counter attack
-
ఆర్మీ కాన్వాయ్పై ముష్కరుల కాల్పులు
జమ్మూ: జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ సెక్టార్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. వాస్తవాధీన రేఖకు సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా ఆర్మీ కాన్వాయ్పైకి ఉగ్ర మూకలు కాల్పులకు దిగాయి. బలగాలు అప్రమత్తమై దీటుగా స్పందించడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ముష్కరులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. ఆ ప్రాంతాన్ని దిగ్బంధించిన బలగాలు అదనంగా పోలీసులను, ఆర్మీని తరలించి గాలింపు ముమ్మరం చేశారు. ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వద్ద ఆయుధం స్వాధీనం చేసుసుకున్నారు. హెలికాప్టర్ను రంగంలోకి దించి బలగాలు ఓ భవనం బేస్మెంట్లో ఉగ్రవాదులు దాగినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా భారీ పేలుళ్లు, కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు సభ్యుల ముష్కరుల ముఠా ఆదివారం రాత్రి సరిహద్దులు దాటి దొంగచాటుగా దేశంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అంబులెన్సుకు కనీసం డజను బుల్లెట్లు తగిలాయని చెప్పారు. అంతకుముందు, ఉగ్రవాదులు అస్సన్ ఆలయంలోకి ప్రవేశించి సెల్ఫోన్ కోసం అక్కడి వారిని అడిగారు, ఇంతలోనే అటుగా వస్తున్న ఆర్మీ కాన్వాయ్ని గమనించి కాల్పులకు దిగారన్నారు. -
Russia-Ukraine war: రష్యాపై వందల డ్రోన్లతో ఉక్రెయిన్ ముప్పేట దాడి
కీవ్: రష్యా దురాక్రమణతో ఆగ్రహించిన ఉక్రెయిన్ మరోమారు డ్రోన్లతో ముప్పేట దాడికి తెగబడింది. డజన్ల కొద్దీ డ్రోన్లతో ఎదురుదాడిని పెంచింది. అయితే ఈ డ్రోన్లలో చాలావాటిని రష్యా విజయవంతంగా నేలకూల్చడంతో భారీ నష్టం ప్రాణ, ఆస్తినష్టం తప్పింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీదకు రష్యా దండయాత్ర మొదలెట్టాక భారీ స్థాయిలో ఉక్రెయిన్ చేసి ప్రతిఘటనల్లో ఇదీ ఒకటని రక్షణ రంగ వర్గాలు చెబుతున్నాయి. అయితే అటవీప్రాంతంలో కూలిన డ్రోన్ల నుంచి చెలరేగిన మంటలతో కార్చిచ్చు వ్యాపించింది. ఒక భవనం అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. రష్యావ్యాప్తంగా ఏడు రీజియన్లలో పెద్దసంఖ్యలో ఉక్రె యిన్ డ్రోన్లను ప్రయోగించిందని, వాటిలో 125 డ్రోన్లను నేలకూల్చామని రష్యా రక్షణ మంత్రిత్వి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక్క ఓల్గోగ్రేడ్ రీజియన్లోనే 67 శత్రు డ్రోన్లను పేల్చేశామని రష్యా తెలిపింది. ఓరోనెజ్, రస్తోవ్ ప్రాంతాల్లోనూ డ్రోన్ల దాడులు, వాటిని రష్యా గగనతల రక్షణ వ్య వస్థ కూల్చేసిన ఘటనలు నమోద య్యాయి. డ్రోన్ల మంటలు పడి దాదాపు 50 ఎకరాల్లో అడవి తగలబడిపోయింది. -
Lok sabha elections 2024: కమలానికి పెనుసవాళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్న కమల దళానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనా«థ్ తదితర కీలక నేతలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు విపక్షం నుంచి ఎదురుదాడి, మిత్రపక్షాల కారణంగా తలెత్తుతున్న చిక్కులు, కొన్ని వర్గాల్లో నానాటికీ పెరుగుతున్న అసంతృప్తి వంటివి బీజేపీలో అలజడి సృష్టిస్తున్నాయి. రిజర్వేషన్ల రద్దు అంశంపై రగడ ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఇప్పటిదాకా సొంతంగా 432 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో పది నుంచి పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. మొత్తం 445 మంది అభ్యర్థులను బరిలో నిలిపినా, 370 సీట్ల లక్ష్యం సాధించాలంటే 80 శాతానికి పైగా స్థానాల్లో కచి్చతంగా నెగ్గాల్సి ఉంటుంది. కానీ, అందుకు ప్రతిబంధకాలు లేకపోలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. రిజర్వేషన్లు, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని పదేపదే ఆరోపిస్తున్నాయి. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంక, ఆప్ నేత సంజయ్ సింగ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ రిజర్వేషన్లు, రాజ్యాంగంపై బీజేపీని ఇరుకున పెడుతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ ఇటీవల వైరల్ చేసిన అమిత్ షా డీప్ఫేక్ వీడియో తర్వాత రిజర్వేషన్ల రద్దు అంశంపై జనంలో చర్చ మొదలైంది. రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని, అలాంటి ఆలోచనే లేదని నరేంద్ర మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇస్తున్నప్పటికీ, దేశంలో 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల్లో అనుమానాలు పూర్తిగా తొలగిపోవడం లేదు. మరో ఐదు విడతల్లో 350కి పైగా స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. రిజర్వేషన్ల రద్దు వ్యవహారం ఓటర్లపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అందుకేనా 400 సీట్లు? మళ్లీ బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేయడం ఖాయం అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. రాజ్యాంగంతోపాటు కీలకమైన చట్టాలను మార్చడానికే ‘అబ్కీ బార్ చార్ సౌ పార్’ నినాదాన్ని బీజేపీ తెరపైకి తెచి్చందని కాంగెరస్ అధ్యక్షుడు ఖర్గే సహా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయం, సమానత్వం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ద్వేషిస్తోందని, నియంతృత్వ పాలన తీసుకురావడమే ఆ పార్టీ లక్ష్యమని విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపైనా ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాల్సి వచి్చంది. సాక్షాత్తూ బాబాసాహెబ్ అంబేడ్కర్ దిగివచి్చనా రాజ్యాంగాన్ని మార్చలేరని ఆయన పలు సభల్లో చెప్పారు. అయినప్పటికీ రాజ్యాంగ మార్పుపై బీజేపీ నేతలు అనంతకుమార్ హెగ్డే, అరుణ్ గోవిల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి సంకటంగా మారాయి. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం తమకు లేదని మోదీ పదేపదే స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా విపక్షాల దాడిని సమర్థంగా తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమవుతోంది. రాజ్యాంగం మార్పుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొన్ని వర్గాల ప్రజలు నమ్ముతున్నట్లే కనిపిస్తోంది. ఇంకోవైపు రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తమ జనాభా ఉన్న స్థానాల్లోనూ తమ వర్గం వారికి టిక్కెట్లు ఇవ్వలేదని రాజ్పుత్లు బీజేపీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మహాపంచాయతీలు నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలతో వివాదం కర్ణాటకలో బీజేపీ మిత్రపక్షమైన జేడీ(ఎస్) సిట్టింగ్ ఎంపీ, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కర్ణాటకలో రెండో విడత పోలింగ్కు రెండు రోజుల ముందు ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతోంది. ప్రజ్వల్ రేవణ్ణను జేడీ(ఎస్) నుంచి బహిష్కరించినప్పటికీ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. -
Russia-Ukraine war: రష్యాపై డ్రోన్లతో దాడి
కీవ్: రష్యా భూభాగంపై ప్రతి దాడులను ఉక్రెయిన్ ముమ్మరం చేసింది. శుక్రవారం సరిహద్దుల్లోని రష్యాకు చెందిన రోస్టోవ్ ప్రాంతంపైకి ఉక్రెయిన్ పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో మొరొజొవ్స్కీ ఎయిర్ ఫీల్డ్లోని ఆరు సైనిక విమానాలు ధ్వంసం కాగా, మరో ఎనిమిదింటికి నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ తెలిపింది. 20 మంది సిబ్బంది చనిపోయినట్లు ప్రకటించుకుంది. మొరొజొవ్స్కీ ప్రాంతంపైకి వచ్చిన 44 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. వైమానిక స్థావరంపై దాడి, యుద్ధ విమానాలకు జరిగిన నష్టంపై రష్యా స్పందించలేదు. దాడుల్లో ఒక విద్యుత్ ఉపకేంద్రం మాత్రం ధ్వంసమైందని పేర్కొంది. సరటోవ్, కుర్స్క్, బెల్గొరోడ్, క్రాస్నోడార్లపైకి వచ్చిన డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా ఆర్మీ తెలిపింది. -
మావోల సరికొత్త ఎత్తుగడ
ఛత్తీస్గఢ్ అడవుల్లో బంకర్ వెలుగుచూసిన నేపథ్యంలో మావోయిస్టులు సరికొత్త ఎత్తుగడలు అనుసరిస్తున్నట్టు తెలిసింది. దశాబ్దంన్నర కాలంగా బస్తర్ అడవుల్లో మావోయిస్టులు నిర్వహిస్తున్న జనతన సర్కార్ను నిర్వీర్యం చేసేందుకు భద్రతాదళాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. వందల సంఖ్యలో క్యాంపులు ఏర్పాటు చేస్తూ, ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ క్రమంగా అడవులపై పట్టు సాధిస్తున్నాయి. దీంతో పోలీసుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు అమలు చేసే పనిలో మావోయిస్టులు ఉన్నారు. ఈ మేరకు 80 పేజీలతో కూడిన ప్రత్యేక డాక్యుమెంట్ను గోండు భాషలో తయారు చేశారు. ఇందులో ఉన్న రణతంత్ర వివరాలపై గతంలోనే జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, దీనిని ఆతర్వాత కొందరు హిందీలోకి అనువదించినట్టు తెలిసింది. ఆకాశదాడులు తిప్పికొట్టేలా.. డ్రోన్లు, హెలికాప్టర్లతో భద్రతాదళాలు తమపై రెండేళ్లుగా దాడులు చేస్తున్నాయంటూ మావోయిస్టులు ఆరోపిస్తుండగా, మావోయిస్టుల ఏరివేతకు వాయు దాడులు చేయడం లేదని భద్రతాదళాలు చెబుతున్నాయి. డ్రోన్లు ఉపయోగించినా నిఘా కోసమే తప్ప దాడులకు కాదంటున్నారు. ఇలా భిన్నవాదనలు ఉన్నా, ఆకాశ దాడులను తట్టుకోవడంతో పాటు తిప్పికొట్టే వ్యూహాలపై మావోయిస్టులు తీవ్రంగా ఆలోచించారు. ఈమేరకు రక్షణ వ్యూహాల్లో డ్రోన్లు, హెలికాప్టర్ల దాడుల నుంచి తప్పించుకునే అంశంపై డాక్యుమెంట్లో చర్చించారు. తాము సంచరిస్తున్న ప్రాంతాల్లో డ్రోన్లు లేదా హెలికాప్టర్లు ఎదురైతే వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని నిర్ణయించారు. డ్రోన్లు, హెలికాప్టర్ దాడులను తిప్పికొట్టేలా ‘చెట్లపై నుంచి రాకెట్ లాంచర్లు పేల్చడం’పై కేడర్కు శిక్షణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. డ్రోన్లపై తేలికగా దాడులు చేసేందుకు వీలుగా కొండపై ఎత్తయిన ప్రాంతాల్లో గస్తీ బృందాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచే లాంగ్ పైప్ బాంబులను ప్రయోగించే దానిపై ఫోకస్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మూడడుగుల బంకర్లు డ్రోన్లు, హెలికాప్టర్ల కంట పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా డాక్యుమెంట్లో చర్చించారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అడవిలో ఆరుబయట ప్రాంతంలో కాకుండా పైనుంచి చూస్తే కనిపించకుండా ఉండే చెట్ల కిందే విశ్రమించాలని నిర్ణయించారు. ఒకే చోట ఎక్కువ కాలం ఉంటే...కనీసం మూడు అడుగుల లోతుతో బంకర్లు నిర్మించాలని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. కొత్తగా మావోయిస్టు స్నైపర్ టీమ్లు మావోయిస్టులకు ఇప్పటికే బెటాలియన్లు, ప్లాటూన్లు, లోకల్ గెరిల్లా స్క్వాడ్, యాక్షన్స్ టీమ్లు ఉన్నాయి. అయితే అబూజ్మడ్ అడవుల్లో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ క్యాంపులు పెరిగిపోతున్నాయి. ఒకేసారి వందల మందితో కూడిన బెటాలియన్లు అడవుల్లో నలుదిశలా కూంబింగ్ చేస్తున్నాయి. దీంతో భద్రతాదళాలపై అందుబాటులో ఉన్న కేడర్తో అంబూష్ దాడి చేయడం మావోయిస్టులకు సాధ్యం కావడం లేదు. కనీసం కూంబింగ్ స్పీడ్కు బ్రేకులు వేయడం సైతం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా స్నైపర్ టీమ్లు ఏర్పాటు చేసే అంశంపై మావోయిస్టులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అడవుల్లోకి వచ్చే భద్రతాదళాలపై స్నైపర్ టీమ్ దాడి చేసి కనీసం ఒక్కరిని గాయపరచగలిగినా భద్రతా దళాల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, తద్వారా కూంబింగ్ స్పీడ్కు బ్రేకులు పడతాయనేది మావోయిస్టుల వ్యూహంగా ఉన్నట్టు తెలిసింది. అగ్రనేతల సమావేశం? దంతెవాడ – బీజాపూర్ జిల్లా సరిహద్దులో వెలుగుచూసిన బంకర్లో మావోయిస్టు అగ్రనేతల సమావేశం జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనవరి రెండో వారంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బడే చొక్కారావును మావోయిస్టు పార్టీ నియమించింది. అంతకుముందు ఆ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన నాయకులు తాజాగా వెలుగు చూసిన బంకర్లోనే సమావేశమైనట్టు తెలుస్తోంది. :::సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
-
కేసీఆర్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్
-
ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ యత్నం
చెన్నై: సనాతన ధర్మకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చేస్తున్న తీవ్ర ఆరోపణలపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఎదురుదాడి ప్రారంభించారు. ప్రధాని మోదీ సహా కాషాయ పార్టీ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. వ్యాఖ్యలపై దాఖలైన కేసులన్నిటినీ చట్టపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మణిపూర్లో నెలలుగా కొనసాగుతున్న హింసపై విమర్శలను ఎదుర్కోలేని ప్రధాని మోదీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తన వ్యాఖ్యలపై రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ, మంత్రులు సనాతన ధర్మపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై చర్చించిన విషయం తెలిసిందే. ‘ప్రజలకిచ్చిన వాగ్దానాలను తొమ్మిదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్మరించింది. ప్రజల సంక్షేమం కోసం బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. దీనిని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ నేతలు ‘జనహననం’అంటూ నా వ్యాఖ్యలను వక్రీకరించారు. తమను తాము రక్షించుకునేందుకు దీనిని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు’అని గురువారం ఉదయనిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. ‘మణిపూర్లో ఆగని హింసపై సమాధానం ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే మోదీజీ స్నేహితుడు అదానీని వెంటేసుకుని ప్రపంచ దేశాల్లో తిరుగుతున్నారు. మణిపూర్ హింసలో 250 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు..మోదీ ప్రభుత్వం 7.5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది. వీటన్నిటినీ మరుగుపరిచేందుకే మోదీ, ఆయన బ్యాచ్ సనాతన వ్యాఖ్యలను వాడుకోవాలనుకుంటున్నారు. ప్రజల అమాయకత్వమే వారి రాజకీయాలకు పెట్టుబడి. ’అని విమర్శించారు. ‘ఈ రోజుల్లో సాధువులు కూడా ప్రచారం కోరుకుంటున్నారంటూ తన తలపై రూ.10 కోట్లు ప్రకటించిన సాధువుపై ఉదయనిధి వ్యాఖ్యానించారు. అంతా త్యాగం చేసిన ఆ సాధువుకు రూ.10 కోట్లు ఎలా వచ్చాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమానవీయ విశ్వాసాలపైనే..: స్టాలిన్ సనాతన ధర్మంపై తన కొడుకు, మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై రేగుతున్న దుమారంపై సీఎం స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మంలో భాగమైన అమానవీయ సిద్ధాంతాలపైనే ఉదయనిధి మాట్లాడారని చెప్పారు. వీటి ఆధారంగా ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. -
నిండు సభలో.. మహిళా మంత్రికి ముద్దులా?
న్యూఢిల్లీ: లోక్సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫ్ల్లయింగ్ కిస్లు బుధవారం పెను వివాదానికి దారి తీశాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతుండగా అధికార సభ్యుల కేసి ఆయన ముద్దులు విసిరారు. రాహుల్కి ఉన్న మహిళా విద్వేషానికి ఇది నిదర్శనమని బీజేపీ దుమ్మెత్తిపోయగా, అధికార పార్టీ రాహుల్ ఫోబియాతో బాధ పడుతోందంటూ కాంగ్రెస్ ఎదురు దాడికి దిగింది. రాహుల్పై అత్యంత కఠిన చర్య తీసుకోవాలంటూ బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ బిర్లాకు ఫిర్యాదుచేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాహుల్ తీరును తూర్పారబట్టారు. మొత్తంమ్మీద అనర్హత వేటు తర్వాత సభలో అడుగుపెట్టిన తర్వాత రాహుల్గాంధీ చేసిన సైగలతో రేగిన దుమారం కొద్దిరోజులపాటు పార్లమెంట్ను కుదిపేసేలా కనిపిస్తోంది. సభలోనే కన్ను కొట్టిన చరిత్ర రాహుల్ది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి లోక్సభలో రాహుల్ అసభ్యకర సైగలు చేశారంటూ స్పీకర్కు బీజేపీ లిఖితపూర్వక ఫిర్యాదుచేసింది. మంత్రులు శోభా కరంద్లాజే, దర్శన జర్దో‹Ùతోపాటు 20 మందికిపైగా బీజేపీ మహిళా ఎంపీలు దానిపై సంతకం చేశారు. ‘ రాహుల్ చేసిన దిగజారుడు పని సభలోని మహిళా సభ్యులను తీవ్రంగా అవమానించింది. అంతేకాదు, లోక్సభలో గౌరవానికి కూడా భంగం కలిగింది. అందుకే ఆయనపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుమ్మెత్తిపోశారు. ఒక సభ్యుడు నిండు సభలో ఇంత బాహాటంగా స్త్రీ విద్వేషం ప్రదర్శించిన ఉదంతం పార్లమెంట్ చరిత్రలోనే ఎన్నడూ లేదని మహిళా బీజేపీ ఎంపీ అన్నారు. గాంధీ కుటుంబీకులు పాటించే విలువలకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇలాంటి దిగజారుడు ప్రవర్తనకుగాను రాహుల్కు తగిన శిక్ష పడి తీరాలని డిమాండ్ చేశారు. ఇరానీ ప్రసంగం వినాల్సిందిగా బీజేపీ సభ్యులు కోరినందుకు రాహుల్ వారివైపు రెండు మూడు అడుగులు వేసి మరీ ఫ్లైయింగ్ కిస్సులు విసిరారని శోభా కరంద్లాజే ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీలు చూసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలోనూ లోక్సభలో కన్ను కొట్టిన చరిత్ర రాహుల్కు ఉందని ఎంపీలు గుర్తుచేశారు. ఆయన ప్రవర్తనలోనే ఏదో లోపముందని అభిప్రాయపడ్డారు. మణిపూర్పై చర్చ తప్పించుకునేందుకే: కాంగ్రెస్ లోక్సభలో రాహుల్ ఫ్ల్లయింగ్ కిస్సులను కాంగ్రెస్ గట్టిగా సమరి్థంచుకుంది. ఆయన మహిళలను ఎప్పటికీ అగౌరవపరచజాలరని పార్టీ స్పష్టంచేసింది. మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో చర్చ జరగడం అధికార పారీ్టకి అస్సలు ఇష్టం లేదంటూ ఎదురుదాడికి దిగింది. అందుకే రాహుల్పై ఇలా తప్పుడు ఆరోపణలకు బరితెగించిందని ఆరోపించింది. బీజేపీకి, స్మృతి ఇరానీకి రాహుల్ ఫోబియా పట్టుకుందని లోక్సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాకూర్ ఎద్దేవాచేశారు. ముద్దులు.. ప్రేమకు, ఆప్యాయతకు నిదర్శనమని ఆయన చేసిన భారత్ జోడో యాత్రను చూసిన వారందరికీ తెలుసు అని కాంగ్రెస్ పారీ్టప్ర«దాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గుర్తుచేశారు. రాహుల్ చర్య ఆప్యాయత చిహ్నమేనని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది వ్యాఖ్యానించారు. ‘అప్పట్లో రాహుల్ ప్రేమ దుకాణం అన్నారు. ఇదీ అలాంటి సదుద్దేశంతో కూడిన సైగ మాత్రమే’ అని స్పష్టంచేశారు. -
రాహుల్ విమర్శలకు మంత్రి హరీష్ రావు కౌంటర్
-
దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ కౌంటర్ ప్లాన్
-
రష్యాపై ఎదురుదాడికి ఉక్రెయిన్ సన్నాహాలు!
బెర్లిన్: రష్యా ఆక్రమించిన ప్రాంతాలకు తిరిగి విముక్తి కల్పించడానికి ఎదురుదాడికి దిగుతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. అయితే రష్యా భూభాగంపై దాడులకు పాల్పడబోమని స్పష్టం చేశారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన జెల్న్స్కీ ఆదివారం జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్ స్కాల్జ్తో సమావేశమయ్యారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దు ప్రాంతాలకు విముక్తి కల్పించడమే తమ మీడియాకు లక్ష్యమని తెలిపారు. తమ ప్రాంతాలను రష్యాపై నుంచి తీసుకుంటామన్నారు. రష్యాపై దాడికి దిగేటంత ఆయుధ సంపత్తి తమ దగ్గర లేదన్నారు. రష్యా అక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి తీసుకుంటామని చెప్పారు. తమకు అండదండగా ఉంటూ 300 కోట్ల డాలర్ల విలువైన మిలటరీ సాయం చేసిన జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్కు ధన్యవాదాలు తెలిపారు. -
ఉక్రెయిన్కు నాటో భారీ ఆయుధ సాయం
కీవ్: రష్యాపై ఎదురుదాడి ప్రయత్నాల్లో ఉన్న ఉక్రెయిన్ బలగాలకు నాటో భారీ సాయం లభించింది. నాటోలోని మొత్తం 31 సభ్య దేశాలు కలిపి ఉక్రెయిన్కు 1,550 పోరాట వాహనాలు, 230 ట్యాంకులు, ఇతర పరికరాలతోపాటు పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని అందించాయి. దీంతో ఉక్రెయిన్కు ఇచ్చిన హామీల్లో 98% వరకు నెరవేర్చినట్లయిందని నాటో సెక్రటరీ–జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ చెప్పారు. అంతేకాకుండా, కొత్తగా ఏర్పాటైన9 ఉక్రెయిన్ బ్రిగేడ్లకు చెందిన 30 వేల బలగాలకు ఆయుధ, శిక్షణ సాయం కూడా ఇచ్చామని చెప్పారు. ఇవన్నీ కలిపితే ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాను వెళ్లగొట్టేందుకు జరిగే పోరులో ఉక్రెయిన్ పైచేయిగా నిలుస్తుందన్నారు. శాంతి చర్చల్లోనూ ఆ దేశం పటిష్ట స్థానంలో ఉంటుదన్నారు. ఇలా ఉండగా, బుధ, గురువారాల్లో రష్యా కాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్ల దాడిలో ఉక్రెయిన్లోని మైకోలైవ్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిందని అధికారులు చెప్పారు.. కనీసం ఏడుగురు చనిపోగా, మరో 33 మంది గాయపడ్డారు. దాడుల్లో 22 బహుళ అంతస్తుల భవనాలు, 12 ప్రైవేట్ ఇళ్లు, ఇతర నివాస భవనాలు దెబ్బతిన్నాయి. -
రఘునందన్ ఆరోపణలపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. రఘునందన్ ఆరోపణలు ఖండిస్తున్నానని అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఆర్డిఎస్ భూములను కబ్జా చేశానని రఘునందన్ చెప్తున్నాడు. ఆర్డిఎస్ ఎక్కడుంది ఆయనకు తెలుసా? సర్వే నంబర్ 60 లో శ్రీశైలం ముంపు లో పోయింది. 2020 లో సర్వే చేయించిన తరవాతే మేము వాటిని ఖరీదు చేశాం. ఎవరు అప్లికేషన్ పెట్టినా సర్వే చేస్తారు. న్యాయవాదిగా ఉన్న రఘునందన్ ఇలాంటి కామెంట్స్ చేయొచ్చా? ఇప్పుడు సర్వే చేసినా ఎంత భూమి ఉందో తెలుస్తుంది కదా? నేను విదేశాల్లో ఉన్నప్పుడే రిప్లై పంపించాను. ఆయన ఎప్పుడు వస్తారో చెప్పండి. మేము మళ్ళీ సర్వే చేయిస్తాం. మీరు తప్పు చేసినట్టు రుజువైతే తప్పయింది అని ఒప్పుకోవాలి. (ఒక్క గుంట భూమి ఎక్కువున్నా రాజీనామా చేస్తా.. పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్లేనా?) నాకంటే చిన్న వాడివి. అపర మేధావి అని నాకు తెలుసు. పక్క నియోజకవర్గంలో వేలు పెట్టేపెట్టడం మానుకోవాలి. మా దగ్గర ఉన్న భూములకు రికార్డ్స్ ఉన్నాయి. మాకు భూమి అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు’ అని పేర్కొన్నారు. -
మా నామినేషన్లు చెల్లకుండా చేసే కుట్ర
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడితో పాటే అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కూడా తారస్థాయికి చేరుతోంది. తమ నామినేషన్లను ఏదోలా చెల్లకుండా చేసేందుకు బసవరాజ్ బొమ్మై సర్కారు భారీ కుట్రకు తెర తీస్తోందని పీసీసీ చీఫ్ శివకుమార్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థుల నామినేషన్లలో ఏదో ఒక లోపాన్ని వెతకాలని, అలాగే బీజేపీ నామినేషన్లలో ఏమైనా తప్పులుంటే సరి చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్లందరి మీదా ఎంతగానో ఒత్తిడి తెస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు స్వయానా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వారికి ఫోన్లు వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం రంగంలోకి దిగి దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీఎంఓ కాల్ డీటైల్స్ తెప్పించుకుని పరిశీలించాలని సూచించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి అంతూ పొంతూ లేకుండా పోతోందంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ కుట్రకు సంబంధించి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. సౌందత్తి ఎల్లమ్మ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయి. వాటిని సరిచేయాల్సిందిగా సీఎంఓ నుంచి ఆర్ఓకు ఫోన్ వెళ్లింది. ఇక నా నామినేషన్ను ఏదోలా తిరస్కరింపజేసేందుకు బీజేపీ తరఫున పెద్ద టీమే రంగంలోకి దిగింది. నా పరిస్థితే ఇలా ఉంటే ఇతర సాధారణ అభ్యర్థుల సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. -
పోటీ సంస్థలను దెబ్బతీస్తున్న జియో.. ఎయిర్టెల్ ఏం చెబుతోందంటే?
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. తాము చౌక టారిఫ్లను అమలు చేస్తున్నామన్న దుగ్ధతోనే ఎయిర్టెల్ జియోఫైబర్పై ఫిర్యాదులు చేస్తోందని, కావాలనే తమ ప్రతిష్టను దెబ్బతీసే యత్నాలు చేస్తోందని రిలయన్స్ జియో ఆరోపించింది. భవిష్యత్తులో ఇలాంటి చౌకబారు ఆరోపణలు మళ్లీ చేయకుండా ఎయిర్టెల్ను హెచ్చరించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్కి రాసిన లేఖలో కోరింది. రిజిస్టర్ చేసుకోని డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫాంలకు కంటెంట్ను అందించడం ద్వారా బ్రాడ్కాస్టింగ్ సంస్థలు డౌన్లింకింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ ట్రాయ్కు ఎయిర్టెల్ ఫిర్యాదు చేసింది. తద్వారా ఐపీఎల్ 2023 మ్యాచ్లను జియో టీవీ ప్రసారం చేస్తుండటాన్ని పరోక్షంగా ప్రస్తావించినట్లయింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (ఆర్జేఐఎల్) బ్రాడ్బ్యాండ్ ప్లానలతో పాటు పోటీ సంస్థలను దెబ్బతీసేలా చౌకగా లైవ్ టీవీ చానెళ్లు కూడా అందిస్తోందంటూ ఎయిర్టెల్ ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ జియోకు ట్రాయ్ సూచించింది. తాము వినియోగదారులకు అందుబాటు ధరల్లో సేవలు అందిస్తున్నామనే అక్కసుతోనే ఎయిర్టెల్ ఇటువంటి ఆరోపణలు చేస్తోందని జియో స్పష్టం చేసింది. తమ ప్లాన్లపై వివరణ ఇచ్చింది. -
కమలానికి కౌంటర్
-
Ram Gopal Varma: నాగబాబుపై ఆర్జీవీ సెటైర్లు.. వీడియో రిలీజ్
సాక్షి, హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన నాయకుల మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. పవన్ కల్యాణ్పై కామెంట్లు చేశారంటూ తనపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్న నేపథ్యంలో ఆర్జీవీ మరోసారి కౌంటర్ ఎటాక్గా ముందుకొచ్చారు. ‘కొణిదెల నాగబాబు.. ఆయన తమ్ముడికి లేక అన్నయ్యకు ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు నాకు కాదు. నేను జనసేన మీదకాని పవన్ కల్యాణ్ మీద చేసిన ట్వీట్స్ పవన్ అభిమానిగా చేశాను. అది అర్ధం అవ్వకపోకడం నా దురదృష్టం.. అంతకన్నా ఎక్కువ పవన్ దురదృష్టం. కేవలం తన అన్నయ్య కాబట్టి ఇలాంటి సలహాదారులను మాత్రమే పెట్టుకుంటే దాని తరువాత పవన్ కల్యాణ్ అవుట్ కమ్ ఏమిటో! జనమే చెపుతారు’ అంటూ రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. ఈమేరకు ట్విటర్లో వీడియో రిలీజ్ చేశారు. Hello @Pawankalyan gaaru , Konchem mee bhaijaaan gaarini choosukondi pic.twitter.com/8ih8kgxlDC — Ram Gopal Varma (@RGVzoomin) January 15, 2023 డైమండ్ రాణి అనే బిరుదుతో ఒకావిడని కించపరిచిన వ్యక్తికి తనుకూడా ఒక ఇస్పెట్ రాజా అని తెలుసుకోవాల్సిన కనీస జ్ఞానం ఉండాలి అని ఒక పి ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నాను — Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2023 -
TS: ఎన్నికలపై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
KTR.. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్..బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీ పెద్దల అవినీతి వల్లే రూపాయి విలువ పడిపోతోంది. మొదటి సర్వే బీజేపీది, రెండో సర్వే కాంగ్రెస్ది.. కానీ, వారి షాకిస్తూ రెండు సర్వేల్లో టీఆర్ఎస్ గెలుస్తుందనే తేల్చాయి. మా ప్రత్యర్థుల సర్వేలు కూడా మూడోసారి టీఆర్ఎస్ గెలుస్తుందని ఒప్పుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో 90కి పైగా స్థానాల్లో గెలుస్తాము. నల్లగొండ, ఖమ్మంలో బీజేపీకి మండల స్థాయి నాయకులు లేరు. కాంగ్రెస్కు కూడా కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. కట్టప్పల గురించి కేసీఆర్ వివరంగా చెప్పారు. మోదీ ప్రధాని అయ్యాక 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. పార్లమెంట్లో అన్పార్లమెంట్ పదాలు వాడేది బీజేపీ నేతలే. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. ప్రధాని మోదీ ప్రైవేటు విజిట్కు సీఎం కేసీఆర్ స్వాగతం పలకాల్సిన అవసరం లేదు. మోదీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్. గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ గుజరాత్కు వస్తే ఎందుకు రిసీవ్ చేసుకోలేదు. తెలంగాణ గవర్నర్ తమిళిసైతో మాకు ఎటువంటి పంచాయితీ లేదు. సొంత నియోజకవర్గంలో గెలవలేని రాహుల్, రేవంత్ సిరిసిల్లకు వచ్చి ఏం చేస్తారు?. అందరు ప్రధానులు రూ. 56లక్షల కోట్ల అప్పులు చేస్తే.. మోదీ ఒక్కరే 100 లక్షల కోట్ల అప్పులు చేశారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైంది?. కాంగ్రెస్ హయంలో శ్రీశైలం, కల్వకుర్తి పంపుహౌస్లు మునిగిపోయాయి. ప్రకృతి విపత్తుల వల్ల పంప్హౌస్లోకి నీళ్లు వస్తే ఎవరేం చేస్తారు’’ని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్పై కర్రలు, రాళ్లతో దాడి -
ఇంటికే వస్తా అంటే రమ్మంటిని, కానీ, ఎక్కడా?: జూపల్లి
సాక్షి,నాగర్ కర్నూల్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం విష్ణువర్ధన్ రెడ్డి పరస్పర సవాళ్లతో కొల్లాపూర్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో అవాంఛిత ఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ ఎత్తున మోహరించారు. అయితే, చర్చలో పాల్గొనేందుకు జూపల్లి ఇంటికి బీరం ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే బీరం నిరాధార ఆరోపణలను జూపల్లి మీడియా ఎదుట ఎండగట్టారు. చదవండి👉🏼 విరాట పర్వం.. 30 ఏళ్ల కిందట పేలిన తూటా శంకరన్న చేతిలో సరళ బలి రాత్రి నుంచి చూస్తున్నా.. ఎక్కడా? ‘నేను అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడదామన్న. కాని చర్చకు ఇంటికే వస్తా అంటే స్వాగతం పలుకుతానని చెప్పా. నీ మాట ప్రకారమే రాత్రి నుంచి ఎదురుచూస్తున్నా. కానీ, ఎమ్మెల్యే రాలేదు. మూడున్నరేళ్లు ఎమ్మెల్యే ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అరెస్టు చేయించుకుని తప్పించుకుని పోయినవ్.. ముఖం చాటేసుకున్నవ్. ఎమ్మెల్యే మాట మార్చాడు. నేను మాట మార్చలేదు. హుస్సేన్ సాగర్ కారు ప్రమాదం, ఫ్రుడెన్షియల్ బ్యాంకు వ్యవహారాలపై ఎమ్మెల్యే అవాస్తవాలు మాట్లాడుతున్నాడు. అప్పు తీసుకుని వ్యాపారం చేసాం, ఇది తప్పు అన్నట్లుగా మాట్లాడితే ఎట్లా!. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయొద్దని సహచర మంత్రులే సూచించినా నేను వెనక్కి తగ్గలేదు. మిగతా మంత్రులపై ఒత్తిడి వస్తుంది వద్దన్నారు. వెయ్యి కోట్లిచ్చినా అమ్ముడు పోయే వ్యక్తిని కాను. నాది మచ్చలేని చరిత్ర. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కోర్టులో కేసు వేసిందెవరు? నా పై నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బీరంపై పరువు నష్టం దావా వేస్తా’అని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. చదవండి👉🏼కొల్లాపూర్లో హై టెన్షన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్ -
‘మోదీగారు.. వంటగ్యాస్ ధర తగ్గించండి’.. సబితా ఇంద్రారెడ్డి గట్టి కౌంటర్
మీర్పేట: ప్లీజ్ తెలంగాణలో ఒక్కసారి అధికారం ఇవ్వండని బీజేపీ నాయకుల అభ్యర్థనకు ‘ప్లీజ్ మోదీగారు వంటగ్యాస్, ఇంధన ధరలు తగ్గించండి’ అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో నిత్యం పెరిగిపోతోన్న గ్యాస్ ధరలను నిరసిస్తూ ఆదివారం రంగారెడ్డి జిల్లా మీర్పేటలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చీపుళ్లు తిరగేస్తారనే భయంతోనే తుక్కుగూడలో జరిగిన బీజేపీ సభకు మహిళలను ఆహ్వానించలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఒక్కో రంగాన్ని ఎంచుకుని అభివృద్ధి చేస్తున్నారని తెలిపా రు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.2వేల పింఛను ఇస్తుంటే..మరి కేంద్రం గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదని మహిళలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ సభలో అమిత్షా రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటీ మాట్లాడలేదని.. అసలు సభ ఎందుకు పెట్టినట్లని ఆమె సూటిగా ప్రశ్నించారు. బాలాపూర్ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణుల మహాధర్నా. (ఇన్సెట్లో) కట్టెలపొయ్యిపై వంట చేస్తున్న మంత్రి సబిత రానున్న రోజుల్లో మహిళల ఆగ్రహానికి బీజేపీ గురికాకతప్పదని హెచ్చరించారు. హిందూ, ముస్లింల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. బీజేపీ నాయకులు ప్రజల్లోకి వస్తే గ్యాస్, ఇంధన ధరలు తగ్గించేంత వరకు తమ వద్దకు రావద్దని మహిళలే వారిని తరిమి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే జీవో నంబర్ 111ను ఎత్తివేస్తామని బండి సంజయ్ చెప్పారని, దానిపై ఆయనకు అవగాహన లేదని, ఓ వైపు 111 జీవోను ఎత్తివేస్తేనే ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి అన్ని రూ.కోట్లు ఇచ్చామంటూ కిషన్రెడ్డి, అమిత్షా పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలకు డబ్బులు ఇస్తున్నామని చెబుతున్న వారు ఇవే పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమిత్ షానా.. అబద్దాలకు బాద్ షానా.. స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో శనివారం కేంద్ర హోం మంత్రి పర్యటన తర్వాత తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడిక్కెంది. అమిత్ షా వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయ పర్యటకుల తాకిడి ఎక్కువైంది. హైదరాబాద్కి వచ్చి బిర్యానీ తిని, చాయి తాగి ఇక్కడి నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తున్నారు. అమిత్ షా మాట్లాడిన అబద్దాలు చూస్తుంటే తన పేరు మార్చుకోవాలి. తన పేరు అమిత్ షా కాదు అబద్దాల బాద్ షాగా మార్చుకోవాలి. తుక్కుగూడలో తుక్కు డిక్లరేషన్ అంతా తుప్పే మాటలే. కేంద్ర మంత్రి హోదాలో ఉండి వాస్తవాలు చెప్పకుండా ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్ళాడు. పదవులు అమ్ముకునే దౌర్భాగ్యులు, హీనులు, చిల్లర పార్టీ బీజేపీ. కర్నాటకలో 40 శాతం కమీషన్ ఇవ్వకపోతే నిధులు ఇచ్చే పరిస్థితి లేదు.. అవినీతి ఎవరిది?. సీఎం పదవిని అమ్ముకునే మీ పార్టీ అవినీతి పార్టీ కాదా?. చైతన్యవంతమైన పార్టీ టీఆర్ఎస్పైన పిచ్చిగా మాట్లాడటం మంచిది కాదు. నిజం చెప్పమని అడిగితే నిజాం గురించి మాట్లాడుతున్నాడు. నిజాం వారసులుగా బీజేపీ నేతలు పదే పదే తలుచుకుంటున్నారు. ఈ ఎనిమిది ఏళ్లలో కేంద్రం తెలంగాణకు చేసింది ఏమిటో చెప్పాలని అడిగాము. ఓ చదువుకోని బీజేపీ ఎంపీ 3 లక్షల 94 వేల కోట్లు ఇచ్చామని చెప్తున్నాడు. కానీ, నిన్న అమిత్ షా 2లక్షల కోట్లు ఇచ్చామని చెప్పాడు. బీజేపీ నేతల మాటలు అబద్దాలు అనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణ ప్రజలు కడుతున్న పన్నులతో బీజేపీ పాలిత రాష్ట్రాలు బతుకుతున్నాయి. అప్పుల శాతంలో మనది 23వ రాష్ట్రం. 28 రాష్ట్రాలలో కింది నుండి 5వ స్థానం తెలంగాణది. 2014లో 56 లక్షల కోట్లు దేశం అప్పులు ఉంటే.. ఇప్పుడు 80 లక్షల కోట్లు అప్పు దేశానికి అయ్యింది. మేము అప్పు చేసేది అభివృద్ధి, సంక్షేమం కోసమే.. కానీ, బీజేపీ అప్పు చేస్తే కార్పొరేట్ మిత్రుల కోసం. అసమర్థ ప్రధాని ఉంటే దేశం ఇట్లా ఉంటది. మా స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది.. మీ స్టీరింగ్ ఎక్కడ ఉందో అందరికీ తెలుసు’’ అని కౌంటర్ ఇచ్చారు. Live: Addressing the Media at Telangana Bhavan https://t.co/Hkhvzr4vmk — KTR (@KTRTRS) May 15, 2022 ఇది కూడా చదవండి: రాజకీయాల్లోకి రాక ముందే బెంజ్ కారులో తిరిగా: మంత్రి -
రష్యా స్పేస్ చీఫ్కు ఎలన్ మస్క్ కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఎలన్ మస్క్కు.. రష్యాకు మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరింది. తాజాగా రష్యా స్పేస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్కు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు మస్క్. ఉక్రెయిన్ పరిణామాల్లో ఫాసిస్ట్ బలగాలకు మిలిటరీ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ద్వారా ఎలన్ మస్క్ మద్ధతు ఇస్తున్నాడంటూ రష్యా స్పేస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాదు.. మూర్ఖుడంటూ మస్క్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలను మస్క్ సీరియస్గానే తీసుకున్నాడు. మీడియాకు రోగోజిన్ ఇచ్చిన స్టేట్మెంట్ తాలుకా స్క్రీన్ షాట్లను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి మరీ ఎలన్ మస్క్ తన ట్విటర్ వాల్పై పోస్ట్ చేసి మరీ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టాడు. There are no angels in war — Elon Musk (@elonmusk) May 9, 2022 తాజాగా.. యుద్ధంలో దైవదూతలంటూ ఎవరూ ఉండరని రోగోజిన్కు పంచ్ వేశాడు. అంతకు ముందు చావు గురించి ఎలన్ మస్క్ చేసిన ఓ ట్వీట్ మీద విపరీతమైన చర్చ నడిచింది. అనుమానాస్పద రీతిలో చనిపోతే.. అంటూ రష్యా నుంచి తనకు ముప్పు ఉందన్న కోణంలో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. రష్యా దురాక్రమణ మొదలైన తొలి నాటి నుంచే ఉక్రెయిన్కు మద్ధతు ప్రకటించాడు ఎలన్ మస్క్. అంతేకాదు తన శాటిలైట్ సర్వీస్ కంపెనీ స్టార్లింక్ నుంచి సేవలు సైతం అందించాడు. ఒకానొక టైంలో తనతో బాహాబాహీకి తలపడాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కే సవాల్ విసిరాడు ఎలన్ మస్క్. చదవండి: ‘ఒక వేళ నేను చనిపోతే?’.. ఎలన్ మస్క్ సంచలన ట్వీట్ -
దేశంలో హిందీ ఎంతమంది మాట్లాడతారు ?
హిందీ జాతీయ భాషపై వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందినవారంతా కలిస్తే ఇంగ్లిష్ బదులుగా హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రతిపాదనలు అగ్గి రాజేస్తే, తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ హిందీయే మన జాతీయ భాష అంటూ చేసిన ట్వీట్తో వివాదం భగ్గుమంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్లో బీజేపీ ‘ఒకే దేశం ఒకే భాష’ తీసుకువస్తుందన్న అనుమానంతో దక్షిణాది రాష్ట్రాలు ఎదురుదాడికి దిగాయి. చరిత్రలోకి తొంగి చూస్తే.. హిందీ భాషను ఇతర ప్రాంతాలపై రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలు కొత్తేం కాదు. స్వాతంత్య్రానికి ముందే 1937 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందీ భాషను బోధించడానికి ప్రయత్నిస్తే దానిని వ్యతిరేకిస్తూ మూడేళ్ల పాటు ఉధృతంగా ఉద్యమం జరిగింది. 1946లో మొదటిసారిగా సమావేశమైన రాజ్యాంగ పరిషత్ పార్లమెంటులో చర్చలు హిందీ, ఇంగ్లిష్లో కొనసాగించాలని నిర్ణయించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ భాషగా ఏది ఉండాలన్న దానిపై ఆనాటి కాంగ్రెస్ నాయకులు కేఎం మున్షీ, గోపాలస్వామి అయ్యంగార్ హిందీ అనుకూల, వ్యతిరేక వర్గాలను కలుసుకొని అభిప్రాయాలను సేకరించారు. చివరికి హిందీ, ఇంగ్లిషులను కేంద్రం అధికార భాషలుగా గుర్తించింది. పదిహేనేళ్ల పాటు ఆ విధానం కొనసాగాక దానిని సమీక్షించాలని నిర్ణయించింది. పదిహేనేళ్ల గడువు ముగిశాక జాతీయ భాషగా హిందీని చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమిళనాడు భగ్గుమంది. చివరికి కేంద్ర ప్రభుత్వం 1963లో అధికార భాషా చట్టంలో హిందీతోపాటు ఇంగ్లిష్ని చేర్చింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాష్ట్రాలకు తమ అధికార భాషను గుర్తించే అధికారం, అందులోనే ఉత్తరప్రత్యుత్తరాలు చేసుకునే అవకాశం కల్పించింది. హిందీ ఎంతమంది మాట్లాడతారు ? 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 మాతృభాషలున్నాయి. వీటిలో 22 భాషల్ని రాజ్యాంగం గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చింది. ఆనాటి లెక్కల ప్రకారం 43.6% మందికి మాతృభాష హిందీయే. ఆ తర్వాత స్థానంలో 8 శాతంతో బెంగాలీ నిలిచింది. 6.86% మంది ప్రజలు మాట్లాడే మరాఠీ మూడో స్థానంలో నిలిస్తే, 6.70% మందితో మన తెలుగు భాష నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మధ్య కాలంలో తెలుగు, కన్నడ సినిమాలు బాలీవుడ్లో బంపర్ హిట్ కొడుతూ ఉండడంతో హిందీ చిత్ర పరిశ్రమలో కొందరు అసూయతో రగిలిపోతున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ప్రభంజనం మొదలైంది. ఇటీవల తెలుగు సినిమాలైన పుష్ప, ఆర్ఆర్ఆర్ వసూళ్లలో సునామీ సృష్టిస్తే, కన్నడ సినిమా కేజీఎఫ్–2 సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఈ స్థాయిలో ఎందుకు విజయం సాధించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హిందీ ఎప్పటికీ మన జాతీయ భాషేనంటూ ట్వీట్ రాజకీయ రంగు పులుముకుంది. మూడు భాషల ఫార్ములా ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పనిసరి. ఇంగ్లిష్ భాషలో మాట్లాడడం, రాయడం రాకపోతే అంతర్జాతీయ సమాజంలో నెగ్గుకువచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇంగ్లిష్ సెకండ్ లాంగ్వేజీగా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో హిందీ కంటే ఇంగ్లిష్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విద్యా విధానం (ఎన్ఈపీ) మూడు భాషల ఫార్ములాను తీసుకువచ్చింది. 8వ తరగతి వరకు హిందీని నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. ‘సరైన విధానంలో బోధించేవరకు మూడు భాషల ఫార్ములా మంచిదే. ఎన్ని భాషలు వస్తే అంత మంచిది. కానీ హిందీని జాతీయ భాషగా రుద్దకూడదు. ఆ భాష వస్తే ఒక అదనపు భాష వచ్చినట్టే. కానీ జాతీయ భాష అంటూ కిరీటాలు తగిలించకూడదు’ అని భాషావేత్త మాయా లీలా చెప్పారు. – నేషనల్ డెస్క్, సాక్షి స్థానిక భాషే సుప్రీం కేజీఎఫ్–2 సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేసిన నేపథ్యంలో కన్నడ సినీ నటుడు, ఈగ ఫేమ్ సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్దేవగణ్ మధ్య ట్వీట్ల ద్వారా నడిచిన చర్చ రాజకీయ రచ్చకి దారితీసింది. హిందీ ఇక జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ స్పందిస్తూ అలాంటప్పుడు మీ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీయే ఎప్పటికీ మన జాతీయ భాష అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ట్వీట్లు స్నేహపూర్వకంగా నడిచినప్పటికీ దానిపై రాజకీయ దుమారం లేచింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామిలు గురువారం నటుడు సుదీప్కు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. దేశంలో హిందీ కూడా ఇతర ప్రాంతీయ భాషల మాదిరిగా ఒక భాషే తప్ప జాతీయ భాష కాదని కుండబద్దలు కొట్టారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో భాషకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడిందని, ఎక్కడికక్కడ స్థానిక భాషే సుప్రీం అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హుబ్లీలో చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి మాతృభాషని గౌరవించాలని, ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలని అన్నారు. మన దేశంలో విశిష్టమైన భాషా వైవిధ్యాన్ని ప్రతీ పౌరుడు గౌరవించాలని, మాతృభాష వినిపిస్తే ఎవరైనా గర్వంతో ఉప్పొంగిపోవాల్సిందేనని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ చేసిన ట్వీట్ నూటికి నూరు శాతం నిజమని, ఎక్కువ మంది మాట్లాడినంత మాత్రాన హిందీ జాతీయ భాష అవదని జేడీ(ఎస్) నాయకుడు కుమారస్వామి ట్వీట్లు చేశారు. మరోవైపు బొమ్మై కేబినెట్ మంత్రి డాక్టర్ సిఎన్ అశ్వంత్ నారాయణ్ కమ్యూనికేషన్ కోసం జాతీయ స్థాయిలో హిందీ భాషను మాట్లాడితే తప్పులేదని వ్యాఖ్యానించడం విశేషం. -
కశ్మీర్ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు హతమయ్యారు. మరో సాధారణ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా పోలీసులు వెల్లడించారు అమిషిపొరా గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న కచ్చితమైన సమాచారం మేరకు జరిగిన ఆపరేషన్లో ఉగ్రవాదుల్ని నిర్బంధించడానికి ప్రయత్నించగా వారు జరిపిన కాల్పుల్లో షకీల్ అహ్మద్ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని, ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రంతా జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టుగా వివరించారు. -
లష్కరే టాప్ ఉగ్రవాది సలీం పర్రే హతం
జమ్మూ/శ్రీనగర్: శ్రీనగర్ శివారులో సోమవారం పోలీసుబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన వాంటెడ్ ఉగ్రవాది సలీం పర్రే హతమయ్యాడు. పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో సలీం పర్రే మృతి చెందినట్లు కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అదేవిధంగా గాసు గ్రామంలో భద్రతాబలగాలతో జరిగిన మరో ఎన్కౌంటర్లో గుర్తు తెలియని ఒక ఉగ్రవాది హతమయ్యాడన్నారు. జమ్మూకశ్మీర్లోని సరిహద్దుల్లో పాక్ భూభాగం నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఒక వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) కాల్చి చంపింది. సాంబా జిల్లా పరిధిలోని రామఘర్ సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సోమవారం అనుమానాస్పద కదలికలు కనిపించడంతో బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా జవాన్లు పలుమార్లు హెచ్చరించారు. లక్ష్య పెట్టకుండా ముందుకు వచ్చేందుకు యత్నించిన అతడిని బలగాలు కాల్చి చంపాయని సీనియర్ సైనికాధికారి ఒకరు వెల్లడించారు. -
దండకారణ్యంలో ఎన్కౌంటర్
పాడేరు (విశాఖ)/మల్కన్గిరి (ఒడిశా): ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దున దండకారణ్యంలో మంగళవారం ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తులసి పహాడ్ ప్రాంతంలోని ఓ చోట మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు మల్కన్గిరి ఎస్పీ ప్రహ్లాద్ సాయిల్ మిన్నాకి సమాచారం అందింది. అప్రమత్తమైన ఆయన ఆ ప్రదేశంలో కూంబింగ్ నిర్వహించాల్సిందిగా ఎస్వోజీ, డీబీఎఫ్ జవాన్లను ఆదేశించారు. దీంతో సోమవారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టిన జవాన్లకు మంగళవారం ఉదయం మావోయిస్టుల శిబిరం కనిపించింది. జవాన్ల రాకను పసిగట్టిన మావోయిస్టులు వారి నుంచి తప్పించుకునేందుకు వారిపై కాల్పులు జరిపారు. ఆ వెంటనే జవాన్లు కూడా కాల్పులు ప్రారంభించారు. దాదాపు 2 గంటలపాటు సాగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు దుర్మరణం చెందారు. మావోలు విసిరిన గ్రెనేడ్ దాడిలో ఓ జవాన్కు గాయాలయ్యాయి. మరణించిన మావోయిస్టుల్లో ఆంధ్రా కేడర్కు చెందిన చిన్నారావు, మహిళా మావోయిస్టు సోనీ, మరో మహిళా మావోయిస్టు ఉన్నారు.కాగా, కొందరు మావోయిస్టులు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుని పరారయ్యారు. అనంతరం మావోయిస్టుల శిబిరంలోని డంప్ నుంచి వివిధ రకాల తుపాకులు, బుల్లెట్లు, మందుగుండు సామగ్రి, మావోయిస్టుల యూనిఫాం, వంట సామగ్రి, మందులు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో మావోయిస్టుల మృతదేహాలను పోలీసు బలగాలు మోసుకుని వస్తున్నట్టు తెలిసింది. రోడ్డు మార్గానికి చేరేంత వరకు మృతదేహాల తరలింపులో ఎస్వోజీ బలగాలు అష్టకష్టాలు పడుతున్నట్టు సాయంత్రానికి శాటిలైట్ ఫోన్లో పోలీసు అధికారులకు సమాచారం అందింది. ఘటనలో మరికొందరు మావోలు తప్పించుకోవడంతో పోలీసు బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. శిబిరంలో మల్కన్గిరి–కొరాపుట్–విశాఖ డివిజినల్ మావోయిస్టు అగ్రనేతలు రాకేష్, అరుణ ఉన్నట్టు సమాచారం అందడంతోనే కూంబింగ్ జరిపామని, నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో మూడుసార్లు ఎదురుకాల్పులు జరిగాయని ఎస్పీ పేర్కొన్నారు. -
2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు చూసి
పనాజీ: దేశవ్యాప్తంగా శుక్రవారం రికార్డు స్థాయిలో 2.5 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసులు వేయడంతో తన 71వ పుట్టిన రోజు ఎంతో ఉద్వేగంగా జరిగిందని, మరపురాని రోజుగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలు కూడా ఇలాంటి అరుదైన ఘనతని సాధించలేకపోయాయని అన్నారు. వ్యాక్సినేషన్పై విమర్శలు చేస్తున్న వారిపై ఎదురుదాడికి దిగారు. ఈ డ్రైవ్ చూసిన ఒక రాజకీయ పార్టీకి జ్వరం వచ్చిందని ఎగతాళి చేశారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోవాలోని ఆరోగ్య కార్యకర్తలు, వ్యాక్సిన్ తీసుకున్న వారితో ముచ్చటించారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ సింగిల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రంగా గోవా నిలిచిన నేపథ్యంలో మోదీ వారితో మాట్లాడారు. ‘నా జీవితంలో ఈసారి జరిగిన పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకం. టీకా వేసుకుంటే జ్వరం వస్తుందని అనుకుంటారు. కానీ నా పుట్టిన రోజున 2.5 కోట్ల టీకా డోసులు ఇవ్వడం చూసి ఒక రాజకీయ పార్టీ జ్వరం వచి్చంది’అని మోదీ పరోక్షంగా కాంగ్రెస్కు చురకలంటించారు. ఒకేరోజు ఈ స్థాయిలో టీకాలు ఇవ్వడం చిన్న విషయం కాదని, గంటకి 15 లక్షల డోసులు, ప్రతీ నిముషానికి 26 వేలు, సెకండ్కి 415 డోసులు ఇచ్చారని భావోద్వేగంతో చెప్పారు. ప్రతిరోజూ పుట్టినరోజు కావాలి: కాంగ్రెస్ ప్రధాని∙మోదీ ప్రతీ రోజూ పుట్టిన రోజు జరుపుకుంటే కొన్ని బీజీపీ పాలిత రాష్ట్రాలు సాధారణ రోజుల కంటే అధికంగా టీకాలు పంపిణీ చేస్తాయని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. రికార్డు స్థాయిలో 2.5 కోట్ల టీకా డోసులు ఇచ్చామంటూ కేంద్రం జబ్బలు చరుచుకుంటోంది కానీ, జనాభాకి ప్రతీ రోజూ ఇదే స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. -
30 ఏళ్లుగా బీసీలకు టీడీపీ మోసం: మంత్రి అనిల్
సాక్షి, అమరావతి: టీడీపీ నేత అచ్చెన్నాయుడువి మతిలేని మాటలు అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. 30 ఏళ్లుగా బీసీలను టీడీపీ మోసం చేస్తూనే వస్తోందని గుర్తుచేశారు. బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని మంత్రి అనిల్ తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. అచ్చెన్నాయుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు ఎవరూ ఇవ్వని ప్రాధాన్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్తున్నారన్నారని తెలిపారు. అర్ధ శాతం రాజకీయ పదవులు బడుగు, బలహీన వర్గాలకు సీఎం కేటాయించారని వివరించారు. ఒకేసారి 1,30,000 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనని ప్రకటించారు. సీఎం జగన్ వెంటే బీసీలు ఉండటాన్ని జీర్ణించుకోలేని అచ్చెన్నాయుడు విమర్శలు చేయటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జమ్మూ కశ్మీర్లో కాల్పుల కలకలం..!
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చింది. భద్రతా సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు దక్షిణా కశ్మీర్ జిల్లాలోని క్వారిగం, రాణిపోరా ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ను నిర్వహించారు. భద్రతా సిబ్బంది తనీఖీలు చేస్తోన్న సందర్భంలో ఒక్కసారిగా ఇద్దరు ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులతో విరుచుకుపడ్డారు. వెంటనే భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపై ఎదురుకాల్పులును జరిపింది. కాల్పుల్లో ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల వివరాలను సేకరిస్తున్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. -
ఎన్నికల ప్రచారానికి వీల్ చెయిర్లో వస్తా..!
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై దాడి వార్తతో పశ్చిమబెంగాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీఎంసీ శ్రేణులు బుధవారం సాయంత్రం నుంచే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించాయి. ఇది దాడి కాదు ప్రమాదం మాత్రమేనని, చిన్న ప్రమాదాన్నే పెద్దది చేసి చూపుతున్నారని బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది. మరోవైపు, కోల్కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమతా బెనర్జీ సంయమనం పాటించాలని గురువారం పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అవసరమైతే, వీల్చెయిర్లో కూర్చునే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. తనపై దాడి చేశారన్న మమత ఆరోపణలపై గుర్తు తెలియని వ్యక్తులపై నందిగ్రామ్లో పోలీసులు కేసు నమోదు చేశారు. మమత ఆరోగ్యం స్థిరంగా ఉందని, రక్తంలో సోడియం స్థాయిలు కొంచెం తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. గాయమైన ఎడమ కాలికి కట్టు కట్టామని వివరించారు. ‘ముఖ్యమంత్రికి ఎడమ పాదం, ఎడమ మడమ వద్ద తీవ్రమైన గాయాలయ్యాయి. ఎడమ భుజం, మెడ వద్ద కూడా గాయాలున్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. కానీ, గాయమైన కాలి వద్ద నొప్పి తీవ్రంగా ఉంది’ అని తెలిపారు. ఆమెను పరీక్షించిన వైద్య నిపుణులు సర్జరీ అవసరం లేదని తేల్చారన్నారు. సీటీ స్కాన్ సహా మరికొన్ని వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారన్నారు. కోల్కతాలోని పలు ప్రాంతాల్లో, నార్త్ 24 పరగణ, హూగ్లీ, హౌరా, బీర్భూమ్, సౌత్ 24 పరగణ, జల్పాయిగురి తదితర ప్రాంతాల్లో గురువారం టీఎంసీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు జరిపాయి. బిరూలియా ప్రాంతంలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య స్వల్పంగా ఘర్షణ జరిగిందని, కాసేపటికే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చామని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. మరోవైపు, శాంతి, సంయమనం పాటించాలని, ప్రజలు ఇబ్బంది పడే చర్యలకు పాల్పడవద్దని అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ఒక వీడియో సందేశంలో మమత విజ్ఞప్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లోనే మళ్లీ పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని, అవసరమైతే వీల్ చైర్ను వినియోగిస్తానని స్పష్టం చేశారు. దాడికి ఈసీనే బాధ్యత తీసుకోవాలి మమతా బెనర్జీపై జరిగిన హత్యాయత్నానికి ఎన్నికల సంఘమే బాధ్యత తీసుకోవాలని టీఎంసీ డిమాండ్ చేసింది. సీఎంకు తగిన స్థాయిలో భద్రత కల్పించలేదని ఆరోపించింది. అది మామూలు దాడి కాదని, తమ నేత ప్రాణాలు తీసేందుకు ఉద్దేశించిన కుట్రపూరిత దాడి అని పేర్కొంది. కోల్కతాలో ఎన్నికల సంఘం అధికారులకు గురువారం టీఎంసీ నేతలు మమతపై జరిగిన దాడికి సంబంధించి ఫిర్యాదు చేశారు. సమగ్ర దర్యాప్తు జరగాలి సీఎం మమతకు అయిన గాయాలపై రాజకీయాలు చేయాలనుకోవడం లేదని బీజేపీ వ్యాఖ్యానించింది. అయితే, మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. మమత బెనర్జీపై జరిగింది దాడి కాదని, చిన్న ప్రమాదం మాత్రమేనని తమకు స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం అందిందని బీజేపీ అధికార ప్రతినిధి సామిక్ భట్టాచార్య వ్యాఖ్యానించారు. ఆమెకు అయిన గాయాలపై రాజకీయాలు చేయబోమని, అయితే, అది దాడి అని ఆమె ఆరోపిస్తున్నందున మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అన్నీ నిందారోపణలే: ఈసీ మమతపై దాడికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. వారిచ్చిన వినతిపత్రం పూర్తిగా నిందలు, ఆరోపణలతో నిండి ఉందని వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం ఏర్పాటు, విధులనే ప్రశ్నించేలా ఉందని ఆక్షేపించింది. ఈ మేరకు టీఎంసీకి ఈసీ ఒక లేఖ పంపించింది. మమత చరాస్తులు 16.72 లక్షలే మమత బెనర్జీ మొత్తం చరాస్తుల విలువ రూ. 16.72 లక్షలు మాత్రమే. ఈ వివరాలను ఆమె తన ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. తనకు సొంత వాహనం లేదని, తన పేరుపై ఆస్తులేవీ లేవన్నారు. 2019–20 ఏడాదికి తన ఆదాయం రూ. 10.34 లక్షలని తెలిపారు. తన దగ్గర ప్రస్తుతం రూ. 69,255 నగదు ఉందని, రూ. 13.53 లక్షల బ్యాంక్ బాలన్స్ ఉందని, రూ.18,490ల విలువైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ ఉన్నాయని చెప్పారు. రూ.43,837ల విలువైన ఆభరణాలు ఉన్నాయన్నారు. -
కూలో చేరిన కంగనా: ట్విటర్కు కౌంటర్
ఇటీవల ట్విటర్పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఖాతాల తొలగింపు.. లేదా పోస్టుల డిలీట్ వంటి అంశాలు వివాదం రేపిన విషయం తెలిసిందే. ట్రంప్ మొదలుకుని మనదేశంలో కంగనా వరకు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే సామాజిక మాధ్యమం ట్విటరే. ఇప్పుడు ఆ యాప్కు ప్రత్యామ్నాయంగా సరికొత్త యాప్లు వస్తున్నాయి. ప్రస్తుతం ట్విటర్కు దేశీయ యాప్గా ‘కూ’ (Koo)ను పేర్కొంటున్నారు. ఈ దేశీయ యాప్ను ప్రముఖులు వినియోగించడం మొదలుపెట్టారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పీయూశ్ గోయల్ వంటి వారు కూలో చేరారు. తాజాగా ఇటీవల ట్విటర్లో తన ట్వీట్ల తొలగింపునకు గురయిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూలో చేరింది. సరికొత్త యాప్లో చేరిన కొద్దిసేపటికే ట్విటర్కు కౌంటర్ ఇచ్చింది. ట్విటర్ పనైపోయిందని తెలిపింది. ‘ట్విటర్ నీ టైమ్ అయిపోయింది. కూ యాప్కు హాయ్ చెప్పే సమయం వచ్చింది. త్వరలోనే అకౌంట్ వివరాలు తెలుపుతా. దేశీయంగా అభివృద్ది చెందిన యాప్ ఓపెన్ చేసినందుకు ఎంతో థ్రిల్లింగ్గా ఉంది’ అని కంగనా ట్వీట్ చేసింది. ఈ విధంగా కూ యాప్ వినియోగం భారతదేశంలో పెరుగుతోంది. ట్విటర్కే కాదు వాట్సప్కు ప్రత్యామ్నాయంగా దేశంలో దేశీయ యాప్స్ రూపొందిస్తున్నారు. చైనా మాదిరి అన్ని స్వదేశీ సామాజిక మాధ్యమాలు రూపొందించేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రోత్సాహం కూడా కల్పిస్తున్న విషయం తెలిసిందే. ట్విటర్కు ప్రత్యామ్నాయం ‘కూ’ రాగా, వాట్సాప్కు పోటీగా సందేశ్ అనే యాప్ను రూపొందించారు. టెలిగ్రామ్ కూడా. ప్రస్తుతం వీటి వినియోగం పెరిగింది. Your time is up @Twitter time to shift to #kooapp will inform everyone soon about my account details there. Absolutely thrilled to experience home grown #kooapp https://t.co/Kdm0TISCmR — Kangana Ranaut (@KanganaTeam) February 10, 2021 -
మైండ్గేమ్తో బీజేపీ ఆటలు సాగవు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేవలం సీఎం కేసీఆర్ను తిట్టడం కోసమే పెట్టినట్లు ఉందని హుజుర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం కరోనాను కనిపెట్టడంలో విఫలమవగా ఆ సమయంలో కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ధీటుగా ఎదుర్కొందో దేశమంతా చూసిందని గుర్తుచేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయ, భగీరథ పథకాలను కేంద్రమంత్రులందరూ పొగిడారని చెప్పారు. గుజరాత్ తరువాత తెలంగాణ మాత్రమే జీఎస్టీ అత్యధికంగా కడుతున్న రాష్ట్రమని ఎమ్మెల్యే తెలిపారు. జనాల మైండ్తో గేమ్ ఆడుతూ ఎన్నికల్లో గెలుస్తున్నారని విమర్శించారు. బీజేపీకి రామ మందిరం కట్టడమే ఇష్టం లేదని.. సుప్రీంకోర్టు చెప్పేవరకు పోరాటం చేసిన నేత ఒక్కరూ బీజేపీలో లేరని పేర్కొన్నారు. నేషనల్ స్కిల్ దేవలమెంట్ పెట్టి దేశంలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, తెలంగాణలో 7లక్షల 60 వేల ఉద్యోగాలు ఐటీ ఆధారితతో యువతకు ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా లోగోను రూ.10 కోట్లు పెట్టి బయట కొన్నా ఉపయోగం లేదని చెప్పారు. కొన్ని పిచ్చి కుక్కలను రాష్ట్రం మీదకు వదిలారు!.. అని తీవ్రస్థాయిలో బీజేపీ నేతలపై సైదిరెడ్డి విరుచుకుపడ్డారు. మాఫియాను పోషించేది బీజేపీనే మరో ఎమ్మెల్యే గాదరి కిశోర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దేశీయ దొంగలు ఇష్టమొచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సత్యహరిశ్చంద్రుడు బతికి ఉంటే వీరి మాటలు విని ఆత్మహత్య చేసుకునే వారని తెలిపారు. దేశంలో మాఫియాను పెంచి పోషించేది బీజేపీ అని, హత్యలు అత్యాచారాలు చేసిన 25 మంది మంత్రివర్గాల్లో ఉన్నారని ఎమ్మెల్యే కిశోర్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కేసులు ఉన్న నేతలు 176 మంది పాలకవర్గంలో కొనసాగుతున్నారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేసుల వల్ల గతంలో గుజరాత్ నుంచి వెలివేశారని గుర్తుచేశారు. దేశానికి మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నల్లధనం పేరుతో ఎంతమందిని అరెస్ట్ చేశారని, పేదలకు ఎంతధనం పంచారో చెప్పాలి? అని ప్రశ్నించారు. మాఫియా అనేది ఎవరో దేశ.. రాష్ట్ర ప్రజలకు తెలుసని తెలిపారు. దేశం బయట ఉన్న డబ్బులు దేశానికి రప్పించకుండా.. దేశంలో ఉన్న డబ్బులు బయటకు తరలిస్తున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు. బండి సంజయ్ కాలం దగ్గర పడిందని హెచ్చరించారు. కేసీఆర్ను విమర్శిస్తే తెలంగాణ ప్రజలను అన్నట్లేనని ఎమ్మెల్యే కిశోర్ పేర్కొన్నారు. -
రాజాసింగ్ వర్సెస్ సజ్జనార్!
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మె ల్యే రాజాసింగ్ లోధా, సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జ నార్ మధ్య మంగళవారం మాటల యుద్ధం జరిగింది. గోవుల అక్రమ రవాణాకు సంబంధించిన అంశం దీనికి కారణమైంది. ఈ వ్యవహారంలో శంషాబాద్ వెళ్లిన రాజాసింగ్ పోలీసులపై ఆరోపణలు చేస్తూ తన వాహనం నుంచి సెల్ఫీ వీడియో విడుద ల చేశారు. లోన్ యాప్స్ నిందితుల అరెస్టుపై నిర్వహించిన మీడియా సమావేశంలో దీనిపై సజ్జనార్ కౌంటర్ ఇచ్చారు. దీంతో తన ‘స్వరం మార్చిన’రాజాసింగ్ రాత్రికి మరో వీడియో విడుదల చేశారు. వీరి మధ్య పేలిన మాటల తూటాలిలా.. పోలీసులు బ్రోకర్లుగా పని చేస్తున్నారు.. ‘మహారాష్ట్ర నుంచి ఒక బండిలో 45 ఆవులు, దూడలు బహదూర్పురలోని స్లాటర్ హౌస్కు తీసుకొస్తున్నారు. మూడు, నాలుగు రోజుల క్రితం జీహెచ్ఎంసీ కమిషనర్ను కలసి బహదూర్పురలో అక్రమ పశువధపై ప్రశ్నించినా సమాధానం లేదు. మీకు దొరకని బండి మాకు ఎందుకు దొరుకుతోందని సీపీ, డీజీపీలను ప్రశ్నిస్తున్నా.. మా కార్యకర్తలు ఇలాంటి బండ్లు ఆపితే లాఠీచార్జ్ చేసి కేసులు బుక్ చేస్తున్నారు. నువ్వు ఎవరు? ఏ అధికారముందని ప్రశ్నిస్తున్నారు. నేరాలు ఆపే అధికారం ప్రజలకు కూడా ఉంటుంది. కొత్తూర్ ఎస్సై శ్రీధర్ ఒక బండిని డబ్బు తీసుకుని పంపిస్తున్నారు. తన లిమిట్స్ దాటడానికి డబ్బు తీసుకుని బ్రోకర్గా తయారవుతున్నారు. శాలరీ చాలట్లేదంటే మేము భిక్షం ఎత్తుకుని పోలీసులకు డబ్బులిస్తాం. ఇలాంటి పాపం మాత్రం చేయకండి.. – ఉదయం సెల్ఫీ వీడియోలో రాజాసింగ్ పోలీసులపై నిందలు ఫ్యాషనైపోయింది.. ఎవరు పడితే వారు మీడియాలో పోలీసులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. శాంతి భద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులపై నిందలు వేయడం ఫ్యాషనైపోయింది. దేశంలోనే తెలంగాణ పోలీసు నంబర్ వన్.. పోలీసులు ఎవరైనా డబ్బులు తీసుకున్నారంటే సాక్ష్యాలు చూపండి. ఫిర్యాదులు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. డబ్బు తీసుకున్నారనే ఆధారాలుంటే బయటపెట్టండి. అయినా కూడా చర్యలు తీసుకోకుంటే అప్పుడు మాట్లాడండి.. అంతేకానీ బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా పోలీసులపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఆ వ్యాఖ్యలపై న్యాయపర చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కేసు నమోదు చేస్తాం – వీసీ సజ్జనార్ సరిహద్దుల్లో చెక్పోస్టులు పెట్టండి.. సైబరాబాద్ కమిషనర్కు చాలెంజ్ చేస్తున్నా. మీ పరిధిలో పోలీస్ స్టేషన్ల ముందు నుంచి అక్రమంగా ఆవుల్ని వధించడానికి తీసుకెళ్తున్నారా? లేదా? ఈ నివేదిక మీరు తెచ్చుకోండి. అందులో తేలిన నిజానిజాలను బట్టి నాపైనా లేదా పోలీసులపై చర్యలు తీసుకోండి. గోవుల్ని తరలిస్తున్న వాహనాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు. గతంలో మీ పరిధిలోని పోలీస్స్టేషన్కు కార్యకర్తలు ఓ బండిని పట్టుకుని తీసుకుని వెళ్తే దూషించారా? లేదా? వారిపై రౌడీషీట్ తెరుస్తామని వార్నింగ్ ఇవ్వడం నిజమా? కాదా? మీరు మంచి కమిషనర్.. మీ పరిధిలోని సరిహద్దు ఠాణాల్లో చెక్పోస్టులు పెడితే ఒక్క వాహనం నగరం లోపలకు రాదు. మేము కూడా రోడ్డు మీదకి రాము.. – రాత్రి విడుదల చేసిన వీడియోలో రాజాసింగ్ -
మన్యంలో అలజడి!
సాక్షి, భూపాలపల్లి : ప్రశాంతంగా ఉన్న అడవుల్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పెద్దంపేట అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా అటవీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. ఘటన జరిగిన ప్రాంతానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోనే అంబట్పల్లి పోలీస్స్టేషన్ ఉండటం గమనార్హం. ప్రస్తుతం భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇక ఎదురుకాల్పుల ఘటనలో 12 నుంచి 15 మంది మావోయిస్టులు తప్పించుకున్నారని అనుమానిస్తున్నారు. ఇందులో ఒకరిద్దరు ముఖ్యనేతలున్నట్లు విశ్వసనీయ సమాచారం. తప్పించుకున్న ముఖ్య నాయకులు! కొంతకాలంగా జిల్లాలో మావోల కదలికలు పెరిగాయని రెండ్రోజుల క్రితం ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడంతో పోలీసులు పలిమెల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలోనే మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. ఈక్రమంలోనే మావోలు తప్పించుకుని పారి పోయినట్లు పోలీసు అధికారులు చెబుతున్నా రు. ప్రస్తుతం తప్పించుకున్న మావోలు మహాముత్తారం మీదుగా ములుగు అటవీప్రాంతంలోకి లేకపోతే గోదావరి తీరం దాటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోకి ప్రవేశించే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి తప్పించుకున్న వారిలో జయశంకర్–మహబూబాబాద్–వరంగల్–పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) డివిజన్ కమిటీ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డితో పాటు ఏటూరునాగారం–మహదేవపూర్ ఏరి యా సెక్రటరీ రీనా, ఇల్లందు–నర్సంపేట ఏరి యా సెక్రటరీ భద్రు, జమున, భూపాలపల్లి జిల్లాకు చెందిన భిక్షపతి తదితరులున్నారని గుర్తించినట్లు సమాచారం. తప్పించుకుపోయిన వీరి కోసం మహదేవపూర్, మహాముత్తారం, పలిమెల, భూపాలపల్లి అటవీ ప్రాం తాలతో పాటు ములుగు జిల్లా అటవీ ప్రాం తాల్లో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 13 పోలీసు బృందాలతో పాటు రెండు గ్రేహౌండ్స్ బృందాలూ రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరి, ఇంద్రావతి నదుల సరిహద్దుల్లో నిఘా పెంచారు. అటవీ ప్రాంతా న్ని డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్నారు. -
హిజ్బుల్ చీఫ్ సైఫుల్లా హతం
శ్రీనగర్: మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సైఫుల్లా మిర్ అలియాస్ డాక్టర్ సైఫుల్లా(31)భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. ఈ ఏడాది మేలో హిజ్బుల్ చీఫ్గా ఉన్న రియాజ్ నైకూ భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందడంతో సైఫుల్లా ఆ బాధ్యతలు చేపట్టాడు. ‘సైఫుల్లా మృతి మామూలు ఘటన కాదు. పోలీసులకు, భద్రతా బలగాలకు దక్కిన భారీ విజయం’అని ఎన్కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలించిన కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ అభివర్ణించారు. పుల్వామా జిల్లా మలంగ్పోరాకు చెందిన ఇతడు మెడికల్ ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసిన ఇతడిని డాక్టర్ అని పిలుస్తుంటారు. 2014 అక్టోబర్లో హిజ్బుల్ ముజాహిదీన్లో చేరాడు. కశ్మీర్ లోయలో భద్రతాబలగాలపై జరిగిన పలు ఘటనలకు సూత్రధారిగా ఉన్న సైఫుల్లా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. సైఫుల్లా ఓ ఇంట్లో దాగున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆదివారం ఉదయం శ్రీనగర్ శివారులోని రంగ్రేత్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టాయి. అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు వారి పైకి కాల్పులకు దిగగా బలగాలు దీటుగా స్పందించాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోగా, మరొకరు పోలీసులకు పట్టుబడ్డాడు. మృతుడిని సైఫుల్లాగా గుర్తించారు. అతని వద్ద ఆయుధాలు, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
వెయ్యిరెట్లకు మించి ప్రతీకారం : ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అమెరికాపై ఏదైనా దాడి జరిగితే అంతకుమించి "1,000 రెట్లు ఎక్కువ" ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు.ఇరాన్ టాప్ మిలటరీ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని టెహ్రాన్ యోచిస్తున్నట్లు మీడియా వార్తలు రావడంతో ట్రంప్ తాజా హెచ్చరిక జారీ చేశారు. ఉగ్రవాద నాయకుడు సులేమాని హత్యకు ప్రతీకారంగా అమెరికాపై ఇరాన్ హత్య, లేదా ఏ రూపంలోనైనా,ఎలా దాడిచేసినా దానికి వెయ్యిరెట్లు అధికంగా ప్రతి స్పందిస్తామంటూ ట్విట్ చేశారు. (ఇరాన్ ప్రతీకారం) దక్షిణాఫ్రికాలోని అమెరికా రాయబారి లానా మార్క్స్పై ఇరాన్ ప్రభుత్వం హత్యాయత్నాలు చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ ఒక ఫాక్స్ న్యూస్ నివేదించింది. ఇదే జరిగితే అమెరికా, ఇరాన్ల మధ్య మరింత ఉద్రిక్తతలు రాజుకోనున్నాయని పేర్కొంది. ఇరాన్ గతంలో అమెరికన్ రాయబారులపై హత్యలను ప్రణాళిక వేపిన నేపథ్యంలో ఈ వార్తలను ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయని తెలిపింది. అటు ఈ అంశంపై స్పందించిన దక్షిణాఫ్రికా స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎస్ఎస్ఎ) దక్షిణాఫ్రికా పౌరులు, ఇతర డిప్లొమాటిక్ అధికారులతో సహా యుఎస్ రాయబారి భద్రతకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించింది. మరోవైపు ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. నవంబర్ 3న జరగనున్న ఎన్నికలకు ముందు ఇరాన్ వ్యతిరేక ప్రచారంలో భాగమే ఈ ఆరోపణలని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయీద్ ఖతీబ్జాదే ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఈ ఏడాది జనవరి 3న ఇరాక్లో డ్రోన్ దాడితో రివల్యూషనరీ గార్డ్స్ కుడ్స్ ఫోర్స్ నేత సోలైమానిని అమెరికా హతమార్చిన సంగతి తెలిసిందే. సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. అలాగే 2015 అణు ఒప్పందం ఇరాన్కు అనుకూలంగా ఉందంటూ అమెరికా వైదొలగిన తరువాత నుంచి వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య తీవ్ర ప్రతిష్టంభన కొనసాగుతోంది. (ట్రంప్ తలపై రూ.575 కోట్లు) According to press reports, Iran may be planning an assassination, or other attack, against the United States in retaliation for the killing of terrorist leader Soleimani, which was carried out for his planning a future attack, murdering U.S. Troops, and the death & suffering...— Donald J. Trump (@realDonaldTrump) September 15, 2020 -
గ్యాంగ్స్టర్ దుబే హతం
-
గ్యాంగ్స్టర్ దుబే హతం
కాన్పూర్: పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, డీఎస్పీ సహా ఎనిమిది మంది మరణానికి కారణమైన గ్యాంగ్స్టర్ వికాస్ దుబే శుక్రవారం పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో గురువారం అరెస్ట్ అయిన తరువాత, దుబేను అక్కడి నుంచి యూపీలోని కాన్పూర్కు తీసుకువస్తుండగా, శుక్రవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ శివార్లలోని భావుంటి వద్ద హైవేపై జనçపసంచారం లేని చోట దుబేను తీసుకువస్తున్న కారు బోల్తా పడింది. ఇదే అదనుగా ప్రమాదంలో గాయపడిన పోలీసు నుంచి పిస్టల్ను లాక్కొని పారిపోయేందుకు దుబే ప్రయత్నించాడు. ఆ క్రమంలో తనను అడ్డుకున్న పోలీసులపై కాల్పులు జరిపాడు. దాంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు. కారు బోల్తాపడిన ఘటనలో, తదనంతర ఎదురుకాల్పుల్లో స్పెషల్ టాస్క్ఫోర్స్కు చెందిన ఇద్దరు సహా 8 మంది పోలీసులు గాయపడ్డారని కాన్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్ తెలిపారు. ‘ప్రమాదం అనంతరం ఒక పోలీసు నుంచి తుపాకీ లాక్కుని పారిపోయేందుకు దుబే ప్రయత్నించాడు. ఆయనను చుట్టుముట్టిన పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించారు. ఆ మాటలను వినకుండా, పోలీసులపై.. వారిని చంపే ఉద్దేశంతో దుబే కాల్పులు జరపడం ప్రారంభించాడు. దాంతో, స్వీయ రక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు’ అని వివరించారు. గాయపడిన దుబేను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లామని, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు ఒక పత్రికాప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఆసుపత్రికి తీసుకువచ్చేలోపే దుబే చనిపోయాడని గణేశ్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్బీ కమల్ మీడియాకు తెలపడం గమనార్హం. ఆయన మృతదేహంపై నాలుగు బుల్లెట్ గాయాలున్నాయని, మూడు ఛాతీ భాగంలో, ఒకటి చేతిపై ఉందని వివరించారు. పోలీసుల్లో ఒకరికి భుజంపై, మరొకరికి చేతిపై బుల్లెట్ గాయాలున్నాయన్నారు. దుబేకు కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా నెగెటివ్గా ఫలితం వచ్చిందని చెప్పారు. మొత్తం ఆరుగురి ఎన్కౌంటర్ 8 మంది పోలీసుల మృతికి కారణమైన కాన్పూర్ కాల్పుల ఘటనలో ఇప్పటివరకు ప్రధాన నిందితుడైన వికాస్ దుబే సహా మొత్తం ఆరుగురు వేర్వేరుగా జరిగిన పోలీసుల ఎన్కౌంటర్లలోనే హతమవడం గమనార్హం. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ పట్టణం లోని మహాకాళేశ్వరుడి ఆలయానికి గురువారం దుబే వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను అక్కడే అరెస్ట్ చేసి అనంతరం, యూపీ పోలీసులకు అప్పగించారు. అక్కడి నంచి దుబేను కాన్పూర్కు తీసుకువస్తున్న క్రమంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కొద్ది గంటల ముందే సుప్రీంలో కేసు వికాస్ దుబే ఎన్కౌంటర్ జరగడానికి కొన్ని గంటల ముందే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దు బేను ఎన్కౌంటర్లో హతమార్చే అవకాశముందని, అలా జరగకుండా అడ్డుకోవాలని కోరుతూ ఓ లాయర్ పిటిషన్ వేశారు. చాప్టర్ క్లోజ్ యూపీ సివిల్ డిఫెన్స్ ఐజీ అమితాబ్ ఠాకూర్ ఈ ఎన్కౌంటర్ను ముందే ఊహించారు. ‘వికాస్ దుబే లొంగిపోయాడు. రేపు ఉదయం ఆయన పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే అవకాశముంది.ఆ క్రమంలో పోలీసుల చేతిలో చనిపోయే అవకాశం కూడా ఉంది. దుబే చాప్టర్ క్లోజ్ అవుతుంది’ అని గురువారం ట్వీట్ చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలి గతవారం పోలీసు బృందంపై వికాస్ దుబే జరిపిన కాల్పుల ఘటన నుంచి నేటి దుబే ఎన్కౌంటర్ వరకు అన్ని ఘటనలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరపాలని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి డిమాండ్ చేశారు. ‘నేరస్తులు చనిపోయారు. కానీ ఇన్నాళ్లు వారిని కాపాడిన వారినేం చేస్తారు?’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ప్రశ్నించారు. మొత్తం ఘటనకు సంబంధించి వాస్తవాలు బయటకురావాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్యాదవ్ డిమాండ్ చేశారు. 30 ఏళ్ల నేర చరిత్ర యూపీలో కరడు గట్టిన గ్యాంగ్స్టర్ వికాస్ దుబే(56)కు 30 ఏళ్ల నేర చరిత్ర ఉంది. మొత్తం అతనిపై 62 కేసులు నమోదై ఉన్నాయి. వాటిలో 5 హత్యలు, మరో ఎనిమిది హత్యాయత్నం కేసులు. వారం క్రితం డీఎస్పీ సహా 8 మంది పోలీసుల్ని పొట్టన పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం అతని తలపై రూ. 5 లక్షల రివార్డు ప్రకటించింది. 1990లో కాన్పూర్లో ఒకరిపై దాడి చేసిన కేసులో వికాస్ దుబే పేరు తొలిసారిగా వినిపించింది. ఆ తర్వాత రెండేళ్లకి కాన్పూర్ శివాలి పోలీస్స్టేషన్ ప్రాంతంలో దళిత యువకుడి హత్య కేసులో అతను నిందితుడు. ఈ ఘటన తర్వాత ఒక ముఠాను ఏర్పాటు చే సుకొని డాన్గా ఎదిగాడు. దోపిడీలు, దొంగతనాలు చేస్తూ రాజకీయాల్ని వాడుకున్నాడు. 1995–96లో బీఎస్పీలో చేరాడు. పోలీసు శాఖలో అతనికి సన్నిహితులు ఎక్కువ. ఎప్పుడైనా ప్రభుత్వం అతనిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వెంటనే వికాస్ దుబేకి ఉప్పందిపోయేది. అలా తన చుట్టూ పటిష్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బీజేపీ నేత శుక్లా హత్యతో సంచలనం 2001లో ఆనాటి యూపీ సర్కార్లో సహాయ మంత్రిగా ఉన్న బీజేపీ నేత సంతోశ్ శుక్లాను పట్టపగలు అందరూ చూస్తుండగా పోలీస్స్టేషన్లోనే చంపడంతో వికాస్ దుబే పేరు వింటేనే అందరిలోనూ వణుకుపుట్టింది. ఆరు నెలల అనంతరం అతను లొంగిపోయాడు. కానీ, కేసు విచారణ సమయంలో పోలీసులే సాక్ష్యం చెప్పడానికి నిరాకరించడంతో 2005లో జైలు నుంచి బయటకు వచ్చాడు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సన్నాహాలు వికాస్ సొంతూరు బిక్రులో గత 15 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు జరగడం లేదు. వికాస్ దుబే ఎవరి పేరు చెబితే అతనే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం ఆనవాయితీగా మారింది. తన నేర సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే కావాలని కలలుగన్నాడు. ఎలాగైనా చట్టసభల్లోకి వెళ్లడమే లక్ష్యమని పలుమార్లు సన్నిహితుల దగ్గర చెప్పుకున్నాడు. 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున కాన్పూర్ జిల్లా రణియా నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తూనే బీజేపీలో చేరడానికి కూడా ప్రయత్నించాడు. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు అతని ప్రయత్నాలను సాగనీయలేదని తెలుస్తోంది. పోలీసుల అదుపులో భార్య, కుమారుడు వికాస్ దుబే తల్లిదండ్రులు రామ్కుమార్ దుబే, సరళాదేవి. తల్లి సరళాదేవి చాలా సంవత్సరాలుగా వికాస్ దుబేని దూరం పెట్టారు. తన చిన్న కుమారుడు దీపూతో కలిసి ఉంటున్నారు. వికాస్ పట్టుబడితే కాల్చి చంపేయమని బహిరంగంగానే చెప్పారు. వికాస్ దుబే భార్య రిచా స్థానిక రాజకీయాల్లో ఉన్నారు. ఘిమవూ పంచాయతీ సభ్యురాలిగా నెగ్గారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు ఆకాశ్ విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. రెండో కుమారుడు షాను లక్నోలో తల్లితో కలిసి ఉంటూ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. వికాస్ భార్య, రెండో కొడుకు, వారింట్లో పనివాడిని పోలీసులు ఇప్పటికే నిర్బంధంలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎనిమిది మంది పోలీసుల్ని చంపడానికి చేసిన కుట్రలో రిచా హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఎన్కౌంటర్పై అనుమానాలు ఈ ఎన్కౌంటర్పై పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఉజ్జయిన్లో అరెస్ట్ చేసే సమయంలో ఎలాంటి ప్రతిఘటన చూపని దుబే, ఆ తరువాత కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడని ప్రశ్నించారు. దుబేను తీసుకువెళ్తున్న పోలీస్ కాన్వాయ్ను ఫాలో అవుతున్న మీడియా వాహనాలను ఒక దగ్గర నిలిపేశారని, అక్కడికి కొద్ది దూరంలో, కాసేపటికే ఎన్కౌంటర్ జరిగిందని కూడా ఆరోపణలు వచ్చాయి. ఉజ్జయిన్ నుంచి బయల్దేరిన సమయంలో ప్రమాదం జరిగిన వాహనంలో కాకుండా, వేరే వాహనంలో దుబే కూర్చుని ఉన్న వీడియో క్లిప్పింగ్లు కూడా వైరల్ అయ్యాయి. ఈ అనుమానాలను యూపీ పోలీసులు కొట్టివేశారు. చెక్ చేయడం కోసమే మీడియాను ఆపి ఉండొచ్చని పేర్కొన్నారు. బిక్రు గ్రామంలో పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో ఇప్పటివరకు 21 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వారిలో ముగ్గురిని అరెస్ట్ చేశామని, ఆరుగురు ఎన్కౌంటర్లలో చనిపోయారని ఏడీజీ(లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. -
గల్వాన్ ఘటనతో వణికిన చైనా సైన్యం
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో జూన్ 15న భారత సైనికులు చూపిన తెగువకు చైనా సైన్యం వణికిపోయిం దని సమాచారం. చైనా సైన్యం చేతుల్లో బందీలుగా ఉండి.. సైనికాధికారుల చర్చల అనంతరం విడుదలైన భారతీయ సైనికుల ద్వారా ఈ విషయం స్పష్టమైనట్లు తెలుస్తోంది. సుమారు 60 గంటలపాటు చైనా సైనికుల అదీనంలో ఉన్న కారణంగా భారతీయ సైనికాధికారులు, జవాన్లకు వివిధ పరీక్షలు నర్విహించారు. ఈ క్రమంలో చైనా సైన్యం మానసిక స్థితిపై ఉన్నతాధికారులు ఒక అంచనాకు రాగలిగారు. బందీలుగా ఉండి విడుదలైన ఇద్దరు మేజర్లు, ఇద్దరు కెప్టెన్లు చాలా ఉత్సాహపూరితంగా కనిపించారని, శత్రుదేశపు బందీలుగా ఉన్నా ఇలా ఉండటం ఆశ్చర్యకరమని నిపుణులు చెబుతున్నారు. జూన్ 15న తమ కంటే ఎక్కువ సంఖ్యలో చైనీయులు విరుచుకుపడుతున్నా భారత సైన్యం వెనక్కు తగ్గకపోగా చైనీయుల చేతుల్లోని ఇనుప రాడ్లు, మేకులతో కూడిన గదల్లాంటి ఆయుధాలను లాక్కుని ప్రతిదాడికి దిగారని, ఈ క్రమంలో పెట్రోల్ పాయింట్ 14 వద్ద కనీసం 40 మంది చైనీయులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఈ సాహసం కారణంగానే భారతీయ సైనికులు ఉత్సాహంగా కనిపించారని, చైనీయులను తరుముకుంటూ వారి ఆధిపత్యంలోని ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవడం వల్లనే భారతీయులు బందీలుగా చిక్కారని ఓ అధికారి తెలిపారు. కల్నల్ సంతోష్బాబు మరణించిన సమాచారం తెలుసుకున్న చైనీయులు వెనుతిరిగి పారిపోయారని... వారిని వెంటాడుతూ భారతీయ సైనికులు వెళ్లారని చెప్పారు. షాక్లో చైనా సైనికులు జూన్ 15 నాటి ఘటనతో చైనా సైనికులు ఒక రకమైన షాక్కు గురైనట్లు చైనా నిర్బంధం నుంచి విడుదలైన సైనికుల ద్వారా తెలిసింది. భారతీయ సైనికులు తెగబడి పోరాడటమే కాకుండా ప్రతీకార దాడులకు పాల్పడతారని చైనీయులు భయపడ్డారని కొన్ని గంటల వ్యవధిలో మరింత మంది భారతీయ సైనికులు తమ మాదిరిగానే దాడి చేస్తారని వారు అంచనా వేశారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. మొత్తమ్మీద చైనా దశాబ్దాలపాటు అసలైన యుద్ధంలో పాల్గొనక పోవడం కేవలం సన్నాహక విన్యాసాల్లో పాల్గొనటం సైనికులపై ప్రభావం చూపుతున్నట్లు భారతీయ అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 15 నాటి ఘటనతో చైనీయులు భారతీయ సైన్యం అసలు రూపాన్ని చూశారని సంఖ్యాబలంలో తక్కువైనా ప్రత్యర్థులను చంపగలగడం వారిని భీతవహులను చేసిందని అధికారి ఒకరు తెలిపారు. కాగా, గల్వాన్ ఘటనపై చైనా సోషల్మీడియాలో అసంతృప్తి వ్యక్తమైంది. వాట్సప్ తరహా సామాజిక మాధ్యమం వీబోలో పీఎల్ఏ సైనికులు ఎంత మంది మరణించారన్న విషయంపై ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. -
నలుగురు ఉగ్రవాదుల హతం
జమ్మూ: ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతాబలగాలు సోదాలు చేపట్టి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘటన జమ్మూకశ్మీర్లో చోటుచేసుకుంది. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని దార్ మొహల్లా వాటరిగమ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మరణించిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా, హిజ్బుల్ ఉగ్రసంస్థలకు చెందిన ముజఫర్ అహ్మద్ భట్, ఒమర్ అమీన్ భట్, సాజద్ అహ్మద్ భట్, గుల్జార్ అహ్మద్ భట్లుగా గుర్తించారు. ఇందులో గుల్జార్ హిజ్బుల్కు చెందిన ఉగ్రవాది కాగా, మిగిలిన వారు లష్కరే తోయిబాకు చెందిన వారు. వీరంతా కుల్గామ్ జిల్లాకు చెందిన వారని అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లు, రెండు పిస్తోళ్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
పవన్ కల్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు
-
చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్
సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దత్త పుత్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు, పోలవరం రివర్స్ టెండరింగ్ అంశాలను వివరించేందుకే కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం జగన్ బాధ్యత అని అంబటి పేర్కొన్నారు. ఈ విషయం మరిచిపోయిన పవన్ కల్యాణ్ చంద్రబాబుతో కుమ్మక్కై బరితెగించి సీఎంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్పై కేసులు విచారణ జరుగుతుండగానే నేరస్తుడు అంటూ ఎలా అంటారని, వేల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకొనే పవన్ కల్యాణ్కు ఈ సంగతి తెలియదా అంటూ అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లు పెట్టుకొని సీబీఐతో అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూశారన్నారు. అంతటితో ఆగకుండా అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టినా వైఎస్ జగన్ ఎవరికి భయపడలేదని గుర్తుచేశారు. మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి మద్దతుగా పవన్ జనసేన పార్టీనీ స్థాపించారని దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లాలో వలసల గురించి ప్రశ్నించే ముందు తన పార్టీలో జరుగుతున్న వలసలను ఆపుకోవాలని వ్యాఖ్యలు చేశారు. రెండోచోట్ల పవన్ పోటీ చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారో తెలుసుకోవాలన్నారు. ఆయన ఓడిపోయిన చోట ఇప్పటివరకూ మొహం చూపించలేదన్నారు. ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయిన పవన్కు వైఎస్ జగన్ నైతికత గురించి మాట్లాడే హక్కుందా అంటూ అంబటి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబుతో లాలూచీ రాజకీయాలు చేసిన పవన్... కుప్పం, మంగళగిరిలో చంద్రబాబు, లోకేశ్పై ఎందుకు పోటీ పెట్టలేదని సూటిగా ప్రశ్నించారు. పవన్ ఇప్పటికైనా చంద్రబాబు లాంటి వ్యక్తులను నమ్ముకొని రాజకీయాలు చేస్తే ప్రజలు తిరస్కరిస్తారన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. చెప్పుడు మాటలు వినకుండా సొంతంగా పార్టీ నడిపిస్తే వచ్చే ఎన్నికల్లో కనీసం నాలుగు సీట్లయినా సంపాదించుకోగలుగుతారని సూచించారు. చంద్రబాబు డీఎన్ఏ, పవన్ డీఎన్ఏ ఒకటి కాబట్టే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అంబటి అన్నారు. -
టీడీపీ నేతల వితండవాదం...
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాలకొండ, రాజాం నియోజకవర్గాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుండగా వారిని పక్కన పెట్టి తమ పార్టీకి చెందిన నిమ్మక జయకృష్ణ, కావలి ప్రతిభాభారతి పేరుతో ప్రత్యేక జీవోలిచ్చి నిధులు విడుదల చేసిన విషయం ఇంకా ప్రజలకు గుర్తుంది. ఎమ్మెల్యేలకు విధిగా నిధులు ఇవ్వాల్సిందిపోయి వారి చేతిలో ఓడిపోయిన నేతల పేరుతో అధికారిక జీవోలు ఇచ్చిన ఘనత మీదేనని విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు మండల పరిషత్ కార్యాలయాలకు వస్తున్నారని, కార్యాలయంలో కూర్చొంటున్నారని టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తుంటే... మండల కార్యాలయాల్లోకి తాము తప్ప మరెవ్వరూ రాకూడదన్నట్టుగా ఇంకా అధికార దర్పం ప్రదర్శిస్తుంటే.. ఇంకా మీరే అధికారంలో ఉన్నట్టు కలలు కంటున్నారా అని జనం హేళన చేస్తున్నారు. నోరు పారేసుకుని.. ఆపైన ఎదురుదాడి.. ప్రభుత్వ ఉద్యోగులపై నోరు పారేసుకొని ఆడియో, వీడియో క్లిప్పింగ్లతో అడ్డంగా దొరికిపోయినప్పటికీ టీడీపీ నేతలు బుకాయిస్తున్నారు. తప్పులు సరిదిద్దుకోకపోగా ఎదురుదాడికి దిగుతున్నారు. అధికారులపై అనుచితంగా ప్రవర్తించి తప్పు చేయలేదని మొండి వైఖరి అవలంబిస్తున్నారు. వీరి వ్యవహార శైలిని, నోటి దురుసును లోకమంతా చూసి నివ్వెరపోతున్నా... వీరికి మాత్రం సిగ్గు రావడం లేదు. తప్పులు చేసి ఎదుట వారిపై నిందారోపణలు వేస్తున్నారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మాజీ విప్ కూన రవికుమార్ల తీరును సర్వత్రా తప్పు పడుతున్నా టీడీపీ నేతలు మాత్రం సమర్ధించుకునేలా మాట్లాడుతున్నారు. అసలు మండల అధికారులపై అంతా చూస్తుండగానే విరుచుకుపడ్డారు. కూన రవికుమారైతే ఏమాత్రం తగ్గకుండా స్పందన కార్యక్రమంలో ఇష్టారీతిన మాట్లాడారు. దాడి చేసినంతగా పరుష పదజాలంతో మాట్లాడారు. ‘నాకు రెస్పాండ్ అవ్వకపోతే రేపటి నుంచి మీ సీట్లో కూర్చొంటా... ఎవ్వరూ నన్ను ఆపలేరు. ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తా’నంటూ సరుబుజ్జిలి ఎంపీడీఓ దామోదరావుపై కూన రవికుమార్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అంతకుముందు ఓ మహిళా ఉద్యోగికి ఫోన్ చేసి మరీ బెదిరింపులకు దిగారు. ఇదంతా రికార్డయింది. బాధిత ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆడియో, వీడియో క్లిప్పింగ్లు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటే... కూన రవికుమార్ పరారీ అయ్యారు. ఒక కేసు నమోదైన తర్వాత తప్పనిసరిగా ఆ వ్యక్తి కోసం గాలిస్తారు. అందులో భాగంగా కూన రవికుమార్ ఇళ్లల్లో కూడా తనిఖీలు చేశారు. ఇదంతా పోలీసు విధి నిర్వహణలో భాగమని అందరికీ తెలిసిందే. కానీ టీడీపీ నేతలకు మాత్రం కక్షసాధింపుగా కన్పించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్ష కట్టినట్టు ఎదురుదాడికి దిగుతున్నారు. రవికుమార్ది తప్పు కాదా? అసలు కూన రవికుమార్ చేసినది తప్పా? ఒప్పా? అన్నది ఆత్మ పరిశీలన చేసుకోకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. అసలు కక్ష సాధింపేంటో గత ఐదేళ్ల కాలంలో టీడీపీ వైఖరిని చూస్తే తెలుస్తుంది. తప్పుడు ఫిర్యాదులతో అక్రమ అరెస్టులకు దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు దువ్వాడ శ్రీనివాస్పై అనుసరించిన వైఖరినే తీసుకోవచ్చు. క్వారీ, పవర్ ప్లాంట్ వ్యవహారాల్లో తప్పుడు ఫిర్యాదును ఆధారంగా చేసుకుని దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లి అరెస్టు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ నాడు మంత్రిగా వెలగబెట్టిన అచ్చెన్నాయుడు కనుసన్నల్లోనే జరిగింది. చెప్పాలంటే దువ్వాడ శ్రీనివాస్ను టార్గెట్గా చేసి, కక్ష సాధింపునకు దిగి, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇదొక్క ఉదాహరణ మాత్రమే. జిల్లాలో అనేక మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు తెగబడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ గుర్తు చేసుకోకుండా కేవలం వైఎస్సార్సీపీ నేతలు మండల పరిషత్ కార్యాలయాల్లోకి వెళ్తున్నారని, అక్కడ కూర్చొంటున్నారని, సంక్షేమ పథకాల్లో అనర్హులను ఏరివేస్తున్నారని చెప్పి అధికారులపై నోరు పారేసుకుని, అపై అడ్డంగా దొరికిపోయి, ఉద్యోగులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటే... దాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ కక్ష సాధింపని రాజకీయ లబ్ధి కోసం ఎదురుదాడికి దిగుతున్నారు. తమ అధినేత చంద్రబాబునాయుడు పంథాలోనే జిల్లా టీడీపీ నేతలు నడుస్తున్నారు. జరిగింది తప్పు... పొరపాటున మాట్లాడాను... క్షమాపణ చెబుతున్నా... అని ఉంటే కాస్త హుందాగా ఉండేది. అందుకు భిన్నంగా, చేసిన తప్పును కప్పిపుచ్చుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా, ఆ పార్టీ నేతలపైనా విమర్శలు చేయడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. పదిమంది నిందితులకు బెయిల్ మంజూరు.. ఆమదాలవలస: సరుబుజ్జలి ఎంపీడీఓను బెదిరించి, అనుచితంగా మాట్లాడిన, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన కేసులో అరెస్టయిన పదిమంది నిందితులకు గురువారం బెయిల మంజూరైంది. వీరిని బుధవారం అరెస్ట్ చేసి కోర్టు నుంచి శ్రీకాకుళం సబ్జైల్కు రిమాండ్కు పంపించిన సంగతి తెలిసిందే. ఆ పదిమందికి ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జి గురువారం పూచీకత్తులపై బెయిలు మంజూరు చేసినట్లు సీఐ ప్రసాద్రావు తెలిపారు. ఒక్కో ముద్దాయికి ఇద్దరు పూచీకర్తులతో రూ.10 వేలు జామీను అమౌంట్తో బెయిల్ మంజూరు చేసినట్లు వారు తెలిపారు. -
కర్మ మీకోసం ఎదురుచూస్తోంది!
న్యూఢిల్లీ: భారత దివంగత ప్రధాని రాజీవ్గాంధీ అవినీతిపరుడిగా అంతమయ్యారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. ‘మోదీజీ.. యుద్ధం ముగిసిపోయింది. కర్మ ఫలితం మీకోసం ఎదురుచూస్తోంది. మీ గురించి మీ మనసులో ఉన్న భావాలను నా తండ్రిపై రుద్దడం ద్వారా మీరు తప్పించుకోలేరు. మీకో పెద్ద కౌగిలింత, ప్రేమతో.. రాహుల్’ అని ట్వీట్ చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యూపీలో శనివారం ప్రచారంలో పాల్గొన్న మోదీ రాహుల్గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీ తండ్రి రాజీవ్గాంధీని ఆయన అనుచరులంతా ‘మిస్టర్ క్లీన్‘గా అభివర్ణించేవారు. చివరకు ఆయన నంబర్ 1 అవినీతిపరుడిగా అంతమయ్యారు’ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. మోదీ వ్యాఖ్యలపై ప్రియాంకా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ‘అమరుల పేర్లు చెప్పి ప్రజలను ఓట్లడిగే మోదీ పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ మంచి వ్యక్తిని అవమానించారు. అమేథీ ప్రజల సేవలోనే రాజీవ్ ప్రాణలు అర్పించారు. ఆ ప్రజలే మోదీకి బుద్ధి చెబుతారు. మోదీజీ.. మీలాంటి మోసకారుల్ని దేశం ఎన్నటికీ క్షమించదు’ అని విమర్శించారు. సభ్యత, సంస్కారాల విషయంలో మోదీ అన్ని హద్దులు దాటేశారని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వ్యాఖ్యలపై ఓ గుజరాతీగా సిగ్గుపడుతున్నానని రాజీవ్ స్నేహితుడు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
‘ఆక్సిజన్’ కోసమే మాతో తెగదెంపులు: సేన
ముంబై: కొందరికి అధికారమే ఆక్సిజన్ లాంటిదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎదురుదాడి చేసింది. పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ‘మోదీ ఆక్సిజన్ అంటున్న అధికారం కోసమే 2014లో బీజేపీ మాతో పొత్తును తెంచుకుంది’ అని రాసింది. ‘మంచి రోజులు తెస్తామని హామీలిచ్చి విఫలమైన వారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంటారు’ అని శివసేన బీజేపీపై పరోక్షంగా విరుచుకుపడింది. మంచిరోజులు (అచ్ఛే దిన్) తెస్తామనే నినాదంతో 2014 ఎన్నికలప్పుడు బీజేపీ విస్తృతంగా ప్రచారం చేయడం తెలిసిందే. బీజేపీకి ఆక్సిజన్ లాంటి అధికారాన్ని కోల్పోకుండా ఉండేందుకు నేరగాళ్లకు ఆ పార్టీ ఆశ్రయం కల్పిస్తోందనీ, అలాంటి వారిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా దొంగలను పవిత్రులను చేస్తోందని శివసేన విమర్శించింది. -
ఆర్మీ కాల్పుల్లో వ్యాపారి మృతి
బనిహాల్ / జమ్మూ: జమ్మూకశ్మీర్లోని రంబన్ జిల్లాలోని ఓ గ్రామంలో పశువుల వ్యాపారులపై ఆర్మీ జవాన్లు కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి చనిపోగా, మరొకరు గాయపడ్డారు. అయితే తమపై కాల్పులు జరగడంతోనే ఎదురుకాల్పులు ప్రారంభించామని ఆర్మీ చెబుతోంది. గూల్ ప్రాంతానికి చెందిన పశువుల వ్యాపారులు మొహ్మద్ రఫీక్ గుజ్జర్(28), షకీల్ అహ్మద్(30) ఆదివారం ఉదయం 4 గంటలకు స్వగ్రామానికి తిరిగివస్తుండగా జవాన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రఫీక్ అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ షకీల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఎలాంటి ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యం కాలే దు. ఈ ఘటనకు సంబంధించి ఆర్మీ జవాన్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో కోహ్లి ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు జరుపుతుండగా అనుమానాస్పద కదలికల్ని గమనించిన ఆర్మీ జవాన్లు ఆవ్యక్తులను ఆపి గుర్తింపును చెప్పాల్సిందిగా కోరాయని సైన్యం తెలిపింది. అయితే, జవాన్లపై నిందితులు కాల్పులు జరిపడంతో ప్రతిగా ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో ఒకరు చనిపోగా, మరొకరు గాయపడ్డారని సైనికాధికారులు అంటున్నారు. -
మోదీజీ.. నిప్పుతో ఆటలొద్దు..
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో పాలక మమతా సర్కార్పై ప్రధాని నరేంద్ర మోదీ మిడ్నపూర్ కిసాన్ ర్యాలీలో చేసిన విమర్శలపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. నిప్పుతో చెలగాటం వద్దని మోదీకి హితవు పలికింది. ఈ ర్యాలీకి పొరుగు రాష్ట్రాలు జార్ఖండ్, ఒడిషాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించారని విమర్శించింది. కిసాన్ ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో సిండికేట్ రాజకీయాలను నడిపిస్తూ అధికారంలో కొనసాగేందుకు స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రధాని ఆరోపణలను తృణమూల్ దీటుగా తిప్పికొట్టింది. మత ఛాందసవాదం, అవినీతి, హత్యారాజకీయాలతో బీజేపీ సిండికేట్గా మారిందని దుయ్యబట్టింది. పశ్చిమ బెంగాల్ ప్రపంచంలో సాంస్కృతిక రాజధానిగా వర్ధిల్లుతోందని, అభివృద్ధి అజెండాలేని ప్రధాని మోదీ కేవలం రాజకీయాలతో పబ్బం గడుపుకునేందుకు వచ్చారని పేర్కొంది. మోదీ ఎన్ని మాటలు చెప్పినా బెంగాల్లో బీజేపీకి ఫలితం సున్నా అంటూ వ్యాఖ్యానించింది. మరోవైపు మోదీ ర్యాలీలో టెంట్ కూలి 20 మందికి గాయాలైన ఘటన పట్ల తృణమూల్ విచారం వ్యక్తం చేసింది. క్షతగాత్రులకు అన్నిరకాలుగా సాయం చేసేందుకు సిద్ధమని పేర్కొంది. -
ఢిల్లీ, ఏపీ సీఎంలకు జీవీఎల్ కౌంటర్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన నిరసనకు నాలుగు రాష్ట్రాల సీఎంలు మద్దతు తెలపడాన్ని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అద్భుతంగా పాలిస్తున్నారని, రాష్ట్రాలతో స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాలకు గతంతో పోల్చితే రెట్టింపు నిధులు ఇస్తున్నారని జీవీఎల్ పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్లు సీఎంగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. కేవలం వారి అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికే సీఎంలు నిరసన చేపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, కేజ్రీవాల్లపై ట్వీట్లో జీవీఎల్ మండిపడ్డారు. ’ చంద్రబాబు, కేజ్రీవాల్ల మధ్య కామన్ పాయింట్ ఉంది. సీఎంలుగా బాధ్యతలు నిర్వహించడంలో ఈ ఇద్దరూ విఫలమయ్యారు. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే దీక్షలు, నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబు ఫైవ్ స్టార్ నిరసనల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. నిధుల కోసమే తాను ఇలా చేస్తున్నానని చెబుతుంటారు’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. వీరు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారులను ఉపయోగించారని జీవీఎల్ విమర్శించారు. చంద్రబాబు తన రాజకీయాల కోసం నాన్ గెజిటెడ్ కార్మికులను ఉపయోగించడంలో నిపుణుడని.. కేజ్రీవాల్ ప్రధాన కార్యదర్శిపై దాడికి తన గుండాలను ఉపయోగించారని తెలిపారు. ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ కార్యాలయంలో కేజ్రీవాల్ దీక్షకు సంఘీభావంగా పశ్చిమబెంగాల్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు మమత బెనర్జీ, కుమారస్వామి, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడులు కేజ్రీవాల్ భార్యను పరామర్శించిన సంగతి తెలిసిందే. -
బెంగళూరుపై మోదీ కక్ష సాధింపు: రాహుల్
సాక్షి, బెంగళూరు: ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ బెంగళూరుపై కక్ష సాధిస్తున్నారు. సిలికాన్ సిటీని చెత్త నగరంగా మార్చారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ఇక్కడ ఎన్నోమార్లు పర్యటించినా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు’ అని కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన బెంగళూరు నగరంలో రోడ్ షో నిర్వహించారు. పలుచోట్ల తన ప్రసంగాల్లో మోదీపై ఎదురుదాడికి దిగారు. మోదీ ప్రసంగాలకు ఎవరూ మోసపోరన్నారు. మోదీ ప్రధాని పదవిలో ఉన్నాననే సంగతి మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు 2019లో తాను ప్రధాని కూడా అవుతానని పునరుద్ఘాటించారు.హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా కాంగ్రెస్లో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. అవినీతి, అక్రమాలతో కూరుకుపోయిన బీజేపీకి అవకాశం ఇవ్వరాదని ప్రజలను కోరారు. అనంతరం బసవనగుడిలో ప్రాచీన దొడ్డ గణపతి ఆలయంలో రాహుల్ పూజలు చేశారు. చిక్కపేటె ప్రాంతంలో హజరత్ మసీదులో ప్రార్థనల్లో పాల్గొన్నారు. అవినీతి విషయంలో కర్ణాటకలో ప్రస్తుత కాంగ్రెస్పై గత బీజేపీ పాలనే తేలిగ్గా విజయం సాధిస్తుందని రాహుల్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ హయాం (2008–13)లో జరిగిన అవినీతిని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో పోల్చుతూ పలు గణాంకాలను ట్విటర్లో విడుదల చేశారు. -
ఉగ్రవాదం మీ చలవే..ట్రంప్కు పాక్ కౌంటర్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ అబద్దాల పుట్ట అంటూ సీరియస్ వార్నింగ్లతో చెలరేగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పాక్ గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ చేసిన త్యాగాలను ట్రంప్ విస్మరించారని పాక్ మంత్రి అసన్ ఇక్బాల్ ఆరోపించారు. నూతన సంవత్సరం తొలిరోజున తన ట్వీట్ ద్వారా ట్రంప్ పాక్ ప్రతిష్టపై దాడి చేశారని అన్నారు. అమెరికా రాజకీయాల ఫలితంగానే ఈ ప్రాంతంలో ఉగ్రవాదం ప్రబలిందని ఇక్బాల్ దీటుగా బదులిచ్చారు. పాక్ను అబద్దాల పుట్టగా పిలిచే హక్కు ఏ ఒక్కరికీ లేదని, ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో తాము ఎన్నో త్యాగాలు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. 1970-80 ప్రాంతాల్లో అమెరికా విధానాల కారణంగా ఆప్ఘనిస్తాన్లో ఉగ్రవాదం వేళ్లూనుకుందని అన్నారు. సోవియట్స్తో యుద్ధం ముగిసిన వెంటనే మీరు (అమెరికా) ఆప్ఘన్లో నాటిన సోవియట్ వ్యతిరేకఉద్యమం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే అంశాన్ని విస్మరించారని..సోవియట్తో గెలుపు కోసం మీరు నాటిన ఉగ్ర ధోరణులు వెంటనే కంప్యూటర్ చిప్స్ను తయారుచేయలేవని చురకలు అంటించారు. అమెరికా విధానాల ఫలితంగానే ఉగ్రవాదం వేళ్లూనుకున్న వైనాన్ని గుర్తుచేశారు. ఆప్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కు వచ్చిన లక్షలాది శరణార్థుల కోసం అమెరికా చేస్తున్నదేమీలేదని మంత్రి ఆరోపించారు. -
మాటకు మాట
-
మాఫీ కాదు మాఫియా
-
ఎదురు దాడే సర్కారు ఆయుధం
చల్లటి వాతావరణంలో.. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడిగా, వేడిగా జరగనున్నాయి. వివిధ కుంభకోణాలు, వివాదాస్పద బిల్లులపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు సిద్ధం కాగా, వాటి ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టేందుకు పాలక బీజేపీ ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా సమావేశాలు, మంతనాలు జరిపి ఓ కృతనిశ్చయానికి వచ్చింది. ప్రధానంగా లలిత్ గేట్ కుంభకోణంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ల రాజీనామాలను డిమాండ్ చేస్తూ సమావేశాలను స్తంభింపచేయాలని ప్రతిపక్షాలు వ్యూహరచన చేయగా, ఈ కుంభకోణాల్లో తమవారి తప్పేమీ లేదని సమర్థించుకోవడంతో పాటు కుక్క కాటుకు చెప్పుదెబ్బలా కాంగ్రెస్ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను ప్రస్తావిస్తూ ఎదురుదాడికి దిగాలని పాలక ఎన్డీయే పక్షాలు వ్యూహరచన చేశాయి. తమ పార్టీకి చెందిన మంత్రులు గానీ, ముఖ్యమంత్రులు గానీ ఎవరూ ఎలాంటి తప్పుచేయలేదని, వారు రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రభుత్వం తరఫున ఇప్పటికే స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో అన్ని అంశాలను చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పిలుపునిచ్చారు. సమావేశాలను సజావుగా నిర్వహించడం సమష్టి బాధ్యతని కూడా ఆయన చెప్పారు. ఏ దశలోనూ ప్రతిపక్షం ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గదని, ప్రతిపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టడమే తమ వ్యూహమని, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, పియూష్ గోయల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెలతో అమిత్ షా పార్లమెంట్లో ఎన్డీయే పక్షాలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చోప చర్చలు జరిపారు. జైట్లీ, రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు తదితర పార్టీ నేతలను తోడ్కొని వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో కూడా చర్చించారు. పార్టీ నాయకత్వానికి అందుబాటులో ఉండేందుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కూడా ఢి ల్లీలోనే మకాం వేశారు. అవసరమైతే సుష్మా స్వరాజ్తో సభలో సమాధానం ఇప్పించాలని కూడా అభిప్రాయానికొచ్చారు. సభలో పరిస్థితులను బట్టి వివాదాస్పదమైన భూసేకరణ, జీఎస్టీ, రియల్ ఎస్టేట్ లాంటి పెండింగ్ బిల్లులను తీసుకరావాలని నిర్ణయించారు. ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడమే ఉత్తమ వ్యూహంగా ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత అమిత్ షా పార్టీ మీడియా ప్రతినిధులతో సమావేశమై పార్టీ వైఖరిని వెల్లడించారు. ఈ సమావేశంలో శ్రీకాంగ్ శర్మ, ఎంజె అక్బర్, సాంబిత్ పాత్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష, పాలకపక్షాలు దాడి, ఎదురుదాడులకు సిద్ధపడడంతో పార్లమెంట్ సమావేశాలు హోరెత్తనున్నట్టు స్పష్టమవుతోంది. -
'సీమాంధ్రులను అవమానించిన పవన్'
-
‘తెలంగాణ’పై కౌంటర్ ఎటాక్
-
‘తెలంగాణ’పై కౌంటర్ ఎటాక్
- అవకాశం ఉన్న అంశాల్లో కేసుల నమోదుకు నిర్ణయం - పాత విషయాలు తిరగదోడమని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు - కేసీఆర్, తెలంగాణ అధికారులపై ఏపీలో నమోదైన 70 కేసులు - వీటిలో నోటీసుల జారీకి ఉన్న అవకాశాలను పరిశీలించాలని స్పష్టీకరణ - తనకు ‘నోటీసులు జారీ’ అంశంపై రాష్ట్ర ఏసీబీ అధికారులతో చర్చ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో పీకల్లోతున కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురుదాడి (కౌంటర్ ఎటాక్)కి దిగాలని యోచిస్తున్నారు. వీలున్నంత వరకు తెలంగాణ సర్కారు, నేతలను ఇబ్బందులకు గురిచేయాలని వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నుంచి తనకు నోటీసులు రావడానికి ముందే దీన్ని కార్యరూపంలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఏపీ సీఎం ఈ మేరకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. ఈ మేరకు తనకు నోటీసులు జారీఅయ్యేలోపే తెలంగాణ నేతలు, అధికారులపై కేసుల నమోదుకు గల అవకాశాలను పరిశీలించాలని కోరినట్టు సమాచారం. మరోవైపు తనకు నోటీసులు జారీ అయిన పక్షంలో అనుసరించాల్సిన వ్యూహంపై వరుసగా మూడోరోజూ రాష్ట్ర ఏసీబీ అధికారులతో సీఎం చర్చించారు. అన్నీ సిద్ధం చేయండి... ‘ఓటుకు నోటు’ కేసుకు సంబంధించి తెలంగాణ ఏసీబీ అధికారులు సీఎం చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేయడం ఖాయమనే సంకేతాలు వెలువడుతుండటంతో కౌంటర్ ఎటాక్పై ఆయన దృష్టి పెట్టారు. ఈ నోటీసులు జారీ అయ్యేలోపే తెలంగాణ నేతలు, అధికారులపై కేసుల నమోదు అంశాన్ని పరిశీలించాల్సిందిగా అధికారుల్ని సీఎం ఆదేశించారు. ‘ఓటుకు నోటు’ ఆడియో టేపులు వెలుగులోకి వచ్చిన తరవాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర నేతలు, అధికారులపై టీడీపీ శ్రేణులు, నేతలు ఇచ్చిన ఫిర్యాదులతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దాదాపు 70 కేసులు నమోదయ్యాయి. వీటి దర్యాప్తును సాకుగా చూపి ఆయా నేతలు, అధికారులకు నోటీసులు జారీ చేసే అంశాలను పరిశీలించడంతోపాటు జారీ చేసే అవకాశముంటే వాటిని సిద్ధం చేసి ఉంచాల్సిందిగా సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. మరోవైపు తెలంగాణకు చెందిన నేతలు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై గతంలో ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఏవైనా కేసులు నమోదై ఉన్నాయా? ప్రస్తుతం అవి ఏ స్థితిలో ఉన్నాయి? తదితర అంశాలనూ ఆరా తీసి సిద్ధంగా ఉంచుకోవాలని కూడా సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఆయా కేసులకు సంబంధించిన బాధితులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలను సిద్ధం చేయడంతోపాటు తాజాగా వారితో ఫిర్యాదులు చేయించి... తెలంగాణకు చెందిన వారిపై కేసులు నమోదు చేయడానికున్న అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. నోటీసులు జారీ అయితే ఏం చేద్దాం.. ఇదిలా ఉండగా ‘ఓటుకు నోటు’ కేసులో నోటీసులు జారీ అయితే అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రాష్ట్ర ఏసీబీ అధికారులతో చర్చించారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని (సీఆర్పీసీ 164 స్టేట్మెంట్) తెలంగాణ ఏసీబీ అధికారులు సోమ, మంగళవారాల్లో మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసే అవకాశముంది. దీంతోపాటు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో వెలుగులోకొచ్చిన వివరాలు, కస్టడీలో నిందితులు వెల్లడించిన వివరాలతో న్యాయస్థానంలో సమగ్ర నివేదిక సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫోన్ సంభాషణల ఆడియో టేపుతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుతోపాటు మరికొందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చేందుకు అనుమతి కోరుతూ మెమో దాఖలు చేసేందుకు తెలంగాణ ఏసీబీ కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టం కింద నోటీసులు జారీ చేసే అవకాశముంది. దీంతో వీటిని ఎదుర్కోడమెలా? అనే అంశాలపై ఆయా అధికారులు, న్యాయనిపుణులతో చంద్రబాబు చర్చించినట్టు తెలిసింది.