Advertisement
conductor
-
ప్రాణాలు కాపాడిన కండక్టర్
-
సడన్ బ్రేక్ వేసిన డ్రైవర్.. బలైన కండక్టర్
భూదాన్పోచంపల్లి : ఆర్టీసీ బస్సు డ్రైవర్ సడన్బ్రేక్ వేయడంతో ఫుట్బోర్డు నుంచి జారి కిందపడి కండక్టర్ మృతిచెందాడు. భూదాన్పోచంపల్లి జలాల్పురం గ్రామశివారులో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 50 మందికి పైగా ప్రయాణికులతో ఆదివారం సాయంత్రం 6.20గంటలకు పోచంపల్లి నుంచి సొంత డిపోకు బయలుదేరింది. బస్సులో బిహార్ రాష్ట్రానికి చెందిన కోళ్ల ఫారాల్లో పనిచేసే దాంజిరామ్ కూడా జలాల్పురం వరకు టికెట్ తీసుకున్నాడు.బస్సు జలాల్పురం దాటగానే కండక్టర్ దేవినేని సత్తిరెడ్డి(59) ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ ముందు ఫుట్బోర్డు వైపు వచ్చాడు. ఇదే క్రమంలో దాంజిరామ్ తాను దిగాల్సిన స్టేజీ దాటిపోతుందని భావించి వేగంగా కదులుతున్న బస్సులోంచి ఒక్కసారిగా కిందికి దూకాడు. గమనించిన బస్సుడ్రైవర్ పోచంపల్లికి చెందిన మక్తాల సాయి సడెన్ బ్రేక్ వేయడంతో ముందు ఫుట్బోర్డు సమీపంలో ఉన్న కండక్టర్ బస్సులోంచి జారి కిందరోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్లో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బస్సులోంచి దూకిన దాంజిరామ్ తలకు తీవ్రగాయాలు కాగా అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన కండక్టర్ సత్తిరెడ్డి హైదరాబాద్లోని మన్సురాబాద్లో స్థిరనివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. బస్సు డ్రైవర్ మక్తాల సాయి ఏడాది క్రితం భూదాన్పోచంపల్లి మండల శివారులో బైక్ను ఢీకొట్టి వాహనదారుడి మృతికి కారణమయ్యాడు. దాంతో అప్పుడు ఇతనిపై కేసు నమోదయ్యింది. ఈ మేరకు బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్రెడ్డి తెలిపారు. -
గుండెపోటుతో కండక్టర్ మృతి
ఆదిలాబాద్: మండల కేంద్రానికి చెందిన దాసరి శివరాజ్(57) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శివరాజ్ కుమార్ భైంసా డిపోలో ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి తన కుమారుడు కృష్ణ పైచదువుల కోసం అమెరికా వెళ్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో కుటుంబ సభ్యులంతా వీడ్కోలు పలికి హైదరాబాద్లోని ఇంటికి వచ్చారు. అంతలోనే గుండెపోటు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. కుమారుడికి సమాచారం అందించడంతో తిరుగు పయనమయ్యాడు. మంగళవారం జరిగిన అంతక్రియలో డిపో మేనేజర్ అమృత పాల్గొని నివాళులర్పించారు. -
కండక్టర్ బలవన్మరణం!
రంగారెడ్డి: అనారోగ్య సమస్యలు భరించ లేక ఓ ఆర్టీసీ కండక్టర్ పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోని ఆలూరులో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి ప్రభాకర్(39) ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన కొన్ని రోజులుగా కడుపునొప్పి తదితర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగానికి కూడా వెళ్లడం లేదు. ఆయన భార్య నవనీత తన పిల్లలతో సహా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నెల 23న ప్రభాకర్ భార్యాపిల్లలను చూసి మధ్యాహ్నం స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం ఉదయం పురుగు మందు సేవించి వచ్చి ఇంటి ఎదుట పడిపోవడంతో స్థానికులు గమనించి చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కండక్టర్ కుటుంబానికి రూ. 50 లక్షల సాయం అందించిన టీఎస్ఆర్టీసీ
హైదరాబాద్: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) అండగా నిలిచింది. కండక్టర్ అకాల మరణంతో విషాద చాయాలుఅలుముకున్న ఆ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ బొల్లం సత్తయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జగిత్యాల నుంచి వరంగల్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్లో వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మల్యాల-బలవంతాపూర్ స్టేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత కండక్టర్ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ నేపధ్యంలో యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు బాధిత కుటుంబానికి అక్కరకొచ్చింది. సిబ్బంది, ఉద్యోగుల సాలరీ అకౌంట్స్ను ఇటీవల యూబీఐకి మార్చింది టీఎస్ఆర్టీసీ యాజమాన్యం. ఆర్థిక ప్రయోజనాలతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో సంస్థలోని ఉద్యోగులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. ఈ ఖాతా, కార్డు ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉండటంతో ఉద్యోగులకు ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేతనం ప్రకారం) కనీసం రూ.40లక్షలు, రూపే కార్డు కింద మరో రూ.10లక్షలను యూబీఐ అందజేస్తోంది. ఈ మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల డిపో కండక్టర్ బొల్లం సత్తయ్య కుటుంబానికి రూ.50 లక్షల విలువైన 2 చెక్కులను యూబీఐ అధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మంగళవారం బస్భవన్లో అందజేశారు. రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించడంపై కండక్టర్ సత్తయ్య భార్య బొల్లం పుష్ఫతో పాటు కొడుకు ప్రవీణ్ కుమార్, కూతురు మాధవీలత సంతోషాన్ని వ్యక్తం చేశారు. చెక్కులను అందజేసిన అనంతరం సజ్జనర్ మాట్లాడుతూ.. తన తప్పు ఏమీ లేకపోయినా రోడ్డు ప్రమాదంలో సత్తయ్య అకాల మరణం చెందటం దురదృష్టకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికె తమ సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు గుర్తు చేశారు. కుటుంబపోషణలో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంస్థ అండగా నిలుస్తుందని, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక ప్రయోజనాలతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ గా ఉద్యోగుల ఖాతాలను యాజమాన్యం మార్చడం జరిగిందని చెప్పారు. సంస్థలోని ప్రతి ఉద్యోగి సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్కు ఖాతాను మార్చుకోవాలని సూచించారు. కొన్ని పథకాలు ఆపద సమయంలో అక్కరకు వస్తాయని, ఇందుకు ఇదే ఉదాహరణ అని, వాటిని వినియోగించుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని సూచించారు. ఈ అవకాశాన్ని కల్పించిన యూబీఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఈడీలు ఎస్.కృష్ణకాంత్, వినోద్ కుమార్, యూబీఐ జనరల్ మేనేజర్ పి.క్రిష్ణణ్, రీజినల్ హెడ్ డి.అపర్ణ రెడ్డి, డిప్యూటీ రీజినల్ హెడ్ జి.వి.మురళీ కృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మహిళలు టికెట్లు కొనరు..కండక్టర్లకు చిక్కులు
రాయచూరు రూరల్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఐదు గ్యారంటీ కార్డు పథకాల్లో భాగంగా కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనే వాగ్దానం కండక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మహిళలు టికెట్ తీసుకోకుండా కండక్టర్లతో గొడవలు పడుతున్న ఘటనలు రోజూ జరుగుతున్నాయి. కాగా చెకింగ్ సిబ్బంది కండక్టర్లనే బాధ్యులను చేస్తున్నారు. వివరాలు.. శుక్రవారం భాల్కి నుంచి బీదర్ మీదుగా హైదరాబాద్ వెళుతున్న బస్సును ఖానాపూర్ వద్ద అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో టికెట్ తనిఖీ అధికారులు ఓ మహిళ వద్ద టికెట్ లేకపోవడంపై కండక్టర్పై మండిపడ్డారు. ఆమెకు టికెట్ ఎందుకివ్వలేదని నిలదీశారు. ఉచిత రవాణా సదుపాయం అంటూ ప్రకటించిన నేపథ్యంలో తాను టికెట్ తీసుకోలేదని ప్రయాణికురాలు చెప్పినా అధికారులు కండక్టర్ను మందలించి క్రమశిక్షణ చర్యలకు పూనుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన కండక్టర్ రామకృష్ణ డ్యూటీ ముగిసిన అనంతరం బీదర్ డిపో ముందు తాడుతో ఉరి వేసుకునేందుకు యత్నించాడు. తోటి సిబ్బంది, ఉద్యోగులు గమనించి కండక్టర్ను రక్షించారు. -
ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్ భర్తపై దూసుకెళ్లి..
సాక్షి, నెల్లూరు జిల్లా: కావలి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ కండక్టర్ భర్తపై బస్సు దూసుకెళ్లింది. భార్య సుభాషిణిని గ్యారేజీలో వదిలి తిరిగి బైకుపై వెళ్తుండగా బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అక్కడికక్కడే సుబ్బారాయుడు మృతి చెందాడు. ఆర్టీసీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. చదవండి: హెల్త్ వర్కర్తో అనుచిత ప్రవర్తన.. ఒక్కసారిగా షాకైన మహిళ! -
మంటల్లో చిక్కుకున్న బస్సు..అదే టైంలో కండక్టర్ నిద్రిస్తుండటంతో..
బస్టాప్ వద్ద పార్క్ చేసి ఉన్న ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో బస్సులో కండక్టర్ నిద్రించగా, బస్టాప్లోని రెస్ట్రూంలో డ్రైవర్ నిద్రించడానికి వెళ్లాడు. దీంతో కండక్టర్ ఈ ప్రమాదం బారినపడి..తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బెంగుళూరులోని లింగధీరహల్లిలో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(బీఎంటీసీ) బస్టాండ్లో ఆగి ఉన్న బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. బీఎంటీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో..అదే సమయంలో ఆ బస్సులో కండక్టర్ నిద్రపోతున్నాడు. దీంతో అతను మంట్లో చిక్కుకుని..80 శాతం కాలిన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఐతే బస్సు డ్రైవర్(39) ప్రకాశ్ ఆ సమయంలో బస్టాప్లోని రెస్ట్ రూంలో నిద్రపోవడంతో అతను సురక్షితంగా ఉన్నాడు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆర్టీసీ డీసీపీ పేర్కొన్నారు. ఐతే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు అధికారులు. (చదవండి: భారతీయులు అలాంటివి అనుమతించరు! సమాచార మంత్రి ఫైర్) -
ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు..చివరకు..
బెంగళూరు: మనం ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు టికెట్ తీసుకుంటే కండక్టర్ ఒక్కోసారి చిల్లర లేదని చెబుతుంటాడు. కొన్నిసార్లు టికెట్ వెనకాల రాసి దిగేటపుడు తీసుకోమంటాడు. దీంతో కొంతమంది ఒక్క రూపాయి, రెండు రూపాయల చిల్లరను కండక్టర్కే వదిలేసి వెళ్తుంటారు. కానీ కర్ణాటకకు చెందిన ఒ వ్యక్తి మాత్రం ఇలా కాదు. తనకు రావాల్సిన ఒక్క రూపాయిని కూడా వదులుకోలేదు. దీని కోసం వినియోగదారుల కోర్టు వరకు వెళ్లి విజయం సాధించాడు. ఏం జరిగిందంటే? ఒక్క రూపాయి కోసం కోర్టు వరకు వెళ్లిన ఇతని పేరు రమేశ్ నాయక్. 2019లో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు కార్పోరేషన్(బీఎంటీసీ) బస్సు ఎక్కి శాంతి నగర్ నుంచి మజెస్టిక్ బస్ డిపో వరకు టికెట్ తీసుకున్నాడు. టికెట్ ధర. రూ.29. దీంతో కండక్టర్కు రూ.30 ఇచ్చాడు రమేశ్. మిగతా ఒక్క రూపాయి చిల్లర ఇవ్వమని అడిగాడు. ఇందుకు కండక్టర్ అతనిపై కోపపడ్డాడు. చిల్లర లేదు ఇవ్వనని గట్టిగా అరిచాడు. కండక్టర్ తీరు చూసి వాపోయిన రమేశ్.. బీఎంటీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు కూడా పట్టించుకోలేదు. అతనికి ఒక్క రూపాయి తిరిగి ఇవ్వలేదు. ఇక లాభం లేదని భావించిన రమేశ్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. రూ.15వేలు పరిహారంగా ఇప్పించాలని కోరాడు. ఈ విషయాన్ని పరిశీలించిన న్యాయస్థానం బీఎంటీసీకి షాక్ ఇచ్చింది. రమేశ్కు రూ.2,000 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. న్యాయప్రక్రియకు అయిన ఖర్చు కోసం మరో రూ.1,000 అదనంగా చెల్లించాలని చెప్పింది. 45 రోజుల్లోగా పరిహారం అందజేయాలని పేర్కొంది. ఒకవేళ చెప్పిన తేదీలోగా పరిహారం ఇవ్వకపోతే ఏటా రూ.6,000 వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. విషయం రూపాయి గురించే కాదు.. అయితే ఈ వ్యవహారంలో బీఎంటీసీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇది బస్సుల్లో రోజూ జరిగే సాధారణ విషయమేమని, సేవల్లో ఎలాంటి లోపం లేదని వాదించింది. రమేశ్ పిటిషన్ను కొట్టివేయాలని కోరింది. న్యాయస్థానం మాత్రం వీరి వాదనను తోసిపుచ్చింది. ఇది ఒక్క రూపాయి చిల్లర విషయం గురించి మాత్రమే కాదని, వినియోగదారుడి హక్కు అంశమని స్పష్టం చేసింది. కండక్టర్ ప్రవర్తించిన తీరును తప్పుబట్టింది. పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. చదవండి: గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 70 చోట్ల ఎన్ఐఏ దాడులు.. -
వైరల్ వీడియో: మద్యం తాగి బస్సు ఎక్కిన వ్యక్తి.. కిందకు తోసేసిన బస్సు కండక్టర్
-
కండక్టర్ను వదిలేసి బస్సు రయ్
కర్ణాటక : కండక్టర్ను డ్రైవరు మరచిపోయి బస్సుతో బయల్దేరాడు. కొన్ని కిలోమీటర్లు వెళ్లాక సంగతిని తెలుసుకుని బస్సును నిలిపాడు. ఈ సంఘటన కొప్పళ జిల్లా బస్టాండులో చోటుచేసుకుంది. బస్సు కెఎ–37,ఎఫ్–0678, కొప్పళ బస్టాండ్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరింది. దాదాపు 5 కి.మీ ప్రయాణించిన తరువాత ఓజనహళ్లి వద్దకు చేరుకోగా ప్రయాణికులు టికెట్ కోసం కండక్టర్ ఏడీ అని వెతకసాగారు. అప్పుడు బస్సు డ్రైవర్కు అర్థమైంది. వెంటనే అక్కడే బస్సును ఆపివేసి కండక్టర్కు కాల్ చేశారు. మీ వల్ల ఆలస్యమైందని ప్రయాణికులు డ్రైవర్కు చీవాట్లు పెట్టారు. కండక్టర్ బస్సు ఎక్కకపోతే నేనేం చేయాలని డ్రైవర్ వాపోయాడు. కండక్టర్ మరో బస్సులో అక్కడికి చేరుకుని టికెట్లు కొట్టడంతో అంతా సద్దుమణిగింది. -
బస్లో టిక్కెట్ గొడవ.. కండక్టర్ మృతి
సాక్షి, చెన్నై: టిక్కెట్ తీసుకోమన్న కండక్టర్ను ఓ మందుబాబు కొట్టి చంపేశాడు. మధురాంతకం సమీపంలో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాలు.. కోయంబేడు నుంచి విల్లుపురానికి ప్రభుత్వ బస్సు ఉదయం బయలుదేరింది. ఇందులో కళ్లకు రిచ్చికి చెందిన పెరుమాల్(56) కండక్టర్గా ఉన్నారు. మధురాంతకం బైపాస్లో ఓ యువకుడు బస్సులోకి ఎక్కాడు. టిక్కెట్టు తీసుకోవాలని కండక్టర్ ఆ యువకుడికి సూచించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు తననే టిక్కెట్టు అడుగుతావా...? అంటూ కండక్టర్పై దాడి చేశాడు. ఇతర ప్రయాణికులు అడ్డుకుని.. మార్గం మధ్యలోని అయ్యనార్ ఆలయం వద్ద ఆ యువకుడిని కిందికి దింపేశారు. కాసేపటికే..మృతి బస్సు కొంత దూరం వెళ్లగానే కండెక్టర్ స్పృహ తప్పాడు. దీనిని గుర్తించిన డ్రైవర్, ఇతర ప్రయాణికులు మేల్ మరువత్తూరు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కండెక్టర్ మరణించినట్లు వైద్యులు తేల్చారు. ఆయన ఛాతిపై ఆ మందుబాబు బలంగా కొట్టడం వల్లే మరణించి ఉంటాడని నిర్ధారించారు. మేల్ మరువత్తూరు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు సమీప గ్రామానికి చెందిన మురుగన్(35)గా గుర్తించి అరెస్టు చేశారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెరుమాల్ కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. చదవండి: వాట్ ఏ స్కెచ్: ప్రేమోన్మాది యాసిడ్ దాడి.. రెండువారాల తర్వాత సన్యాసి గెటప్లో.. -
ఇంటి నుంచి వెళ్లిపోయిన నలుగురు ఆడపిల్లలు.. కారణం తెలిసి అవాక్కయిన తల్లిదండ్రులు
సాక్షి, బళ్లారి: పబ్జీలు, రియాలటీషోలతో ప్రభావితమైన నలుగురు చిన్నారులు ఏదైనా సాధించాలనే తపనతో ఉన్నఫళంగా ఇళ్లు వదిలారు. బస్సు ఎక్కి బెంగళూరు చేరుకోగా డ్రైవర్, కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి వారిని సురక్షితంగా పోలీసులకు అప్పగించారు. వివరాలు.. బళ్లారిలోని పార్వతీనగర్లో నివాసం ఉంటున్న రెండు కుటుంబాలకు చెందిన దాదాపు పదేళ్ల వయసున్న ఆడపిల్లలు నలుగురు గతనెల 26న మధ్యాహ్నం ఇళ్లు వదిలారు. ఏదైనా సాధించేందుకు వెళ్తున్నామని, అంతవరకు తాము ఎక్కడున్నా పట్టించుకోవద్దని సెల్ఫోన్లో రికార్డు చేశారు. బళ్లారిలోని కొత్త బస్టాండుకు వెళ్లి బెంగళూరు బస్సు ఎక్కారు. వారి వెంట పెద్దలు లేకపోవడంతో డ్రైవర్, కండక్టర్ ఆరా తీశారు. కుటుంబ సభ్యుల వద్దకు వెళ్తున్నట్లు నమ్మబలికారు. అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో బెంగళూరులో బస్సు దిగకుండా భయం భయంగా దిక్కులు చూస్తుండటంతో డ్రైవర్, కండక్టర్కు అనుమానం వచ్చి ఉప్పారపేటె పోలీసు స్టేషన్లో అప్పగించారు. మరో వైపు తమ పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు గాలింపు చేపట్టారు. ఉప్పారపేటె పోలీసు స్టేషన్లో చిన్నారులు ఉన్న విషయం సామాజిక మాధ్యమాల్లో రావడంతో తల్లిదండ్రులు వెళ్లి బళ్లారికి తీసుకొని వచ్చారు. బస్సు డ్రైవర్ రవికుమార్, కండక్టర్ నవాజ్కు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: Divya Hagaragi Arrested: దివ్య మొబైల్ ముక్కలు! -
బస్సులో చిల్లర అడిగితే జైలుశిక్ష..
సాక్షి,శివాజీనగర(కర్ణాటక): బస్సుల్లో చిల్లర డబ్బు కోసం కండక్టర్ను ప్రయాణికులు అడగడం, కొన్నిసార్లు గొడవ జరగడం అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో కూడా ఈ ఉదంతాలు నవ్విస్తాయి. చిల్లర ఇవ్వాల్సిందేనని ప్రయాణికులు కండక్టర్లపై ఒత్తిడి తెస్తుండడాన్ని అరికట్టడానికి వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ వివాదాస్పద పోస్టర్లను బస్టాండ్లలో అతికించింది. సంస్థ ఏకపక్ష ధోరణిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆ పోస్టర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంతకీ పోస్టర్లో ఏముందంటే.. బస్సుల్లో చిల్లర అడగడం ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడమే అవుతుంది. నేరం రుజువైతే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది అని పోస్టర్లో హెచ్చరిక ఉంది. చిల్లర అడిగితే జైలుకు పంపుతారా, ఇదెక్కడి చోద్యం అని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. -
బస్సులో యువకుల హంగామా.. మాస్క్లేకుండా.. ఉమ్ముతూ..
బెంగళూరు: దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, వైరస్ ఉధృతి మాత్రం ఇంకా తగ్గలేదు. అందుకే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను ఎత్తివేసిన, కొవిడ్ ఆంక్షలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. కాగా, చాలా చోట్ల.. ప్రజలు కరోనా నిబంధనలను అతిక్రమిస్తున్న సంఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను మాస్క్ పెట్టుకొమ్మని అడిగినందుకు కండక్టర్ను చితకబాదారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచోసుకుంది. కెఎస్ఆర్టీసీకి చెందిన బస్సు గత గురువారం బెంగళూరు-హైద్రాబాద్ మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో చదాలపూర్ గేట్ వద్ద ఇద్దరు యువకులు బస్సు ఎక్కారు. వీరిద్దరు మాస్క్ను పెట్టుకోలేదు. పైగా బస్సులో ఎక్కడంటే అక్కడ ఉమ్మివేయసాగారు. దీంతో తోటి ప్రయాణికులు కండక్టర్ను పిలిచి చెప్పారు. దీంతో కండక్టర్ వారిని మాస్క్ ధరించమని చెప్పాడు. ఈ క్రమంలో ఆ యువకులిద్దరు కండక్టర్తో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా.. ఇష్టం వచ్చినట్టు దూషించి, దాడికి కూడా తెగబడ్డారు. కాసేపు బస్సులో నానా హంగామా సృష్టించారు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఆ యువకులిద్దరిని పట్టుకుని, దేహశుద్ధి చేసి బస్సును నేరుగా చిక్కబల్లాపూర్లోని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితులలో ఒకరిని కుప్పహల్లి గ్రామానికి చెందిన చిరంజీవిగా గుర్తించారు. మరో యువకుడు తప్పించుకున్నాడు. అయితే, నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన కండక్టర్ కృష్ణయ్యను చిక్కబల్లాపూర్లోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా, కేసును నమోదు చేసుకున్న పోలీసులు మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. -
డిపో ఎదుట ఓ కండక్టర్ ఆవేదన
పరిగి: ఉద్యోగంలోకి తీసుకోకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఓ కండక్టర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈమేరకు డిపో ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు.. పరిగి ఆర్టీసీ బస్ డిపోలో మాణిక్నాయక్ కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో గతేడాది ఆయన విధుల్లో ఉన్న బస్సులో టీసీలు తనిఖీలు చేసి అతడిపై అభియోగం మోపారు. ఓ ప్రయాణికురాలి వద్ద టికెట్ మిస్ కావటంతో కండక్టర్, డ్రైవర్ను సస్పెండ్ చేశారు. ఇందులో కండక్టర్ టికెట్ ఇచ్చినప్పటికీ తానే పోగొట్టుకున్నానని ప్రయాణికురాలు లిఖితపూర్వకంగా రాసిచ్చింది. అనంతరం కొద్ది నెలలకు డ్రైవర్ను మాత్రమే విధుల్లోకి తీసుకున్నారు. ఇటీవల మాణిక్నాయక్ భార్య అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలైంది. ఏడాదిగా వేతనం లేకపోవటం, భార్య అనారోగ్యానికి గురవడంతో కుటుంబం గడవటం కష్టంగా మారింది. ఈక్రమంలో బుధవారం ఆయన పరిగి డిపో ఎదుట బైఠాయించాడు. తనను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేశాడు. ఈ విషయమై పరిగి డీఎం సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా.. మాణిక్నాయక్పై సస్పెన్షన్ ఎత్తివేయటానికి ఉన్నతాధికారుల నుంచి ఆర్డర్ రావాల్సి ఉందన్నారు. ఆయన సస్పెన్షన్లో ఉన్నందున సగం వేతనం వచ్చేలా అకౌంటెంట్తో మాట్లాడతానని స్పష్టం చేశారు. -
విధుల్లో ఆర్టీసీ కండక్టర్లు
రాజంపేట: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని శాఖల సేవలను వినియోగించుకుంటోంది.ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో కండక్టర్లను వినియోగించుకుంటోంది. 560 మందిని వారి సొంత ప్రాంతాల్లోని పోలీసుశాఖకు అటాచ్ చేశారు. శుక్రవారం రాజంపేట డిపో పరిధిలోని నందలూరుకు చెందిన 13 మంది కండక్టర్లను స్థానిక పోలీసుస్టేషన్కు అటాచ్ చేశారు. వీరికి స్ధానిక ఎస్ఐ ప్రసాద్రెడ్డి కరోనా కట్టడికి సంబంధించిన విధులు, ప్రాంతాలను కేటాయించారు. జిల్లాలో డిపోల వారీగా.. జిల్లాలో డిపోల వారీగా రాజంపేటలో 90, కడప 90, ప్రొద్దుటూరు 100,రాయచోటి 100, జమ్మలమడుగు 70,పులివెందుల 60,మైదుకూరు 50 మంది కండక్టర్లను కరోనా వైరస్ నివారణ బాధ్యతలను అప్పగించారు. ఈ విషయంపై ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ జీవీనరసయ్య ‘సాక్షి’మాట్లాడుతూ కరోనా కట్టడికి చర్యలు చేపట్టే అవకాశం ప్రభుత్వం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. -
మహిళతో బస్సు కండక్టర్ అసభ్య ప్రవర్తన!
బెంగుళూరు: బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ పట్ల కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టపగలే మహిళ చెయ్యి పట్టుకుని వికృతంగా ప్రవర్తించిన ఘటన కర్ణాటక రోడ్డు రవాణ సంస్థ(కేఎస్ఆర్టీసీ) బస్సులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని పుత్తూరు డిపోలో కండక్టర్గా విధులు నిర్వహించే ఓ ప్రబుద్ధుడు ప్రయాణికురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పుత్తూరు నుంచి హసన్కు బస్సులో ఓ మహిళ ప్రయాణిస్తోంది. మధ్యాహ్న సమయం కావడం.. బస్సులో ఎవరూ లేకపోవడంతో కండక్టర్ ప్రయాణికురాలిని లైంగికంగా వేధించాడు. ఈ క్రమంలోనే ఆమె పక్క సీట్లోకి వెళ్లి మెల్లగా మాటలు కలిపాడు. తర్వాత చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. సదరు మహిళ కండక్టర్ను వారించే ప్రయత్నం చేసిన ఈ ప్రబుద్ధుడు పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకొని సదరు మహిళ అతగాడు చేస్తున్న వికృత చేష్టలను తన మొబైల్ ఫోన్లో బంధించింది. బస్సు హసన్కు చేరుకోగానే బస్సు దిగిన ఆ మహిళ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పాటు కేఎస్ఆర్టీసీ అధికారులకు పంపించింది. వెంటనే ఈ ఘటనపై సంస్థ యాజమాన్యం స్పందించి దీనిపై దర్యాప్తుకు ఆదేశించింది. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాత్యాలు ఇప్పటిదాకా క్యాబ్లు, ఆటోలకే పరిమితం కాగా.. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో అది కూడా బస్సు కండక్టర్ ఈ దారుణానికి పాల్పడటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా కండక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఈ కండక్టర్.. కాబోయే కలెక్టర్?
తీరిక లేకుండా కండక్టర్ ఉద్యోగం. పెద్ద పెద్ద అకాడమీల్లో శిక్షణ పొందలేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు ఉన్న వనరులతోనే సివిల్స్ వైపు సాగిపోతున్నాడో యువ కండక్టర్. దూరవిద్యలో డిగ్రీ, పీజీలు చేసి సివిల్స్ పరీక్షల్లో మెయిన్స్ను అధిగమించాడు. కర్ణాటక, యశవంతపుర: పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చని నిరూపించే పనిలో ఉన్నారు బస్సు కండక్టర్ ఒకరు. మండ్య జిల్లా మళవళ్లికి చెందిన ఎన్సీ మధు బెంగళూరులోని కొత్తనూరు 34వ బీఎంటీసీ డిపోలో కండక్టర్గా పని చేస్తున్నాడు. తన 19 ఏటనే కండక్టర్ కొలువు సాధించాడు. చదువు అంటే ఎంతో ఇష్టం కావడంతో మధు ఐఏఎస్ కావాలని కలగన్నాడు. అందుకోసం దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీని పూర్తి చేశాడు. 2014లో కేఎఎస్, 2018, 2019లో యుపీఎస్సీ పరీక్షలను రాశాడు. 2019లో కన్నడ మాధ్యమంలో సివిల్స్ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. రాజనీతి శాస్త్రం, జనరల్ స్టడీస్ను ఎంపిక చేసుకొని రాసిన మెయిన్స్ పరీక్షల్లో పాసై ఇంటర్వ్యూకు ఎంపిక కావడం విశేషం. మార్చి 25న ఢిల్లీలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇంటర్వ్యూలో పాసైతే కలెక్టర్ లేదా ఎస్పీ ఏదైనా సాధించినట్లే. రెండుసార్లు పరాజయం 2014లో కేఎఎస్ పరీక్ష , 2018లో సివిల్స్ రాసినా ఫలితం లేదు. నిరుత్సాహం పడకుండా ఈసారి సాధించాలనే పట్టుదలతో యూ ట్యూబ్లో సివిల్స్ పరీక్షల మెళకువలు నేర్చుకున్నాడు. తన మొబైల్ ఫోన్లో యూ ట్యూబ్ ద్వారా కోచింగ్ తీసుకుంటూ సన్నద్ధమయ్యాడు. 2019లో యుపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ రాసి సత్తా చాటాడు. రోజూ 5 గంటలు వీడియోలతో కోచింగ్ తాను ఎక్కడా కోచింగ్కు వెళ్లలేదని, రోజు ఐదు గంటల పాటు యూ ట్యూబ్లోలో కోచింగ్ తరగతులను చూస్తూ పరీక్షకు సిద్ధమైనట్లు మధు చెబుతున్నాడు. తనకు యూ ట్యూబే మార్గదర్శనమని చెప్పాడు. ఇప్పుడు ఇంటర్వ్యూపై దృష్టి పెట్టినట్లు తెలిపాడు. -
రూపాయి కోసం ముష్టియుద్ధం
కర్ణాటక ,తుమకూరు: ఒక్క రూపాయి కోసం రక్తం చిందింది. ఎవరో ఒకరు సర్దుకునిపోయి ఉంటే సరిపోయేదానికి బాహాబాహీ తలపడడంతో అందరూ విస్తుపోయారు. రూపాయి చిల్లర విషయమై కండక్టర్–ప్రయాణికుని మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన మధుగిరి తాలూకా చిక్కపాలనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం మధుగిరి నుంచి బెంగళూరుకు బయలుదేరిన కేఎస్ఆర్టీసీ బస్సులో నాగేనహళ్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాదనాయకనహళ్లికి వెళ్లడానికి టికెట్ తీసుకున్నాడు. తన స్టాప్ సమీపిస్తుండడంతో తనకు ఇవ్వాల్సిన ఒక్క రూపాయి చిల్లర ఇవ్వాలంటూ ప్రయాణికుడు కంబయ్య కండక్టర్ అజ్జప్పను అడిగాడు. అయితే తన వద్ద చిల్లర లేదని కండక్టర్ బదులివ్వడంతో ఇదే విషయమై ప్రయానికుడు, కండక్టర్తో వాగ్వాదానికి దిగాడు. ప్రయాణికుడికి రక్తగాయాలైన దృశ్యం టికెట్ మిషన్తో కండక్టర్ వీరంగం : ఇది శృతి మించడంతో కంబయ్య, అజ్జప్ప ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో కండక్టర్ అజ్జప్ప టికెట్ మిషన్తో కంబయ్యపై దాడి చేయడంతో కంబయ్యకు గాయాలయ్యాయి. గమనించిన ప్రయాణికులు ఇరువురిని విడిపించి కండక్టర్ అజ్జప్పపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మధుగిరి పోలీసులు కంబయ్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రూపాయి ఇవ్వకుండా రక్తం వచ్చేలా కొట్టిన కండక్టర్ దురుసుతనంపై ప్రయాణికులు మండిపడ్డారు. ఈ గొడవ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
ఆర్టీసీ సమ్మె : కత్తెర పట్టిన కండక్టర్
నిర్మల్ అర్బన్: ఓ ఆర్టీసీ కండక్టర్ కత్తెర పట్టాడు. ఆర్టీసీ సమ్మె కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబ పోషణ నిమిత్తం కులవృత్తిని చేపట్టాడు. నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లీకి చెందిన మహిపాల్ గతంలో సెలూన్ నిర్వహించేవాడు. 2009లో ఆర్టీసీ కండక్టర్గా విధుల్లో చేరాడు. అప్పటి నుంచి కులవృత్తిని వదిలేశాడు. నిర్మల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వచ్చే జీతంలో ఇంటి కిస్తీలు చెల్లిస్తూ.. పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు. అప్పటికే నెల జీతం రావాల్సి ఉంది. సమ్మె కారణంగా మరో నెల జీతం రాకుండా పోయింది. రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఏం చేయాలో పాలుపోక కులవృత్తి అయిన.. తనకు వచ్చిన పనిని చేపడుతున్నాడు. సమస్యల పరిష్కారం కోసం అటు సమ్మెలో పాల్గొంటూ.. కుటుంబ పోషణ కోసం కులవృత్తిని చేపడుతున్నాడు. -
కండక్టర్ అంత్యక్రియల్లో పోలీసుల అత్యుత్సాహం
సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలోని ఆత్మకూరులో ఆర్టీసీ కండక్టర్ రవీందర్ అంతిమయాత్రలో గందరగోళం చోటుచేసుకుంది. అంతిమయాత్రను త్వరగా ముగించాలని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. కుటుంబ సభ్యులు, అంతిమయాత్రలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన పోలీసు కమిషనర్ మధు ఆర్టీసీ కార్మికులపై చేయి చేకున్నారు. పోలీసుల తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పోలీసులు తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతిమయాత్రను ఆపి.. రవీందర్ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ కండక్టర్ రవీందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు భారీ కాన్వాయ్తో రవీందర్ మృతదేహాన్ని ఆయన స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరుకు తరలించారు. రవీందర్కు భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవీందర్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 29వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. చదవండి: ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె -
డోర్ మూయకుంటే డ్రైవర్, కండక్టర్పై చర్యలు
తమిళనాడు, తిరువొత్తియూరు: ప్రయాణిస్తున్న బస్సు తలుపులు మూయకుంటే డ్రైవర్, కండక్టర్లపై చర్యలు తీసుకుంటామని రవాణశాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ తరపున నిత్యం 19 వేల బస్సులు నడుస్తున్నాయి. ఇందులో చెన్నై, కోవై, మదురై, తిరుచ్చి నగరాలకు వెళ్లే బస్సుల్లో రద్దీ ఉంటుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులు, ప్రజలు ఫుట్బోర్డుపై వేలాడుతున్నట్టు ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బస్సు తలుపులను మూయడానికి వీలు పడడం లేదు. తద్వారా పెద్ద ప్రమాదం జరుగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బస్సు ఫుట్రోడ్డుపై నుంచి కింద పడిన కొన్ని సంఘటనలు ఉన్నాయని, ఈ ప్రమాదాలను నివారించటానికి తప్పనిసరిగా డ్రైవర్లు బస్సు ప్రయాణిస్తున్న సమయంలో డోర్లు మూసి ఉంచాలని లేని పక్షంలో బస్సు డ్రైవర్, కండక్టర్లకు నోటీసులు పంపించి చర్యలు తీసుకుంటామని రవాణ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. -
కండక్టర్ నగదు బ్యాగ్తో ఉడాయించిన యువకుడు
కర్ణాటక ,బొమ్మనహళ్లి : ప్రయాణికుడిలా బస్సులోకి వెళ్లి కండక్టర్ నగ దు బ్యాగ్తో ఉడాయిస్తున్న ఓ వ్యక్తిని స్థానికుల సహాయంతో కండక్టర్ పట్టుకుని చితకబాదిన ఘటన సోమవారం కేఎస్ఆర్టీసీ బస్టాండు వద్ద చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఆనేకల్ నుంచి బెంగళూరు నగరానికి వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు మహిళా కండక్టర్, ఎంట్రీ కోసం తన నగదు బ్యాగ్ను సీట్పై ఉంచి డిపోలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువకుడు బస్సులోకి ప్రవేశించి బ్యాగ్ తీసుకుని పారిపోతుండగా గుర్తించిన కండక్టర్ గట్టిగా అరవడంతో స్థానికులు గుర్తించి దుండగుడిని పట్టుకుని చితకబాది నగదు బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. -
‘ఓడి’పోవాల్సిదే!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీలో ఓడీల(అదర్ డ్యూటీస్) దందా జోరుగా సాగుతోంది.సాధారణంగా దీర్ఘకాలిక అనారోగ్యంతోబాధపడుతున్న కండక్టర్, డ్రైవర్లకు రన్నింగ్ డ్యూటీ నుంచి కొంతకాలం మినహాయింపు ఇచ్చేందుకు ‘ఇతర విధుల’కు బదిలీ చేస్తారు. కేవలం ఎండీ స్థాయిలో మాత్రమే జరగాల్సినఓడీ (అదర్ డ్యూటీ).. ఇటీవలఎండీ అనుమతులు లేకుండానే డిపో మేనేజర్లు, రీజనల్ మేనేజర్ల స్థాయిలో ఎడాపెడా జరిగిపోతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓడీ బదిలీ పొందిన వారు ఆరు నెలల్లో తిరిగి తమ పూర్వ విధుల్లో చేరాల్సి ఉండగా.. చాలా మంది ఓడీ విధుల పునరుద్ధరణ లేకుండానే ఏళ్ల తరబడి అదే ఓడీ పైనే కొనసాగుతున్నారు. దీంతో ప్రతి డిపోలో సీనియర్ల పదోన్నతులకు గండి పడుతోంది. ఏళ్ల తరబడి కండక్టర్లు, డ్రైవర్లుగా పనిచేసిన వారు ఎలాంటి పదోన్నతి లేకుండానే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తోందని కొన్ని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓడీ నిబంధనలు ఇవీ.. సాధారణంగా ధీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఓడీ ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కూడా వారు అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే ఎండీ మరికొంత కాలం పాటు పొడిగిస్తారు. అనారోగ్యంతో బస్సులు నడపలేని డ్రైవర్లు, టికెట్లు ఇవ్వలేని కండక్టర్లకు ఈ అవకాశం కల్పిస్తారు. ఓడీ బదిలీ పొందిన వారు డిపోల్లో, బస్టేషన్లలోను, బస్టాపుల్లో కంట్రోలర్లు, పాయింట్మెన్గా సాధారణ విధుల్లో కొనసాగుతారు. కొందరు క్లర్క్లుగా పనిచేస్తారు. డిపో మేనేజర్లు తమ అవసరాలకు అనుగుణంగా ఇతరత్రా విధులను కూడా వీరికి అప్పగిస్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారితో పాటు, ప్రతి డిపోలో ఒకరిద్దరు సీనియర్లకు ‘నాన్ మెడికల్’ కేటగిరీ కింద ఓడీ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఎలాంటి ఓడీ అయినా పొందాలంటే మాత్రం ఎండీ అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ ఇక్కడ అవేమీ పట్టించుకోకుండా కిందిస్థాయిలోనే ఓడీలు ఇచ్చేస్తున్నారు. అర్హత ఉన్నా సున్నే.. ఏకపక్షంగా జరుగుతున్న ఈ వ్యవహారంలో ప్రధాన కార్మిక సంఘాలకు చెందిన కొందరు నాయకులే అడ్డగోలు బదిలీల కోసం అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. మెడికల్, నాన్ మెడికల్ కేటగిరీల్లో తమకు నచ్చిన వారికి ఓడీ ఇచ్చేవిధంగా ఒత్తిడి తెస్తున్నారు. దీంతో నిజంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓడీ కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశం లభించడం లేదు. గుండె జబ్బులు, వెన్నునొప్పి, పక్షవాతం వంటి రోగాలతో బాధపడుతున్న వారికి వైద్యుల సూచన మేరకు ఓడీ ఇవ్వాలి. ఇలాంటి ఉద్యోగులు నెలల తరబడి అధికారులు చుట్టూ తిరుగుతుండగా, కేవలం కార్మిక సంఘాలు సూచించిన వారికి మాత్రమే క్షణాల్లో ఓడీలు ఇచ్చేస్తున్నారని, అర్హత ఉన్నవారికి మాత్రం అన్యాయం జరుగుతోందని వివిధ డిపోలకు చెందిన సీనియర్ డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘20 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి ఎలాంటి పదోన్నతులు లేవు. కేవలం డ్రైవర్, కండక్టర్గానే ఉన్నారు. చివరకు అలాగే ఉద్యోగ విరమణ చేస్తున్నారు. కానీ అధికారుల ప్రాపకంతో, కార్మిక సంఘాల మద్ధతు ఉన్నవారికి ఎలాంటి సీనియారిటీ లేకున్నా, అనారోగ్యం లేకపోయినా ఓడీ ఇచ్చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం’ అని కుషాయిగూడ డిపోకు చెందిన ఓ డ్రైవర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆ డిపోలో పనిచేస్తున్న ఓ జూనియర్ మహిళా కండక్టర్కు ఈసీఐఎల్ బస్స్టేషన్లో పాయింట్ డ్యూటీ అప్పగించడంపట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క కుషాయిగూడలోనే కాకుండా నగరంలోని 29 డిపోల్లోనూ ఓడీల్లో నిబంధనలు పాటించడం లేదని కండక్టర్లు, డ్రైవర్లు చెబుతున్నారు. కార్మిక నేతలు కాకున్నా ‘రిలీఫ్’ ప్రతి డిపోలో కార్మిక సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు ‘రిలీఫ్’నిస్తారు. కార్మికుల సమస్యల కోసం, సంఘాల అవసరాల కోసం ఇలా వారు చేసే విధుల నుంచి రిలీఫ్ను పొందడం కార్మిక సంఘాల హక్కుల్లో భాగమే. కానీ కార్మిక సంఘాల నాయకత్వంలో లేనివారు కూడా ఆయా సంఘాల ప్రతినిధులుగా కొనసాగుతూ విధులకు గైర్హాజరుగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి డిపోలో కనీసం 20 మంది కండక్టర్లు, డ్రైవర్లు ఇలా విధులకు డుమ్మా కొడుతున్నట్టు సమాచారం. స్తంభిస్తున్న సర్వీసులు అసలే సిబ్బంది కొరతతో నగరంలో ప్రతిరోజు వేల కొద్దీ ట్రిప్పులు నిలిచిపోతున్నాయి. ఇక ఇలాంటి సంస్థాగతమైన లోపాలు అందుకు మరింత కారణమవుతున్నాయి. ప్రతి డిపోలో పెద్ద సంఖ్యలో సర్వీసులు నిలిచిపోవడంతో సాయంత్రం సెకండ్ షిఫ్టు ట్రిప్పులకు బ్రేక్ పడుతోంది. దీంతో ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో తెలియని బస్సుల కోసం లక్షలాది మంది ప్రయాణికులు బస్టాపుల్లో పడిగాపులు కాస్తున్నారు. పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి ప్రయాణికుల నిరాదరణ, మెట్రో రైలు రాక మరిన్ని నష్టాలను తెచ్చిపెడుతోంది. దీనికి ఓడీ దందా మరింత తోడవుతోంది.