింగ్ చన్నీ దళిత వర్గానికి చెందిన నేత. తొలుత సుఖ్జీందర్ సింగ్ రాంద్వాను పంజాబ్ సీఎంగా నియమించాలని భావించినా కాంగ్రెస్కు నవజ్యోత్సింగ్ సిద్దూ వర్గం నుంచి వ్యతిరేకత రావడంతో తిరిగి పునరాలోచనలు చేయాల్సి వచ్చింది. It gives me immense pleasure to announce that Sh. #CharanjitSinghChanni has been unanimously elected as the Leader of the Congress Legislature Party of Punjab.@INCIndia @RahulGandhi @INCPunjab pic.twitter.com/iboTOvavPd — Harish Rawat (@harishrawatcmuk) September 19, 2021 చదవండి: సిద్దూ వర్సెస్ అమరీందర్, రాజీనామా బాటలో సీఎం?