Exam centers
-
ఇంటర్ పరీక్షలపై కెమెరాల వార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షల కోలాహలం ప్రారంభమైంది. గురువారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలను కొన్ని ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఇప్పటికే 417 కాలేజీల్లో అద్దెకు సీసీ కెమెరాలు తెప్పించారు. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇప్పటికే కెమెరాలున్నాయి. దీంతో స్వల్ప సంఖ్యలో కాలేజీలు సీసీ కెమెరాల ఏర్పాటును వ్యతిరేకిస్తే.. వాటికి పరీక్ష కేంద్రాలు ఇవ్వబోమని బోర్డు అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే అగ్నిమాపక శాఖ అనుమతి లేని బహుళ అంతస్తుల భవనాల్లోని కాలేజీలకు ఇంటర్ బోర్డు చివరి నిమిషం వరకు అనుమతివ్వలేదు. ఆఖరులో పెద్ద మొత్తంలో జరిమానా విధించి అనుమతిచ్చిది. ఆ కాలేజీల్లో చదివే విద్యార్థుల అడ్మిషన్లకు రూ.2,500, పరీక్ష ఫీజు రూ.500 వసూలు చేసింది. దీంతో ఇంటర్ బోర్డు అధికారులు వేధిస్తున్నారని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సీఎంకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ప్రైవేటు కాలేజీలు ఎంతవరకు సహకరిస్తాయనేది అనుమానంగా మారింది. కొన్ని కాలేజీలపై నిఘా: పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రభుత్వం ఇంటర్ బోర్డును ఆదేశించింది. పరీక్షలపై నిఘా పెట్టాలని పోలీసులకు సూచించింది. దీంతో కొన్ని ప్రైవేటు కాలేజీలపై ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి పెట్టాయి. ప్రశ్న పత్రాల బట్వాడా నుంచి, సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాలకు చేరవేసే దాకా వీడియో రికార్డింగ్ ఉండాలని ఇంటర్ బోర్డు జిల్లా అధికారులను ఆదేశించింది. ఇంటర్ పరీక్షల నియంత్రణ అధికారి జయప్రదబాయి గురువారం కొన్ని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. మొదలైన ప్రాక్టికల్స్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. గురువారం ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 3 నుంచి సెకండియర్ సైన్స్, మ్యాథమెటిక్స్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. థియరీ పరీక్షలు మార్చి 5 నుంచి మొదలవుతాయి. మొదటి సంవత్సరంలో 4,88,316మంది, రెండో సంవత్సరంలో 5,08,225 మంది కలిపి మొత్తం 9,96,541 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. థియరీ పరీక్షల హాల్ టిక్కెట్లు రెండు రోజుల్లో అందుబాటులో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. ప్రాక్టికల్స్ కోసం 2,008, థియరీ కోసం 1,532 కేంద్రాలను ఏర్పాటుచేశారు.మాపై నియంత్రణ దేనికి? పరీక్షలకు మేం సహకరిస్తామనే చెబుతున్నాం. కానీ ఇంటర్ బోర్డు అధికారులు ప్రైవేటు కాలేజీలపై కక్ష గట్టినట్టు వ్యవహరిస్తున్నారు. సమస్య సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. సీసీ కెమెరాలు పెట్టాలనే ఆదేశం సరైంది కాదు. – గౌరీ సతీష్, ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. అన్ని చర్యలు తీసుకున్నాం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. పరీక్షల విధానాన్ని మొత్తం రికార్డు చేస్తున్నాం. ప్రైవేటు కాలేజీలు కూడా సహకరించాలి. – జయప్రదబాయి, ఇంటర్ పరీక్ష విభాగం ముఖ్య అధికారి. -
జేఈఈ మెయిన్స్కు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్–1 పరీక్ష ఈ నెల 24 నుంచి ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 1వ తేదీ వరకూ ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. జేఈఈ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించింది. మొదటి మూడు రోజులు ఆర్కిటెక్చర్ (పేపర్–1) ఉంటుంది. ఈ పరీక్ష రాసే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు ఇప్పటికే ఆన్లైన్లో ఉంచినట్టు ఎన్టీఏ తెలిపింది. జేఈఈ ఇంజనీరింగ్ విభాగానికి ఈ నెల 27 నుంచి పరీక్ష ఉంటుంది. ఈ విద్యార్థుల అడ్మిట్ కార్డులు 25 లోగా ఆన్లైన్లో ఉంచే అవకాశముంది. రెండు విభాగాలకు కలిపి దేశవ్యాప్తంగా ఈ ఏడాది 12 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది పరీక్ష రాస్తారని సమాచారం. జేఈఈ మెయిన్స్కు అన్ని ఏర్పాట్లు చేశామని, భద్రత కల్పిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. మొదటి షిప్టు ఉదయం 9 నుంచి, రెండో షిప్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉంటుంది. ప్రతీ సెషన్ మూడు గంటల వ్యవధితో ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని ఎన్టీఏ ప్రకటించింది. ఈసారి భద్రత వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఫేషి యల్ రికగ్నిషన్ సిస్టమ్ను అమలు చేస్తున్నారు. 11 కేంద్రాల్లో మెయిన్స్ తెలంగాణలో 11 కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వ హించనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. హైదరాబా ద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబా ద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్తోపాటు ఏపీలోని 30 కేంద్రాల్లో పరీక్షలు ఉన్నట్టు అధికారులు వివరించారు. పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్ సహా మొత్తం 10 భాషల్లో నిర్వహిస్తారు. రెండో దశ పరీక్షలు ఏప్రిల్ లో చేపడతారు. ఈసారి పరీక్ష కోసం సిలబస్ తగ్గించారు. కోవిడ్ సమయంలో కేంద్ర విద్యా సంస్థల్లో టెన్త్ రాసినవారు ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ కు హాజరవుతున్నారు. ఆ సమయంలో వీళ్లకు సిలబస్ కుదించారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని 25% సిలబస్ను మెయిన్స్ నుంచి తొలగించారు. గణితంలో సుదీర్ఘ ప్రశ్నలను తొలగించారు. ఈ కారణంగా మెయిన్స్ రాసే వారి సంఖ్య పెరగుతోంది. నెగెటివ్ మార్కులతో జాగ్రత్త జేఈఈ మెయిన్స్లో నెగెటివ్ మార్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నా రు. సమాధానం కచ్చితంగా రాస్తే 4 మార్కులు ఉంటాయి. తప్పుగా టిక్ పెడితే మైనస్–1 అవుతుంది. కాబట్టి తెలియని ప్రశ్నలకు ఊహించి రాసేకన్నా, వదిలేయడమే మంచిదని గణిత శాస్త్ర నిపుణులు ఎంఎన్ రావు తెలిపారు. కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నల కోసం ముందే సమయం వృథా చేయకూడదని, వాటి గురించి ఆఖరులో ఆలోచించాలని ఆయన సూచించారు. అనవసర ప్రశ్నలకు తలబాదుకుంటూ కూర్చుంటే ఆ ప్రభావం తెలిసిన ప్రశ్నలపై పడే అవకాశం ఉంటుందని భౌతిక శాస్త్ర నిపుణుడు విక్రమ్ సింగ్ చెప్పారు. ముందుగానే జేఈఈ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన పత్రాలన్నీ (సెల్ఫ్ డిక్లరేషన్, అండర్ టేకింగ్ ఫాం) దగ్గర ఉంచుకోవాలని ఎన్టీఏ సూచించింది. వాటర్ బాటిల్స్, హ్యాండ్ శానిటైజర్లు, మాసు్కలు, బాల్ పాయింట్ పెన్నులను అనుమతిస్తామని తెలిపింది. -
AP: ఎస్ఐ ఫైనల్ ఎగ్జామ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?
సాక్షి, అమరావతి: ఏపీలో ఎస్ఐ పోస్టులకు ఫైనల్ రాత పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 14, 15 తేదీల్లో ఎస్ఐ ఫైనల్ రాత పరీక్షను నిర్వహించనున్నట్టు అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇక, ఏపీలో సివిల్, ఏపీఎస్పీ ఎస్ఐ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇది కూడా చదవండి: తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి ఏడుగంటల సమయం -
వాయిదా వేస్తే ఇప్పట్లో కష్టమే!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 పరీక్షల తేదీల మార్పు కష్టంగానే కనిపిస్తోంది. ఈనెల 29, 30వ తేదీల్లో గ్రూప్–2 పరీక్షల నిర్వహణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. దాదాపు ఐదు నెలల క్రితమే పరీక్ష తేదీని ప్రకటించింది. అయితే వరుసగా పరీక్షలు ఉన్నాయని, కాబట్టి సన్నద్ధతకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఆందోళన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. గురువారం టీఎస్పీఎస్సీ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. శుక్రవారం కూడా పలుచోట్ల ధర్నాలు నిర్వహించారు. పలు ప్రతిపక్ష పార్టీలు వీరికి మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సర్విస్ కమిషన్ తర్జనభర్జన పడుతోంది. వాయిదా వేస్తే ఎదురయ్యే పరిణామాలను అధికారులు సమీక్షిస్తున్నారు. ఇప్పుడు వాయిదా వేస్తే మళ్లీ ఎప్పుడు నిర్వహించొచ్చనే కోణంలోనూ పరిశీలన చేస్తున్నట్లు, ఒకవేళ వాయిదా గనుక వేస్తే దీర్ఘకాలం వేచి చూడాల్సి ఉంటుందనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వరుస ఎన్నికల ప్రక్రియతో అధికార యంత్రాంగం బిజీగా ఉండడం, రెండున్నర నెలల వరకు ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేకుండా బుక్ అయిపోవడంతో పరీక్షల వాయిదాపై కమిషన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల్లో గందరగోళం... గతేడాది డిసెంబర్లో గ్రూప్–2 ఉద్యోగ ప్రకటన వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా దాదా పు 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల తేదీని దాదాపు ఐదు నెలల క్రితమే టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీంతో అభ్యర్థులంతా సన్నద్ధతలో నిమగ్నమయ్యారు. పరీక్ష తేదీ చాలా ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో పరీక్ష కోసం పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ పుస్తకాలు చేతబట్టారు. అయితే మరికొన్ని పరీక్షలు సైతం సమీప తేదీల్లోనే ఉండటంతో గ్రూప్–2 వాయిదా వేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో కొందరు అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. పరీక్ష నిర్వహిస్తారా? లేదా? అనే సందేహం వారిని వెంటాడుతోంది. అయితే టీఎస్పీఎస్సీ ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఏదో ఒక స్పష్టత ఇచ్చి ఈ గందరగోళానికి తెరదింపాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
ఏపీ వ్యాప్తంగా ఇవాళ గ్రూప్–1 ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నేడు (ఆదివారం) ప్రిలిమినరీ పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) జరగనుంది. పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లోని 297 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్–2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్లో 120 చొప్పున ప్రశ్నలుంటాయి. అభ్యర్థులు హాల్ టిక్కెట్లతోపాటు నిర్దేశిత గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రాల వద్ద చూపించాలి. ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 9.45 గంటల వరకు అనుమతి ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకు పరీక్ష హాల్లోకి వెళ్లాలి. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 1.45 గంటల వరకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఎవరినీ అనుమతించరు. అభ్యర్థి దరఖాస్తులో బయోడేటా వివరాలను తప్పుగా పేర్కొని ఉంటే ఇన్విజిలేటర్ వద్ద అందుబాటులో ఉన్న నామినల్ డేటాను అప్డేట్ చేసుకోవాలి. అభ్యర్థికి ఇచ్చే ఓఎమ్మార్ సమాధాన పత్రం ఒరిజినల్, డూప్లికేట్ కాపీలుగా ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థి ఒరిజినల్ కాపీని ఇన్విజిలేటర్కు ఇచ్చి డూప్లికేట్ కాపీని తన వద్ద ఉంచుకోవాలి. ప్రాథమిక ‘కీ’ ఆదివారం రాత్రి లేదా సోమవారం విడుదల చేస్తారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే తమ లక్ష్యమని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. -
జేఈఈ పరీక్ష కేంద్రాల కుదింపు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24 నుంచి జరిగే జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కుదించింది. గతంలో 21 పట్టణాల్లో నిర్వహించే ఈ పరీక్షను ఈసారి 17 పట్టణాలకే పరిమితం చేసినట్టు స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో గతంలో భౌతికదూరం పాటించాల్సి వచ్చిందని, అభ్యర్థులు గుంపులుగా ఉండకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈసారి ఆ తీవ్రత లేకపోవడంతో పరీక్ష కేంద్రాలను తగ్గించినట్టు పేర్కొన్నారు. కోవిడ్ కాలంలో నాలుగు దఫాలుగా నిర్వహించిన పరీక్షను ఈసారి రెండు దఫాలకు తగ్గించిన విషయం తెలిసిందే. పరీక్ష కేంద్రాల విషయంలో విద్యార్థుల వెసులుబాటు, పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనను ప్రామాణికంగా తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే పరీక్ష కేంద్రాల తగ్గింపు వల్ల పలు జిల్లాల్లో విద్యార్థులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆదిలాబాద్లో పరీక్ష రాసే విద్యార్థులు నిజామాబాద్కుగానీ, హైదరా బాద్కుగానీ వెళ్లాల్సి ఉంటుంది. వికారాబాద్ అభ్యర్థులు హైదరాబాద్లోగానీ, సంగారెడ్డిలోగా నీ రాయాల్సి ఉంటుంది. గద్వాల విద్యార్థులు మహబూబ్నగర్ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు 95 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్, గద్వాల, వికారాబాద్, మంచిర్యాలలో ఉన్న కేంద్రాలను ఈసారి తీసేశారు. పరీక్ష కేంద్రాలు ఇవే. జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాల జాబితాను ఎన్టీఏ ప్రకటించింది. ఇందులో హయత్నగర్, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్నగర్, మేడ్చల్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ ఉన్నాయి. -
నీట్ యూజీ సెంటర్ల జాబితా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) నీట్ యూజీ– 2022 కోసం అభ్యర్థులు ఏ పట్టణాల్లోని పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ రాస్తారనే జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది. అయితే ఈసారి జాబితాను అభ్యర్థుల సౌకర్యార్థం చాలా ముందుగానే విడుదల చేయడం విశేషం. లిస్ట్ను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్లో సెంటర్ వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది అడ్మిట్ కార్డు కాదని, కేవలం అభ్యర్థులకు ముందస్తు సమాచారం అందించే వెసులుబాటు అని ఎన్టీఏ తమ నోటీస్లో పేర్కొంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను తర్వాత డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 17న జరిగే ఈ పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఒకే దఫాలో నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు 13 భాషల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 546 పట్టణాల్లో నిర్వహించనున్న నీట్ యూజీ–2022 కోసం ఆంధ్రప్రదేశ్లో 29, తెలంగాణలో 24 నగరాలను ఎంపిక చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సింగపూర్, కువైట్ సహా పలు దేశాల్లోని 14 నగరాల్లోనూ టెస్ట్ నిర్వహించనున్నారు. -
ఎస్ఐ స్కాం: రాత పరీక్ష కుంభకోణంలో పెరుగుతున్న లొంగుబాట్లు
బనశంకరి: ఎస్ఐ రాత పరీక్ష కుంభకోణంలో లొంగుబాట్లు పెరిగాయి. సోమవారం కలబురిగి జ్ఞానజ్యోతి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాశీనాథ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ పాఠశాల ముఖ్య నిందితురాలు దివ్య హగరగికి చెందినది. గత నెల 10 నుంచి పరారీలో ఉండగా, అరెస్టు తప్పదని తెలిసి కలబురిగిలో సీఐడీ ఆఫీసులో లొంగిపోయాడు. ఈ స్కాం సూత్రధారి రుద్రేగౌడపాటిల్, నీటిపారుదల శాఖ ఇంజనీర్ మంజునాథ మేళకుందతో కాశీనాథ్ కుమ్మక్కయినట్లు సమాచారం. ఆదివారం ఇంజనీర్ మంజునాథ లొంగిపోవడం తెలిసిందే. సమగ్ర దర్యాప్తునకు సమయం కావాలి ఈ బాగోతం రోజురోజుకు మలుపు తిరుగుతుండడంతో సమగ్ర సమాచారం రావాలంటే మరికొన్ని రోజులు పడుతుందని సీఐడీ సీనియర్ అధికారి తెలిపారు. ఎస్ఐ పరీక్ష అక్రమాలు కలబురిగి నుంచి బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరిగి ఉండవచ్చని, లోతుగా దర్యాప్తు చేయడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. తమకు సాంకేతిక నిపుణులు అవసరమన్నారు. ఎస్ఐ నియామకాల్లో ఎంపికైన 545 మంది అభ్యర్థులను విచారణ కు పిలవగా కొందరు గైర్హాజరైయ్యారు. ఆ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 92 కేంద్రాల్లో జరపగా 54,104 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆ మంత్రి పేరు చెప్పాలంటే భయం: డీకే శివాజీనగర: ఎస్ఐ కుంభకోణం లో మంత్రి హస్తం ఉందని వార్తలు వినిపిస్తున్నాయని, ఓ అభ్యర్థి కోసం మంత్రి రాజకీయ పలుకుబడిని వినియోగించినట్లు తెలిసిందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. సోమవారం నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆ మంత్రి ముఖ్యమంత్రి కానున్నారని, ఆయన పేరును బయటకు చెప్పరాదని మండ్య నుంచి ఓ నేత తో పాటు పలువురు ఒత్తిడి తీసుకువస్తున్నారని, తనకు అతడి పేరు చెప్పాలంటే భయంగా ఉందని అన్నారు. రామనగరలో మీరు మగాడా? అని మాకు ఆ మంత్రి తనకు సవాల్ విసిరాడని, దీంతో భయం వేస్తుందని పరోక్షంగా బెంగళూరుకు చెందిన ఓ మంత్రి గురించి చలోక్తులు విసిరారు. కాగా ఈ ఆరోపణలను విలేకరులు సీఎం బొమ్మై వద్ద ప్రస్తావించగా తరువాత మాట్లాడతానని చెప్పారు. మరో కాంగ్రెస్ నేత ఉగ్రప్ప మాట్లాడుతూ ఎస్ఐల స్కాంలో అరెస్ట్ అయినవారిని విడుదల చేయించేందుకు ఉన్నత విద్యా, రామనగర జిల్లా ఇన్చార్జి మంత్రి సీఎన్ అశ్వత్థనారాయణ ఒత్తడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. (చదవండి: ఎంట్రన్స్ టెస్టులో అవకతవకలు.. మరిన్ని ట్విస్టులు) -
పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న... పరిశుభ్రత ప్రశ్నార్థకం
సాక్షి, హైదరాబాద్: మండుతున్న ఎండలకు తోడు కోవిడ్ ఫోర్తు వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో పరిశుభ్రత, శానిటేషన్, తాగునీటి ఏర్పాట్లు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నెల 23 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణ కోసం ప్రభుత్వ పాఠశాలలను కూడా పరీక్ష కేంద్రాలుగా గుర్తించడంతో ఏర్పాట్లు సమస్యగా మారాయి. సర్కారు బడుల్లో నాలుగో తరగతి ఉద్యోగుల కొరత వెంటాడుతుంటంతో ఇప్పటి వరకు ప్రైవేటు సిబ్బందితో పనులు కొనసాగిస్తూ వచ్చారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు రానప్పటికీ టీచర్లందరు కలిసి సిబ్బంది వేతనాలను భరిస్తూ వచ్చారు. ఇక పరీక్షలు కేంద్రాల్లో సదుపాయాలను సమకూర్చేందుకు నిధుల కొరతతోపాటు ప్రైవేట్ సిబ్బంది విధులకు హాజరయ్యే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి సెలవుల సందర్భంగా ఇప్పటివరకు పాఠశాలల్లో పనిచేసిన స్వీ పర్లు, స్కావెంజర్లు డ్యూటీకి రాకుంటే పరిస్థితి ఏమిట ని ప్రధానోపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 62 మంది సిబ్బందే.. హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 690 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నా యి. ఆయా స్కూళ్లలో ప్రస్తుతం 1,06,635 మంది చదువుతుండగా, 6,200 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు నాలుగో తరగతికి చెందిన సుమారు 62 మంది పర్మనెంట్ అటెండర్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ఇతర పాఠశాలల్లో ప్రైవేట్ సిబ్బందిని నియమించుకుని తరగతి గదులు, నీటి ట్యాంకులు, మరుగుదొడ్లను శుభ్రం చేయడంతోపాటు విద్యార్థులకు తాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్ధితేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రెండేళ్ల నుంచి.. కరోనాకు ముందు పాఠశాల నిధులు (స్కూల్ గ్రాంట్) నుంచి కొంత డబ్బులు తీసి ఒక్కొక్కరికి నెలకు రూ.2500 వేతనం కింద ఇచ్చేవారు. సర్వశిక్ష అభియాన్ కింద కేటాయించే నిధులను కోవిడ్ కాలం నుంచి రద్దు కావడంతో హెచ్ఎంలు, ఉపాధ్యాయులపై భారం పడినట్లయింది. తాము పని చేస్తున్న స్కూల్లో మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులు, తరగతి గదులను శుభ్రం చేయించేందుకు సొంతంగా డబ్బులు సమకూర్చే పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న స్కూల్లో ఒక్కొక్కరు రూ.300 నుంచి 500 ఇస్తుండగా, ఎక్కువ ఉన్న చోట్ల రూ.500–1000 వరకు వేసుకొని వారికి వేతనాలుగా అందిస్తున్నారు. పరీక్షల సమయంలో ఎలా? వాస్తవంగా ప్రతి ఏటా పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ రెండో వారంలోగా పూర్తవుతుంటాయి. అప్పుడు అటెండర్లు, స్వీపర్లు, స్కావెంజర్ల సమస్య ఎదురయ్యేది కాదు. ప్రస్తుతం వేసవి సెలవుల సమయంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనుండడంతో ఏర్పాట్లు సమస్యగా తయారైంది. వేసవి సెలవుల్లో ప్రైవేట్ స్వీపర్లు, స్కావెంజర్లు విధులకు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదని కొందరు ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. పరీక్షలు జరుగుతున్నప్పుడు రోజువారీగా తరగతి గదులను శుభ్రం చేయడంతోపాటు తాగునీటిని అందించాల్సిన అవసరం ఉంది, ఎండాకాలం సెలవుల్లో వేతనం ఇచ్చే పరిస్థితి ఉండకపోవడంతో మెజారిటీ సిబ్బంది విధులకు హాజరుపై నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రంజాన్కు భారీ బందోబస్తు) -
Si Exam Scam: ఎంట్రన్స్ టెస్టులో అవకతవకలు.. మరిన్ని ట్విస్టులు
బనశంకరి: ఎస్ఐ పోస్టుల రాత పరీక్ష కుంభకోణంలో రోజురోజుకూ కొత్త ముఖాలు వెలుగు చూస్తున్నాయి. బెంగళూరులోనూ 7 పరీక్ష కేంద్రాల్లో కొందరు అక్రమాలకు పాల్పడి ఉత్తీర్ణులైనట్లు తెలిసింది. దీనికి సంబంధించి హైగ్రౌండ్ పోలీసులు 12 మందిని అరెస్టు చేయగా వారిలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నట్లు సమాచారం. ఇతడు పది లోపు ర్యాంకులో ఉత్తీర్ణుడు కావడం గమనార్హం. ఓఎంఆర్ షీట్, కార్బన్ షీటులో వ్యత్యాసం బయటపడింది. మరో 10 మంది అభ్యర్థుల కోసం గాలింపు జరుగుతోంది. ఇంజనీర్ లొంగుబాటు ఈ స్కాంలో 20 రోజులుగా పరారీలో ఉన్న మరో కింగ్పిన్ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ మంజునాథ మేళకుంద ఆదివారం కలబురిగి నగరంలో సీఐడీ ఆఫీసుకు ఆటోలో వచ్చి లొంగిపోయాడు. ఈ బాగోతంలో తన పాత్ర లేదని, ఆరోగ్యం సరిగా లేకపోవడంలో మంగళూరులో ఉన్నట్లు మీడియాతో చెప్పాడు. తన పేరు అనవసరంగా వెలుగులోకి వచ్చిందన్నారు. మంజునాథ తమ్ముడు రవీంద్ర, ప్రధానోపాధ్యాయుడు కాశీనాథ్, అభ్యర్థి శాంతాబాబు ఇంకా పరారీలో ఉండగా, 10 బృందాలతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. మరికొందరి కుమ్మక్కు మరో ముఖ్య నిందితురాలు దివ్య హాగరగిని సీఐడీ అధికారులు రెండు రోజుల నుంచి ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. కింగ్పిన్ రుద్రేగౌడపాటిల్, మంజునాథ మేళకుందతో కలిసి బ్లూటూత్ ఉపకరణాలను ఉపయోగించి సమాధానాలు చెప్పడానికి గాను లక్షలాది రూపాయలు డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. దివ్య హాగరగి సహకారంతో, కలబురిగి జ్ఞానజ్యోతి పాఠశాల హెచ్ఎం కాశీనాథ్తో కలిసి ప్లాన్ చేశారు. రుద్రేగౌడ పాటిల్తో పాటు కొందరు పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లు కుమ్మక్కైనట్లు అనుమానాలున్నాయి. ఇందులో ఇద్దరు డీఎస్పీలు, ఒక సీఐ, కొందరు కానిస్టేబుల్స్ పేర్లు వినబడుతున్నాయి.ఏయే అభ్యర్థులకు సహాయం చేయాలి అనే దానిపై పోలీస్ అధికారులే రుద్రేగౌడకు సూచనలిచ్చారు. పరీక్ష పూర్తయిన తరువాత కానిస్టేబుల్స్ ద్వారా అభ్యర్థులు డబ్బులు అందజేశారు. ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది రుద్రేగౌడ నిర్ణయించాడు. ఇది కూడా చదవండి: చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన భారత్ -
పీపీఈ కిట్లతో పరీక్షలకు
యశవంతపుర: కర్ణాటకలో వారం రోజులుగా కరోనా విజృంభిస్తోంది. మూడు రోజులుగా వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనికితోడు పలు కళాశాలలు, హాస్టళ్లపై కరోనా పంజా విసురుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని మల్లేశ్వరం ఈడిగ సముదాయ హాస్టల్లో 15 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ముగ్గురు బీకాం, బీబీఎం పరీక్షలు రాయాల్సి ఉంది. దీంతో సదరు విద్యార్థులకు శుక్రవారం పీపీఈ కిట్లు వేయించి అంబులెన్స్లో పరీక్షా కేంద్రమైన మహారాణి కళాశాలకు తీసుకెళ్లారు. విద్యార్థులు పీపీఈ కిట్లు ధరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో పరీక్షలు రాశారు. అనంతరం సదరు విద్యార్థులను ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. -
ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెండో విడత షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల నియామకానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం రెండో విడుత షెడ్యూల్ను విడుదల చేసింది. ఆర్ఆర్బి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెకండ్ పేజ్ సీబీట-1 టెస్ట్ 2021 జనవరి 16 నుండి 2021 జనవరి 30 వరకు జరగనుంది. ఈ పరీక్షలో సుమారు 27 లక్షల మంది అభ్యర్థులు పాల్గొననున్నట్లు ప్రకటించింది. ఈ రోజు(జనవరి 6) నుండి పరీక్షా నగరం & తేదీని తెలుసుకోవడంతో పాటు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల కోసం ఉచిత ట్రావెలింగ్ సర్టిఫికెట్ను అన్ని ఆర్ఆర్బి వెబ్సైట్లలో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.(చదవండి: వైరలవుతోన్న రతన్ టాటా ఫోటో) పరీక్ష తేదీకి 4 రోజుల ముందు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. 2వ దశలో షెడ్యూల్ చేసిన అభ్యర్థులందరికీ వారు ఆన్లైన్ దరఖాస్తులో ఇచ్చిన ఇ-మెయిల్, మొబైల్ నంబర్లకు ఈ సమాచారాన్ని పంపనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన అభ్యర్థులకు సంబందించిన పరీక్షలను తదుపరి దశలో వెల్లడించనున్నట్లు ఆర్ఆర్బి పేర్కొంది. మిగతా సమాచారం కోసం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్ వీక్షించండి. ఆర్ఆర్బి ఎన్టిపీసీ నోటిఫికేషన్ ద్వారా 35,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్ : రేపు(ఆదివారం) జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఈసారి రాష్ట్రం నుంచి 46,171 మంది సివిల్స్ పరీక్షలు రాయనున్నారు. అందుకు హైదరాబాద్లో 99 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సివిల్స్ పరీక్ష రాయనున్న అభ్యర్థులను గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. సివిల్స్ పరీక్ష రెండు సెషన్స్ లో జరగనుంది. కాగా మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 4. 30 వరకు రెండవ సెషన్లో పరీక్ష జరగనుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని.. అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు కూడా తెచ్చుకోవాలని అధికారులు తెలిపారు. అభ్యర్థులంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. కాగా హైదరాబాద్లో జరగనున్న సివిల్స్ పరీక్షా కేంద్రాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. -
రెండో రోజు గ్రామ సచివాలయ పరీక్షలు
-
సచివాలయ పరీక్షలు: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
-
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభణను అరికట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూజీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వారు చదివే కాలేజ్లోనే పరీక్ష రాసే వెసులుబాటును విద్యాశాఖ కల్పించింది. అయితే ఈ వెసులుబాటు ఈ ఒక్క సంవత్సరం మాత్రమే అమలులో ఉంటుంది. ఈ నెల 15 నుంచి అన్ని యూనివర్శిటీలలో చివరి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. (జేఈఈ: తెలంగాణ విద్యార్థులే టాప్! ) -
ఇంటికి దగ్గర్లోనే పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో నడవడం లేదు.. హాస్టళ్లు ఇంకా తెరువలేదు. బయట అద్దె ఇళ్లలో ఉండి పరీక్షలు రాసే అవకాశం లేదు.. విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసేందుకు తమ కాలేజీలకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే విద్యా ర్థులున్న చోటే పరీక్షలు రాసేలా జేఎన్టీయూ చర్యలు చేపట్టింది. ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు ప్రస్తుతం ఉంటున్న చోటే వారికి పరీక్షలు నిర్వహించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. బీటెక్, బీఫార్మసీ తదితర పరీక్షలకు కేంద్రాలను విద్యార్థులు ఉంటున్న దగ్గరే కేటాయించేలా ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 16 నుంచి నిర్వహించే పరీక్షలకు ఈ విధానం అమలు చేసేలా చర్యలు చేపట్టింది. ప్రిన్సిపాళ్లకు వివరాలు.. ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు ప్రస్తుతం తాము ఉంటున్న అడ్రస్, సమీపంలో ఉన్న రెండుమూడు కాలేజీల వివరాలను తమ కాలేజీల ప్రిన్సిపాళ్లకు అందజేస్తే వాటిల్లో ఏదో ఒక కాలేజీలో సదరు విద్యార్థులకు పరీక్ష కేంద్రం కేటాయించేలా చర్యలు చేపట్టింది. ఈ విధానంతో దాదాపు 60 వేల మంది విద్యార్థులు తమ దగ్గరలోని కాలేజీల్లోనే ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూరు హుస్సేన్ వెల్లడించారు. దీనికోసం ఈనెల 31 వరకు గడువు ఇచ్చామని తెలిపారు. విద్యార్థులు తమ సమీపంలోని కాలేజీల వివరాలను, ఇంటి అడ్రస్ను.. తమ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఇవ్వాలని, వారు తమకు పంపిస్తే వాటి ఆధారంగా ఆయా విద్యార్థులందరికి దగ్గరలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. జేఎన్టీయూ అమలు చేస్తున్న ఈ విధానాన్ని ఉస్మానియా, ఇతర యూనివర్సిటీలు కూడా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి నిర్వహించే సంప్రదాయ డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ఈ విధానంలో నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
సీబీఎస్ఈ పరీక్షలకు 15 వేల కేంద్రాలు
న్యూఢిల్లీ: పెండింగ్లో ఉన్న సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలను దేశవ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. కోవిడ్–19 కారణంగా వాయిదా పడిన ఈ పరీక్షలు జూలై 1 నుంచి 15 వరకు జరగనున్నాయి. గతంలో నిర్ణయించినట్టు మూడువేల కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా సామాజిక దూరాన్ని పాటించేందుకూ, విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించే అవసరం లేకుండా ఉండేందుకూ, అత్యధిక పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్టు మంత్రి చెప్పారు. హోంశాఖ నిబంధనల ప్రకారం కోవిడ్–19 కంటైన్మెంట్ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించరు. అలాగే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలను కల్పించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. 12వ తరగతి పరీక్షలు దేశవ్యాప్తంగాను, ఈశాన్య ఢిల్లీలో వాయిదా పడిన 10వ తరగతి పరీక్షలు ఇప్పుడు జరుగుతాయి. -
కట్టుదిట్టంగా పరీక్షలు జరుగుతున్నాయి : పెద్దిరెడ్డి
-
‘సచివాలయ’ రాత పరీక్షలకు 4,478 కేంద్రాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మొత్తం 4,478 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలకు 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్కొక్క రకమైన పరీక్షకు ఒక్కో రోజు చొప్పున సెప్టెంబరు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రెండు పూటలా రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన జరిగే వివిధ ఉద్యోగాల రాత పరీక్షకు అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగే మిగిలిన ఉద్యోగాల రాతపరీక్షకు మాత్రం ఏడు జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు 13 జిల్లాల్లో 4,478 కేంద్రాల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 306, విజయనగరంలో 198, విశాఖ జిల్లాలో 406, తూర్పు గోదావరిలో 481, పశ్చిమ గోదావరిలో 311, కృష్ణాలో 374, గుంటూరులో 365, ప్రకాశంలో 231, నెల్లూరులో 323, చిత్తూరులో 380, వైఎస్సార్ జిల్లాలో 270, అనంతపురంలో 389, కర్నూలు జిల్లాలో 444 పరీక్షా కేంద్రాల్లో 15,50,002 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. సెప్టెంబర్ 3, 4, 6, 7, 8 తేదీల్లో జరిగే రాత పరీక్షకు 7 జిల్లాల్లో 536 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 40, విశాఖలో 56, పశ్చిమ గోదావరిలో 38, కృష్ణాలో 90, నెల్లూరులో 85, చిత్తూరులో 120, అనంతపురం జిల్లాలో 107 పరీక్షా కేంద్రాల్లో 6,19,812 మంది పరీక్ష రాయనున్నారు. రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే రాతపరీక్షలు ప్రశాంతంగా, సక్రమంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పరీక్షల నిర్వాహణపై డీజీపీ గౌతమ్ సవాంగ్తో కలిపి ఆయన బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచి, ప్రత్యేక ఎస్కార్టుతో ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షల తరహాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలను సైతం పకడ్బందీగా నిర్వహించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. -
రేపే నీట్.. సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా మే 5న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు తెలంగాణలో పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. రెండు గంటల ముందే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలని.. 1.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమయినా అనుమతి నిరాకరిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు భారతీయ విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఈఏడాది 80వేలమంది నీట్ పరీక్షకు హాజరవుతున్నారని నిర్వహకులు తెలిపారు. ఎప్పటిలాగే ఈసారి కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని, బూట్లు, ఎత్తుమడిమల చెప్పులు, వాటర్ బాటిల్స్, ఫోన్స్, ఎలక్ట్రికల్ పరికరాలు, విద్యార్థినులు గాజులు, గొలుసులు, ఆభరాణాలు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకురావద్దని తెలిపారు. పరీక్షకు హాల్ టికెట్ తప్పనిసరి. అప్లికేషన్లో పొందుపరిచిన ఫోటో కాపీని తీసుకుని వెళ్లాలని, దానితో పాటు ఏదైనా గుర్తింపు కార్డు కూడా తప్పనిసరని విద్యా మండలి అధికారులు సూచించారు. -
జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాలు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జేఈఈ మెయిన్ నిర్వహించే పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పెంచింది. జనవరిలో జరిగిన మొదటి దఫా జేఈఈ మెయిన్ పరీక్షను 7 పట్టణాల్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా, ఏప్రిల్లో నిర్వహిం చనున్న రెండో దఫా జేఈఈ మెయిన్ పరీక్షను 9 పట్టణాల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. జనవరిలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ పట్టణాల్లో పరీక్షలను నిర్వహించిన ఎన్టీఏ ఏప్రిల్లో వాటితోపాటు అదనంగా కోదాడ, నిజామాబాద్లోనూ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్టీఐ) ప్రవేశాలకు ఎన్టీఏ 2 దఫాలుగా జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దఫా పరీక్షల ఫలితాలను ఇటీవల వెల్లడించింది. ఇక ఏప్రిల్ 7 నుంచి 20 మధ్య నిర్వహించే రెండో దఫా జేఈఈ మెయిన్ దరఖాస్తులను శుక్రవారం ప్రారంభించింది. వచ్చే నెల 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల సబ్మిషన్కు, 8 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకు చర్యలు చేపట్టింది. ఇక ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేయనుంది. జనవరిలో జరిగిన పరీక్షతోపాటు, ఏప్రిల్లో జరిగే పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎందు లో ఎక్కువ స్కోర్ లభిస్తే దానిని పరిగణనలోకి తీసుకొని ఆ తర్వాత తుది ర్యాంకులను ప్రకటించనుంది. ఆ ర్యాంకుల ఆధారంగా ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐల్లో ప్రవేశా లు చేపట్టనుంది. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వ హించే జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హులుగా జేఈ ఈ మెయిన్లో టాప్ పర్సంటైల్ (స్కోర్) సాధించిన 2.24 లక్షల మంది అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోనుంది. జేఈఈ మెయి న్ ఫలితాలు వెల్లడైన మరుసటిరోజు నుంచే జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల ప్రక్రి యను ఐఐటీ రూర్కీ చేపట్టనుంది. ఆ పరీక్షను మే 19న నిర్వహించనుంది. ఏప్రిల్లోనూ నాలుగు రోజులే! జనవరిలో జేఈఈ మెయిన్ను 4 రోజుల పాటు ప్రతి రోజు 2 షిఫ్ట్లలో నిర్వహించిన ఎన్టీఏ ఏప్రిల్లోనూ 4 రోజుల పాటు ప్రతి రోజు 2 షిఫ్ట్లలో జేఈఈ మెయిన్ను నిర్వహించనుంది. మొదటి దఫా పరీక్షలకు హాజ రుకాని 60 వేల మంది విద్యార్థులు రెండో దఫా పరీక్షకు హాజరుకానున్నారు. వారితోపాటు మొదటి దఫా పరీక్షలకు హాజరైన వారిలోనూ 99% మంది తమ స్కోర్ను పెంచుకునేందుకు రెండో దఫా పరీక్షకు హాజరుకానున్నారు. కొంతమంది కొత్త విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో జరిగే పరీక్షకు 10 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇదీ పరీక్ష షెడ్యూల్.. ఆన్లైన్లో పరీక్షలను ప్రతి రోజు 2 షిఫ్ట్లుగా నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి షిఫ్ట్ పరీక్ష నిర్వహించనుండగా, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో షిఫ్ట్ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సి ఉంది. ఉదయం పరీక్షకు 8:30లోపు, మధ్యాహ్నం పరీక్షకు 1:30లోపు పరీక్ష కేంద్రంలోకి అనుమతించనుంది. పరీక్ష హాల్లోకి ఉదయం పరీక్షకు 8:45 గంటల నుంచి 9 వరకు, మధ్యాహ్నం పరీక్షకు 1:45 నుంచి 2 వరకు అనుమతిస్తారు. -
మాస్ కాపీయింగ్కు తెరపడేనా?
సాక్షి, ముదినేపల్లి రూరల్: పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధించేందుకు విద్యాశాఖ ప్రభుత్వ స్కూళ్లల్లో మాత్రమే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే మార్చిలో జరగబోయే పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేపట్టారు. కేవలం పరీక్షా కేంద్రాల మార్పు వల్లే మాస్ కాపీయింగ్ నిరోధించడం ఏమేరకు సాధ్యపడుతుందనేది నియోజకవర్గంలోని ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తమ ఫలితాల కోసం అడ్డదారులు ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు ప్రభుత్వస్కూళ్లలోనూ, ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలోని కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. ఇన్విజిలేటర్లు, డీవోలు, సీఎస్లుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఫలితాల కోసం ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులతో కుమ్మక్కై మాస్కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేరుకే చట్టం పరీక్షల్లో కాపీయింగ్ నిరోధించేందుకు విద్యాశాఖ యాక్ట్ 25 అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం విద్యార్థి మాస్కాపీయింగ్ చేస్తు పట్టుబడితే విద్యార్థితో పాటు ఇన్విజిలేటర్, చీఫ్ సూపరెంటెండెంట్ బాధ్యత వహించాల్సి ఉంది. వీరిని విధుల నుంచి తప్పించడంతో పాటు జరిమానా, సస్పెన్షన్, జైలు శిక్ష విధించాలి. అయితే ఈ చట్టం పేరుకే తప్ప ఆచరణలో ఎక్కడా అమలు కావడం లేదు. దీని ప్రకారం ఇప్పటి వరకు ఏ ఒక్క ఉపాధ్యాయుడిని బాధ్యుడిని చేయలేదంటే మాస్కాపీయింగ్ లేనట్లా? లేక చట్టాన్ని సక్రమంగా అమలుచేయడం లేదో అర్థంకాని పరిస్థితి. దీన్ని అమలు చేయాల్సిన స్క్వాడ్ అధికారులే మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తూ యాక్ట్ 25ను అపహాçస్యం చేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. అధికారుల ఒత్తిడి విద్యార్థుల సామర్థ్యాలతో పనిలేకుండా పది పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా అధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవడం ఆనవాయితీగా మారింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫలితాల సాధన కోసం మాస్కాపీయింగ్ను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నట్లు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలనే ఒత్తిడి ఉన్నంత కాలం పరీక్షా కేంద్రాలు ఏవిధంగా మార్పు చేసినా మాస్కాపీయింగ్కు తెరపడదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. -
నేడు డిపార్ట్మెంటల్ టెస్టుల నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లో ఉద్యోగుల పదోన్నతుల్లో పరిగణనలోకి తీసుకునే డిపార్ట్మెంటల్ టెస్టుల నిర్వహణకు టీఎస్పీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అభ్యర్థులు నవంబర్ 5 నుంచి 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. పరీక్షలను డిసెంబర్ 27 నుంచి 2019 జనవరి 6 వరకు నిర్వహించేలా షెడ్యూల్ను ప్రకటించింది. ఈ పరీక్షలను ఈసారి పూర్తిగా ఆన్లైన్ విధానంలో (కంప్యూటర్ ఆధారిత) నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 9 జిల్లా కేంద్రాలు, హైదరాబాద్, రంగారెడ్డి కలుపుకొని హెచ్ఎండీఏ పరిధిలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని వివరించింది. అభ్యర్థులు తాము పనిచేస్తున్న జిల్లా మాత్రమే కాకుండా అదనంగా పరీక్ష కేంద్రాలను ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలిపింది. ప్రాధాన్యతల ఆధారంగా జిల్లా కేంద్రాలు, హెచ్ఎండీఏ పరిధిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని వెల్లడించింది. -
టైమ్కి వెళ్లినా.. ఎగ్జామ్కు నో ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్/ అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రారంభం కాగా... కానీ కొన్ని పరీక్ష కేంద్రాల్లో రూమ్ వెతుక్కోవడంలో అలస్యమైనందుకు ఎగ్జామ్ రాసేందుకు విద్యార్థులను అనుమతించలేదు. సూర్యాపేట జిల్లా కోదాడలో వాగ్దేవి కాలేజీ ఇంటర్ విద్యార్థినిని ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో సిబ్బంది బయటకు గెంటేశారు. దీంతో విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టగా పోలీసులు నచ్చజెప్పే యత్నం చేశారు. బాధిత విద్యార్థిని రమాదేవి మాట్లాడుతూ.. నిర్ణీత సమయానికే ఎగ్జామ్ సెంటర్కు వెళ్లిన తాను రూమ్ వెతుక్కోవడంలో అలస్యమైనందుకు బయటకు పంపారని చెప్పింది. పరీక్ష రాసేందుకు అనుమతించాలని వేడుకున్నా సిబ్బంది తన మాట వినలేదని వాపోయింది. కాగా, ఏపీలో మొత్తం 1,423 కేంద్రాల్లో, తెలంగాణలో 1,294 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అయితే నిమిషం నిబంధన కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు చిక్కులు పెట్టి పరీక్ష రాయకుండా అడ్డుకుంది. ఉదయం 8.45 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతించారు. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్తో ఉదయం 9 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి చేరుకున్న విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించినట్లు సిబ్బంది చెబుతున్నారు. -
అక్కడి వారిక్కడ.. ఇక్కడి వారక్కడ
సాక్షి, వరంగల్ రూరల్: ‘‘మా విద్యార్థులు మీ కళాశాలలో పరీక్ష రాస్తారు.. మీ విద్యార్థులు మా కళాశాలలో పరీక్ష రాస్తారు.. ఇక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. మా వారికీ అక్కడ ఏమీ ఇబ్బంది ఉండవద్దు’ ఇదీ.. ప్రైవేటు ఐటీఐ కళాశాల యాజమా న్యాల ముందస్తు ఒప్పందం. డైరెక్టరేట్ జనరల్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ (డీజీఈటీ), డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ (డీజీటీ)ల ఆధ్వ ర్యంలో ఇండస్ట్రియల్ ట్రెనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ) పరీక్షలు నిర్వ హిస్తున్నారు. ఈ నెల 5న ప్రారంభమైన సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 15 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఐటీఐలు 65, ప్రైవేట్ ఐటీఐలు 222 ఉన్నాయి. వీటిలో 58,300 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సెమిస్టర్ పరీక్షల కోసం 125 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ముందస్తు ఒప్పందం ప్రకారం పరీక్షలు చూచిరాతను తలపిస్తున్నాయి. పరస్పర ఒప్పందంతో.. వరంగల్ అర్బన్ జిల్లాలోని విద్యార్థి ఐటీఐ, విన్సెంట్ ఐటీఐ విద్యార్థులకు శ్రీ రాజీవ్ గాంధీ ప్రైవేట్ ఐటీఐలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. శ్రీ రాజీవ్ గాంధీ ఐటీఐకి చెందిన విద్యార్థులకు విన్సెంట్ ప్రైవేట్ ఐటీఐలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మ్యూచువల్ చేంజ్గా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముందుగానే ఉన్నతాధికారులతో ఒప్పందం కుదుర్చుకుని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయించుకున్నారు. మా విద్యార్థులను ఫ్రీగా వదిలేస్తే ఇక్కడ మీ విద్యార్థులను ఫ్రీగా వదిలేస్తామని ఒప్పందం చేసుకున్నారు. గతంలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఉన్నతాధికారులతో ప్రైవేట్ యాజమాన్యాలు కుమ్మక్కై మ్యూచు వల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రైవేట్ ఐటీఐలకు సెల్ఫ్ సెంటర్లను సైతం ఏర్పాటు చేశారు. మ్యూచువల్ చేంజ్తో కేం ద్రాలు ఏర్పాటు కావడంతో జోరుగా మాస్కాపీయింగ్ జరు గుతోంది. పరీక్ష కేంద్రంలో కనీస నియమాలు సైతం పాటించడం లేదు. జంబ్లింగ్ కాకుండా ఒకే ట్రేడ్ వారిని పక్కపక్కన కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తు న్నారు. కనీస సౌకర్యాలు లేకు న్నా సైతం కొన్ని కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లిలోని వీఎన్ఆర్ ఐటీఐలో సాధారణ కుర్చీలు ఏర్పాటు చేసి పరీక్షలు రాయిస్తున్నారు. ఆ ఐటీఐ భవనం ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. పైసా వసూల్ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు చూసి రాసుకునేందుకు ప్రైవేట్ ఐటీఐల యజమానులు అడ్డదారులు తొక్కుతున్నారు. పైసలు ఇస్తే పాస్ గ్యారంటీ పేరుతో ప్రైవేట్ ఐటీఐలు డబ్బులు వసూల్ చేస్తు న్నాయి. సెంటర్ ఫీజు పేరుతో విద్యార్థుల నుంచి రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వసూళ్లు చేసినట్లు తెలిసింది. కొన్ని పరీక్ష కేంద్రాలలో ఏకంగా బోర్డుల పైనే జవాబులు రాస్తున్నారు. ఐటీఐ చేసిన వారికి ట్రాన్స్కో, జెన్ కో, సింగరేణిలో ఉద్యోగ అవకాశాలున్నాయి. దీంతో విద్యార్థులు కూడా పాస్ అవుతాం కదా అని డబ్బులు ఇచ్చేందుకు వెనుకాడటంలేదని సమాచారం. విద్యార్థుల నుంచి వసూల్ చేసిన డబ్బులను పరీక్ష పర్యవేక్షకుడికి, ఉన్నత అధికారులకు ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వని విద్యార్థులను మరో గదిలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్నారు. -
విద్యార్థులకు అసౌకర్యం కలగనివ్వం: మంత్రి కడియం
హైదరాబాద్: ఎంసెట్ పరీక్షకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ సెంటర్లు ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. 2.46 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్నట్లు ఆయన తెలపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఇంజినీరింగ్ పరీక్షకు 'క్యూ' సెట్ ప్రశ్నాపత్రం ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఇంజినీరింగ్ పరీక్షకు 276 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, పోలీసు, ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ సంస్థల సహకారం తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరించారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు మెడికల్, అగ్రికల్చర్ ఎగ్జామ్ కు 190 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. -
10కి పక్కా ఏర్పాట్లు
- నేలబారు పరీక్షలుండవ్ - అందుబాటులో మినరల్ వాటర్ - కాపీయింగ్ నిరోధానికి సీసీ, వెబ్ కె మెరాలు - ‘సాక్షి’తో డీఈవో కృష్ణారెడ్డి సాక్షి, విశాఖపట్నం: విద్యార్థి జీవితంలో తొలిమెట్టుగా భావించే పదో తరగతి పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. వీటి ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్టికెట్లు జారీ అయ్యాయి. జిల్లాలో నాలుగో వంతు పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్ లేదు. మరికొన్ని కేంద్రాల్లో కనీస సదుపాయాల కొరత ఉంది.. ఏజెన్సీతో పాటు మరికొన్ని సెంటర్లలో కాపీయింగ్ బెడద కూడా ఉంది. ఈ ఏడాది జిల్లాలో 62 వేల మందికి పైగా టెన్త్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షల ఏర్పాట్లు, సమస్యాత్మక కేంద్రాలు, ఫర్నిచర్ కొరత, సౌకర్యాల కల్పన, కాపీయింగ్ నిరోధానికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలివి.. జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం 62,568 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో 5812 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. మొత్తం 268 కేంద్రాల కు గాను అర్బన్లో 136, రూరల్లో 97, ఏజెన్సీలో 35 ఉన్నాయి. ఈ ఏడాది ఒక్కరు కూడా నేలపై కూర్చుని రాయడానికి వీల్లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. తొలుత 70 కేంద్రాల్లో పాక్షికంగా, 13 సెంటర్లలో పూర్తిగా ఫర్నిచర్ కొరత ఉంది. వీటిలో ఏజెన్సీలోని కేంద్రాలే అధికం. ఆరు వేల మంది విద్యార్థులకు మూడు వేల బెంచీలు అవసరం ఉంది. దీంతో ఆయా కేంద్రాలకు కొత్తగా బెంచీలు, బల్లలను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇప్పటికే వెయ్యి బెంచీలు వచ్చాయి. మరో రెండు వేలు పరీక్షలు ప్రారంభమయ్యే 21వ తేదీకి ముందే వస్తాయి. ఇంకా ఎక్కడైనా అవసరమైతే అద్దెకు తెస్తాం. అందువల్ల ఈ ఏడాది ఎక్కడా నేలపై పరీక్షలు రాసే పరిస్థితి రాదు. పరీక్షల నిర్వహణకు 3217 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించాం మినరల్ వాటర్.. ఫస్ట్ ఎయిడ్.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఈ ఏడాది మినరల్ వాటర్ను ఏర్పాటు చేశాం. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో ప్రాథమిక చికిత్సను అందుబాటులో ఉంచుతున్నాం. మరుగుదొడ్ల నిర్వహణపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అన్ని కేంద్రాల్లోనూ విద్యుత్ సరఫరాతో పాటు లైట్లు ఉండేలా చర్యలు చేపట్టాం. 11 సమస్యాత్మక కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 11 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించాం. వీటిలో ప్రభుత్వ హైస్కూలు- అరకువేలీ, బాలికల ప్రభుత్వ హైస్కూలు-శ్రీకృష్ణాపురం (పాడేరు), జెడ్పీ హైస్కూలు-చింతపల్లి, మున్సిపల్ గరల్స్ హైస్కూలు-అనకాపల్లి, బాలికల జెడ్పీ హైస్కూలు-చోడవరం, అయ్యన్న జూనియర్ కాలేజీ-కె. కోటపాడు, జెడ్పీ హైస్కూలు- వి.మాడుగుల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల-నర్సీపట్నం, జ్ఞాననికేతన్ స్కూల్ (అక్కయ్యపాలెం-విశాఖ) ఉన్నాయి. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది సీసీ, వెబ్ కె మెరాలు సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటుం. చింతపల్లి, పాడేరు, అనకాపల్లి, చోడవరం, కె.కోటపాడు, అరకువేలీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, మిగిలిన సెంటర్లలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా 13 ఫ్లయింగ్, ఐదు సిటింగ్ స్క్వాడ్లను, ఏజెన్సీలో ఇద్దరు స్ట్రయికింగ్ ఫోర్సులను నియమించాం. వీరితో పాటు ఆయా మండలాల తహసీల్దార్లు కూడా పరీక్షా కేంద్రాలను సందర్శిస్తారు. హాల్టిక్కెట్లు రాకపోతే.. ఇప్పటికే అన్ని సెంటర్లకు హాల్టిక్కెట్లను పంపించాం. ఎవరికైనా అందని పక్షంలో ఠీఠీఠీ.ఛట్ఛ్చఞ.ౌటజ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని సంబంధిత స్కూల్ హెడ్మాస్టర్తో ధ్రువీకరించుకుంటే పరీక్షకు అనుమతిస్తారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందే చేరుకునేలా విద్యార్థులు, తల్లిదండ్రులు సన్నద్ధం కావాలి. ఆయా పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతారు/ గంట ముందుగానే బస్సులు అందుబాటులో ఉంటాయి. పరీక్ష కేంద్రాలు సులువుగా తెలుసుకునేందుకు ఈ ఏడాది కోడ్ నంబర్లతో సహా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల వెంట సెల్ఫోన్లను అనుమతించబోరు. శతశాతం ఉత్తీర్ణతకు కృషి గత ఏడాది 91.76 శాతం ఉత్తీర్ణత సాధించామని డీఈవో కృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఏడాది శతశాతం ఫలితాల సాధనకు కృషి చేస్తున్నామని చెప్పారు. -
‘మినిట్’ టెన్షన్
ఆధోని: తెలుగు రాష్ట్రాలలో బుధవారం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకేంద్రంలోకి హజరు కానివ్వమని అధికారులు ముందే హెచ్చరించడంతో.. విద్యార్థులు ఉదయం నుంచే పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరారు. ఆర్టీసీ బస్సులను నమ్ముకొని వచ్చే విద్యార్థుల కన్నా తల్లిదండ్రుల సాయంతో పరీక్ష కేంద్రాలకు హజరయ్యే వారే ఎక్కువగా కనిపించారు. ‘డెడ్లైన్’ దగ్గర పడుతున్నా కొంతమంది విద్యార్థుల ఉరుకులు పరుగులు ఎక్కువయ్యాయి. కర్నూలు జిల్లా ఆధోనిలోని బాలాజి జూనియర్ కళాశాల వద్ద పరీక్ష కేంద్రంలోనికి ‘ప్యాడ్’లు అనుమతించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం పరీక్ష కేంద్రంలో టేబుళ్లు ఏర్పాటు చేశామని తెలపడంతో వారు శాంతించారు. -
ఎండలే అసలు పరీక్ష
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు * 74,756 మంది విద్యార్థుల హాజరు * ఉదయం 9 నుంచే సూర్యప్రతాపం * ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎండల భయం పట్టుకుంది. ఉదయం 9 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడం ఇందుకు కారణం. దీనికితోడు గాలి, వెలుతురు రాని గదులను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేయడం, అందులో ఫ్యాన్లు, లైట్లు, మంచినీరు, ఇతర సౌకర్యాలు సరిగా లేకపోవడంపై కూడా విద్యార్థిలోకంలో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలను ఎదుర్కోవడం విద్యార్థులకు అగ్ని పరీక్షగా మారింది. నాలుగు డిగ్రీల సెల్షియస్ ఎక్సెస్.. గత ఏడాది ఇంటర్ పరీక్షల సమయంలో భానుడి ప్రతాపం 36 డిగ్రీల సెల్షియస్కు పరిమితం కాగా ఈ ఏడాది ఆ తీవ్రత 39-40 డిగ్రీల మధ్య ఉంది. ఈ కారణంగా ఉదయం 9 గంటలకే జనాలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఉదయం 9నుంచి 12 గంటల మధ్య ఇంటర్ పరీక్షల నిర్వహణ సమయంలో ఇటు ఉక్కపోత, అటు ఎండ వేడిమితో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి నెలకొంది. 101 కేంద్రాలు, 74,576 మంది విద్యార్థులు మర్చి 2 నుంచి 19 వరకు మొదటి సంవత్సరం, 3 నుంచి 21 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. 74,576 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 36,094 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 38,662 మంది ఉన్నారు. వీరికోసం జిల్లావ్యాప్తంగా 101 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ/ఎయిడెడ్ కాలేజీల పరిస్థితి పర్వలేదనిపిస్తుండగా ప్రయివేట్ జూనియర్ కళాశాలల కేంద్రాల్లో మాత్రం వసతులు సరిగా లేనట్లు తెలుస్తోంది. గాలి, వెలుతురు సక్రమంగా రానివి, ఫ్యాన్లు, లైట్లు లేని గదులున్నట్లు సమాచారం. మరికొ న్ని కేంద్రాల్లో బెంచీలు లేని కారణంగా నేలబారు రాతలు తప్పని పరిస్థితి నెలకొంది. 13 స్క్వాడ్ బృందాలతో పర్యవేక్షణ పరీక్షల నిర్వహణను 13 స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనున్నాయి. ఇందులో నాలుగు ఫ్లైయింగ్ స్వ్కాడ్స్, హైపవర్ కమిటీ, ఆర్ఐఓ, డీవీఈఓ, డీఈసీ, ఐదు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు విరివిగా పరీక్షలో మాల్ ప్రాక్టీస్ను నివారించేందుకు కృషి చేస్తాయి. సమస్యాత్మకంగా గుర్తించిన ఆలూరు, కౌతాళం, హొళగుంద కేంద్రాల్లో పర్యవేక్షణ అధికంగా ఉంటుంది. ఇక ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులుంటారు. మూడు సెట్ల ప్రశ్న పత్రాలు.. ప్రతి పరీక్షకు మూడు సెట్ల ప్రశ్న పత్రాలను కేంద్రాల సమీపంలోని పోలీసు స్టేషన్లలో ఉంచారు. ఉదయం 8.30 గంటలకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల సెల్ఫోన్లకు వచ్చే మెసేజ్ ఆధారంగా ఎంపిక చేసిన సెట్ ప్రశ్నపత్రాలను తీసుకెళ్తారు. అన్ని పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కంట్రోల్ రూం ఏర్పాటు.. పరీక్షలకు సంబంధించిన ఫిర్యాదులు, సూచనలు అందజేయడానికి ఆర్ఐఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇక్కడ సీనియర్ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో సభ్యులు.. సందేహాలను నివృత్తి చేస్తారు. ఇందుకోసం 040-24603317,0866-2974130, 08518-222407 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఏర్పాట్లు పూర్తి ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా మాల్ ప్రాక్టీస్ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవు. - పరమేశ్వరెడ్డి, ఆర్ఐఓ -
బెస్ట్ ఆఫ్ లక్
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి 1,02,541 మంది విద్యార్థులు 110 పరీక్షా కేంద్రాలు ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఛాన్స్ విద్యార్థి దశలో ఎంతో కీలకమైన ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. జీవితాన్ని మలుపు తిప్పే ఈ పరీక్షలు బంగారు భవిష్యత్తుకు సోపానాలు వేస్తాయి. రేపటి మంచి రోజులకు భరోసా ఇస్తాయి. నేటి విద్యార్థులకు ఈ సంగతి తెలియంది కాదు.. అందుకే వారు అహర్నిశలూ శ్రమించారు. ఎన్నో ఆశలతో ఎగ్జామ్స్కు సిద్ధమయ్యారు. అయితే పరీక్షలు మొదలు కాబోతున్న వేళ కాస్త ఒత్తిడి, ఆందోళన సహజం. అందుకే విద్యార్థులంతా విజయం మీదే అని విశ్వసించండి.. మీమీద మీరు నమ్మకముంచండి. అంతా బాగుంటుందన్న పాజిటివ్ దృక్పథంతో పరీక్షకు సిద్ధం కండి.. ఆల్ ది బెస్ట్! విశాఖపట్నం: ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. బుధవారం నుంచి 21 తేదీ వరకూ జరిగే ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వం ఈసారి ఉదయం 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించకూడదన్న కఠిన నిర్ణయం తీసుకుంది. అందువల్ల అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,02,541 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం 52,107 మంది, ద్వితీయ సంవత్సరం 50,434 మంది ఉన్నారు. ఇందుకోసం 110 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో నగరంలో 56, గ్రామీణ జిల్లాలో 41, మన్యంలో 13 సెంటర్లు ఉన్నాయి. వీటిలో 16 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జెరాక్స్ సెంటర్లను తెరవడానికి అనుమతించలేదు. ఒకవేళ తెరిస్తే నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. జంబ్లింగ్ విధానం జిల్లాలోని మొత్తం 110 కేంద్రాల్లో జంబ్లింగ్ విధానం లో పరీక్షలు జరగనున్నాయి. కానీ కళాశాలకు, కళాశాలకు మధ్య 30 కి.మీలకు పైగా దూరంతో పాటు ఆయా చోట్లకు బస్సు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో ఐదు కళాశాలలకు జంబ్లింగ్ నుంచి మినహాయింపునిచ్చారు. దీంతో ఆ కళాశాలల్లో చదువుతు న్న దాదాపు 1200 మంది విద్యార్థులు అక్కడే పరీక్ష లు రాసుకునే వెసులుబాటు దక్కింది. వాటి వివరాలు.. కొయ్యూరు గిరిజన సంక్షేమ కళాశాల (బాలురు) ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కాలేజి పెదబయలు గిరిజన సంక్షేమశాఖ ఎస్టీ కళాశాల (బాలురు) అప్పర్ సీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల జీకేవీధి గిరిజన సంక్షేమశాఖ ఎస్టీ కళాశాల (బాలికలు) సమస్యాత్మక కేంద్రాలు జిల్లావ్యాప్తంగా 16 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను అధికారులు గుర్తించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కేడీపేట గిరిజన సంక్షేమ కళాశాల (బాలురు), కొయ్యూరు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, అనంతగిరి గిరిజన సంక్షేమ కళాశాల (బాలికలు) అనంతగిరి గిరిజన కళాశాల, అరకువేలి ప్రభుత్వ కళాశాల, అరకువేలి ప్రభుత్వ కళాశాల, ముంచంగిపుట్టు గిరిజన సంక్షేమ కళాశాల(బాలురు), పెదబయలు ప్రభుత్వ జూనియర్ కాలేజి, హుకుంపేట ప్రభుత్వ కళాశాల, పాడేరు గిరిజనసంక్షేమ కళాశాల (బాలికలు), పాడేరు ప్రభుత్వ కళాశాల, జి.మాడుగుల అప్పర్ సీలేరు ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ కళాశాల, చింతపల్లి గిరిజన కళాశాల, చింతపల్లి గిరిజన సంక్షేమ కళాశాల (బాలికలు) జీకేవీధి సీసీ కెమెరాలతో నిఘా మరో వైపు ఈ ఏడాది సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో సెంటరులో 2 నుంచి 4 వరకు అమరుస్తున్నారు. వీటికి తొలిసారిగా విశాఖలోని ఇంటర్ కార్యాలయం నుంచి హైదరాబాద్లోని బోర్డు కార్యాలయానికి ఇంటర్నెట్ ద్వారా అనుసంధానిస్తారు. దీంతో ఆయా కేంద్రాల్లో జరిగే పరీక్షల తీరును నేరుగా తెలుసుకో గలుగుతారు. దీని ద్వారా పరీక్షా కేంద్రాల్లో అవకతవకలు, అక్రమాలు, మాస్కాపీయింగ్ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముందుగానే చేరుకోవాలి పరీక్షలు ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతాయి. 9 గంటలు దాటాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవా లి. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే విద్యార్థి భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం ఉం ది. అలాగే విద్యార్థులు ఓఎంఆర్ షీట్పై తమ పేరు, హాల్టిక్కెట్ నంబరు, మీడియం, సబ్జెక్టుతో ఆధార్ నంబరు సరిగా ఉందో లేదో సరి చూసుకోవాలి. -
ఏపీ ఐసెట్కు పకడ్బందీగా ఏర్పాట్లు
ఏఎన్యూ: ఏపీ ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)-2015కు గుంటూరు రీజియన్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఐసెట్ గుంటూరు రీజియన్ కోఆర్డినేటర్, ఏఎన్యూ ఆర్ట్స్ కళాశాల కామర్స్ విభాగాధిపతి డాక్టర్ ఆర్.శివరాం ప్రసాద్ తెలిపారు. యూనివర్సిటీలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఐసెట్ వివరాలను వెల్లడించారు. ఐసెట్ ఈనెల 16వ తేదీన జరుగుతుందన్నారు. పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, విద్యార్థులను 9:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. గుంటూరు రీజియన్లో 16 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని, పరీక్షకు అన్ని కేంద్రాల నుంచి 8,650 మంది హాజరవుతున్నారన్నారు. ప్రతి కేంద్రానికి పరిశీలకులను నియమించామని చెప్పారు. ఇతర యూనివర్సిటీల నుంచి మరో ఐదుగురు ప్రత్యేక పరిశీలకులను ఐసెట్ కన్వీనర్ పంపనున్నారని తెలిపారు. పరీక్ష ఏర్పాట్ల కోసం గుంటూరు కలెక్టరేట్ నుంచి 3 రూట్లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు అనుమతించడం లేదని, విద్యార్థులెవరూ వాటిని వెంట తెచ్చుకోవద్దని సూచించారు. హాల్టికెట్లలో సమస్యలు ఉన్న విద్యార్థులు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును వెంటతెచ్చుకుంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. సందేహాలు ఉన్న విద్యార్థులు 9849856589 సెల్ నంబరును సంప్రదించాలన్నారు. పరీక్షా కేంద్రాల వివరాలు.. గుంటూరు రీజియన్లో జీవీఆర్ అండ్ ఎస్ మహిళా కళాశాల, క్రీస్తు జయంతి కాలేజ్ , జేసీ కాలేజ్ ఆఫ్ లా , ఆర్వీఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, జేకేసీ డిగ్రీ కాలేజ్, విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ (పెదపలకలూరు రోడ్), బీహెచ్హెచ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ప్రభుత్వ మహిళా కళాశాల, ఏసీ కాలేజ్, ఆంధ్రా లూథరన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అభ్యుదయ మహిళా కళాశాల, టీజేపీఎస్ కాలేజ్, మహాత్మాగాంధీ కాలేజ్, హిందూ కాలేజ్, సెంయింట్ ఆన్స్ కాలేజ్ (గోరంట్ల), చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ (లాం) కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని రీజినల్ కోఆర్డినేటర్ శివరాం ప్రసాద్ తెలిపారు. -
సమయానికి రండి
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలో గురువారం జరిగే ఎంసెట్కు విద్యార్థులు సమయూనికి హాజరు కావాలని అధికారులు సూచించారు. కనీసం గంట ముందు గా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని పేర్కొన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమై నా పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలలో తగిన వసతులు కల్పి ంచామని, రవాణా సౌకర్యం కూడా ఉంటుందని వివరించారు. ఇంజి నీరింగ్ పరీక్ష కోసం 17, మెడిసిన్కు 8 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం పది గంటల నుంచి పగలు ఒంటిగంట వరకు,మెడిసిన్ పరీక్ష పగలు 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుంది. దూరప్రాంత విద్యార్థులకు వసతిని ఏర్పాటు చేశారు. కొందరు బుధవారం మధ్యాహ్నం వరకే వసతి కేంద్రాలకు చేరుకున్నారు. కాకతీయ జూనియర్ కళాశాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు వేరువేరుగా వసతి కల్పించడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ తాగునీరుతోపాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నారుు. ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు ప్రత్యేక ఏ ర్పాట్లను చేస్తున్నారు. ఒక్క విద్యార్థికి కూడా ఇబ్బంది కలుగకూడదు ఎంసెట్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. బు దవారం ఆయన వరంగల్ నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక్క విద్యార్థి ఉన్న సరే ఇబ్బం దులు పడకుండా సెంటర్కు వెళ్లే విధంగా తోడ్పాటునందించలన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి విద్యార్థులను తీసుకురావడంపై ప్రధాన దృష్టిసారించాలన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉ ండాలని సూచించారు. విద్యార్థులు ఒక పరీక్ష కేంద్రానికి బ దులు మరో పరీక్ష కేంద్రానికి వెళితే పోలీసు వాహనాల ద్వారా వారిని సెంటర్లకు పంపించాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్శర్మ మాట్లాడుతూ బస్సులు బయలు దేరే సమయాలను విద్యార్థుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ చేయాలన్నారు. పోలీసు శాఖ అత్యంత బాధ్యతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. బస్సులపై బ్యానర్లను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష అనంతరం బస్సులు మండలాల కేంద్రాలకు పంపించాల ని పేర్కొ న్నారు. కలెక్టర్ డి.రొనాల్డ్రోస్ మాట్లాడుతూ విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేందుకు 237బస్సులను ఏర్పాటు చేశామన్నారు. సందేహాలు తీర్చడానికి 18004256644 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు జేసీ రాజారాం, ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, డీఆర్ఓ మనోహర్, డీటీసీ రాజా రత్నం, ఆర్టీసీ ఆర్ఎం రమాకాంత్, ఎంసెట్ కో-ఆర్డినేటర్ రాంమోహన్రావు పాల్గొన్నారు. -
రేపు ఏపీ ఎంసెట్
► కర్నూలు, నంద్యాలలో పరీక్ష ► నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ కర్నూలు(జిల్లా పరిషత్) : ఏపీ ఎంసెట్-2015 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించే ఈ పరీక్షకు కర్నూలులో ఇంజనీరింగ్కు 12, మెడికల్కు 11, నంద్యాలలో ఇంజనీరింగ్కు 5, మెడిసిన్కు 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్కు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడిసిన్/అగ్రికల్చర్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు కర్నూలు పట్టణ, నంద్యాల రీజనల్ కో-ఆర్డినేటర్లు డాక్టర్ వి. సతీష్కుమార్, డాక్టర్ ఎం.రామసుబ్బారెడ్డి తెలిపారు. కర్నూలులోని పరీక్ష కేంద్రాల్లో ఇంజనీరింగ్కు 7,526 మంది, మెడిసిన్కు 6,337 మంది, నంద్యాల పరీక్ష కేంద్రాల్లో ఇంజనీరింగ్కు 1,886, మెడిసిన్కు 552 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వారు వివరించారు. కర్నూలులో పరీక్ష కేంద్రాలు ఇంజనీరింగ్: 1, 2 కేంద్రాలు జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏ, బీ సెంటర్లు, మూడో కేంద్రం జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల, నందికొట్కూరు రోడ్డు, 4- మాంటిస్సోరి హైస్కూల్, ఎ.క్యాంపు, 5- ఉస్మానియా కళాశాల, 6- వాసవి మహిళా కళాశాల, పెద్దమార్కెట్, 7- సిస్టర్ స్టాన్సిలాస్ మెమోరియల్ ఇంగ్లీష్ స్కూల్, సుంకేసుల రోడ్డు, 8- బృందావన్ ఇంజనీరింగ్ కళాశాల(బిట్స్), పెద్దటేకూరు, 9- సిల్వర్జూబ్లీ ప్రభుత్వ కళాశాల, 10- కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, 11- ప్రభుత్వ పురుషుల కళాశాల, బి.క్యాంపు, 12- సెయింట్ జోసఫ్ బాలికల జూనియర్ కళాశాల, ఆత్మకూరు రోడ్డు. మెడిసిన్: 1, 2- జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏ,బీ సెంటర్లు, 3- జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల, నందికొట్కూరు రోడ్డు, 4- మాంటిస్సోరి హైస్కూల్, ఎ.క్యాంపు, 5- ఉస్మానియా కళాశాల, 6- వాసవి మహిళా కళాశాల, 7- సిస్టర్ స్టాన్సిలాస్ మెమోరియల్ స్కూల్, సుంకేసుల రోడ్డు, 8- బృందావన్ ఇంజనీరింగ్ కళాశాల, 9- సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల, 10. కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, 11- ప్రభుత్వ పురుషుల కళాశాల, బి.క్యాంపు. నంద్యాలలో పరీక్ష కేంద్రాలు ఇంజనీరింగ్: 1- పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాల, 2- రామకృష్ణ డిగ్రీ కాలేజి, 3- డీఎస్సీ, కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 4- ఎస్పీవై రెడ్డి డిగ్రీ కళాశాల, 5- ఏవీఆర్ ఎస్వీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మెడిసిన్: 1- ఈఎస్ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, 2- ఏవీఆర్ ఎస్వీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజి. ఉచిత బస్సు సౌక ర్యం కర్నూలులోని జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల, బృందావన్ ఇంజనీరింగ్ కళాశాలల వారు తమ కళాశాలలో పరీక్ష రాసే విద్యార్థుల కోసం కర్నూలు రాజవిహార్ సెంటర్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ► విద్యార్థులు హాల్టికెట్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ ప్రతిని పరీక్షకు తీసుకెళ్లాలి. ఆన్లైన్ అప్లికేషన్లో అభ్యర్థి ఫొటో అతికించి దానిపై గెజిటెడ్ లేదా వారు చదివిన కళాశాల ప్రిన్సిపల్తో సంతకం చేయించుకోవాలి. ► ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించి తీసుకురావాలి ► అభ్యర్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. ► పరీక్ష రాసేందుకు బ్లాక్/బ్లూ పాయింట్ బాల్ పెన్ మాత్రమే ఉపయోగించాలి ► ఓఎంఆర్ షీటుపై విద్యార్థి పేరు, హాల్టికెట్ నెంబర్, ఫొటోగ్రాఫ్ ప్రింట్ చేసి ఉంటాయి. అవి సరిగ్గా ఉన్నదీ లేనిది సరిచూసుకోవాలి. అది సరిగ్గా లేకపోయినా, ఓఎంఆర్ షీటు చిరిగి పోయి ఉన్నా వెంటనే ఇన్విజిలేటర్ సహాయంతో మార్చుకోవాలి. ► ప్రశ్నపత్రం ఇచ్చాక దానిపై ఉన్న బుక్లెట్ సంఖ్య, బుక్లెట్ కోడ్ ఓఎంఆర్ షీటుపై, నామినల్ రోల్పై నింపాలి. జాగ్రత్తగా చూసి నింపి తేడాలు లేకుండా చూడాలి ► కాపీయింగ్కు పాల్పడినా, సెల్ఫోన్, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. -
మార్చి 11 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 11 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 9,90,912 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్ కేటగిరిలో 9,33,308 మంది, ఒకేషనల్లో 57,604 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. దీని కోసం ఇంటర్మీడియెట్ విద్యా బోర్డు 1,411 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మార్చి 3 వరకు జరగుతాయి. ఈ పరీక్షలకు 2,90,380 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. దీని కోసం 1,723 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. మొదటి సంవత్సరానికి సంబంధించి ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నీతిశాస్త్రం, 31న పర్యావరణ విద్యపైన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
అక్రమాలకు ఆస్కారం లేకుండా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షలు విద్యార్థులు, తల్లిదండ్రులు, నిర్వాహకులకు సవాలే నిలిచాయి. గతేడాది ఇంటర్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాలు, ఇన్విజిలేటర్ల కేటాయింపు వివాదాస్పదంగా మారింది. ప్రైవేట్ కళాశాలల యా జమాన్యాల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారన్న ఆరోపణలు వచ్చాయి. మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న ఫిర్యాదుల మేరకు ఏకంగా అప్పటి ఎస్పీ డాక్టర్ తరుణ్ జోషి, జేసీ వెంకటేశ్వర్రావులు నిజామాబాద్ కాకతీయ జూనియర్ కాలేజీలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కళాశాల అధినేతను పోలీ సులు అదుపులోకి తీసుకుని విచారించడం చర్చనీయాశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా కూడ పలుచోట్ల ఇంటర్ పరీక్షల నిర్వహణ వివాదాస్పదమైంది. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్, మార్చి 9 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యం లో ముందస్తు ప్రణాళికపై ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాంతీయ తనిఖీ అధికారి ఎ.విజయ్కుమార్తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఆయన మాటల్లో.. మూత పడిన 20 కాలేజీలు.. జిల్లాలో మొత్తం 163 ఇంటర్ కాలేజీలు ఉంటే అందులో ఈ ఏడాది 143 కళాశాలల విద్యార్థులే పరీక్షలకు హాజరవుతున్నారు. గత రెండు మూడేళ్లుగా 20 కాలేజీలు మూతపడ్డాయి. ఈ ఏడాది నిజామాబాద్లో విశ్వభారతి, బాన్సువాడలో ప్రగతి కాలేజీలను మూసేశారు. 31 ప్రభుత్వ, 4 ఎయిడెడ్ కళాశాలు, 15 మోడల్ స్కూల్స్, 13 సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల కళాశాలతో పాటు 80ప్రైవేట్ కళాశాల విద్యార్థులు 60,592 ఈసారి పరీక్షలు రాయనున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మార్చి 9 నుంచి జరిగే ఇంటర్ ప్రథ మ, ద్వితీయ పరీక్షలకు ఇప్పటి నుంచే పకబ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాము. ప్ర భుత్వ మార్గదర్శకాల ప్రకారం పరీక్ష కేంద్రాలను ‘జంబ్లింగ్’ పద్ధతిన ఏర్పా టు చేయనున్నాము. ఉదాహరణకు నిజామాబాద్లో 18 కాలజీలుంటే వాటి ని మూడు జోన్లుగా విభజించి ఏ కాలేజీలో చదివే పిల్లలు ఆ కాలేజీలో పరీక్ష రాసే అవకాశం ఉండకుండా పరీక్షా కేంద్రాలను కేటాయిస్తాము. గతంలో ఆరోపణలు వచ్చిన కళాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాము. పరీక్షల నిర్వహణపై సమావేశం... ఇంటర్ పరీక్షల నిర్వహణపై త్వరలోనే కళాశాలల యాజమాన్యాలతో ఓ స మావేశం నిర్వహించనున్నాము. జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల నిర్వాహకు లు హాజరయ్యే విధంగా ముందస్తుగా సమాచారం ఇవ్వనున్నాము. 143 ప్ర భుత్వ, ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు ఏ సెంటర్లో పరీక్ష రాయాల్సి వచ్చి నా.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా సెంటర్లలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలనేది సూచిస్తాము. కళాశాలల నిర్వాహకులు ఖచ్చితంగా హాజరయ్యేలా ప్రణాళికబద్ధంగా నిర్వహించే సమావేశం పరీక్షలకు కీలకం కానుంది. ప్రాక్టికల్స్ ఎక్కడికక్కడే.. ఇంటర్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువు డిసెంబర్ 12న ముగిసింది. ఈ లె క్కన 29,250 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం కోసం పరీక్ష రాయనుండగా, 31,342 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. అ యితే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఏ కాలేజీలో చదివితే ఆ కాలేజీలోనే ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4 వరకు ఉంటాయి. కేవలం రాత పరీ క్షలు మాత్రమే ప్రథమ, ద్వితీయ విద్యార్థులకు జంబ్లింగ్ పద్ధతిలో ఉంటాయి. ’కాపీయింగ్’పై తల్లిదండ్రుల వ్యతిరేకత ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ‘విద్యార్థులకు జలుబు పడితే తల్లిదండ్రులకు తుమ్ములు వస్తున్నాయి’. తమ పిల్లల భవిష్యత్పై కలలుకంటున్న వారు కాపీయింగ్ను కోరుకునే పరిస్థితిలో అసలే లేరు. అయితే కొన్ని విద్యాసంస్థలు ర్యాంకుల కోసం గతంలో ఈ పద్ధతులు అవలంభించినట్లు ఆరోపణలున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా అందరి సహకారంతో అవకతవకలకు అస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తాము. అవకతవకలకు పాల్పడితే ఇంటికే.. ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. పిల్లలు ఉత్తములుగా ఎదిగేందుకు తల్లిదండ్రులు అనేక వ్యయప్రయాసాలకు సిద్ధపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల్లో అవకతవకలకు ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలకు సిఫారసు చేయడంతో పాటు అనుమతులు రద్దు చేస్తాము. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఆ సబ్జెక్టుకు సంబంధించిన బోధకులకు ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు ఇవ్వం. ఇన్విజిలేట ర్లు అక్రమాలకు అవకాశం కల్పిస్తే ఇంటికి పంపడం ఖాయం. ఈ పరీక్షల్లో 400 మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లను వినియోగించనున్నాము. -
ప్రశాంతంగా డీసెట్
కర్నూలు (విద్య): డీఎడ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన డైట్సెట్-2014(డీసెట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు రావాలని అధికారులు ఆదేశించడంతో అభ్యర్థులు మారుమూల గ్రామాల నుంచి ఉదయం 9 గంటలకంతా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉర్దూ మీడియానికి సంబంధించి పరీక్ష కేంద్రాలను డోన్లో ఏర్పాటు చేయడంతో పలువురు ముస్లిం మైనార్టీ మహిళా అభ్యర్థినులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్నూలులో 73, డోన్లో 10 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 92.2శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలుగు మీడియంలో 17,944 మందికి గాను 16,522 మంది, ఉర్దూ మీడియంలో 931 మందికి 880 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని టౌన్ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి కె.నాగేశ్వరరావు సందర్శించారు. అలాగే కర్నూలులో రాష్ట్ర పరిశీలకులు, డిప్యూటీ డెరైక్టర్(ట్రైనింగ్) ఉషారాణి, మోడల్ స్కూల్స్ డిప్యూటీ డెరైక్టర్ విజయలక్ష్మి పలు కేంద్రాలను పరిశీలించారు. -
ఎంసెట్.. ప్రశాంతం
జిల్లాలోని 29 కేంద్రాల్లో గురువారం ఎంసెట్-2014 ప్రశాంతంగా జరిగింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు ముందే హెచ్చరించడంతో.. చాలామంది గంట ముందే ఆయా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. చివరి నిమిషాల్లో వచ్చినవారు ఉరుకులు పరుగులతో పరీక్షా హాలులోకి వెళ్లారు. కాగా, జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో.. లోపల అభ్యర్థులకు, బయట వారి తల్లిదండ్రులకు ఎంసెట్ నిజంగానే పరీక్షగా మారింది. భానుగుడి(కాకినాడ)/ అమలాపురం రూరల్ న్యూస్లైన్ : ఒక పక్క మండుతున్న ఎండ.. చెమటలు కారుతూ సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుతామా లేదా అనుకుంటూ విద్యార్థుల పరుగులు... మొత్తం మీద గురువారం జిల్లాలో ఎంసెట్ పరీక్ష ప్రశాతంగా జరిగింది. పరీక్ష కేంద్రంలో విద్యార్థులు ఎంసెట్ రాస్తే తల్లిదండ్రులు భానుడి పరీక్షను బయట తట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని తేలడంతో చాలా మంది విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రం వద్దకు చేరారు. మరికొందరు విద్యార్థులు ఆఖరి నిమిషాల్లో ఉరుకులు పరుగులతో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థుల హాజరు కాకినాడ ప్రాంతీయ కేంద్రంగా ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షను 25 కేంద్రాల్లో నిర్వహించారు. కోనసీమలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించారు. కాకినాడ కేంద్రంగా జరిగిన ఇంజనీరింగ్ పరీక్షలో 11,555 మంది విద్యార్థులకు గాను, 10,503 మంది హాజరయ్యారు. 1,052 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన మెడిసిన్ పరీక్ష పది కేంద్రాల్లో నిర్వహించారు. 3051 మంది విద్యార్థ్ధులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 2,852 మంది హాజరయ్యారు. 199 మంది గైర్హాజరైనట్టు పరీక్ష కో-ఆర్డినేటర్, జేఎన్టీయూకే ప్రిన్సిపాల్ కొప్పిరెడ్డి పద్మరాజు తెలిపారు. కోనసీమలో అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల, భట్లపాలెంలోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల, అనాతవరంలోని ప్రసిద్ధ ఇంజనీరింగ్ కళాశాల, చెయ్యేరులోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ పరీక్షకు 2,517 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2354 మంది హాజరు కాగా 163 మంది గైర్హాజరయ్యారు. మెడిసిన్ విభాగంలో 543 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 509 మంది పరీక్ష రాశారు. 34 మంది గైర్హాజరయ్యారు. తనిఖీలు హైదరాబాద్ జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ వేణుగోపాలరావు, ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్ ిసీహెచ్ శ్రీనివాసరావు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కోనసీమలో రీజనల్ కోఆర్డినేటర్ వక్కలంక కృష్ణమోహన్ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. తల్లిదండ్రులకు ఇబ్బందులు విద్యార్థుల తల్లిదండ్రుల కోసం టెంట్లను ఏర్పాటుచేసినప్పటికీ ఎండవేడి ఎక్కువగా ఉండడంతో వాటిని ఎవరూ వినియోగించుకోలేదు. కాకినాడ సత్యసాయిసేవా సమితి వారు తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. విసుగుతెప్పించిన కళాశాలల ప్రచారం మా కళాశాలలో చేరాలంటే..మా కళాశాలలో చేరాలని వివిధ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల ప్రతినిధులు పరీక్షా కేంద్రాల వెలుపల నిర్వహించిన ప్రచారం విద్యార్థుల తల్లిదండ్రులకు విసుగుతెప్పించింది. వారు సీడీలు, పేపర్లను విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందజేశారు. -
నేటి నుంచి ‘పది’ పరీక్షలు
భానుగుడి (కాకినాడ), న్యూస్లైన్ : అర్ధరాత్రి దాటినా ఇంట్లో దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఏ టీవీ సీరియలో చూడడానికి కాదు- మర్నాడు జరగబోయే పరీక్షను ఎదుర్కోవడానికి! అందుకోసం కనీసం ఇద్దరు కచ్చితంగా మేలుకుని ఉంటారు. ఒకరు పరీక్ష రాయబోయే విద్యార్థి. మరొకరు- ఆ విద్యార్థిని కన్నతల్లి. గురువారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులున్న ప్రతి ఇంట్లో.. కొంచెం ఇంచుమించుగా ఇలాంటి దృశ్యాలే చోటు చేసుకుంటాయంటే అతిశయోక్తి కాదు. ఆ తరగతి అనగానే ఆ తరహా ప్రాధాన్యం, ఆ పరీక్షలు అనగానే ఆ స్థాయి ఆదుర్దా స్థిరపడిపోయింది, మరి. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు డీఈఓ కేవీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. జిల్లాలో రెగ్యులర్, ప్రైవేట్ కేటగిరీల్లో మొత్తం 68,489 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్టు వివరించారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 30,291 మంది బాలురు, 30,462 మంది బాలికలు కాగా ప్రైవేట్ విద్యార్థుల్లో 4,180 మంది బాలురు, 3,756 మంది బాలికలు అని తెలిపారు. రెగ్యులర్ విద్యార్థుల కోసం 271 పరీక్షా కేంద్రాలను, ప్రైవేట్ విద్యార్థుల కోసం 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షా పత్రాలను భద్రపరిచేందుకు 3 ట్రెజరీలను, 66 పోలీస్ స్టేషన్లను స్టోరేజ్ కేంద్రాలుగా వాడుతున్నట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో కేటగిరీ -ఎలో 13, కేటగిరీ-బిలో 212, కేటగిరీ -సిలో 87 ఉన్నాయన్నారు. 36 మంది రూట్ ఆఫీసర్లను, 15 స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని శాఖల సహాయసహకారాలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. -
మాకెందుకీ ‘పరీక్ష’?
ఒంగోలు ఒన్టౌన్, న్యూస్లైన్ : జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ ఏడాదీ నేల మీద రాతలు తప్పేలా లేవు. విద్యార్థులను నేలపై కూర్చోబెట్టి పరీక్ష రాయించొద్దన్న ఉన్నతాధికారుల ఆదేశాలు అమలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ కార్యాలయం పరీక్ష కేంద్రాలున్న ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు ఫర్నిచర్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. మొక్కుబడిగా కొన్ని పాఠశాలలకు తక్కువ సంఖ్యలో బల్లలు సరఫరా చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో విద్యార్థులు నేలమీద కూర్చుని పరీక్ష రాస్తూ అవస్థలు పడాల్సి వస్తోంది. జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 39,601 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 195 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 86 పరీక్ష కేంద్రాలకు మాత్రమే పూర్తి స్థాయిలో ఫర్నిచర్ ఉంది. 93 పాఠశాలల్లో 50 శాతం ఉండగా 16 పరీక్ష కేంద్రాల్లో అసలు ఫర్నిచరే లేదు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల్లో 11,311 మంది విద్యార్థులు నేలమీద కూర్చుని పరీక్ష రాయక తప్పదు. ఫర్నిచర్ లేని పరీక్ష కేంద్రాలివే.. జిల్లాలోని 16 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు కూర్చునేందుకు ఒక్క బల్ల కూడా అందుబాటులో లేదు. తాళ్లూరు సరస్వతి హైస్కూల్, కందుకూరు జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్, దర్శి, సింగరాయకొండ, కొండపి ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూళ్లు, దూపాడు ఏపీ రెసిడెన్షియల్ బాలికల హైస్కూల్, ముండ్లమూరు జెడ్పీ హైస్కూల్-బీ కేంద్రం, వేటపాలెం జెడ్పీ బాలికల హైస్కూల్-బీ కేంద్రం, ఇంకొల్లు జెడ్పీ హైస్కూల్- బీ కేంద్రం, ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల-బీ కేంద్రం, గుడ్లూరు జెడ్పీ హైస్కూల్-బీ కేంద్రం, పీసీపల్లి, సీఎస్ పురం, వెలిగండ్ల జెడ్పీ హైస్కూళ్లలోని బీ కేంద్రాలు, మార్కాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, కంచర్లపల్లి జెడ్పీ హైస్కూల్ పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్ లేదు. కొత్త పరీక్ష కేంద్రాలు ఇవీ.. ఈ ఏడాది కొత్తగా అమ్మనబ్రోలు(బాలికలు), సంతనూతలపాడు(బాలురు) ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు, కురిచేడు జిల్లా పరిషత్ హైస్కూల్, ముండ్లమూరు జిల్లా పరిషత్ హైస్కూళ్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంగోలు డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం ఉన్నందన అక్కడి సెంటర్ను అన్నవరప్పాడులోని శ్రీ సూర్య విద్యానికేతన్కు మార్చారు. సంతమాగులూరులోని బాలాజీ హైస్కూల్లో పరీక్ష కేంద్రాన్ని తొలగించారు. ఫర్నిచర్ సరఫరా చేస్తాం : డీఈఓ రాజేశ్వరరావు పరీక్ష కేంద్రాలకు ఫర్నిచర్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పరీక్ష కేంద్రాలు, పరీక్షలు రాసే విద్యార్థులు చదువుతున్న ఉన్నత పాఠశాలల హెచ్ఎంలను సమన్వయం చేసి బల్లల కొరత లేకుండా చూడాలని ఎం ఈఓలను ఆదేశించాం. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తున్నాం. -
అ‘టెన్’షన్
రాయవరం, న్యూస్లైన్: పదో తరగతి పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. పరీక్షలు దగ్గర పడుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు విద్యాశాఖాధికారులకు కూడా టెన్షన్ మొదలైంది. పదో తరగతి ఫలితాలపైనే జిల్లా విద్యాశాఖాధికారుల పనితీరు ఆధారపడి ఉండడంతో మెరుగైన ఉత్తీర్ణత సాధించేందు కు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. 312 పరీక్షా కేంద్రాలు జిల్లాలో 60,753 మంది రెగ్యులర్ విద్యార్థులు, 7,936 మంది ప్రైవేట్ విద్యార్థులు 312 పరీక్ష కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలను రాయనున్నారు. రాజమండ్రి, కాకినాడల్లో 13 పరీక్షా కేంద్రాలు (ఏ సెంటర్లు), పోలీస్టేషన్కు దగ్గర్లో 212 పరీక్షా కేంద్రాలు (‘బీ’ సెంటర్లు) ఉన్నాయి. పోలీస్టేషన్కు ఎనిమిది కిలోమీటర్ల పైబడి 87 పరీక్షా కేంద్రాలు (‘సీ’ సెంటర్లు) ఉన్నాయి. 312 పరీక్షా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు డిపార్ట్మెంట్ అధికారుల నియమించినట్టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకట్రావు తెలిపారు. 15 ఫ్లెయింగ్ స్క్వాడ్స్ పరీక్షల్లో కాపీ జరగకుండా చూసేందుకు 15 ఫ్లెయింగ్స్క్వాడ్స్ను ఏర్పాటు చేసినట్టు వెంకట్రావు తెలిపారు. ఈ స్క్వాడ్స్ జిల్లాలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తాయన్నారు. అదేవిధంగా 87 సెంటర్లలో కార్ కస్టోడియన్లను నియమించామన్నారు. పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఆరు రోజులకు సంబంధించిన పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. ఈ పేపర్లను ఆయా పరీక్షా కేంద్రాల దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్లో భద్రపరుస్తున్నారు. పరీక్ష రోజున వాటిని కేంద్రానికి తీసుకువెళతారు. మిగిలిన పరీక్షలకు చెందిన ప్రశ్నాపత్రాలు ఈ నెల 24వ తేదీ నాటికి జిల్లాకు రానున్నట్టు సమాచారం. ఇన్విజిలేటర్ల సమస్య ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ను నియమించాల్సి ఉంది. దాని ప్రకారం జిల్లాలో 3,434 మంది ఇన్విజిలేటర్లు అవసరమవుతారు. పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ఎస్జీటీ ఉపాధ్యాయులను నియమించేవారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను ఇన్విజిలేషన్ విధులకు నియమించవద్దంటూ ఉపాధ్యాయ సంఘాలు డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ను కోరాయి. దాంతో పదోతరగతి ఇన్విజిలేటర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని, తప్పకపోతే ఎస్జీటీలను నియమించాలని ఆదేశాలు ఇచ్చారు. పదోతరగతి పరీక్షలు, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి రావడంతో గందరగోళం నెలకొంది. ఈ సమస్యను జిల్లా విద్యాశాఖ ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి. -
టెట్ ప్రశాంతం
ఏలూరు సిటీ, న్యూస్లైన్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. నగరంలో 78 పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు పరీక్షలు నిర్వహించటంతో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద హడావుడి నెలకొంది. ఎప్పటినుంచో ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు పిల్లాపాపలతో సహా కేంద్రాలకు వచ్చి పరీక్షలు రాశారు. అయితే పరీక్షా కేంద్రాల గుర్తింపులో అభ్యర్థులు కాస్త గందరగోళానికి గురయ్యారు. ఒకే పేరుతో రెండు ప్రాంతాల్లో విద్యాసంస్థలు ఉండడంతో అభ్యర్థులు తికమక పడ్డారు. కొందరు పరీక్ష కేంద్రాలకు చేరుకున్న అనంతరం ఇది తమ కేంద్రం కాదని తెలియడంతో కొందరు అభ్యర్థులు ఆ కేంద్రాలకు పరుగులు పెట్టారు. పైగా ఒక్క నిమిషం నిబంధన ఉండడంతో సకాలంలో చేరతామో లేదోనని కంగారుపడ్డారు. -
రేపు టెట్
నల్లగొండ అర్బన్, న్యూస్లైన్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు జిల్లా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం నాడు టెట్ నిర్వహించనున్నారు. డీ.ఈడీ అభ్యర్థులు హాజరయ్యే పేపర్-1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 10 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి 2,325 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. బీ.ఈడీ అభ్యర్థులు హాజరయ్యే పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 80 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఇందుకు 19,196 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు పరీక్షకు ఒక నిమిషం ఆలస్యమైన అనుమతించరు. పరీక్ష సమయం పూర్తైన తర్వాతనే హాలు వదిలి వెళ్లాలి. హాల్టికెట్లను వెబ్సైట్లో పెట్టారు. గతంలో వెబ్సైట్ నుంచి తీసిన హాల్టికెట్లు కూడా అనుమతిస్తారు హాల్టికెట్ పొందిన వారు పరీక్ష కేంద్రం చిరునామాను ఒక రోజు ముందుగానే తెలుసుకుని పరీక్ష రోజు గంట ముందుగా సెంటర్కు హాజరుకావాలి. ఓఎంఆర్ షీట్లో వైట్నర్తో దిద్దడం చేయకూడదు. ఓఎంఆర్ షీట్లో హాల్టికెట్ నంబరు వేయడం, పేపర్ కోడ్ను నలుపు వలయంగా షేడ్ చేయడం తప్పనిసరి. -
అటోళ్లు ఇటు.. ఇటోళ్లు అటు..
అటోళ్లు ఇటు.. ఇటోళ్లు అటు.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శుల ఎంపిక పరీక్షా కేంద్రాల ఏర్పాటు గందరగోళంగా మారింది. తూర్పు ప్రాంత అభ్యర్థులకు పశ్చిమలో, పశ్చిమ ప్రాంతంలోని వారికి తూర్పులో కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విస్తీర్ణం పరంగా జిల్లా విశాలంగా ఉంటుంది. తూర్పు ప్రాంతంలోని వారికి జిల్లా కేంద్రంతోపాటు, పశ్చిమలోని నిర్మల్కు వెళ్లాలంటే 150 నుంచి 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఐదారు గంటల ప్రయాణం తప్పదు. కానీ, అవేమి పట్టించుకోని ఏపీపీఎస్సీ జిల్లా కేంద్రంతోపాటు, రెవెన్యూ డివిజన్లు, బెల్లంపల్లిలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇష్టారీతిన అభ్యర్థులకు కేంద్రాలు కేటాయించారు. తూర్పు ప్రాంతం వారికి తూర్పులో, పశ్చిమ వారికి పశ్చిమలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుండేది. ఇటీవల నిర్వహించిన వీఆర్వో, వీఆర్ఏ ఎంపిక పరీక్షల్లోనూ అధికారులు ఇష్టారాజ్యంగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అభ్యర్థులు పరీక్ష రాయలేక పోయారు. కొందరు పరీక్షా కేంద్రాలు దూరంగా ఉన్నాయని, వెళ్లకుండా ఉండిపోతే, మరికొందరు సుదూర ప్రాంతాల నుంచి కేంద్రాలకు చేరేసరికి సమయం మించి పోవడంతో పరీక్ష రాయలేదు. కనీసం ఇప్పుడైనా ఆయా ప్రాంతాల వారికి అక్కడే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారని భావించిన అభ్యర్థులకు నిరాశే మిగిలింది. అందుబాటులో హాల్టికెట్లు పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం డిసెంబర్ 12, 2013న నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ, ఈ నెల 23వ తేదీన పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పది రోజుల ముందుగానే వెబ్సైట్లో హాల్టికెట్లు పెట్టాల్సి ఉన్నా, రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి వల్ల ఆలస్యంగా హాల్టికెట్లు అందుబాటులో ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి హాల్టికెట్లు అందుబాటులో ఉండడంతో అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్నగర్, చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్లలో ఏర్పాటు చేయడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1(జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటి), మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పేపర్ 2( గ్రామీణాభివృద్ధి(ఏపీ ప్రాధాన్యం) పరీక్షలు ఉన్నాయి. దీంతో ఉదయం పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం, పరీక్ష పూర్తయిన తరువాత గమ్య స్థానాలకు చేరుకోవడం అభ్యర్థులకు అగ్ని పరీక్షే. పరీక్షా కేంద్రాలు ఇవే.. జిల్లా వ్యాప్తంగా 46,020 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం జిల్లా కేంద్రంతోపాటు రెవెన్యూ డివిజన్లలో 185 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్లో 65, నిర్మల్లో 32, మంచిర్యాలలో 37, ఆసిఫాబాద్లో 12, ఉట్నూరులో 17, బెల్లంపల్లిలో 24 పరీక్షా కేంద్రాలను ఉన్నాయి. -
అదృష్ట ‘పరీక్ష’!
చిరు ఉద్యోగానికి ఎన్ని వ్యయప్రయాసలో.. వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలు ప్రశాంతం జిల్లాలో 89.34 శాతం హాజరు సుదూరం నుంచి తరలివచ్చిన అభ్యర్థులు కిక్కిరిసిన పరీక్షా కేంద్రాలు సంగారెడ్డి/కలెక్టరేట్, న్యూస్లైన్: నిరుద్యోగ యువతీయువకులు కడలి ప్రవాహంలా కదిలొచ్చారు. ఉద్యోగన్వేషణలో విసిగివేసారిన నిరుద్యోగులు రాకరాక వచ్చిన ఒక్క అవకాశాన్ని ఒడిసి పట్టుకోడానికి హోరాహోరీగా పోటీపడ్డారు. ఒక్కసారిగా వందలు, వేల సంఖ్యలో తరలివచ్చి అదృష్టాన్ని ‘ప రీక్షించుకున్నారు’. చిరుద్యోగమైనా ప్రభుత్వ ఉద్యోగమే నయమని భావించి వ్యయప్రయాసలు పడ్డారు. ఆదివారం నిర్వహించిన వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలకు మొత్తం 60,477 మంది హాజరు కావాల్సి ఉండగా, 54,034 మంది పరీక్ష రాయడంతో జిల్లాలో 89.34 శాతం హాజరు నమోదైంది. సిద్దిపేటలోని ఓ పరీక్ష కేంద్రంలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ అక్కాతమ్ముళ్లు అధికారులకు పట్టుబడ్డారు. వీరిపై స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ఘటన మినహా జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. వీఆర్ఓకు 57,834 మంది దరఖాస్తు చేసుకోగా 51,731 మంది పరీక్ష రాశారు. దీంతో 89.44 శాతం హాజరు నమోదైంది. 6,102 మంది గైర్హాజరయ్యారు. వీఆర్ఏకు 2,643 మంది దరఖాస్తు చేసుకోగా 2,302 మంది పరీక్ష రాశారు. 87.09 శాతం హాజరు నమోదైంది. 341 మంది హాజరుకాలేదు. కష్టనష్టాలకు ఓర్చి.. నిరుద్యోగ యువతీయువకులను ఊరించిన వీఆర్ఓ, వీఆర్ఏ ఉద్యోగాల రాత పరీక్షకు భారీ స్పందన లభించింది. సుదూర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలుండటంతో అభ్యర్థులు కష్టనష్టాలు ఓర్చి ఎట్టకేలకు పరీక్ష రాశారు. కొందరు అభ్యర్థులు ముందు జాగ్రత్తగా ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకుని బస్టాండ్లు, లాడ్జీల్లో బస చేశారు. చాలామంది అద్దె వాహనాల్లో వచ్చి పరీక్షలు రాశారు. బస్సులు సమయానికి రాకపోవడంతో కొందరు అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోలేకపోయారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించవద్దనే నిబంధన మేరకు అధికారులు వీరిని పరీక్ష రాయడానికి అనుమతించలేదు. పరీక్షలు జరిగే ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ కిక్కిరిసిపోయి కనిపించాయి. ఒక్కసారిగా వేల మంది తరలిరావడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఆహార పదార్థాలు లభ్యం కాక ఇబ్బంది పడ్డారు. కలెక్టర్ సందర్శన కలెక్టర్ స్మితా సబర్వాల్ సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆంథోని పాఠశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, మండల పరిధిలోని ఎంఎన్ఆర్ కళాశాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. కరుణ హైస్కూల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తనిఖీ చేశారు. సమీకృత కలెక్టరేట్ ఆవరణలోని సెయింట్ ఆంథోనీ పాఠశాల కేంద్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్రెడ్డి తనిఖీ చేశారు.