chip
-
ఏఐ చిప్లపై అమెరికా ఆంక్షల ప్రభావం
అమెరికా ఇటీవల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. భారత్ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఎగుమతికి సంబంధించి అమెరికా ఆంక్షలను నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నెల ప్రారంభంలో దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు చైనా, రష్యా వంటి దేశాల్లో సాంకేతిక పురోగతిని నిరోధించడమే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇతర దేశాలపైనా వీటి ప్రభావంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో ఏఐ చిప్ ఎగుమతుల పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది.అమెరికా ఆంక్షల పరిధిఅమెరికా ఎగుమతులపై విధించిన ఆంక్షలకు సంబంధించి వివిధ దేశాలను భద్రత, మానవ హక్కుల ప్రమాణాల ఆధారంగా మూడు అంచెలుగా వర్గీకరించింది. టైర్ 1లో యూకే, జపాన్, ఆస్ట్రేలియా వంటి మిత్ర దేశాలు ఉన్నాయి. ఇవి ఎటువంటి ఆంక్షలను ఎదుర్కోవు. భారతదేశం, సింగపూర్, ఇజ్రాయెల్ టైర్ 2 దిగుమతులపై కొన్ని పరిమితులను ఎదుర్కొంటాయి. ఇందులో భాగంగా అధునాతన ఏఐ చిప్లకు లైసెన్సింగ్ అవసరం. టైర్ 3లో చైనా, రష్యా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు తయారు చేసిన చిప్లను కొనుగోలు చేయకుండా పూర్తిగా నిషేధించాయి.ఇదీ చదవండి: మార్కెట్ ఆధారిత సంస్కరణలు అవసరంభారత్ ఏఐ మౌలిక సదుపాయాలపై ప్రభావంసమీప భవిష్యత్తులో 10,000 జీపీయూ(Graphics Processing Unit)లతో ఏఐ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిష్టాత్మక జాతీయ ఏఐ మిషన్ ఈ ఆంక్షల కారణంగా అడ్డంకులను ఎదుర్కొనుంది. 2027 వరకు 50,000 జీపీయూలను సిద్ధం చేయాలనే భారత ప్రణాళికలు ఈ ఆంక్షల వల్ల ప్రభావితం చెందే అవకాశం ఉంది. అయితే భారత్ యూఎస్ ఆంక్షల పరంగా టైర్2 విభాగంలో ఉండడంతో ఏఐ చిప్ల లైసెన్సింగ్ సదుపాయాలు మరింత మెరుగుపడాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆంక్షల వల్ల కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందని ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్ఏ) ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లకు కీలకమైన జీపీయూలకు మార్కెట్ తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన మార్గాలను అన్వేషించాలని కోరింది. -
భారత్లో అపార వ్యాపారావకాశాలు: కెనాన్ ఇండియా ప్రెసిడెంట్
భారత్లో చిప్ ఫ్యాబ్రికేషన్కి సంబంధించి గణనీయంగా వ్యాపార అవకాశాలు ఉన్నట్లు జపాన్కి చెందిన ఇమేజింగ్ ఉత్పత్తుల దిగ్గజం కెనాన్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో తొషియాకి నొమురా తెలిపారు. తమ సెమీకండక్టర్ లిథోగ్రఫీ మెషిన్లను సరఫరా చేసేందుకు, దేశీయంగా సెమీకండక్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు.చిప్ల ఉత్పత్తికి పలు చిప్ తయారీ సంస్థలకు ఇప్పుడు భారత్ కొత్త గమ్యస్థానంగా మారుతోందని పేర్కొన్నారు. మరోవైపు 2024లో తమ వృద్ధి దాదాపు రెండంకెల స్థాయిలో ఉండగలదని, ఏటా ఇదే తీరును కొనసాగించగలమని ఆశిస్తున్నట్లు నొమురా వివరించారు.ప్రధాన వ్యాపారమైన ఇమేజింగ్, ప్రింటింగ్, సరై్వలెన్స్ ఉత్పత్తులతో పాటు కెనాన్ ఇండియా సంస్థ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలతో పాటు డయాగ్నోస్టిక్ మెడికల్ ఇమేజింగ్ సొల్యూషన్స్పై (సీటీ, ఎక్స్-రే, అ్రల్టాసౌండ్ మొదలైనవి) కూడా దృష్టి పెడుతోంది. హెల్త్కేర్ విభాగంలో తమ వ్యాపార వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని నొమురా తెలిపారు. అటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. ఐటీ, బీఎఫ్ఎస్ఐ, ఫార్మా తదితర పరిశ్రమలపైనా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. -
గూగుల్ కొత్త చిప్: సూపర్ కంప్యూటర్ కంటే ఫాస్ట్
టెక్ దిగ్గజం 'గూగుల్'.. క్వాంటం కంప్యూటింగ్లో వేగవంతమైన పురోగతి సాధిస్తోంది. ఇందులో భాగంగానే సరికొత్త క్వాంటం చిప్ విల్లోను ఆవిష్కరించింది. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని కంపెనీ ల్యాబ్లో అభివృద్ధి చేసిన ఈ కొత్త చిప్, కేవలం ఐదు నిమిషాల్లో సంక్లిష్టమైన గణిత సమస్యను విజయవంతంగా పరిష్కరించగలిగింది.గూగుల్ పరిచయం చేసిన ఈ విల్లో చిప్.. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ల కంటే కూడా వేగంగా పనిచేస్తుంది. విల్లో చిప్ ఐదు నిమిషాల్లో పరిష్కరించగలిగిన సమస్యను.. వేగవంతమై సూపర్ కంప్యూటర్ పరిష్కారించాలంటే 10 సెప్టిలియన్ (ఒకటి తరువాత 25 సన్నాలు ఉన్న సంఖ్య) సంవత్సరాలు పడుతుంది. ఇది విశ్వం ఆవిర్భావం కంటే ఎక్కువని గూగుల్ వెల్లడించింది.ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!విల్లోని పరిచయం చేస్తున్నాము, ఇది మా కొత్త లేటెస్ట్ క్వాంటం కంప్యూటింగ్ 'చిప్' అని గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. వావ్ అని కామెంట్ చేశారు. ఆ తరువాత వీరిరువురి మధ్య కొంత సంభాషణ కూడా జరిగింది. ఇదంతా ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.Introducing Willow, our new state-of-the-art quantum computing chip with a breakthrough that can reduce errors exponentially as we scale up using more qubits, cracking a 30-year challenge in the field. In benchmark tests, Willow solved a standard computation in <5 mins that would…— Sundar Pichai (@sundarpichai) December 9, 2024Wow— Elon Musk (@elonmusk) December 9, 2024 -
రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు
భారతదేశంలో సెమీకండక్టర్ రంగంలో 2026 నాటికి దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు అవసరమవుతారని నివేదికలు వెలువడుతున్నాయి. టాలెంట్ సొల్యూషన్స్ కంపెనీ ఎన్ఎల్బీ సర్వీసెస్ నివేదిక ఈమేరకు వివరాలు వెల్లడించింది. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్లో మూడు లక్షల ఉద్యోగాలు, చిప్ ఏటీఎంపీ (అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్)లో రెండు లక్షల ఉద్యోగాలు, ఇతర విభాగాల్లో మరిన్ని కొలువులు సృష్టించబడుతాయని ఎన్ఎల్బీ నివేదించింది.నివేదికలోని వివరాల ప్రకారం.. దేశంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్లకు పెద్ద ఎత్తున అనుమతులు లభిస్తున్నాయి. తాజాగా దాదాపు రూ. 32,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఉత్తరప్రదేశ్లో ఆమోదం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం త్వరలో ప్రత్యేకంగా సెమీకండక్టర్ పాలసీను తీసుకురావాలని యోచిస్తోంది. గుజరాత్లోని ధొలేరా ప్రాంతంలో టాటా ఎలక్ట్రానిక్స్-పీఎస్ఎంసీ చిప్ ప్రాజెక్ట్, అస్సాంలో టాటా అసెంబ్లింగ్, టెస్ట్ యూనిట్ను నిర్వహిస్తోంది. సీజీ పవర్, కేన్స్, అదానీ వంటి ప్రైవేట్ కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. అమెరికాకు చెందిన మైక్రోటెక్ సంస్థ గుజరాత్లో ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం లభించింది.రూ.166 లక్షల కోట్లు ఖర్చుఎలక్ట్రానిక్ భాగాలు, తయారీ, సేవలకు సంబంధించి ఈ రంగంలో గ్లోబల్గా దాదాపు రెండు ట్రిలియన్ డాలర్లు(రూ.166 లక్షల కోట్లు) ఖర్చు చేయబోతున్నట్లు ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్ ప్లాట్ఫామ్ లుమినోవో వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సెబాస్టియన్ స్కాల్ అంచనా వేశారు. సెమీకండక్టర్ పరిశ్రమలో ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ఇంజినీర్, సెమీకండక్టర్ వేఫర్ ఇన్స్పెక్టర్, టెక్నికల్ స్పెషలిస్ట్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ (పీఎం) టెక్నీషియన్, డిజైన్ ఇంజినీర్, ప్రాసెస్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్ స్పెషలిస్ట్ వంటి కీలక పోస్టుల కోసం మానవ వనరుల అవసరం ఉందని చెప్పారు.ఇదీ చదవండి: నాలుగు లైన్ల పోస్ట్కు స్పందించి జాబ్ ఆఫర్!ఏటా ఐదు లక్షల మందిఎన్ఎల్బీ సర్వీసెస్ సీఈఓ సచిన్ అలుగ్ మాట్లాడుతూ..‘ఈ రంగంలో మానవ వనరుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని నైపుణ్యం కలిగిన వర్క్ఫోర్స్ను తయారు చేయాల్సి ఉంది. భారతదేశం సెమీకండక్టర్ హబ్గా మారాలంటే 2026 నాటికి 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరం. కాబట్టి ఈ రంగంలో ఉపాధి కొరతను తీర్చాలంటే ఏటా ఐదు లక్షల మంది ప్రతిభావంతులను తయారు చేయాల్సి ఉంటుంది’ అన్నారు. -
టాటా ఎల్రక్టానిక్స్ కొత్త ఒప్పందం.. తొలి చిప్ ఫ్యాక్టరీ
న్యూఢిల్లీ: ధొలేరా చిప్ తయారీ ప్లాంటు కోసం తైవాన్కి చెందిన పవర్చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్తో (పీఎస్ఎంసీ) ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా ఎల్రక్టానిక్స్ తెలిపింది. దీని ప్రకారం ఈ ప్లాంటుకు సంబంధించి డిజైన్, నిర్మాణ, సాంకేతికాంశాల్లో పీఎస్ఎంసీ సహాయ, సహకారాలు అందిస్తుంది.పీఎస్ఎంసీ సాంకేతికత, నైపుణ్యాలు భారత్లో సెమీకండక్టర్ల తయారీని వేగవంతం చేయగలవని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. గుజరాత్లోని ధొలేరాలో టాటా గ్రూప్ రూ. 91,000 కోట్లతో చిప్ల తయారీ ప్లాంటును నెలకొల్పుతోంది. నెలకు 50,000 వేఫర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతోంది. దీనితో 1,00,000 పైచిలుకు నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
నిజమవుతున్న రతన్ టాటా కల.. ఇక చైనా అవసరం లేనట్లే!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన తరువాత చాలా దేశాలు సెమీకండక్టర్ చిప్ కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కొంత డీలా పడ్డాయి. ఈ తరుణంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' స్వదేశీ సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ఇప్పుడు నిజం కాబోతోంది.భారతదేశంలో సెమీకండక్టర్ చిప్లను తయారు చేస్తే.. మన దేశం చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. రతన్ టాటా అనుకున్న విధంగానే చిప్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మోరిగావ్ జిల్లాలోని జాగిరోడ్లో ప్లాంట్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ భూమి పూజ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సమక్షంలో జరిగింది.అస్సాంలో నిర్మించనున్న ఈ ప్లాంట్ నిర్మాణానికి రూ. 27 వేలకోట్లు ఖర్చవుతుందని సమాచారం. నిర్మాణం పూర్తయిన తరువాత సుమారు 27000 కంటే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. సెమీకండక్టర్ తయారీలో అగ్రగామిగా ఉన్న చైనా మీద.. భారత్ ఆధారపడటం తగ్గుతుంది. దీనికోసం టాటా కంపెనీ కోట్లాది సెమీకండక్టర్లను తయారు చేయడానికి సిద్ధమైంది. రాబోయే రోజుల్లో భారత్ సెమికండక్టర్ చిప్ ఎగుమతిదారుగా కూడా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: తులం బంగారం కేవలం రూ.63.. మరి ఇప్పుడో..!టాటా సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ 2025 నాటికి సిద్ధమవుతుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. 2024 ఫిబ్రవరి 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఆమోదం పొందిన ఐదు నెలల వ్యవధిలోనే ప్లాంట్ నిర్మాణం ప్రారంభించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. -
ఎన్వీడియా ఏఐ చిప్.. దిగ్గజ కంపెనీలపై ప్రభావం
నేడు దిగ్గజ కంపెనీలు చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగిస్తున్నాయి. ఈ జాబితాలో ఎన్వీడియా కూడా ఉంది. సంస్థ ఏఐ ద్వారా చిప్లను తయారు చేయడం ప్రారంభించింది. దీంతో ప్రారంభంలో ఉత్పత్తి కొంత తక్కువగా ఉండొచ్చని, సరఫరాలలో కొంత ఆలస్యం అవ్వొచ్చని సమాచారం.ఎన్వీడియా చిప్ల తయారీ ఆలస్యం.. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి వాటిపైన పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ తన ఫ్లాగ్షిప్ గ్రేస్ హాప్పర్ AI సూపర్చిప్ను అనుసరించి మార్చిలో.. తన బ్లాక్వెల్ ఏఐ చిప్లను ఆవిష్కరించింది. ఇది ఉత్పత్తిని వేగవంతం చేస్తుందని సమాచారం. ఆ తరువాత సరఫరా వేగవంతం అవుతుంది.మార్కెట్లో హాప్పర్ డిమాండ్ ఎక్కువగా ఉంది, కాబట్టి ఉత్పత్తిని వేగవంతం చేయడానికి సంస్థ శ్రమిస్తోంది. అయితే ఈ వారం మైక్రోసాఫ్ట్, మరొక ప్రధాన క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్కు చిప్ల సరఫరా ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఎన్వీడియా తెలిపింది. -
న్యూరాలింక్ అద్భుతం, బ్రెయిన్లో చిప్ను అమర్చి.. ఆపై తొలగించి
ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలోన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ కంపెనీ న్యూరోటెక్నాలజీలో అరుదైన ఘనతను సాధించింది. ఈ ఏడాది మార్చిలో పక్షవాతానికి గురైన ఓ యువకుడి బ్రెయిన్ (పుర్రెభాగం- skull)లో చిప్ను విజయవంతంగా అమర్చింది. అయితే సమస్యలు ఉత్పన్నం కావడంతో ఆ చిప్ను వైద్యులు తొలగించారు. చిప్లోని లోపాల్ని సరిచేసి మరోసారి బ్రెయిన్లో అమర్చారు.ఇప్పుడా యువకుడు చేతుల అవసరం లేకుండా కేవలం తన ఆలోచనలకు అనుగుణంగా బ్రెయిన్ సాయంతో కంప్యూటర్, స్మార్ట్ఫోన్ను వినియోగిస్తున్నాడు. ఈ సందర్భంగా టెక్నాలజీ తన జీవితాన్ని మార్చేసిందంటూ భావోద్వేగానికి గురవుతున్నాడు.పక్షవాతంతో వీల్ ఛైర్కే2016లో సమ్మర్ క్యాప్ కౌన్సిలర్గా పనిచేసే సమయంలో నోలాండ్ అర్బాగ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతని వెన్నుముక విరిగి పక్షవాతంతో వీల్ ఛైర్కే పరిమితమయ్యాడు.ఎన్1 అనే చిప్ సాయంతోమెడకింది భాగం వరకు చచ్చుపడిపోవడంతో తాను ఏ పనిచేసుకోలేకపోయేవాడు. అయితే మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చే ప్రయోగాలు చేస్తోన్న న్యూరాలింక్ ఈ ఏడాది మార్చిలో నోలాండ్ అర్బాగ్ పుర్రెలో ఓ భాగాన్ని తొలగించి అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్1 అనే చిప్ను చొప్పించింది. ఇదే విషయాన్ని మస్క్ అధికారింగా ప్రకటించారు.Livestream of @Neuralink demonstrating “Telepathy” – controlling a computer and playing video games just by thinking https://t.co/0kHJdayfYy— Elon Musk (@elonmusk) March 20, 2024 డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికిఈ నేపథ్యంలో ఆర్బాగ్ బ్రెయిన్లో అమర్చిన చిప్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో న్యూరాలింక్ సంస్థ బాధితుడి బ్రెయిన్ నుంచి చిప్ను తొలగించింది. ఆపై సరిచేసి మళ్లీ ఇంప్లాంట్ చేసింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ చిప్ తొలగించిన తాను భయపడినట్లు నోలాండ్ అర్బాగ్ చెప్పారు.న్యూరాలింక్ అద్భుతం చేసింది‘ఈ చిప్ నా జీవితాన్ని మార్చేసింది. కానీ చిప్లో డేటా పోవడంతో.. చిప్ అమర్చిన తర్వాత గడిపిన అద్భుత క్షణాల్ని కోల్పోతాననే భయం మొదలైంది. అయినప్పటికీ, న్యూరాలింక్ అద్భుతం చేసింది. సాంకేతికతకు మార్పులు చేసి మెరుగుపరచగలిగింది’ అంటూ గుడ్ మార్నింగ్ అమెరికా ఇంటర్వ్యూలో తన అనుభవాల్ని షేర్ చేశారు నోలాండ్ అర్బాగ్ -
మెదడులో చిప్.. చెస్ ఆడించారు
ఇంతకాలం అసాధ్యం అనుకున్నదానిని సుసాధ్యం చేసినట్లు ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ గర్వంగా ప్రకటించుకున్నారు. పక్షవాతానికి గురైన ఓ వ్యక్తి మైండ్ కంట్రోల్ చిప్ సాయంతో అతనితో చెస్ ఆడాడు. తద్వారా చారిత్రాత్మక మైలురాయి చేరుకున్నట్లు మస్క్ సంతోషం వ్యక్తం చేశారు. ఎలన్ మస్క్కు చెందిన కంపెనీ న్యూరాలింక్ కార్పొరేషన్ అరుదైన ఫీట్ సాధించింది. ఓ వ్యక్తి బ్రెయిన్లో చిప్ అమర్చి.. అతని మైండ్ సాయంతో(Telepathically) ఆన్లైన్లో చెస్ ఆడిస్తూ అదంతా లైవ్ స్ట్రీమింగ్ చేసింది. క్వాడ్రిప్లెజియా(కాళ్లు చేతులు పక్షవాతానికి గురైన) పేషెంట్ అయిన నోలన్ అర్బాగ్ (29) అనే వ్యక్తిలో తొలి న్యూరాలింక్ చిప్ను అమర్చారు. ఈ ప్రాజెక్టులో భాగం కావడం తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశాడు అర్బాగ్. https://t.co/OMIeGGjYtG — Neuralink (@neuralink) March 20, 2024 Today, we might see the first human Neuralink patient controlling a phone and a computer with his brain. Neuralink to go live on 𝕏 at 2:30pm PST pic.twitter.com/vQxMem3ih7 — DogeDesigner (@cb_doge) March 20, 2024 ప్రపంచంలోని మొట్టమొదటి న్యూరాలింక్ చిప్ అమర్చిన వ్యక్తి.. కంప్యూటర్ను నియంత్రించగలడని, తన ఆలోచనల ద్వారా ద్వారా వీడియో గేమ్లు ఆడగలడని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ఈ విజయం ఆరంభం మాత్రమేనని.. ఇక నుంచి పక్షవాతం, ప్రమాదాలతో శరీర భాగాలు పని చేయకుండా మంచానికే పరిమితం అయిన వాళ్లతో న్యూరాలింక్ పని చేస్తుందని మస్క్ ప్రకటించారు. Neuralink's first ever patient demonstrating telekinetic abilities - controlling laptop, playing chess by thinking - using their implanted brain chip "Telepathy".#Neuralink #Telepathy #Telekinesis #Brainchip https://t.co/Qd7ZBdCPDK pic.twitter.com/uejICSs8R0 — Orders of Magnitude (@ordrsofmgnitude) March 21, 2024 2016లో బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ ‘న్యూరాలింక్’ను ఎలన్ మస్క్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. వైకల్యాలున్న వ్యక్తులు ప్రపంచంతో సంభాషించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ స్టార్టప్. ఈ క్రమంలో న్యూరాలింక్ తయారు చేసిన ఈ బ్రెయిన్కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ చిప్ను రోగి మెదడులో అమర్చే ప్రయోగాలు మొదలుపెట్టింది. న్యూరాలింక్ చిప్ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించింది. మరోవైపు కంప్యూటర్తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్’ ప్రయోగాలకు అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ’ గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది. జనవరి చివరివారంలో ఓ వ్యక్తి బ్రెయిన్లో చిప్ అమర్చినట్లు.. అతను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తే ఈ నోలన్ అర్బాగ్. ఎలా పనిచేస్తుందంటే.. న్యూరాలింక్ బ్రెయిన్కంప్యూటర్ ఇంటర్ఫేస్ లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్1 అనే చిప్ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్నకు పంపుతాయి. ఒక చిప్లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్స్టాల్ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమ్లుగా మారుస్తుంది. న్యూరాలింక్ కంటే ముందే.. ఈ తరహా ప్రయోగాలు న్యూరాలింక్తో పాటు మరికన్ని కంపెనీలు కూడా చేస్తున్నాయి. న్యూరాలింక్ కంటే ముందే.. ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జులైలో యూఎస్కు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్ను అమర్చింది. -
మెదడులో చిప్ పనిచేస్తోంది.. నిజమవుతున్న మస్క్ కల!
న్యూరాలింక్ ఇటీవల మనిషి మెదడులో చిప్ అమర్చింది. ఆ చిప్ కలిగిన మనిషి ఇప్పుడు పూర్తిగా కోలుకుంటున్నట్లు, వారి ఆలోచనల ద్వారా కంప్యూటర్ మౌస్ను నియంత్రించగలుగుతున్నట్లు స్టార్టప్ వ్యవస్థాపకుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) వెల్లడించారు. మెదడులో చిప్ కలిగిన వ్యక్తి పూర్తిగా కోలుకుంటున్నట్లు మాత్రమే కాకుండా.. పురోగతి కూడా కనిపిస్తోందని తెలిపారు. ఆ వ్యక్తి కేవలం ఆలోచించడం ద్వారా స్క్రీన్ చుట్టూ మౌస్ కదిలించగలడని, వీలైనన్ని ఎక్కువ మౌస్ బటన్ క్లిక్లను పొందడానికి ఇప్పుడు న్యూరాలింక్ ప్రయత్నిస్తోందని మస్క్ వెల్లడించారు. సెప్టెంబరులో హ్యూమన్ ట్రయల్ రిక్రూట్మెంట్ కోసం ఆమోదం పొందిన తర్వాత సంస్థ గత నెలలో మొదటిసారి మనిషి మెదడులో చిప్ను విజయవంతంగా అమర్చింది. మెదడులోకి ఒక ప్రాంతంలో ఆపరేషన్ చేసి చిప్ అమర్చినట్లు వెల్లడించారు. మనిషి మెదడులో చిప్ అమర్చడానికి ప్రధాన ఉద్దేశ్యం ప్రజలు తమ ఆలోచనలను ఉపయోగించి కంప్యూటర్ కర్సర్ లేదా కీబోర్డ్ను నియంత్రించేలా చేయడమే అని చెబుతున్నారు. అంతే కాకుండా నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వంటి వాటివల్ల కాళ్లు, చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను ఈ చిప్ మెరుగుపరిచే వీలుంది. డిమెన్షియా, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి, మానసిక సమస్యల చికిత్స కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇదీ చదవండి: టెక్నాలజీ ఉంది కదా అని ఎవరైనా ఇలా చేస్తారా! వీడియో చూడండి మనిషి మెదడులో చిప్ అమర్చడం అనేది ఇలాన్ మస్క్ కల. దీని కోసం గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆఖరికి కావాల్సిన అనుమతులు పొంది మెదడులో చిప్ అమర్చారు. ప్రస్తుతం ఇది సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. -
‘అప్పుడే అయిపోలేదు’..ఇంటెల్ ఉద్యోగులకు భారీ షాక్..!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటెల్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. తాజాగా చేపట్టిన 5వ రౌండ్ తొలగింపుల్లో సుమారు 235 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆర్ధిక మాద్యం మందస్తు భయాలు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా సంస్థలు వర్క్ ఫోర్స్ను తగ్గించుకుంటున్నాయి. ఇంటెల్ సైతం అదే దారిలో ఉన్నట్లు సమాచారం. అమెరికా కాలిఫోర్నియాలో శాక్రమెంటో కౌంటీలో రీసెర్చ్, డెవలప్మెంట్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది చిప్ తయారీ సంస్థ ఇంటెల్ 2025 నాటికి కాస్ట్ కటింగ్ చేసి సుమారు 10 బిలియన్ డాలర్లను ఆదా చేయాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ఇందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ‘ఇంటెల్ సంస్థ పలు విభాగాల్లో ఉద్యోగుల తొలగింపుతో ఖర్చుల్ని తగ్గించుకునే వ్యూహంతో పనిచేస్తుందని’అని కంపెనీ ప్రతినిధి అడీ బర్ శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ నివేదికలో పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపులు అప్పుడే అయిపోలేదని.. వచ్చే ఏడాది మరిన్ని తొలగింపులు ఉండవచ్చని పేర్కొన్నారు. కాగా, గతంలో జరిగిన ఉద్యోగుల తొలగింపుల్లో ఇంటెల్ దాని ఫోల్సమ్ క్యాంపస్లో 549 మందికి పింక్ స్లిప్ జారీ చేసింది. -
స్పైసీ చిప్స్ తినకూడదా? చనిపోతారా..?
చిన్నారుల దగ్గర నుంచి పెద్దలు వరకు సరదాగా కాలక్షేపంగా తినే చిరుతిండ్లలో చిప్స్ ఒకటి. అవంటే.. అందరూ ఇష్టంగా లాగించేస్తారు. అవి తినొద్దు! లివర్కి మంచిది కాదన్నా.. పిల్లలే కాదు పెద్దలు కూడా చిన్నపిల్లల్లా..ఒక్కసారి తింటే ఏం కాదులే అంటూ లాగించేస్తారు. అంతలా ప్రజలు ఈ చిప్స్ని ఇష్టంగా తింటుంటారు. ఇటీవల నెట్టింట రకరకాల ఛాలెంజ్లను చూస్తున్నాం. సెలబ్రెటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ ఈ ఛాలెంజ్లను చేసేందుకు తెగ ఉత్సాహం కనబరుస్తున్నారు కూడా. అవి మంచివి అయితే పర్లేదు. ప్రాణాంతకమైనవి అయితేనే సమస్య. ఇక్కడొక చిన్నారి కూడా అలాంటి ఛాలెంజ్ని తీసుకుని ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. ఆ చిన్నారి ఆ ఛాలెంజ్ని తీసుకున్నాక గానీ తెలియలేదు స్పైసీ చిప్స్ తింటే చనిపోతారని. వాట్? ఇది నిజమా? అని షాకవ్వకుండా. ఈ ఘటన యూఎస్లోని మసాచుసెట్స్లో జరిగింది. వివరాల్లోకెళ్తే..మాసాచుసెట్స్కి చెందిన హారస్ వోలోబా అనే 14 ఏళ్ల బాలుడు ఆన్లైన్ చక్కర్లు కొడుతున్న స్పైసీ చిప్స్ ఛాలెంజ్ని తీసుకున్నాడు. అది తిన్న కొద్దిగంటలకే తీవ్రమైన కడుపునొప్పితో గిలగిలలాడిపోయాడు. హుటాహుటినా ఆస్పత్రికి తరలించినా.. ఫలితం శూన్యమే అయ్యింది. ఆస్పత్రికి వెళ్లాక ఆ బాలుడి పరిస్థతి మరింతగా విషమించి మృతి చెందాడు. అతను తీసుకున్న స్పైసీ ఫుడ్ ఛాలెంజ్లో తినాల్సిన చిప్స్ ప్రపంచంలోనే అత్యంత స్పైసీ చిప్స్ అట. దాని ప్యాకింగ్ కవర్పై కూడా అత్యంత ఘాటైనా మిరియాలతో చేసినవని గర్భిణీ స్త్రీలు, ఇతర సమస్యలున్న పెద్దలు వీటికి దూరంగా ఉండాలని ఓ హెచ్చరికి కూడా ఉంటుందట. ఐతే ఆ బాలుడి కుటుంబ సభ్యులు మాత్రం ఈ చిప్స్ తిన్నాక మా అబ్బాయి అస్వస్థతకు గురై చనిపోయాడంటూ గొడవచేశారు. ఆ చిప్స్ని బ్యాన్ చేయాలని గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చారు కూడా. ఈ స్పైసీ చిప్స్కి సంబంధించి తొలి ప్రాణాంతక కేసు కూడా ఇదే. ఈ ఘటనతో అక్కడ కొన్ని పాఠశాల వద్ద ఈ చిప్స్ అమ్మకాలను బ్యాన్ చేశారు కూడా. ఈ స్పైసీ చిప్స్ ప్యాకెట్ కేవలం రూ.830/లకే మార్కెట్లో దొరుకుతుంది. తాము ఇచ్చిన హెచ్చరికను పట్టించకుండా తినడం వల్లే ఇలా జరిగిందని ఆ ప్యాకెట్లు ఉత్పత్తి చేసే కంపెనీ వాదించడం గమనార్హం. ఇక అధ్యయనాల్లో కూడా అందులో వాడే ఘాటూ మిరియాల పొడి తీవ్రమైన గుండె సంబంధిత రుగ్మతలకు దారితీసే అవకాశం ఉందని తేలింది. ఇక ఆ బాలుడు చిప్స్ వల్లే చనిపోయాడన్నది అధికారికంగా నిర్థారణ కాలేదు. పోస్ట్మార్టం తదనంతరం వాస్తవాలు తెలియాల్సి ఉంది. ఏదీఏమైనా ఇలాంటి జంక్ ఫుడ్స్ పిల్లలకు ఇచ్చేటప్పుడూ కాస్త పెద్దలు ఆలోచించటం మంచిది. ఇంట్లో తయారు చేసి ఇవ్వండి గానీ మార్కెట్లో దొరికే చిప్స్ జోలికి వెళ్లకపోతేనే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: ఎంతపనైపాయే! పొరపాటున నాలుక కరుచుకుంది..అంతే ఊపిరాడక..) -
మేడిన్ ఇండియా ఈ-చిప్: 2024 చివరికల్లా మార్కెట్లోకి..
న్యూఢిల్లీ: భారత్లో తయారైన (మేడ్ ఇన్ ఇండియా) తొలి ఈ–చిప్లు 2024 డిసెంబర్ నాటికి మార్కెట్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. ఏడాదిలోపు నాలుగు నుంచి ఐదు వరకు సెమీకండక్టర్ ప్లాంట్లు దేశంలో ఏర్పాటు కావొచ్చని చెప్పారు. అమెరికాకు చెందిన కంప్యూటర్ మెమొరీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీస్ 2.75 బిలియన్ డాలర్ల వ్యయంతో గుజరాత్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు చేసిన ప్రకటనను మంత్రి గుర్తు చేశారు. ఈ ప్లాంట్కు అనుసంధానంగా 200 చిన్న యూనిట్లు కూడా ఏర్పాటు అవుతాయని మంత్రి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, భారత ప్రధాని మోదీ సంయుక్త ప్రకటన అనంతరం అశ్వని వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మైక్రాన్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి పన్ను నిబంధనలు, ఫ్యాక్టరీ డిజైన్, భూ కేటాయింపులపై ఒప్పందం కూడా పూర్తయినట్టు తెలిపారు. మైక్రాన్ టెక్నాలజీస్ నుంచి మొదటి చిప్ ఆరు త్రైమాసికాల తర్వాత మార్కెట్లోకి వస్తుందన్నారు. మైక్రాన్ ఏర్పాటు చేసే 2.75 బిలియన్ డాలర్ల ప్రాజెక్టుకు సంబంధించి సంస్థ సొంతంగా రూ.825 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండగా, మిగిలిన మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చనుండడం గమనార్హం. ఈ ప్లాంట్తో మొత్తం 20వేల ఉద్యోగాలు రానున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం విలువ బిలియన్ డాలర్ల మేర ఉంటుందని అశ్వని వైష్ణవ్ తెలిపారు. సెమీకండక్టర్ పథకం సవరణ సెమీకండక్టర్ పథకాన్ని సవరించామని, కనుక గతంలో దరఖాస్తు చేసిన సంస్థలను మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరినట్టు మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. లేదా దరఖాస్తులు సవరించుకోవాలని సూచించినట్టు చెప్పారు. సవరించిన పథకం కింద సెమీకండక్టర్ ప్లాంట్ వ్యయంలో 50 శాతాన్ని కేంద్రమే ద్రవ్య ప్రోత్సాహకం కింద సమకూరుస్తోంది. గతంలో ఇది 30 శాతంగానే ఉండేది. -
ఎలాన్ మాస్క్ మరో సంచలం ...బ్రెయిన్లోకి చిప్
-
ఎలాన్ మస్క్ సంచలనం, నా కొడుకు బ్రెయిన్లో ఈ చిప్ను అమర్చుతా?
ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసే ఉంటారుగా. ఆ సినిమాలోని హీరోకి చిప్ను అమర్చి అతని కదలికల్ని ఎలాగైతే కంట్రోల్ చేస్తారో సేమ్ టూ సేమ్ అలాంటి టెక్నాలజీనే అందుబాటులోకి తేబోతున్నారు బిలియనీర్ ఎలాన్ మస్క్. ఈ ప్రాజెక్ట్ పట్ల మస్క్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎంతలా అంటే? అవసరం అయితే తన బ్రెయిన్లో, లేదంటే తన కొడుకు బ్రెయిన్లో చిప్ను అమర్చుకునేంత ధీమా ఉందన్నారు. ఎలాన్ మస్క్కు కృత్తిమ మేధపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అది మానవులకన్నా తెలివైంది. భవిష్యత్లో మానవాళిపై ఆధిపత్యం సాధిస్తోందని తరచూ చెబుతున్నారు. దాన్ని ఎదుర్కొవడానికే న్యూరాలింక్ ప్రాజెక్ట్కు ఆయన శ్రీకారం చుట్టారు. ఏఐని అధిగమించేలా మానవుల మేధస్సును సామర్ధ్యాలను పెంచడానికి దోహద పడుతుందని, అందుకే ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా న్యూరాలింక్ ప్రాజెక్ట్ గురించి మస్క్ కీలక ప్రకటన చేశారు. మరో 6 నెలల్లో బ్రెయిన్ కంప్యూటర్ ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీతో మనిషి మెదడులో చిప్ పెట్టే ప్రయోగాలను చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. బ్రెయిన్ కంప్యూటర్ ఎంటర్ ప్రైజెస్ టెక్నాలజీ పరిజ్ఞానంపై కాలిఫోర్నియాలోని న్యూరాలింక్ ప్రధాన కార్యాలయంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. పక్షపాతం వచ్చిన వారి అవయవాలను కదిలించేలా చేసేందుకు వెన్నపూసలో అమర్చేందుకు వీలుగా చిప్, చూపు కోల్పోయిన వారికి సాయపడేలా మరో పరికరాన్ని రూపొందిస్తున్నారు. ఈ రెండింటిలో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మనిషి మెదడులో పెట్టబోయే చిప్తో పాటు దాన్ని పుర్రెలో అమర్చగలిగే రోబోను కూడా పరిచయం చేశారు. మనుషులపై ప్రయోగాలు జరిపేందుకు అవసరమైన ప్రయోగాలు జరిపేందుకు ఆహార,ఔషద నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ)కు సమర్పించేందుకు అన్నీ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉన్నాయని, అలాగే ఇప్పటి వరకు ఎఫ్డీఏతో జరిపిన చర్చలన్నీ సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. దీంతో పాటు చిప్ను అమర్చిన కోతి తనకు ఎదురుగా ఉన్న కంప్యూటర్ స్క్రీన్ మీద జస్ట్ మీ కళ్లతో అటూ ఇటూ చూస్తుంటే..మౌస్ కర్సర్ కదులుతుంది. అది ఏం టైప్ చేయాలనుకుంటుందే అదే టైప్ అవుతుంది. ఆ వీడియోను ప్రదర్శించారు. బ్రెయిన్లో చిప్ను అమర్చే ప్రయోగాల పట్ల నమ్మకంగా ఉన్నారు.చిప్ను నా బ్రెయిన్లో, నా కుమారుడి బ్రెయిన్లో అమర్చుకునేంతలా’ అనే ధీమా వ్యక్తం చేశారు. చదవండి👉 ఎలాన్ మస్క్కు మరో ఎదురు దెబ్బ..‘టిమ్ కుక్ ఇక్కడ ఏం జరుగుతోంది’? -
గోరుచుట్టుపై రోకటి పోటు
-
5 కంపెనీలు..రూ.1.53 లక్షల కోట్ల పెట్టుబడులు,1.35లక్షల ఉద్యోగాలు!!
మనదేశంలో 1.53 ట్రిలియన్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ చిప్, డిస్ప్లే తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఐదు కంపెనీల నుండి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయని కేంద్రం తెలిపింది. వేదాంత ఫాక్స్కాన్ జేవీ, ఐజీఎస్ఎస్ వెంచర్స్, ఐఎస్ఎంసీలు 13.6 బిలియన్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ చిప్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. రూ.76,000 కోట్ల సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ కింద కేంద్రం నుండి 5.6 బిలియన్ల సహాయాన్ని కోరినట్లు కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. "నెలకు దాదాపు 120,000 వేఫర్ల సామర్థ్యంతో 28 నానోమీటర్ (ఎన్ఎమ్) నుండి 65 ఎన్ఎమ్ సెమీకండక్టర్ ఫ్యాబ్లను ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు అందాయని తెలిపిన కేంద్రం..28 ఎన్ఎమ్ నుండి 45 ఎన్ఎమ్ వరకు ఉన్న చిప్లకు 40 శాతం వరకు, 45 ఎన్ఎమ్ నుండి 65 ఎన్ఎమ్ వేఫర్ల కోసం తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి 30 శాతం వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు హామీ ఇచ్చింది. కాగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు మొదలైన వాటిలో ఉపయోగించే డిస్ప్లే తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని వేదాంత, ఎలెస్ట్ సంస్థలు ప్రతిపాదించాయి. 6.7 బిలియన్ల అంచనా పెట్టుబడితో. భారత్లో డిస్ప్లే ఫ్యాబ్ల ఏర్పాటు కోసం కేంద్రం నుంచి 2.7 బిలియన్ డాలర్ల మద్దతు కోరినట్లు ఆ ప్రకటన తెలిపింది. ఎలక్ట్రానిక్ చిప్,డిస్ప్లే ప్లాంట్లు కాకుండా 4 కంపెనీలు ఎస్పీఈఎల్ సెమీకండక్టర్,హెచ్సీఎల్, సిర్మా టెక్నాలజీ, వాలెంకని ఎలక్ట్రానిక్స్ సంస్థలు సెమీకండక్టర్ ప్యాకేజింగ్ కోసం నమోదు చేసుకున్నాయి. రట్టోన్షా ఇంటర్నేషనల్ రెక్టిఫైయర్ సైతం సెమీకండక్టర్ల కోసం నమోదు చేసుకుంది. మూడు కంపెనీలు టెర్మినస్ సర్క్యూట్స్, ట్రిస్పేస్ టెక్నాలజీస్, క్యూరీ మైక్రో ఎలక్ట్రానిక్స్ లు డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద దరఖాస్తులను సమర్పించాయి. కాగా, క్యాబినెట్ ఆమోదించిన సెమీకండక్టర్లకు ప్రోత్సాహక పథకం కింద వచ్చే నాలుగేళ్లలో దాదాపు రూ.1.7 ట్రిలియన్ల పెట్టుబడులు,1.35 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు ఇంటి వద్ద అపరిచితుడి కలకలం
జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ నివాసం వద్ద బుధవారం ఉదయం కలకలం రేగింది. గుర్తు తెలియని ఓ దుండగుడు నేరుగా దోవల్ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కారులో వేగంగా దూసుకొచ్చినప్పటికీ.. గేట్ వద్దే భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో దోవల్ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. తన శరీరంలో ఎవరో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చారని, అందుకే తనకు తెలియకుండానే అలా వచ్చేశాని తొలుత ఆ వ్యక్తి చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. అప్రమత్తమై.. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే అతని వాలకానికి, సమాధానాలకు పొంతన లేకపోవడంతో వైద్యుల్ని పిలిపించారు. ప్రాథమిక విచారణలో అతను మతిస్థిమితం సరిగాలేని వ్యక్తి అని, కర్ణాటకవాసిగా గుర్తించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అజిత్ దోవల్ నివాసం ఢిల్లీ 5, జన్పథ్లో ఉంది. ఐబీ మాజీ చీఫ్, పైగా ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు కావడంతో.. ఆయన నివాసం వద్ద జెడ్ ఫ్లస్ కేటగిరీ కింద భారీగా సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది మోహరింపు ఉంటుంది. అంతేకాదు భద్రతా కారణాల దృష్ట్యాతో ఆయన నివాసానికి నేమ్ ప్లేట్ కూడా ఉండదు. అయినప్పటికీ ఆ వ్యక్తి సరాసరి దోవల్ ఇంట్లోకి దూసుకెళ్లడంతో అంతా ఉలిక్కిపడ్డారు. బుధవారం ఉదయం 7:30-8 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆ అపరిచితుడి ఐడెంటిటీని గుర్తించే పనిలో ఉన్నారు. -
ఒకపక్క దిగ్గజాల ఏడుపు.. మరోపక్క ఎన్నడూ లేనంతగా కాసుల వర్షం!
Chip Shortage Still Record Level Business In 2021: చిప్ కొరత.. ఇది ఒక్క కంపెనీ సమస్య కాదు. మొత్తం గ్లోబల్ ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్య వల్లే ప్రొడక్టివిటీ బాగా తగ్గింది. పైగా టెస్లా లాంటి తోపు కంపెనీలు తాము కొత్త మోడల్స్ను తేలేకపోతున్నామంటూ ప్రకటనలు సైతం ఇచ్చుకుంటోంది. మరి అంత పెద్ద సమస్య.. ఊహకందని రేంజ్లో బిజినెస్ చేసిందంటే నమ్ముతారా?.. చిప్ కొరత(సెమీ కండక్లర్ల కొరత).. గత ఏడాది కాలంగా సెల్ఫోన్, ఆటోమొబైల్స్ రంగంలో ప్రముఖంగా వినిపిస్తున్న పదం. దీనిని వంకగా చూపిస్తూనే వాహనాలు, మొబైల్స్ రేట్లు నేలకు దిగడం లేదు. పైగా పోను పోనూ మరింత పెంచుకుంటూ పోతున్నాయి కంపెనీలు. ఈ తరుణంలో కిందటి ఏడాది సెమీకండక్టర్ సెక్టార్ చేసిన బిజినెస్ ఎంతో తెలుసా? అక్షరాల 583.5 బిలియన్ డాలర్లు. అవును.. సెమీకండక్టర్ సెక్టార్లో ఒక ఏడాదిలో ఇన్నేళ్లలో ఈ రేంజ్లో భారీ బిజినెస్.. అదీ 500 బిలియన్ డాలర్ల మార్క్ను దాటడం ఇదే ఫస్ట్టైం. ఈ మేరకు సోమవారం వెలువడిన గార్ట్నర్ నివేదిక సెమీకండక్టర్ బిజినెస్కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ► 2018 నుంచి శాంసంగ్-ఇంటెల్ మధ్య చిప్ బిజినెస్లో పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో.. మూడేళ్ల తర్వాత శాంసంగ్ ఇంటెల్కు రాజేసి మొదటి పొజిషన్ను ఆక్రమించుకుంది. ఓవరాల్ మార్కెట్లో ఒక్కసారిగా 34.2 శాతం రెవెన్యూను శాంసంగ్ పెంచుకోవడం గమనార్హం. ► ఇంటెల్కు కేవలం 0.5 శాతం పెంచుకుని.. టాప్ 25 కంపెనీల్లో అతితక్కువ గ్రోత్ రేట్ సాధించిన కంపెనీగా పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ► 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకున్నప్పటికీ.. సెమీకండక్టర్ సప్లయ్ చెయిన్ కొరత.. ప్రత్యేకించి ఆటోమోటివ్ పరిశ్రమలో వీటి కొరత స్పష్టంగా కనిపించింది. ► ఫలితంగా బలమైన డిమాండ్, లాజిస్టిక్స్, ముడిసరుకు ధరల కలయిక సెమీకండక్టర్ల సగటు అమ్మకపు ధరను (ASP) ఒక్కసారిగా పెంచేసిందని, చిప్ కొరత-స్ట్రాంగ్ డిమాండ్ 2021లో మొత్తం ఆదాయ వృద్ధికి దోహదపడిందని గార్ట్నర్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ నార్వుడ్ చెప్తున్నారు. ► రిమోట్ వర్కింగ్, లెర్నింగ్, ఎంటర్టైన్మెంట్ అవసరాలను తీర్చడానికి హైపర్స్కేల్ క్లౌడ్ ప్రొవైడర్ల ద్వారా పెరిగిన సర్వర్ డిప్లాయ్మెంట్ల కారణంగా, అలాగే PCలు, అల్ట్రా మొబైల్స్ కోసం ఎండ్-మార్కెట్ డిమాండ్ పెరగడం వల్ల ‘మెమరీ’ మళ్లీ అత్యుత్తమ పనితీరును కనబరుస్తోంది. ► 2020లో ఆదాయం కంటే 42.1 బిలియన్లు డాలర్లు పెరగ్గా.., ఇది 2021లో మొత్తం సెమీకండక్టర్ మొత్తం ఆదాయ వృద్ధిలో 33.8 శాతం కావడం కొసమెరుపు. ► మెమరీతో పాటు డ్రామ్(DRAM) కూడా 2021 ఆదాయం పెరగడంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 40.4 శాతం రాబడి వృద్ధితో.. 2021లో 92.5 బిలియన్ డాలర్ల ఆదాయం తీసుకొచ్చింది. సర్వర్స్, పీసీల నుంచి బలమైన డిమాండ్ కారణంగా డ్రామ్ డబుల్ డిజిట్కు చేరుకోగలిగింది. ► 2021లో 555 మిలియన్ల యూనిట్ల 5జీ స్మార్ట్ఫోన్లు ఉత్పత్తి అయ్యాయి. 2020లో ఇది కేవలం 250 మిలియన్ యూనిట్లుగా మాత్రమే ఉంది. ఈ లెక్కన 5జీ స్మార్ట్ఫోన్ మార్కెట్ కూడా సెమీకండక్టర్ రెవెన్యూ గణనీయంగా పెరగడానికి కారణమైంది. ► హవాయ్ మీద అమెరికా విధించిన ఆంక్షలు కూడా ఒక కారణమైంది. చైనా యేతర కంపెనీలకు కాసుల పంట పండించింది. హువాయ్ చిప్ సబ్సిడరీ.. 2020లో 8.2 బిలియన్ డాలర్ల బిజినెస్ చేయగా.. 2021లో కేవలం ఒక బిలియన్డాలర్ల బిజినెస్ చేయడం గమనార్హం. చదవండి: లాభాల్లో కింగూ.. అయినా ఇలాంటి నిర్ణయమా? రీజన్ ఏంటంటే.. -
ఇంటెల్కు షాక్.. శాంసంగ్ దెబ్బ మామూలుగా లేదు!
ఒకవైపు సెమీకండక్టర్ల కొరతతో ఆటోమొబైల్ రంగం, డివైజ్ తయారీ రంగం ఘోరంగా దెబ్బ తిన్నాయి. కొత్త మోడల్స్ సంగతి ఏమోగానీ.. ప్రొడక్టివిటీని పెద్ద మొత్తంలో చేయలేకపోతున్నాయి. ఈ తరుణంలో ఈ గ్యాప్లో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ దూసుకొచ్చింది. ఏకంగా చిప్ దిగ్గజం ‘ఇంటెల్’కు ఎసరు పెట్టి.. తొలి స్థానాన్ని అధిగమించింది. 2021లో లాజిక్ ఐసీ, మెమరీ చిప్ సెగ్మెంట్లలో ఉత్పత్తి అధికంగా జరగడంతో శాంసంగ్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. అంతేకాదు మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ టెక్నాలజీలో ఉపయోగించే డైనమిక్ ర్యాన్డమ్-యాక్సెస్ మెమరీ (DRAM), NAND ఫ్లాష్ మార్కెట్ ఫర్ఫార్మెన్స్ సైతం ఇంటెల్ కంటే మెరుగైన బిజినెస్ చేయడం విశేషం. వాస్తవానికి కిందటి ఏడాది రెండో త్రైమాసికం వద్దే ఇంటెల్ను శాంసంగ్ అధిగమించింది. అయితే అది కొన్ని విభాగాల్లో మాత్రమే కావడం గమనార్హం. ఇప్పుడు పూర్తి కేటగిరీల్లో ఇంటెల్ను శాంసంగ్ డామినేట్ చేసేసింది. స్మార్ట్ఫోన్ ఎస్వోసీ (సిస్టమ్ ఆన్ చిప్), జీపీయూ అమ్మకందారులు కూడా యాభై శాతం అధిక ఆదాయాన్ని చవిచూసినట్లు కౌంటర్పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. తద్వారా అమెరికన్ సెమీకండక్టర్ కంపెనీ ఇంటెల్ను.. దక్షిణ కొరియా శాంసంగ్ అన్నింటా అధిగమించినట్లయ్యింది. ఈ పోటీలో శాంసంగ్ను ఇంటెల్ ఇప్పట్లో అధిగమించకపోవచ్చనే భావిస్తున్నారు నిపుణులు. అదనంగా టాప్ 15 అమ్మకందారుల్లో.. 27 శాతం ఆదాయ వృద్ధిని గమనించినట్లు రీసెర్చ్ అనలిస్ట్ విలియమ్ లీ వెల్లడించారు. ఇదిలా ఉంటే చిప్ కొరత సమస్య 2023 వరకు తీరేది కాదని ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్ చెప్తున్నారు. మరోవైపు చిప్ కొరతను క్యాష్ చేసుకునే ఉద్దేశంలో శాంసంగ్ ఉంది. సుమారు 17 బిలియన్ల డాలర్లతో సెమీకండక్టర్ కంపెనీని ఆస్టిన్ బయట నెలకొల్పుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సంబంధిత వార్త: చిప్ ఎఫెక్ట్.. శాంసంగ్ ‘బాహుబలి’ ప్రాజెక్ట్ -
లాభాల్లో కింగూ.. అయినా ఇలాంటి నిర్ణయమా?
గ్లోబల్ లెవల్లో ఆటోమొబైల్ రంగం.. అందునా ఈవీ కేటగిరీలో ఆ రేంజ్ లాభాలు మరేయితర కంపెనీ సాధించలేదు. పైగా గడిచిన ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాదిలో యాభై శాతం అధికంగా వాహన ఉత్పత్తి సామర్థ్యం ఉందని ప్రకటించుకుంది కూడా. అయినప్పటికీ ఈ ఏడాదిలో కొత్త మోడల్ తేలేమని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్వయంగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. టెస్లా 2023 మొదటి భాగం(Q1) వరకు ఎలాంటి కొత్త మోడళ్లను రిలీజ్ చేయబోదని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. ప్రపంచ ఆటో రంగం ఎదుర్కొంటున్న చిప్ షార్టేజ్ ఇందుకు ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. దీంతో కిందటి ఏడాది వస్తుందని భావించిన సైబర్ట్రక్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. అంతేకాదు 25 వేల డాలర్ల చిన్న సైజు ఎలక్ట్రిక్ కారు విషయంలో సైతం ప్రయత్నాలు ముందుకెళ్లట్లేదని, అయినప్పటికీ కారును మార్కెట్లోకి తెచ్చి తీరతామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం చెయిన్ సిస్టమ్ సప్లయ్ సమస్యను అధిగమించడం, ప్రపంచ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంపై టెస్లా తన దృష్టి సారిస్తుందని ఎలన్ మస్క్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించాడు. రాడికల్ సైబర్ట్రక్ తో పాటు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రోడ్స్టర్ స్పోర్ట్స్ కారు సైతం ఆలస్యం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త వాహనాలను ప్రవేశపెడితే.. మొత్తం ఉత్పత్తిపైనే ప్రభావం పడుతుందని ఎలన్ మస్క్ చెప్తున్నారు. కొత్త మోడల్ను లాంచ్ చేయడానికి అదనపు వనరులను గనుక మళ్లిస్తే.. ఇతర మోడళ్లను ఉత్పత్తి చేసే సంస్థ సామర్థ్యం పరిమితం అవుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎలన్ మస్క్ తెలిపారు. అయితే సైబర్ట్రక్, రోడ్స్టర్ల ఉత్పత్తికి మద్దతు ఇచ్చే సాధనాలను 2022లోనే మొదలుపెట్టాలనుకుంటున్నామని, వచ్చే ఏడాది నుంచి వాటి ఉత్పత్తిని ఆశిస్తున్నామని మస్క్ వివరణ ఇచ్చుకున్నారు. చదవండి: బాబోయ్ బూతు వీడియోలు.. టెస్లాకు కొత్త చిక్కులు! -
చైనాకు కోలుకోని దెబ్బ, శరవేగంగా కేంద్రం కీలక నిర్ణయాలు!!
దేశంలో సెమీకండక్టర్ల తయారీలో కేంద్రం వడివడి అడుగులు వేస్తుంది. చైనా కోలుకోలేని విధంగా షాకిస్తూ కేంద్రం మరో రెండేళ్ల తర్వాత దేశంలో చిప్లు తయారయ్యే దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దేశీయ టెక్ కంపెనీలు వేలకోట్లు పెట్టుబడులు పెట్టేలా కేంద్రం ప్రోత్సహిస్తుంది. కేంద్రం దేశీయంగా సెమీకండెక్టర్లు, డిస్ప్లే తయారీకి రూ.76వేల కోట్ల విలువైన ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకానికి ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో భాగంగా సెమీకండక్టర్ల తయారీ కోసం దేశీయ టెక్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూకడుతున్నాయి. మొబైల్ హ్యాండ్సెట్స్ మొదలుకుని ఆటోమొబైల్స్ దాకా అనేక ఉత్పత్తుల్లో సెమీ కండక్టర్లు(చిప్) కీలకంగా ఉంటున్నాయి. టీవీలు, ల్యాప్టాప్లు, ఇయర్బడ్స్, వాషింగ్ మెషీన్ల వంటి అనేక ఉత్పత్తుల్లో వీటిని వినియోగిస్తున్నారు. ఎక్కువ శాతం ఈ చిప్లు విదేశీ కంపెనీలు తయారు చేస్తుంటే..వాటిని కొనుగోలు చేస్తున్నాం. అయితే ఇకపై అలాంటి సమస్య లేకుండా కేంద్రం పీల్ఐ స్కీం అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా కేంద్రం ప్రపంచ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీలో 10% వాటా లక్ష్యంగా పెట్టుకుంది.సెమీకండక్టర్లలో రూ.90వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. చిప్ కొరత సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చిప్ ఉత్పత్తి తయారీ సంస్థలతో మాట్లాడుతోందని ఐటీ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. ఇక దేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తి విషయానికొస్తే మరో రెండేళ్ల తర్వాత సాధ్యమవుతుంది" అని గౌర్ చెప్పారు. అంతేకాదు ఐటీ హార్డ్వేర్ పీఎల్ఐ స్కీమ్లో హెచ్పీ, డెల్, యాక్సర్ వంటి టెక్ సంస్థలు వేల పెట్టుబడులు పెట్టనున్నాయని గౌర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. చైనాకు గట్టి ఎదురుదెబ్బ! చిప్స్ కొరత సమస్య భారతదేశంలోని ఆటో, స్మార్ట్ ఫోన్, వైట్ గూడ్స్ పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది. సెమీకండక్టర్ తయారీదారులను ఆకర్షించడానికి అమెరికా వంటి దేశాలు భారీ సబ్సిడీలను నిలిపివేయడంతో భారతదేశం వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చీప్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగలనున్నట్లు నిపుణులు అంటున్నారు. కొరియన్ దిగ్గజం శామ్ సంగ్ ఇటీవల అమెరికాలోని టెక్సాస్ లో 17 బిలియన్ డాలర్ల చిప్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చదవండి: మీరు ఈ టెక్నాలజీలో ఎక్స్పర్టా? అయితే మీకు జాబులే జాబులు!! -
మరీఘోరంగా టూ వీలర్స్ అమ్మకాలు
November 2021 Record Lowest wholesales In automobile industry Due To Chip Shortage: ఆటోమొబైల్ రంగంలో మునుపెన్నడూ లేనంత తీవ్ర ప్రతికూల పరిస్థితులు నడుస్తున్నాయి ఇప్పుడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత ఒక నెలలో ద్విచక్ర వాహనాలు రికార్డు స్థాయిలో తక్కువగా అమ్ముడుపోవడం విశేషం. అంతేకాదు దాదాపు ఏడేళ్ల తర్వాత ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లోనూ ఇదే ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. 2021 నవంబర్ నెల ఆటోమొబైల్ రంగానికి అచ్చి రాలేదు. ఓవైపు పండుగ సీజన్ కొనసాగినా.. ఊహించినంత వాహన అమ్మకాలు లేకపోవడం విశేషం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చురర్స్ (SIAM) నివేదికల ప్రకారం నవంబర్ నెలలో.. ప్యాసింజర్ వెహికిల్ అమ్మకాల మొత్తం 18.6 శాతం పడిపోయింది. అదే విధంగా టూ వీలర్స్ ఏకంగా 34 శాతం తగ్గింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈ డౌన్ఫాల్ దారుణంగా నమోదు అయ్యింది. ►ప్యాసింజర్ వెహికిల్స్ ఈ నవంబర్లో 2, 15, 626 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 2, 64, 898గా ఉంది. ఇక ఉత్పత్తి కూడా 9.5 శాతం పడిపోయింది (2,94,596 యూనిట్ల నుంచి 2,66,552కి). ►టూ వీలర్స్ ఈ నవంబర్లో 10, 50, 616 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. కిందటి ఏడాది నవంబర్లో ఈ సంఖ్య 16 లక్షల యూనిట్లకు పైనే ఉంది. ఇక ఉత్పత్తి కూడా 29 శాతం పడిపోయి.. పదకొండేళ్ల తర్వాత పతనం నమోదు చేసుకుంది. 19, 36, 793 యూనిట్లకు గానూ 13, 67, 701 యూనిట్లను ఉత్పత్తి పడిపోయింది. ►ఇక త్రీ వీలర్స్ విషయానికొస్తే.. ఈ నవంబర్లో 6.64 శాతం క్షీణత కనిపిస్తోంది. 22, 471 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 24, 071 యూనిట్లుగా ఉంది. ఉత్పత్తి మాత్రం 6 శాతం పడిపోయింది. 65, 460 యూనిట్ల నుంచి 61, 451 యూనిట్లకు పడిపోయింది. పెరిగిన ఎగుమతి.. అమ్మకాల సంగతి ఎలా ఉన్నా.. ఎగుమతుల విషయంలో మాత్రం కంపెనీలు అస్సలు తగ్గట్లేదు. మొత్తంగా ఈ మూడు కేటగిరీలను పరిశీలిస్తే.. ప్యాసింజర్ వెహికిల్స్లో 15.5 శాతం పెరుగుదల (44, 265 యూనిట్లు), టూ వీలర్స్లో 9 శాతం (3, 56, 659 యూనిట్లు), త్రీ వీలర్స్లో 14 శాతం (42, 431 యూనిట్లు) ఎగుమతి శాతం పెరిగింది. కారణం.. సెమీ కండక్టర్ల కొరత. కరోనా సమయంలో చిప్ ఉత్పత్తి ఫ్యాక్టరీలు మూతపడి.. ఈ ప్రభావం ఏడాది తర్వాత కూడా వెంటాడుతోంది. చిప్ల సమస్య కారణంగా ఉత్పత్తి.. డెలివరీలు దెబ్బతింటోంది. మన దేశంలోనే కాదు.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. అయితే నవంబర్లో అదీ పండుగ సీజన్లో ఈ రేంజ్ ప్రతికూల ప్రభావం చూడడం 19 ఏళ్లలో ఇదే తొలిసారి అని సియామ్(SIAM) డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్తున్నారు. ముఖ్యంగా త్రీ వీలర్స్ అమ్మకాలు మరీ దారుణంగా ఉన్నాయని చెప్తున్నారాయన. చదవండి: గూగుల్, యాపిల్ను తలదన్నే రేంజ్ ప్లాన్.. 17 బిలియన్ డాలర్లతో చిప్ ఫ్యాక్టరీ -
వాహన విక్రయాలకు చిప్ సెగ
న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ పరిశ్రమను సెమీకండక్టర్ల కొరత వెంటాడుతోంది. చిప్ల సమస్య కారణంగా ఉత్పత్తి.. డెలివరీలు దెబ్బతినడంతో నవంబర్లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు 19 శాతం క్షీణించాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ శుక్రవారం ఈ విషయాలు వెల్లడించింది. సియామ్ గణాంకాల ప్రకారం గత నెల డీలర్లకు కార్ల వంటి ప్యాసింజర్ వాహనాల సరఫరా 2,15,626కి పరిమితమైంది. గతేడాది నవంబర్లో నమోదైన 2,64,898 యూనిట్లతో పోలిస్తే 19 శాతం క్షీణించింది. అటు ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 34 శాతం పడిపోయాయి. 16,00,379 యూనిట్ల నుంచి 10,50,616 యూనిట్లకు తగ్గాయి. మోటర్సైకిళ్ల అమ్మకాలు 10,26,705 నుంచి 6,99,949 యూనిట్లకు పడిపోయాయి. స్కూటర్ల విక్రయాలు 5,02,561 యూనిట్ల నుంచి 3,06,899 యూనిట్లకు క్షీణించాయి. ఇక మొత్తం త్రిచక్ర వాహనాల అమ్మకాలు 7 శాతం క్షీణించి 24,071 యూనిట్ల నుంచి 22,471 యూనిట్లకు పరిమితమయ్యాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం ఆటోమొబైల్ అమ్మకాలు గత నెల 12,88,759 యూనిట్లకు తగ్గాయి. గతేడాది నవంబర్లో ఇవి 18,89,348 యూనిట్లుగా నమోదయ్యాయి. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ అమ్మకాలు 1,35,775 యూనిట్ల నుంచి 1,09,726 యూనిట్లకు పడిపోయాయి. అలాగే హ్యుందాయ్ మోటర్ ఇండియా విక్రయాలు 48,800 నుంచి 37,001 యూనిట్లకు క్షీణించాయి. 7 ఏళ్ల కనిష్టానికి పీవీ విక్రయాలు.. ‘అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత కారణంగా పరిశ్రమ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. పండుగ సీజన్లో కొంతయినా కోలుకోవచ్చని ఆశించింది కానీ ఈ ఏడాది నవంబర్లో ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏకంగా ఏడేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 11 ఏళ్లు, త్రిచక్ర వాహనాల అమ్మకాలు 19 ఏళ్ల కనిష్టాలకు క్షీణించాయి‘ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఉద్యోగుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూనే, సరఫరా వ్యవస్థపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. -
చిప్ ఎఫెక్ట్.. శాంసంగ్ ‘బాహుబలి’ ప్రాజెక్ట్
Samsung Texas Chip Factory: కరోనా వైరస్-లాక్డౌన్ ప్రభావాల వల్ల స్మార్ట్ డివైజ్లు, వాహనాలు, ఎలక్ట్రానిక్ డివైజ్లు.. చిప్ కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ కొరతను అధిగమించేందుకు ఏకంగా సొంతంగా చిప్ తయారీకి పూనుకుంటున్నాయి ఫోన్ కంపెనీలు. ఈ క్రమంలో శాంసంగ్ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. చిప్ ఫ్యాక్టరీల నిర్మాణానికి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే గూగుల్, యాపిల్ కంపెనీలు రంగంలోకి దిగగా.. ఇప్పుడు శాంసంగ్ వాటి ప్రాజెక్టులను తలదన్నేలా భారీ ప్రణాళికకు ముందడుగు వేసింది. ఏకంగా 17 బిలియన్ డాలర్ల(17 X ఏడువేల కోట్ల రూపాయలు) భారీ ఖర్చుతో సెమీకండక్టర్ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు టెక్సాస్ ఆస్టిన్ నగరం శివారులో జెయింట్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నట్లు ఈ దక్షిణ కొరియా టెక్ దిగ్గజం అధికారికంగా ప్రకటించింది కూడా. గత కొన్నేళ్లుగా టెక్ కంపెనీలకు అడ్డాగా మారుతున్న టెక్సాస్లో ఈ రేంజ్లో ఓ విదేశీ కంపెనీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతుండడం విశేషం. వచ్చే ఏడాది నుంచి బిల్డింగ్ నిర్మాణం.. 2024 నుంచి చిప్ తయారీ పనులు ప్రారంభించాలని శాంసంగ్ ప్రణాళిక వేసుకుంది. చదవండి: గూగుల్.. చిప్ చిచ్చు రాజుకుందా? లాక్డౌన్ ప్రభావంతో చిప్ ఫ్యాక్టరీలు మూతపడగా.. ప్రస్తుతం చిప్ షార్టేజ్ సమస్య ప్రపంచం మొత్తం కొనసాగుతోంది. అమెరికా లాంటి అగ్రదేశాలు.. చైనా, తైవాన్ లాంటి ఆసియా దేశాల మీద చిప్ కోసం ఆధారపడి ఉన్నాయి. కానీ, ముందు ఆసియా దేశాల కొరత తీర్చాకే బయటి దేశాలకు ఉత్పత్తి చేసే ఉద్దేశంలో ఉన్నాయి చిప్ తయారీ కంపెనీలు. చదవండి: చిప్ల తయారీలోకి ఆపిల్, గూగుల్.. ఏమిటీ వివాదం? -
Google Pixel 6 Series: అదిరిపోయే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ లాంఛ్
All about The New Google Pixel 6 and Pixel 6 Pro Smart Phones: చాలాకాలంగా ప్రచారంలో వినిపిస్తున్న పిక్సెల్ 6 సిరీస్ను ఎట్టకేలకు గూగుల్ అధికారికంగా లాంఛ్ చేసింది. మంగళవారం రాత్రి జరిగిన గూగుల్ ఈవెంట్లో.. పిక్సెల్ సిరీస్లో భాగంగా పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో మోడల్స్ ఫీచర్స్ను రివీల్ చేసింది. పిక్సెల్ సిరీస్లో గూగుల్ ఈ ఫోన్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు కారణాలు.. సొంత టెన్సార్ చిప్సెట్లతో పాటు ఆండ్రాయిడ్12 వెర్షన్తో తీసుకురావడం. గూగుల్ పిక్సెల్ 6 ► 6.4 ఇంచుల ఎఫ్హెచ్డీ+అమోలెడ్ స్క్రీన్, 90 హెచ్జెడ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ► పంచ్హోల్ కట్అవుట్, గొరిల్లా గ్లాస్ విక్టస్, ఫింగర్ప్రింట్ సెన్సార్ ► టెన్సార్ చిప్సెట్తో 8జీబీ ర్యామ్ 128 జీబీ/256 జీబీ వేరియెంట్లలో లభ్యం.. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ► 4,614ఎంఏహెచ్ బ్యాటరీ, 30డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ► 50ఎంపీ మెయిన్ కెమెరా, వైడర్ షాట్స్ కోసం 12ఎంపీ ultrawide lens ► 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ► మ్యాజిక్ ఎరేస్ లాంటి సాఫ్ట్వేర్ ఫీచర్ కూడా గూగుల్ పిక్సెల్ 6 ప్రో ► 6.7 ఇంచుల క్యూహెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెచ్జెడ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ► కట్అవుట్, గొరిల్లా గ్లాస్ విక్టస్, ఫింగర్ప్రింట్ సెన్సార్ ► టెన్సార్ చిప్సెట్తో 12జీబీ ర్యామ్ 128 జీబీ/256 జీబీ/512జీబీ.. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ► 5,003 ఎంఏహెచ్ బ్యాటరీ, 30డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ► 50ఎంపీ మెయిన్ కెమెరా, వైడర్ షాట్స్ కోసం 12ఎంపీ ultrawide lens, 48ఎంపీ టెలిఫొటో లెన్స్ అదనం. ► 11.1 ఎంపీ సెల్ఫీ కెమెరా ► మ్యాజిక్ ఎరేస్ లాంటి సాఫ్ట్వేర్ ఫీచర్ కూడా We're launching Pixel 6 and Pixel 6 Pro today! They’re unlike any phone we've built before, with a new industrial design, Android 12 with Material You user interface, and running on our custom Google Tensor chip. Can't wait to see how people use them:)https://t.co/QPvVrCtxvB pic.twitter.com/2eFJsGmSOc — Sundar Pichai (@sundarpichai) October 19, 2021 చిప్మేకర్ క్వాల్కమ్ కంపెనీని కాదని.. సొంత టెన్సార్ చిప్తో గూగుల్ ఈ ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ రెండింటి టెన్సార్షిప్ కూడా టైటాన్ ఎం2 చిప్ ద్వారా భద్రత కల్పించనుంది. స్టీరియో స్పీకర్, మూడు మైక్రోఫోన్స్, డ్యుయల్ సిమ్ సపోర్ట్, వైఫై 6ఈ సపోర్ట్, బ్లూటూత్ 5.2, సబ్ 6సీహెచ్ 5జీ.. సపోర్ట్తో ఈ ఫోన్లు వచ్చాయి. ధరలు ఎంతంటే.. పిక్సెల్ 6 ప్రారంభ ధర 599 డాలర్లు(దాదాపు మన కరెన్సీలో రూ.44, 971), పిక్సెల్ ప్రొ ధర 899 డాలర్లు(దాదాపు 67,494 రూపాయలు). అయితే ఈ సిరీస్ ఫోన్లు భారత్లో ఎప్పుడు లాంఛ్ అవుతాయనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఫోన్లతో పాటు పిక్సెల్ పాస్ ప్రోగ్రామ్ను సైతం అనౌన్స్ చేసింది. దీని ప్రకారం.. నెల నెల కొంత చెల్లించి ప్రీమియం గూగుల్ వన్ స్టోర్ 200 జీబీ, యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం, గూగుల్ ప్లే పాస్ పొందొచ్చు. యూఎస్లో ఈ ప్లాన్ల ధరను పిక్సెల్ మోడల్స్కు 45 డాలర్లుగా, పిక్సెల్ ప్రోకు 55 డాలర్లుగా నిర్ణయించారు. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! -
గూగుల్.. చిప్ చిచ్చు రాజుకుందా?
అమెరికా టెక్ దిగ్గజం గూగుల్(ఆల్ఫబెట్ కంపెనీ), చిప్మేకర్ క్వాల్కమ్ మధ్య విభేధాలు మొదలయ్యాయి. చిప్ తయారీ విషయంలో గూగుల్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. ఈ మేరకు గూగుల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్వాల్కమ్ ఒక ట్వీట్ చేయడం విశేషం. అమెరికన్ చిప్మేకర్ కంపెనీ క్వాల్కమ్.. సొంతంగా చిప్లు తయారు చేసుకోవాలన్న గూగుల్ నిర్ణయంపై అసంతృప్తితో రగిలిపోతోంది. రాబోయే పిక్సెల్ 6 స్మార్ట్ఫోన్స్ను గూగుల్ తాము సొంతంగా రూపొందించిన చిప్ సిస్టమ్తో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ నిర్ణయంపై క్వాల్కమ్ ట్వీట్ రూపంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. "We've decided to make our own smartphone SoC instead of using Snapdragon" 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 — Snapdragon (@Snapdragon) October 13, 2021 స్నాప్డ్రాగన్కు బదులు ఇకపై సొంత స్మార్ట్ఫోన్ ఎస్వోసీని తయారు చేబోతున్నాం అంటూ ఎర్ర జెండాల ఎమోజీతో ఒక ట్వీట్ చేసింది క్వాల్కమ్. ఇప్పటిదాకా పిక్సెల్ ఫోన్లకు చిప్సెట్లను సప్లై చేస్తూ వస్తోంది క్వాల్కమ్. కానీ, తాజా నిర్ణయంతో క్వాల్కమ్కు నష్టం వాటిల్లనుంది. గూగుల్ టెన్సర్ చిప్ను నమ్మకూడదంటూ ఆండ్రాయిడ్ యూజర్లను క్వాల్కమ్ హెచ్చరించడం విశేషం. అయితే పొరపచ్చాలు..ఈ రెండు కంపెనీల భవిష్యత్తు వ్యాపారంపై పడే నష్టం ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పిక్సెల్ ఫోన్లను మినహాయిస్తే.. మిగతా డివైజ్లన్నీ క్వాల్కమ్ ప్రాసెసర్లతోనే మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ, రాబోయే రోజుల్లో ఇది శత్రుత్వంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక గూగుల్ డెవలప్ చేస్తున్న సొంత చిప్ అండ్ ప్రాసెసింగ్ వ్యవస్థ 2023 నాటికల్లా మార్కెట్లోకి రానుంది. ప్రపంచంలో 90 శాతం మొబైల్ డివైజ్ వ్యవస్థలో ఉపయోగించే.. బ్లూప్రింట్ ఆఫ్ ఆర్మ్స్ ఆధారంగా గూగుల్ సీపీయూ, మొబైల్ ప్రాసెసర్ ను గూగుల్ తీసుకురాబోతోంది. చదవండి: జీవిత భాగస్వాములపై నిఘా..! గూగుల్ కీలక నిర్ణయం! -
ఆపిల్ కొంపముంచిన చిప్స్...!
ప్రపంచవ్యాప్తంగా సెమికండక్టర్స్(చిప్) కొరత పలు కంపెనీలను తీవ్రంగా వేధిస్తోంది. చిప్స్ కొరతతో పలు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. తాజాగా చిప్స్ కొరత ఆపిల్ను కూడా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపిల్కు భారీ దెబ్బ...! గత నెలలో ఆపిల్ ఐఫోన్13 స్మార్ట్ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.కాగా ఇప్పుడు సెమికండక్టర్ కొరత ఐఫోన్13 స్మార్ట్ఫోన్ల తయారీపై పడనుంది. దీంతో ఆపిల్కు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు బ్లూమ్బర్గ్ పేర్కొంది. చిప్ కొరతతో సుమారు 10 మిలియన్ల ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లపై తయారీ భారీ ప్రభావం పడనుంది. ఈ ఏడాది చివరినాటికి సుమారు 90 మిలియన్ల ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఉత్పతి చేయాలని ఆపిల్ భావించింది. ఆపిల్ చిప్స్ను అందిస్తోన్నబ్రాడ్కామ్, టెక్సాస్ ఇన్స్ట్రూమెంట్స్ చిప్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి.దీంతో ఐఫోన్13 స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిపై భారీ ప్రభావమే చూపనున్నట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది. చదవండి: సౌరవ్ గంగూలీపై కోకాకోలా కీలక నిర్ణయం..! ఇతర స్మార్ట్ఫోన్ కంపెనీలతో పోలిస్తే బెటర్...! ఇతర స్మార్ట్ఫోన్ కంపెనీలతో పోలిస్తే ఆపిల్పై చిప్స్ కొరత ప్రభావం తక్కువగా ఉన్నట్లు ఆపిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా, తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో కరోనా కారణంగా టెక్ దిగ్గజం ఆపిల్తో సహా ఇతర టెక్ కంపెనీలకు అందించే ఫోన్ విడి భాగాల(కాంపోనెంట్స్)పై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో ఊహించిన దానికంటే చిప్ సెట్ల కొరత చాలా ఎక్కువ ఉందని పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. చదవండి: భారత్ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్తో మామూలుగా ఉండదు..! -
చిప్ చిన్నదే.. కానీ దాని ఎఫెక్ట్ చాలా పెద్దది
ముంబై: పండుగ సీజన్పై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆటో కంపెనీలకు నిరాశ ఎదురైంది. పరిశ్రమను సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ చిప్ల కొరత వేధించడంతో సెప్టెంబర్ విక్రయాల్లో క్షీణత నమోదైంది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రాతో సహా ఆటో పరిశ్రమలో పలు కంపెనీల విక్రయాలు తగ్గాయి. సమీక్షించిన నెలలో మారుతీ సుజుకీ 86,380 యూనిట్ల వాహనాలను అమ్మగా.. గతేడాది సెప్టెంబర్లో మొత్తం 1,60,442 యూనిట్లను విక్రయించింది. ‘‘ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కారణంగానే సెప్టెంబర్ అమ్మకాలు తగ్గాయి. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటాము’’ అని మారుతీ తెలిపింది. ఇదే నెలలో హ్యుందాయ్ మోటార్ అమ్మకాలు 23 శాతం క్షీణించి 45,791 వాహనాలకు చేరాయి. అయితే వార్షిక ప్రాతిపదికన టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్, నిస్సాన్ మోటార్స్ విక్రయాలు వరుసగా 26%, 28%, 100% చొప్పున వృద్ధిని సాధించాయి. చదవండి: జియోకు కొత్త చిక్కులు,పెరగనున్న 'జియో నెక్ట్స్' ఫోన్ ధరలు? -
ఐఫోన్-13పై చిప్ దెబ్బ..కొన్ని వారాలు ఎదురు చూడాల్సిందేనా?
ప్రపంచ దేశాల్ని సెమీ కండక్టర్ల(చిప్) కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఇప్పుడు ఆ సమస్య ఇండియాలో యాపిల్ ఐఫోన్ -13 అమ్మకాలపై పడింది. సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమైన ఐఫోన్-13 సిరీస్ మోడల్ అమ్మకాల్లో ఉన్న ఫోన్ సేల్స్ పూర్తయ్యాయి.దీంతో ఐఫోన్-13 ఫోన్ల కొరత ఏర్పడింది. మళ్లీ కొత్త ఫోన్లను కొనుగోలు చేయాలంటే ఒకటి నుంచి ఐదువారాల వరకు ఎదురు చూడాల్సి ఉందని ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ విడుదల చేసింది. ఎకనమిక్ టైమ్ ప్రకారం.. చైనా, తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో కరోనా కారణంగా టెక్ దిగ్గజం యాపిల్తో సహా ఇతర టెక్ కంపెనీలకు అందించే ఫోన్ విడి బాగాల(కాంపోనెంట్స్)పై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో ఊహించిన దానికంటే చిప్ సెట్ల కొరత చాలా ఎక్కువ ఉందని పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు సెమీ కండక్టర్ల కొరతపై మార్కెట్ ట్రాకర్ ఐడిసి ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ..ఐఫోన్ 13 కొత్త మోడళ్లు ఇండియన్ మార్కెట్లో లేకపోవడానికి చిప్ సెట్లు, ఫోన్ విడిభాగాల కొరతే కారణమని అన్నారు. కాబట్టే భారత్లో యాపిల్ వాచ్తో పాటు ఇతర ప్రాడక్ట్ల విడుదల తేదీల్ని ఖరారు చేయలేకపోతున్నట్లు తెలిపారు. ఐఫోన్ 12 సిరీస్ మోడళ్ల కొరత చాలా తక్కువగా ఉందని, ఆ మోడల్ ఫోన్లు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. చదవండి: ఇండియన్ మార్కెట్లో ఐఫోన్13 సిరీస్ ధరలు -
ఆ విషయంలో చైనాకు చెక్ పెట్టేలా ఇండియా ప్లాన్ !
chipset Crisis : చిప్సెట్ల తయారీలో స్వయం సమృద్ధి దిశగా ఇండియా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా చైనాపై ఆధారపడకుండా దేశ అవరసరాలకు తగ్గట్టుగా చిప్సెట్ల తయారీపై దృష్టి సారించింది. తగ్గిన ఉత్పత్తి కరోనా ప్రభావం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చిప్సెట్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో మొబైల్ ఫోన్ నుంచి మొదలుపెడితే కార్ల తయారీ వరకు అనేక పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి. చిప్సెట్ల కొరత కారణంగా కార్లు, మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తి సామార్థ్యం తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనాకి చెక్ ఇండియాలో ఉపయోగిస్తున్న చిప్సెట్లలో సింహభాగం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. అయితే సంక్షోభ సమయంలో చిప్ సెట్ల సరఫరా విషయంలో భారత్కి స్పష్టమైన హామీ చైనా నుంచి రాలేదు. దీంతో ఎల్లకాలం చైనాపై ఆధారపడకుండా స్వంతంగా భారీ ఎత్తున చిప్లను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెరపైకి తైవాన్ చిప్సెట్ల తయారీలో తైవాన్కి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. తైవాన్ నుంచి అమెరికా, యూరప్ దేశాలకు అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. దీంతో సాంకేతిక రంగంలో తైవాన్ ప్రాధాన్యతను భారత్ గుర్తించింది. ఈ మేరకు భారత్ తరఫున ఇటీవల అధికారుల బృంధం తైపీలో పర్యటించారు. అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఒప్పందం అయితే తైవాన్, భారత్ల మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించిన అంశాలను ఇరు దేశాలు బాహాటంగా ఇంకా ప్రకటించలేదు. అయితే ఉన్నతస్థాయి అధికార వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం 7.5 బిలియన్ల డాలర్ల వ్యయంతో ఇండియాలో చిప్ల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని నిర్ణయించింది. దీనికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను తైవాన్ ఇండియాకు అందిస్తుంది. ఈ మేరకు చిప్సెట్ల తయారీ పరిశ్రమ ఎక్కడ నెలకొల్పానే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. 5జీ టెక్నాలజీ తైవాన్ , భారత్ ప్రభుత్వం మధ్య కుదిరే ఒప్పందం ప్రకారం చిప్ తయారీ పరిశ్రమ స్థాపనకు అవుతున్న వ్యయంలో 50 శాతాన్ని ఇండియన్ గవర్నమెంట్ భరిస్తుంది. అంతేకాకుండా ట్యాక్సుల్లో కూడా మినహాయింపు ఇస్తుంది. తైవాన్ సంస్థ నెలకొల్పే చిప్ తయారీ పరిశ్రమలో 5జీ టెక్నాలజీకి సంబంధించిన చిప్సెట్ల నుంచి కారు తయారీ వరకు ఉపయోగించే అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ని తయారు చేస్తారు. బోల్డ్ స్టెప్ తూర్పు లధాఖ్ ప్రాంతంపై ఇండియా చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు తైవాన్తో కూడా చైనాకు సత్సంబంధాలు లేవు. పదే పదే చైనా యుద్దవిమానాలు తైవాన్ గగనతలంలోకి దూసుకొస్తున్నాయి. అయితే తైవాన్కి అండగా అమెరికా నిలబడింది. ఈ తరుణంలో ఏషియాలో కీలకమైన చైనాను కాదని తైవాన్తో భారీ వాణిజ్యం ఒప్పందం భారత్ చేసుకుంది. ఇకపై చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తామని పరోక్షంగా చెప్పింది. అయితే ఈ ఒప్పందంపై అధికార ప్రకటన రాకపోవడంతో చైనా అధికార బృందం మౌనంగా ఉంది. చదవండి : చిప్ల కొరత, కలవరంలో కార్ల కంపెనీలు -
షాక్..పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు..కారణం ఇదే!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే విడుదలైన మోడళ్ల ధర 7–10 శాతం అధికం కానుంది. సెమికండక్టర్ చిప్స్తోసహా ఇతర విడిభాగాల కొరత తీవ్రం కావడమే ఇందుకు కారణమని కంపెనీలు అంటున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఇంటి నుంచి పని విధానం, ఆన్లైన్ క్లాసులు.. వెరసి సెమికండక్టర్లకు విపరీతంగా డిమాండ్ ఏర్పడి కొరతకు దారితీసింది. దీని ప్రభావం స్మార్ట్ఫోన్ పరిశ్రమపై కొన్ని త్రైమాసికాలు ఉంటుందని కౌంటర్ పాయింట్ రిసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వెల్లడించారు. ‘నూతన మోడళ్ల రాక ఆలస్యం కావడం లేదా కొన్ని మోడళ్లే మార్కెట్లోకి వస్తాయి. అయినప్పటికీ ఈ పండుగల సీజన్లో డిమాండ్ బలంగా ఉంటుంది. 4జీ చిప్సెట్స్పైనే ప్రభావం ఉంది. డిసెంబర్ వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది’ అని వివరించారు. 5జీ చిప్సెట్ల సరఫరా కాస్త మెరుగ్గా ఉంది. మాస్ మార్కెట్ 5జీ చిప్సెట్స్ సరఫరా తక్కువగా ఉంటుంది. ‘కొరత కారణంగా పెరుగుతున్న చిప్ ధరలు స్మార్ట్ఫోన్ తయారీదారుల విడిభాగాల బిల్లును గణనీయంగా ప్రభావితం చేశాయి. ఇది ఇప్పుడు వినియోగదారులపై, నూతన మోడళ్ల విడుదలపైనా ఉంటుంది’ అని గార్ట్నర్ ప్రిన్సిపల్ అనలిస్ట్ కనిష్క చౌహాన్ అన్నారు. కొన్ని బ్రాండ్ల చేతుల్లోకి.. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్రొడక్ట్స్ విభాగంలో ప్రధానంగా స్మార్ట్ఫోన్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్ మార్కెట్ కొన్ని బ్రాండ్లకే పరిమితమైంది. ఇవి పెద్ద కంపెనీలే కాదు, నిధులు, విడిభాగాల సరఫరా విషయంలోనూ అగ్రస్థానంలో ఉంటాయని ఇండియన్ సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. చదవండి: ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
బాబోయ్ చిప్.. పెట్రో బంకుల్లో కనికట్టు
-
చిప్ల తయారీలోకి ఆపిల్, గూగుల్.. ఏమిటీ వివాదం?
ఎవరనుకున్నారు...???? అమెరికా అమలాపురాలను ఒక్క ఫోన్ కాల్ కలిపేస్తుందని! ఆఫీసు, ఇల్లు, సినిమాహాలు, ఒలింపిక్ క్రీడలు... అరచేతిలో ఇమిడిపోతాయని!! గుడిలో, బడిలో.. వాషింగ్మెషీన్లో.. నడిపే వాహనంలో, తళుకుల బల్బుల్లో.. ఇందుగలదందు లేదన్న సందేహంబు వలదన్నట్టు... చిప్లు చేరిపోతాయనీ.. సుఖసౌఖ్యాలను మన దరికి చేరుస్తాయని!! మనిషి మేధకు తాజా తార్కాణమా అన్నట్లు.. యాభై ఏళ్ల క్రితం మొదలైన మైక్రోప్రాసెసర్ ప్రస్థానం... గతం... ప్రస్తుతం.. భవిష్యత్తు...!!! ‘‘స్పర్ధయా వర్ధతే విద్య’’ అంటుంది ఓ సంస్కృత నానుడి. పోటీ ఉంటేనే విద్యలో రాణించగలం అని అర్థం. మరి.. పోటీ వ్యాపారంలో ఉంటే? ఇంకొన్నేళ్లలో మనకు ఇది కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటారా? పీసీ, ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్లకు అత్యంత కీలకమైన మైక్రోప్రాసెసర్ల తయారీలో ఇప్పుడు పోటీ నెలకొంది కాబట్టి! మైక్రోప్రాసెసర్ల గతం... ప్రస్తుతం.. భవిష్యత్తుల గురించి తెలుసుకునే ముందు ఆసక్తికరమైన ఈ పోటీ సంగతేమిటో అర్థం చేసుకుందాం. సాక్షి, హైదరాబాద్: నిన్న మొన్నటివరకూ మైక్రోప్రాసెసర్ అంటే.. ఇంటెల్. ఇంటెల్ అంటే మైక్రోప్రాసెసర్ అదీ పరిస్థితి. కాలక్రమంలో సాంసంగ్, టీఎస్ఎంసీ, క్వాల్కామ్, మీడియాటెక్ వంటివి పీసీ, స్మార్ట్ఫోన్ మైక్రోప్రాసెసర్ల తయారీ రంగంలోకి దిగినా ఆధిపత్యం మాత్రం ఇంటెల్దే కొనసాగింది. కానీ ఆ పరిస్థితులిప్పుడు మారిపోతున్నాయి. దిగ్గజం ఇంటెల్ను తోసిరాజని ఒకవైపు ఆపిల్ ఇంకోవైపు గూగుల్ రెండూ తమదైన మైక్రోప్రాసెసర్లను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. స్మార్ట్ఫోన్ రంగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న క్వాల్కామ్కూ చెక్ పెట్టేందుకు ఆపిల్, గూగుల్లు రెండూ పావులు కదుపుతూండటం విశేషం. ఆపిల్ ఇప్పటికే పీసీ, స్మార్ట్ఫోన్లు రెండింటికీ సొంతంగా చిప్లు తయారు చేసుకుంటున్నా... క్వాల్కామ్, ఇంటెల్ వంటి సంస్థల చిప్లను కూడా కొంతమేరకు ఉపయోగిస్తోంది. త్వరలోనే దీనికీ స్వస్తి చెబుతామని ఆపిల్ ప్రకటించింది. మరోవైపు గూగుల్ కూడా తన స్మార్ట్ఫోన్లు ‘పిక్సెల్ –6’, ‘పిక్సెల్ –6 ప్రో’లకు సొంతంగా మైక్రోప్రాసెసర్లు తయారు చేసుకుంటామని ప్రకటించింది. ఈ పరిణామం కాస్తా.. మరింత సమర్థమైన ఫోన్లు, క్రోమ్బుక్లు చౌకధరల్లో వినియోగదారుడికి అందే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. గూగుల్ కూడా 2016లో క్వాల్కామ్ సరఫరా చేసే చిప్లతో పిక్సెల్ బ్రాండు స్మార్ట్ఫోన్లను తయారు చేస్తూండగా.. వీటి ధరల విషయంలో పలు విమర్శలు వచ్చాయి. సొంతంగా చిప్లు తయారు చేసుకుంటే తాము అనుకున్న ఫీచర్లను స్మార్ట్ఫోన్ల ద్వారా అందించే వీలుంటుందని కంపెనీ భావిస్తోంది. కృత్రిమ మేధ, రియల్టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వంటి కొత్త కొత్త టెక్నాలజీలను తమ చిప్ల ద్వారా అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఏమిటీ వివాదం కంప్యూటర్లకు మాత్రమే కాదు.. స్మార్ట్ఫోన్లకు, ట్యాబ్లెట్లకు, ఇతర ఆపిల్ ఉత్పత్తులకు కొంతకాలం క్రితం వరకూ ఇంటెల్, క్వాల్కామ్లే అందించేవి. అయితే ఆపిల్, గూగుల్ల అవసరాలకు తగ్గట్టుగా ఎక్కువ సామర్థ్యంతో ఉన్న చిప్లను తయారు చేయడంలో ఇంటెల్ కొన్నేళ్లుగా వెనుకబడటం, ఇతర కంపెనీల చిప్లను వాడటంలో ఉన్న కొన్ని పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఆపిల్, గూగుల్ రెండూ సొంతంగా చిప్లు తయారు చేసుకోవాలని తీర్మానించుకున్నాయి. పీసీ, స్మార్ట్ఫోన్లు రెండింటికీ సొంతంగా చిప్లు తయారు చేసుకున్న ఆపిల్ స్మార్ట్ఫోన్లలోని మెడెమ్లు, ఇతర పరికరాల కోసం మాత్రం క్వాల్కామ్పైనే ఆధారపడుతోంది. కానీ ధరలు ఎక్కువగా ఉండటం, కొన్ని గుత్తాధిపత్య ధోరణిల కారణంగా వీటిని కూడా సొంతంగా తయారు చేసుకోవాలని రెండేళ్ల క్రితం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంత సులువా? మైక్రోప్రాసెసర్ల తయారీ అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమవుతాయి. ఇసుక నుంచి సిలికాన్ను తయారు చేసే ఫౌండ్రీలను ఏర్పాటు చేయడం మొదలుకొని మిల్లీమీటర్ల సైజున్న చిప్లలో వెయ్యికోట్లకుపైగా ట్రాన్సిస్టర్లను ఇమడ్చేలా డిజైన్లు తయారు చేయాలంటే ఏళ్లుపూళ్లవుతాయి. ఆపిల్ పీసీ చిప్ల తయారీలో విజయం సాధించినా స్మార్ట్ఫోన్లతో వ్యవహారం అంత సులువు కాదని నిపుణులు అంటున్నారు. ఇంటెల్ నుంచి కొను గోలు చేసిన మోడెమ్ తయారీ కేంద్రం సాయంతో సొంత తయారీ మొదలుపెట్టనుంది. కాకపోతే చిప్ల తయారీతోపాటు క్వాల్కామ్ స్మార్ట్ఫోన్ టెక్నాలజీలపై విస్తృత పరిశోధనలు, పరీక్షలు చేస్తూండటం, ప్రమాణాలను నిర్ణయించడంలో చాలా ముందున్న కారణంగా 5జీ ఫోన్ల విషయంలో మాత్రం క్వాల్కామ్పై ఆధారపడాల్సి ఉంటుందని అంచనా. ఏతావాతా.. ఆపిల్ తనదైన స్మార్ట్ఫోన్ చిప్లను తయారు చేసుకునేందుకు మరికొంత సమయం పట్టనుందన్నమాట. లక్షల కోట్ల వ్యవహారం! మైక్రోప్రాసెసర్ తయారీ మార్కెట్ విలువ ఎకాఎకిన కొన్ని లక్షల కోట్ల వరకూ ఉంటుంది. ఇంటెల్, మోటరోలా, అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్, ఐబీఎం, సన్ మైక్రోసిస్టమ్స్, హ్యూలెట్ ప్యాకర్డ్ వంటి దిగ్గజాలు కొన్ని వందల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టడమే కాకుండా.. పోటాపోటీగా మరింత సమర్థమైన, మెరుగైన ఫీచర్లు ఉన్న మైక్రోప్రాసెసర్లను అందుబాటు లోకి వెచ్చాయి. యాభై ఏళ్ల క్రితం నాటి తొలి మైక్రోప్రాసెసర్లో కేవలం 2300 ట్రాన్సిస్టర్లు ఉంటే.. తాజాగా ఈ సంఖ్య 1600 కోట్లకు చేరిపోయిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చూ. అది కూడా ఒక చదరపు సెంటీమీటర్ వైశాల్యంలోనే ఇన్ని కోట్ల ట్రాన్సిస్టర్లను ఇమడ్చేందుకు ఎంత సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్, పరికరాలు అవసరమవుతాయో ఊహించుకోవచ్చు. ఇలా తయారైన మైక్రోప్రాసెసర్లు పీసీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లతోపాటు పరిశ్రమల్లో, వాహనాల్లో, దైనందిన వాడకంలో ఉండే ఎలక్ట్రానిక్ పరికరాల్లోకీ చేరిపోయాయి. ఇంత విస్తృత వాడకం ఉన్న కారణంగానే మైక్రోప్రాసెసర్ల మార్కెట్ విలువ ఏడాదికి దాదాపు రూ.6.75 లక్షల కోట్లు ఉంది. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఏడాది వృద్ధి 6.4 శాతం వరకూ ఉండవచ్చునని అంచనా. 2021 చివరకల్లా మార్కెట్ రూ.7 లక్షల కోట్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లదే హవా.. మైక్రోప్రాసెసర్ల రంగంలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లలో వేగంగా వృద్ధి కనపడుతోంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉండటం, ప్రజల వద్ద ఖర్చు పెట్టేందుకు ఉండే ఆదాయం పెరుగుతూండటం నేపథ్యంలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల విక్రయాలు పెరుగుతూండటం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు 2019లో సగటు అమెరికన్ చేతిలో ఖర్చు పెట్టేందుకు సగటున 15 వేల డాలర్లు ఉంటే అది గత ఏడాది అక్టోబరు నాటికి 47,673 డాలర్లకు చేరినట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. భారత్, చైనా వంటి దేశాల్లోనూ మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రానిక్ పరికరాలపై పెడుతున్న ఖర్చు ఎక్కువవుతూండటం మైక్రోప్రాసెసర్ రంగానికి వరంగా మారుతోంది. ఒక్క భారత్లోనే వచ్చే ఏడాదికల్లా స్మార్ట్ఫోన్లు ఉన్న వారి సంఖ్య 82 కోట్లకు చేరుతుందని అంతర్జాతీయ సంస్థ కేపీఎంజీ లెక్కకడుతోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వాడకం పెరిగిన కొద్దీ అందులోనూ చిప్ల వాడకం ఉన్న కారణంగా మైక్రోప్రాసెసర్ రంగం వృద్ధి వేగంగా సాగుతుందని అంచనా. దిగ్గజ తయారీదారులు వీరే... మైక్రోప్రాసెసర్ల తయారీలో తైవాన్కు చెందిన మీడియాటెక్, దక్షిణ కొరియాకు చెందిన సాంసంగ్, జపాన్లోని తోషిబాలు కలసి అమెరికా బయట ఆధిపత్యం కనబరుస్తున్నాయి. మొత్తమ్మీద చూస్తే అమెరికన్ కంపెనీ ఇంటెల్దే తొలిస్థానం. మార్కెట్ దీని షేర్ 19.5 శాతంగా ఉంది. తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 11.25 శాతంతో రెండో స్థానంలోనూ, దాదాపు 10 శాతంతో మూడోస్థానంలో క్వాల్కామ్ ఉన్నాయి. సాంసంగ్ సెమీ కండక్టర్, బ్రాడ్కామ్, ఫ్రీస్కేల్ సెమీ కండక్టర్, ఎన్విడియా, ఏఎండీ, స్ప్రెడ్ట్రమ్, టీఐ, ఆపిల్, ఐబీఎం, ఆట్మెల్, టీఎస్ఎంసీ, లీడ్కోర్, ఆమ్లాజిక్, నూఫ్రంట్, ఇన్జెనిక్ వంటి కొన్ని కంపెనీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మైక్రో ప్రాసెసర్ సెగ్మెంట్ను స్థూలంగా మూడు భాగాలుగా విడదీయవచ్చు. ఆర్మ్, ఎక్స్–86 ఆధారిత ఎంపీయూలు ఒక వర్గమైతే.. అప్లికేషన్ల ఆధారంగా చేసే వర్గీకరణ (పీసీలు, సర్వర్లు, ట్యాబ్లెట్లు, సెల్ఫోన్లు, ఎంబెడెడ్ ఎంపీయూలు) రెండోది. ఉపయోగించే రంగం ఆధారంగా జరిగే మూడో వర్గీకరణలో సమాచారం, కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటివి ఉంటాయి. స్మార్ట్ఫోన్లలో మాత్రం క్వాల్కామ్ పెత్తనం కొనసాగుతోంది. 2020 లెక్కల ప్రకారం స్మార్ట్ఫోన్ అప్లికేషన్ ప్రాసెసర్ రంగంలో క్వాల్కామ్ 32 శాతం ఆదాయాన్ని దక్కించుకుంది. చైనాకు చెందిన హైసిలికాన్ 22 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఆపిల్ 19 శాతంతో మూడో స్థానంలో ఉండగా.. మిగిలిన అన్ని సంస్థలు కలిసి 27 శాతం వాటా కలిగి ఉన్నాయి. -
చిక్కుల్లో ఆపిల్.. కారణమేంటీ ?
మనిషిని ఆపరేట్ చేసేది మెదడు. మరి ఆ మెదడునే మనిషి ఆపరేట్ చేస్తే..ఇదిగో ఇలాంటి ఐడియాతో మనిషి మెదడులో కంప్యూటర్ చిప్ను అమర్చేందుకు ఎలాన్ మస్క్ న్యూట్రాలింక్ ప్రయోగం తెరపైకి తెచ్చారు. ఆ ప్రయోగం ఎలా ఉన్నా ఇప్పుడు ప్రపంచ దేశాల్ని చిప్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా టెక్ దిగ్గజం ఆపిల్పై దీని ప్రభావం ఎక్కువగానే ఉంది. నేడు మనం వినియోగించే అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లో సెమీ కండక్లర్లు, మైక్రో ప్రాసెసర్లు ఉంటాయి. ఇలాంటి సెమీ కండక్టర్లు, మైక్రో ప్రాసెసర్ల సమాహరాన్నే చిప్ లేదా చిప్సెట్గా పిలుస్తారు. అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో చిప్ల తయారీ గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు కరోనా వల్ల తలెత్తిన పరిస్థితుల్లో ఆన్లైన్ వ్యవహరాలు పెరిగిపోయాయి. జూమ్ మీటింగ్స్, వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ క్లాసులతో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, మాక్ప్యాడ్, ఐప్యాడ్ల వినియోగం పెరిగింది. ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరిగింది. కరోనా సంక్షోభంతో పాటే ఈ సమస్య తలెత్తినా.. గత మార్చి వరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అప్పటికే చిప్లు స్టాక్ ఉండడంతో సమస్యలు తలెత్తలేదు. ఓ వైపు చిప్ స్టాక్ అయిపోవడం మరో వైపు చిప్ల తయారీ ఇంకా పుంజుకోకపోవడంతో సమస్య తల్తెతింది. చిప్లు, సెమీ కండర్లు లేకపోవడం వల్ల ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ వ్యాపారం దెబ్బతింటుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ... చిప్ సెట్ల కొరత కారణంగా మాక్, ఐప్యాడ్ అమ్మకాలు క్షీణించినట్లు చెప్పారు. సెప్టెంబర్ త్రైమాసికం సమయానికి చిప్ మార్కెట్లోకి రాకపోతే తమకు కష్టమేనన్నారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో ఆపిల్ ఆదాయం సుమారు 6 లక్షల కోట్లుగా నమోదు అయ్యింది. ఇందులో మాక్ నుంచి వచ్చే ఆదాయం సుమారు రూ .61 వేల కోట్లు ఉండగా ఐప్యాడ్ ద్వారా వచ్చే ఆదాయం సుమారు 54 వేల కోట్లుగా నమోదు అయ్యింది. -
సెక్యూరిటీ ప్రాసెసర్ చిప్.. హ్యాకర్లకు చెక్
న్యూయార్క్: గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా సెక్యూరిటీ ప్రాసెసర్ చిప్ను ఆవిష్కరించింది. ప్లూటన్ పేరుతో కొత్తగా అభివృద్ధి చేసిన ఈ చిప్ విండోస్ పీసీలకు మరింత భద్రతను చేకూర్చనున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఈ కొత్త సెక్యూరిటీ చిప్ను సిలికాన్ దిగ్గజాలు ఇంటెల్, ఏఎండీ, క్వాల్కామ్ సాంకేతిక సహకారంతో రూపొందించినట్లు తెలియజేసింది. తద్వారా విండోస్ పీసీలలోని నెక్ట్స్ జనరేషన్ హార్డ్వేర్కు మరింత భద్రతను కల్పించనున్నట్లు వివరించింది. సీపీయూలతో.. మైక్రోసాఫ్ట్ ప్లూటన్ను భవిష్యత్ సీపీయూలలో అంతర్గతంగా ఏర్పాటు చేయనున్నట్లు ఓఎస్ సెక్యూరిటీ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్ డేవిడ్ వెస్టన్ తెలియజేశారు. తద్వారా హార్డ్వేర్, క్రిప్టోగ్రాఫిక్స్ భద్రతకు వినియోగించే ట్రస్ట్డ్ ప్లాట్పామ్ మాడ్యూల్(టీపీఎంలు)ను ఈ చిప్ రీప్లేస్ చేయనున్నట్లు వివరించారు. ఈ ఆధునిక సెక్యూరిటీ ప్రాసెసర్(ప్లూటన్) హ్యాకర్ల నుంచి మరింత భద్రతను చేకూరుస్తుందని పేర్కొన్నారు. తద్వారా హ్యాకర్లు ఆపరేటింగ్ సిస్టమ్లో భాగంగా అంతర్గతంగా దాక్కునేందుకు లేదా.. ఫిజికల్ ఎటాక్స్ చేసేందుకు కష్టమవుతుందని తెలియజేశారు. క్రెడిన్షియల్, ఎన్క్రిప్షన్ కీస్ వంటివి చోరీ చేయడాన్ని ఈ చిప్ అరికడుతుందని వివరించారు. అంతేకాకుండా సాఫ్ట్వేర్ బగ్స్నుంచి రికవరీ సాధించేందుకు సైతం తోడ్పడుతుందని పేర్కొన్నారు. వెరసి కమ్యూనికేషన్ చానల్పై దాడి అవకాశాలకు చెక్ పెడుతుందని చెప్పారు. గత పదేళ్లుగా టీపీఎంలు విండోస్కు మద్దతిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
ఆవుపేడతో రేడియేషన్కు చెక్ పెట్టొచ్చట..!
న్యూఢిల్లీ: ఆవు హిందువులకు ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆలానే ఆవు పేడ, మూత్రాన్ని కూడా అనేక రకాలుగా వినియోగిస్తారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాను ప్రతి రోజు ఆవు మూత్రం తాగుతానని తెలిపారు. ఇక ఆవు పేడను కూడా ఇప్పటికే దీన్ని ఎన్నో ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆవు పేడ గురించి రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ వల్లభాయ్ కతిరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవు పేడకు రేడియేషన్ను ఎదుర్కోవడంతోపాటు దాన్ని తగ్గించే సామర్ధ్యం ఉందని కతిరియా తెలిపారు. ఆవు పేడతో తయారైన చిప్ని ప్రదర్శించిన కతిరియా మీడియాతో మాట్లాడారు. మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నపుడు మనుషులను ప్రభావితం చేసే రేడియేషన్ని నివారించడానికి ఈ ఆవు పేడ చిప్ సహాయపడుతుందని ఆయన చెప్పారు. ‘‘ఆవు పేడ ప్రతి ఒక్కరినీ రక్షిస్తుంది, దీనికి రేడియేషన్ నిరోధకత ఉందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఆవు పేడ ఉత్పత్తులను ఇంట్లో ఉంచడం వల్ల ఇది ప్రజలను రేడియేషన్ నుంచి రక్షిస్తుంది’’ అన్నారు కతిరియా. (చదవండి: అమెరికాలో పిడకల వేట!) ఫోన్లలో ఆవుపేడ ఆధారిత చిప్ ఉంచితే అది వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఆవు పేడ చిప్ని ఆవిష్కరించిన కామధేను ఆయోగ్ ఛైర్మన్ దానికి ‘గౌసత్వా కవచ్’ అని పేరు పెట్టారు. రేడియేషన్ వల్ల వచ్చే వ్యాధులను నివారించాలనుకుంటే, ఆవు పేడతో చేసిన చిప్ను ఫోన్లలో వాడాలని కతిరియా ప్రజలకు సూచించారు. దేశవ్యాప్తంగా గోవధను అరికట్టడమే కాకుండా వీటి ఉత్పత్తులను శాస్త్రీయంగా నిర్ధారించి ప్రోత్సహిచేందుకు కేంద్రం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ కామధేను ఆయోగ్ సంస్ధను ఏర్పాటు చేసింది. ఈ సంస్ధ గోవులకు సంబంధించిన ప్రతీ ఉత్పత్తిని శాస్త్రీయంగా పరీక్షించి వాటిని జనంలోకి విస్తృతంగా వ్యాప్తి చేస్తుంది. ఇప్పుడు రేడియేషన్కు వ్యతిరేకంగా పనిచేసే ఆవు పేడతో తయారు చేసిన చిప్ను సంస్ధ విడుదల చేసింది. దీన్ని మొబైల్ ఫోన్లలో ఉపయోగించడం ద్వారా రేడియేషన్ నుంచి కాపాడుకోవచ్చని చెబుతోంది. ‘గౌసత్వ కవచ్’ పేరుతో రూపొందించిన ఈ చిప్ను గుజరాత్కు చెందిన ఓ గోశాల తయారు చేసినట్లు కేంద్రం చెబుతోంది. -
తొలి దేశీయ 4జీ సెమీకండక్టర్ చిప్
న్యూఢిల్లీ: 4జీ, ఎల్టీఈ, 5జీ మోడెమ్స్లో ఉపయోగించడానికి అనువైన సెమీకండక్టర్ చిప్స్ను తొలిసారి దేశీయంగా రూపొందించినట్లు బెంగళూరుకు చెందిన సిగ్నల్చిప్ వెల్లడించింది. ఇందులో నాలుగు చిప్ల శ్రేణిని బుధవారం ఆవిష్కరించింది. వీటి వినియోగం కోసం సంబంధిత రంగ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సిగ్నల్చిప్ వ్యవస్థాపకుడు, హిమాంశు ఖస్నిస్ వెల్లడించారు. తొలి దేశీ సెమీకండక్టర్ చిప్ల రూపకల్పనపై సిగ్నల్చిప్ సంస్థను టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ అభినందించారు. మరోవైపు, భద్రతాప్రమాణాలకు సంబంధించి అంతర్జాతీయంగా చైనా టెలికం పరికరాల తయారీ సంస్థలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై మరింతగా అధ్యయనం చేయనున్నట్లు అరుణ చెప్పారు. ‘చాలా దేశాలు చైనా సంస్థల టెలికం పరికరాల విషయంలో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి భారత్ కూడా దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది‘ అని చిప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు చైనా కంపెనీలు.. ముఖ్యంగా హువావే సంస్థ తయారు చేసే టెలికం పరికరాలను ఉపయోగించరాదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అరుణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, హువావేకి వ్యతిరేకంగా కొన్ని దేశాలు నిర్ణయం తీసుకున్నప్పటికీ.. జర్మనీ తదితర దేశాలు మాత్రం ఆ సంస్థ పరికరాల వినియోగం కొనసాగించే యోచనలో ఉన్నాయి. -
ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఆరు రోజులు అక్కర్లే..
ఎంత ఖరీదు పెట్టి కొనుగోలు చేసిన మొబైల్ అయినా ఆరు నుంచి ఏడు గంటల తర్వాత దానికి చార్జింగ్ పెట్టాల్సిందే. నిత్యం వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్,ఇన్స్ట్ర్రాగ్రాం లాంటివి వాడుతుండటం వల్ల ఫోన్లో చార్జింగ్ ఒక్కో పాయింట్దిగిపోతూ ఉంటుంది. ట్రావెలింగ్ సమయాల్లో ఫోన్ చార్జింగ్ అయిపోతుందేమోననే భయంతో మనతో పాటు పవర్బ్యాంక్ని కూడా వెంట తెచ్చుకుంటాం. మొబైల్ చార్జింగ్లో ఇటువంటి సమస్యలు నిత్యకృత్యం. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టి కేవలం 1.మి.మీ. సైజు ఎలక్ట్రానిక్ చిప్ (డివైజ్)ని కనిపెట్టి ఆరు రోజుల వరకు ఫోన్కు చార్జింగ్ పెట్టకుండా ఉండేలా తన మిత్రులతో కలిసి సరికొత్తఅధ్యాయానికి తెర తీశాడు సిటీ కుర్రాడు సునీల్కుమార్. గత ఏడాది ‘నాస్కో’ అవార్డును కూడా అందుకున్నాడు. హిమాయత్నగర్ :లింగంపల్లికి చెందిన సునీల్కుమార్ గచ్చిబౌలిలోని ఐఐటీ క్యాంపస్లో ఐఐటీ పూర్తి చేశాడు. అనంతరం 2016లో మాస్టర్స్ పూర్తి చేశాడు. మొబైల్ చార్జింగ్ విషయంలో అనేక ఇబ్బందులు పడుతుండేవాడు. సమస్యకు ఏదైనా పరిష్కార మార్గాన్ని కనుగొనాలనుకున్నాడు. దాదాపు ఆరు రోజులు ఫోన్కు చార్జింగ్ పెట్టకుండా దానిని వాడుకునేలా ఎలక్ట్రానిక్ చిప్ని రూపొందించి సరికొత్త రికార్డును సృష్టించాడు. మిత్రులతో సునీల్కుమార్ ఏమిటీ డివైజ్ ప్రత్యేకత.. ‘బ్లూ సెమీ’ పేరుతో ఎలక్ట్రానిక్ చిప్ (డివైజ్)ని రూపొందించాడు. దీనికోసం సుమారు మూడేళ్ల సమయం పట్టింది. ఈ డివైజ్ని మొబైల్లోని మదర్బోర్డుపై సెట్ చేస్తారు. ఇప్పటి వరకు ట్రయల్స్లో ఉన్న ఈ డివైజ్ వచ్చే ఏప్రిల్ నుంచి మార్కెట్లోకి రానుంది. సునీల్కుమార్ 12మంది టీం సభ్యులతో కలిసి ఈ డివైజ్ని రూపొందించాడు. మొబైల్ కొనుగోలు చేసిన తర్వాత 100 శాతం చార్జింగ్ పెడితే చాలు. మరో ఆరు రోజుల వరకు మొబైల్కు చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండటమే దీని ప్రత్యేకత అని సునీల్ కుమార్ తెలిపారు. ఆటోమేటిక్గా చార్జింగ్.. ఓ పక్క మనం చార్జింగ్ పెడుతూనే మరో పక్క ఫోన్లోని యాప్స్ని ఓపెన్ చేస్తూ చూస్తుంటాం. ఒక్క నిమిషం కూడా ఫోన్ని వాడకుండా ఉండలేం. దీనివల్ల మొబైల్లో చార్జింగ్ అయిపోవడం షరామామూలే. సునీల్ కనిపెట్టిన డివైజ్ మొబైల్ని మనం వాడుతుంటే.. సూర్యరశ్మి, మన బాడీ టెంపరేచర్, నైట్టైం లైటింగ్కి చార్జింగ్ ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది. మొబైల్తో పాటే డివైజ్ మనం కొనే శామ్సంగ్, ఐ ఫోన్, వీవో, ఎంఐ తదితర ఫోన్లలోనే ఈ డివైజ్ని ఫిట్ చేసి ఉంచుతామని సునీల్కుమార్ తెలిపారు. ఇప్పటికే పలు కంపెనీలతో తాము ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి మార్కెట్లో తాము రూపొందించిన డివైజ్ను అమర్చిన ఫోన్లు మార్కెట్లోకి రానున్నట్లు వివరించారు. మనం కొనే మొబైల్ ధరపై రూ.500నుంచి రూ.1000 అదనంగా ఆయా కంపెనీలు చార్జి చేసే అవకాశం ఉన్నట్లు వివరించారు. త్వరలో ప్రాసెసర్ కంట్రోలింగ్ త్వరలో మొబైల్ ప్రాసెసర్ని కంట్రోల్ చేసే విధంగా డివైజ్ని రూపొందించేందుకు సిద్ధపడుతున్నాం. ఇప్పుడున్న చిప్ని తయారు చేసేందుకు రూ.కోటి ఖర్చు అయ్యింది. పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఏప్రిల్లో విడుదల అయ్యాక మొబైల్ వాడే ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారనే నమ్మకం ఉంది. త్వరలో ప్రాసెస్ కంట్రోలింగ్తో పాటు వాట్సప్, ఫేస్బుక్ వంటి వాటి పవర్ని కూడా కంట్రోల్ చేస్తూ చార్జింగ్ నిలిచేలా చేస్తాం. – సునీల్కుమార్, డివైజ్ రూపకర్త -
ఖాతాదారులకు ఎస్బీఐ సూచన
-
డెబిట్ కార్డులపై ఎస్బీఐ న్యూ అలర్ట్
న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ప్రస్తుత మాగ్నెటిక్ స్ట్రైప్ ఏటీఎం కమ్ డెబిట్ కార్డులను సరికొత్త ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులతో మార్చుకోవాలని ఖాతాదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సూచించింది. ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియేనని, కొత్త కార్డుల జారీకి ఎటువంటి చార్జీలు ఉండవని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఎస్బీఐ ట్వీట్ చేసింది. నకిలీ కార్డు మోసాలకు ఆస్కారమివ్వని ఈఎంవీ (యూరోపే, మాస్టర్కార్డ్, వీసా) చిప్ కార్డులు సురక్షితమైనవని పేర్కొంది. జూన్ ఆఖరు నాటికి ఎస్బీఐ 28.9 కోట్ల ఏటీఎం–డెబిట్ కార్డులు జారీ చేయగా, ఇందులో సింహభాగం చిప్ ఆధారితమైనవే. కొత్త చిప్ డెబిట్ కార్డు కోసం హోమ్ బ్రాంచీలో సంప్రదించవచ్చని లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్బీఐ సూచించింది. ఏటీఎం కార్డులకు సంబంధించిన మోసాలబారిన పడకుండా ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో కేవలం చిప్ ఆధారిత, పిన్ నంబర్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులు మాత్రమే జారీ చేయాలంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించడం తెలిసిందే. -
ఫోన్ల నుంచి విమానాల వరకూ అన్నీ పరుగులే!
ఈ చిప్ కొంచెం.. వేగం మాత్రం ఘనం. స్మార్ట్ఫోన్ల నుంచి విమానాల వరకూ ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను, వాహనాలను ఇది పరుగులెత్తిస్తుందట. ప్రస్తుతం కంప్యూటర్లలో 14 నుంచి 22 నానోమీటర్ల మధ్య సైజులో గల చిప్లను వాడుతున్నారు. అయితే, ఇవి కొంచెం పెద్దగానే ఉన్నప్పటికీ.. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల వేగం తక్కువ, విద్యుత్ వినియోగం ఎక్కువ అన్న రీతిలో పని జరుగుతోంది. అందుకే, సిలికాన్-జెర్మేనియంతో ఐబీఎం కంపెనీవారు దీనిని తయారు చేశారు. దీని సైజు 7 నానోమీటర్లేనట. సైజు తగ్గినా దీనిపై 20 బిలియన్ల ట్రాన్సిస్టర్(స్విచ్)లను అమర్చవచ్చట. ఈ చిప్తో విద్యుత్ వినియోగం కనీసం 50 శాతం తగ్గి, వేగం కనీసం 50 శాతం పెరుగుతుందని చెబుతున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్డాటా వ్యవస్థల సామర్థ్యం పెంచేందుకూ ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారు. బుల్లి చిప్తో భలే ప్రయోజనాలే ఉన్నాయన్నమాట. 3 బిలియన్ డాలర్ల నిధులతో చేపట్టిన పరిశోధక ప్రాజెక్టులో భాగంగా శాంసంగ్, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్కు చెందిన గ్లోబల్ ఫౌండరీస్తో కలిసి ఐబీఎం ఈ బుల్లి చిప్ను రూపొందించడం విశేషం. -
ఇతడు ఆలోచించాడు... రోబో చేయి పాటించింది..!
ఇతడికి పండ్ల రసం తాగాలనిపించింది. అలా అనుకోగానే రోబోటిక్ చేయి చకచకా కదిలింది. పండ్ల రసాన్ని సిద్ధం చేసింది! ఆ తర్వాత నోటికీ అందించింది! అమెరికాలోని లాస్ ఏంజెలిస్లో గతేడాది మార్చి 28న జరిగిన సీన్ ఇది. కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, కెక్ మెడిసిన్ యూనివర్సిటీ, తదితర సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ‘కృత్రిమ నాడీ పరికరం’ ద్వారా ఇది సాధ్యమైంది. ఇతడి మెదడులో ఆలోచనలను చదివే చిప్(కృత్రిమ నాడీ పరికరం)ను అమర్చారు. మెదడులోని ఆలోచనలను ఆ చిప్ విశ్లేషించి, రోబో చేయికి సంకేతాలు పంపింది. దీంతో ఆ సంకేతాలకు అనుగుణంగా రోబో చేయి పనిచేసింది. ఈ టెక్నాలజీ పరిశోధన ఫలితాలను గురువారం శాస్త్రవేత్తలు ప్రకటించారు. అవయవాలు కోల్పోయినవారికి, పక్షవాతానికి గురైనవారికి ఈ టెక్నాలజీ వరప్రసాదం కానుందని వారు చెబుతున్నారు. అయితే, ఎరిక్ జి. సోర్టో అనే ఇతడే కృత్రిమ నాడీ పరికరాన్ని ఉపయోగించిన తొలి వ్యక్తి కావడం మరో విశేషం. -
నొప్పికి అడ్డుకట్ట..!
కూర్చుంటే నొప్పి.. లేస్తే నొప్పి.. నడిస్తే నొప్పి! నడుము, వెన్ను నొప్పులతో పాటు రోజూ వేధించే నొప్పులెన్నో.. అలాంటి దీర్ఘకాలిక బాధలకు ఇక చెల్లు! పెయిన్ కిల్లర్లు అక్కర్లేదు.. ఎలక్ట్రోడ్లు అవసరం లేదు.. ఒక చిన్న చిప్ను వెన్నుపాము వద్ద అమర్చుకుంటే చాలు.. నొప్పి సంకేతాలు మెదడుకు చేరకుండా అడ్డుకుంటుంది. వెన్నుపాము వద్ద అమర్చిన అయాన్ పంపు ఊహాచిత్రమిది. అంతర్ చిత్రంలో.. ప్లస్ గుర్తులో ఉన్నవి నొప్పి సిగ్నళ్లు కాగా, పసుపురంగులోనివి నొప్పిని అడ్డుకుంటున్న సిగ్నళ్లు శరీరంలో ఎలాంటి నొప్పి అయినా మనకు తెలియాలంటే.. ముందుగా ఆ నొప్పి సిగ్నళ్లు మెదడును చేరాలి. అప్పుడే మనకు నొప్పి అనుభూతి కలుగుతుంది. ఆ తర్వాతే బాధ నుంచి ఉపశమనం కలిగించే నాడీ రసాయనాలు విడుదలయ్యేలా మెదడు ఆదేశాలిస్తుంది. ఇదంతా దేహంలో జరిగే సహజమైన ప్రక్రియ. కానీ నొప్పి సిగ్నళ్లు నిరంతరం మెదడును చేరుతూ ఉంటే.. ఇక రోజూ నరకమే! అందుకే.. నొప్పి సంకేతాలు మెదడును చేరకుండా అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. స్వల్పస్థాయి కరెంటు షాక్లు ఇచ్చే ఎలక్ట్రోడ్లను వెన్నుపాము వద్ద అమర్చడం, పెయిన్ కిల్లర్ మందులను ఇవ్వడం వంటివి చేస్తున్నారు. కానీ వీటి వల్ల దుష్ర్పభావాలు కలుగుతున్నాయి. మరి.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పికి అడ్డుకట్ట వేయడం కుదురుతుందా? అంటే అవుననే అంటున్నారు స్పెయిన్లోని లైనికోపిన్ యూనివర్సిటీ, కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు. శరీరంలో నొప్పిని నివారించే నాడీ రసాయనాలను సహజంగానే విడుదలయ్యేలా చేసే ‘ఆర్గానిక్ అయాన్ పంప్’ని వారు తయారు చేశారు. ఉదాహరణకు.. ఒక వ్యక్తికి నడుము దగ్గర నాడులు దెబ్బతిని నడుమునొప్పి వేధిస్తుందనుకుందాం. దెబ్బతిన్న నాడుల దగ్గర నుంచి నొప్పి సంకేతాలు(నాడీ రసాయనాలు) వెన్నుపాముకు, అక్కడి నుంచి మెదడుకు చేరతాయి. అయితే, ఈ సంకేతాలు వెన్నుపాముకు చేరే దగ్గర అయాన్ పంపు చిప్ను అమరిస్తే గనక.. ఇది అక్కడ ‘గామా అమైనోబ్యుటిరిక్ యాసిడ్’ అనే నాడీ రసాయన అణువులు సహజంగానే విడుదలయ్యేలా చేస్తుంది. దీంతో ఇవి నొప్పి సంకేతాలను అక్కడే అడ్డుకుంటాయి. ఫలితంగా నొప్పి అన్న భావనే కలగదు! ఈ చిప్ ఎలుకల్లో విజయవంతంగా పనిచేసిందని, ఐదేళ్లలో మనుషులలో వాడేందుకూ సిద్ధమవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 7 శాతం మంది దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్నారని, అలాంటి వారికి దీనితో ఉపశమనం కలుగుతుందన్నారు. దీర్ఘకాలిక నొప్పుల నివారణకే కాకుండా.. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల చికిత్సకు, గుండెను పేస్మేకర్కు అనుసంధానించేందుకూ ఈ అయాన్ పంపు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. -
కొలతలో కక్కుర్తి.. నాణ్యత కల్తీ
ఉప్పల్ జయలీల పెట్రోల్ బంక్ బాగోతం మెషిన్లో చిప్ అమర్చి తూకంలో మోసం సీజ్ చేసిన తూనికల కొలతల అధికారులు ఉప్పల్, న్యూస్లైన్: పెట్రోలు ఫిల్లింగ్ బాక్స్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ చిప్ను ఉపయోగించి కొలతలో మోసానికి పాల్పడుతున్న పెట్రోలు బంక్ బాగోతాన్ని అధికారులు బట్టబయలు చేశారు. ఉప్పల్ జయలీల ఫిల్లింగ్ స్టేషన్ లో తక్కువ కొలత వస్తుందని, పెట్రోలు నాణ్యతపై అనుమానం ఉందని కొందరు వినియోగదారులు తూనికల కొలతల శాఖాధికారులకు ఫిర్యాదు చే శారు. తూ.కొ. విభాగం అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్రావు, జిల్లా ఇన్స్పెక్టర్ అనిల్ ఆధ్వర్యంలో బుధవారం జయలీల ఫిల్లింగ్ స్టేషన్పై దాడి చేశా రు. ప్రతి యంత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి లీటర్పై 2.18 నుంచి 2.30 ఎంఎల్ మేర పెట్రోల్ తక్కువగా వస్తుందని గుర్తించారు. ఫిల్లింగ్ బా క్స్లను విప్పి చూడగా ప్రత్యేక సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నారని తేలింది. పెట్రోల్ నాణ్యతను కూడా అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకులోని అన్ని యంత్రాలను సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెట్రోల్లో కల్లీ ఉందని తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. -
తూ.కొ...మేలుకో
ఆగని పెట్రోల్బంకుల మోసాలు దర్జాగా పంపింగ్లో మోసం లీటర్కు 10 ఎంఎల్ స్వాహా కేసులకు భయపడని డీలర్లు పట్టింపులేని తూ.కొ.శాఖ అధికారులు సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో పెట్రోలు, డీజిల్ బంకుల మోసాలకు అడ్డుకట్టపడటం లేదు. మోసాలు జరుగుతున్నాయని మొత్తుకుంటున్నా యంత్రాంగం స్పందించడం లేదు. ప్రభుత్వ లోపభూయిష్ట చట్టాలతో పెట్రోలుబంకుల డీలర్ల దోపిడీ దర్జాగా సాగుతోంది. హైదరాబాద్లో పెట్రోలుబంకుల మహా మోసాలు కళ్లముందు కదలాడుతున్నా..కనీసం పట్టని తూనికల,కొలతల శాఖ తిమింగలాలను వదిలి.. చేపలను పట్టేలా ఇటీవల స్పెషల్డ్రైవ్ పేరిట గ్రామీణ ప్రాంతాల్లోని బంకులను తనిఖీలు నిర్వహించడం విస్మయానికి గురిచేస్తోంది. మహానగరం పరిధిలో సుమారు 300కు పైగా పెట్రోలు, డీజిల్ బంకులు ఉండగా, ఇటీవల స్పెషల్డ్రైవ్లో కనీసం పదిశాతం బంకులను కూడా తనిఖీలు నిర్వహించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నాలుగైదు ప్రాంతాల్లో కొన్ని బంకులను మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించగా..అంబర్పేటలోని ఐవోసీ పెట్రోల్బంకుపై మాత్రమే ఒక కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో పెట్రోలు బంకుల డీలర్లకు కనీసం భయం లేకుండాపోయింది. వినియోగంలో మనమే టాప్ : రాష్ట్రంలోనే పెట్రోలు, డీజిల్ వినియోగంలో నగరం వాటా సగానికి పైనే. ప్రతిరోజు మహానగరంలో సగటున 30 లక్షల లీటర్ల పెట్రోలు, 33 లక్షల డీజిల్ వినియోగమవుతోంది. బంకుల్లో సగటున ప్రతి లీటరుకు 10 నుంచి 15 ఎంఎల్ వరకు తక్కువగా పంపింగ్ జరగడం సర్వసాధరణమే. ఈ నగ్నసత్యాన్ని సంబంధిత అధికారులు కూడా ధ్రువీకరిస్తున్నారు. ఇలా 10ఎంల్ చొప్పున తక్కువ పంపింగ్ జరిగినా.. ప్రతిరోజు 3వేల లీటర్ల పెట్రోలు, 3300 లీటర్ల డీజిల్ దోపీడీ జరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం లెక్కకడితే నిత్యం కోట్లాదిరూపాయలు వినియోగదారులు నష్టపోతున్నారు. భయపడని డీలర్లు : పెట్రోలు బంకుల డీలర్లు ఎలాంటి భయం లేకుండా దర్జాగా దోపిడీ పర్వం కొనసాగిస్తున్నారు. కొన్నినెలల క్రితం ఎస్వోటీ పోలీసులు, తూనికలకొలతలశాఖ ఫ్లైయింగ్స్క్వాడ్లు వేర్వేరుగా నిర్వహించిన తనిఖీల్లో పెట్రోల్ బంకుల నయా వంచనలు బహిర్గతం కావడం పాఠకులకు తెలిసిందే. కొందరు బంకుల యజమానులు ఫిల్లింగ్ మిషన్ల సాఫ్ట్వేర్లో ప్రత్యేక చిప్లు పెట్టి రిమోట్ ద్వారా కంట్రోల్ చేస్తూ మీటర్ రీడింగ్ను జంపింగ్ చేస్తున్నట్లు బయటపడగా, మరికొందరు ఆయిల్ కంపెనీలు సరఫరా చేసిన రిమోట్ కంట్రోల్ ద్వారా పంపింగ్ను కంట్రోల్ చేస్తూ దోపిడీ చేయడం సంచలనం సృష్టించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కేవలం ఆయిల్ కంపెనీలు సరఫరా చేసిన ఫిల్లింగ్ మిషన్ మోడల్ను తప్పుపట్టి హడావుడి సృష్టించి నోటీసులు జారీ చేసిన తూ.కొ.శాఖ అధికారులు కేసులు నమోదు చేసి కాంపౌండింగ్తో సరిపెట్టారు. ఆ తర్వాత అధికారులు పట్టించుకోకపోవడంతో ఏదొక తరహాలో మోసాల తంతు సాగుతూనే ఉంది. క్రిమినల్ కేసులే పరిష్కారం: పెట్రోల్బంకుల్లో మోసాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తే తప్ప అడ్డుకట్ట పడదని వినియోగదారులు పేర్కొంటున్నారు. నిత్యం బంకుల దోపిడీ కోట్లలో జరుగుతుంటే జరిమానాలు వేలల్లో విధిస్తే లాభం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. తూనికల,కొలతలశాఖ చట్టాలను సవరించి కేసులను కోర్టుకు నివేదించి బాధ్యులను జైళ్లకు పంపితే తప్ప మోసాలు పునరావృతం కావని వారు అభిప్రాయపడుతున్నారు. -
మొదటి ర్యామ్ చిప్ పరిచయం చేశారు
K V GNANA KUMAR Director DBS, Hyderabad Computer Awareness 1. A flaw in a program that causes it to produce incorrect or inappropriate results is called a ___. a) Byte b) Attribute c) Unit Problem d) Bug e) None 2. A collaborative network that uses Internet Technology to link business with their suppliers is ___. a) Internet b) Intranet c) Extranet d) WAN e) None of these 3. In a computer software, the term 'morphing' refers to which of the following: a) Animation technology in which one image is gradually turned into another. b) Data conversion technique by way of use of codes c) Conversion of digital picture to analog images d) A softer that saves a network form intrusion e) Software that links one server to another 4. Which of the following is a key function of a firewall: a) Deleting b) coping c) Monitoring d) Moving e) None of the above 5. Which of the following is the study of molecules and structures whose ranges from 1 to 100 nanometers: a) Nanoscience b) Microelectrodes c) Computer forensics d) Artificial intelligence e) None of the above 6. ___ is data that has been organized or presented by in a meaningful fashion: a) A process b) Software c) Storage d) Information e) None of the above 7. The components that process data are located in the: a) Input device b) Output device c) System unit d) Storage Component e) None of the above 8. Word processing, spreadsheet, and photo editing are examples of: a) Application software b) System software c) Operating system d) Platform software e) None of the above 9. The PC (personal computer) and Apple Macintosh are examples of two different: a) Platforms b) Applications c) Programs d) Storage devices e) None of these 10. DSL is an examples of a(n) ___connection a) Network b) Wireless c) Slow d) Broadband e) None of the above 11. Bookmarks can be organized by using: a) Containers b) Menus c) Folders d) Tables e) Structures 12. Which of the following symbol is used to specify a cell range a) Slash b) Hyphen c) Colon d) Asterisk e) Comma 13 An example of web browser is a) Google Chrome b) Mozilla c) Safari d) Epic e) All the above 14. The number of pixels displayed on a screen is known as the screen: a) Resolution b) Color depth c) Refresh rate d) Viewing size e) None of these 15. Smart Card is: a) Special purpose Card b) Microprocessor Card c) Processing unit containing memory for storing data d) Processing unit for software handling e) None of these 16. Which of the following is not a part of the operating system? a) Supervisor b) Job - control program c) I / O Control program d) Performance monitor e) None of these 17. A program that generally has more user - friendly interface than a DBMS is called a: a) Front end b) Repository c) Back end d) Form e) None of these 18. Programs used to create or modify bitmap images are called: a) Illustration programs b) Image editor c) Graphical modifiers d) Bit publishing packages e) None of these 19. First RAM chip was introduced by which of the following? a) Microsoft b) Intel c) Dell d) HP e) Apple 20. Reel-to-Reel tape drives are commonly used with a) Mini computers b) Micro computers c) Mainframes computers d) Laptops e) Personal computers 21. In the URL http://www.sakshieducation.com, the portion labeled http is a) Host b) Domain name c) Protocol d) top - level domain e) None of these 22. RTF stands for: a) Real Time Formatting b) Rich Text Format c) Real Time Fonts d) Real Text Format e) None of these 23. Which of the following is NOT done by a modem: a) Transmission speed b) Data Accuracy c) Error detection and correction d) Data compression e) None of these 24. Which of the following is a program coded in programming language: a) Target code b) Source code c) Block d) All the above e) None of these 25. Who among the following developed Unix Operating System? a) Bat Walter b) John Bird c) Ken Thompson d) Richard Bird e) None of these 26. A picture, map or graphics or image that can be used in a document is known as a) Clip b) Object c) Clip Board d) Drag Drop e) None of these 27. A repair for a known software bug, usually available at no charge on the Internet, is called a a) Version b) Patch c) Tutorial d) FAQ e) None of these 28. Favorites are accessible from the ___menu: a) Start b) Title c) Stop d) File e) None of these 29. Technology no longer protected by copy right, and available to everyone is considered to be: a) Open b) Experimental c) Proprietary d) In the public domain e) None of these 30. The earliest calculating devices are: a) Clock b) Difference engine c) Abacus d) Calculator e) None of these 31. Which is the other Name for LAN Card: a) NIC b) Network Connector c) MODEM d) Internet Card e) None of these 32. Internet is: a) Complex system b) Decentralized system c) Dynamic system d) All of these e) None of these 33. What is the process of copying software program from secondary storage media to the hard disk called: a) Configuration b) Download c) Storage d) Upload e) Installation 34. Which command is used to close the workbook of Excel? a) Alt + F4 b) Ctrl + W c) Ctrl + R d) Ctrl + X e) None of these 35. Website is a collection of: a) HTML documents b) Graphic files c) Audio and video files d) All of these e) None of these 36. Which of the following protocols is used for WWW: a) FTP b) HTTP c) W3C d) UDC e) None of the above 37. FAT stands for a) File Activity Table b) File Allocation Table c) File Alless Tape d) File Accommodation table e) None of these 38. Which protocol E-Mail facility among different hosts: a) SMTP b) FTP c) TELNET d) SNMP e) None of these 39. A template is a a) Pattern of work sheet b) Heading c) Title d) Theme e) None of these 40. The centralized processing system in a bank makes use of which of the following: a) Stand alone computers b) Shared networking c) Computers connected by a communication network d) Computers connected by internet e) None of these 41. The term SWIFT stands for which of the following: a) Society for world-over intern-ational financial transfers b) Society for world-wide interbank financial transfers c) Society for world-wide interbank financial telecommunication d) Society for worst internatio-nal financial terrorism e) None of these 42. The funds that could be loaded into a card, which could be used as cash in case of need: a) Credit card b) Smart card c) Electronic cash d) Narrow money e) None of these 43. Which of the following is the part of hexadecimal number system: a) A b) A134 c) 1600 d)1010 e) None of these 44. IDRBT stands for which of the following: a) Institute for Development and Research in Banking Technology b) Institute for Development and Research in Business Technology c) Institution of Development and Research in Banking Technology d) Institute for Development of Rural Banking Technology e) None of these 45. The term CAD in the context of use of computer mean: a) Computer application design b) Computer aided design c) Computer appraised data d) Computer assisted debit e) None of these 46. What is a web-site? a) A place from where we can get information in documents and files b) A site that is owned by any particular company c) A location on the world wide web d) A place from where we can access internet e) None of the above 47. A collection of worksheets is called: a) Excel Book b) Work sheets c) Excel sheets d) Work Book e) None of the above Key 1) d 2) d 3) a 4) c 5) a 6) d 7) c 8) a 9) a 10) d 11) c 12) c 13) e 14) a 15) b 16) d 17) a 18) b 19) b 20) c 21) c 22) b 23) b 24) b 25) c 26) b 27) b 28) a 29) c 30) c 31) a 32) d 33) c 34) b 35) d 36) b 37) b 38) a 39) a 40) c 41) c 42) c 43) a 44) a 45) a 46) c 47) d