excursion
-
జనరేషన్ జెడ్.. ఖర్చులో జెట్ స్పీడు
సాక్షి, అమరావతి: తరాలు మారుతున్నకొద్దీ అలవాట్లు, అభిరుచులు, అవసరాలు మారిపోతుంటాయి. కొత్త తరం కొంగొత్త ఆశలతో ముందుకు సాగిపోతుంటుంది. సమాజంలో వేగంగా వస్తున్న మార్పులు, అవకాశాలను అంతే వేగంతో అందిపుచ్చుకుంటుంది. ఆదాయమూ పెరుగుతోంది. చేతిలో డబ్బు ఆడుతున్నకొద్దీ పెట్టే ఖర్చూ పెరుగుతుంది. ఇప్పుడు ‘జనరేషన్ –జెడ్’ చేస్తున్న పని కూడా ఇదే. ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్.. ఇలా అన్ని రంగాల్లోనూ వీరు పెడుతున్న ఖర్చు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఖర్చు పెట్టడంలో ‘జెడ్’ తరాన్ని మించిన వారు లేరని అంతర్జాతీయ సంస్థలైన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ), స్నాప్చాట్ షోస్ చెబుతున్నాయి. ఖర్చు చేయడంలో మిలీనియల్స్ జనరేషన్ (1981–96 మధ్య పుట్టిన వారు)ను దాటుకొని జెనరేషన్–జెడ్ (1997–2012 మధ్య పుట్టిన వారు) దూసుకుపోతున్నట్లు ఈ సంస్థల సంయుక్త అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం భారత దేశ ప్రజలు ఏటా పెడుతున్న ఖర్చులో 43 శాతం జనరేషన్–జెడ్దే అని, వచ్చే పదేళ్లల్లో వీరు ఖర్చు 50 శాతం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జనరేషన్–జెడ్ ఏటా చేస్తున్న ఖర్చు అక్షరాలా రూ.74,70,000 కోట్లు. ఇది 2035 నాటికి రూ.1,66,00,000 కోట్లకు చేరుతుందని ఆ సర్వే అంచనా వేసింది. స్నాక్స్ నుంచి సెడాన్ కార్ల వరకు దేశ ప్రజలు పెడుతున్న ఖర్చులో ప్రతి రెండో రూపాయి జనరేషన్–జెడ్ నుంచే వస్తోంది. ప్రస్తుతం దేశ జనాభాలో 1997–2012 మధ్య పుట్టిన ‘జెడ్’ తరం జనాభా 37.7 కోట్లు. అమెరికా మొత్తం జనాభా కంటే మన దేశంలో వీరి సంఖ్యే ఎక్కువ. ప్రస్తుతం జనరేషన్ ‘జెడ్’లో 25 శాతం మంది (ప్రతి నలుగురిలో ఒకరు) మాత్రమే సంపాదించడం మొదలు పెట్టారని, ఇది 2035 నాటికి 47 శాతానికి (దాదాపు సగం మంది) చేరుతుందని సర్వే అంచనా వేసింది.విహారయాత్రలకే పెద్దపీట జెడ్–జనరేషన్ ప్రయాణాలు, విహారయాత్రలకే అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్లు సర్వే తెలిపింది. ఈ ఏడాది (2024 సంవత్సరం)లో విహార యాత్రల కోసం వీరు చేసే ఖర్చు రూ.6,62,500 కోట్ల నుంచి రూ.6,64,000 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ట్రావెల్స్ సంస్థలు వీరికి ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఆ తర్వాత అత్యధికంగా ఫ్యాషన్ –లైఫ్స్టైల్ వస్తువుల కొనుగోలుకు ఖర్చు పెడుతున్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ పానియాలతో పాటు రెస్టారెంట్లకూ వీరు భారీగానే ఆదాయాన్ని అందిస్తున్నట్లు సర్వేలో తేలింది. స్పష్టంగా చెప్పాలంటే.. ‘జెడ్’ తరానికి వంట చేయడమంటే మహా చిరాకు.సింపుల్గా ప్యాకేజ్డ్ ఫుడ్ లేదా బయట నుంచి తెప్పించుకొని ఆరగించడమే ఇష్టం. ఇలా వీరు ప్యాకేజ్డ్∙ఫుడ్ కోసం రూ.2,90,500 కోట్లు, ఆహారం కోసం రెస్టారెంట్లకు మరో రూ.2,90,500 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు బీసీజీ సర్వే పేర్కొంది. ఏమిటీ జనరేషన్లు..అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఒక జనరేషన్ అంటే 16 సంవత్సరాల కాలం. దీని ప్రకారం 1981–96 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్గా పేర్కొన్నారు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్ –జెడ్గా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి జన్మింస్తున్న వారు ఆల్ఫా జనరేషన్గా పరిగణిస్తున్నారు. ఈ తరాల మధ్య అంతరాలను అంతర్జాతీయంగా కొన్ని సంస్థలు అంచనా వేస్తుంటాయి. అందులో భాగంగానే బీసీజీ, స్నాప్ చాట్ షో సంస్థలు జనరేషన్–జెడ్ పై అధ్యయనం చేసి, వారి ఖర్చులపై నివేదిక ఇచ్చాయి. -
విషాదం మిగిల్చిన విహారం
మైదుకూరు/దువ్వూరు: విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు.. తెలుగుగంగ రిజర్వాయర్లో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలంలో జరిగింది. వివరాలు.. ప్రొద్దుటూరుకు చెందిన పఠాన్ రహంతుల్లా(23), ఎస్కే ముదాతీర్(22), వేంపల్లి షాహిద్(23) ఆదివారం సాయంత్రం మైదుకూరు మండల పరిధిలోని తెలుగు గంగ సబ్సిడరీ రిజర్వాయర్–1 వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న పార్కులో కొద్దిసేపు గడిపిన తర్వాత రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ఈత వేసేందుకని రిజర్వాయర్లోకి దిగి గల్లంతయ్యారు. రాత్రయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు.. ఫోన్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో సోమవారం ఉదయాన్నే వారి స్నేహితులను వాకబు చేశారు. ముగ్గురు యువకులూ విహార యాత్రకని తెలుగు గంగ రిజర్వాయర్కు వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలుసుకున్నారు. ఆ వెంటనే అక్కడికి వెళ్లగా.. రిజర్వాయర్ కట్టపై యువకుల దుస్తులు, చెప్పులు, సెల్ ఫోన్లు ఉండటంతో చుట్టుపక్కల వెతికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మైదుకూరు, దువ్వూరు పోలీసులు రిజర్వాయర్ వద్దకు చేరుకొని.. యువకుల కోసం గాలించారు. మైదుకూరు అర్బన్, రూరల్ సీఐలు మస్తాన్, శ్రీనాథ్రెడ్డి అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లను పిలిపించారు. వారు రిజర్వాయర్లో గాలించి సోమవారం మధ్యాహ్నానికి ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. రిజర్వాయర్ గేట్లకు సమీపంలో.. 30 అడుగుల లోతు ఉండటంతో యువకులు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. -
‘స్కిల్’ కాదు డొల్లే
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముసుగులో మాజీ సీఎం చంద్రబాబు చేసిన మోసాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2.50 లక్షల మందికి నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించినట్లు ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో డొల్లతనం బయటపడింది. ఎనిమిదో తరగతి చదివే పిల్లలకు సైతం నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చినట్లు కాగితాలపై చూపారు. పాఠశాల విద్యార్థులను విజ్ఞాన యాత్రల పేరిట సీమెన్స్కు తెలియకుండా ఆ కంపెనీ పేరిట ఏర్పాటు చేసిన సెంటర్లకు తరలించారు. బీసీ వెల్ఫేర్ పాఠశాలలకు చెందిన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు కంప్యూటర్–ఐటీ ఫండమెంటల్స్, ఎల్రక్టానిక్స్ ఆఫీస్, ఎలక్ట్రికల్ హోమ్ లాంటి కోర్సుల్లో వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చినట్లు రికార్డుల్లో చూపించారు. చంద్రబాబు ప్రభుత్వం వైదొలగేలోపు మొత్తం 1,21,654 మంది నైపుణ్య శిక్షణ తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో 70,000 మంది బీసీ వెల్ఫేర్ పాఠశాలలకు చెందిన విద్యార్థులే కావడం గమనార్హం. విహారయాత్రకు వచ్చిన ఒక్కో విద్యార్థికి రూ.200 ఇచ్చినట్లు సంతకాలు పెట్టించారు. వాటిని చూపిస్తూ వారందరికి అత్యున్నత నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు రికార్డులు తయారు చేశారు. ఇలా శిక్షణ పొందిన విద్యార్థులకు అధిక జీతాలు చెల్లించి తీసుకున్న కంపెనీలు ఏమిటో చంద్రబాబుకు బాకా ఊదుతున్న ఎల్లో మీడియానే చెప్పాలి!! ల్యాబ్లూ లేవు.. సీమెన్స్ పేరును తెరపైకి తీసుకొచ్చి రూ.3,300 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఘనంగా చెప్పుకున్నా వాస్తవంగా రూ.70 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్న విషయం ఫోరెన్సిక్ ఆడిట్లో బహిర్గతమయ్యింది. ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు, వాటికి అనుబంధంగా 34 టీఎస్డీఐలు (టెక్నికల్ స్కిల్స్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్స్) ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు కాగితాల్లో చూపించారు. పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు చూపించే ఫోటోలన్నీ ఉత్తిత్తి ల్యాబుల్లో తీసినవే. సీఎన్సీ మెకానిక్, టూ వీలర్, ఫోర్ వీలర్ ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, మెకానికల్ సర్వీస్ సెక్టార్, క్యాడ్ రామ్, ఐసీటీ, అగ్రి ఫార్మ్ మెకనైజేషన్ లాంటి కోర్సుల గురించి విద్యార్థులకు కంప్యూటర్ స్క్రీన్పై చూపించి శిక్షణ ముగించారు. ఒక్కో సీవోఈలో 15 ల్యాబ్లు, టీఎస్డీఐలో 10 ల్యాబ్లు ఏర్పాటు చేసినట్లు రికార్డులో చూపించారు. రాష్ట్రం వాటాగా తరలించిన రూ.371 కోట్లను కాజేసిన కేటుగాళ్లు ఒప్పందం ప్రకారం ల్యాబ్లను ఏర్పాటు చేయలేదు. ఈ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం 2021లో ఫోరెన్సిక్ ఆడిటింగ్కు ఆదేశించిన వెంటనే ఆగమేఘాలపై కొన్ని ల్యాబ్లను ఏర్పాటు చేయడం గమనార్హం. -
విహార యాత్రలో విషాదం
సాక్షి, పాల్వంచ: విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం కిన్నెరసాని కాల్వ వద్ద జరిగింది. ములకలపల్లి మండలం నాగారం యూపీఎస్కు చెందిన నలుగురు టీచర్లు 70మంది విద్యార్థులను కిన్నెరసాని కాల్వ వద్దకు విహార యాత్రకు తీసుకు వచ్చారు. అయితే ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులను ముత్యాలు, నాగమణిల కుమారుడు వారం రాజేష్(11), వల్లవరపు వెంకటకృష్ణ, సౌజన్య దంపతుల కుమారుడు విజన్(10)గా గుర్తించారు. -
పేషెంట్లు బెడ్పైనే ఉండక్కర్లేదు!
♦ మెడికల్ ట్యాక్సీ ద్వారా బయటకు తిప్పే సేవలు ♦ పార్టీలకు, విహారయాత్రలకూ తీసుకెళ్లే అవకాశం ♦ ఇవన్నీ అందిస్తున్న హైదరాబాదీ స్టార్టప్ ఈ–సహాయ్ ♦ ఈ నెలాఖరులోగా విశాఖపట్నంలో సేవల విస్తరణ ♦ డిసెంబర్లో బెంగళూరు, కొచ్చిన్, పుణె, చెన్నైలకు ♦ ‘స్టార్టప్ డైరీ’తో సంస్థ ఫౌండర్ హరి భరద్వాజ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో అక్కినేని నాగార్జున నటించిన ‘ఊపిరి’ సినిమా చూశారా? అందులో కుర్చీకే పరిమితమైన నాగార్జునను హీరో కార్తీ ఏకంగా విదేశాలకు తీసుకెళ్లి పారా గ్లైడింగ్ వంటి సాహస కార్యాలు చేయిస్తాడు. నాగార్జున మనసులో చోటు సంపాదించుకుంటాడు!!. నిజానికి ఇంట్లోనో, ఆసుపత్రిలోనో బెడ్కే పరిమితమైన పేషెంట్లు కుటుంబ కార్యక్రమాల్లో, చిన్న చిన్న ఫంక్షన్లలో నలుగురితో కలిసి తిరిగితేనో, లేదా ప్రకృతి అందాల నడుమ విహరిస్తేనో త్వరగా కోలుకుంటారని వైద్యులు చెబుతుంటారు. ఏదో సినిమా కాబట్టి అలాంటివి సాధ్యం కానీ.. మామూలుగా అయితే వారి ప్రయాణం, వైద్య సహాయం, మందుల సమయపాలన చూసుకోవటం ఇవన్నీ సాధ్యమా? అంటుంటారు చాలామంది. .. ఇదిగో సరిగ్గా దీన్నే వ్యాపార సూత్రంగా మార్చుకుంది హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న ఈ–సహాయ్! దేశంలోనే తొలిసారిగా మెడికల్ ట్యాక్సీ సేవలను ప్రారంభించిన సంస్థ ప్రారంభం, విస్తరణ ప్రణాళికల గురించి ఈసహాయ్ వ్యవస్థాపక సీఈఓ హరి భరద్వాజ్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ఈ సహాయ్ ప్రారంభానికి కంటే ముందు అమెజాన్, యాక్సెంచర్ కంపెనీల్లో పనిచేశా. అయితే అందరిలా నేను కూడా ఏదో ఒక వ్యాపారం చేద్దామనుకోలేదు. వినూత్నంగా ఉండటంతో పాటూ సామాజిక కోణంలోనూ ఉండాలని ఆలోచించా. వైద్య రంగంలో అయితే వ్యాపారంతో పాటూ సేవ కూడా చేసినట్టుంటుందని రూ.50 లక్షల పెట్టుబడితో గతేడాది సెప్టెంబర్లో ‘ఈసహాయ్.ఇన్’ సంస్థను ప్రారంభించా. వినూత్నంగా మెడికల్ ట్యాక్సీ సేవలు వేగనార్, ఈకో, ఇండికా వంటి హ్యాచ్బ్యాక్ వాహనాలను మెడికల్ ట్యాక్సీ సేవల కోసం వినియోగిస్తాం. వీటి ప్రత్యేకత ఏంటంటే.. వాహనంలోని సీట్లు 90 డిగ్రీల్లో తిరుగుతాయి. 10–15 అంగుళాలు బయటికి వస్తాయి. వీల్చెయిర్లా పడుకోవచ్చు కూడా. దీంతో పేషెంట్లకు వాహనంలోకి ఎక్కేందుకు, దిగేందుకు సులువుగా, సౌకర్యవంతంగా ఉంటుంది. కేవలం సీటింగ్ మాత్రమే కాదు.. పేషెంట్తో మెడికల్ అటెండర్, వైద్య పరికరాలు, మందులూ ఉంటాయి. వినూత్న, సౌకర్యవంతమైన సేవలుండటం వల్లే కాబోలు.. వృద్ధులు, గర్భవతులు, సర్జరీ పేషెంట్లు ఈ సేవలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రతి కి.మీ.కు రూ.8–10 చార్జీ ఉంటుంది. ప్రస్తుతం 6 మెడికల్ ట్యాక్సీలున్నాయి. 2 వారాల్లో మరో 10 వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నాం. ఏడాదిలో 2 వేల వాహనాలకు చేర్చాలన్నది లక్ష్యం. అంబులెన్స్, టెక్నాలజీ సేవలు కూడా.. ఈసహాయ్ ద్వారా మెడికల్ ట్యాక్సీ మాత్రమే కాకుండా మేం అంబులెన్స్లను అగ్రిగేట్ కూడా చేస్తున్నాం. దీన్లో స్థానిక డ్రైవర్లు తమ వాహనాలను నమోదు చేసుకోవాలి. అంబులెన్స్ బుకింగ్ ఆర్డర్ రాగానే దాన్ని స్థానికంగా అందుబాటులో ఉండే డ్రైవర్కు పంపిస్తాం. రోగిని సమయానికి ఆసుపత్రికి పంపించడంతో పాటూ జీపీఎస్ సహాయంతో అంబులెన్స్ను ట్రాక్ చేయవచ్చు. ప్రస్తుతం అంబులెన్స్ ఎక్కడుంది? ఎంత సమయంలో ఆసుపత్రికి చేరతాడు? వంటి అన్ని రకాల వివరాలను ఎప్పటికప్పుడు కస్టమర్లకు చేరవేస్తాం. ప్రస్తుతం 165 మంది అంబులెన్స్ డ్రైవర్లు నమోదయ్యారు. ఇక రవాణా నిర్వహణలో.. అంబులెన్స్ ఉన్న ఆసుపత్రులకు వాటి నిర్వహణ, సాంకేతిక అభివృద్ధి వంటి సేవలందిస్తాం. ప్రస్తుతం యశోద, ఆర్చన, సెంచురీ, కాంటినెంటల్, ఓమినీ, ఇండస్, శ్రీశ్రీ హోలిస్టిక్, శ్రీఖర, సురక్ష, అంకుర వంటి 35 ఆసుపత్రులతో ఒప్పందం చేసుకున్నాం. ఆయా విభాగాల్లో సేవలకు గాను 10–15 శాతం కమీషన్ తీసుకుంటాం. నెలకు రూ.10 లక్షల ఆదాయం..: ఇప్పటివరకు 20 వేల ఈసహాయ్ యాప్స్ డౌన్లోడ్ అయ్యాయి. నెలకు 600–700 వరకు ఆర్డర్లొస్తున్నాయి. ప్రతి నెలా రూ.10 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి విశాఖపట్నంలో ఈ–సహాయ్ సేవలను ప్రారంభించనున్నాం. డిసెంబర్ నాటికి కొచ్చిన్, పుణె, చెన్నై, బెంగళూరు నగరాలకు విస్తరించాలనేది మా లక్ష్యం. 3 నెలల్లో రూ.25–30 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం 24 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే మరో 100 మందిని నియమించుకోనున్నాం. ఏప్రిల్లో ఇండియా, అమెరికాలోని కొంత మంది స్నేహితులు బృందంగా కలిసి రూ.2 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు సీడ్ రౌండ్లో రూ.25–30 కోట్ల నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. బెంగళూరులోని పలు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. మరో 3 నెలల్లో డీల్ను క్లోజ్ చేస్తాం... అని హరి వివరించారు. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
రఫేల్ ఫైటర్జెట్లో అనిల్ అంబానీ విహారం
యలహంక (బెంగళూరు): ఏరో ఇండియా–17 వైమానిక ప్రదర్శనలో రెండో రోజైన బుధవారం రిలయన్స్ గ్రూప్(అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీ ఫ్రాన్స్లో తయారైన అత్యాధునిక ఫైటర్జెట్ రఫేల్లో విహరించారు. ఆ యుద్ధ విమానంలో సుమారు అర్ధగంటపాటు ఆకాశంలో దూసుకెళ్లారు. రఫేల్లో విహారం ప్రత్యేక అనుభూతిని కలిగించిందని అనిల్ చెప్పారు. -
విహారం... విషాదం
• పెన్నాలో ఇద్దరు గల్లంతు • మరో ఇద్దరిని కాపాడిన ఓ యువకుడు విహారం విషాదాన్ని నింపింది... సరదా కోసం ఈతకెళ్లిన వారు తిరిగిరాని లోకానికి వెళ్లారు... జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పెన్నాలో ఇద్దరు గల్లంతయ్యారు... చెన్నూరు పరిధిలోని నదిలో మొదట ముగ్గురు మునిగిపోగా, ఇద్దరిని ఓ యువకుడు కాపాడారు.. ఒకరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు... సిద్దవటం వద్ద నదిలో ఓ యువకుడు ఈత కొడుతూ మునిగిపోయాడు. కర్నూలు నుంచి వలస వచ్చి... చెన్నూరు: పొట్టకూటి కోసం వలస వచ్చి బేల్దారి పని చేసుకుంటూ జీవించే వారికి విహారం, విందు.. వేదన మిగిలించాయి. పెన్నా నదిలో అందరూ చూస్తుండగానే ముగ్గురు మునిగిపోగా.. ఇద్దరిని ఓ యువకుడు కాపాడగా, ఒకరు గల్లంతైన సంఘటన ఆదివారం చెన్నూరు సమీపంలోని కొండపేట వంతెన వద్ద చోటు చేసుకుంది. వారి బంధువులు, ఎస్ఐ వినోద్కుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నారుు. కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచగరి గ్రామానికి చెందిన వడ్డె రామయ్య కుమారుడు రాముడు అలియాస్ బజారి(25) బేల్దారి పని చేస్తూ జీవించే వాడు. అతని కుటుంబంతోపాటు అదే మండలానికి చెందిన కొందరు యువకులు కడప రవీంద్రనగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని బేల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నూరులోని ఏటిగడ్డ వీధిలో మస్తాన్ ఇంటి నిర్మాణాన్ని అదే మండలానికి చెందిన 12 మంది యువకులు ఇటీవల పూర్తి చేశారు. వారికి ఆదివారం మధ్యాహ్నం మస్తాన్ విందు ఏర్పాటు చేశాడు. విందు అయ్యాక అందరూ కలిసి సరదాగా పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వారిలో రాముడుతోపాటు రంగేష్, సురేష్ అనే యువకులు నది లోపలికి వెళ్లడంతో కొట్టుకుపోతుండగా.. అక్కడే ఉన్న సురేష్కుమార్ ఇద్దరిని కాపాడాడు. రాముడును కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. వేగంగా వస్తున్న జల ప్రవాహానికి మునిగిపోరుు గల్లంతయ్యాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, బందువులు సంఘటనా స్థలానికి చేరుకుకున్నారు. వారు తెలపడంతో పోలీసులు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో ఇప్పుడు సాధ్యం కాదని, సోమవారం జాలర్లను పిలిపించి గాలింపు చర్యలు తిరిగి చేపడతామని ఎస్ఐ వినోద్కుమార్ తెలిపారు. రోదిస్తున్న బంధువులు, స్నేహితులు గల్లంతైన రాముడుకి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోగా భార్య జానకి(22) ప్రస్తుతం గర్భవతి. ‘కూలి పనులు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చి మృత్యువాత పడ్డావా నాయనా’ అంటూ తల్లిదండ్రులు, అక్క, బంధువులు, స్నేహితులు నది వద్ద రోదించడం అందరిని కలిచి వేసింది. కడప నుంచి వచ్చి.. సిద్దవటం: సిద్దవటం వద్ద ప్రవహిస్తున్న పెన్నాలో ఓ యువకుడు గల్లంతయ్యాడని ఎస్ఐ అరుణ్రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నారుు. కడప నగరంలోని ఇందిరా నగర్కు చెందిన వై.రామాంజనేయులు (22) ఆదివారం స్నేహితులతో కలిసి వచ్చి నదిలో ఈత కొట్టాడు. లోతుగా వున్న ప్రాంతంలోకి వెళ్లడంతో నీటిలో కొట్టుకు పోయాడు. ఈ సమాచారం తెలియడంతో పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. రామాంజనేయులు ఎక్కడా కన్పించలేదని ఎస్ఐ అన్నారు. -
విహారం..విషాదం
- పెన్నా నదిలో మునిగిన ముగ్గురు యువకులు - ఇద్దరిని కాపాడిన మరో యువకుడు - ఒకరు గల్లంతు - గల్లంతైన వ్యక్తి ఆదోని వాసి చెన్నూరు : విహారం విషాదం నింపింది. పొట్టకూటి కోసం వలస వచ్చి బేల్దారి పని చేసుకుంటూ జీవించే వారికి విందు.. వేదనను మిగిల్చింది. పెన్నా నదిలో అందరూ చూస్తుండగానే ముగ్గురు మునిగిపోగా.. ఇద్దరిని ఓ యువకుడు కాపాడాడు. ఒకరు గల్లంతైన సంఘటన ఆదివారం చెన్నూరు సమీపంలోని కొండపేట వంతెన వద్ద చోటు చేసుకొంది. వారి బంధువులు, ఎస్ఐ వినోద్కుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచగేరి గ్రామానికి చెందిన వడ్డె రామయ్య కుమారుడు రాముడు అలియాస్ బజారి(25) బేల్దారి పని చేస్తూ జీవించే వాడు. అతని కుటుంబంతోపాటు అదే మండలానికి చెందిన కొందరు యువకులు కడప రవీంద్రనగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని బేల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నూరులోని ఏటిగడ్డ వీధిలో మస్తాన్ ఇంటి నిర్మాణాన్ని అదే మండలానికి చెందిన 12 మంది యువకులు ఇటీవల పూర్తి చేశారు. వారికి ఆదివారం మధ్యాహ్నం మస్తాన్ విందు ఏర్పాటు చేశాడు. విందు అయ్యాక అందరూ కలిసి సరదాగా పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వారిలో రాముడుతోపాటు రంగేష్, సురేష్ అనే యువకులు నది లోపలికి వెళ్లడంతో కొట్టుకుపోతుండగా.. అక్కడే ఉన్న సురేష్కుమార్ ఇద్దరిని కాపాడాడు. రాముడును కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. వేగంగా వస్తున్న జల ప్రవాహానికి మునిగిపోయి గల్లంతయ్యాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, బందువులు సంఘటనా స్థలానికి చేరుకుకున్నారు. వారు తెలపడంతో పోలీసులు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో ఇప్పుడు సాధ్యం కాదని, సోమవారం జాలర్లను పిలిపించి గాలింపు చర్యలు తిరిగి చేపడతామని ఎస్ఐ వినోద్కుమార్ తెలిపారు. రోదిస్తున్న బంధువులు, స్నేహితులు గల్లంతైన రాముడుకి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోగా భార్య జానకి(22) ప్రస్తుతం గర్భవతి. ‘కూలి పనులు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చి మృత్యువాత పడ్డావా నాయనా’ అంటూ తల్లిదండ్రులు, అక్క, బంధువులు, స్నేహితులు నది వద్ద రోదించడం అందరిని కలిచి వేసింది. -
విహారయాత్రలో విషాదం
జలపాతంలో ఈతకు దిగి యువకుడి గల్లంతు గల్లంతైన యువకుడుది విశాఖపట్నంలోని ఆరిలోవ ప్రాంతం సరియా వద్దకు విహారయాత్రకు వచ్చిన ఆరుగురు స్నేహితులు వీరంతా విశాఖ రైల్వే స్టేషన్ ఫుడ్ కౌంటర్లో సప్లయర్లు దేవరాపల్లి: స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేందుకు సరియా జలపాతం వద్దకు విహార యాత్రకు వచ్చిన ఓ యువకుడు గురువారం సాయంత్రం ఈతకు దిగి గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి వచ్చిన ఆరిలోవకు చెందిన మురళీ(30) ఈత కొడుతూ ఊబిలో చిక్కుకున్నాడు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లోని జనహరి ఫుడ్స సెంటర్లో ఫుడ్ సప్లయర్లుగా పని చేస్తున్న ఆరుగురు స్నేహితులు గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మూడు బైకులపై దేవరాపల్లి మండలం వాలాబుకు, అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీకి సరిహద్దులో ఉన్న సరియా జలపాతం వద్దకు వచ్చారు. విశాఖట్నంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆదపాక సారుు, ఆవాల అనిల్ కుమార్, చన్న సారుుకుమార్, పొట్నూరు నరసింగ్, వేంపాడ ప్రసాద్తో పాటు ఆరిలోవకు చెందిన మురళీ కూడా వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో వెంట తెచ్చుకున్న భోజనాలు చేసి, కొద్ది సేపు జలపాతం పరిసరాలలో ఉల్లాసంగా గడిపారు. అనంతరం వీరంతా కలిసి సరదాగా ఈతకొట్టారు. అందరూ చూస్తుండగా మురళీ నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసిన ఫలించలేదు. చీకటి పడే వరకు మురళీ కోసం స్థానికుల సహాయంతో గాలించిన ఆచూకీ లభించక పోవడంతో మిగిలిన యువకులంతా దేవరాపల్లి పోలీస్ స్టేషన్ను గురువారం సాయంత్రం సంప్రదించారు. జలపాతం అనంతగిరి మండలం పరిధిలోకి రావడంతో అనంతగిరి పోలీసులకు సమాచారం అందించారు. గల్లంతైన మురళీకి ఏడాదిన్నర క్రితం వివాహం కాగా, బాబు కూడా ఉన్నట్టు తెలిసింది. కళ్లు ముందే తమ స్నేహితుడు గల్లంతవుతున్నా రక్షించుకోలేక మిగిలినవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
విహారయాత్రలో విషాదం
ఏకేబీఆర్ మెయిన్ కెనాల్లో పడి వ్యక్తి మృతి – పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఘటన పెద్దఅడిశర్లపల్లి విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. తన బంధువులతో కలిసి ఆదివారం ఏకేబీఆర్ (అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు) విహారయాత్రకు వచ్చిన వ్యక్తి మెయిన్ కెనాల్లో పడి తినిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హైదరాబాద్ మలక్పేటకు చెందిన మహమ్మద్ ఖలీల్ఖాన్ (41) స్థానికంగా ఉంటూ వ్యాపారం నిర్వహించేవాడు. మహమ్మద్ ఖలీల్ఖాన్ తన సోదరులతో కలిసి సెలవు దినం కావడంతో పీఏపల్లి మండలంలోని ఏకేబీఆర్ (అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు) విహారయాత్రకు వచ్చారు. ఖలీల్ఖాన్ తన సోదరులతో కలిసి భోజనం చేసి స్నానం చేయడానికి ఏఎమ్మార్పీ మెయిన్ కాల్వలోకి దిగాడు. కాగా ఖలీల్ఖాన్ నీటిలో ఈత కొడుతూ అలిపిరి వచ్చి ఊపిరాడక మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే కాల్వలోకి దూకి బయటకు తీయగా అప్పటికే ఖలీల్ఖాన్ మృతిచెందాడు. సమాచారం తెలుసుకుని గుడిపల్లి ఎస్ఐ భోజ్యానాయక్, హెడ్కానిస్టేబుళ్లు మహమూద్, సిబ్బంది వెంకట్, జాని, హోంగార్డు సైదులుతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
యూకే విహారయాత్ర 10 శాతం చౌక
బ్రెగ్జిట్ ఫలితాల ప్రభావంతో పౌండ్ విలువ క్షీణించడం వల్లే... విహార యాత్ర కోసం యూకే వెళ్లాలనుకుంటున్నారా? అయితే తక్షణమే ప్యాకేజీ సొమ్మును పూర్తిగా చెల్లించేయండి. ఎందుకంటే... బ్రెగ్జిట్ ఫలితాల ప్రభావంతో రూపాయితో పౌండ్ మారకం విలువ 10 శాతం క్షీణించడంతో మీ విహార యాత్ర ఖర్చు ఆ మేరకు తగ్గనుంది. పౌండ్ విలువలో క్షీణత వల్ల ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఐర్లాండ్లకు హాలిడే ట్రిప్పులు 10 శాతం చౌకగా లభించనున్నాయి. ఇప్పటికే హాలిడే ప్యాకేజీలు బుక్ చేసుకొని బస, స్థానిక రవాణా, పర్యాటక ప్రదేశాల సందర్శన వంటి వాటికి ఇంకా సొమ్ము చెల్లించని వారూ చార్జీల్లో 10 శాతం మేర లబ్ధి పొందొచ్చు. ఉదాహరణకు ఏడు రోజుల యూకే ప్యాకేజీ (రూ. 1.1 లక్షలు)పై రూ. 5 వేల నుంచి రూ. 6 వేలు, 10 రోజుల ప్యాకేజీ (రూ. 1.44 లక్షలు)పై రూ. 7 వేల నుంచి రూ. 8 వేలు తగ్గనుంది. -
విషాదం నింపిన విహార యాత్ర
- ఏలూరు సమీపంలో లారీని ఢీకొట్టిన వ్యాన్ - హైదరాబాద్కు చెందిన న్యాయవాది దంపతుల దుర్మరణం.. 15 మందికి గాయాలు ఏలూరు అర్బన్: విహార యాత్ర విషాదంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం దెందులూరు చెక్పోస్ట్ వద్ద శనివారం వేకువజామున చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్లో స్థిరపడిన న్యాయవాది కందుకూరి హరిప్రసాద్ (49), ఆయన భార్య గీతాభవాని (42) అక్కడిక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్లో న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డ వరంగల్ జిల్లా జనగాంకి చెందిన కందుకూరి హరిప్రసాద్ తల్లి సావిత్రమ్మ, భార్య గీతాభవాని, కుమారులు హరిదీప్, రాహుల్ కలిసి శుక్రవారం హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి జనగాంలో ఉంటున్న ఆయన తమ్ముడు నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి నాగేశ్వరరావు, ఆయన భార్య విమల, వారి ముగ్గురు కుమార్తెలు కీర్తి, నిధి, సిరి, మేనమామ షణ్ముఖాచారి, కుమారుడు ఎం.శ్రీకాంత్, భార్య శ్రీలత, వారి పిల్లలు సూర్యతేజ, శివరామ్తేజ, వారి సమీప బంధువు అరుణతో కలిసి శుక్రవారం రాత్రి టాటా వింగర్ వ్యాన్లో అరకు లోయ బయలుదేరారు. శనివారం వేకువజామున ఏలూరులో దెందులూరులోని చెక్ పోస్ట్ ప్రాంతంలో ముందు వెళుతున్న లారీని వ్యాన్ డ్రైవర్ ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వ్యాన్ అదుపుతప్పి లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న హరిప్రసాద్, ఆయన భార్య గీతా భవాని అక్కడికక్కడే మృత్యువాతపడగా, డ్రైవర్ గుడ్లపల్లి నరేష్ సహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. -
స్వర్గం నుంచి దిగి వచ్చి'నది'!
విహారం ‘భవబంధాలకు దూరంగా ఏకాంతంగా తపస్సు చేసుకుంటున్న మునిపుంగవుడిలా ఉంటుంది’ ‘ప్రకృతిలో చలనమే కాదు చిత్రలేఖనం కూడా అంతర్లీనమై ఉంది అని చెప్పడానికి ఇదో ఉదాహరణ’ ‘ఇంద్రధనసులు ఆకాశంలోనే కాదు...నదిలో కూడా కనిపిస్తాయి’ ‘స్వర్గం నుంచి దిగి వచ్చిన నది’ ‘కానో క్రిస్టేల్స్’ నది గురించి ఇలా భావుకతతోనో, కవితాత్మకంగానో చెబుతుంటారు పర్యాటకులు. ‘మోస్ట్ బ్యూటిఫుల్ రివర్ ఇన్ ది వరల్డ్’గా ప్రఖ్యాతిగాంచిన ‘కానో క్రిస్టేల్స్’ నది కొలంబియాలోని సెరనియ దె లా మకరెనా పర్వత శ్రేణుల మధ్యలో ఉంది. జూలై, నవంబర్ మాసాల మధ్యలో ప్రకృతిదేవత తన కుంచెతో చిత్రాలు గీస్తుందని, దాని ఫలితమే కానో క్రిస్టేల్స్ నది, దాని పరిసర ప్రాంతాల అందమనే నమ్మకం ఉంది. ఆకుపచ్చ, పసుపుపచ్చ, నీలి, ఎరుపు, నలుపు వర్ణాలతో ఈ నది పంచరంగుల నది అని పేరు తెచ్చుకుంది. ఈ ప్రకృతి వర్ణమాల అనేది యాదృచ్ఛికంగా ఏర్పడింది కాదని, ఆ రంగుల వెనుక పరమార్థం ఉందని తాత్వికకోణాన్ని జోడించేవారు కూడా ఉన్నారు. పసుపు రంగు....ఆనందం, ఆశావాదదృక్పథాన్ని, ఆకుపచ్చ రంగు...సమన్వయ శక్తి, సామరస్య దృష్టిని, నీలిరంగు... నిజాయితీ, నమ్మకాలను, నలుపురంగు... శక్తి, నియంత్రణను,ఎరుపు రంగు... నాయకత్వ లక్షణాలు, అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందనే తాత్విక అర్థం ఉంది. ప్రకృతి ఆరాధకులు అందమైన ప్రకృతి చిత్రాలను మాత్రమే చూసి ఆనందించగా, కొందరు మాత్రం ఈ పంచరంగుల నదిని వీక్షించడం వల్ల ఆ రంగులలోని సానుకూల అంశాలు, శక్తులు తమలో వచ్చి చేరుతాయని విశ్వసిస్తారు. నది గర్భంలో పెరిగే మకెరేనియ క్లవిగేరాలాంటి తాజా నీటి మొక్కల వల్లే నది పంచరంగుల్లో కనిపిస్తుంది. సూర్యకాంతి ప్రకారం కూడా నదీ రంగుల అందాలు మారుతుంటాయి. కొలంబియన్ జర్నలిస్ట్, అన్వేషకుడు ఆండ్రూ హుర్టాడో గార్షియా ఈ పంచరంగుల నది సౌందర్యాన్ని గురించి ప్రపంచానికి మొట్ట మొదటిసారిగా పరిచయం చేశాడు. పర్యావరణ రక్షణ చర్యలు, ఉగ్రవాద కార్యకలాపాల దృష్ట్యా ఈ నది 2009 వరకు ‘నో-గో ఏరియా’గా ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంతం కొలంబియా మిలటరీ అధీనంలో ఉంది. ఈ నది పుణ్యమా అని లా మకరెనా నేషనల్ అండ్ ఎకోలాజికల్ రిజర్వ్ పార్క్ కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ నది దగ్గరికి వెళ్లడానికి రోడ్డు మార్గం లేదు. చిన్నదైన లా మకరెనా విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి నడిచికాని, గుర్రం మీదకాని నది సమీపానికి చేరాల్సి ఉంటుంది. ‘‘ఇది నదే అని నమ్మడానికి చాలాసేపు పడుతుంది’’ అంటాడు ఒక పర్యాటకుడు ఆశ్చర్యంగా. రంగుల విచిత్రాలు మాత్రమే కాదు...ప్రాచీన శిలల గంభీర మౌనం, సరిగమల జలపాత సౌందర్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ‘‘అక్కడి నుంచి బయటి రాగానే ఒక అందమైన కల నుంచి మేలుకున్నట్లుగా అనిపిస్తుంది తప్ప వాస్తవదృశ్యాలను దర్శించినట్లు అనిపించదు. మడుగులు, గుహలు నాటకీయంగా కనిపిస్తాయి’’ అని కానో క్రిస్టేల్స్ గురించి చెబుతాడు బ్రిటన్ రచయిత టామ్ హాల్. రకరకాల కారణాల రీత్యా ‘మీ భద్రతకు మా పూచీ లేదు’ అని ఈ ప్రాంతాన్ని కొలంబియా ప్రభుత్వం ‘రెడ్ జోన్’గా ప్రకటించింది. అయినప్పటికీ ఈ పంచరంగుల నదిని చూడడానికి పర్యాటకులు ఉత్సాహపడుతూనే ఉన్నారు. అక్కడి ఊహలతో గుసగుసలాడుతూనే ఉన్నారు. -
అదృష్ట ఆలయం!
విహారం దేశాలకు రాజధాని ఉండడం తెలుసు, రాష్ట్రాలకు రాజధాని ఉండడం తెలుసు. మరి బొమ్మలకు రాజధాని ఉంటుందనే విషయం తెలుసా? టకసాకి సిటీ గురించి తెలిసినవాళ్లు ‘ఉంటుంది’ అంటారు. జపాన్లోని క్యోటోకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న టకసాకీని ‘దరుమా బొమ్మల రాజధాని’ అని పిలుస్తారు. ఈ సిటీలో ఉన్న షోరింజన్ దరుమా ఆలయంలో దరుమ బొమ్మలను ఉంచితే ‘అదృష్టం’ వరిస్తుందనే బలమైన నమ్మకం ఉంది. ఈ నమ్మకం నిన్నా మొన్నటిది కాదు... కొన్ని శతాబ్దాల నాటిది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు రకరకాల ఆకారాల్లో ఉన్న దరుమా బొమ్మలను ఈ ఆలయంలో పెడతారు. జపాన్ సంస్కృతిలో బొమ్మలు వినోదానికి మాత్రమే కాదు... రకరకాల సెంటిమెంట్లకు ప్రాముఖ్యం పొందాయి. వీటిలో ముఖ్యమైనవి... కోకేషి, హకట, దరుమా బొమ్మలు. చెక్కతో తయారు చేసిన కోకెషి, మట్టితో తయారుచేసిన హకటల కంటే ఎరుపురంగు దరుమా బొమ్మలపై ఎక్కువ సెంటిమెంట్ ఉంది. ఈ బొమ్మలపై తమ కోరికను రాయడం ఆనవాయితీగా వస్తుంది. ఒకవేళ కోరిక ఫలిస్తే మరో బొమ్మను కూడా ఇదే ఆలయంలో పెట్టాల్సి ఉంటుంది. సంవత్సరాంతంలో ఇలా పోగైన బొమ్మలను గుట్టలుగా పేర్చి కాల్చి వేస్తారు. కాల్చే ముందు ఆ బొమ్మలకు కృతజ్ఞత తెలియజేస్తారు. ఈ తంతుని ‘దరుమ క్యో’ అంటారు. టకసాకిలో ఇతర పర్యాటక ఆకర్షణలు లేకపోలేదు. 1597లో నిర్మించిన టకసాకి క్యాజిల్ చరిత్రను కళ్ల ముందు ఉంచుతుంది. టకసాకి స్టేషన్ నుంచి 90 నిమిషాలు ప్రయాణిస్తే హరున సరస్సు కనిపిస్తుంది. దీన్ని ఆనుకొని ఉంటుంది మౌంట్ హరున. ఆ సరస్సు, ఈ పర్వతాల సౌందర్యం ఒక ఛాయా చిత్రాన్ని తలపి స్తుంది. జపాన్ చక్రవర్తి యోమై సమాధిని కూడా ఎక్కువ మంది సందర్శిస్తారు. మినోవా క్యాజిల్, ‘ద మ్యూజియం ఆఫ్ మోడ్రన్ ఆర్ట్’... మొదలైనవి కూడా పర్యాటక ప్రాముఖ్యాన్ని సంతరించు కున్నప్పటికీ వీటన్నికంటే పర్యాటకులు షోరింజన్ దరుమా ఆలయానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. దరుమా బొమ్మలను ‘ధర్మ బొమ్మలు’ అని కూడా పిలుస్తారు. ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి బోధిధర్మ చెప్పిన సిద్ధాంతాలకు, మనుషులు నమ్మే అదృష్టానికి ఈ బొమ్మలు ప్రాతినిధ్యం వహిస్తాయని చెబుతారు. ఈ బొమ్మలు బోధిధర్మ ముఖాన్ని పోలి ఉంటాయి. బోధిధర్మ తొమ్మిదేళ్ల పాటు ఒక చెట్టు కింద ధ్యానం చేశాడని, నిద్ర రాకుండా కనురెప్పలను కోసుకున్నాడని... ఇలా రకరకాల గాథలు ప్రచారంలో ఉన్నాయి. బోధిధర్మ బొమ్మలకు, అదృష్టానికి ఉన్న సంబంధం గురించి వివరించే ప్రత్యేక కథలు లేనప్పటికీ... బోధిధర్మ పేరు మీద బొమ్మను పెడితే అదృష్టం వరిస్తుందనే నమ్మకం పెరిగిపోయింది. కొందరైతే అదృష్ట దురదృష్టాల గురించి చెప్పిన జెన్ కథలను కూడా ప్రస్తావిస్తుంటారు. ఉదా: ఒక రైతు దగ్గర ఒక బలహీనమైన గుర్రమొకటి ఉండేది. ఒకరోజు దాన్ని చూసి జాలి పడిన రైతు దానికి స్వేచ్ఛను ఇస్తూ అడవిలో వదిలి పెట్డాడు. ‘‘ఉన్న ఒక్క గుర్రాన్నీ వదులు కున్నావు... నీలాంటి దురదృష్టవంతుణ్ని మేం చూడలేదు’’ అన్నారు పొరుగువారు. అడవిలోకి వెళ్లిన గుర్రం వారం రోజుల తరువాత వెనక్కి వచ్చింది. వస్తూ వస్తూ తనతో పాటు పన్నెండు గట్టి గుర్రాలను తీసుకువచ్చింది. ‘‘నీలాంటి అదృష్టవం తుడు లేరు’’ అన్నారు. ఆ గుర్రాల్లో ఒక గుర్రం మీద స్వారీ చేయబోయి చేయి విరగొట్టుకున్నాడు రైతు కొడుకు. ‘దుర దృష్టం’ అన్నారు. ఆకస్మికంగా వచ్చిన యుద్దం కోసం రాజ్యంలోని యువకు లందరినీ సైన్యంలో చేర్చమని రాజు ఆజ్ఞాపించాడు. చేయి విరగడంతో రైతు కొడుక్కీ సైన్యంలో చేరే బాధ తప్పింది. ‘అదృష్టం’ అన్నారు పొరుగువాళ్లు. ఈ కథను ఉదహరిస్తూ ‘అదృష్ట దురదృష్టాలు అనేవి శాశ్వతం కానప్పుడు... అదృష్టం కోసం టకసాకికి వెళ్లడం దేనికి?’ అని ప్రశ్నించేవాళ్లు కూడా ఉన్నారు. వారి ప్రశ్నలు, వాదనలు అందులోని హేతువు సంగతి ఎలా ఉన్నా.. షోరింజన్ అలయా నికి వెళితే అదృష్టం వరిస్తుందన్న నమ్మకం పెరుగుతోందే తప్ప తరగట్లేదు. -
పునరుత్తేజ దర్శనం!
విహారం గతంలోనే పాతుకుపోవడం కంటే, భవిష్యత్ గురించి కలలు కనడం కంటే, వర్తమానం మీదే దృష్టిని కేంద్రీకరించమని చెబుతుంది బౌద్ధం. బౌద్ధాన్ని అభిమానించి ఆరాధించే ఆరిస్ట్ కోసిట్పిపాట్ కూడా అంతే. థాయిలాండ్లోని చైయింగ్రాయి ప్రావిన్స్లో శిథిలావస్థలో ఉన్న ప్రాచీనమైన వాట్ రోంగ్ ఖున్ బౌద్ధ ఆలయాన్ని చూసినప్పుడు... ఆయన హృదయం కదిలిపోయింది. ‘మళ్లీ ఈ బౌద్ధ ఆలయంలో కళ కనిపించాలి’ అనుకున్నాడు. ‘ఈ ఆలయానికి ఏమైంది?’ అని నిట్టూరుస్తూ కూర్చోలేదు. ‘ఇలా చేయాలి... అలా చేయాలి’ అని కలలు కనలేదు. వర్తమానంలోనే ఉన్నాడు. వర్తమానం గురించే ఆలోచించాడు. తన వంతుగా ఎంత చేయగలను, ఏమి చేయలగలను? అంటూ స్పష్టమైన అంచనా వేసుకున్నాడు. ఆలయ పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా తానే భరించాలని నిర్ణయించుకున్నాడు. ‘కొందరు ప్రయాణమే మొదలు పెట్టరు. కొందరు మజిలీ చేరుకోకుండానే ప్రయాణాన్ని అర్ధంతరంగా ఆపేస్తారు’ అంటూ బౌద్ధం చెప్పిన సూక్తిని మరోసారి గుర్తు చేసుకున్నాడు కోసిట్పిపాట్. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, స్వయంగా తానే డిజైన్ చేసి మరీ ఈ ఆలయాన్ని నిర్మించాడు కోసిట్పిపాట్. ‘వైట్ టెంపుల్’ పేరుతో ప్రసిద్ధమైన ఈ ఆలయం ఆవరణలో మెడిటేషన్ హాల్, ఆర్ట్ గాల్యరీ, బౌద్ధ సన్యాసుల క్వార్టర్స్తో సహా తొమ్మిది భవంతులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులలో కొందరు నిర్మాణ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వస్తారు. కొందరు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి వస్తారు. కొందరు బౌద్ధాన్ని గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి వస్తారు. ఇదంతా ఒక ఎత్తయితే... నమ్మకాల పరంగా కూడా ఈ వైట్ టెంపుల్కు ప్రాముఖ్యత ఉంది. ఆలయ ఆవరణలో ఒక చిన్న సరస్సు ముందు వందల సంఖ్యలో చేతుల శిల్పాలు కనిపిస్తాయి. మనిషిలోని అంతులేని కోరికలకు ఈ చేతులు ప్రతీకలు. ‘కోరికలే దుఃఖానికి మూలం’ అని బౌద్ధం చెబుతుంది కదా! అలా ఒక చిన్న సరస్సుపై ఉన్న బ్రిడ్జి మీది నుంచి నడిచి వెళితే... మనలోని దురాశ, స్వార్థం, అహంకారం అన్నీ దూరం అవుతాయని, తద్వారా శాంతి చేకూరుతుందని ఒక నమ్మకం. అలాగే బ్రిడ్జి దాటగానే కనిపించే కిన్నారి విగ్రహాన్ని దర్శించడాన్ని ఎంతో శుభసూచకంగా భావిస్తారు. బౌద్ధపురాణంలో ఈ కిన్నారి ప్రస్తావన కనిపిస్తుంది. మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు వారిని రక్షించడానికి సగం మనిషి, సగం పక్షి రూపంలో ఉన్న కిన్నారి హిమాలయాల నుంచి వస్తుందని ఒక నమ్మకం. ఇక్కడ ఉన్న గోల్డెన్ బిల్డింగ్ను దర్శించడం కూడా ఒక అందమైన కట్టడాన్ని దర్శించడం కాదు. ఆ భవనం నుంచి ఎన్నో తాత్విక విషయాలు మనసుకు అందుతుంటాయి. మనిషి జ్ఞానం కోసం కాకుండా ధనం, కోరికలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్న వైనాన్ని ఈ భవంతి గుర్తుకు తెస్తూ భౌతిక సుఖాల వెంట పరుగులు తీయవద్దని హితబోధ చేస్తుంది. ఇక్కడ కనిపించే అద్దాలు మన ఆత్మదర్శనాన్ని, పుర్రె, రాక్షసుడి తల... మొదలైనవి మనిషికి ఎదురయ్యే సమస్యలను, కష్టాలను ప్రతీకాత్మకంగా చెబుతుంటాయి. కేవలం బౌద్ధ పురాణ ప్రతీకలు మాత్రమే కాదు... మైకేల్ జాక్సన్ నుంచి హ్యారీ పాటర్ వరకు ఎన్నో చిత్రాలు దర్శనమిస్తాయి. మనం ఏ దిశగా ప్రయాణిస్తున్నాం అనేది ఇవి ప్రతీకాత్మకంగా చెబుతాయట! థాయిలాండ్లో ఉన్న 33,000 బౌద్ధ ఆలయాల్లో ఈ వైట్ టైంపుల్ కూడా ఒకటి కావచ్చు. అయితే ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడితే... నోరు మౌనంగా ఉండొచ్చేమో గానీ... మది బౌద్ధం వెలుగులో విరామమెరుగక ప్రయాణిస్తూనే ఉంటుంది! -
పసుపు పచ్చని రోడ్డు తోడుంటే...
విహారం ‘‘అక్కడ ఏయే ప్రదేశాలు చూసి వచ్చారు?’’ అని ఒకప్పుడు నెదర్లాండ్స్కు వెళ్లి వచ్చిన పర్యాటకులను అడిగితే.... వైబ్రెంట్ క్యాపిటల్ ‘ఆమ్స్టర్డమ్’ గురించి... అక్కడ ఉన్న గొప్ప చారిత్రక ఆర్ట్ గ్యాలరీలు, మ్యూజియమ్ల గురించి చెప్పేవారు. అంతేనా? టులిప్ పువ్వుల గురించి కూడా. టులిప్ పుష్పాలను చూడాలంటే నెదర్లాండ్సలోనే చూడాలి అంటుంటారు. ‘ద గార్డెన్ ఆఫ్ యూరప్’గా పేరున్న లిస్సే నగరంలోని కెకెన్హాప్ గార్డెన్ గురించి మాత్రమే కాదు... హాగే నేషనల్ పార్క్ గురించి కూడా ప్రత్యేకంగా చెబుతుం టారు. 13,800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి స్కీడామ్ మాటేమిటి! అసలింతకీ అదేమిటి అంటారా? ‘బీద నగరం’ అంటే చప్పున గుర్తుపడతారేమో! నెదర్లాండ్సలోని స్కీడామ్ నగరంలో చారిత్రాత్మకమైన కాలువలు, ప్రపంచం లోనే ఎత్తై గాలిమరలు తదితర ఆకర్షణలు ఉన్నప్పటికీ... పర్యాటకుల దృష్టిలోకి ఈ నగరం ఎప్పడూ వెళ్లలేదు. కానీ ఇప్పుడు మాత్రం నెదర్లాండ్సకు వచ్చే పర్యాటకులు స్కీడామ్ గురించి తప్పని సరిగా ఆరా తీస్తున్నారు. దీనికి కారణం.... ఎల్లో బ్రిక్ రోడ్డు! స్కీడామ్లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ ఎల్లో రోడ్ రూపు దిద్దుకుంది. పసుపురంగు సంతోషానికి, సేఫ్టీకి, సక్సెస్కి చిహ్నాలుగా అక్కడ భావిస్తారట. అందువల్లే ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తే... పనిలో విజయం సిద్ధిస్తుందని, ఐశ్వర్యం ఇంటి తలుపు తడుతుందని బలంగా నమ్ముతారు స్కీడామ్ వాసులు. ఇది ఎంత వరకు నిజమో తెలియదుగానీ ‘ఎల్లో బ్రిక్ రోడ్డు’ పుణ్యమా అని ఎవరూ పట్టించు కోని స్కీడామ్పై నేడు పర్యాటకులు అమితాసక్తి కనబరుస్తున్నారు. ‘‘ఎప్పుడూ మా నగరం ముఖం చూడనివాళ్లు కూడా ఇక్కడికి పదే పదే వస్తూండటం నాకైతే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’’ అంటున్నాడు స్కీడామ్ నివాసి రోనాల్డ్. ‘‘నెదర్లాండ్సలో ఉన్నప్పుడు ఒక మిత్రుడు ఈ స్కీడామ్ గురించి చెప్పాడు. ఆసక్తితో అక్కడికి వెళ్లాను. నా ప్రేమ ఫలించాలని మనసులో అనుకుంటూ ఎల్లో రోడ్డు మీద ప్రయాణిం చాను. ఏదో సరదా కోసం చేసిన పని ఇది. కానీ చిత్రమేమిటంటే కొద్ది కాలంలోనే నేను ప్రేమించిన అమ్మాయితో నాకు పెళ్లి జరిగిపోయింది’’ అంటున్నాడు యువ ఆస్ట్రేలియన్ ఇంజినీర్ హ్యారిసన్. ‘ఎల్లో బ్రిక్ రోడ్డు మీద ప్రయాణిం చడం వల్ల మంచి జరుగుతుంది’ అనే ప్రచారాన్ని ఖండిస్తున్నవారు కూడా లేక పోలేదు. అయితే వారి ఖండన మండనల మాట ఎలా ఉన్నా....‘ఇదేదో వింత రోడ్డు’ అనుకునేవాళ్లు, ‘ఒక ప్రయత్నం చేద్దాం’ అనుకునేవాళ్లు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. ఈ పసుపు పచ్చని రోడ్డు మీద ప్రయాణించి తమ సరదాను తీర్చుకుంటున్నారు. అమెరికన్ రచయిత ఎల్.ఫ్రాంక్ బామ్ రాసిన ‘ద వండర్ఫుల్ విజార్డ్ ఆఫ్ ఓజ్’ నవల చాలా ప్రాచుర్యం పొందింది. 1900 సంవత్సరంలో విడుదలైన ఈ పుస్తకం పాఠక ఆదరణ చూరగొనడమే కాదు... అమెరికన్ పాపులర్ కల్చర్లో భాగమై పోయింది. ఈ నవల ఆధారంగా ఇదే పేరుతో 1939లో హాలీవుడ్లో కామెడీ-డ్రామా ఫాంటసీ సినిమా రూపుదిద్దుకుంది. ‘ద విజార్డ్’లో ఎల్లో బ్రిక్ రోడ్డు ఒక ముఖ్య ఆకర్షణ. కాలక్రమంలో ఈ రోడ్డు నవలలో నుంచి వాస్తవ ప్రపంచంలోకి వచ్చింది. రెస్టారెంట్ల నుంచి ప్రచురణ సంస్థల వరకు ‘ఎల్లో బ్రిక్ రోడ్’ పేరును వాడుకున్నాయి. స్కీడామ్లోని పసుపు పచ్చని రోడ్డుకు ‘ఎల్లో బ్రిక్ రోడ్’ అని పేరు పెట్టింది కూడా అందుకే అని చెబుతుంటారు. -
విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు క్షేమం
ఆదిలాబాద్ : విహార యాత్రకు వెళ్లిన తమ పిల్లల ఆచూకీ లభ్యం కావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని ఓ ప్రయివేట్ స్కూలుకు చెందిన 52మంది విద్యార్థులు ఈనెల 6వ తేదీన విహార యాత్రకు హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. కాగా గత రాత్రి విద్యార్థులు ఎక్కాల్సిన ట్రయిన్ మిస్ కావడంతో వారి ఆచూకీ కొద్దిసేపు తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు మంగళవారం స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ పిల్లల ఆచూకీ తెలిపాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఎట్టకేలకు తాము క్షేమం అంటూ విద్యార్థుల నుంచి ఫోన్ కాల్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. -
బడి గంట గణగణ
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం బడిబాట పట్టనున్న 10 లక్షల మంది విద్యార్థులు సర్కారు స్కూళ్లకు సమస్యలతో స్వాగతం సిటీబ్యూరో:ఇన్నాళ్లూ ఆటపాటలు, విహార యాత్రలతో గడిపిన విద్యార్థులు ఇక బడిబాట పట్టనున్నారు. దాదాపు ఒకటిన్నర నెలల తరువాత పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు. వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.జంట జిల్లాల్లో సుమారు ఐదువేల పాఠశాలలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ మేరకు తమ పిల్లలకు అవసరమైన పుస్తకాలు, బ్యాగ్ల వంటివి కొనుగోలులో తల్లిదండ్రులు తలమునకలవుతున్నారు. మరోవైపు పెరిగిన ఫీజులు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారుతున్నాయి. సమస్యల లోగిళ్లు... హైదరాబాద్ జిల్లాలో 712, రంగారెడ్డి జిల్లాలో రెండు వేలకుపైగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో అధిక శాతం పాఠశాలల్లో మరుగుదొడ్ల వంటి మౌలిక సౌకర్యాలు లేవు. మరికొన్ని చోట్ల ఈ సౌకర్యాలు ఉన్నా... నీరు లేకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. ఇంకొన్ని చోట్ల మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చాలా పాఠశాలలకు ప్రహరీలు లేవు. వేసవిలో ఈ పనులు చేపట్టాల్సి ఉండగా.. పూర్తి స్థాయిలో జరుగలేదు. ఇక తాగునీటికి నోచుకోని స్కూళ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. పారిశుద్ధ్యానిదీ అదే పరిస్థితి. ఈ క్రమంలో నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో అడుగు పెడుతున్న విద్యార్థులకు ఎప్పటిలాగానేసమస్యలు స్వాగతం పలకనున్నాయి. పూర్తిగా రాని పుస్తకాలు ఈ విద్యా సంవ త్సరానికి హైదరాబాద్ జిల్లాకు 12.33 లక్షలు, రంగారెడ్డి అర్బన్ మండలాలకు 10.39 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం. ప్రస్తుతం 19.85 లక్షల పుస్తకాలు మాత్రమే రామంతాపూర్లోని జిల్లా ప్రభుత్వ సేల్స్ మేనేజర్ కార్యాలయానికి చేరుకున్నాయి. గోదాం నుంచి ఇప్పటి వరకు 17.30 లక్షల పుస్తకాలను ఎంఆర్సీ కేంద్రాలకు తరలించారు. అక్కడి నుంచి దాదాపు అన్ని స్కూళ్లకు చేరాయని మండల విద్యా శాఖాధికారులు వెల్లడించారు. మరో 2.55 లక్షల పుస్తకాలు గోదాంలోనే మగ్గుతున్నాయి. అన్ని తరగతులకు సంబంధించినవి పూర్తి స్థాయిలో రాకపోవడంతో అక్కడే ఉంచేసినట్టు తెలుస్తోంది. అప్పటి వరకు విద్యార్థులు అరకొర పుస్తకాలతోనే కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి దాపురించింది. మిగిలిన పుస్తకాలు జిల్లాకు చేరుకోవడానికి మరో మూడు నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. మరింత ప్రణాళికాబద్ధంగా.. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నామని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు సోమిరెడ్డి, రమేష్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత పెంచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. పిల్లలు చదువుపై అధిక శ్రద్ధ పెట్టేలా కౌన్సెలింగ్ చేస్తామన్నారు. 90శాతానికి పైగా పుస్తకాలు బడులకు చేరాయని తెలుగు, ఉర్దూ మీడియానికి సంబంధించి మరికొన్ని రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వ రకు వచ్చిన పుస్తకాలను పాఠశాలలు పున:ప్రారంభం రోజునే విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు. మిగిలినవి మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని, రాగానే వాటినీ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. -
విషాద యాత్ర
విహార యాత్రకు వెళ్లి ఏడుగురు మృతి మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు మరో ఇద్దరు బంధువులు మహబూబ్నగర్ జిల్లా అమనగల్లు మండలంలో ఘటన చాంద్రాయణగుట్ట: విహార యాత్ర విషాదాంతం కావడంతో పాతబస్తీలో విషాదం నెలకొంది. విహారయాత్ర కోసం వెళ్లిన వారిని చెరువు రూపంలో మత్యువు కబళించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ఇద్దరు బంధువులు మృతి చెందడంతో చాంద్రాయణగుట్ట అల్ జుబేల్ కాలనీ, ఘాజీమిల్లత్ కాలనీ, హషమాబాద్లలో విషాద చాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. అల్ జుబేల్ కాలనీకి చెందిన అహ్మద్ బేగ్ అలియాస్ బాబు బాయి ఉస్మానియా మార్చురీలో పని చేస్తున్నాడు. బుధవారం అతను కుటుంబ సభ్యులతో కలిసి ఆమనగల్లు మండల పరిధిలోని సరికొండ గౌరమ్మ చెరువుకు విహార యాత్రకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో బేగ్ ఇద్దరు కుమారులు సల్మాన్ (30), రహెమాన్ (19), కుమార్తె రొఖియా బేగం(18), కోడలు మోనా సుల్తానా (20), అల్లుడు షేక్ బాసిత్ (30), హషమాబాద్కు చెం దిన బంధువుల అమ్మాయి ముస్రత్ ఫాతీమా (19), వట్టేపల్లికి చెందిన ముస్కాన్ (18)లతో కలిసి మొత్తం 13 మంది రెండు వాహనాల్లో సరిగొండ గౌరమ్మ చెరువుకు వెళ్లారు. అయితే వీరిలో ఒకరు చెరువులోకి దిగుతుండగా అందులో పడి పోవడంతో వారిని కాపాడే క్రమంలో ఒకరి తరువాత ఒకరు మొత్తం ఏడు మంది చెరువులో దిగి మృతి చెందారు. దీనిపై సమాచారం అందడంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం గురువారం నగరానికి తీసుకురానున్నట్లు తెలిసింది. బేగ్ కుటుంబంలో ఐదుగురు.. కాగా ఈ ఘటనలో అహ్మద్ బేగ్ కుటుంబంలో ఐదుగురు మృతి చెందడం స్థానికులను కలచివేస్తోంది. బేగ్ ఇద్దరు కుమారులతో పాటు కోడలు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. చిన్న కుమార్తె రొఖియా బేగం మృతి చెందగా, పెద్ద కుమార్తె అస్మా బేగం భర్త బాసిత్ అసువులు బాసాడు. దీంతో ఆ కుటుంబంలో బేగ్ దంపతులతో పాటు పెద్ద కుమార్తె ఒక్కరే మిగి లారు. విదేశాలకు వెళ్లిన బేగ్ భార్య గురువారం హైదరాబాద్కు తిరిగిరానున్నట్లు బంధువులు తెలిపారు. పెళ్లయిన 4నెలలకే.. మృతుల్లో ఒకరైన మోనా బేగం అలియాస్ మోనా సుల్తానాకు అహ్మద్ బేగ్ కుమారుడు సల్మాన్తో నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. కాగా సల్మాన్, మోనాలిద్దరూ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడంతో మోనా కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 3నెలల క్రితమే రొఖియా బేగంకు నిశ్చితార్థం అహ్మద్ బేగ్ చిన్న కుమార్తె రొఖియా బేగంకు మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూసుకుంటూ ఇరు కుటుంబాలు ఆనందంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రొఖియా బేగం ఈ ప్రమాదంలో మృతి చెందడంతో వరుడి కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఆరుగురు క్షేమం మొత్తం 13మంది విహారానికి వెళ్లగా అందులో ఆరుగురు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం నుం చి బయటపడిన వారంతా చిన్న పిల్లలు, వృద్ధులే. ఒకరిని కాపాడేందుకు ఒకరు చెరువులోకి వెళ్లి మరణించగా.. వీరు పిల్లలు, వృద్ధులు కావడంతో వారిని కాపాడే ప్రయత్నం చేయలేక పోయారు. దీంతో వారు ప్రమాదంలో చిక్కుకోలేదు. నగరానికి చేరుకున్న మృతదేహాలు... కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో పోస్టు మార్టమ్ నిర్వహించిన అనంతరం ఏడుగురి మృతదేహాలను బుధవారం రాత్రి చాంద్రాయణగుట్ట పరిధిలోని హషామాబాద్, ఆల్బుబేర్కాలనీ, జీఎం కాలనీలలోని వారి నివాసాలకు తరలించారు. మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, మజ్లిస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఎక్స్గ్రేషియా చెల్లిస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్దండ: ఆమనగల్లు మండలం చరికొండ గౌరమ్మ చెరువులో పడి మృతి చెందిన ఏడు మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ శ్రీదేవితో పాటు ప్రజాప్రతినిధులు మృతదేహలను పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. మృతుల్లో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున వారి కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా అందిస్తామని చెప్పారు. పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న రహ్మాన్ అహ్మద్ బేగ్ చిన్న కుమారుడు పదో తరగతి పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. బుధవారం జరిగిన ప్రమాదంలో రహ్మాన్ మృతి చెందినట్లు తెలుసుకున్న అతని స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటలోనే మృతి చెందిన హషమాబాద్కు చెందిన ముస్రత్ ఫాతీమా ఇంటర్ పరీక్షలు రాసింది. మరో మృతురాలు ముస్కాన్ కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉంటున్నందున ఆమె అహ్మద్ బేగ్ ఇంటిలోనే ఆశ్రయం పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. -
విహార యాత్రలో విద్యార్థిని మృతి
భీమ్గల్: విహార యాత్ర విషాదం నింపింది. భీమ్గల్ మండలంలోని బాచన్పల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని ఆకుల నిఖిత(15) పాఠశాల నుంచి వెళ్లిన విహార యాత్రలో మృతి చెందింది. వివరాల్లోకెలితే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులను సంక్రాతి సెలవుల్లో విహార యాత్రకు తీసుకువెళ్లారు. సుమారు 50 మంది విద్యార్థులను 7 గురు ఉపాధ్యాయుల సంరక్షణలో ప్రయివేటు టూరిస్టు బస్సులో శనివారం బయలుదేరి వెళ్లారు. ఆదివారం తమిళనాడులోని వేలూరుకు సమీపంలో వయాఅంబాడి గ్రామ సమీపంలో నిఖిత అస్వస్థతకు గురైంది. పాఠశాల సిబ్బంది స్థానికంగా వైద్యుడి వద్ద చికిత్స చేయించారు. చికిత్స అనంతరం కొద్దిగా ఆరోగ్యం కుదుటపడిందన్నారు. తెల్లవారు జామున మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురైందని, ఫిట్స్ రాగా వేలూర్లోని వైద్యకళాశాలకు తరలించామన్నారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు తెలిపారన్నారు. ఈ విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
విషాదం నింపిన విహారయాత్ర
⇒జీపును ఢీకొన్న కంటైనర్ వాహనం: నలుగురి దుర్మరణం ⇒మృతుల్లో ముగ్గురు మహిళలు,కంటైనర్ డ్రైవర్ ⇒ హైదరాబాద్ను సందర్శించి కర్ణాటక వెళ్తుండగా ప్రమాదం ⇒శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ వద్ద ఘటన శంషాబాద్ రూరల్: వారంతా ఒకే గ్రామానికి చెందిన బంధువులు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా హైదరాబాద్కు విహారయాత్రకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో మధుర స్మృతులు నెమరువేసుకుంటూ వెళ్తున్నారు. అంతలోనే వారిపై మృత్యువు పంజా విసిరింది. వారు ప్రయాణిస్తున్న జీపును కంటైనర్ వాహనం రూపంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో జీపులో ఉన్న ముగ్గురు మహిళలతో పాటు కంటైనర్ డ్రైవర్ దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా ప్రాంతంలోని ఫర్తాబాద్కు చెందిన రాజశేఖర్కు తన సొంత జీపును నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బంధువులు 12 మంది ఆదివారం ఉదయం 7 గంటలకు విహారయాత్ర నిమిత్తం హైదరాబాద్కు బయలుదేరారు. సాయంత్రం వరకు చార్మినార్, బిర్లా మందిర్ తిలకించారు. రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చూసేందుకు వచ్చారు. అక్కడే రాత్రి 12 గంటల వరకు సరదాగా గడిపారు. మరోమార్గంలో వెళ్తూ.. ఉదయం హైదరాబాద్ కు వీరు బీజాపూర్ మార్గంలో చేవెళ్ల మీదుగా వచ్చారు. శంషాబాద్ నుంచి షాద్నగర్-పరిగి దారిలో కర్ణాటక వెళ్లొచ్చని ఎయిర్పోర్ట్లో ఓ డ్రైవర్ వీరికి చెప్పాడు. దీంతో వారు బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఘాంసిమియాగూడకు చేరుకున్నారు. చీకటి కావడంతో జీపు డ్రైవర్ రాజశేఖర్ దారి తప్పినట్లు భావించాడు. దీంతో ఘాంసిమియాగూడ వద్ద బస్టాప్ వద్ద యూటర్న్ తీసుకుని అక్కడ ఉన్న ఓ హోటల్లో దారి గురించి వాకబు చేద్దామని జీపును రోడ్డు పక్కన నిలిపాడు. ఇదే సమయంలో షాద్నగర్ నుంచి బైక్ల లోడుతో శంషాబాద్ వైపు వస్తున్న ఓ కంటైనర్ వాహనం వీరి జీపును వెనక నుంచి ఢీకొంది. ప్రమాద తీవ్రతకు జీపు వెనక వైపు డోరు ఊడిపోయింది. కంటైనర్ జీపును సుమారు వంద అడుగుల వరకు ఈడ్చుకెళ్లింది. ఆ తర్వాత జీపు రోడ్డు అవతలి వైపు ఉన్న గుంతలో పడిపోగా కంటైనర్ ప్రమాద స్థలం నుంచి సుమారు 250 అడుగుల వరకు డివైడర్ మీదుగా వెళ్లి అదుపుత ప్పి రోడ్డుపై బోల్తాపడింది. ఈ సంఘటనతో జీపులో ఉన్న వారు తీవ్రగాయాలతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. తోడికోడళ్లు మృతి.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జీపు వెనక వైపు కూర్చున్న గీత(29)కు తీవ్రగాయాలవడంతో శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఈమె తోడికోడలు కమలాబాయి(33), ప్రియాంక(20), కవిత, ఐశ్వర్య, బసమ్మకు తీవ్రగాయాలవడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కమలాబాయి, ప్రియాంక సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. జీపులో ఉన్న బస్వరాజు, శర ణు, రేణుక, అన్నపూర్ణ, లక్ష్మీబాయి, కవిత, జీపు డ్రైవర్ రాజశేఖర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృత్యువుతో పోరాడి.. ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ వైపు బోల్తాపడింది. దీంతో వాహనం డ్రైవర్ జ్ఞానేశ్వర్(50) క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. జాకీ సహాయంతో పోలీసులు అతి కష్టం మీద డ్రైవర్ను బయటకు తీశారు. అతని రెండు కాళ్లు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో కాళ్లకు తీవ్ర రక్తస్రావమైంది. అపస్మారక స్థితికి చేరుకున్న అతణ్ని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా సోమవారం ఉదయం మృతి చెందాడు. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన జ్ఞానేశ్వర్కు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. పోలీసులు సోమవారం నలుగురి మృతదేహాలకు ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. ట్రాఫిక్కు అంతరాయం.. రోడ్డు ప్రమాదంలో కంటైనర్ వాహనం రహదారిపై బోల్తా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం భారీ క్రేన్ సహాయంతో కంటైనర్ను రహదారిపై నుంచి తొలగించారు. -
స్కూలు బస్సు బోల్తా
15 మంది విద్యార్థులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం విహారయాత్రలో విషాదం శంషాబాద్: ఓ స్కూలు బస్సు అదుపుతప్పి బోల్తాపడడంతో 15మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని పెద్దగోల్కొండ రోటరీ జంక్షన్ సమీపంలో ఔటర్ రింగ్రోడ్డుపై శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పటాన్చెరులోని సాయితేజ విద్యా నికేతన్ పాఠశాలకు చెందిన సుమారు వంద మంది విద్యార్థు లు శుక్రవారం విహారయాత్రకు వెళ్లారు. పాఠశాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో వేరే పాఠశా లలకు చెందిన మూడు బస్సులను తీసుకెళ్లారు. బస్సుల్లో విద్యార్థులతో పాటు పది మంది పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. విజ యవాడ రోడ్డులోని మౌంట్ ఒపేరా నుంచి వీరు తిరిగి వస్తూ పెద్దఅంబర్పేట్ వద్ద ఔటర్పైకి చేరుకున్నారు. పెద్దగోల్కొండ రోటరీ జంక్షన్ దా టగానే ఓ బస్సు టైర్ పంక్చర్ అయింది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది. బస్సులో సుమారు 32 మంది విద్యార్థులున్నారు. దాదాపు 15 మందికి గాయాల య్యాయి. విద్యార్థులు హీనా(15), ప్రత్యూష(15) పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో శంషాబాద్లోని ఓ ్రైపైవేట్ ఆస్పత్రికి తరలించారు. బస్సు వేగంగా వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కన సేఫ్గార్డును ఢీకొట్టడంతో టైర్ పంక్చర్ అయి బోల్తా పడినట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. క్షతగాత్రుల వివరాలు వెల్లడించడానికి ఉపాధ్యాయులు నిరాకరించారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆగ్రహం పెద్దగోల్కొండ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన స్కూలు బస్సు ప్రమాదంపై బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కమిషన్ సభ్యులు అచ్యుతరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రమాద కేసు ను సుమోటోగా స్వీకరించినట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా విహారయాత్రకు తీసుకెళ్లిన పాఠశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా విద్యాధికారి, జిల్లా ఎస్పీ, కలెక్టరుకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆయుర్వేదం... అద్భుత విషయాలు!
వైద్యుడిగా పరిణతి సాధించాలని అనుకునేవాడు ఏదో ఒక విభాగానికి మాత్రమే పరిమితం కాకూడదు. అప్పుడతడు పాక్షిక వైద్యుడవుతాడు. పాక్షిక వైద్యుడు చికిత్స చేయడానికి పనికిరాడు. అందుకే నిష్పాక్షికంగా అతడు అన్ని విభాగాల్లోనూ నైపుణ్యం సాధించి పరిపూర్ణజ్ఞానాన్ని పొందాలంటుంది ఆయుర్వేదం. ఇదీ నాడీ ప్రవీణ, డెరైక్టర్ ఆఫ్ మహర్షి ఆయుర్వేద, డాక్టర్ జె.ఆర్. రాజు ఉద్బోధించే విషయాలు. ఈరోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్లడం కంటే... ఆ తర్వాత వ్యాధి నిర్ధారణ కోసం వారు సూచించే పరీక్షలే రోగిని ఎక్కువగా భయపెడుతుంటాయి. కానీ వైద్యాచార్య డాక్టర్ రాజు ఇలాంటి రక్తపరీక్షలూ, మూత్రపరీక్షలూ, ఈసీజీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరీక్షలను చేయించరు. కేవలం నాడిని చూడటం ద్వారానే వ్యాధినిర్ధారణ చేస్తారు. తద్వారా రోగుల ఖర్చులు ఆదా అవుతాయి. ఇక ఆయన ఎన్నెన్నో దేశాల్లో అల్లోపతి వైద్యులకూ ఆయుర్వేదం గొప్పదనాన్ని వివరించి, ఆ విధానంలో నయంకాని (క్యూర్ లేదనే) వ్యాధులకు ఆయుర్వేద విధానంలో నయం చేసే విధానాలను బోధిస్తుంటారు. ఆయుర్వేదాన్ని ఆచరిస్తూ వస్తున్న ఆయన మన రోజువారీ దినచర్యల్లో అత్యంత సులభంగానూ, సూక్ష్మంగానూ, పైసా ఖర్చులేకుండా ఆరోగ్యాన్ని పొందే అనేక విషయాలను విపులంగా వివరిస్తున్నారు. దైనందిన జీవనశైలిలోనే ఆయుర్వేదం... ఆయుర్వేద జ్ఞానం చాలా విస్తృతం. దానిని ఔపోసన పట్టడం కంటే అభ్యాసం చేయడం మేలని ఎంచారు మన పూర్వికులు. అందుకే ఆయుర్వేదాన్ని మన నిత్యజీవన శైలిగా మార్చారు. స్నానం, పానం, ఆహారం, విహారం... ఇలా ప్రతి అంశంలోనూ మనకు తెలియకుండానే మనం ఆయుర్వేదాన్ని ఆచరిస్తుంటాం. ఇంగ్లిష్ మందులు, ఇతర ఔషధాలకు కొన్ని దుష్ర్పభావాలు ఉంటాయి. వాటినే సైడ్ ఎఫెక్ట్స్ అని అందరూ వ్యవహరిస్తుంటారు. కానీ ఆయుర్వేదంలో ఉపయోగించే పదార్థాలన్నీ స్వాభావికాలు. ప్రకృతి సహజాలు. ఉదాహరణకు మన వంటగదిలో ఉపయోగించే వాము, జీలకర్ర, దాల్చినచెక్క వంటివన్నీ ఆయుర్వేదంలో ఔషధాలే. అలాక్కాకుండా వంటింటి దినుసులుగా ఉపయోగిస్తే అప్పుడవి రోజువారీగా ఉపయోగించే పదార్థాలే. అందుకే ఆయుర్వేదం వల్ల సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. అన్నీ సైడ్ బెనిఫిట్సే. కాబట్టే ఆయుర్వేదం మన నిత్యజీవితంలో భాగం అయ్యేలా చూశారు మన పూర్వికులు, ఆచార్యులు. అందుకే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం పైసా ఖర్చులేకుండా పొందగలిగే ఆరోగ్యాన్ని స్నానం నుంచి ప్రారంభిద్దాం. రోజులో తొలి కార్యక్రమం...వ్యాయామం వ్యాయామం అతిగా చేయకూడదు. నుదుట చెమట రావడం మొదలు కాగానే లేదా అధికశ్రమతో శ్వాస తీసుకోవడం మొదలుకాగానే వ్యాయామాన్ని ఆపేయాలి. ఇలా చేయడాన్నే శరీర అర్ధబలమంటారు. బాగా శరీర పరిశ్రమ (కఠిన వ్యాయామం) లేదా రన్నింగ్ లేదా వాకింగ్ చేసి వచ్చాక... వెంటనే నీరు తాగకూడదు. శరీరం, శ్వాస నెమ్మదించాక మాత్రమే నీరు తాగాలి. వ్యాయామ, విహారాలకు అనువైనది ప్రాతఃకాలమే. ఆహారం తీసుకున్న తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యాయామం చేయకూడదు. స్నానం...ప్రాధాన్యం..! స్నానానంతరం మనకు కలిగే ఆహ్లాదం అంతా ఇంతా కాదు. స్నానం కేవలం శరీరాన్ని శుభ్రపరచడం మాత్రమే చేయదు. అనేక సమస్యలనుంచి సాంత్వన కలిగిస్తుందీ స్నానం. అయితే స్నానం ఆరోగ్యకరం కావాలంటే కొన్ని సూచనలు గుర్తుపెట్టుకోండి. అవి... తలపై మరీ ఎక్కువ వేన్నీళ్లతో స్నానం వద్దు. స్టీమ్ బాత్, సౌనా బాత్ వంటివి ఆరోగ్యకరం కాదు. స్టీమ్బాత్, సౌనాబాత్లో తలకు ఆవిరి పెడతారు. అది చాలా ప్రమాదకరం. ఏదైనా తిన్నవెంటనే స్నానం చేయకూడదు. స్నానం తర్వాతే ఆహారం తీసుకోవాలి. కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు. రెండు, మూడు గంటల తర్వాతే స్నానం చేయండి. బలహీనంగా ఉన్నవాళ్లు, వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో స్నానంగాని వద్దు. చన్నీళ్ల స్నానం ఆరోగ్యకరమనే అపోహ వద్దు. గోరువెచ్చని నీళ్లే మంచివి. తప్పనిసరి పరిస్థితుల్లో చన్నీళ్లతో స్నానం చేస్తే... దానికి ముందర చన్నీళ్లు తాగవద్దు. చన్నీళ్ల స్నానంలో నీరు ఎంత చల్లటివైతే... స్నానం వ్యవధిని అంతగా తగ్గించడం మంచిది. గోరువెచ్చని నీళ్లతో స్నానం ముందర కాస్తంత వ్యాయామం మంచిది. ఏ నీళ్లతో (చన్నీళ్లు లేదా వేణ్ణీళ్లు) అయినా స్నానం తర్వాత తలనొప్పి, జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే అది మీ ఆరోగ్యానికి అంతగా సరిపడదని గుర్తుంచుకోండి. నీరూ... ఆరోగ్యప్రదాయనే! నీటిని మనం ఆహారంతో పాటు స్వీకరిస్తుంటాం. నీరూ ఒక ఓషధే. సరైన పాళ్లలో సరైన విధంగా తీసుకుంటే దాంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ఉదాహరణకు... స్థూలకాయం ఉన్నవారు తమ బరువు తగ్గించుకోడానికి ఆచరించదగిన నీటి చికిత్స (వాటర్ థెరపీ) ఏమిటంటే... ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో మూడో వంతు ఆవిరయ్యేలా చేసి, మిగతా నాల్గో వంతు భాగాన్ని చల్లార్చి తాగితే ఊబకాయం తగ్గుతుంది. అలాగే లావెక్కాలని భావించే అతిసన్నటి శరీరం ఉన్నవారు... ఒక పాత్రలో నీటిని తీసుకుని కేవలం నాలుగోవంతు మాత్రమే ఆవిరయ్యేలా చేసి, మిగతా నీటిని చల్లార్చి తాగితే క్రమంగా ఒళ్లు చేస్తారు. ఇలా ఒకే నీరు... దాన్ని ఉపయోగించే అతి సాధారణ, అతి సులభ పద్ధతుల్లో రెండు రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. ప్రతి అరగంటకొకసారి వేడి నీళ్లను టీ తాగినట్లుగా రోజూ సిప్ చేస్తూ తాగుతుంటే దీర్ఘకాలంలో చాలా వ్యాధులు నయమవుతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి... కాచిన పాలనూ, కాచిన నీళ్లను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. అన్నపానాదులను సంస్కరించాకే ఉపయోగించాలి. ఇలాంటి సంస్కరణకు ప్రధానంగా ఉపయోగపడేది నీరే. నీళ్లు లేకుండా ఘన పదార్థాల సంస్కారం వీలు కాదు. చాలా రోగాలకు ముఖ్యకారణం కూడా నీరే. తమ ఆవాసంగా నీటిలో ఉండే జంతుజాలం ప్రసవించే సమయంలో వెలువడే విషపదార్థాలు నీళ్లలో కరిగి రోగకారకాలు కావచ్చు. అందుకే నీటి స్వచ్ఛపరిచాకే ఉపయోగించాలి. నీటిని స్వచ్ఛపరచడం అంటే... తొలుత మంచి పరిశుభ్రమైన నిర్మల వస్త్రంతో వడగట్టడం, ఆ తర్వాత నీటిని బాగా కాచి చల్లార్చి తాగడం. ఇలా నీటిని స్వచ్ఛపరిచాకే తాగాలి. భోజనానికి ముందు నీరు తాగితే అది మందాగ్ని రూపంలో శరీరాన్ని కృశింపజేస్తుంది. మధ్యమధ్యన నీరు తాగకుండా భోజనం తర్వాతే నీరు తాగితే అది శరీర స్థౌల్యం (ఊబకాయం) కలిగిస్తుంది. ఛాతీ, కంఠం, శిరస్సుల్లో కఫాన్ని వృద్ధి చేస్తుంది. అందుకే భోజనం మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉంటే మధ్యమ స్థితి (అంటే కృశ - స్థౌల్య... ఈ రెంటినీ కలిగించేదిగా) సంభవిస్తుంది. ఇలా మధ్య మధ్యన నీరుతాగడం రస, రక్తాధి ధాతువులను సమస్థితిలో ఉంచుతుంది. ఇలా తాగిన నీరు సులభంగా, సుఖంగా జీర్ణమవుతుంది. చల్లని నీళ్లు జీర్ణం కవడానికి 45 నిమిషాలు, వేడి నీరు జీర్ణం కావడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. దురలవాట్లనుదూరం చేసుకోండిలా... భోజనం గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. భోజనం ‘ఆత్మ’కు ఇంపుగా ఉండాలి. మంచి కవిత్వం రాయడం ఎప్పుడు సాధ్యమన్న విషయాన్ని అల్లసాని పెద్దన సరదాగా చెప్పినా ఆ మాటల్లోని వాస్తవం గమనించారా? ‘ఆత్మకింపైన భోజనం...’ తినాలంటారాయన. అలాగే అన్నం తిన్న తర్వాత కలిగే తృప్తిని వర్ణించడానికి చెప్పే మాట... ‘ఆత్మారాముడు శాంతించాడు’ అనే. అంటే ఇక్కడ తాను అనే అర్థంలో ఆత్మ అనే మాటను వాడినా... విస్తృతార్థంలోనూ ఆత్మకింపైన, ఆత్మకు మేలు చేకూర్చే భోజనమే తీసుకోవాలన్నది వాస్తవం. ఇందులో భాగంగా శరీరానికీ, నాలుకకూ రుచిగా ఉన్నప్పటికీ అది ఆరోగ్యానికి అంతగా మేలు చేసేది కానప్పుడు దాన్ని వర్జించాలి. ఇలా వర్జించే సమయంలోనూ దాన్ని అకస్మాత్తుగా వర్జించకూడదు. దురలవాటునూ, దుర్వ్యసనాన్ని దూరం చేసుకోనే సమయంలో దాని పరిమాణాన్ని రోజూ శోడశ పాద భాగాన్ని విడవాలి. అంటే ప్రతిరోజూ ఒకటిలో పదహారోవంతును తగ్గించుకుంటూ... ఇలా క్రమంగా మేలు చేయని ఆహారాన్ని వర్జించాలన్నమాట. భోజనం తర్వాత మొక్కజొన్న కండె, మొక్కజొన్న అటుకులు తినకూడదు. వండటానికి పనికొచ్చే కూరలను వండే తినండి... ఇటీవల చాలా మంది పచ్చి కూరలు తినడం వల్లనే ఆరోగ్యం ఇనుమడిస్తుందంటూ చెబుతుంటారు. ఇది కేవలం పాక్షిక సత్యం మాత్రమే. వండి తినడం (పచనం చేయడం) నాగరక పరిణామక్రమంలో వచ్చిన అభివృద్ధి. అందువల్ల దాన్ని అభివృద్ధి సూచకంగానే పరిగణించాలి. క్యారెట్, బీట్రూట్, ఉల్లి, కీర, చిన్నపాటి అల్లం తురుము, ధనియాలు, పుదీన లాంటి వాటిని పచ్చిగా తిన్నా పర్వాలేదు. ఎందుకంటే అవి అందుకు ఉపయుక్తంగా ఉంటాయి కాబట్టి. కానీ సొర, బీర, కాకర వంటి కూరగాయలను వండి మాత్రమే తినండి. వండటానికి మాత్రమే వాటిని ఉపయుక్తంగా తయారు చేసింది ప్రకృతి. ఉదాహరణకు కూరగాయలుగా మనం వాడేవాటిలో కాకరనే తీసుకుందాం. దానికి చికిత్సాపరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నది వాస్తవం. దాన్ని తింటే ఆరోగ్యానికి మంచిది, డయాబెటిస్ లాంటి దీర్ఘవ్యాధులను తగ్గిస్తుందన్నది కూడా పరమ సత్యం. అయితే అలాగని దాన్ని పచ్చిగా తినడం చాలా హానికరం. అందులో ఔషధగుణాలతో పాటు కొన్ని ఆల్కలాయిడ్స్ కూడా ఉంటాయి. అవి మోతాదుకు మించినప్పుడు శరీరానికి హాని చేస్తాయి. కాబట్టి దాన్ని పచ్చిగా తినడమో లేదా అదేపనిగా రోజూ కాకర రసం తీసుకుని తాగడమో చేస్తే దీర్ఘకాలంలో దాని దుష్పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే కూరగాయలను, ఆకుకూరలను వండే తినండి. సలాడ్స్గా తీసుకోదగ్గ క్యారెట్, బీట్రూట్, ఉల్లి, కీర, చిన్నపాటి అల్లం వంటివాటికి మిగతా కూరలను జత చేయకండి. పొన్నగంటికూర కళ్లకు చాలా మంచిది. భోజనం తీసుకోండిలా... అన్నం పరబ్రహ్మస్వరూపం. అందుకే దాన్ని గౌరవిస్తూ వీలైతే తూర్పునకు ముఖం చేసి తినండి. ఆహారాన్ని దూషిస్తూ, అశాంతితో తినకూడదు. భోజనంలో మొదట తీపి తీసుకోండి. ఆ తర్వాత భోజనంలో హెవీఫుడ్గా మీరు భావించేదాన్ని తినాలి. అలా క్రమంగా భోజనం సాగుతున్న కొద్దీ హెవీ నుంచి లైట్కు వస్తూ ఉండాలి. మొదట హెవీ అనే క్రమంలో నెయ్యిని తీసుకోండి. ఎందుకంటే నేతికి రెండు రకాల గుణాలుంటాయి. అది అగ్నిని ప్రజ్వలిస్తుంది. (అగ్నికి ఆజ్యం తోడైనట్లు అనేది అందుకే). అంటే మొదట అగ్నిగుణాన్ని కలిగించడం వల్ల ఆహారం జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది. అగ్నిగుణం కలిగిన ఆ నెయ్యే... కారాలతో నాలుక భగభగలాడేప్పుడూ... ఆహారంలో కారం మంట అధికంగా ఉన్నప్పుడూ దాన్ని శాంతింపజేయడానికి తోడ్పడుతుంది. అందుకే అన్నంలో నేతికి తొలి వరస. ఈ క్రమంలో అన్నింటికన్నా తేలికైన మజ్జిగది తుది వరస. అన్నం తినేప్పుడు కొందరు మంచినీళ్లు అస్సలు తాగరు. కానీ మధ్యలో నీళ్లు తాగడమే మంచిది. లేకపోతే మనం తీసుకునే అన్నంలోని ఘనపదార్థాలు మధ్యలో చిక్కుకుపోయి (స్తంభించి), జీర్ణక్రియకు అవరోధం కలిగిస్తాయి. అందుకే గొంతులో/ కడుపులో ఏదైనా అడ్డంపడ్డట్లు ఉన్నప్పుడు నీళ్లు తాగడమే మంచిది. అన్నాన్ని కళ్లతో చూడగానే నోట్లో నీళ్లూరతాయి. జ్ఞానేంద్రియాలలో కలిగే స్పందనల్లో ఇదొకటి. మంచి శ్రేష్ఠమైన ఆహారం రుచులను వినగానే వాటిని రుచిచూడాలనిపిస్తుంది. ఇది మరో జ్ఞానేంద్రియం చేసే పని. ఇక ఎలాగూ నాల్క రుచిచూస్తుంది. అలాగే అన్నాన్ని స్పర్శిస్తూ తినడం వల్ల కూడా కొన్ని స్పందనలు కలుగుతాయి. అందుకే అన్నాన్ని స్పూన్లూ, ఫోర్కులూ, నైఫ్ల వంటి ఉపకరణాలతో తినే బదులు చేతి ఐదువేళ్లతో స్పర్శిస్తూ తినండి. ఈ స్పర్శజ్ఞానమూ మెదడులో కొన్ని స్పందనలు కలిగించి అన్నం పట్ల హితవును కలిగిస్తుంది. అయితే ఈ జ్ఞానం కలగడానికి మిగతా జ్ఞానేంద్రియాలతో పోలిస్తే కాస్త ఎక్కువ వ్యవధి పడుతుంది. భోజనం చివరన చల్ల (మజ్జిగ) వాడటం చాలా మంచిది. దీనికి కొద్దిగా శుంఠి, సైంధవ లవణం కలుపుకుని తింటే మరింత శ్రేష్ఠం. ఇక అన్నం తిన్న తర్వాత చేయి కడిగి... ఆ చేయి తుడుచుకున్న తర్వాత ఉండే కాస్తంత తడితో కళ్లుమూసుకుని, కన్రెప్పలను తుడుచుకుంటే కొన్ని దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇది కళ్లకు చాలా మంచిది. భోజనం చేయండిలా... భోజనం చేసే సమయంలో మీ కడుపును నాలుగు భాగాలుగా ఊహించుకోండి. అందులోని రెండు భాగాలను ఘనపదార్థాలకూ, ఒక భాగం ద్రవపదార్థాలకూ, మిగతా మరో భాగాన్ని వాయువుకు విడవండి. ఈ నిష్పత్తిలో భోజనం చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. కేవలం పెరుగును మాత్రమే తినకూడదు. పెరుగు తినదలచినవారు అందులో కొద్దిగా తేనెనుగాని లేదా ఉసిరిక లేదా ముద్గయూషం (పెసరకట్టు) కలుపుకుని లేదా చిలికి తినాలి. పెరుగును యథాతథంగా రాత్రిపూట తినడం నిషిద్ధం. పెరుగు తన గురుగుణం వల్ల శోఫ (వాపు)ను, కఫాన్ని పెంచుతుంది. అదే మజ్జిగ ఆ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఫలాలు...ఫలితాలు కొన్ని పండ్లు భోజనానికి ముందే తినడం మంచిది. మామిడి, కొబ్బరి, అరటి వంటి పండ్లను భోజనానికి ముందే తినాలి. (అరటి శ్రేష్టమైన పండే అయినప్పటికీ దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది బరువైన పండు, బరువైన ఆహారాలు ముందే తినాలి కాబట్టి దీన్ని భోజనానికి ముందే తీసుకోవడం మంచిది. లేదా మధ్యాహ్నభోజనం అయ్యాక... చాలాసేపటి తర్వాత ఈవినింగ్ శ్నాక్స్ టైమ్లో (ఉజ్జాయింపుగా సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో) తినాలి. బొప్పాయి పండును ఖాళీ కడుపుతోనే తినాలి. అప్పుడది కడుపులోని మలినాలను తీసేస్తుంది. కడుపునిండా భోజనం చేశాక బొప్పాయి తినకూడదు. పండ్లలో లీఛీ పండు అంత మంచిది కాదు. ఆహారం భాగమైన పండ్ల విషయంలోనూ దేశ, కాలాత్మాది విజ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని ప్రాంతాల్లో పండేవి అక్కడి వారికి తేలిగ్గా జీర్ణమవుతాయి. అవి వారికి మంచిది. ఇక కొన్ని పండ్లూ, ఆహారాలు కొన్ని ప్రాంతాలవారికి పరాయివి. దేశకాలాలను బట్టి మనకు ఏది అనువైనదో వాటినే తీసుకోవాలి. రోజులో చివరి కార్యకలాపం నిద్ర గురించి... నియమానుసారంగా నిద్రపోవాలి. తద్వారా ఆరోగ్యం, పుష్టి, బలం కలుగుతాయి. అకాల నిద్ర లేదా అతినిద్ర లేదా బొత్తిగా నిద్రమానినా అది ఆయువును హరించివేస్తుంది. నిద్ర వేళలు / నిద్ర అలవాట్లు సరిగా లేకపోతే అది రోగాన్ని, కృశింపజేసే తత్వాన్ని, బలహీనతను, అజ్ఞానాన్ని, మరణాన్ని కలగజేస్తుంది. నిద్రలేమి అనేది రోగాన్ని కలగజేస్తుంది. జ్ఞాపకశక్తిని హరిస్తుంది. సరైన నిద్ర లేకుండటం అన్నది దీర్ఘకాలంలో మనిషిని క్రమంగా కుంగదీస్తుంది. నిద్ర వేళలన్నవి వారి వారి సౌకర్యాన్ని బట్టి మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ ఉండకుండా చూసుకోవాలి. అతినిద్ర, నిద్రలేమి ఈ రెండూ ప్రమాదకరమే అని గ్రహించండి. అవీ ఇవీ... సత్తుపిండి (సున్ని ఉండలను) రాత్రి తినకూడదు. సత్తుపిండిని నీళ్లతో కలిపి తినకూడదు. నువ్వుల నూనెకు సత్వరం వ్యాపించే గుణం ఉంది. అందుకే అభ్యంగం (మసాజ్)లో దీన్ని వాడటం వల్ల అనేక రోగాలు తగ్గడానికి దోహదం చేస్తుంది. బక్కచిక్కిన వాళ్లు దీనితో మసాజ్ చేసుకుంటే బరువు పెరుగుతారు. అదే స్థూలకాయులైతే బరువు తగ్గుతారు. బియ్యం లాంటి ఆహారధాన్యాలు ఒక సంవత్సరం కిందటివి అంటే పాతవి శ్రేష్ఠం. కొత్తపంటలు ప్రమేహానికి (డయాబెటిస్)కు కారకాలు. ధాన్యాలు, ఘృతం (నెయ్యి), తేనె, బెల్లం, పిప్పలి ఇవి తప్ప... ఇతర ద్రవ్యాలు ఒక ఏడాదిపైబడినవే శ్రేష్ఠం. పెసలు మంచి ప్రోటీన్. మినుములు మాంసంతో సమానమైన శాకాహారం. పుట్టగొడుగులు మిగుల దోషకారి. కాలేయంలోని విషాలను పెంచుతాయి. లేతముల్లంగి శ్రేష్ఠం. ముదురు ముల్లంగి రోగకారకం. లేత వంకాయ శ్రేష్ఠం, ముదురు వంకాయ రోగకారకం. ముదురు బూడిద గుమ్మడికాయ శ్రేష్ఠం. లేత బూడిద గుమ్మడికాయ రోగకారకం. బియ్యం తేలికైనవి. కానీ వాటితోనే రూపొందే అటుకులు ఆలస్యంగా జీర్ణమవుతాయి. పైన పేర్కొన్నవన్నీ ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి, రాత్రి నిద్రించే వరకు ఒక క్రమపద్ధతిలో చేయడానికి వీలుగా ఆయుర్వేదం ఈ అలవాట్లన్నింటినీ మనందరి దైనందిన జీవితంలో ప్రవేశపెట్టింది. కొందరు ఏమీ తెలియకుండానే వీటన్నింటినీ ఆచరిస్తుండవచ్చు. మరికొందరు తెలియక కొన్నింటిని ఆచరించక, రుగ్మతలకు లోనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయుర్వేద సదాచారాలను అర్థం చేసుకుని ఆరోగ్యంగా జీవించండి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి ‘తేనె’లొలికే ఆరోగ్య సూచనలు ఉదయం వేళ ఆరోగ్యదాయని అంటూ చాలామంది తేనెను స్వీకరిస్తుంటారు. వేన్నీళ్లలో కాస్తంత తేనెనూ, నిమ్మరసాన్ని వేసి తాగుతారు. ఇలా తీసుకోవడం చాలా ప్రమాదకరం. తేనెను ఆరోగ్యప్రదాయనిగా స్వీకరించదలచినవారు వేన్నీళ్లలో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వేయకూడదు. చన్నీళ్లతోనే స్వీకరించాలి. మీ శరీరం ఎంత తేనెను స్వీకరించడానికి సిద్ధంగా ఉందో ఆ మోతాదునే ఎప్పుడూ కొనసాగించాలి. అంతేగానీ తేనె మధురంగా ఉంటుందని అతిగా తీసుకోవడం సరికాదు. తేనె, నెయ్యి... ఈ రెండింటినీ సమానపాళ్లలో కలిసి తీసుకోకూడదు. ఏదో ఒకదాని మోతాదు ఎక్కువో, తక్కువో ఉండాలి. ఆ రెండూ సమానంగా ఉంటే అది విషంతో సమానం. తేనె ‘యోగవాహి’. అంటే తేనెను దేనితోనైనా కలిపి తీసుకుంటే, అది చేరిన పదార్థం గుణాలను అధికం చేస్తుంది. కానీ తన స్వీయ గుణాల వల్ల ఉద్దేశిత కార్యానికి విరుద్ధంగా పనిచేయదు. ఉదాహరణకు కరక్కాయతో కలిసిన తేనె విరేచనాన్ని కలిగిస్తుంది. కానీ తన స్వభావమైన విరేచన కార్యాన్ని ఆపదు. పాల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే... చాలామంది ఉదయం వేళ పాలు, అరటిపండు తీసుకుంటుంటారు. పాలతోగాని, పెరుగుతోగాని, పాలపొడితోగాని అరటిపండు తీసుకోవడం సరికాదు. అది స్లోపాయిజన్ వంటిది. చాలామంది భోజనం అనంతరం అరటిపండును తీసుకుంటారు. ఇది కూడా సరికాదు. అరటిపండును తినాలనుకునేవారు భోజనానికి ముందే తీసుకోవాలి. లేదా మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో కడుపు కాస్త ఖాళీ అయ్యాక తీసుకోవడం మంచిది. రోజూ పాలు తాగేవారు దానితో తీపి పదార్థాలు తప్ప మరే రుచినీ కలపకూడదు. కాబట్టి టీ, కాఫీలు తాగేవారు కేవలం వాటిని కషాయంగా (పాలు కలపకుండా) తాగడమే ఆరోగ్యానికి మంచిది. ఇక ముఖ్యంగా పాలతో ఉప్పు కలపడం ఆరోగ్యానికి అనర్థం. అందుకే పాలతో కలిపి సాల్ట్ బిస్కెట్లు తీసుకోవడం మంచిదికాదని గుర్తుంచుకోండి. కొందరు కొన్ని రకాల కూరల్లో పాలు కలిపి వండుతుంటారు. పాలలో ఉప్పు కలిపి వేడిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి... ఇలా చేయడం దీర్ఘకాలంలో హానికరం. పాలు, పనసపండు కలిపి తినకూడదు. పాలు, చేపలు కలిపి తినకూడదు. చేపలు తిన్న తర్వాత మజ్జిగ గాని, పెరుగుగాని తింటే దీర్ఘకాలంలో ఆరోగ్యభంగం అయ్యే అవకాశం ఉంది. పెరుగును ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు. -
మీపై గూగుల్ కన్నేసింది!
లండన్: వారాంతంలో ఏదైనా విహార యాత్రకు వెళ్లారా..? లేదా ఏదైనా పనిమీద మరో ప్రాంతానికి వెళ్లారా..? ఇలా మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళుతున్నా... ఒకరు కనిపెట్టేస్తున్నారు! మీరు వెళ్లే చోట్ల వివరాలను దాచిపెడుతున్నారు.. జాగ్రత్త మరి! ఇలా మీపై నిఘా పెట్టిందెవరో తెలుసా?.. గూగుల్ సంస్థ. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు, ‘గూగుల్ నవ్’ను వినియోగిస్తున్నవారు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్లినా.. అది మీ గూగుల్ అకౌంట్లో నిక్షిప్తమైపోతుంది. కొద్ది నెలల పాటు ఆ వివరాలు గూగుల్ సర్వర్లలో ఉంచుతారు కూడా. కావాలంటే ‘గూగుల్ నవ్’లోకి వెళ్లి చూసుకుంటే... మీరు కొద్దిరోజులుగా ఎక్కడెక్కడికి వెళ్లినదీ మ్యాప్పై ఎరుపురంగు చుక్కలతో చూపిస్తుంది. అయితే గూగుల్లో ఈ సర్వీసు తప్పనిసరేమీ కాదని, కావాలంటే ఈ మొబైల్ ట్రాకింగ్ను ఆఫ్ చేసుకోవచ్చని గూగుల్ సంస్థ చెబుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... మీ స్మార్ట్ఫోన్లో ఇంటర్నెట్ వినియోగిస్తేనే ఇదంతా జరుగుతుంది. -
చిత్తడి నేలల్లో...చినుకుతో విహారం
రుతుపవనాలు ఆలస్యంగా పలకరించడంతో అన్నిచోట్లా వరుణుని రాక కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల మోస్తరు.. కొన్ని చోట్ల అడపాదడపా కురిసే వానలు తేయాకు తేటల్లో విరివిగా కురుస్తున్నాయి. చినుకుల్లో తడిసి, ఆహ్లాదం పొందాలకునేవారిని ఈ భూతల స్వర్గాలు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. వానకాలం వారాంతాలకు వేదికగా మారిన ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి - వైత్రి హిల్ స్టేషన్, మున్నార్, కూర్గ్, మహాబలేశ్వర్, గోవా! పచ్చందనాల పరవశం వైత్రి హిల్ స్టేషన్ కేరళలోని వయనాడు జిల్లాలో ఉంది వైత్రి. ఈ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పర్వత ప్రాంతం ఇది. ఇక్కడ చూడదగిన అద్భుత సుందర దృశ్యాలు ఎన్నో మనస్సును కట్టిపడేస్తాయి. అందుకే పర్యాటకులకు మేలిమి పిక్నిక్ స్పాట్గా మారింది - వైత్రి. ఇక్కడ చూడదగిన వాటిలో ప్రధానమైనవి కరలాడ్ సరస్సు, లక్కిడి. సముద్ర మట్టం నుంచి 700 మీటర్ల ఎత్తులో ఉన్న లక్కిడి రహదారులన్నీ మలుపులు మలుపులుగా ఉంటుంది. ఈ మలుపుల్లో ప్రయాణించేటప్పుడు పవనాల తాకిడి గిలిగింతలు పెడుతుంది. వైత్రికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూకోట్ సరస్సులో పడవ ప్రయాణం, చుట్టూ అటవీ ప్రాంతం, పిల్లల పార్క్, అడవి బిడ్డల హస్తకళలు అమితంగా ఆకట్టుకుంటా యి. వయనాడు దగ్గరలో బాన్సువారా సాగర్ డ్యామ్, కురువా ద్వీపం, ఎడక్కల్ గుహల్, సూజిపరా జలపాతం, మీన్ముట్టి జలపాతం, ప్రాచీన మ్యూజియం, జైన్ దేవాలయం, కరపుజా డ్యామ్లు చూడదగినవి. ఇక్కడే ఉన్న చెంబ్రా పర్వతం ట్రెక్కింగ్ చేసేవారికి గొప్ప అనుభూతిని ఇస్తుంది. సమీప రైల్వేస్టేషన్ కోళిక్కోడ్ 63 కి.మీ, 73 కి.మీ దూరంలో కరిపుర అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కోళిక్కోడ్ చేరుకొని, అక్కడ నుంచి కారులో వైత్రికి చేరుకోవచ్చు. రోడ్డుమార్గాన హైదరాబాద్ నుంచి బెంగళూరు బయల్దేరి అక్కడి నుంచి వైత్రికి చేరుకోవచ్చు. వైత్రిలో వసతుల కోసం: www.vythiriresort.com, www.the windflower.com, www.wayanadresorts.com, silenttreckకు లాగిన్ అవ్వచ్చు. వైత్రి పర్యాటక శాఖ ఫోన్ నెంబర్లు: 09497492882, 09562591233, 09447181160. ముచ్చట గొలిపే మున్నార్ ముద్రపూజ, నల్లతన్ని, కుండల.. అనే మూడు పర్వతాలు ఉన్న ప్రాంతమే కేరళలోని మున్నార్. సముద్రమట్టానికి 1,600 మీటర్ల ఎత్తులో ఈ ఉన్న ప్రాంతం తేయాకు తోటల పెంపకానికి అనువైనది. చిన్న చిన్న టౌన్లు, గాలిమరల దారులు గల ఈ ప్రాంతంలో పేరొందిన రిసార్టులు ఉన్నాయి. వర్షాలు విస్తారంగా కురిసే ఈ కాలం అటవీ ప్రాంతంలో గల గడ్డిమైదానాలు, వాటిలో పువ్వుల సోయగాలు మనసులను ఆహ్లాదపరుస్తాయి. ఇక్కడి అనముడి ప్రాంతం పర్వతారోహకులకు అనువైనది. మరిన్ని సుందర ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికి ఎరవికులమ్ ఉద్యానం ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఈ ఉద్యానంలో అరుదైన సీతాకోకచిలుకలు, జంతువులు, పక్షులు కనువిందు చేస్తాయి. ఇక్కడ నుంచి చూస్తే తేయాకు తోటలతో నిండి ఉన్న పర్వతసానువులు పచ్చని చీరను సింగారించుకున్నట్టు కనిపిస్తాయి. మున్నార్కి 13 కి.మీ దూరంలో ఉన్న మట్టుపెట్టి మరో ఆసక్తికరమైన ప్రదేశం. ఇక్కడే మసోన్రీ డ్యామ్ స్టోరేజీ వాటర్తో తయారైన అందమైన సరస్సు ఉంది. ఇందులో బోట్ రైడ్ ఉత్సాహకరమైన క్రీడగా చెప్పుకోవచ్చు. మట్టుపెట్టిలో చిన్నా, పెద్ద జలపాతాలకు అలవాలమైన ప్రాంతాలు చిన్నకనాల్, అనయిరంగాల్. మున్నార్కు 22 కి.మీ దూరంలో ఉంటాయి. కేరళ పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు మున్నార్-కొడెకైనాల్ రోడ్డు మార్గాన వెళుతుంటే ఆ ప్రయాణం పర్యాటకులకు ఊహించని ఆనందాన్నిస్తుంది. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో ఎర్నాకుళం చేరుకొని, అక్కడ నుంచి 130 కి.మీ దూరంలో ఉన్న మున్నార్కి కారులో వెళ్లచ్చు. రైలు మార్గాన హైదరాబాద్లో శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి కొచ్చి చేరుకొని, అక్కడ నుంచి బస్సుల ద్వారా మున్నార్ వెళ్ళవచ్చు. వసతి సదుపాయాల కోసం www.teacounty munnar.comకు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ క్లబ్ మహీంద్రా, అబద్ హోటల్స్, క్లౌడ్ 9, దేశ్దన్.. మొదలైనవి వసతి సదుపాయాలు కల్పిస్తున్నాయి. మనసు దోచే సుందరచిత్రం మడికేరి కర్నాటకలోని కొడగు జిల్లాలో ఉంది మడికేరి. ఈ ప్రాంతాన్నే అంతా కూర్గ్గా పేర్కొంటుంటారు. కాఫీ, ఏలకుల తోటలకు ఈ ప్రాంతం ప్రసిద్ధం. పడమటి కనుమల్లో కనువిందు చేసే ఇక్కడి పచ్చదనం వర్షాకాలంలో ప్రకృతి ప్రియులను కట్టిపడేస్తుంది. హైదరాబాద్ నుంచి 797 కి.మీ దూరంలో ఉన్న కూర్గ్కు రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రాంతానికి కారులో బయల్దేరితే 13 గంటల సమయం పడుతుంది. ఇక్కడి వసతి సదుపాయాల కోసం.. www.plantationtrails.net/ www.orangecounty.in/coorg-resorts/www.kadkani.com/ KTDC Mayura hoteను సంప్రదించవచ్చు. కూర్గ్లో ప్లాంటేషన్ ట్రయల్స్ పేరుతో ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. వాటి వివరాల కోసం ఫోన్: +9108023560761/235606595, మొబైల్: +91-80-23346074/73లలో సంప్రదించవచ్చు ఉత్కంఠభరితం మహాబలేశ్వరం అబ్బురపరిచే శిఖరపు అంచులు, ఉత్కంఠ కలిగించే లోయలు, అచ్చెరువొందించే అటవీ వృక్ష సంపద.. వీటి మీదుగా పలకరించే వర్షపు జల్లులు మహాబలేశ్వర్ సందర్శకులను ఓ వింతైన అనుభూతిని కలిగిస్తాయి. అంతేకాదు కొండలపై నుంచి సాగే చల్లని గాలులు మేనిని తాకి గిలిగింతలు పెడతాయి. మహారాష్ట్రలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన హిల్ స్టేషన్ ఇది. ఇక్కడికి విచ్చేసే సందర్శకులు ప్రకృతిని, చారిత్రక కట్టడాలను చూసి తరించవచ్చు. ఇక్కడ మౌంట్ మల్కోమ్, మరోజి క్యాజిల్, మహాబలేశ్వర్ క్లబ్ చూశాక సుందరమైన వెన్నా సరస్సుకు చేరుకోవాలి. అక్కడ బోటులో షికార్లు, చేపలు పట్టడం, రైడింగ్ చేయడం వంటి క్రీడల ద్వారా ఉల్లాసాన్ని పొందవచ్చు. దగ్గరలోనే పంచ్గని, స్ట్రాబెర్రీ తోటలను వీక్షించవచ్చు. మహాబలేశ్వర్ చుట్టుపక్కల పేరొందిన పంచగంగ మందిర్, కోయనా, వెన్నా, సావిత్రి, గాయత్రి, కృష్ణా నదీ పాయల సోయగం, బాబింగ్టన్ పాయింట్లోని దోమ్ డ్యామ్, మహాబలేశ్వర్ మందిరం దర్శించవచ్చు. వర్షాకాలంలో ఈ ప్రాంత సందర్శన పర్యాటకులకు ఆనందానుభూతులను మిగులుస్తుంది. దీనికి దగ్గరలో పుణేలో (120 కి.మీ) విమానాశ్రయం ఉంది. వసతి సదుపాయాల కోసం ఎమ్టిడిసి హాలీడే రిసార్ట్స్ను సంప్రదించవచ్చు. వర్షంలో హర్షం గోవా లక్షలాది పర్యాటకులను అమితంగా ఆకట్టుకు నే ప్రాంతం గోవా. వేసవిలో నిశ్శబ్దంగా ఉండే గోవా జులై మాసాన అడుగుపెట్టే వర్షరుతువు లో అత్యద్భుతంగా కనివిందు చేస్తుంది. అందుకే వర్షాకాలంలోనూ గోవా పర్యటనకు ఆసక్తి చూపే పర్యాటకులు పెరుగుతున్నారు. ఉన్నట్టుండి మబ్బుల పట్టిన ఆకాశం, ఆ వెంటనే సూర్యకాంతి వెలుగులు ఆహ్లాదపరుస్తుంటాయి. దాదాపు 80 బీచ్లు, ఇసుక తీరాలు కనువిందు చేస్తుంటాయి. ప్యారాచూట్స్, బోట్రైడింగ్, బైక్ రైడింగ్లో ఉల్లాసాన్ని పొందవచ్చు. గోవాకే ప్రత్యేకమైన అతిపెద్ద ప్రాచీన చర్చ్నీ, సహజసిద్ధమైన జలపాతాల అందాలనూ వాన జల్లుల మధ్య ఎంత సేపు చూసినా తనివి తీరదు. గోవా సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఎన్నో హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి. ఇవి ప్రత్యేక వర్షాకాల ప్యాకేజీలను డిస్కౌంట్ రేట్లలో ఇస్తున్నాయి. హైదరాబాద్ నుంచి రాయచూర్-భాగల్కోట్- బెల్గామ్ల మీదుగా గోవా చేరుకోవచ్చు. దూరం 660 కి.మీ. హైదరాబాద్ నుంచి వోల్వో బస్సు సదుపాయాలు ఉన్నాయి. పావ్లో ట్రావెల్స్ ఫోన్ నెం: +91-40-66515051/66625856/66625857, కేశినేని ట్రావెల్స్ మొబైల్ నెం: +919849051414, ఎస్విఆర్ ట్రావెల్స్ ఫోన్: 040-23735005, 23755442, 237332444. హైదరాబాద్ నుంచి రైలు మార్గాన వాస్కో-డ-గామ్ ఎక్స్ప్రెస్లో నేరుగా గోవాకు చేరుకోవచ్చు. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో విమానాలు హైదరాబాద్ నుంచి గోవా వెళుతుంటాయి. మరిన్ని వివరాల కోసం ఇండియా పర్యాటక శాఖ వారిని సంప్రదించవచ్చు. ఫోన్ నెం: 040-23409199 -
విహార యాత్రకు వెళ్లివస్తానని చెప్పి..
బంగారుపాళెం : ‘విహార యాత్రకు వెళ్లివస్తానని చెప్పి శవమై వచ్చావా తల్లీ.. అప్పుడే నీకు నిండు నూరేళ్లూ నిండిపోయాయా.. అమ్మా..’ అంటూ తల్లిదండ్రుల ఏడ్పులు చూపరులకు కంటతడిని తెప్పిం చాయి. ఎక్కెక్కి ఏడ్చుతున్న వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. హైదరాబాద్లోని విజ్ఞానజ్యోతి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న రిథిమా పాపాని మార్చి 3న కళాశాలకు చెందిన మిత్రులతో కలసి విహారయాత్రకు వెళ్లింది. ఆపై 8వ తేదీ హిమాచల్ప్రదేశ్లోని బియాస్నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం ఆమె మృతదేహాన్ని అధికారులు కనుగొన్నారు. శుక్రవారం ఆమె మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి స్వగ్రామమైన బంగారుపాళెం మండలం పాపానివారిపల్లెకు తరలించారు. రిథిమా మృతదేహానికి కుటుంబ సభ్యులు, బంధువులు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి పాపాని శ్రీనివాస్ కుమార్తె అంతిమ సంస్కారాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రిథిమా మృతదేహాన్ని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించి నివాళులర్పించారు. బంధువులను ఓదార్చారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు లలితకుమారి, వెంకటేశ్వర చౌదరి, మాజీ ఎంపీ దుర్గారామకృష్ణ, డీఆర్వో పెంచలకిషోర్, రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శివకుమార్, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విజయసింహారెడ్డి, బంగారుపాళెం తహశీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐలు మధుసూదన్నాయుడు, శివకుమార్, టీడీపీ మండలాధ్యక్షుడు జయప్రకాష్, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు రామచంద్రారెడ్డి తదితరులు రిథిమా మృతదేహాన్ని సందర్శించారు. తిరుపతి విమానాశ్రయంలో తిరుపతి ఆర్డీవో రంగయ్య, రేణిగుంట తాహశీల్దార్ మనోహర్ విమానాశ్రయానికి చేరుకుని రిథిమా మృతదేహానికి నివాళులర్పించారు. -
కథ: పల్లె విహారం
అతణ్ని ఆఫీసులో అందరూ వెస్టీ అని పిలుస్తారు. ఒక చిత్రమైన వ్యక్తిగానూ పరిగణిస్తారు. అతడొక సాధారణమైన ఉద్యోగి. వయసులో పెద్దవాడు. స్వభావంలో మంచివాడు. కాని ఇన్నేళ్ల తన జీవితంలో అతగాడు ఒక్కసారంటే ఒక్కసారి మాత్రమే పారిస్ నగరాన్ని విడిచి బయటికెళ్లాడు. అది జూలై నెల చివరి వారం. ఉద్యోగులంతా ప్రతి ఆదివారం అలవాటుగా పారిస్కు దూరంగా ఉన్న పల్లెలవైపు విహారయాత్ర చేస్తారు. పచ్చని పచ్చికలో పొర్లటం, నీట మునిగి తేలి కేరింతలు కొట్టటం చేస్తారు. ఎవరికి వారు ఎంపిక చేసుకున్న పల్లెవైపు మాత్రమే పోతారు. అంటే ప్రతీ పల్లెకూ ఆనవాయితీగా వెళ్లే సందర్శకులంటారు. పారిస్ ఉద్యోగులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆ దర్శనీయ స్థలాల అందాలూ ఆకర్షణలూ వారి దైనందిన సంభాషణల్లో, వాగ్వివాదాల్లో చోటుచేసుకుంటాయి. పెద్దాయన వెస్టీ మాత్రం ఎప్పుడూ ఇలా అనేవాడు: ‘‘మూర్ఖుల్లారా! మీరంతా గొర్రెల మందల్లాగా పల్లెలవైపు పోతారు గానీ, ఆ పల్లెలు అందరాని అద్భుతమైనవని నాకనిపించదు. మీదంతా ఒక వెర్రి...’’బొయ్విన్ నాతోనే ఒకే గదిలో పనిచేసేవాడు. కొలంబస్ అనే పల్లెలో ఆ వెధవకొక కొంప ఉండేది. ఒక్క ఆదివారమైనా నన్ను అక్కడికి రమ్మని తెగ పోరుతూ ఉండేవాడు. ‘‘అయితే వెస్టీ నువ్వెప్పుడన్నా అసలు పారిస్ విడిచి బయటకు వెళ్లావా? లేదా?’’ అని మేం అడిగాం. ‘‘నేను బస్సుల్లో మాత్రమే బయటికెళ్తాను. గ్రౌండ్ ఫ్లోర్లోని సారా వ్యాపారి దుకాణంలో సుష్టుగా భోంచేసి బస్సు రూట్లూ వేళలతో సైతం పారిస్ మ్యాప్ని ఒకదాన్ని తయారుచేసుకుంటాను. అప్పుడు నేను బస్సు పెట్టెలో పైకి ఎక్కి గొడుగు వేసుకొని కూర్చుంటాను. ఎన్నో దృశ్యాల్ని చూస్తాను. మీ అందరూ చూసినవాటి కన్నా నేనెక్కువ భిన్నమైన స్థలాల్ని సందర్శిస్తాను. నా ప్రయాణం ప్రపంచాన్నే చుట్టివచ్చినంత ఆహ్లాదంగా ఉంటుంది. ఒక వీధిలో నివసించే జనాలు వేరొక వీధివాసుల్లాగా ఉండరు. పారిస్ నగరం నాకు తెలిసినంతగా వేరెవరికీ తెలీదు. అలా అలా సాగుతుండగా మొదటి అంతస్తు కిటికీ దృశ్యాలు ఎంతో వినోదాన్ని కలిగిస్తాయి. ఓ చోట బిగ్గరగా అరుస్తున్న వ్యక్తి ముఖాన్ని చూసి అతని ఇంటి పరిస్థితుల్ని చిత్రించుకోవచ్చు. మరోచోట ఒక కస్టమర్ ముక్కుకు సబ్బు నురగతో ప్లాస్టర్ చేసి వీధివైపు దృష్టి సారిస్తున్న బార్బల్ని చూసి మీరూ నవ్వుకోవచ్చు. ఇంకోచోట బట్టల దుకాణంలోని అందమైన అమ్మాయిల కొంటెచూపుల్ని సరదాగా తిప్పికొట్టవచ్చు. ఇలాంటి ఆనంద దాయకమైన సంఘటనల్ని కోకొల్లలుగా చూడగలరు. అంతేకాదు, వాస్తవ జీవితాన్ని చిత్రించే నిజమైన నాటకం లాగా నా ప్రయాణం కొనసాగుతుంది. నా బస్సు ప్రయాణపు అందాల్నీ ఆనందాల్నీ సుదూరపు పల్లెటూర్లలో మీ తెలివితక్కువ తిరుగుళ్లతో పోగొట్టుకోలేను’’ అనేవాడు వెస్టీ. ‘‘అయినా సరే వెస్టీ! ఒక్కసారి ప్రయత్నించకూడదూ. ఒకే ఒక్కసారి పల్లెల వైపు వచ్చి చూడు. ఎంత ఆహ్లాదంగా ఉంటుందో నీకే తెలుస్తుంది’’ అని మేం అనేవాళ్లం. ‘‘ఇరవై సంవత్సరాల క్రితం ఒకే ఒక్కసారి వెళ్లాను. మళ్లీ వెళ్లి బలైపోవడం నాకు ఇష్టం లేదు’’ అన్నాడు. ‘‘ఒక్కసారి వెళ్లావా? చెప్పవేం మరి. అయితే పెద్దోడా! ఆ అనుభవాల్ని మాకు చెప్పు చెప్పు’’ అని మేమంతా అతణ్ని ఒత్తిడి చేశాం. ‘‘చెప్తాను. ఆగండి మరి. మీకు బొయ్విన్ తెలుసు కదా. అక్షరాల్ని చెమటతో తడిపేసేవాడు. అతగాడు... మనం అతణ్ని రకరకాల పేర్లతో పిలిచేవాళ్లం.’’ ‘‘అవును. గుర్తున్నారు.’’ ‘‘బొయ్విన్ నాతోనే ఒకే గదిలో పనిచేసేవాడు. కొలంబస్ అనే పల్లెలో ఆ వెధవకొక కొంప ఉండేది. ఒక్క ఆదివారమైనా నన్ను అక్కడికి రమ్మని తెగ పోరుతూ ఉండేవాడు. అతడనేవాడు, ‘‘పాంటలూన్ (నన్నతడు సరదాగా పిలిచే మారు పేరు)! నాతో రావయ్యా. ఎంతో ఆహ్లాదకరమైన విహారాన్ని చవి చూపిస్తాను.’’ ‘‘అంతే. ఒక ఫూల్లాగా అతగాడి వలలో పడి ఒక ఆదివారం ఉదయం ఎనిమిది గంటల రైల్లో బయల్దేరాను. దారి కనుక్కోవడం కూడా సాధ్యం కాని ఒక చిన్న పల్లెని చేరుకున్నాను. చిట్టచివరికి ఒక సందు చివర రెండు గోడల మధ్య ఒక పాత కట్టె ద్వారాన్ని కనుగొన్నాను. దానికొక ఇనుప కాలింగ్ బెల్ ఉన్నది. ‘‘నేనా బెల్ని కొట్టాను. కొంతసేపు వేచివున్న తర్వాత తలుపు తెరుచుకున్నది. ‘‘మొదటి చూపులో ఆ తెరిచింది మనిషో మర్కటమో నేను పోల్చుకోలేకపోయాను. ‘‘ఆమె ఒక అనాకారి ముసల్ది. వేసుకున్న గుడ్డలు పీలికలుగా ఉన్నాయి. మనిషంతా మురికి పట్టి ఉన్నది. కోపిష్టిలాగానూ ఉన్నది. జుత్తులో పక్షి ఈకలున్నాయి. ఆమె నా కంటికి నన్ను మింగడానికి సిద్ధంగా ఉన్న ముసలి రాక్షసిలా కనపడింది. ‘‘ఆమె అడిగింది: ‘నీకేం కావాలి?’ ‘‘బొయ్విన్ కావాలి. ‘‘అతడితో నీకేం పని?’’ చిరాకుతో కూడిన ఈ ఎదురుప్రశ్న నన్ను తికమక పెట్టింది. ‘‘అప్పుడు నేను మెల్లగా గొణిగాను, ‘బొయ్విన్ నాకోసం చూస్తుంటాడు.’ ‘‘ఓహో లంచ్కి వచ్చేవాడివి నువ్వేనా?’’ జంకుతూ అంగీకరించాను. అప్పుడామె ఇంటి లోపలికి తిరిగి అసహనమైన గొంతుతో అన్నది: ‘‘బొయ్విన్ నీ అతిథి వచ్చాడు’’ ఈమె నా మిత్రుడి భార్య! బొయ్విన్ తలుపు దగ్గరకొచ్చాడు. మరకలు పడిన గుడ్డల్తో ఉన్నాడు. తలపైన పాడుబడిన పనామా టోపీ ఉన్నది. కరచాలనం చేసి తోట అని పిలవబడే ఆవరణలోనికి తీసుకెళ్లాడు. అది మరీ ఇరుకు దారి చివర్న ఉన్నది. చేతి రుమాలంత చిన్న స్థలంలో ఉంది. దాని చుట్టూ ఎత్తయిన భవనాలు ఉన్నాయి. సూర్యుడు ఒకటి రెండు గంటలు మాత్రమే ఆ తోటలోనికి తొంగి చూడగలడు. పాన్సీలూ, వాల్ పుష్పాలూ, కొద్దిపాటి గులాబీ మొక్కలూ ఉన్నాయి. అవి కూడా చుట్టూ ఉన్న ఇళ్ల పైకప్పులు ప్రతిబింబించే వేడికి వాడిపోయే స్థితిలో ఉన్నాయి. ‘మాకు పెద్ద చెట్లయితే లేవు’ బొయ్విన్ స్వగతంలాగా అన్నాడు. ‘కాని ఇరుగు పొరుగు ఇళ్లే నీడనిస్తుంటాయి. దాంతో మాకు అడవిలో ఉన్నంత నీడ దొరుకుతుంది.’ బొయ్విన్ నా కోటు చివర పట్టుకుని నా చెవిలో అన్నాడు: ‘నా భార్యని చూశావు కదా. అదో పాచిపళ్ల రాక్షసి. ఇవ్వాళ నువ్వొచ్చావు కదా! నాకు మంచి బట్టలిచ్చింది. అవి మట్టి పడితే తిడుతుంది. కాబట్టి ఈ పూటకి నువ్వే మా పూల మొక్కలకి కాస్త నీరు పోసి పెట్టాలి. ప్లీజ్!’ అందుకు నేనూ అంగీకరించాను. కోటు తీసి షర్టు చేతుల్ని వెనక్కి మడిచాను. పంపు మాత్రం చాలా చిన్నది. ఎన్నో పురిటి నొప్పుల తర్వాత ఒక చుక్క నీరు కారుస్తున్నది. చిన్న క్యాన్ని నింపటానికి పది నిమిషాలు పట్టింది. నేనొక పందిలాగా చెమట పట్టాను. బొయ్విన్ నేనే పనులు చెయ్యాలో పురమాయించడం మొదలుపెట్టాడు. ‘ఇక్కడ... ఈ మొక్క... దీనికి మరికొంచెం... చాలు... ఇప్పుడు దీనికి...’ నీరు పోసే క్యాన్కి ఒక రంధ్రం ఉన్నది. నీరు అదేపనిగా చిమ్మడం మొదలుపెట్టింది. దాంతో పూలమొక్కల కన్నా నా పాదాలు బాగా తడిసిపోయాయి. నా ప్యాంటు పాదాల దగ్గర బాగా తడిచి ముద్దయ్యింది. బురద పట్టుకుపోయింది. నేను పంపు పట్టుకోవడం, ప్యాంటు తడవడం, చెమట పట్టడం ఈ విధానమంతా సుమారు ఒక ఇరవైసార్లు జరిగింది. నేను అలసిపోయి ఆగిపోదామనుకునేసరికి బొయ్విన్ నా చెయ్యి పట్టుకొని బతిమాలడం మొదలుపెట్టాడు. ‘మరొక్క క్యాన్... మరొక్కటి మాత్రమే.. చాలు... పూర్తవుతుంది.’ తన కృతజ్ఞతను తెలుపడానికి నాకొక విచ్చిన గులాబీ ఇచ్చాడు. నేను దాన్ని కోటు గుండీ వద్ద పెట్టుకునేసరికి రెక్కలన్నీ రాలిపోయి ఆకుపచ్చని రాతి వంటి తొడిమ మాత్రమే మిగిలింది. నాకు నోట మాట రాలేదు. నేనేమీ అననూ లేదు. దూరం నుండి మేడమ్ బొవిన్ కేక వినపడింది. ‘‘ఓయ్! లోపలికి రండి. లంచ్ రెడీ అయింది.’’ మేం తోట వదిలి ఇంటికి తిరిగి వచ్చాం. తోట నీడలో ఉన్నది. అందుకు భిన్నంగా ఇల్లు ఎండలో మండిపోతున్నది. నా మిత్రుడి హాలూ భోజనాల గదీ అగ్ని గోళాల్లాగా ఉన్నాయి. డైనింగ్ టేబులు మీద మూడు ప్లేట్లున్నాయి. వాటిపక్కన సగం శుభ్రం చేసిన తెల్ల మెటల్ ఫోర్కులున్నాయి. టేబుల్ మధ్యలో ఉడికించిన మాంసం, బంగాళా దుంపలూ గల ఒక మట్టిపాత్ర ఉన్నది. మేం తినటానికి కూర్చున్నాం. ఒక్క చుక్క మాత్రమే వైన్ కలిపిన పెద్ద గాజు పాత్ర నిండా నీరూ నా కంట పడింది. బొయ్విన్ తికమక పడి భార్యను బతిమాలాడు: ‘మై డియర్! ఈ ఒక్కసారి మాత్రం నీరు కలపని వైన్ తీసుకోనివ్వవా?’ ఆమె అతని వైపు కోపంగా చూసింది. ‘‘అయితే మీరిద్దరూ తాగి తందనాలాడి ఇల్లు న్యూసెన్స్ చేస్తారా? కుదరదు.’’ బొయ్విన్ వెనక్కి తగ్గాడు. ఈసారి మాంసంతో పాటు బంగాళా దుంపల్ని వడ్డించింది. భోజనాల రెండో విడత నిశ్శబ్దంగా పూర్తయింది. అప్పుడామె ప్రకటించింది. ‘భోజనం ఇంతే ఇక లేవండి.’ బొయ్విన్ భార్య వైపు దిగ్భ్రాంతితో చూశాడు. ‘మరి ఆ పావురం... ఈ రోజు ఉదయం నువ్వు పట్టుకున్న పావురం...’ ఆమె చేతులు జాడిస్తూ నిల్చుంది. ‘మీకింకా చాల్లేదా. ఇళ్లు ఖాళీ చెయ్యడానికి జనాల్ని పిల్చుకొస్తుంటావు. అంతా మీకే మేపితే ఈ సాయంత్రం నేనేం తినాలి?’ మేం లేచాం. బొయ్విన్ మెల్లగా నా చెవిలో ఊదాడు: ‘ఒక్క నిమిషంలో నేనూ నీతో వస్తాను. ఇద్దరమూ కలిసి బయటికెళ్దాం.’ బొయ్విన్ తన భార్య వెళ్లిన వంటగది వైపు వెళ్లాడు. ఆ తరువాత ఈ సంభాషణ నా చెవిన పడింది. ‘‘డార్లింగ్! నాకో ఇరవై నాణేలు ఇవ్వవూ!’’ ‘‘వాటితో ఏం చేస్తావు?’’ ‘‘ఏం అవసరం పడుతుందో చెప్పలేం కదా! డబ్బు చేతిలో లేకపోతే అసహ్యంగా ఉంటుంది.’’ నాకు వినపడేట్టు ఆమె గొంతు పెంచింది. ‘‘మరేం ఫరవాలేదు. నీ దగ్గర డబ్బుండటానికి వీల్లేదు. ఆ వచ్చినవాడికి లంచ్ మేపావు కదా! దానికి మారుగా మిగిలిన నీ రోజు ఖర్చులన్నీ వాడే భరించాలి. అంతే!’’ బొయ్విన్ నా వద్దకు తిరిగి వచ్చాడు. ఇక బయల్దేరేటప్పుడు నా సభ్యత తెలపటానికి నా అతిథేయి భార్యకు తలవంచి ఇలా గొణిగాను. ‘మీ దయ గల ఆతిథ్యానికి థాంక్స్ మేడమ్.’ అందుకామె ఇలా జవాబు చెప్పింది. ‘సరే. సరే. వీడికి మాత్రం సారా పట్టించి ఇంటికి తేవద్దు. తెస్తే నేనొప్పుకోను సుమా!’ మేం బయల్దేరాం. అక్కణ్నించి నీడే లేని విశాలమైన బయలు ప్రాంతాన్ని దాటాం. నేను దారి పక్కనున్న కొమ్మనొకదాన్ని పీకడానికి ప్రయత్నించి కెవ్వుమన్నాను. నా చేతికేదో గుచ్చుకుని దురద పుట్టింది. ఆ మొక్కని దురద గొండి అంటారట. ఎటు చూసినా భరించలేని పేడ దుర్గంధం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. బొయ్విన్ అంటున్నాడు. ‘కొంచెం భరించు. కొద్దిసేపట్లో మనం నదిని చేరుకుంటాం.’ నిజానికి నదినైతే చేరుకున్నాం. కాని అక్కడ కూడా బురద, మురికి, కంపు నిండి ఉంది. సూర్యుడి వేడి కిరణాలు నీటిమీద పడుతున్నాయి. నా కళ్లు నొప్పి పెట్టాయి. అక్కణ్నించి మరెక్కడికైనా పోదామని బొయ్విన్ని కోరాను. అతడు నన్నొక కొంప లాంటి చోటుకి తీసుకెళ్లాడు. అక్కడ జనం కిక్కిరిసి ఉన్నారు. అదొక చిన్న పాకలో నడుస్తున్న పానశాల. నది పక్క నివసించే జాలరులు అక్కడికి వస్తుంటారు. బొయ్విన్ అన్నాడు: ‘ఇది చూడ్డానికి బావుండదు గానీ తినే పదార్థాలు బావుంటాయి. నేనూ ఆకలిగా ఉన్నాను. ఒక ఆమ్లెట్ ఆర్డరిచ్చాను’. ఆసరికి బొయ్విన్ రెండో రౌండ్ మద్యానికే తలవాల్చేశాడు. ఫూల్! అతడి భార్య అతికొద్దిపాటి సారాయితో కడివెడు నీటిని ఎందుకు కలిపిందో నాకిప్పుడు అర్థమైంది. బొయ్విన్ లేచి బిగ్గరగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడ ఇద్దరు తాగుబోతులు పోట్లాడుకొంటున్నారు. వారి మధ్యగా తలదూర్చి తన వీరత్వాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించాడు. కొట్టు యజమాని కల్పించుకోకపోతే మమ్మల్నిద్దర్నీ చంపేసేవారు. తాగి తూలుతూ పేలుతున్నవాడికి చేసినట్లుగా నేనతణ్ని బలవంతంగా పట్టుకుని దూరంగా లాక్కొచ్చాను. ఒక చెట్టు నీడలోకి తెచ్చి పరుండబెట్టాను. అతడి పక్కనే నేను కూడా చతికిలబడిపోయాను. మేమిద్దరమూ చాలాసేపే నిద్రపోయినట్టున్నాం. ఎందుకంటే నేను లేచేసరికే చీకటైపోయింది. బొయ్విన్ ఇంకా నా పక్కన గురక పెడుతూనే ఉన్నాడు. గట్టిగా తట్టి లేపితేనే మేల్కొన్నాడు. ఇంకా మైకంలోనే ఉన్నాడు గానీ ఇందాకటికన్నా నయంగా ఉన్నాడు. మేం చీకట్లోనే ఆ బయలు ప్రాంతాన్ని దాటడానికి బయల్దేరాం. తనకు దార్లన్నీ బాగా తెలుసునని బొయ్విన్ నిబ్బరంగా చెప్పుకొచ్చాడు. ముందు ఎడమకూ ఆ తరువాత కుడివైపూ మళ్లీ ఎడమవైపూ అటూ ఇటూ తిరిగాం. పైన ఆకాశం గానీ కింద నేలగానీ కనపడలేదు. మా కంటే ఎత్తయిన డొంకలు గల కీకారణ్యంలో మేం దారి తప్పిపోయాం. కచ్చితంగా అది తీగలు పాకిన స్తంభాలు గల ద్రాక్ష తోట అయి ఉంటుంది. మాకొక్క వీధి దీపం కూడా కనపడలేదు. బహుశా ఒక రెండు గంటల పాటు మేం అదే పనిగా గుండ్రంగా తిరిగాం. తడబడుతూ బయటికొచ్చే దారి దొరికినట్టే దొరికి మళ్లీ తప్పిపోయేవాళ్లం. పోనీ మా అడుగు జాడలు మాకు కనపడే పరిస్థితి కూడా లేదు. అంతా చీకటి. చివరికి బొయ్విన్ నేలలో పాతివున్న ఒక కొయ్య పైన పడిపోయాడు. అతడి చెక్కిలి తెగిపోయింది. నేలమీద కూలబడిపోయాడు. బిగ్గరగా ఊపిరితిత్తుల శక్తి మేరకు అరవడం మొదలుపెట్టాడు. నేను కూడా హెల్ప్ హెల్ప్ అని గొంతు చించుకున్నాను. మమ్మల్ని రక్షించేవారికి మా ఉనికిని తెలపడానికి, మేం కూడా ధైర్యం తెచ్చుకోవడానికి కొవ్వత్తుల్ని వెలిగించాం. చివరికి తన పనిలో ఆలస్యమైన ఒక రైతు మా గోడు విని, వచ్చి సరైన దారి చూపించాడు. బొయ్విన్ని, నేను ఇంటి వరకూ తీసుకెళ్లాను. కానీ గేటు ముందే అతణ్ని విడిచి రావాలనుకున్నాను. అయితే ఒక్కసారిగా గేటు తలుపు తెరుచుకున్నది. ఎదురుగుండా బొయ్విన్ భార్య నిల్చుని ఉన్నది. ఆమె చేతిలో కొవ్వత్తి వెలుగుతున్నది. ఆ ఉగ్రరూపం చూసి నేను భయపడిపోయాను. బహుశా చీకటి పడినప్పటినుండీ ఆమె మగడి కోసం కాచుకొని ఉండొచ్చు. అతణ్ని చూడగానే నావైపు తిరిగి పెద్దగా అరవడం మొదలుపెట్టింది: ‘‘ఓరీ! స్కౌండ్రల్. వీణ్ని నువ్వు తప్ప తాగించి ఇలాగే తెస్తావని నాకు తెలుసు.’’ మీరు నమ్మండి... నేను పరుగు లంకించుకున్నాను. ఆ మహోగ్ర మూర్తి నా వెంట పడుతుందని భయంగానే ఉంది. దగ్గరి రైల్వేస్టేషన్కు చేరుకునే వరకూ పరిగెడుతూనే ఉన్నాను. అక్కడ మరో అరగంట వరకూ రైలు ఏదీ లేదని తెలిసింది. ‘ఎందుకైనా మంచిదని అక్కడి శౌచాలయంలోకి దూరి లోపల గడియ పెట్టుకున్నాను.‘అంచేత నేను పెళ్లి జోలికీ పోలేదు. ఆ తరువాత ప్యారిస్ నగరం విడిచి వెళ్లనూ లేదు. .ఫ్రెంచ్ మూలం: గై డి మొపాసా .తెలుగు: టి.షణ్ముఖరావు -
నిర్లక్ష్యం తెచ్చిన విషాదం
సంపాదకీయం: వేర్వేరు స్థాయిల్లో తీసుకోవలసిన చిన్న చిన్న జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యంవహిస్తే ఏమవుతుందో హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాలో బియాస్ నదిలో మృత్యువాతపడిన విద్యార్థుల ఉదంతం తెలియజెబు తున్నది. తమ పిల్లలు మంచి చదువులు చదువుకుంటున్నారని, మరి కొన్నాళ్లలోనే ప్రయోజకులై జీవితంలో స్థిరపడతారని తల్లిదండ్రు లంతా ఆశిస్తున్న తరుణంలో ఇంతటి పెనువిషాదం వారిని చుట్టు ముట్టింది. హృదయమున్న ప్రతి ఒక్కరినీ తల్లడిల్లేలా చేసింది. యా త్రకని ఎంతో ఉత్సాహంగా వెళ్లిన పిల్లలు ఇలా శాశ్వతంగా దూరమ వుతారని, తమకు గర్భశోకం మిగులుస్తారని ఎవరూ అనుకుని ఉం డరు. హైదరాబాద్ నగర శివార్లలోని విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24మంది, ఒక టూర్ ఆపరేటరు గల్లంతుకాగా నలు గురు విద్యార్థుల మృతదేహాలు మాత్రమే ఇంతవరకూ లభించాయి. గల్లంతైనవారిలో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారో లేదో ఇంతవరకూ తెలియ లేదు. అసలు విద్యార్థులు వెళ్లింది పారిశ్రామిక శిక్షణకా లేక విహార యాత్రకా అన్న స్పష్టత లేదు. కాలేజీ యాజమాన్యానికైనా ఉన్నదో లేదో తెలియదు. విహారయాత్రకైతే యూనివర్సిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని జెన్టీయూ చెబుతున్నది. ఇలాంటి సంద ర్భాల్లో అనుసరించాల్సిన విధానాలకు సంబంధించి నిబంధనలుగానీ, మార్గ దర్శకాలుగానీ ఇంతవరకూ లేవని జేఎన్టీయూ ప్రకటన చూస్తే అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు వాటికి రూపకల్పన చేస్తామంటు న్నారు. ఈ దుర్ఘటనతో పోలిస్తే చిన్నదే కావొచ్చుగానీ కొన్నాళ్లక్రితం పులిచింతల ప్రాంతంలో కూడా ఇలాగే ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. యాత్రలకు తీసుకెళ్లేటపుడు పాటించాల్సిన అంశాల విషయంలో తగిన నిబంధనలను అప్పుడే రూపొందించివుంటే కళా శాల యాజమాన్యాలకు తగిన అవగాహన వచ్చివుండేది. తల్లిదం డ్రులు కూడా అన్నివిధాలా సంతృప్తిపడిన తర్వాతే తమ పిల్లలను అనుమతించేవారు. విద్యార్థులను యాత్రలకు తీసుకెళ్లేట పుడు ఆయా ప్రాంతాల గురించిన సం పూర్ణ అవగాహన ఉన్నవారిని వారితోపాటు పంపడం కనీస ధర్మం. కనీసం స్థానికులెవరినైనా గైడ్లుగా పెట్టుకునివున్నా బాగుండేది. ప్రమా దాలు పొంచివుండే ప్రాంతాలేమిటో, అత్యంత జాగురూకతతో మెల గవలసిన అవసరం ఉన్న ప్రదేశాలేమిటో తెలిసివున్నవారు విద్యార్థుల తోపాటు ఉంటే అది ప్రమాదాల నివారణకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు విద్యార్థులు దిగిన ప్రదేశానికి 2.7 కిలోమీటర్ల ఎగువన ఒక చిన్న బరాజ్ ఉన్నదని, అక్కడ అప్పుడప్పుడు నీళ్లు వదిలే అవకాశం ఉంటుందన్న అవగాహన ఉన్నవారు విద్యార్థులకు తోడుగా ఉంటే వా రిని అప్రమత్తం చేసేవారు. కనీసం బరాజ్ ప్రదేశానికి వెళ్లి నీళ్లు వదిలే సమయం ఎప్పుడో తెలుసుకునేవారు. అటు తర్వాతే విద్యార్థులు భరోసాతో ఆ ప్రదేశానికి వెళ్లేవారు. ఇలాంటి చిన్న చిన్న అంశాలపై శ్రద్ధవహించకపోవడం యాజమాన్యంవైపు నుంచి జరిగిన లోపం. బరాజ్ నిర్వహణ కూడా అస్తవ్యస్థంగా ఉన్నదని అక్కడినుంచి వెలువడుతున్న కథనాలు సూచిస్తున్నాయి. మలుపులతో ఉన్న బియాస్ నదీమార్గంలో విద్యుదుత్పాదన కోసమని బరాజ్ నిర్మిం చినప్పుడు, అవసరాన్నిబట్టి గేట్లు వదులుతున్నప్పుడు ఆ సంగతిని తెలియజెబుతూ నదీమార్గం పొడవునా అక్కడక్కడ హెచ్చరికల బోర్డులుంచాలని ప్రభుత్వ యంత్రాంగానికి తట్టలేదు. అన్నిటికంటే హాస్యాస్పదమైన విషయమేమంటే గేట్లు తెరిచినప్పుడు సైరన్ మోత మోగిస్తారటగానీ అది బరాజ్ చుట్టుపక్కల కొంత దూరం మాత్రమే వినబడుతుందట! వదిలిపెట్టే నీరు ఒక్కసారిగా ఆరేడు అడుగుల ఎత్తున ఎగిసిపడుతూ బయటికొస్తుంది. ప్రవాహం ఉరవడి పెరుగుతుంది. నదీమార్గం పొడవునా క్షణాల్లో ఈ మార్పులు చోటు చేసుకుం టున్నప్పుడు... సరిగ్గా అక్కడే సందర్శకుల రద్దీ నిత్యమూ ఉంటున్న ప్పుడు ప్రమాదాలకు ఆస్కారం ఉండవచ్చునన్న ఆలోచన ప్రభుత్వ యంత్రాంగానికి కలగాలి. అందుకు తగినట్టుగా నిర్ణీత ప్రాంతాల్లో సైరన్లు మోగించడమో, మరోవిధమైన ఏర్పాటో చేయాలి. ప్రమా దం చోటుచేసుకున్న ప్రాంతంలో జలపాతం ఉన్నదంటేనే సందర్శ కులు ఫొటోలు తీసుకోవడానికి తప్పనిసరిగా అక్కడ ఆగుతారని అంచనా ఉండాలి. పైగా నదీమార్గం మలుపులతో ఉన్నప్పుడు ఎగువ నుంచి వచ్చే నీటి ఉరవడిని సమీపానికి వచ్చేవరకూ గమ నించడం సాధ్యంకాదు. ఇలాంటి అంచనాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం, అందుకవసరమైన చర్యలు తీసుకోకపోవడం విచా రకరం. ప్రమాదం జరిగాక అయినా అక్కడి ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక లేని తీరు చూస్తే దాన్నుంచి ఇన్ని ముందు జాగ్రత్తలను ఆశించడం వృథా ప్రయాసే. అయితే, మనకున్న విపత్తుల నివారణ సంస్థ పనితీరు కూడా అధ్వాన్నంగానే ఉన్నది. ప్రమాదాలు సంభవించాక వివిధ శాఖలను అప్రమత్తం చేయడం, సహాయబృందాలు తరలివెళ్లేలా చూడటంవంటి పనులు ఆ సంస్థ చేస్తున్నది. అవి అవసరమే. కానీ, ఇలా ప్రమాదాలు పొంచివుండే ప్రాంతాలను సర్వేచేసి స్థానిక యం త్రాంగానికి తగిన సూచనలివ్వడం, వాటి అమలు తీరును ఎప్ప టికప్పుడు పర్యవేక్షించడంవంటివి చేయడం లేదు. దేశంలో ఏ ప్రాంతం గురించి అయినా, అక్కడ ఎదురుకాగల ఇబ్బందుల గురించి అయినా సంపూర్ణ అవగాహన కలిగించేలా వెబ్సైట్ను రూపొందించి మరిన్ని సూచనలు, సలహాలు ఇవ్వాలని అందరినీ కోరితే...వాటిని సైతం వెబ్సైట్లో ఉంచితే సందర్శకులు తాము దిగిన స్థలం ఎలాంటిదో అక్కడికక్కడే అవగాహన తెచ్చుకుంటారు. ఈ కనీస జాగ్రత్తలు లేకపోవడమే విలువైన యువ ప్రాణాలను కబళించింది. ఈ నిర్లక్ష్యం పోవాలంటే ఇంకెందరు బలికావాలో?! -
మన మెదడు చాలా... ఫాస్ట్!
వాషింగ్టన్: మనిషి మెదడుకు సంబంధించిన మరో కొత్త సంగతిది. ఇప్పటిదాకా 100 మిల్లీసెకన్ల కంటే తక్కువ సమయం కనిపించే దృశ్యాలను మెదడు బాగా విశ్లేషించలేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 13 మిల్లీసెకన్లు చాలు ఏ దృశ్యాన్నైనా మెదడు చూడగలదని ఎంఐటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. వీరి పరిశోధన కోసం.. కొందరు వలంటీర్లకు నవ్వుతున్న దంపతులు, విహారయాత్ర, ఇతర దృశ్యాలకు సంబంధించిన ఫొటోలను 80, 53, 40, 27, 13 మిల్లీసెకన్ల సమయం చొప్పున కంప్యూటర్లో చూపిం చారు. ఒక్కో ఫొటోకు మధ్య 13 మిల్లీసెకన్ల సమయం మాత్రమే ఉన్నా, ఆ ఫొటో విశ్లేషణను కొనసాగిస్తూనే మరో ఫొటో విశ్లేషణ ప్రక్రియను మెదడు నిర్వహించగలదని తేలింది. -
కడుపులో మంట, అజీర్ణం, పుల్లటితేన్పులు... తగ్గేదెలా?
నా వయసు 42. గత రెండేళ్లుగా కడుపులో మంట, పుల్లని తేన్పులు, అజీర్ణం, అప్పుడప్పుడు కడుపుబ్బరం, గ్యాస్ లక్షణాలతో బాధపడుతున్నాను. హైపర్ అసిడిటీ అని చెప్పి డాక్టర్లు సూచించిన ఎన్నో మందులు వాడాను. కానీ ఫలితం కనపడలేదు. దీని సంపూర్ణ నివారణకు ఆయుర్వేద మందులు తెలియజేయప్రార్థన. - కె. భానుప్రకాశ్, ఆదిలాబాద్ మీకు ఉన్న సమస్యను ఆయుర్వేదంలో ‘ఆమ్లపిత్తం’ వ్యాధిగా చెబుతారు. నియమ నిబంధనలకు భిన్నంగా ఆహారవిహారాలు జరిగితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీనికి తోడు మానసిక ఆందోళన, ఒత్తిడికి గురిచేసే వృత్తివ్యాపారాలు కూడా మరొక ముఖ్యకారణం. ఈ కింది సూచనలు పాటించండి. రెండుమూడు నెలల్లో మీకు గణనీయంగా సత్ఫలితం లభిస్తుంది. ఆహారం : అల్పాహారమైనా, భోజనమైనా ప్రతిరోజూ నియమిత వేళల్లోనే స్వీకరించాలి. పులుపు, ఉప్పు, కారం పూర్తిగా మానేయండి. తీపిపదార్థాలు, నూనె పదార్థాలు బాగా తగ్గించండి. ప్రతి రెండు గంటలకు ఒక లీటరు నీళ్లు తాగండి. అల్పాహారంలో ఇడ్లీ మంచిది. మొలకలు, గ్రీన్సలాడ్స్ కూడా తీసుకోండి. భోజనంలో మసాలాలు లేని శాకాహారం మంచిది. ఆవుపాలు, ఆవుమజ్జిగ వాడండి. బొంబాయిరవ్వ, బార్లీ, రాగులు మొదలైనవాటితో చేసిన జావ అప్పుడప్పుడూ తాగాలి. బయటి తినుబండారాలు, బేకరీ వస్తువులు, జంక్ ఫుడ్స్, శీతలపానీయాల వంటివి అస్సలు పనికిరావు. అరటిపండ్లు మంచిది. విహారం : నియమతి వేళల్లో రాత్రిపూట నిద్ర అత్యంతావశ్యకం. జాగరణ చేయవద్దు. ధూమపాన, మద్యపానాల వంటి అలవాట్లు వ్యాధిని మరింత ఉద్ధృతం చేస్తాయి. దుఃఖం, చింత, శోకం, భయం వంటి ఉద్వేగాలను దూరంచేసి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. వ్యాయామం వల్ల... ముఖ్యంగా ప్రాణాయామం వల్ల మానసిక ఒత్తిడి దూరమై మీ సమస్య కుదుటపడుతుంది. మందులు లఘుసూతశేఖరరస (మాత్రలు) :ఉదయం 2, రాత్రి 2 అవిపత్తికర చూర్ణం : మూడుపూటలా ఒక్కొక్క చెంచా (నీటితో) శూక్తిన్ (మాత్రలు ) : ఉదయం 1, రాత్రి 1 గమనిక... అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఇతర వ్యాధులుంటే, వాటిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ప్రతిరోజూ పరగడుపున ఒక అరటిపండు తినడం ఈ సమస్యకు మంచిది. మా పాప వయసు 5 నెలలు. గత పది రోజులుగా పాపకి మలమార్గం చుట్టూ ఉన్న చర్మం ఎర్రగా కమిలిపోయినట్లు, ఒరిసినట్లుగా ఉంది. తాకితే పాప ఏడుస్తోంది. పరిష్కారం సూచించండి. - ఎమ్. నిర్మలమ్మ, తణుకు శిశువు విసర్జించిన మలం ఎక్కువసేపు ఆ ప్రాంతానికి తగులుతూ ఉంటే, అక్కడి చర్మం ఆ విధంగా తయారవుతుంది. దీనిని ఆయుర్వేదంలో ‘గుదకుట్ట లేదా అహిపూతనా’ అనే పేర్లతో వివరించారు. మలమూత్రాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే అలవాటు మంచిది. శిశువు పక్కబట్టలను ఎప్పుడూ పొడిగా, పరిశుభ్రంగా ఉంచాలి. గోరువెచ్చని నీళ్లలో కొంచెం పసుపువేసి ఆ ప్రాంతాన్ని శుభ్రపరచి, అనంతరం ‘మహామరిచాదితైల’ అనే మందును దూదితో ముంచి, ఒరిసిన చర్మం మీద నాజూగ్గా రాయాలి. ఇది బయటి పూతకు మాత్రమే. ‘అరవిందాసవ’ అనే ద్రావకాన్ని అర చెంచా ఉదయం, అరచెంచా రాత్రి తేనెతో శిశువుకు తాగించండి. దీనివల్ల చంటిపిల్లలకు అరుగుదల, బలం చక్కగా ప్రాప్తిస్తాయి. ఎన్నో వ్యాధులకు నివారకంగా కూడా పనిచేస్తుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమాయూన్ నగర్, హైదరాబాద్ -
విషాదం మిగిల్చిన విహార యాత్ర
ఆదిలాబాద్ క్రైం, న్యూస్లైన్: విహారయాత్ర విషాదం మిగిల్చింది. ఆరుగురు స్నేహితులు సరదాగా గడుపుదామని వెళ్లగా జలపాతంలో పడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో ఆదిలాబాద్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీకి చెందిన ఆరుగురు స్నేహితులు ఆదివారం మహారాష్ట్రలోని సాసర్కుండ్ జలపాతాన్ని సరదాగా చూడటానికి వెళ్లారు. వీరిలో షేక్ సల్మాన్ (20), సయ్యద్ సల్మాన్ (21)లు జలపాతం వద్ద కొండపై ఫొటోలు దిగుతున్నారు. వీరు ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతం గుంతలో పడి మునిగిపోయారు. స్నేహితులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దాదాపు రెండు గంటలపాటు జాలరులు గాలించగా మృతదేహాలు దొరికాయి. మహారాష్ట్ర పోలీసులు పోస్టుమార్టం చేయించి ఆదిలాబాద్కు తరలించారు. రెండు కుటుంబాల్లో విషాదం షేక్ సల్మాన్ హైదరాబాద్లో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హైదరాబాద్ నుంచి సెలవుల నిమిత్తం మూడు రోజుల క్రితం ఆదిలాబాద్కు వచ్చాడు. సల్మాన్ తండ్రి షేక్సత్తర్ చిరువ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. ముగ్గురిలో సల్మాన్ పెద్ద కొడుకు కావడంతో తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉన్నత చదువులు చదివించాలని కష్టపడి హైదరాబాద్కు పంపించారు. కొడుకు పైకొచ్చి తమను సుఖంగా చూసుకుంటారనుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చాడు. ఇక సయ్యద్ సల్మాన్ది మధ్యతరగతి కుటుంబం. తండ్రి సయ్యద్ సలీం వ్యాపారం చేస్తున్నాడు. ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబం కావడంతో సల్మాన్ ఆటో నడుపుతూ ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. షేక్ సల్మాన్, సయ్యద్సల్మాన్లు వరుసకు బావమరుదులు. ఈ క్రమంలోనే సెలవులపై హైదరాబాద్ నుంచి వచ్చిన షేక్సల్మాన్తోపాటు మిగతా స్నేహితులు గుడ్డు, సమీర్అలీ, మంచీర్, రిజ్వాన్లతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వీరిరువురు జలపాతంలో పడిమృతి చెందడంతో ఖానాపూర్లో విషాదఛాయలు నెలకొన్నాయి. -
చల్లారని అసమ్మతి
= సీఎల్పీ సమావేశంలో భగ్గుమన్న ఎమ్మెల్యేలు = మంత్రుల పనితీరుపై అసంతృప్తి = ముఖ్యమంత్రి తీరుపై కూడా ధ్వజం = పథకాల్లోని లోపాలపై విమర్శలు = పథకాలను ప్రకటించడానికి ముందు తమను సంప్రదించాలంటూ హితవు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెల్గాంలో జరుగుతున్న శాసన సభ శీతాకాల సమావేశాల సందర్భంగా బుధవారం రెండో రోజు కూడా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో అసమ్మతి భగ్గుమంది. సుమారు. 30 మంది ఎమ్మెల్యేలు మంత్రుల పని తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావాన్ని అడ్డుకోవడానికి మంత్రులేమీ చేయలేక పోతున్నారని అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైందని, మరో ఆరు నెలల్లో లోక్సభ సమావేశాలు ముంచుకొస్తున్నాయని చెబుతూ, మంత్రులు ఇంకా బద్ధకాన్ని వీడలేక పోతున్నారని విమర్శించారు. దీనిపై అధిష్టానానికి లేఖ రాస్తామని హెచ్చరించారు. మరో వైపు షాదీ భాగ్య, ప్రతిపాదిత మూఢాచారాల నిరోధక బిల్లు, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు విహార యాత్ర... లాంటి అంశాలపై కూడా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి తీరును ఎండగట్టారు. కోస్తా, మలెనాడు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు మూఢాచారాల ముసాయిదా బిల్లును ఎండగట్టారు. బీజేపీకి గట్టి పట్టున్న ఈ ప్రాంతాల్లో ఈ బిల్లు వల్ల పార్టీకి ఎక్కువ నష్టం వాటిల్లనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్కు నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉండిందని అభిప్రాయపడ్డారు. మరో వైపు షాదీ భాగ్య పథకంపై ముస్లిం ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేశారు. రోషన్ బేగ్, తన్వీర్ సేఠ్, రఫిక్ అహ్మద్లు మాట్లాడుతూ ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందు ప్రభుత్వం తమ మత పెద్దలను సంప్రదించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఈ పథకానికి కేవలం రూ.5 కోట్లు కేటాయించిందని, ఒక్కో పెళ్లికి రూ.50 వేల వంతున వెయ్యి మంది మాత్రమే లబ్ధి పొందుతారని వివరించారు. స్థూలంగా చెప్పాలంటే, నియోజక వర్గానికి నలుగురైదుగురికి మాత్రమే లబ్ధి కలుగుతుందని, తద్వారా ఈ మొత్తం అందని వారిలో కలిగే అసంతృప్తిని పరిగణనలోకి తీసుకోలేదని నిష్టూరమాడారు. ప్రధాన పథకాలను ప్రకటించడానికి ముందు తమను సంప్రదించాలని, లేనట్లయితే నియోజక వర్గాల్లో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేమని వారు వాపోయారు. వెనుకబడిన వర్గాల విద్యార్థులను మాత్రమే విహార యాత్రలకు పంపడం వల్ల ఇతర వర్గాల విద్యార్థుల్లో అసూయ, ద్వేషాలు ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు ఎమ్మెల్యేలు హెచ్చరించారు. -
గర్భవతులు ప్రయాణాలు చేయవచ్చా...?
నాకిప్పుడు ఆరోనెల నడుస్తోంది. మావారితో కలిసి విహార యాత్రకు వెళ్లాలని అనుకుంటున్నాను. గర్భవతులు ప్రయాణాలు చేయవచ్చా? నాకు కాస్త వివరంగా చెప్పండి. - సుచిత్ర, హైదరాబాద్ ఇది చాలా మంది గర్భవతులకు చాలా సాధారణంగా వచ్చే సందేహమే. తాము ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, విహారయాత్రలకు దూరప్రయాణాలు చేయవచ్చా అని తరచూ డాక్టర్ను అడుగుతుంటారు. గర్భవతిగా ఉండటం అన్నది ప్రయాణాలకు ఏమాత్రం అడ్డంకి కాదని గుర్తించాలి. అయితే అవసరాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. గర్భంతో ఉన్న వ్యవధిలో తొలి మూడు నెలలను ఫస్ట్ ట్రైమిస్టర్ అని, నాలుగు నుంచి ఆర్నెల్ల కాలాన్ని రెండో ట్రైమిస్టర్ అని, ఏడో నెల నుంచి ప్రసవం అయ్యేవరకు ఉన్న సమయాన్ని మూడో ట్రైమిస్టర్ అని అంటారన్నది తెలిసిందే. ఏ ట్రైమిస్టర్లో అయినా ప్రయాణాలు చేయవచ్చు. కాకపోతే మొదటి, మూడో ట్రైమిస్టర్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఉదాహరణకు మొదటి ట్రైమిస్టర్లో ఉన్నప్పుడు గర్భిణికి వికారం, వాంతులు ఉంటాయి. అటువంటి సమయంలో ప్రయాణం చేయడం వల్ల వాంతులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన మందులతో ప్రయాణం చేయవచ్చు. ఇకపోతే కొంతమందిలో కడుపునొప్పి, బ్లీడింగ్ మొదలైన సమస్యలు మొదటి ట్రైమిస్టర్లో ఉండవచ్చు. అలాంటివారు ప్రయాణాన్ని సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితులలో వైద్యుల సలహా మేరకు ప్రయాణం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక రెండో ట్రైమిస్టర్లో తల్లి ఆరోగ్య పరిస్థితి, బిడ్డకు సంబంధించిన వివరాలు (స్కానింగ్ రిపోర్టులు) అన్నీ బాగా ఉంటే, అటువంటి వారు పెళ్లిళ్లకు, పేరంటాలకు మాత్రమే కాకుండా విహారయాత్రలకు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నిజానికి బిడ్డ పుట్టాక, చిన్నారి సపర్యలతో చాలాకాలం వరకు ఎటూ కదలడానికి, వెళ్లడానికి వీలుకాదు కాబట్టి ఒకవేళ విహార యాత్రలకు వెళ్లాలనుకుంటే రెండో ట్రైమిస్టర్ అన్నది చాలా సౌకర్యవంతమైన సమయం అనుకోవచ్చు. అయితే దూరప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు తమ డాక్టర్ను సంప్రదించి తగు సలహా తీసుకోవాలి. మూడో ట్రైమిస్టర్ కూడా ప్రయాణాలకు అనుకూలమే. కాకపోతే తొమ్మిదోనెల దాటాక ప్రయాణాలు అంత మంచివి కాదు. ఇక 32-34 వారాల ప్రెగ్నెన్సీ సమయం నాటికి తాము ప్రసూతి ప్లాన్ చేసుకున్న చోటికి వచ్చి ఉండటం అన్నివిధాలా మంచిది. ఎందుకంటే తొమ్మిదో నెల తర్వాత నొప్పులు ఏ సమయంలో అకస్మాత్తుగా మొదలవుతాయో తెలియదు. పైగా ఒక్కోసారి అకస్మాత్తుగా ఉమ్మనీరు బయటకు చిమ్మడం వంటివి కూడా కనిపించవచ్చు. అందుకే 34 వారాల తర్వాత ఎలాంటి ప్రయాణాలూ పెట్టుకోకుండా, తాము ప్రసూతి కావాలనుకున్న చోటే ఉండటం మంచిది. ఇక ప్రయాణాలు చేయాలనుకున్న వారు ఎలాంటి వాహనాలలో వెళ్లాలి, బస్లోనా, కారులోనా, రైల్లోనా, విమానప్రయాణాలు చేయవచ్చా...లాంటి సందేహాలను వెలిబుచ్చుతుంటారు. కుదుపులు లేకుండా ఉండే ఎలాంటి ప్రయాణమైనా చేయవచ్చు. ఇక కొందరు స్త్రీలు తాము ద్విచక్రవాహనం నడుపుతుంటామని, అలా నడపవచ్చా అని అడుగుతుంటారు. కుదుపుల్లేకుండా నడుపుతూ, ట్రాఫిక్లో తాము తీసుకునే జాగ్రత్తల విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ధతీసుకుంటూ, తమ శరీరం సహకరించినంత వరకు మహిళలు స్కూటర్ లేదా కార్ వంటి వాహనాలను నడపవచ్చు. కాకపోతే అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, ఎదురుగా గుంతల్లోకి వాహనాన్ని నడిపి శరీరాన్ని అకస్మాత్తుగా కుదుపునకు గురిచేయడం వంటి వాటిని అవాయిడ్ చేయాలి. అందుకే రద్దీగా ఉండే ట్రాఫిక్లో వాహనం నడపకుండా అవాయిడ్ చేయడమే మంచిది. ఇక కార్ నడిపేవారు విధిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అయితే ఈ సీట్ బెల్ట్ను సౌకర్యంగా పొట్ట కింది భాగంలో ఉండేలా చూసుకోవాలి. ఇక విమాన ప్రయాణం చేసేవారు తాము ఏ కంపెనీకి చెందిన ఫ్లైట్లో వెళ్లాలనుకుంటున్నారో, వారిని సంప్రదించాలి. ఎందుకంటే కంపెనీని బట్టి వారు ప్రెగ్నెన్సీలో ఏ సమయం వరకు ప్రయాణాన్ని అనుమతిస్తారో, ఆ సమయం వరకు ప్రయాణం చేయవచ్చు. అయితే ఒకవేళ విమాన ప్రయాణం అన్నది ఆరు గంటల కంటే ఎక్కువగా కొనసాగాల్సి వస్తే మాత్రం... ప్రతి రెండు గంటలకొకసారి ఫ్లైట్లోనే అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటూ తిరగాలి. ఇక ఎనిమిది గంటలకు పైగా ప్రయాణం కొనసాగించాల్సి వస్తే మాత్రం విధిగా స్టాకింగ్స్ ధరించాలి. దీనివల్ల కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితిని నివారించవచ్చు. ఒకవేళ 8 నుంచి 10 గంటలకు పైగా విదేశాలకు వెళ్లడం వంటి దూరప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తే... ప్రయాణానికి ముందే తమ డాక్టర్ను విధిగా సంప్రదించాలి. అప్పుడు డాక్టర్లు అవసరాన్ని బట్టి రక్తం గడ్డకట్టకుండా నివారించే ఇంజెక్షన్స్ (థ్రాంబోప్రొఫిలాక్టిక్ ఇంజెక్షన్స్) ఇచ్చి, ప్రయాణంలో పాటించాల్సిన జాగ్రత్తలు చెబుతారు. ఇక గర్భవతులు విమానం ఎక్కాల్సి వచ్చినప్పుడు విధిగా తమ డాక్టర్నుంచి ఫిజికల్ ఫిట్నెస్ / ట్రావెల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుపోవడం మరచిపోవద్దు. ఇక మీ విషయానికి వస్తే... మీ రిపోర్టులన్నీ బాగున్నాయి కాబట్టి... ప్రసవం తర్వాత బిడ్డ సంరక్షణలో కనీసం ఆరు నెలల పాటు ఎటూ వెళ్లడానికి వీలుండదు కాబట్టి ఈ సమయంలో మీరు నిరభ్యంతరంగా విహారయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. డాక్టర్ సుశీల వావిలాల ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
శబరిమలై యాత్రకు రైళ్లు ఫుల్
విజయనగరం టౌన్, న్యూస్లైన్: అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమలై వెళ్లే స్వాములకు సంబంధించి విజయనగరం మీదుగా వెళ్లే వందకు పైగా రైళ్లన్నీ రిజర్వేషన్లలో వెయిటింగ్ లిస్టుల్లోనే దర్శనమిస్తున్నాయి. విజయనగరం నుంచి ఎర్నాకులం వరకూ వెళ్లే రైళ్ల రిజర్వేషన్లన్నీ జనవరి 8 వరకూ ఖాళీలు లేకపోవ డంతో దర్శనానికి వెళ్లేందుకు అయ్యప్ప భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెట్టకపోవడంతో భక్తులు బస్సులకే పరిమితమవుతున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి తమకు అందుబాటులో ఉన్న బంధువుల సహాయంతో రిజర్వేషన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. విజయనగరం మీదుగా ఎర్నాకులం వెళ్లేందుకు కేవలం పది రైళ్లు ఉన్నాయి. 15906 వివేక్ ఎక్స్ప్రెస్, 06335 డిబ్రూఘర్-కొచ్చావలి స్పెషల్,02851 సంత్రాగచ్చి-కొచ్చావలి స్పెషల్, 18189 టాటా -అలెప్పీ ఎక్స్ప్రెస్, 13351 ధన్బాద్- అలెప్పీ ఎక్స్ప్రెస్, 16310 పాట్నా -ఎర్నాకులం ఎక్స్ప్రెస్, 16324 షాలిమార్ -త్రివేండ్రం ఎక్స్ప్రెస్, 12660 గురుదేవ్ ఎక్స్ప్రెస్, 12516 గౌహతి-త్రివేండ్రం ఎక్స్ప్రెస్, 12508 గౌహతి-ఎర్నాకులం ఎక్స్ప్రెస్లు వెళ్తాయి. వీటిలో ఏ ఒక్క రైలుకూ జనవరి నెల వరకూ రిజర్వేషన్లు ఖాళీల్లేవు. డిసెంబరు 25న ఒక్కరోజుమాత్రమే 6 వరకూ ఆర్ఏసీ ఉంది. ప్రస్తుతానికి అన్ని రైళ్లూ వందకు పైగా వెయిటింగ్ లిస్ట్, మరికొన్ని రిగ్రీట్, ఇంకొన్ని నో రూమ్తో దర్శనమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తం గా ఏటా అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతోందని, విజయనగరం మీదుగా ఎర్నాకులం వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసే విధంగా రైల్వే అధికారులు శ్రద్ధ చూపాలని అయ్యప్ప యాత్రకు వెళ్లే భక్తులు కోరుతున్నారు. -
విహార యాత్రలో విషాదం
బెంగళూరు, న్యూస్లైన్: విహార యాత్ర ముగించుకుని వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు దుర్మరణం చెందారు. బెంగళూరు నగర శివార్లలోని తలఘట్టపుర పోలీస్ స్టేషన్లో పరిధిలో ఈ సంఘటన జరిగింది. మృతులు బెంగళూరుకు చెందిన వారుగా గుర్తించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు... శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇక్కడి సిటీ మార్కెట్ నుంచి బయలు దేరిన బీఎంటీసీ బస్సు కనకపుర రోడ్డులోని కెంపయ్యనపాళ్యకు బయలు దేరింది. బెంగళూరు నగరంలోని నీలసంద్రకు చెందిన యువకులు కనకపుర సమీపంలోని మేకదాటికి విహార యాత్రకు వెళ్లి రెండు కార్లలో బెంగళూరు బయలుదేరారు. మార్గం మధ్యలో కనకపుర మెయిన్ రోడ్డులోని సోమనహళ్లి దగ్గర ఉన్న ఏపీఎస్ కాలేజ్ సమీపంలో సాయంత్రం 4.30 గంటలకు బీఎంటీసీ బస్సును మలుపు వద్ద షిఫ్ట్ డిజైర్ కారు (కేఏ 05- ఎంఎల్ 9825) ఢీకొంది. దీంతో కారులో ఉన్న ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కనకపుర మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుక్ను హారోహళ్లి పోలీస్ స్టేషన్ సీఐ రామచంద్రప్ప, తలఘట్టపుర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో 45 నిమిషాల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు బెంగళూరులోని నీలసంద్రకు చెందిన యాసిర్ ఖాన్, అయూబ్, యారుబ్, జువైద్, మయూర్గా గుర్తించామని సీఐ రామచంద్రప్ప తెలిపారు. విహార యాత్రకు వెళ్లి వస్తుంటే ప్రమాదం జరిగిందని, అందరు విద్యార్థులేనని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ తలఘట్టపుర పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.