DDCA
-
భారత్లో మరో టీ20 లీగ్.. తొలి ఎడిషన్ అప్పటి నుంచే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. 2008లో మొదలైన ఈ టీ20 లీగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. క్యాష్ రిచ్ లీగ్గా పేరొందిన ఐపీఎల్లో ఒక్కసారి ప్రతిభ నిరూపించుకుంటే ఆటగాళ్లపై కనకవర్షం కురవడం ఖాయం. అంతేకాదు.. ఇక్కడ ప్రతిభ చూపితే జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకునే అవకాశాలు ఉంటాయి.ఇటీవలి కాలంలో యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ తదితరులు అలా టీమిండియాలో చోటు దక్కించుకున్న వాళ్లే. యంగ్ టాలెంట్ హంట్లో భాగంగా దేశవాళీ క్రికెట్, అండర్-19 టోర్నీల్లో ఆకట్టుకున్న ఆటగాళ్ల నుంచి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన వాళ్లను ఎంపిక చేసుకుంటాయి.ఇప్పటికే పలు స్థానిక లీగ్లుఈ క్రమంలో పలు రాష్ట్రాల క్రికెట్ బోర్డులు సైతం టీ20 లీగ్లు నిర్వహిస్తూ స్థానిక ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే తమిళనాడు ప్రీమియర్ లీగ్, ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, పంజాబ్ ప్రీమియర్ లీగ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ బోర్డు సైతం ఇదే బాటలో నడవాలని నిశ్చయించింది.ఢిల్లీ ప్రీమియర్ లీగ్ పేరిట టోర్నీని ఆరంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు 2024 ద్వితీయార్థ భాగంలో ఈ లీగ్ను మొదలుపెట్టనున్నట్లు పేర్కొంది. మ్యాచ్లన్నీ అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది.అదే స్పెషల్ ఇక్కడమిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఢిల్లీ తమ ప్రీమియర్ లీగ్ను నిర్వహించనుంది. ఈ టోర్నీలో పురుషులతో పాటు మహిళా జట్లకు కూడా అవకాశం ఇవ్వనుంది. మొత్తంగా 40 మ్యాచ్లు నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలిపిన డీడీసీఏ.. ఇందులో 33 మెన్, 7 వుమెన్ క్రికెట్ మ్యాచ్లు ఉంటాయని వెల్లడించింది.ఇక ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో మొత్తంగా ఆరు జట్లు(మెన్) ఉంటాయని.. వీటికోసం ఫ్రాంఛైజీలు రూ. 49.65 కోట్ల రూపాయాల మేర ఖర్చు చేయవచ్చని డీడీసీఏ తెలిపింది. ఇందులోని టాప్ 4 బిడ్డర్లు మహిళా జట్లను ఆటోమేటిక్గా కైవసం చేసుకుంటాయని పేర్కొంది. స్థానికంగా క్రికెట్ను మరింత అభివృద్ధి చేసేందుకే ఈ లీగ్ ఆరంభిస్తున్నట్లు తెలిపింది. -
క్రికెట్లోకి సెహ్వాగ్ కొడుకు ఎంట్రీ.. ఢిల్లీ జట్టుకు ఎంపిక
టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయడు ఆర్యవీర్ దేశీవాళీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ఢిల్లీ అండర్-16 జట్టుకు ఆర్యవీర్ ఎంపికయ్యాడు. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్లో బిహార్తో తలపడుతోంది. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల ఢిల్లీ జట్టులో ఆర్యవీర్కు చోటు దక్కింది. కాగా ఢిల్లీ ప్రాబ్బుల్స్లో ఆర్యవీర్ ఉన్నప్పటికీ.. హైదరాబాద్తో జరిగిన తొలి మ్యాచ్కు అతడికి చోటు దక్కలేదు. ఇక ఈ జట్టుకు అర్నవ్ బుగ్గా సారథ్యం వహిస్తున్నాడు. ఇక ఇదే విషయంపై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్పర్సన్ ఆకాష్ మల్హోత్రా స్పందించారు. "ఆర్యవీర్ అద్భుతమైన బ్యాటర్. అతడి ఫుట్వర్క్ కూడా చాలా బాగుంది. బంతిని కూడా బాగా మిడిల్ చేస్తున్నాడు. అతడి ఆటతీరు మమ్మల్ని ఆకట్టుకుంది. అందుకే ఆర్యను ఎంపిక చేశాం" అని ఆకాష్ మల్హోత్రా పేర్కొన్నాడు. ఇక జట్టు ఎంపికైన తర్వాత ఆర్యవీర్ తల్లి ఆర్తి సెహ్వాగ్ అతడి బ్యాటింగ్ ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో రిపోస్ట్ చేసింది. Delhi Men's under 16 Team for the match against Bihar in the Vijay Merchant Trophy. Delhi won the toss and elected to bat first. pic.twitter.com/KcwMwSS4yw — DDCA (@delhi_cricket) December 6, 2022 అంతకుముందు ఆర్యవీర్ కూడా నెట్ ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. కాగా ఢిల్లీ నుంచి ఎంతో మంది స్టార్ క్రికెటర్లగా ఎదిగారు. విరాట్ కోహ్లి, గౌతం గంభీర్, సెహ్వాగ్, మదన్లాల్ వంటి క్రికెటర్లు ఢిల్లీకి చెందిన వారే. View this post on Instagram A post shared by Aaryavir Sehwag (@aaryavirsehwag) View this post on Instagram A post shared by Aaryavir Sehwag (@aaryavirsehwag) -
Rohan Jaitley: డీడీసీఏ అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ
Rohan Jaitley Elected As DDCA President: ప్రతిష్టాత్మక ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ మళ్లీ ఎన్నికయ్యారు. గురువారం వెలువడిన ఫలితాల్లో ఆయన సమీప ప్రత్యర్థి, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్పై 753 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇక ఇండిపెండెంట్గా పోటీ చేసిన సిద్ధార్థ్ సింగ్ వర్మ కార్యదర్శి పదవిని సొంతం చేసుకున్నారు. మాజీ క్రికెటర్ అయిన సిద్ధార్థ్, మాజీ ముఖ్యమంత్రి సాహెబ్సింగ్ వర్మ కుమారుడు, ప్రస్తుత పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మకు సోదరుడు. చదవండి: T20 World Cup 2021 Aus Vs SL: కప్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆసీస్... వరుస విజయాలు -
డీడీసీఏ అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడవు శనివారంతో ముగియగా... అధ్యక్ష పదవి రేసులో రోహన్ మాత్రమే ఉండటంతో అతడిని ఏకగ్రీవం చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. అధ్యక్ష పదవిలో రోహన్ వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఉండనున్నారు. గతంలో అరుణ్ జైట్లీ 1999 నుంచి 2013 వరకు డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. న్యాయవాది అయిన రోహన్... తండ్రి బాటలోనే నడుస్తూ డీడీసీఏ అధ్యక్ష పదవిని అలంకరించడంతో పలువురు క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. కోశాధికారి, డైరెక్టర్ పదవుల కోసం నవంబర్ 5–8 మధ్య ఎన్నికలు జరగనున్నాయి. కోశాధికారి పదవి కోసం బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సీకే ఖన్నా సతీమణి శశి, గౌతమ్ గంభీర్ మేనమామ పవన్ గులాటి మధ్య పోటీ నెలకొని ఉంది. -
కీలక పదవికి జైట్లీ కుమారుడు ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహాన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021 జూన్ 30 వరకు ఆయన డీసీసీఏ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. వృత్తిరిత్యా న్యాయవాది అయిన రోహాన్.. తన తండ్రి బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక అధికారులు, నేతల సూచనల మేరకు డీడీసీఏ బరిలో నిలిచి విజయం సాధించారు. ఈ సందర్భంగా రోహాన్ జైట్లీకి పలువురు ఆటగాళ్లు, ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. జైట్లీ నేతృత్వంలోనే ఢిల్లీ క్రికెట్ సంఘం మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా అవినీతి ఆరోపణలు రావడంతో రజత్ శర్మ రాజీనామా చేయగ.. ఆ పదవిక ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రోహాన్ ఎన్నికయ్యారు. ఢిల్లీ క్రికెట్ సంఘానికి కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎంతో సేవ చేసిన విషయం తెలిసిందే. 1999 నుంచి 2013 వరకు ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్కు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. ఆయన సారథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు జాతీయ జట్టుకు సైతం ఎంపికయ్యారు. ఆయన సేవలను గుర్తించిన డీసీఏ జైట్లీ మరణాంతరం ఢిల్లీలోని ప్రముఖ ఫిరోజ్ షా కోట్ల మైదానానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టి ఘనంగా సత్కరించింది. -
కీలక పదవిలో అరుణ్ జైట్లీ కుమారుడు!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహాన్ జైట్లీ ఓ కీలక పదవి కోసం పోటీపడుతున్నారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ మేరకు రోహాన్ జైట్లీ బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సభ్యులంతా ఆయననే మద్దతు తెలుపుతుండటంతో ఎన్నికల లాంఛనం కానున్నట్లు సమాచారం. ఇక డీసీసీఏ పదవికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పలువురు ప్రముఖలు జైట్లీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ దావన్ ట్విటర్ వేదికగా విషెష్ తెలియజేశాడు. అతను విజయం సాధించాలని, డీడీసీఏ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించాడు. మరోవైపు రోహాన్ ఎన్నికకు తామంతా సహకరిస్తామని డీసీఏ సభ్యులు తెలిపారు. ఢిల్లీ క్రికెట్ సంఘానికి కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎంతో సేవ చేసిన విషయం తెలిసిందే. 1999 నుంచి 2013 వరకు ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్కు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. ఆయన సారథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు జాతీయ జట్టుకు సైతం ఎంపికయ్యారు. ఆయన సేవలను గుర్తించిన డీసీఏ జైట్లీ మరణాంతరం ఢిల్లీలోని ప్రముఖ ఫిరోజ్ షా కోట్ల మైదానానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టి ఘనంగా సత్కరించింది. అయితే తండ్రి వారసత్వంలో కొనసాగాలి అనుకున్న రోహాన్.. స్థానిక పెద్దల సహకారంతో డీడీసీఏ పదవికి నామినేషన్ వేశారు. అయితే రోహాన్ ఎన్నికకు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఎన్నిక నల్లేరు మీద నడకే కానుంది. మరోవైపు డీడీసీఏలో తారాస్థాయిలో అంతర్యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొంతకాలంగా ముఖ్య కార్యదర్శి వినోద్ తిహారాతో అధ్యక్షుడు రజత్ శర్మకు పొసగటం లేదు. అరుణ్ జైట్లీ మరణం తర్వాత డీడీసీఏ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావడం అంతేకాకుండా రజత్ శర్మపై అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా తమ నిర్ణయాలకు అధ్యక్షుడు వ్యతిరేకించడంతో సంఘం సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్ష పదవికి గత ఏడాది నవంబర్లో సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. -
రసాభాసగా మారిన ఏజీఎం
-
ఢిల్లీ క్రికెట్లో గల్లీ గొడవ
న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ)లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విభేదాలు రచ్చకెక్కాయి. ఆదివారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) సందర్భంగా సభ్యులు ఒకరిపై మరొకరు నేరుగా చేయి చేసుకున్నారు. అధికార వర్గానికి చెందిన సంయుక్త కార్యదర్శి రంజన్ మన్చందాను ప్రత్యర్థి వర్గం ప్రతినిధి మఖ్సూద్ ఆలమ్ చెంపదెబ్బ కొట్టగా... స్థానిక ఎమ్మెల్యే కూడా అయిన ఓం ప్రకాశ్ శర్మపై కూడా వినోద్ తిహారాకు చెందిన వ్యక్తులు దాడికి దిగారు. ఇంత గొడవ మధ్యలో కూడా అన్ని తీర్మానాలకు ఆమోదం లభించినట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారికంగా ప్రకటించింది. జస్టిస్ బదర్ అహ్మద్ స్థానంలో కొత్తగా జస్టిస్ దీపక్ వర్మను కొత్త అంబుడ్స్మన్గా నియమించారు. ‘ఢిల్లీ క్రికెట్ సంఘం అతి ఘోరంగా సున్నాకే ఆలౌటైంది. కొందరు సంఘం పరువు తీస్తున్నారు. ఈ సంఘాన్ని వెంటనే రద్దు చేయాలని బీసీసీఐ, గంగూలీకి విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైతే తప్పు చేసినవారిపై జీవితకాల నిషేధం కూడా విధించండి’ అని భారత మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ తాజా ఘటనపై వ్యాఖ్యానించాడు. -
బీసీసీఐనే బురిడీ కొట్టించాడు!
న్యూఢిల్లీ: అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లు ఆడేందుకు వయసు దాచి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)నే తప్పుదారి పట్టించే యత్నం చేసిన ఢిల్లీ క్రికెటర్ ప్రిన్స్ రామ్ నివాస్ యాదవ్పై నిషేధం పడింది. ఈ మేరకు రామ్ నివాస్ యాదవ్ దొంగ సర్టిఫికేట్ ఇచ్చాడనే విషయం తాజాగా వెలుగుచూడటంతో అతనిపై నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ నిషేధం రెండేళ్ల పాటు మాత్రమే అమల్లో ఉంటుందని బోర్డు తెలిపింది. దాంతో 2020-21, 2021-22 సీజన్లలో దేశవాళీ టోర్నీల్లో పాల్గొనే అవకాశాన్ని రామ్ నివాస్ కోల్పోయాడు. ‘ అతను వయసుతో బోర్డును రాష్ట్ర అసోసియేషన్ను తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. దీనిపై బీసీసీఐ నుంచి మాకు సమాచారం అందింది. దాంతో అతనిపై విచారణ చేయగా తప్పు చేసినట్లు తేలింది’ అని డీడీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అతను 1996, జూన్ 10వ తేదీన పుడితే, బీసీసీఐకి ఇచ్చిన సర్టిఫికేట్లో 2001, డిసెంబర్ 12వ తేదీన పుట్టినట్లు ఉంది. ఈ విషయం అతని సెకండరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లో బట్టబయలు అయ్యింది. ఏకంగా ఐదు ఏళ్ల తేడాతో బోర్డునే బురిడీ కొట్టించాలని చూడటంతో బీసీసీఐ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ క్రికెట్ బోర్డులో అతని ఐడీ నంబర్ 12968 కాగా, ఢిల్లీ తరఫున రిజస్ట్రేష్ చేసుకున్నాడు. 2018-19 సీజన్కు సంబంధించి అండర్-19 క్రికెట్ కేటగిరీలో అతను రిజస్టర్ చేసుకున్నాడు. కాగా, అతని వయసుకు సంబంధించి సర్టిఫికేట్ను ఇటీవల బీసీసీఐ ఇవ్వాల్సి రావడంతో అసలు దొంగ సర్టిఫికేట్ వ్యవహారం బయటపడింది. అతనికి సంబంధించి పూర్తి వివరాలను బీసీసీఐ.. డీడీసీఏకు అందజేసింది. అందులో అతని జన్మించిన సంవత్సరం 2001గా ఉంది. -
గౌతం గంభీర్కు అరుదైన గౌరవం
ఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్కు అరుదైన గౌరవం దక్కనుంది. ఢిల్లీలోని అరుణ్జైట్లీ క్రికెట్ స్టేడియంలోని ఒక స్టాండ్కు గంభీర్ పేరు పెట్టాలని ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) నిర్ణయించింది. భారత జట్టుకు ఎన్నో సేవలందించిన ఈ ఢిల్లీ ఆటగాడికి ఒక గుర్తింపు ఇవ్వడానికి డీడీసీఏ సమాయత్తమైంది. దానిలో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలోని ఒక స్టాండ్కు గంభీర్ పేరును దాదాపు ఖరారు చేసింది. ఈ మేరకు వచ్చే నెలలో గంభీర్ పేరుతో స్టాండ్ ఏర్పాటు కానుంది. జూనియర్, సీనియర్ స్థాయిలో ఢిల్లీ తరఫున గంభీర్ ఎన్నో మ్యాచ్లు ఆడాడు. 2018లో ఆంధ్రప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో భాగంగా ఢిల్లీ తరఫున చివరి మ్యాచ్ ఆడుతూనే గంభీర్ తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. 1999 సీజన్లో గంభీర్ రంజీ ట్రోఫీ అరంగేట్రాన్ని ఢిల్లీ తరఫున ఆరంభించాడు. అలా టెస్టు ఫార్మాట్లోకి అడుగుపెట్టి భారత్ తరఫున 9 ఏళ్ల క్రికెట్ ఆడాడు. 2007-08 సీజన్లో అతని సారథ్యంలోని ఢిల్లీ రంజీ ట్రోఫీ అందుకుంది. -
‘ఆ రాజీనామా ఇంకా ఆమోదించలేదు’
న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్ష పదవికి సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ ఉన్నపళంగా రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే రజత్ శర్మ రాజీనామాను తాము ఇంకా ఆమోదించలేదని డీడీసీఏ డైరెక్టర్ ఆర్పీసింగ్ స్పష్టం చేశారు. రజత్ శర్మ రాజీనామాను తాము వెంటనే ఆమోదించేసినట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇంకా ఆయన రాజీనామా అంశం చర్చల దశలోనే ఉందన్నారు. రజత్ రాజీనామాపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. డీడీసీఏలో అధిక ఒత్తిళ్లు ఎదురవుతున్న కారణంగానే రాజీనామా చేసినట్లు శనివారం తన పదవికి గుడ్బై చెప్పిన తర్వాత రజత్ శర్మ తెలిపారు. కొంత మంది క్రికెట్ సమగ్ర అభివృద్ది కోసం కాకుండా స్వార్థ పూరిత విధానాలకు పాల్పడుతున్నారన్నారు. డీడీసీఏలో తారాస్థాయిలో అంతర్యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా ముఖ్య కార్యదర్శి వినోద్ తిహారాతో రజత్ శర్మకు పొసగటం లేదు. అరుణ్ జైట్లీ మరణం తర్వాత డీడీసీఏ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావడం అంతేకాకుండా రజత్ శర్మపై అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా తమ నిర్ణయాలకు అధ్యక్షుడు వ్యతిరేకించడంతో సంఘం సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. -
జైట్లీ మృతికి బీసీసీఐ ప్రగాఢ సంతాపం
న్యూఢిల్లీ: క్రికెట్ పాలకుడిగా తనదైన ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతికి బీసీసీఐ సంతాపం ప్రకటించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, సుదీర్ఘ కాలం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా పనిచేసిన జైట్లీని సమర్ధుడైన పాలకుడిగా కొనియాడింది. జైట్లీ మృతి తనకు, దేశానికి తీరని లోటని బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా అన్నారు. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో పలువురు స్థానిక క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగారు. వారిలో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, టీమిండియా ప్రస్తుత ఆటగాళ్లైన కెప్టెన్ కోహ్లి, ధావన్, ఇషాంత్ శర్మ తదితరులున్నారు. జెట్లీ తనకు పితృ సమానుడని గంభీర్ అభివర్ణించాడు. జైట్లీ మృతి కలచి వేసిందని దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. జైట్లీ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు విండీస్తో టెస్టులో నల్ల బ్యాడ్జీలు ధరించారు. -
జైట్లీ మరణం.. గంభీర్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ఆగ్ర నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ(66) మరణం పట్ల యావత్ భారతావని విచారం వ్యక్తం చేస్తోంది. జైట్లీతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ పలువురు రాజీకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇప్పటికే బీసీసీఐతో పాటు టీమిండియా తాజా, మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ జైట్లీ మరణంపై భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘నాన్న నీకు మాట్లాడాలని చెప్తారు. నాన్నలాంటి వారు నిన్ను అందరి ముందు ప్రసంగించాలని సూచిస్తారు. తండ్రి నీకు నడక నేర్పిస్తారు. తండ్రిలాంటి వ్యక్తి నీకు పరుగెత్తడం నేర్పిస్తారు. నాన్న నీకు పేరు పెడతాడు. నాన్న సమానులు నీకో గుర్తింపునిస్తారు. నా తండ్రి సమానుడైన అరుణ్ జైట్లీ మరణంతో నాలో ఓ భాగం పోయినట్టుంది’ అంటూ భావోద్వేగ సందేశాన్ని గంభీర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. (చదవండి: ఒకరిది వ్యూహం..మరొకరిది మానవత్వం..ఆ ఇద్దరి వల్లే!) ‘అరుణ్ జైట్లీ గారు మరణించారన్న వార్త విని షాకయ్యాను. ఇతరులకు సహాయం చేసే వ్యక్తిత్వం ఆయనది. నా లాంటి ఎంతో మంది ఆటగాళ్లను ప్రోత్సహించేవారు. 2006లో నా తండ్రి చనిపోయినప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను, నా కుటుంబాన్ని ఓదార్చారు. నాలో ధైర్యాన్ని నింపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’అంటూ టీమిండియా సారథి విరాట్ కోహ్లి ట్వీట్ చేశాడు. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో వీరేంద్ర సెహ్వాగ్, గంభీర్, ధావన్, కోహ్లి వంటి ఆటగాళ్లతో మంచి సాన్నిహిత్యం ఉండేది. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించే జైట్లీ వారికి సరైన అవకాశాలు ఇచ్చేందుకు పాటు పడేవారు. అంతేకాకుండా ఢిల్లీ క్రికెట్ అభివృద్దికి తగిన కృషి చేశారు. చదవండి: అపర చాణక్యుడు.. ట్రబుల్ షూటర్! అరుణ్ జైట్లీ: క్రికెట్తో ఎనలేని అనుబంధం -
అరుణ్ జైట్లీ: క్రికెట్తో ఎనలేని అనుబంధం
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(66) మరణం పట్ల యావత్ భారతావని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా జైట్లీ దేశానికి అందించిన సేవలను రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు స్మరించుకుంటున్నారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడిగా ఆయన సుదీర్ఘ కాలం(1999-2013) ఢిల్లీ క్రికెట్కు సేవలందించారు. అంతేకాకుండా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈ సమయంలోనే జైట్లీకి క్రికెట్తో ఎనలేని బంధం ఏర్పడింది. బీసీసీఐతో ఉన్న సత్ససంబంధాలతో ప్రతిభ ఉన్న ఢిల్లీ ఆటగాళ్లను టీమిండియా తరుపున ఆడించే ప్రయత్నం చేశారు. ప్రతిభావంతులైన క్రికెటర్లను ప్రొత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే వారు. ఇక ఢిల్లీ క్రికెట్ అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో తీవ్ర కృషి చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఆటగాళ్లు టీమిండియా తరుపున ఆడుతున్నారంటే అది జైట్లీ చలవే అని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఆరుణ్ జైట్లీతో తమకున్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జైట్లీ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘అరుణ్ జైట్లీ మరణం వ్యక్తిగతంగా నన్ను ఎంతో బాధించింది. ఆయనతో నాకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. ఎప్పుడు కలిసినా ప్రేమగా పలకరించేవారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే నాతో సహా ఎంతో మంది ఢిల్లీ ఆటగాళ్లు దేశానికి ఆడారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో, ఆటగాళ్ల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుండే వారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేశారు. వీరేంద్ర సెహ్వాగ్తో పాటు గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, సురేష్ రైనా, హర్ష బోగ్లే, తదితర ఆటగాళ్లు అరుణ్ జైట్లీ మరణానికి ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. చదవండి: అరుణ్ జైట్లీ అస్తమయం అరుదైన ఫోటో ట్వీట్ చేసిన కపిల్ సిబల్ -
ఆ క్రికెటర్పై జీవితకాల నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీ, ఢిల్లీ డిస్ట్రిక్స్ అసోసియేషన్(డీడీసీఏ) సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అమిత్ భండారీపై దాడికి పాల్పడిన అండర్-23 క్రికెటర్ అనూజ్ దేడాపై జీవితకాలం నిషేధం విధించారు. ఈ మేరకు ఆ క్రికెటర్ను జీవితకాలం ఏ క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు డీడీసీఏ స్పష్టం చేసింది. ‘ అమిత్ భండారీపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన యువ క్రికెటర్ అనూజ్ దేడాపై జీవితకాల నిషేధం విధిస్తున్నాం. ఇక్కడ అనూజ్ దేడాపై న్యాయపరమైన చర్యలను పక్కకు పెడితే, అతను ఇక నుంచి ఏ క్రికెట్ ఆడకుండా జీవితకాలం నిషేధం విధిస్తూ చర్యలు తీసుకున్నాం’ అని డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ తెలిపారు. భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్, డీడీసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ అమిత్ భండారిపై సోమవారం అనూజ్ బృందం గుంపుతో కలిసి దాడికి దిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ కోసం స్థానిక సెయింట్ స్టీఫెన్స్ మైదానంలో సాగుతున్న ఢిల్లీ సీనియర్ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్ను భండారి పరిశీలిస్తుండగా హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో దాడికి తెగబడింది. వీరిలో ఒకడు తుపాకీతో బెదిరించాడు. దీంతో భండారి పారిపోయేందుకు యత్నించినా వెంటాడి మరీ కొట్టడంతో తీవ్ర అలజడి రేగింది. -
ఐరన్ రాడ్లతో భారత మాజీ క్రికెటర్పై దాడి
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ, ఢిల్లీ డిస్ట్రిక్స్ అసోసియేషన్(డీడీసీఏ) సెలక్షన్ కమిటీ చీఫ్ అమిత్ భండారీపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. డీడీసీఏ అండర్-23 సెలక్షన్ జరుగుతున్న సమయంలో ఈ దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. న్యూఢిల్లీలోని స్టీఫెన్స్ గ్రౌండ్ వద్ద ఉన్న కశ్మేరా గేట్ ఏరియాలో దాడి జరిగినట్లు సహ సెలక్టర్ సుఖ్విందర్ సింగ్ తెలిపారు. అతనిపై ఐరన్ రాడ్లు, హాకీ స్టిక్లతో కొన్ని అల్లరి మూకలు దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో భండారీ తలకు, చెవికి తీవ్ర గాయాలైన భండారీని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీ అండర్-23 టీమ్ మేనేజర్ శంకర్ సైనీ కథనం ప్రకారం.. ‘టీమ్ ట్రయల్స్ని సెలక్టర్లతో కలిసి అమిత్ భండారీ పరిశీలిస్తుండగా.. నేను భోజనం కోసం అక్కడే ఏర్పాటు చేసిన టెంట్లోకి వెళ్లాను. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి భండారీతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ.. నిమిషాల వ్యవధిలోనే అనూహ్యాంగా సుమారు పదిహేను మంది హాకీ స్టిక్స్, రాడ్స్, సైకిల్ చైన్లతో వచ్చి భండారీపై దాడికి దిగారు. దీంతో.. అక్కడ ట్రయల్స్ కోసం వచ్చిన యువ క్రికెటర్లు ఆ మూకని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. అప్పటికే భండారీని తీవ్రంగా గాయపడ్డాడు’ అని సైనీ తెలిపారు. ఈ దాడి ఎవరు చేసారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
సెహ్వాగ్, గంభీర్ కొత్త ఇన్నింగ్స్
న్యూఢిల్లీ: టీమిండియా హిట్ ఓపెనింగ్ జోడీల్లో వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ జోడీ ఒకటి. ఈ ఇద్దరూ టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించారు. తాజాగా వీరిద్దరూ కలిసి సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించనునన్నారు. అయితే, ఈ సెకండ్ ఇన్నింగ్స్ మైదానం బయట కావడం విశేషం. డీడీసీఏ క్రికెట్ కమిటీలో తాజాగా ఈ ఇద్దరికీ చోటు కల్పిస్తూ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఇప్పటికే ఈ క్రికెట్ కమిటీలో మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, రాహుల్ సంఘ్వితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఢిల్లీ క్రికెట్లో కోచ్లు, సెలక్టర్ల ఎంపిక, ఇతర అంశాలను ఈ క్రికెట్ కమిటీ చూసుకుంటుంది. లోధా కమిటీ నిబంధనల ప్రకారమే ఈ క్రికెట్ కమిటీ నియామకాలు జరిపినట్లు డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ వెల్లడించారు. అయితే, గంభీర్, సెహ్వాగ్ విషయంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చింది. గంభీర్ ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నాడు. అలాంటి వ్యక్తి సెలక్టర్లను ఎలా నియమిస్తాడు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీంతో పాటు గంభీర్ ఇప్పటికే డీడీసీఏలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నాడు. ఈ క్రికెట్ కమిటీలో గంభీర్కు ఓ ముఖ్యమైన పదవి కట్టబెట్టనున్నారు. డీడీసీఏలో ప్రభుత్వ నామినీగా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
‘గంభీర్కు మళ్లీ కీలక బాధ్యతలు’
న్యూఢిల్లీ: భారత వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో మళ్లీ కీలకం కానున్నాడు. శుక్రవారం ఢిల్లీ క్రికెట్ సంఘానికి ఎన్నికలు నిర్వహించగా రజత్ శర్మ నేతృత్వంలోని ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా కార్యదర్శిగా ఎన్నికైన వినోద్ తిహారా మాట్లాడుతూ.. ఇకపై గంభీర్ డీడీసీఏలో ప్రభుత్వ నామినీగా కీలకంగా ఉంటాడని, క్రికెట్ సంబంధిత నిర్ణయాలన్నింట్లోనూ అతడి పాత్ర ఉంటుందని చెప్పాడు. ‘క్రికెట్ సంబంధిత నిర్ణయాలన్నీ గంభీరే తీసుకుంటాడు. ఢిల్లీ క్రికెట్లో గంభీర్ది పెద్ద పేరు. దాంతో డీడీసీఏలో గంభీర్ మేజర్ రోల్ పోషిస్తాడు’ అని తిహారా చెప్పారు. గతేడాది డీడీసీఏ మేనేజింగ్ కమిటీలో గంభీర్ను ప్రభుత్వ నామినీగా నియమించారు. అయితే గంభీర్ ఇంకా క్రికెట్ ఆడుతూ ఉండటంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాల్లో భాగంగా అతనికి కీలక బాధతలు అప్పచెప్పడానికి అర్హత లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పరిపాలన కమిటీ సభ్యుడు జస్టిస్ విక్రమ్జిత్ సేన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, తాజాగా మరొకసారి గంభీర్ పేరును తెరపైకి తేవడాన్ని రజత్ శర్మ ప్యానల్ సమర్ధించుకుంది. మరొకసారి గంభీర్ విషయంలో ఎటువంటి వివాదాలు చెలరేగకుండా ఉండేలా చూసుకుంటామని తిహారా తెలిపారు. ఈ మేరకు తమకు కొన్ని ప్రణాళికలున్నాయని ఆయన స్పష్టం చేశారు. క్రికెట్ విధాన నిర్ణయాల్లో గంభీర్ కీలకంగా వ్యవహరిస్తాడన్నారు. ఇందుకు క్రికెట్ అఫైర్స్ పేరుతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. -
అరుణ్ జైట్లీ క్షమిస్తారా..?
న్యూఢిల్లీ : పంజాబ్ నేత బిక్రం సింగ్తో మొదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేజ్రీవాల్పై ముప్పైకి పైగా పరువు నష్టం దావా కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా పలు బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కేజ్రీవాల్ క్షమాపణలు చెబుతూ లేఖలు రాయడంలో బిజీగా ఉన్నారు. తాజాగా ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరికి కూడా క్షమాపణలు చెప్పారు. నేడో, రేపో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కూడా కేజ్రీ లేఖ అందనుంది. కానీ ఈ విషయంపై అరుణ్ జైట్లీ ఎలా స్పందిస్తారో అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పరువు నష్టం కేసు.. 13ఏళ్ల పాటు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేసిన జైట్లీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కేజ్రీతో సహా పలువురు ఆప్ నేతలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో జైట్లీ వారిపై పరువు నష్టం దావా కేసు వేశారు. ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసిన జైట్లీ పరువు నష్టం కింద రూ. 10 కోట్లు చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ క్షమాపణలు తెలిపారు. అంత తేలిగ్గా వదలరు.. ఈ విషయాన్ని జైట్లీ అంత తేలికగా వదిలిపెట్టరని, ఆప్ కన్వీనర్ను క్షమించే అవకాశం లేదని జైట్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేజ్రీతో పాటు.. తనపై ఆరోపణలు చేసిన ఆప్ నేతలు రాఘవ్ చద్దా, విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ బాజ్పేయిలు కూడా క్షమాపణలు చెబితే జైట్లీ ఈ విషయం గురించి పునరాలోచిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
కెప్టెన్గా రిషబ్ పంత్కు ఉద్వాసన..!
న్యూఢిల్లీ:ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో నెలకొన్న అంతర్గత రాజకీయాల కారణంగా రిషబ్ పంత్ను ఢిల్లీ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించారు. అదే సమయంలో చాలాకాలంగా ఢిల్లీకి జట్టులో చోటు కోల్పోయిన లెఫ్టార్మ్ స్సిన్నర్ ప్రదీప్ సాంగ్వాన్ను రిషబ్ పంత్ స్థానంలో సారథిగా ఎంపిక చేస్తూ డీడీసీఏ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 2016లో ఢిల్లీ తరపున చివరిసారి ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడిన సాంగ్వాన్కు ఒక్కసారిగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు. ఓవరాల్గా చూస్తే 2017 ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ తరపున సాంగ్వాన్ చివరిసారి కనిపించాడు. నిషేధిత ఉత్ర్పేరకం వాడి పాజిటివ్గా తేలిన తొలి క్రికెటర్గానూ సాంగ్వాన్ నిలవడం గమనార్హం. అయితే రిషబ్ పంత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడం, ఆపై సాంగ్వాన్కు ఆ బాధ్యతలను అప్పగించడాన్ని ఢిల్లీ సెలక్టర్ల చైర్మన్ అతుల్ వాసన్ సమర్దించుకున్నాడు. 'రిషబ్ పంత్ బ్యాటింగ్లో ఇబ్బంది పడుతున్న కారణంగానే ఆ భారాన్ని తగ్గించేందుకు అతని కెప్టెన్సీకి ఉద్వాసన పలికాం. అదే సమయంలో సీనియర్ ఆటగాడైన సాంగ్వాన్ను సారథిగా ఎంపిక చేశాం. కెప్టెన్గా ఎంపిక చేయడానికి సాంగ్వాన్కు అన్ని అర్హతలున్నాయి' అని అతుల్ హసన్ తెలిపారు. మరొకవైపు సీనియర్ ఆటగాళ్లైన ఉన్కుక్త్ చంద్, మనన్ శర్మ, మిలింద్ కుమార్ల సైతం జట్టు నుంచి తప్పించారు. -
సెహ్వాగ్ ఒకే.. యువ సంచలనాన్ని ఎలా మరిచారు?
సాక్షి, స్పోర్ట్స్ : భారత్, న్యూజిలాండ్ల మధ్య ఇక్కడ జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్కు టీమిండియా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ద్వారం స్వాగతం పలకనుంది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోని రెండో గేట్కు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరూ పేరు పెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే డీడీసీఏ చేసిన పెద్ద తప్పిదంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్లో చాలా రికార్డులు సాధించాడంటూ కొన్ని ఘనతలపై ఏర్పాడు చేసిన బోర్డులో డీడీసీఏ పెద్ద తప్పిదం చేసింది. 'భారత్ తరఫున అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యామ్స్ మెన్ సెహ్వాగ్' అంటూ రాశారు. కానీ కరుణ్ నాయర్ ను డీడీసీఏ మరిచిపోవడం దుమారం రేపింది. భారత్ నుంచి టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించింది ఇద్దరు క్రికెటర్లు కాగా, తొలి ఆటగాడు సెహ్వాగ్, రెండో ఆటగాడు కరుణ్ నాయర్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అందులోనూ ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ కూడా ఐపీఎల్ లో ఢిల్లీ (ఢిల్లీ డేర్ డెవిల్స్) జట్టుకే ప్రాతినిధ్యం వహించినా అతడ్ని డీడీసీఏ ఎలా మరిచిపోతుందంటూ ప్రశ్నిస్తున్నారు. టెస్టుల్లో రెండు సార్లు సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. యువ సంచలనం కరుణ్ నాయర్ 2016లో చెన్నైలోని చిదంబరం స్డేడియంలో ఇంగ్లండ్ జట్టుతో ఆడిన టెస్టులో 303 పరుగులు చేసిన విషయాన్ని యావత్ భారత దేశ క్రికెట్ ప్రేమికులు గుర్తించుకోగా.. డీడీసీఏకు మాత్రం ఈ విషయం లెక్కలోకి రాదా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చురకలంటించారు. DDCA honours @virendersehwag , forgets @karun126’s triple hundred. On Gate No 2, “ only Indian to score 300 in Tests”. New board maybe pic.twitter.com/jrFlTLguUM — Sahil Malhotra (@Sahil_Malhotra1) 31 October 2017 -
కేజ్రీవాల్ విచారణను ఎదుర్కోవాలి
ఢిల్లీ కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) వ్యవహారానికి సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణను ఎదుర్కోనున్నారు. ఆయనతో పాటు మరో ఐదుగురు ఆప్ నేతలు అశుతోష్ కుమార్, విశ్వాస్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ బాజ్పాయ్లు కూడా విచారణను ఎదుర్కోనున్నారు. ఈ కేసును శనివారం చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సుమిత్ దాస్ విచారించారు. విచారణకు జైట్లీ హాజరుకాకపోవడంపై కోర్టులో పలువురు న్యాయవ్యాదులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో తమకు ముప్పు ఉందని నిందితులు పేర్కొనడంతో... కేసుకు సంబంధించినవారు మినహా మిగిలిన వారందరినీ బయటకు పంపేయాలని భద్రతా సిబ్బందిని జడ్జి ఆదేశించారు. అనంతరం, తాము ఏ తప్పు చేయలేదని, విచారణకు సిద్ధమని నిందితులు పేర్కొన్నారు. దీంతో ఐపీసీ సెక్షన్ 500 కింద కేజ్రీవాల్, ఇతర నిందితులకు నోటీసులు జారీ చేస్తూ జడ్జి తదుపరి విచారణను మే 20కి వాయిదా వేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో అరుణ్జైట్లీ అక్రమాలకు పాల్పడ్డారని కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. -
గంభీర్-కోచ్ల వివాదంపై కమిటీ
ఢిల్లీ: ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా ఢిల్లీ ఓపెనర్ గౌతం గంభీర్, కోచ్ క్రిష్ణన్ భాస్కరన్ పిళ్లై మధ్య చోటు చేసుకున్న వివాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీసీ) ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో రాజేందర్ ఎస్ రాథోడ్, సోనీ సింగ్లు మిగిలిన ఇద్దరు సభ్యులు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఢిల్లీ పోరాటం ముగిసిన తరువాత తనను గంభీర్ తీవ్రంగా దూషించినట్లు బాస్కరన్ అనేకసార్లు మీడియా ముందు వాపోయాడు. తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ గంభీర్ అగౌరపరిచాడని భాస్కరన్ తెలిపాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీడీసీఏ.. ఆ ఘటనపై విచారణకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ డీడీసీఏ అడ్మినిస్ట్రేటర్ జస్టిస్ విక్రమ్ జిత్ సేన్ తాజాగా ఒక సర్క్యులర్ ను జారీ చేశారు. -
అలాంటి తప్పుడు ప్రకటనలు వారికి అలవాటే
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సస్పెండ్కు గురైన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్లకు తప్పుడు ప్రకటనలు చేయడం, ఎదుటివారికి మచ్చతెచ్చేలా మాట్లాడటం ఒక అలవాటుగా మారిందని ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) హైకోర్టుకు వెల్లడించింది. ఈ కేసును విచారిస్తున్న జాయింట్ రిజిస్ట్రార్ ఏకే సిసోడియా ముందు కొన్ని పత్రాలను కూడా బుధవారం సమర్పించింది. తమ వ్యవహారాల్లో తలదూర్చి పనితీరును, ఆర్థిక వ్యవహారాలను తప్పుబడుతూ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా కేజ్రీవాల్, ఆజాద్ ప్రకటనలు చేశారని డీడీసీఏ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యలు ఖండించకపోగా తాను చేసిన ఆరోపణలు వాస్తవాలు అంటూ కేజ్రీవాల్ సమర్థించుకున్నారు. ఆజాద్ కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ నేపథ్యంలో కౌంటర్ కోరగా మీడియా ముందుకు ఎప్పుడు వెళ్లినా పక్కవారి గౌరవానికి భంగం కలిగేలా కేజ్రీవాల్, ఆజాద్ మాట్లాడతారని అది వారిద్దరికి అలవాటుగా మారిందని డీడీసీఏ బుధవారం ఆరోపించింది. -
నేనేమీ ఆయన పరువు తీయలేదు
ప్రజలు అనుకుంటున్న విషయాలే చెప్పను న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అవకతవకల కేసులో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువుకు భంగం కలిగించేలా తాను ఎలాంటి ఆరోపణలు చేయలేదని హస్తిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టుకు తెలిపారు. జైట్లీ గురించి బహిరంగంగా ప్రజలు చెప్పుకొంటున్న విషయాలనే తాను చెప్పానని, అంతేకానీ ఆయనకు వ్యతిరేకంగా తన సొంతమాటలు ఏవీ చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు. జైట్లీ తనపై, ఆప్ నాయకులపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో ఈ మేరకు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది మంగళవారం కోర్టుకు తెలియజేశారు. జైట్లీ పరువునష్టం కేసులో సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు అభియోగాలు ఖరారుచేసింది. ('లక్ష ఓట్లతో ఓడిపోయావు.. నీకేం పరువుంది?') డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నకాలంలో అక్రమాలు జరిగినట్టు వెలుగుచూడటంతో ఆ అవకతవకలతో జైట్లీకి సంబంధం ఉందంటూ కేజ్రీవాల్, ఆప్ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో జైట్లీ కేంద్ర ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో జైట్లీ కేజ్రీవాల్, ఆప్ నేతలు రాఘవ్ చద్దా, కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ వాజపేయి తదితరులపై వ్యక్తిగత హోదాలో రూ. 10 కోట్ల పరువునష్టం దావా వేశారు. -
కేజ్రీవాల్, కీర్తి ఆజాద్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : డీడీసీఏ పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎంపీ కీర్తి ఆజాద్కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నోటీసులపై సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కాగా ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు తనపై చేసిన ఆరోపణలపై ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ చట్టపరచర్యలకు దిగిన విషయం తెలిసిందే. మరోవైపు డీడీసీఏ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కేజ్రీవాల్తో పాటు, కీర్తి ఆజాద్కు నోటీసులు ఇచ్చింది. -
'ఫేస్ బుక్, ట్విట్టర్ లో నాపై ఆరోపణలు'
న్యూఢిల్లీ : ఆప్ నేతలపై పరువునష్టం కేసులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం పాటియాల హౌస్ కోర్టుకు హాజరయ్యారు. జైట్లీ స్టేట్మెంట్ను పాటియలా హౌస్ కోర్టు రికార్డు చేసింది. తనతో పాటు కుటుంబసభ్యులపై కేజ్రీవాల్తో పాటు ఆప్ నేతలు ...ట్విట్టర్, ఫేస్ బుక్ లో నిరాధార ఆరోపణలు చేశారని ఆయన తన స్టేట్మెంట్లో తెలిపారు. తన పరువుకు భంగం కలిగించారని జైట్లీ పేర్కొన్నారు. కాగా ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం వ్యవహారంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు...అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోతనతో పాటు తనకుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్తో పాటు అయిదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజపేయిలపై జైట్లీ రూ.10 కోట్లకు వ్యక్తిగత హోదాలో డిసెంబర్ 21న పరువునష్టం దావా వేశారు. ఇందుకోసం ఆయన స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఇక డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంపై అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. -
అక్కడికి లేఖరాసి ఇక్కడ ఎందుకు సోదాలు?
న్యూఢిల్లీ: ఏప్రిల్ 2013- మార్చి 2014 మధ్య కాలానికి సంబంధించిన చిట్టా పద్దుల వివరాల కోసం తాము ముందుగానే డీడీసీఏను సంప్రదించామని సీబీఐ పేర్కొటుండగా, ఈ వార్తలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. దర్యాప్తు చేయడానికి ముందుగానే ఆడిట్ లెక్కలు సమర్పించాలని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)కు లేఖ రాసినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. గత అక్టోబర్లో డీడీసీఏ అవినీతిపై ప్రాథమిక విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న డీడీసీఏకు లేఖ రాశారని సీబీఐ చెబుతన్నప్పటికీ ఆ మరుసటిరోజు వారికి లేఖ అందిందని వారే వెల్లడించారని చెప్పారు. అయితే, ఆ మరుసటి రోజే తన కార్యాలయంలో సోదాలు నిర్వహించడంపై సీఎం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్రకుమార్ పై వచ్చిన ఆరోపణలు వచ్చాయన్న వంక చూపి సీబీఐ బృందం ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొన్ని బ్లాక్స్లో తనిఖీలు నిర్వహించిందంటూ మండిపడ్డారు. సీబీఐ చేసిన తనిఖీలను కేజ్రీవాల్ తప్పుపట్టారు. డీడీసీఏకు సంబంధించిన పేపర్లు, ఇతర డాక్యుమెంట్ల కోసమే తన కార్యాలయంలో సోదాలు చేశారని ఆరోపించారు. డీడీసీఏకు లేఖ రాసినప్పుడు అక్కడ సోదాలు చేయకుండా ఇక్కడ తన కార్యాలయంలో సోదాలు ఎందకు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మరో అడుగు ముందుకేస్తూ గతంలో డీడీసీఏలో కీలక పదవులు నిర్వర్తించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. -
ఢిల్లీ సీఎంపై మరో కేసు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ క్రికెట్ సంఘాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. అరుణ్ జైట్లీ ఇప్పటికే కేజ్రీవాల్పై పరువు నష్టం దావా వేయగా, డీడీసీఏ కూడా అదేబాటలో నడవాలని నిర్ణయించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో పాటు బీజేపీ బహిష్కృత ఎంపీ కీర్తి ఆజాద్లపై పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్టు బుధవారం డీడీసీఏ ప్రకటించింది. అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డీడీసీఏలో దారుణ అక్రమాలు, అవినీతి జరిగాయని మంగళవారం కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. డీడీసీఏ అధికారులు లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను డీడీసీఏ ఖండించింది. కేజ్రీవాల్ ఎలాంటి ఆధారాలూ లేకుండా, గుడ్డిగా ఆరోపణలు చేశారని పేర్కొంది. డీడీసీఏ కుంభకోణంలో జైట్లీ పాత్ర ఉందని గతంలో కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ కేసు నుంచి జైట్లీని తప్పించడానికే తన కార్యాలయంలో సీబీఐ దాడులు చేయించారని విమర్శించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఖండించిన అరుణ్ జైట్లీ ఆయనపై పరువు నష్టం కేసు వేశారు. ఇక కీర్తి ఆజాద్.. డీడీసీఏతో పాటు జైట్లీపై విమర్శలు చేసి బీజేపీని సస్పెండ్ అయ్యారు. -
డీడీసీఏలో కామాంధులు!!
-
'ఏ విచారణకైనా మేము సిద్ధం'
న్యూఢిల్లీ:డీడీసీఏలో ఎటువంటి అవతవకలు జరగలేదని ఉపాధ్యక్షుడు చేతన్ చౌహాన్ స్పష్టం చేశారు. డీడీసీఏ చాలా స్వచ్ఛంగా ఉందని, అసలు తమ క్రికెట్ అసోసియేషన్ లో ఎటువంటి సమస్యలేవని పేర్కొన్నాడు. ఈ మేరకు మంగళవారం చేతన్ చౌహాన్ నేతృత్వంలోని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము ఏ తరహా విచారణకైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. తమను సీబీఐ ఏ సమాచారం కోరినా అందజేస్తామని చేతన్ చౌహాన్ స్పష్టం చేశారు. డీడీసీఏపై విచారణకు ఆదేశించిన వారే ఇప్పుడు భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. డీడీసీఏలో నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గతంలో డీడీసీఏ కు అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారీ ఎత్తున అవతవకలు జరిగాయనేది కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. డీడీసీఏలో 2013 వరకూ 13 సంవత్సరాల పాటు అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని కేజ్రీవాల్ తో పాటు మాజీ క్రికెటర్లు బిషన్ సింగ్ బేడీ, కీర్తి ఆజాద్ లు ఆరోపిస్తున్నారు. -
కోరిక తీరిస్తే..కొడుకును ఎంపిక చేస్తారట!
* డీడీసీఏపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫైర్ న్యూఢిల్లీ: ఇప్పటికే ఢిల్లీ, ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో అవినీతి తారాస్థాయికి చేరిందంటూ యుద్ధం ప్రకటించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డీడీసీఏలోని అధికారులు సెలక్షన్స్ కోసం వెళ్లిన వారి పట్ల అనైతికంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. క్రికెటర్ల ఎంపికలో భాగంగా కొడుకుని తీసుకుని డీడీసీఏ అధికారుల వద్దకు వెళ్లిన ఓ సీనియర్ జర్నలిస్టుకు ఎదురైన చేదు అనుభవం తాజాగా తన దృష్టికి వచ్చిందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ పేర్కొన్నారు. 'ఓ సీనియర్ జర్నలిస్టు నా వద్దకు తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా డీడీసీఏలో చోటు చేసుకున్న విషయాల్ని నాతో చర్చించాడు. కుమారుని క్రికెట్ జట్టు సెలక్షన్ కోసం వెళితే అతని భార్యను శారీరక సుఖం కోసం పంపమని ఓ డీడీసీఏ అధికారి అడిగాడట. స్వయంగా అతనే ఈ విషయాన్ని నాతో మొరపెట్టుకున్నాడు. ఆ జర్నలిస్టు పేరును బయటకు చెప్పాలనుకోవడం లేదు. డీడీసీఏలో జరుగుతున్న అవతవకలకు ఇంతకన్నా నిదర్శనమేమిటి?, ఇదొక్కటే కాదు.. ఈ తరహా ఘటనలు అక్కడ అనేకం చోటు చేసుకుంటున్నాయి. 'అని అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. డీడీసీఏలో ఆర్థిక అవకతవకలు అనేది ఒక కోణమైతే..అక్కడ సెక్స్ రాకెట్ లాంటి మరోకోణం నడుస్తుందని కేజ్రీవాల్ విమర్శించారు. ఇప్పటికైనా డీడీసీఏలో అవినీతిపై విచారణను అడ్డుకోవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. -
మోదీ వద్దకు డీడీసీఏ పంచాయితీ!
న్యూఢిల్లీ : బీజేపీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎంపీ కీర్తి ఆజాద్...ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరారు. ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఉందని కీర్తి ఆజాద్ ఆరోపణలు సంధించిన విషయం తెలిసిందే. సొంత పార్టీకి చెందిన కేంద్ర ఆర్థికమంత్రిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసి, ట్వీట్ల యుద్ధం ప్రకటించిన ఆయనపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో కీర్తి ఆజాద్...ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. '1996లో ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీని అహ్మదాబాద్లో కలిశా. అప్పట్లో ఆయన జనరల్ సెక్రటరీగా పనిచేసేవారు. ఆ సమయంలో మోదీతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నా అభ్యర్థనను ఆయన సానుకూలంగా విని న్యాయం చేస్తారని భావిస్తున్నా' అని కీర్తి అజాద్ నిన్న అహ్మదాబాద్లో పేర్కొన్నారు. మరోవైపు కీర్తి అజాద్ సస్పెన్షన్పై బీజేపీ సీనియర్ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. -
'అతడే... హీరో ఆఫ్ ది డే'
న్యూఢిల్లీ: పార్టీ నుంచి సస్పెండైన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ కు బాలీవుడ్ సీనియర్ నటుడు, పాట్నా ఎంపీ శత్రుఘ్నసిన్హా బాసటగా నిలిచారు. ఆజాద్ ను 'హీరో ఆఫ్ ది డే'గా వర్ణించారు. అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన ఆజాద్ వేటు వేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. సీనియర్ నేత అద్వానీని ఆదర్శంగా తీసుకోవాలని అరుణ్ జైట్లీకి సూచించారు. డీడీసీఏ కేసును రాజకీయంగా ఎదుర్కొవాలని సలహాయిచ్చారు. 'కీర్తి ఆజాద్- ఈ రోజు హీరోగా నిలిచాడు. అవినీతి గురించి వెల్లడించిన ఆజాద్ పై అనాలోచిత చర్యలు మానుకోవాలని పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నా. న్యూటన్ మూడో సూత్రం మర్చిపోరాదు. చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. తనపై వచ్చిన ఆరోపణలను ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ రాజకీయంగా ఎదుర్కొవాలి గానీ చట్టపరంగా కాదు. ఎల్ కే అద్వానీ లా నిష్కళంకంగా బయటపడాలని అరుణ్ జైట్లీకి సూచించాలని డాషింగ్ డైనమిక్ ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నా' అని శత్రుఘ్నసిన్హా ట్వీట్ చేశారు. -
నన్ను సస్పెండ్ చేయడం పార్టీకే దురదృష్టం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీపై ఆరోపణలు చేసినందుకు బీజేపీ తనను సస్పెండ్ చేయడంపై ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ స్పందించారు. తానేం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశానని తనను సస్పెండ్ చేశారని బీజేపీ అధినాయకత్వాన్ని ఆయన ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేయడం పార్టీకే దురదృష్టం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తాను తొమ్మిదేళ్లుగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నానని, గతంలోనే పార్టీ పెద్దలు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో పార్టీదే బాధ్యత అని, తనదేం తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. తొమ్మిదేళ్లుగా తాను ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నాని, తాను ఎవరి గురించి వ్యక్తిగతంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెప్పారు. నిజాలు మాట్లాడేవారిని బీజేపీ నుంచి గెంటేస్తున్నారని, మున్ముందు ఇంకా ఏం జరుగనుందో వేచి చూడాలని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ క్రికెట్ బోర్డు అవినీతి వ్యవహారంలో అరుణ్జైట్లీపై కీర్తి ఆజాద్ బాహాటంగా ఆరోపణలు చేశారు. దీనిపై కన్నెర్ర జేసిన బీజేపీ ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. -
'జైట్లీకి సిగ్గులేదు'
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీపై సీనియర్ న్యాయవాది రామ్జెఠ్మలానీ తీవ్రంగా దుమ్మెత్తిపోశారు. జైట్లీ ఓ సిగ్గులేని వ్యక్తి అంటూ విరుచుకుపడ్డారు. అలాగే జైట్లీని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీతో పోల్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆయన దుయ్యబట్టారు. 'నరేంద్రమోదీ తానే అంతా అనుకొని జైట్లీని అద్వానీతో పోలుస్తున్నారు. జైట్లీ ఓ సిగ్గులేని మనిషి. అతనిపై వందలాది ఆరోపణలు ఉన్నాయి' అని రామ్జెఠ్మలానీ విమర్శించారు. ఢిల్లీ క్రికెట్ బోర్డు అక్రమాల వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్పై జైట్లీ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరువు నష్టం దావా కేసులో కేజ్రీవాల్ తరఫున వాదిస్తున్న రామ్జెఠ్మలానీ జైట్లీ తీరును తప్పుబట్టారు. హవాలా కుంభకోణం కేసులో అద్వానీ తరఫున తాను వాదించడం వల్లే ఆయన విజయం సాధించారని, ప్రస్తుతం తాను కేజ్రీవాల్ దన్నుగా పరువునష్టం కేసులో జైట్లీని ప్రాసిక్యూట్ చేయబోతున్నానని, పరిస్థితి ఎలా ఉంటుందో మీరు గుర్తించవచ్చునని ఆయన చెప్పారు. అందరూ తప్పు చేస్తారని, కానీ తనకు జైట్లీ అంటే ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు. -
'జైట్లీ చాలా పెద్ద తప్పుచేశారు'
న్యూఢిల్లీ: ఒకప్పటి బీజేపీ నేత, ప్రముఖ సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అండగా నిలిచారు. కేజ్రీవాల్ పై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేసి అతిపెద్ద తప్పు చేశారని అన్నారు. కేజ్రీవాల్ కు మాత్రమే కాదు ఇతర నేతలపై కూడా ఆ దావా వేయడం సరికాదని అన్నారు. ఈవిషయంలో తాను జోక్యం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. మొత్తం రూ.పది కోట్లు తనకు చెల్లించాలని కోరుతూ అరుణ్ జైట్లీ ఢిల్లీ సీఎం ఆయన నేతలపై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. దీనిపై రాం జెఠ్మలానీని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూ చేయగా ఆయన ఈ అభిప్రాయాలు తెలిపారు. 'ఇది నేను వ్యక్తిగతంగా తీసుకొని వ్యాఖ్యానించడం లేదు. జైట్లీ మాత్రం కేజ్రీవాల్ విషయంలో చెడ్డపనిచేశారు. ఈ సందర్భంగా నేను కేజ్రీవాల్ కు సానుభూతి వ్యక్తం చేస్తున్నాను' అని జెఠ్మలానీ అన్నారు. -
కోర్టుకు చేరిన డీడీసీఏ రగడ
ఆప్ నేతలపై సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేసిన జైట్లీ కేజ్రీవాల్ సహా ఐదుగురు నేతలపై రూ.10 కోట్లకు కేసు ♦ కేసులకు భయపడేది లేదన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలపై ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ చట్టపరచర్యలకు దిగారు. కేజ్రీవాల్తో పాటు ఆప్ నేతలు కుమార్ బిశ్వాస్, అశుతోష్, సంజయ్సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజ్పేయిపై రూ. పది కోట్లకు పాటియాలా హౌస్ కోర్టులో సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలను వేశారు. వారం క్రితం కేజ్రీవాల్ ఆఫీసులో ఆయన ముఖ్య కార్యదర్శిపై సీబీఐ దాడులు చేయడంతో వివాదం చెలరేగింది. డీడీసీఏకి జైట్లీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, దీనికి సంబంధించిన ఫైలు కోసమే సీబీఐ సీఎంవోలో సోదాలు జరిపిందని ఆప్ నేతలు ఆరోపించడం తెలిసిందే. వారు తనపై అబద్ధపు, అపఖ్యాతిని కలిగించే ప్రచారం చేశారని, దీని వల్ల తనకు తిరిగి పూడ్చలేని నష్టం కలిగిందని జైట్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులతో పాటియాలా కోర్టుకు వచ్చిన జైట్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సంజయ్ ఖనాగ్వాల్ వద్ద క్రిమినల్ దావా వేశారు. ఐపీసీ 499(పరువు నష్టం), 500(శిక్షార్హమైన నేరం), 501, 502(పరువుకు నష్టం కలిగించే వార్తల ముద్రణ, అమ్మకం) తదితరాల కింద ఫిర్యాదు చేశారు. నిందితులపై ఆరోపణలు రుజువైతే రెండేళ్ల జైలు శిక్ష కూడా పడొచ్చు. జైట్లీ వెంట కేంద్ర మంత్రులు వెంకయ్య, ఇరానీ తదితరులున్నారు. జైట్లీ న్యాయవాది లూద్రా వాదనలు వినిపిస్తూ.. వెంటనే జైట్లీ వాంగ్మూలాన్ని నమోదు చేయాలన్నారు. అయితే ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా చెప్పిన కోర్టు కేసు విచారణను జనవరి 5కు వాయిదా వేసింది. అప్పుడు వాంగ్మూలాన్ని నమోదు చేస్తామంది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీ సహా ఆప్ నేతలపై జైట్లీ సివిల్ పరువు నష్టం దావా వేశారు. తనపై, తన కుటుంబ సభ్యులపై ఆప్ నేతలు పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేశారని ఆరోపించారు. సివిల్ కేసులో పరువుకు నష్టం కలిగించినందుకు రూ. 10 కోట్లు చెల్లించాలని కోర్టును కోరామని జైట్లీ లాయరు మోనికా డోగ్రా చెప్పారు. అవినీతిపై పోరు కొనసాగుతుంది: కేజ్రీ తనపైనా, తన పార్టీ నేతలపైనా సివిల్, క్రిమినల్ పరువు నష్టం కేసులు దాఖలు చేసినంత మాత్రాన భయపడబోమని, అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని కేజ్రీ స్పష్టం చేశారు. డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ముందు హాజరై జైట్లీ తన నిజాయతీని నిరూపించుకోవాలన్నారు. డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఢిల్లీ సర్కారు మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్కు ఢిల్లీ కేబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. డీడీసీఏ అంశంపై మంగళవారం ప్రత్యేకంగా అసెంబ్లీ భేటీ నిర్వహించాలనీ నిర్ణయించింది. కాగా, డీడీసీఏ అంశాన్ని లేవనెత్తిన వాళ్లలో తానూ ఉన్నానని, జైట్లీ తనపైన దావా ఎందుకు వేయలేదని బీజేపీ ఎంపీ కీర్తీ ఆజాద్ అన్నారు. కేజ్రీవాల్ తరఫున న్యాయవాది రాం జెఠ్మలానీ వాదించనున్నారు. -
'డియర్ జైట్లీ.. దమ్ముంటే నాపై దావా వేయ్'
న్యూఢిల్లీ: డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అక్రమాల వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీపై బీజేపీ ఎంపీ మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మరోసారి విరుచుకుపడ్డారు. సొంత పార్టీకి చెందిన అగ్రనేత అయిన జైట్లీకి ఆయన బహిరంగ సవాల్ విసిరారు. జైట్లీ తనపై కూడా పరువునష్టం దావా వేయాలని పేర్కొన్నారు. 13 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా వ్యవహరించిన జైట్లీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ ప్రభుత్వం మీద అరుణ్జైట్లీ పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే జైట్లీపై పరోక్ష విమర్శలు చేసిన కీర్తి ఆజాద్.. తాజాగా ఆయనపై బహిరంగంగా ట్వీట్ల యుద్ధానికి తెరలేపారు. 'హాల్లో డియర్ అరుణ్జైట్లీ.. నాపై కూడా పరువునష్టం దావా వేస్తున్నావు కదా? ప్లీజ్ నా మీద కూడా వేయ్. మినహాయింపు ఏమీ వద్దు. భావప్రకటనా స్వేచ్ఛను హరించకు' అని ట్వీట్ చేశారు. 'నా పేరు ఎందుకు కేసులో చేర్చలేదు. మీరే కదా నేను రిజిస్టర్ పోస్టులో పంపించిన లేఖలు చూపించింది. నాపై కూడా కేసు పెట్టండి' అని పేర్కొన్నారు. జైట్లీపై తన ట్లీట్ల గురించి ప్రస్తావించగా.. 'కృష్ణుడు బాలుడిగా ఉన్నప్పుడే కాళియ సర్పంతో పోరాడాడు. ఇప్పుడు ఈ వ్యవహారంలో కృష్ణుడు ఎవరో, కాళియుడు ఎవరో మీరు వ్యాఖ్యానించాలి' అని కీర్తి ఆజాద్ పేర్కొన్నారు. -
'కేసుకు భయపడేది లేదు.. పోరాటం సాగిస్తాం'
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. అరుణ్ జైట్లీ కోర్టు కేసుకు తాము భయపడబోమని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన విచారణ సంఘానికి సహకరించి జైట్లీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు పలువురు ఆప్ నేతలపై అరుణ్ జైట్లీ వ్యక్తిగత హోదాలో సోమవారం రూ.10 కోట్లకు ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు. డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర సర్కారు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. డీడీసీఏ కుంభకోణం కేసులో జైట్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్, అరుణ్ జైట్లీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
జైట్లీ రాజీనామాకు విపక్షాల పట్టు
న్యూఢిల్లీ: డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్)లో అక్రమాల వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేసింది. సోమవారం ఉదయం లోక్ సభ ప్రారంభమైన వెంటనే.. కుంభకోణంలో పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలంటూ విపక్షాలునినదించారు. డీడీసీఏపై చర్చించేవీలులేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పడంతో విపక్ష ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలకు ఆటంకం ఏర్పడటంతో స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే అంశంపై దుమారం చెలరేగింది. సభ ప్రారంభానికి ముందే విపక్ష కాంగ్రెస్ డీడీసీఏపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. చైర్మన్ తీర్మానాన్ని అంగీకరించకపోవడంతో అరుణ్ జైట్లీ రాజీనామా చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చారు. దీంతో సభ 30 నిమిషాలు వాయిదాపడింది. వరుస వాయిదాల అనంతరం 12:30కు లోక్ సభ తిరిగి ప్రారంభమైంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తనపై వచ్చిన ఆరోపణలపై వివరాణ ఇచ్చేందుకు ఉద్యుక్తులుకాగా, విపక్ష ఎంపీలు ఆయనకు అడ్డుతగిలారు. ఒక సందర్భంలో ఆగ్రహానికి లోనైన జైట్లీ 'కూర్చొని వినండి' అంటూ గట్టిగా అరిచారు. దీనికి ప్రతిగా విపక్ష ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. కుంభకోణంలో తన పాత్ర ఏమీలేదని జైట్లీ వివరణ ఇచ్చారు. ఏమిటీ కుంభకోణం? ప్రస్తుత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షునిగా ఉన్న 13ఏండ్ల కాలంలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. జైట్లీ హయాంలో డీడీసీఏ ఎన్నో అక్రమాలకు పాల్పడిందనీ, అతణ్ని మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర అధికార పార్టీ ఆప్ కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం నేతృత్వంలో విచారణ కమిషన్ను కూడా నియమించింది ఢిల్లీ ప్రభుత్వం. 2008-12 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రూ. 24.45 కోట్ల వినోదపు పన్నును డీడీసీఏ ఎగ్గొట్టిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. మొన్నటి భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ సందర్భంలోనూ ఈ విషయం వివాదాస్పదం కావటం, డీడీసీఏ కోర్టుకెళ్లడం, ప్రభుత్వానికి తాత్కాలికంగా రూ. కోటి చెల్లించాలని కోర్టు ఆదేశించడం తెలిసిందే. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో నిర్మించిన కార్పొరేట్ బాక్సుల విషయంలో అక్రమాలు జరిగాయని బీజేపీకే చెందిన ఎంపీ కీర్తి ఆజాద్ వెల్లడించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కార్యదర్శి రాజేంద్రకుమార్ కార్యాలయంపై సీబీఐ నిర్వహించిన సోదాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ సోదాలు అరుణ్ జైట్లీని కాపాడే ఉద్దేశంతో డీడీసీఏ ఫైళ్ల కోసమే సీబీఐ హడావుడి చేసిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ సందర్భంగా ఆరోపించారు. -
రూ.10కోట్లకు పరువునష్టం దావా వేసిన జైట్లీ
న్యూఢిల్లీ : డీడీసీఏ రగడ చివరకు కోర్టు మెట్లు ఎక్కింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు పలువురు ఆప్ నేతలపై అరుణ్ జైట్లీ సోమవారం ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. తనతో పాటు తనకుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్తో పాటు అయిదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజపేయిలపై జైట్లీ రూ.10 కోట్లకు వ్యక్తిగత హోదాలో పరువునష్టం దావా దాఖలు చేశారు. డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంపై అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. అలాగే ఇదే అంశంపై ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పాటియాల కోర్టులో అరుణ్ జైట్లీ క్రిమినల్ కేసు దాఖలు చేయనున్నారు. మరోవైపు డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర సర్కారు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. -
డీడీసీఏపై విచారణకు ఆదేశం
ఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. గతంలో డీడీసీఏ కు అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారీ ఎత్తున అవతవకలు జరిగాయనేది కేజ్రీవాల్ ప్రధాన ఆరోపణ. డీడీసీఏలో 2013 వరకూ 13 సంవత్సరాల పాటు అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన అవినీతికి పాల్పడటంతో పాటు అందుకు ఢిల్లీ క్రికెట్ బాడీలోని సభ్యులు సహకరించారని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. విచారణ కమిషన్ కు రాజ్యాంగ నిపుణుడు గోపాల్ సుబ్రహ్మణ్యం నేతృత్వం వహించనున్నారు. కమిషన్ కు నేతృత్వం వహించాలని తాను కోరగా, గోపాల్ సుబ్రహ్మణ్యం అంగీకరించారని కేజ్రీవాల్ ట్విటర్ ద్వారా తెలిపారు. కాగా, అంతకుముందు కూడా డీడీసీఏలో అవినీతి అంశానికి సంబంధించి కేజ్రీవాల్ ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ను విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. 2008-12 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రూ.24.45 కోట్ల వినోదపు పన్నును డీడీసీఏ ఎగ్గొట్టిందని కేజ్రీవాల్ ఆరోపిస్తూ దర్యాప్తుకు ఆదేశించారు. అది దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య సిరీస్ జరుగుతున్న సమయం కావడంతో అప్పట్లో ఢిల్లీ టెస్టుపై నీలి మేఘాలు అలుముకున్నాయి. అయితే మ్యాచ్ నిర్వహణపై హామీగా కోటి రూపాయిలను ప్రభుత్వానికి చెల్లించాలని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేయడంతో డీడీసీఏకు ఊరట లభించింది. దీంతో ఆ టెస్టు మ్యాచ్ ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగిపోయింది. -
'అక్రమాలు నిజమే... జైట్లీకి సంబంధం లేదు'
న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)పై వచ్చిన నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మాజీ క్రికెటర్, బీజేపీ కీర్తి ఆజాద్ స్పందించారు. ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... డీడీసీఏ పలు మోసపూరిత కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చిందని, ఎటువంటి సంప్రదింపులు లేకుండానే డబ్బులు చెల్లించిందని ఆరోపించారు. డీడీసీఏ సభ్యులు టెండర్లలో అక్రమాలు చేశారని చెప్పారు. ల్యాప్ టాప్, ప్రింటర్లు తదితర వస్తుసామాగ్రిని అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేశారని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని అన్నారు. డీడీసీఏ ఆర్థిక అవకతవకలపై వికీలీక్స్ తయారుచేసిన వీడియోను ఆయనీ సందర్భంగా ప్రదర్శించారు. తాను ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద అభిమానినని... అవినీతిపైనే తాము పోరాటం చేస్తున్నామని, వ్యక్తులపై కాదని కీర్తి ఆజాద్ స్పష్టం చేశారు. అక్రమాలకు సంబంధించిన వీడియో బయటపెట్టడంతో నిధుల దుర్వినియోగం జరిగినట్టు డీడీసీఏ ఒప్పుకుంది. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. -
సెహ్వాగ్ కు బీసీసీఐ సన్మానం
న్యూఢిల్లీ: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను బీసీసీఐ ఈ ఉదయం సన్మానించింది. సెహ్వాగ్ కు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ జ్ఞాపిక బహూకరించి సత్కరించారు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు ఈ కార్యక్రమం నిర్వహించారు. సొంత గడ్డపై బీసీసీఐ సన్మానం అందుకోవడం పట్ల సెహ్వాగ్ సంతోషం వ్యక్తం చేశాడు. సెహ్వాగ్ ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సెహ్వాగ్ సన్మానం గురించి బీసీసీఐ ఆలస్యంగా వర్తమానం పంపడంతో ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. 'వీరూ సన్మానం గురించి బీసీసీఐ నుంచి మెయిల్ వచ్చింది. అధ్యక్షుడు, లేదా కార్యదర్శి ఎవరూ సన్మానిస్తారో మాకు తెలియదు. డీడీసీఏ మాత్రం ఇందులో భాగం పంచుకోదు. ఎందుకంటే బోర్డు మాకు చాలా తక్కువ సమయం ఇచ్చింది. మేం సిద్ధం కావడానికి ఇది సరిపోదు. ఢిల్లీకి ఎనలేని సేవలందించిన సెహ్వాగ్ను మరోసారి ఘనంగా సత్కరిస్తాం' అని డీడీసీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ చేతన్ చౌహన్ వెల్లడించారు. -
సెహ్వాగ్కు బీసీసీఐ సన్మానం
న్యూఢిల్లీ: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను నాలుగో టెస్టుకు ముందు బీసీసీఐ సన్మానించనుంది. ఈ మేరకు బోర్డు అధికారికంగా ఢిల్లీ క్రికెట్ సంఘానికి (డీడీసీఏ)కు ఈ మెయిల్ పంపింది గురువారం ఉదయం 9 గంటలకు ఈ సన్మానం జరగనుంది. అయితే ఆశ్చర్యకరంగా డీడీసీఏ ఈ కార్యమ్రానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ‘వీరూ సన్మానం గురించి బీసీసీఐ నుంచి మెయిల్ వచ్చింది. అధ్యక్షుడు, లేదా కార్యదర్శి ఎవరూ సన్మానిస్తారో మాకు తెలియదు. డీడీసీఏ మాత్రం ఇందులో భాగం పంచుకోదు. ఎందుకంటే బోర్డు మాకు చాలా తక్కువ సమయం ఇచ్చింది. మేం సిద్ధం కావడానికి ఇది సరిపోదు. ఢిల్లీకి ఎనలేని సేవలందించిన సెహ్వాగ్ను మరోసారి ఘనంగా సత్కరిస్తాం’ అని డీడీసీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ చేతన్ చౌహన్ వెల్లడించారు. -
నాల్గో టెస్టు ఢిల్లీలోనే!
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా-టీమిండియాల టెస్టు సిరీస్ లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో వచ్చే నెలల జరుగనున్న చివరిదైన నాల్గో టెస్టుపై నెలకొన్నసందిగ్ధతకు దాదాపు తెరపడింది. మ్యాచ్ నిర్వహణకు సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ)ను ఆపొద్దంటూ ఢిల్లీ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అయితే మ్యాచ్ నిర్వహణపై హామీగా కోటి రూపాయిలను ప్రభుత్వానికి చెల్లించాలిన హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఆ నగదు మొత్తంలో సగ భాగాన్ని అంటే రూ.50 లక్షలను రెండు వారాల లోపు డీడీసీఏ చెల్లించాలని తన తీర్పులో పేర్కొంది. ఆ మొత్తాన్ని చెల్లించడానికి డీడీసీఏ అంగీకారం తెలపడంతో తమ తదుపరి తీర్పు(నవంబర్ 27) వరకూ డీడీసీఏపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ బాదర్ దుర్రేజ్ అహ్మద్, సంజీవ్ సచ్చదేవ్ లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. దీంతో వచ్చే నెల మూడు నుంచి ఏడు వరకూ ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో నాల్గో టెస్టు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తమ ప్రభుత్వానికి వినోదపు పన్ను రూపంలో రావాల్సిన రూ.24.45 కోట్లు చెల్లించాలని డీడీసీఏను అరవింద్ కేజ్రీవాల్ సర్కారు ఆదేశించిన సంగతి తెలిసిందే. 2008-12 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి వినోదపు పన్నును డీడీసీఏ చెల్లించకుండా అవినీతికి పాల్పడిందంటూ ఇద్దరు సభ్యులతో కూడిన ప్యానెల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేసిన డీడీసీఏ హైకోర్టును ఆశ్రయించింది. -
'డీడీసీఏపై వేటు వేయండి'
న్యూఢిల్లీ: ఢిల్లీ, జిల్లాల క్రికెట్ సంఘంలో (డీడీసీఏ)లో అవకతవకలు చోటు చేసుకున్నాయని, బీసీసీఐ.. డీడీసీఏను సస్పెండ్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. బీసీసీఐ శాశ్వత పరిష్కారం కొనుగొనేంత వరకు ఢిల్లీ క్రికెట్ వ్యవహారాలను చూసుకునేందుకు క్రికెటర్లతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. 2008-12 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి డీడీసీఏ వినోదపు పన్ను చెల్లించని కారణంగా దానిపై దర్యాప్తుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. వినోదపు పన్ను రూపంలో ప్రభుత్వానికి రూ.24.45 కోట్లు చెల్లించాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. డీడీసీఏ పెద్దలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. డీడీసీఏ వ్యవహారంపై విచారణకు ఢిల్లీ ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇదిలావుండగా, వచ్చే నెల 3 నుంచి జరగాల్సిన భారత్-దక్షిణాఫ్రికాల నాలుగో టెస్టుకు ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే టెస్టు మ్యాచ్ నిర్వహణకు కావాల్సిన అనుమతులను ఈ నెల 17 లోగా ఢిల్లీ ప్రభుత్వం నుంచి తీసుకోవాలని, లేదంటే మ్యాచ్ వేదికను పుణెకు తరలిస్తామని బీసీసీఐ.. డీడీసీఏకు గడువు విధించింది. గడువు ఈ రోజుతో ముగయనుండటంతో బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
ఢిల్లీ టెస్టుపై నీలి నీడలు!
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా-టీమిండియాల టెస్టు సిరీస్ లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో వచ్చే నెలల జరుగనున్న చివరిదైన నాల్గో టెస్టుపై నీలి నీడలు అలుముకున్నాయి. ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ)లో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు సభ్యుల ప్యానెల్ ను తాజాగా ఏర్పాటు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. 2008-12 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి డీడీసీఏ వినోదపు పన్ను చెల్లించని కారణంగా దానిపై దర్యాప్తుకు కేజ్రీవాల్ ఆదేశించారు. గత అక్టోబర్ లో వినోదపు పన్ను రూపంలో ప్రభుత్వానికి రూ.24.45 కోట్లు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని.. ఆ సమయంలో పన్ను మినహాయింపు రూపంలో వచ్చిన డబ్బును ఎలా చెల్లిసామని డీడీసీఏ వైస్ ప్రెసిడెంట్ చేతన్ చౌహాన్ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించడంతో నాల్గో టెస్టు జరుగుతుందా?లేదా?అనేది సందేహాస్పదంగా మారింది. ఇదిలా ఉండగా డీడీసీఏపై మరో భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. డీడీసీఏలో అవినీతి ఆరోపణలపై కేజ్రీవాల్ కల్పించుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయమన్నారు. ప్రస్తుత సమయంలో ఢిల్లీలో టెస్టు మ్యాచ్ జరిపేందుకు డీడీసీఏ ఆరోగ్యకరంగా లేదంటూ సెటైర్లు గుప్పించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్టలో చివరి టెస్టు జరిగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ అక్కడ టెస్టు మ్యాచ్ జరగని పక్షంలో ఆమ్యాచ్ ను తాజాగా టెస్టు హోదా పొందిన పుణేలో నిర్వహించే అవకాశం ఉంది. -
అజహర్తో ఎందుకు మాట్లాడారు?
డీడీసీఏకు బీసీసీఐ లేఖ న్యూఢిల్లీ: బీసీసీఐ నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్తో విదర్భ రంజీ ఆటగాళ్లు సంభాషించడం వివాదాస్పదమైంది. 2000లో వెలుగు చూసిన మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా అజ్జూపై బీసీసీఐ వేటు వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఉపాధ్యక్షుడు చేతన్ చౌహాన్ ఆహ్వానం మేరకు అజహర్ మైదానానికి వచ్చారు. అయితే విదర్భకు ఆడుతున్న వెటరన్ క్రికెటర్లు వసీం జాఫర్, ఎస్.బద్రీనాథ్, చీఫ్ కోచ్ పారస్ మాంబ్రే.. అజహర్తో మాట్లాడుతూ కనిపించారు. అవినీతి వ్యతిరేక యూనిట్ నిబంధనల ప్రకారం నిషేధిత ఆటగాళ్లతో ప్రస్తుత క్రికెటర్లు ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు. ‘బీసీసీఐ నుంచి మాకు లేఖ అందిన విషయం వాస్తవమే. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల అధికారిక స్థలం (పీఎంఓఏ)లో అజహర్తో వారు ఎలా మా ట్లాడారని ప్రశ్నించారు. అయితే అజహర్ పీఎంఓఏ దగ్గర లేరు. ఈవిషయంలో కాస్త గందరగోళం నెల కొంది. ఏది ఏమైనా అజ్జూతో ఆటగాళ్లు మాట్లాడకూడదని చెప్పారు కాబట్టి ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాం’ అని చౌహాన్ తెలిపారు.