congratulates
-
తెలంగాణలో నూతన MLCలకు ప్రధాని మోదీ అభినందనలు
-
టీమిండియాకు వైఎస్ జగన్ అభినందనలు
-
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు
-
ఇస్రో శాస్త్రవేత్తలకు YS జగన్ అభినందనలు
-
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు వైఎస్ జగన్ అభినందనలు
-
ఇస్రో సైంటిస్టులకు అభినందనలు తెలిపిన వైఎస్ జగన్
-
కోనేరు హంపికి వైఎస్ జగన్ అభినందనలు
-
ఏపీ గర్వపడేలా చేశారు.. క్రికెటర్ నితీష్కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: క్రికెటర్ నితీష్ కుమార్రెడ్డి(Nitish Kumar Reddy)కి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మెల్బోర్న్(Melbourne)లో చిన్నవయసులోనే సెంచరీ సాధించిన నితీష్కు అభినందనలు. 21 సంవత్సరాల వయసులోనే ఈఘనత సాధించటం విశేషం. ప్రపంచ స్థాయి ఆస్ట్రేలియన్ జట్టు మీద నితీష్ అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. నితీష్ సాధించిన విజయం దేశం మొత్తానికి గర్వకారణం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గర్వపడేలా చేశారు. నితీష్ విజయం ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తి దాయకం. నితీష్ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత క్రికెటర్, ఆంధ్రా ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీతో మెరిశారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరొ వైపు, వాషింగ్టన్ సుందర్ తో కలిసి రికార్డు నెలకొల్పడం విశేషం. ఇదీ చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు -
మీకు హ్యాట్సాఫ్: పారాలింపియన్స్కు జగన్ శుభాకాంక్షలు
గుంటూరు, సాక్షి: పారిస్ పారాలింపిక్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ ఈసారి రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించింది. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.‘‘పారాలింపియన్ల అంకితభావం, ప్రతిభ నిజంగా గొప్పది. అంతేకాదు.. స్ఫూర్తిదాయకం కూడా. పతక విజేతలతో పాటు పారాలింపిక్స్లో భారత్ తరఫున పాల్గొన్న అందరికీ అభినందనలు. మీకు హ్యాట్సాఫ్.. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది’’ అని జగన్ ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారు.The dedication and talent of Paralympians are truly remarkable and inspirational. Congratulations and hats off to all the participants and medal winners! The nation is proud of you.#Paralympics2024— YS Jagan Mohan Reddy (@ysjagan) September 9, 2024పారిస్ వేదికగా ఆగస్టు 28న మొదలైన పారాలింపిక్స్ సెప్టెంబర్ 8వ తేదీతో ముగిశాయి. మొత్తం 84 మంది అథ్లెట్లు.. అంచనాలను మించి అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఓవరాల్గా ఏడు స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో 18వ స్థానంలో నిలిచింది. ఫలితంగా.. భారత్ రికార్డు స్థాయిలో తొలిసారి పారాలింపిక్స్ చరిత్రలోనే అత్యధిక పతకాలు సాధించింది. -
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. EOS-08 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని విజయవంతంగా ప్రయోగించటంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనలో ఈ విజయం ప్రపంచ వేదికపై నిలిపిందని ఆయన పేర్కొన్నారు.శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం(ఆగస్టు16) స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ డీ3)ని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు.ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–08)తో పాటు ఎస్ఆర్–0 డెమోశాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను 475 కిలోమీటర్లు ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్లో రాకెట్ విజయవంతంగా ప్రవేశపెట్టింది. రక్షణ రంగంతో పాటు విపత్తు నిర్వహణ, ఇతర రంగాలకు ఈ ఉపగ్రహాల సేవలు ఏడాదిపాటు అందనున్నాయి. -
నీరజ్ చోప్రాకు వైఎస్ జగన్ అభినందనలు
-
ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం.. మను బాకర్కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: పారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం అందించిన మను బాకర్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ‘‘ఒలింపిక్స్లో షూటింగ్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. యావత్ భారతదేశాన్ని గర్వపడేలా చేశారు’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.పారిస్ ఒలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుబాకర్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో మనూ 221.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలువగా.. సౌత్ కొరియాకు చెందిన ఓ (243.2), కిమ్ (241.3) మొదటి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. భారత్ తరఫున షూటింగ్లో పతకం సాధించిన తొలి మహిళగా మనూ చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల మనూ హర్యానాకు చెందిన యువతి. మనూ తండ్రి మెరైన్ ఇంజనీర్ కాగా.. తల్లి ప్రిన్సిపల్. మనూ.. 2018 కామన్వెల్త్ క్రీడల్లో 16 ఏళ్ల వయసులోనే స్వర్ణ పతకం సాధించింది. మనూ అర్జున అవార్డు గ్రహీత. My best wishes and congratulations to @realmanubhaker on creating history as the first Indian woman to win a medal in shooting at the Olympics. You have made me and all of India very proud!#Olympics2024Paris pic.twitter.com/tu8YK1Afpd— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2024 -
భారత టీ-20 జట్టులోకి ఏపీ కుర్రాడు నితీశ్... వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత టీ–20 జట్టులోకి ఆంధ్ర నుంచి ఎంపికయిన మొదటి ఆటగాడు నితీశ్ కుమార్రెడ్డికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆల్రౌండర్గా రాణిస్తున్న నితీశ్.. భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడంపై హర్షం వ్యక్తం చేశారు. జింబాబ్వే టూర్లో నితీశ్ మంచి ప్రతిభ చూపాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్.. కెరీర్లో మరింత ఎదగాలని తెలిపారు.కాగా, ఇటీవల ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్న విశాఖకు చెందిన నితీశ్కుమార్రెడ్డి భారత టీ-20 జట్టులోకి ఎంపికయ్యారు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే ఐపీఎల్లో స్థానం సంపాదించి సన్రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. జూలై 2024లో జరగబోయే జింబాబ్వే పర్యటన కోసం నితీశ్ భారత టీ–20 జట్టుకు ఎంపికయ్యారు. -
పెమ్మసాని మంత్రి పదవి? గల్లా అభినందనలు
సాక్షి, ఢిల్లీ: పెమ్మసానికి కేంద్ర సహాయ మంత్రి పదవి ఖరారు కావడంతో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అభినందనలు తెలిపారు. రాజకీయ మొదటి అడుగులోనే కేంద్ర మంత్రి పదవి పొందడం గొప్ప విషయం అన్నారు. కేంద్ర మంత్రి పదవితో సానుకూల మార్పులు తీసుకురావాలన్నారు.కాగా, సహాయ మంత్రి పదవులకు గుంటూరు, నెల్లూరు ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిల పేర్లను ఆయన ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధానమంత్రితో పాటు వీరు ముగ్గురూ ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా, మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడికి ఈసారి కేంద్రమంత్రి పదవి ఖాయమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. Congratulations to Dr. @PemmasaniOnX on being confirmed as a Minister of State. Such an honour to serve the nation at the central level during your very first political stint. The people of Guntur and entire AP are proud of you. All the best for your new role. May you bring… pic.twitter.com/NAvPMViMLc— Jay Galla (@JayGalla) June 9, 2024 Congratulations to my young friend @RamMNK on being confirmed as a cabinet minister in the new #NDA Government! Your sincerity and humble nature will surely be an asset to the development of the country. Wishing you all the best in your new role! pic.twitter.com/VkgGu8kdHB— Jay Galla (@JayGalla) June 9, 2024 -
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో బ్యాడ్మింటన్ జోడీ సైనా నెహ్వాల్- పారుపల్లి కశ్యప్ (ఫొటోలు)
-
జీఎస్ఎల్వీ ఎఫ్14 గ్రాండ్ సక్సెస్.. సీఎం జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: జీఎస్ఎల్వీ ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇన్శాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చిన ఇస్రో బృందాన్ని సీఎం అభినందించారు. భవిష్యత్లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహకనౌక 2,275 కిలోల బరువు గల వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్-3డీఎస్ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు దీనిని ప్రయోగించారు. పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. గతంలో ప్రయోగించిన ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్శాట్–3డీఎస్ని పంపించారు. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి. ఇదీ చదవండి: చంద్రబాబులోని చీకటి కోణమే ఇది! -
చేనేత కార్మికుడు నాగరాజుకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అరుదైన కానుక అందింది. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ది అందని అర్హులకు.. లబ్ది చేకూర్చే కార్యక్రమంలో సీఎం జగన్కి మంగళగిరికి చేనేత కార్మికుడు మురుగుడు నాగరాజు పట్టు వస్త్రాలు అందించారు. తాను స్వయంగా నేసిన చేనేత చీరను సీఎం జగన్ చేతికి అందించారు. ఈ కానుకను ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతికి అందించాలని నాగరాజు కోరారు. ఈ సందర్భంగా నాగరాజు నైపుణ్యాన్ని చూసి సీఎం జగన్ అభినందించారు. -
ఇస్రో బృందానికి సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: టెస్ట్ వెహికల్ ఫ్లైట్ టీవీ-డీ1 సక్సెస్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో బృందానికి సీఎం అభినందనలు తెలిపారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో మరింత ఎత్తైన కక్ష్యలోకి ఇస్రో దూసుకెళ్లోందంటూ సీఎం జగన్ కొనియాడారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్యాన్ మిషన్లో తొలి అడుగు పడింది. ఇస్రో తొలి పరీక్ష ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్’(టీవీ-డీ1) ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఉదయం శ్రీహరికోట నుంచి నింగిలోకి రాకెట్ దూసుకెళ్లగా.. క్రూ మాడ్యూల్ పారాచూట్ల సాయంతో కిందకు సురక్షితంగా ల్యాండ్(సముద్రంలోకి) అయ్యింది. గగన్యాన్లో వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహాక ప్రయోగం సక్సెస్ కావడం పట్ల.. ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. చదవండి: ఇస్రో ‘గగన్యాన్’ TV-D1 ప్రయోగం సక్సెస్ -
ఇస్రో టీమ్ కు సీఎం జగన్ అభినందనలు
-
ఏషియన్ గేమ్స్ లో విజేతలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
-
ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన క్రీడాకారులకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ఏషియన్ గేమ్స్లో బంగారు పథకం సాధించిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆర్చరీ విభాగంలో స్వర్ణం సాధించిన వీజే.సురేఖ, పరిణీత్, అదితిగోపీచంద్ స్వామిలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడకు చెందిన సురేఖ సాధించిన విజయంపై రాష్ట్రమంతా గర్వపడుతోందన్న సీఎం.. తెలుగు జెండా రెపరెపలాడుతోందంటూ ట్వీట్ చేశారు. ఆసియా క్రీడలు-2023లో ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ విభాగంలో భారత్ అదరగొట్టింది. చైనాలోని హెంగ్జూ వేదికగా గురువారం నాటి ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణం గెలిచింది. బంగారు తల్లులు వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్ ఈ మేరకు దేశానికి మరో పసిడి పతకం అందించారు. చదవండి: గురి తప్పలేదు.. అదరగొట్టేశారు.. మన అమ్మాయికి ‘మరో’ స్వర్ణం My best wishes and congratulations to @VJSurekha, @Parrneettt and Aditi Gopichand Swami for winning India the gold in the archery final at #AsianGames2023. Your precision and skill have made all of proud. I and all of Andhra Pradesh is particularly proud of our very own… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2023 -
యోగిని అభినందిస్తూ.. భారత సంతతి బ్రిటిష్ ఎంపీ లేఖ!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని అభినందిస్తూ భారత సంతతి బ్రిటిష్ ఎంపీ వీరేంద్ర శర్మ లేఖ రాశారు. ఆ లేఖలో.. యూపీలో శాంతిని నెలకొల్పేలా.. మీరు చేసిన ప్రయత్నాలు, సాధించిన విజయాలకు గాను మీకు అభినందనలు అని రాశారు. ఈ సందర్భంగా రచయిత శంతను గుప్తా తనకు ప్రెజెంట్ చేసిన గ్రాఫిక్ నవల "అజయ్ టు యోగి ఆదిత్యనాథ్" గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. అంతేగాదు హౌస్ ఆఫ్కామన్స్లో రచయిత శంతను గుప్తా ఉత్తరప్రదేశ్ అభివృద్ధి ప్రయాణం గురించి తనతో చర్చించినట్లు కూడా లేఖలో తెలిపారు. రచయిత శంతను హౌస్ఆఫ కామన్స్లో మాట్లాడుతూ....ప్రపంచ వ్యాప్తంగా బ్రాంబ్ ఇండియాను ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించారని, దాని కారణంగానే నేడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్లే భారత్ బలమైన బ్రాండ్గా మారింది. అంతేగాదు ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వ హయాంలో అగ్రశ్రేణి పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. అలాగే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో 2017లో 14వ స్థానంలో ఉన్న యూపీ కాస్తా 2కి ఎగబాకింది. అంతేగాదు ఉత్తరప్రదేశ్లోని ఎక్స్ప్రెస్వే, కొత్త విమానాశ్రయాలు, బలమైన శాంత్రి భద్రతలు గురించి కూడా రచయిత శంతను భారత సంతతి బ్రిటిష్ ఎంపీతో చెప్పుకొచ్చారు. ఇంకా రచయిత శంతను వీరేంద్ర శర్మతో యోగి ఆదిత్యనాద్ తండ్రి గురించి కూడా ఓ ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే యోగి ఆధిత్యానాథ్ సాధించిన విజయాలు, ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్న బ్రిటిష్ ఎంపీ వీరేంద్ర శర్మ ఆయన్ని అభినందిస్తూ లేఖ రాశారు. (చదవండి: డల్లాస్లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్!) -
భారత ఏస్ ఆర్చర్ జ్యోతి సురేఖకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత ఏస్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంను జ్యోతి సురేఖ బుధవారం కలిశారు. ఇటీవల బెర్లిన్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్షిప్, ప్యారిస్లో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్లో పలు పతకాలను ఆమె సాధించారు. తాను సాధించిన పతకాలను సీఎంకు సురేఖ చూపించారు. అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను వెలుగెత్తి చాటడంపై సురేఖను సీఎం ప్రశంసించారు. తనకు డిప్యూటీ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్న సీఎం.. రాబోయే రోజుల్లో ఇదే స్ధాయిలో ఏపీకి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. చదవండి: కాలుష్య రహిత విద్యుత్ ఉత్పాదనలో తొలిస్థానంలో ఏపీ: సీఎం జగన్ -
సాత్విక్-చిరాగ్ జోడీని అభినందించిన సీఎం వైఎస్ జగన్
-
PSLV-C55 సక్సెస్ పై సీఎం జగన్ హర్షం
-
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు
-
ఇస్రో బృందాన్ని అభినందించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఎల్వీఎం3–ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. భవిష్యత్లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. భారత అంతరిక్ష చరిత్రలో ఈ రోజు ఒక ముఖ్యమైన మైలురాయిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఎల్వీఎం3–ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా భారత్ అవతరించింది. ఈ ప్రయోగం ద్వారా యూకేకు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీ, భారత్కు చెందిన భారతి ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా వన్వెబ్ ఇండియా–2 పేరుతో రూపొందించిన 5,805 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్లో 87.4 డిగ్రీల వంపులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశట్టారు. చదవండి: సంతోష సూచీలో మనమెక్కడ.. మనకంటే మెరుగైన స్థానాల్లో పాక్, శ్రీలంక ప్రయోగాన్ని 19.7 నిమిషాల్లో పూర్తి చేశారు. నాలుగేసి ఉపగ్రహాల చొప్పున.. 9 విడతలుగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. పూర్తి స్థాయి వాణిజ్యపరంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కలిసి వన్వెబ్ పేరుతో చేసిన రెండో ప్రయోగమిది. My best wishes and congratulations to the team at @isro on the successful launch of the LVM3 rocket from Satish Dhawan Space Centre in Sriharikota, #AndhraPradesh. This day will always be remembered as an important milestone in Indian space history. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 26, 2023 -
ఆర్ఆర్ఆర్ టీమ్ కి మంత్రి రోజా అభినందనలు
-
రాజమౌళి బృందానికి పీఎం మోదీ అభినందనలు
-
ఆస్కార్ అవార్డు పొందిన ఆర్ఆర్ఆర్ టీమ్ కి సీఎం జగన్ అభినందనలు
-
ఆర్ఆర్ఆర్ టీంకు చిరు అభినందనలు
-
విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులకు సీఎం అభినందనలు
సాక్షి, అమరావతి: ఏపీ విద్యుత్ సంస్థలు జాతీయస్థాయిలో పలు అవార్డులు గెలుచుకున్నందుకు.. ఆ సంస్థల ఉన్నతాధికారులను సీఎం జగన్ అభినందించారు. విద్యుత్ సమర్థ వినియోగంలో ఏపీ విద్యుత్ సంస్థలు ఇటీవల మూడు అవార్డులు గెలుచుకున్నాయి. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ విషయంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్మిషన్ యుటిలిటీగా ఏపీ ట్రాన్స్కో ఎంపికైంది. న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పునరుత్పాదక కార్పొరేషన్లలో ఒకటిగా ఎనర్షియా అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డులను సోమవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్కు ఇంధన శాఖ ఉన్నతాధికారులు అందించారు. వారిని అభినందించిన సీఎం జగన్.. భవిష్యత్లో మరిన్ని అవార్డులు గెల్చుకునేలా కృషి చేయాలని సూచించారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ ట్రాన్స్కో సీఎండీ బి.శ్రీధర్, ఎన్ఆర్ఈడీసీ, ఏపీ వీసీ ఎండీ ఎస్.రమణారెడ్డి, ట్రాన్స్కో జేఎండీ(హెచ్ఆర్డీ) ఐ.పృథ్వితేజ్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పద్మాజనార్ధన్రెడ్డి, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, ఏపీ ట్రాన్స్కో జేఎండీ(విజిలెన్స్) బి.మల్లారెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్కు మంత్రుల శుభాకాంక్షలు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు సీఎం జగన్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ఆర్కే రోజా, జోగి రమేశ్తో పాటు ఉన్నతాధికారులు సీఎం జగన్కు పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: విద్యుత్తు, నీళ్లు, డ్రైనేజీ తప్పనిసరి -
పొలిటికల్ కారిడార్ : ఏపీ హోంమంత్రికి అమిత్ షా అభినందనలు
-
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చిన ఎల్వీఎం3-ఎం2ను విజయవంతంగా ప్రయోగించటం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(ఎస్డీఎస్సీ) ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్వెహికల్ఎం3–ఎం2 రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో ఒక చరిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ రకం రాకెట్ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. తొలి యత్నంలోనే ఇస్రో గ‘ఘన’ విజయం సొంతం చేసుకుంది. ఇదీ చదవండి: ఇస్రో దీపావళి ధమాకా -
మంత్రి ‘అంబటి’కి సీఎం జగన్ అభినందన
సాక్షి, అమరావతి: దేశంలో నాలుగు సాగునీటి కట్టడాలను ప్రపంచ వారసత్వ కట్టడాలుగా ఐసీఐడీ (ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) గుర్తిస్తే.. అందులో ధవళేశ్వరం బ్యారేజీ ఉండడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుని అభినందించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో.. ఐసీఐడీ కాంగ్రెస్ విశేషాలను మంత్రి అంబటి వివరించి ఐసీడీసీ ప్రదానం చేసిన పత్రాన్ని సీఎంకు చూపించారు. వచ్చే ఏడాది విశాఖలో ఐసీఐడీ 25వ కాంగ్రెస్ను ఘనంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. -
బ్రిటన్ కొత్త ప్రధానికి మోదీ శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్కు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆమె నాయకత్వంలో భారత్-బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు. ప్రధానిగా కొత్త బాధ్యతలు చేపడుతున్న ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈమేరకు మోదీ ట్వీట్ చేశారు. Congratulations @trussliz for being chosen to be the next PM of the UK. Confident that under your leadership, the India-UK Comprehensive Strategic Partnership will be further strengthened. Wish you the very best for your new role and responsibilities. — Narendra Modi (@narendramodi) September 5, 2022 బ్రిటన్ ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాన్పై లిజ్ ట్రస్ ఘన విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులంతా ఆమెవైపే మొగ్గుచూపారు. ట్రస్కు 81,326 ఓట్లు రాగా.. రిషికి 60,399 ఓట్లు వచ్చాయి. అధికారిక ఫలితాలను సోమవారం సాయంత్రం ప్రకటించారు. ప్రధానిగా ట్రస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చదవండి: గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి.. సీఎం సంతాపం -
ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ-సీ53ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో బృందం మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. చదవండి: పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ53.. కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 55వ ప్రయోగం. -
'మేజర్' టీమ్కు వెండి నాణేన్ని బహుకరించిన సీఎం
UP CM Yogi Adityanath Meets And Blesses Team Major: ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. తాజాగా ఇలాంటి గొప్ప సినిమాను రూపొందించినందుకు చిత్రబృందాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ అభినందించారు. 'మేజర్' మంచి విజయం సాధించిన సందర్భంగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులతోపాటు మూవీ యూనిట్ను కలిసి ప్రశంసించారు. తర్వాత సినిమాలో 10 నిమిషాలను సీఎంకు చూపించి పూర్తి చిత్రాన్ని వీక్షించాలని వారు కోరారు. చిత్ర విశేషాలను సుధీర్ఘంగా చర్చించిన తర్వాత మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పేరును ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తాని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం చిత్రబృందానికి, మేజర్ సందీప్ తల్లిదండ్రులకు శాలువ కప్పి, వెండి నాణేన్ని జ్ఞాపికగా బహుకరించారు. ఈ కార్యక్రమంలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులతోపాటు హీరో అడవి శేష్, నిర్మాత శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. (చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ) ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అడవి శేష్ పంచుకున్నారు. కాగా ఇటీవల మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఫండ్కు సంబంధించిన విషయం గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో చిత్ర యూనిట్ సమావేశమైంది. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే సీడీఎస్, ఎన్డీఏ ఆశావహులకు శిక్షణ కోసం ఉపయోగిస్తామని తెలిపింది. దీంతో దేశానికి సేవ చేయాలనే వారి కలలు సాకారం అవుతాయని చిత్రబృందం పేర్కొంది. చదవండి:కాపీ కొట్టి ఆ సినిమా తీశారు.. స్క్రీన్షాట్స్ వైరల్ స్టూడెంట్స్గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
సివిల్స్ విజేతలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: సివిల్స్లో ర్యాంకులు సాధించిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 15వ ర్యాంక్ సాధించిన యశ్వంత్ కుమార్రెడ్డితో సహా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీఎం అభినందనలు తెలిపారు. పి.సాహిత్య, శ్రుతి రాజ్యలక్ష్మి, రవికుమార్, కె.కిరణ్మయి, పాణి గ్రాహికార్తీక్, జి.సుధీర్ కుమార్రెడ్డి, శైలజ, శివానందం, ఏ.నరేష్లను సీఎం జగన్ అభినందించారు. చదవండి: జగనన్న మూడేళ్ల పాలన: పేదలకు ‘చేయూత’.. సంక్షేమ ‘బావుటా’ సివిల్స్ సర్వీసెస్-2021 ఫలితాలు ఇవాళ (సోమవారం) ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం యూపీఎస్సీ బోర్డు 685 మందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్కుమార్ రెడ్డికి 15వ ర్యాంక్ దక్కింది. పూసపాటి సాహిత్యకు జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్, శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంక్, రవికుమార్కు 38వ ర్యాంక్, కొప్పిశెట్టి కిర్మణయికి 56వ ర్యాంక్ దక్కింది. పాణిగ్రహి కార్తీక్కు 63వ ర్యాంక్, గడ్డం సుధీర్కుమార్కు 69వ ర్యాంక్, శైలజ 83వ ర్యాంక్, శివానందం 87వ ర్యాంక్, ఆకునూరి నరేష్కు 117వ ర్యాంక్, అరుగుల స్నేహకు 136వ ర్యాంక్, గడిగె వినయ్కుమార్ 151 ర్యాంక్, దివ్యాన్షు శుక్లాకు 153వ ర్యాంక్, కన్నెధార మనోజ్కుమార్కు 157వ ర్యాంక్, బొక్కా చైతన్య రెడ్డికి 161వ ర్యాంక్, దొంతుల జీనత్ చంద్రకు 201వ ర్యాంక్, అకవరం సాస్యరెడ్డికి సివిల్స్ జాతీయ స్థాయిలో 214వ ర్యాంక్ దక్కాయి. -
హఠాత్తుగా వాహనం దిగి.. హోంగార్డును అభినందించి.
సాక్షి, హైదరాబాద్: అది ఎల్బీ స్టేడియం పక్కన ఉన్న బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం చౌరస్తా... రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా అబిడ్స్ ట్రాఫిక్ ఠాణా హోంగార్డు అష్రఫ్ అలీ ఖాన్ విధుల్లో ఉన్నారు. ఉదయం 9.20 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వాహనం ఆ దారిలో వెళ్తోంది. హఠాత్తుగా సీజే తన వాహనాన్ని స్లో చేయించి అలీని దగ్గరకు పిలిచారు. వాహనం నుంచి కిందికి దిగిన జస్టిస్ సతీశ్చంద్ర.. అలీని ‘వెల్డన్ ఆఫీసర్’ అంటూ అభినందించి పుష్పగుచ్ఛం ఇచ్చారు. దీంతో అలీఖాన్తోపాటు అక్కడున్న వాళ్లూ ఆశ్చర్యపోయారు. విజయ్నగర్ కాలనీకి చెందిన అష్రఫ్ 24 ఏళ్ల క్రితం హోంగార్డుగా అడుగుపెట్టారు. రెండున్నరేళ్లుగా అబిడ్స్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అలీ నిత్యం బీజేఆర్ స్టాట్యూ చౌరస్తాలోని పాయింట్లో డ్యూటీ చేస్తుంటారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ రాకపోకలు సాగించేది ఈ చౌరస్తా మీదుగానే. అత్యంత ప్రముఖుల జాబితాలో ఉండే ఆయనకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్చానల్ ఇస్తుంటారు. సీజే ప్రయాణించే సమయంలో, ఆ మార్గంలో మిగిలిన వాహనాలను ఆపి, ఆయన వాహనాన్ని ముందుకు పంపిస్తారు. బీజేఆర్ స్టాట్యూ వద్ద అలీ ఒక్క రోజు కూడా చిన్న ఇబ్బందీ రానీయలేదు. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న అలీని కొన్నాళ్లుగా గమనిస్తున్న సీజే శుక్రవారం అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. హోంగార్డు అలీ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా సీజే స్థాయి వారిని దగ్గర నుంచి కూడా చూడలేదు. అలాంటిది సీజే నా వద్దకు వచ్చి అభినందించడంతో షాకయ్యా’ అని ఉబ్బితబ్బిబ్బయ్యారు. సీజే ఇచ్చిన స్ఫూర్తిని అలీ జీవితకాలమంతా గుర్తుపెట్టుకుంటారని డీజీపీ మహేందర్రెడ్డి ట్టిట్టర్లో పేర్కొన్నారు. -
సీఎం జగన్ కు గవర్నర్ అభినందనలు
-
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్కు గవర్నర్ అభినందనలు
సాక్షి, విజయవాడ: జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా 13 జిల్లాలను ఏర్పాటు చేయటం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన, సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోవటం అనుసరణీయమన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుతో పునర్ వ్యవస్థీకరించిన 26 జిల్లాల పాలన ప్రారంభం కావటం అన్ని ప్రాంతాల ఏకీకృత అభివృద్ధికి బాటలు వేస్తుందని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేసారు. చదవండి: కొత్త జిల్లాలతో ప్రజలకు మేలు: సీఎం జగన్ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వంలో మరింత పారదర్శకతను తీసుకువస్తుందని ఇది రాష్ట్ర పరిపాలనా చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టిస్తుందన్నారు. నూతన జిల్లాలతో అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, పథకాల అమలులో మరింత వేగం, ప్రజలకు చేరువగా పాలన సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే ప్రాంగణంలో అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయటం మంచి ఆలోచన అని గవర్నర్ పేర్కొన్నారు. -
కత్రీనా పెళ్లిపై సల్మాన్ ఖాన్ రియాక్షన్.. కమిటెడ్ అని హింట్ !
Salman Khan Congratulates Katrina Kaif On Her Wedding: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. టైగర్ 3, పవనపుత్ర భాయిజాన్, దబాంగ్ 4, నో ఎంట్రీ 2 సినిమాలతో అలరించనున్నాడు. ప్రస్తుతం వీటిలో కొన్ని చిత్రీకరణ జరుపుకుంటుండగా మరికొన్ని సెట్స్పైకి వెళ్లనున్నాయి. అయితే బీటౌన్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్గా పేరొందిన సల్మాన్ ఇటీవలే 56వ పడిలోకి అడుగు పెట్టాడు. అయితే తమ అభిమాన హీరో సల్లూ భాయ్ ఓ ఇంటివాడు అయితే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్లో పలువురు హీరోయిన్లతో సల్మాన్ రిలేషన్లో ఉన్నట్లు ఇప్పటికే అనేకసార్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై సల్లూ భాయ్ ఎప్పుడూ స్పందించలేదు. అయితే తాజాగా తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి తాజాగా స్పందిచాడు భాయిజాన్. అంతేకాకుండా తన స్నేహితురాలు కత్రీనా కైఫ్ వివాహంపై కూడా మాట్లాడాడు. జనవరి 30 ఆదివారం జరిగిన హిందీ బిగ్బాస్ సీజన్ 15 ఫినాలేలో ఆ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ గ్రాండ్ ఫినాలేకు పలువురు సెలబ్రిటీలు వచ్చి బిగ్బాస్ స్టేజిపై సందడి చేశారు. ఇందులో భాగంగా కత్రీనా కైఫ్ నర్తించిన చికినీ చమేలి పాటకు మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్స్ రాఖీ సావంత్, రుబీనా దిలాయక్ డ్యాన్స్ చేశారు. తర్వాత 'కంగ్రాట్స్ కత్రీనా.. మీ వివాహ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మీ వివాహంతో అందరూ సంతోషిస్తున్నారు.' అని కెమెరావైపు చూసి తెలిపాడు. అనంతరం కత్రీనా కైఫ్ విషయంపై షెహనాజ్ గిల్ సరదాగా సల్మాన్ టీజ్ చేసింది. సల్మాన్ అలా చెప్పగానే 'మీరు కూడా సంతోషంగా ఉన్నారా ? అయినా మీరు సింగిల్గా ఉంటేనే బాగుంటారు' అనగా 'అవును. నేను సింగిల్గా అయినప్పుడే మరింత మెరుగ్గా కనిపిస్తాను' అని సల్లూ భాయ్ సమాధానం ఇచ్చాడు. దీంతో షెహనాజ్ 'ఇప్పుడు మీరు కమిటెడ్ ఆ ?' అని అడగ్గా సల్మాన్ సమాధానం ఇవ్వకుండా నవ్వాడు. అయితే ఇటీవల సమంత లాక్వుడ్తో సల్మాన్ రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
ఏఐటీటీ టాపర్స్కు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (ఏఐటీటీ)–2020లో క్రాఫ్ట్మెన్ ట్రైనింగ్ స్కీమ్ (సీటీఎస్) జాతీయ స్థాయి పరీక్షలో టాప్ ర్యాంకులు సాధించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు విద్యార్థులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఒక్కో విద్యార్థికి రూ.5 లక్షల నగదు ప్రోత్సాహం, వారి చదువుకు అనుగుణంగా ఏపీఐఐసీలో ఉద్యోగాన్ని ప్రకటించారు. వారికి మెమెంటోలతో పాటు సర్టిఫికెట్లు, ట్యాబ్లను అందజేశారు. ఇదిలా ఉండగా కౌశలాచార్య అవార్డు–2021ని సాధించిన డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ వై.రజిత ప్రియను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందిస్తూ రూ.5 లక్షల ప్రోత్సాహం ప్రకటించారు. వీరందరికీ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో రూ.5 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి, రీజనల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, జాయింట్ డైరెక్టర్ జి.బాలసుబ్రహ్మణ్యం, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏఐటీటీ–2020 టాపర్స్ వీరే.. ► డి.మణికంఠ, మెకానిక్ డీజిల్ ట్రేడ్ – ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ ►మొండి సతీష్, ఎలక్ట్రీషియన్, ఆల్ ఇండియా ఐదో ర్యాంక్ ►ఎన్.కుమారి, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఆల్ ఇండియా ఆరో ర్యాంక్ ► ఎం.బాల పవన్ రాజు, డ్రాఫ్ట్మెన్ సివిల్, ఆల్ ఇండియా ఎనిమిదో ర్యాంక్ ►ఎం.రోషణ్, మెకానిక్ ఆర్ అండ్ ఏసీ ట్రేడ్, ఆల్ ఇండియా తొమ్మిదో ర్యాంక్. -
జియో సంచలనానికి ఐదేళ్లు..! ట్విటర్లో క్యూ కట్టిన పలు కంపెనీలు
న్యూఢిల్లీ: జియో భారత టెలికాం రంగంలో సంచలనాలను నమోదుచేసింది. 2021 సెప్టెంబర్ 5తో జియో ఐదు వసంతాలను పూర్తి చేసుకుంది. అతి తక్కువ ధరలో 4జీ ఇంటర్నెట్ను అందించిన మొబైల్ నెట్వర్క్ సంస్థగా జియో నిలిచింది. పలు కంపెనీలు తమ టారిఫ్ వాల్యూలను తగ్గించాల్సి వచ్చింది. జియో రాకతో ఇంటర్నెట్ రంగంలో పెనుమార్పులే వచ్చాయి. 2016 సెప్టెంబర్ 5న జియో నెట్వర్క్ను రిలయన్స్ లాంచ్ చేసింది. చదవండి: ఎయిర్టెల్, జియో మధ్య ముగిసిన భారీ డీల్..! జియో ప్రారంభమై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పలు దిగ్గజ కంపెనీలు జియోకు శుభాకాంక్షలను తెలియజేశాయి. గూగుల్, జోమాటో, నెట్ఫ్లిక్స్, పేటీయం, హెచ్డీఎఫ్సీ, అమెజాన్ ప్రైమ్ వీడియో , ఫోన్పే, అపోలో హస్పిటల్స్, అశోక్ లేల్యాండ్, టిండర్ ఇండియా, వూట్, జీ5, శాంసంగ్ ఇండియా, వివో, ఓప్పో, డొమినోస్ ఇండియా, సోనీ లివ్, నోకియా, మైక్రో మ్యాక్స్, ఆన్అకాడమీ లాంటి కంపెనీలు జియోకు ట్విటర్లో శుభాకాంక్షలను తెలియజేశాయి. భారత్లో జూన్ 2021 వరకు.. మొబైల్, బ్రాడ్బ్యాండ్ వ్యవస్థలో అత్యంత మార్కెట్ షేర్ను కలిగిన సంస్థగా జియో నిలిచిందని ట్రాయ్ పేర్కొంది. ట్రాయ్ నివేదిక ప్రకారం బ్రాడ్బ్యాండ్ చందాదారుల గత 5 సంవత్సరాలలో డేటా వినియోగదారుల సంఖ్య 4 రెట్లు పెరిగిందని పేర్కొంది. బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల సంఖ్య సెప్టెంబర్ 2016 లో 19.23 కోట్ల నుంచి జూన్ 2021 నాటికి 79.27 కోట్లకు చేరింది. 2016 డిసెంబరు నుంచి మార్చి 2021 మధ్యకాలంలో ప్రతి వినియోగదారుడు నెలవారీ డేటా వినియోగం 878.63 ఎమ్బీ నుంచి 12.33జీబీ సుమారు 1,303 శాతానికి పైగా డేటా వినియోగం పెరిగింది. చదవండి: Jio Phone Next: రూ.500కే జియో స్మార్ట్ ఫోన్, షరుతులు వర్తిస్తాయ్! -
బిలియనీర్ చారిత్రక రోదసీ యానం: జెఫ్ బెజోస్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ చారిత్రక రోదసీ యాత్ర విజయవంతంపై మరో బిలియనీర్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్పందించారు. రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫైట్లో అంతరిక్షంలోకి అడిగిడిన సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. నింగికి ఎగిసే క్షణాలకోసంఎదురు చూస్తున్నాం.. ఆ క్లబ్లోకి చేరడానికి తమకు ఉత్సాహంగా ఉందంటూ ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. మరోవైపు అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న బెజోస్ కల త్వరలోనే నెరవేరబోతోంది. బెజోస్స్ కు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ ఒరిజన్ రూపొందించిన తయారు చేసిన న్యూ షెపర్డ్ రాకెట్లో సోదరులిద్దరూ రోదసీలోకి అడుగుపెట్టనున్నారు. జెఫ్ బెజెస్, అతడి సోదరుడు మార్క్ బెజోస్ సహా వ్యోమగాములతో మరికొద్ది రోజుల్లో ( 2021, జులై 20వ తేదీ) న్యూ షెపర్డ్ రోదసీలోకి టేకాఫ్ తీసుకోనుంది. కాగా అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్కు చెందిన మానవసహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22లో రోదసిలోకి పయనమవుతున్న సందర్భంగా కూడా ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ సంఘటన తనకు ఒక జీవిత అనుభవాన్ని మిగిల్చిందని, ఏదో మాయాజాలంలా అనిపించిందంటూ బ్రాన్సన్ సంతోషం వ్యక్తం చేశారు. అంతరిక్షం నుంచి భూమిని చూస్తున్న అనుభూతి అద్బుతంగా ఉందని బ్రాన్సన్ పేర్కొన్నారు. ఇంత అద్భుతమైన స్పేస్పోర్ట్ను సృష్టించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. తమని ఇంత దూరం తీసుకురావడానికి చేసిన కృషికి బ్రాన్సన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చరిత్ర సృష్టించిన శిరీషను బ్రాన్సన్ తన భుజాలపై ఎత్తుకున్న ఫోటోగా వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Jeff Bezos (@jeffbezos) -
చారిత్రాత్మక విజయం : నీతా అంబానీ ప్రశంసలు
సాక్షి, ముంబై: ఆస్ట్రేలియా గడ్డపై సంచలన విజయాన్ని నమోదు చేసిన టీమిండియాను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ అభినందించారు. మూడు దశాబ్దాల తరువాత ఆసిస్ జట్టును మట్టికరపించి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని గెలుచుకున్న భారత క్రికెటర్లను యంగ్ ఇండియా అంటూ అభివర్ణించారు నీతా అంబానీ. (అద్భుత విజయం : బీసీసీఐ భారీ నజరానా) ‘‘ఇంతటి చారిత్రాత్మక విజయానికి భారత జట్టుకు అభినందనలు. మీలో ప్రతి ఒక్కరూ ఆత్మ విశ్వాసం, సంకల్పం, నిర్భీతితో ఈ అద్భుతమైన సిరీస్ను సొంతం చేసుకున్నారు. ఇదీ మన యంగ్ ఇండియా, న్యూ ఇండియా. దేశం మొత్తాన్ని ఉత్తేజితం చేసిన మీ విజయానికి, ధైర్యానికి ఒక భారతీయురాలిగా గర్వపడుతున్నాను అంటూ నీతా అంబానీ తన అధికారిక ప్రకటనలో తెలిపారు. కాగా బ్రిస్బేన్లోని గబ్బాలో యువ భారత జట్టు ఆస్ట్రేలియాను మూడు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంపై అటు క్రికెట్ లెజెండ్స్, ఇతర క్రీడాభిమానులతోపాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హర్షం వక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. (పాపం లాంగర్.. ఓడిపోయాకా తెలిసొచ్చినట్లుంది) -
శాస్త్రవేత్తలకు ఏపీ గవర్నర్ అభినందన
సాక్షి, అమరావతి: కరోనాపై పోరులో భాగంగా రెండు దేశీయ టీకాలను విజయవంతంగా అభివృద్ది చేసి దేశవ్యాప్త పంపిణీకి మార్గం సుగమం చేసిన భారత శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. శనివారం దేశవ్యాప్తంగానూ, ఆంధ్రప్రదేశ్ లోనూ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించటం శుభపరిణామమన్నారు. చదవండి: ఏపీ వ్యాప్తంగా రెండో రోజు వ్యాక్సినేషన్.. పరిశోధకులు తమ నిరంతర ప్రయత్నాల ఫలితంగా అతి తక్కువ వ్యవధిలో టీకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని గవర్నర్ ప్రశంసించారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఆరోగ్య కార్మికుల ప్రయోజనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ కరోనా టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నేపధ్యంలో రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు, వైద్య బృందాలను గవర్నర్ అభినందించారు. చదవండి: మరోసారి మారిన కరోనా కాలర్ టోన్ -
‘సైబ్ హర్’ను అభినందించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగాన్ని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు అభినందించారు. మహిళలు, పిల్లలు భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ‘సైబ్ హర్’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం మరో అద్భుతం సాధించిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ఇంటర్ నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాల వినియోగం గణనీయంగా పెరగడంతో సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్నాయి. సులువుగా మోసాలకు గురయ్యే అవకాశం ఉన్న పిల్లలు, మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ‘సైబ్ హర్’ పేరుతో పోలీసులు స్పెషల్ ప్రోగ్రాం చేపట్టారు. దాదాపు 15 లక్షల మందికి సైబర్ నేరాలు జరిగే విధానం- నేరాల నుంచి బయటపడేందుకు పోలీసులు అవగాహన కల్పించారు. వారిని మనసారా అభినందిస్తున్నానని’’ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
ప్రధాని మోదీపై అమిత్ షా ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. దూరదృష్టి, నిర్ణయాత్మక నాయకత్వం నేతృత్వంలో దేశాన్ని మరింత ముందుకు నడిపిస్తున్నారని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో చేసిన చారిత్రాత్మక తప్పిదాలను ఆరేళ్ల కాలంలో నరేంద్ర మోదీ సరిచేసి చూపారని కొనియాడారు. మోదీ గత ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఫలితమే మరోసారి అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెట్టాయని అభినందించారు. 130 కోట్ల ప్రజలకు మోదీ నాయకత్వ పటిమ మీద అపారమైన నమ్మకం ఉందని, ఆయన కష్టపడే తత్వమే ఈ స్థాయికి తీసుకువచ్చిందని అమిత్ షా పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వంతో ప్రపంచ దేశాల వేదికపై భారత్ను గర్వపడేలా చేశారని అన్నారు. (ఏడాది పాలన: ప్రజలకు మోదీ లేఖ) అలాగే దేశ వ్యాప్తంగా బీజేపీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను, విజయాలను ప్రతి గడపకు చేరవేసిన కోట్లాది కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శనివారం ట్విటర్ వేదికగా అమిత్ షా వరుస ట్వీట్లు చేశారు. కాగా అంచనాలను తలకిందులు చేస్తూ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నేటితో తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
గట్టెక్కిన గ్రిడ్!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి విద్యుత్ దీపాలు ఆర్పినప్పటికీ, విద్యుత్ శాఖ పక్కా వ్యూహంతో వ్యవహరించడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ఒకేసారి పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగంలో మార్పులు సంభవించినా, ఉత్పత్తి – సరఫరా మధ్య సమతూకం సాధించడంలో జెన్ కో, ట్రాన్స్ కో పూర్తిస్థాయిలో విజయం సాధించాయి. ఆదివారం ఉదయం నుంచి జెన్ కో– ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్రావు విద్యుత్ సౌధలోని లోడ్ డిస్పాచ్ సెంటర్లోనే ఉండి విద్యుత్ డిమాండ్ ఒకేసారి పడిపోయినప్పుడు అనుసరించాల్సిన వ్యూహం రచించారు. దానికి అనుగుణంగా రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు వ్యవహరించారు. రాష్ట్రంలో ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల 300 నుంచి 500 మెగావాట్ల డిమాండ్ పడిపోయే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అంచనా వేసింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల రాష్ట్రంలో 1,500 మెగావాట్ల డిమాండ్ పడిపోయింది. మూడు రెట్ల విద్యుత్ డిమాండ్ పతనం... ఆదివారం రాత్రి 9 గంటలకు ముందు రాష్ట్రంలో 7,380 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, 9 గంటల తర్వాత 5,800 మెగావాట్లకు పడిపోయింది. రాష్ట్రమంతటా ఇళ్లల్లో విద్యుత్ దీపాలను బంద్ చేస్తే గరిష్టంగా 300–500 మెగావాట్ల డిమాండ్ మాత్రమే తగ్గనుందని కేంద్ర విద్యుత్ ప్రాధికారత సంస్థ (సీఈఏ) అంచనా వేయగా, దాని కన్నా మూడు రేట్లు అధికంగా విద్యుత్ డిమాండ్ పతనమైంది. అయినా విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్) కుప్పకూలకుండా లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎల్డీసీ) ఇంజనీర్లు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గడం తో గ్రిడ్ను బ్యాలెన్స్ చేసేందుకు నాగార్జునసాగర్ రివర్స్ పంపింగ్ కేంద్రంలోని నాలుగు యూనిట్లను నడపడం ద్వారా 400మెగావాట్ల విద్యుత్ను, మేడారంలోని కాళేశ్వరం పంపింగ్ స్టేషన్ను నడపడం ద్వారా మరో 300 మెగావాట్ల విద్యుత్ను వినియోగించారు. ఇలా మొత్తం 700 మెగావాట్ల కృత్రిమ విద్యుత్ డిమాండ్ను సృష్టించడంతో పాటు మరో 800 మెగావాట్ల వరకు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించడం ద్వారా గ్రిడ్ బ్యాలెన్సింగ్ను పరిరక్షించారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి– సరఫరాల మధ్య సమతూకం కుదిరింది. విద్యుత్ దీపాలను మళ్లీ వెలిగించడంతో క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ పుంజుకుని పూర్వస్థితికి చేరింది. లైట్లు ఆర్పేసినా విద్యుత్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసిన విద్యుత్ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. -
త్వరలోనే రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మందగమనం ఉన్నా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుల సంఘటిత శక్తిని వారి సంక్షేమానికి ఉపయోగపడేలా కొత్తగా ఎన్నికైన సహకార సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన జిల్లా కేంద్ర సహకార సంఘాలు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల (డీసీఎంఎస్) చైర్మన్లు సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్తో భేటీ అ య్యారు. సహకార ఎన్నికలను సవాల్గా తీసుకుని టీఆర్ఎస్కు భారీ విజయాన్ని అందించిన మంత్రులను కేటీఆర్ అభినందించారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 48 శాతం మేర ప్రాతినిథ్యం కల్పించామని చెప్పారు. ఆదిలాబాద్లో ఎస్సీ, మహబూబ్నగర్లో మైనారిటీ వర్గానికి చెందిన వారిని చైర్మన్లుగా ఎంపిక చేసిట్లు గుర్తు చేశారు. సహకార ఎన్నికల్లో రిజర్వేషన్లు లేకున్నా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో బలహీన, బడుగు వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించేలా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను ఖరారు చేశారన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా రైతు సంక్షేమం: ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నందునే రాష్ట్రంలోని 906 సహకార సంఘాల్లో 94 శాతానికి పైగా తమ పార్టీ మద్దతుదారులే గెలుపొందారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం కొత్త పుంతలు తొక్కుతోందని, రైతు బీమా, రైతుబం ధు లాంటి ప్రత్యేక పథకాలను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. కేంద్ర అసంబద్ధ నిర్ణయాలతో దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొందని ఆరోపించారు. సమావేశంలో మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతిరాథోడ్, నిరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లను ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ -
హంపికి సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి ప్రతిష్టాత్మక కెయిన్స్ కప్ టైటిల్ గెల్చుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అభినందనలు తెలిపారు. అమెరికాలోని సెయింట్ లూసియాలో జరిగిన ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారికతో చివరి గేమ్ను ‘డ్రా’ చేసుకొని హంపి టైటిల్ను ఖాయం చేసుకుంది. కొత్త ఏడాదిని గొప్ప విజయంతో మొదలుపెట్టిన కోనేరు హంపి రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. -
అవినీతి చీడ వదిలించే బాధ్యత మీదే
సాక్షి, హైదరాబాద్ : ప్రజా జీవితంలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యం అనేవి రాజకీయ నేతలు, అధికారులకు అత్యంత ముఖ్యమైన అంశాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. అవినీతి చీడను పారద్రోలి సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారానికి బాటలు వేయాల్సిన బాధ్యత సివిల్ సర్వీసెస్ అధికారులదేనని, సుపరిపాలన ద్వారా దేశ సమగ్ర, సుస్థిరాభివృద్ధికి కృషిచేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వమంటే ప్రజలకు కనిపించేది అధికారుల రూపంలోనేనని చెప్పారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అఖిలభారత సర్వీసెస్, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసు అధికారుల ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సివిల్ సర్వెంట్స్కు ప్రజాసేవే పరమావధికావాలి. అనుక్షణం నీతి, నిజాయితీలతో పనిచేయాలి. ఏదో ఉద్యోగం చేస్తున్నాం అన్నట్టు కాకుండా ప్రజాసేవను ఒక బాధ్యతగా నిర్వహించండి’ అని అన్నారు. పేదరికం, లింగవివక్షలపై... దేశాన్ని పట్టిపీడిస్తున్నపేదరికం, నిరక్షరాస్యత, కుల, మత, లింగ వివక్షలను పారద్రోలడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కనీస వసతుల కల్పన ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఉప రాష్ట్రపతి సూచించారు. ప్రధాని, ఆర్థికమంత్రి, ముఖ్యమంత్రి ఇలా కొందరి వల్లే దేశ పురోభివృద్ధి్ద సాధ్యం కాదని, అందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమన్నారు. ప్రభుత్వపథకాలను అధికారులు సరిగ్గా అమలుచేయడంతోనే సుపరిపాలన సాధ్యమని తెలిపారు. ప్రస్తుతం అసహనం పెరిగిపోయిందని కొందరు అంటుంటారని, రాజకీయంగా ప్రజలిచ్చి న తీర్పు పట్ల సహనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలీకరణ కాలంలో అనేక అవకాశాలు లభిస్తాయని, వాటితో పాటు సవాళ్లు కూడా ఉంటున్నందున వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండండి–ఫిట్గా ఉండండి.. నేటి యువత పిజ్జా, బర్గర్ వంటి పాశ్చాత్య రుచులకు ఆకర్షితులవుతోందని, ఆ ఆహారం విదేశీయులకు మంచిది తప్ప మనకు కాదని వెంకయ్యనాయుడు హితవుపలికారు. మనపెద్దలు నిర్దేశించినట్టుగా ఏ కాలానికి తగ్గట్టుగా ఆ సంప్రదాయ ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్నారు. ఇన్స్టంట్ ఫుడ్ తీసుకుంటే ఎల్లప్పుడూ (కన్స్టంట్)రోగాలు పొంచి ఉంటాయన్నారు. శారీరకంగా ధారుఢ్యంగా ఉండేందుకు వ్యాయామం, క్రీడలు దోహదం చేస్తాయని, ఫిట్నెస్ అనేది జీవితంలో భాగమని అధికారులు గుర్తించాలని చెప్పారు. తాను 70 ఏళ్ల వయసులోనూ ప్రతీరోజు బ్యాడ్మింటన్ ఆడతానని, ఉదయం ఢిల్లీలో బ్యాడ్మింటన్ ఆడి వచ్చానని తెలిపారు. ‘దేశ రక్షణ వ్యవస్థ, అనుబంధ రంగాల్లో మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ వ్యవస్థ కీలకమైంది. ఈ విభాగం (ఎంఈఎస్) అధికారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశ రక్షణ వ్యవస్థలోభాగస్వాములయ్యే అవకాశం దొరుకుతుంది. ఈ వ్యవస్థలోనూ అవినీతికి తావులే కుండా..లక్ష్యాలను నిర్దేశిత సమయంలో పూర్తిచేయడంలో మీరు చొరవతీసుకోండి’ అని ఎంఈఎస్ అధికారులకు ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ బీపీ ఆచార్య, కోర్స్ డైరెక్టర్ హర్ప్రీత్ సింగ్, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ సీఈ బ్రిగేడియర్ పీకేజీ మిశ్రా పలువురు ఐఏఎస్ అధికారులు, ఫౌండేషన్ కోర్సుకు హాజరైన అఖిలభారత, కేంద్ర సర్వీసుల అధికారులు, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసుల అధికారులు పాల్గొన్నారు. -
ఇది మనందరి అదృష్టం
‘‘కళాకారుల ప్రతిభకు అవార్డులు, రివార్డులే కొలమానాలు’’ అన్నారు చిరంజీవి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లండన్లోని భవన్స్ ప్రాంగణంలో సంగీత వేడుక జరిగింది. సంగీతంలోని విశిష్టమైన 72 మేళకర్త రాగాలను ఏకధాటిగా 61గంటల 20 నిమిషాల పాటు వీణవాదన చేసి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు తెలుగు సినిమా సంగీత దర్శకుడు వీణాపాణి. ఈ సందర్భంగా వీణాపాణిని సత్కరించిన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఇటువంటి కళాకారులను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా గౌరవించడం మన సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం. ఇంత గొప్ప గౌరవం దక్కటం తెలుగువారితో పాటు భారతీయులందరి అదృష్టం’’ అన్నారు. ‘‘వీణపాణి అసలు పేరు రమణమూర్తి. ఆయనకు వీణాపాణి అని నామకరణం చేసింది నేనే అని గర్వంగా చెప్పగలను’’ అన్నారు తనికెళ్ల భరణి. ‘‘మన తెలుగువాడు ఇంతటి కీర్తిని సాధించడం మనకు గర్వ కారణం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘‘వీణాపాణి ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’’ అన్నారు జనార్థన మహర్షి. ‘‘నా దర్శకత్వంలో వచ్చిన ‘పట్టుకోండి చూద్దాం’ ద్వారా సంగీత దర్శకునిగా ప్రయాణం మొదలుపెట్టిన వీణాపాణికి గిన్నిస్ అవార్డు రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు శివ నాగేశ్వరరావు. ‘‘ఈ రికార్డును ఆ మహాత్మునికి అంకితం ఇస్తున్నాను. నన్ను 28ఏళ్లుగా భరిస్తున్న నా భార్యకు, పిల్లలకు కూడా ఈ అవార్డు చెందుతుంది’’ అన్నారు వీణాపాణి. -
మోదీకి ట్రంప్ ఫోన్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: జూన్లో జపాన్లో జరిగే జీ–20 సమావేశంలో ప్రత్యేకంగా భేటీ కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీలు శుక్రవారం నిర్ణయించుకున్నారు. అమెరికా, ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మోదీని అభినందించేందుకు ట్రంప్ ఫోన్ చేశారు. జపాన్లో ఇండియా, అమెరికా, జపాన్ల మధ్య త్రైపాక్షిక భేటీ ఉంటుందని శ్వేతసౌధం అధికారులు చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛగా నౌకలు తిరిగే అంశంపై వారు ప్రధానంగా చర్చిస్తారంది. జూన్ 28, 29 తేదీల్లో ఈ జీ–20 సదస్సు జరగనుంది. ప్రపంచ దేశాల నేతల అభినందనలు ఎన్నికల్లో ఘనవిజయానికి అభినందిస్తూ మోదీకి పలువురు ప్రపంచ దేశాల అధినేతలు ఫోన్లు చేశారు. వారందరికీ మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, సౌదీ అరేబియా రాజు సల్మాన్బిన్ అబ్దుల్అజీజ్ అల్ సౌద్, నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, ఇండోనేసియా అధ్యక్షుడు జొకో విడొడొ, నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ సహా పలువురు నేతలు మోదీకి అభినందనలు తెలియజేశారు. -
కేసీఆర్కు అసదుద్దీన్ ప్రశంసలు
-
అంగ్సాన్ సూచీకి మోదీ శుభాకాంక్షలు
-
అంగ్సాన్ సూచీకి మోదీ శుభాకాంక్షలు
మయన్మార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అంగ్సాన్ సూచీకి భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. యూకే పర్యటనకు వెళుతున్న సమయంలో అంగ్సాన్ సూచీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపి, భారత్ రావాలని ఆహ్వానించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం ట్విట్ చేశారు. మయన్మార్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూల పార్టీ 'నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ)' ఘన విజయం సాధించింన విషయం తెలిసిందే. గత ఆదివారం జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటింగ్లో పాల్గొన్న మయన్మార్ ప్రజలు.. ఎన్ఎల్డీకి తిరగులేని మెజారిటీ అందించారు. ఈ ఎన్నికల్లో ఎన్ఎల్డీ 536 పార్లమెంట్ సీట్లను గెలుపొందింది. Diplomacy aboard Air India 1! PM called Daw Aung San Suu Kyi, congratulated her on her electoral victory and invited her to visit India — Vikas Swarup (@MEAIndia) November 12, 2015 -
కంగ్రాట్స్.. సుందర్ పిచాయ్: మోదీ
-
కంగ్రాట్స్.. సుందర్ పిచాయ్: మోదీ
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కొత్త సీఈవోగా నియమితులైన సుందర్ పిచాయ్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గూగుల్లో కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలంటూ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు రాజధాని చెన్నైలో సుందర్ 1972లో జన్మించారు. పిచాయ్ 2004 లో గూగుల్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ స్థాయికి చేరారు. సుందర్ పిచాయ్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్ల, ఆంధ్రపదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్లు అభినందించారు. -
మహిళా కబడ్డీ జట్టుకు మోడీ అభినందనలు
న్యూఢిల్లీ : ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళా కబడ్జీ జట్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. 'పసిడి పతకం గెలుచుకున్న జట్టును అభినందిస్తున్నా.ఇది అసాధారణ విజయం' అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత మహిళల కబడ్డీ జట్టు దేశం గర్వపడేలా చేసిందని మోడీ అన్నారు. కబడ్డీలో మహిళలు జట్టు ఫైనల్స్లో ఇరాన్పై 31-21 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు పురుషుల కబడ్డీ జట్టు కూడా స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకూ భారత్ 11 పసిడి పతకాలను సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది.