food business
-
కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది!
రోజూ కొన్ని గంటల పాటు నడుచుకుంటూ పట్టణానికి వెళ్లి కూరగాయలు అమ్మే యాంగ్మీలా ఇప్పుడు ఒక స్టార్టప్కు యజమానురాలు. ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధిని, స్ఫూర్తిని ఇస్తున్న ఉత్తేజం.మణిపూర్లోని ఫరుంగ్ గ్రామానికి చెందిన యాంగ్మీలా ప్రతిరోజూ ఉదయం తన ఊరి నుంచి ఉఖ్రుల్ పట్టణానికి కూరగాయల బుట్టను మోసుకుంటూ ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లేది. వాటిని అమ్మి ఎండలో తిరిగి ఇంటికి వచ్చేది. తాను నడిచి వెళ్లే దారి మామూలు దారి కాదు. కొండల దారి.ఆర్థిక ఇబ్బందుల వల్ల 21ఏళ్ల వయసులో కూరగాయలు అమ్మడం మొదలుపెట్టింది యాంగ్మీలా. అప్పటికే ఆమెకు ఒక మగబిడ్డ. భర్త తనను విడిచి వెళ్లాడు. బిడ్డతోపాటు అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత ఉండడంతోకష్టాన్నే నమ్ముకుంది యాంగ్మీలా. వయసు పైబడుతుండడంతో యాంగ్మీలాకు నడక భారమైంది. ‘ఇలా ఎంతకాలం! వేరే మార్గం లేదా?’ అని ఆలోచించింది మనసులో. ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనతో మొదటగా పాత బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత కోళ్ల పెంపకం చేపట్టింది. మిఠాయిల దుకాణం నడిపింది. ఉసిరి, మామిడి, ఆపిల్... మొదలైన వాటిని ప్రాసెస్ చేసి మిఠాయిలు తయారు చేసేది. ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన శిక్షణ శిబిరంలో సాల్గొన్న తరువాత ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.మిర్చి, వెల్లుల్లి, వంకాయలు, వెదురు చివుళ్లు... మొదలైన వాటితో సేంద్రియ ఊరగాయల తయారీని ప్రారంభించింది. తన స్టార్టప్కు ‘షిరిన్ ప్రొడక్ట్స్’ అని పేరు పెట్టింది. ‘షిరిన్’ అనేది నాగా పదం. ‘పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి’ అనేది దీని అర్థం.జర్మన్ ఎన్జీవో ‘జీఐజెడ్’ నుంచి ఈ స్టార్టప్కు 1.2 లక్షల గ్రాంట్ లభించింది. ఆర్బీఐకి సంబంధించిన ‘రంగ్ దే’ అనే లెండింగ్ ప్లాట్ఫామ్ నుంచి రెండు లక్షల రుణం తీసుకుంది. ‘షిరిన్ ప్రొడక్ట్స్ చుట్టుపక్కల ప్రాంతాలలోనే కాకుండా మణిపూర్ రాజధాని ఇంఫాల్, అస్సాం, నాగాలాండ్, దిల్లీలలో కూడా అమ్ముడవుతున్నాయి.ఫేస్బుక్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది యాంగ్మీలా.‘ఒకే ఉద్యోగితో మా కంపెనీ ప్రారంభం అయింది. మొదట్లో డోర్ టు డోర్ అమ్మకాలు చేసేవాళ్లం. ఇప్పుడు నా దగ్గర పన్నెండు మంది వర్కర్లు పనిచేస్తున్నారు. వారికి నేనే శిక్షణ ఇచ్చాను’ అంటుంది యాంగ్మీలా. ఎమ్మెస్సీ చేసిన ఆమె కుమారుడు షంగ్రీఫా ఇప్పుడు వ్యాపారంలో తల్లికి సహాయంగా ఉంటున్నాడు.‘సింగిల్ మదర్గా ఆమె ఎలాంటి కష్టాలు పడిందో ఊహించుకోవచ్చు. అయితే ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. కష్టపడాలి, ఎప్పుడూ ఏదో చేయాలనే తపన ఆమెకు విజయాన్ని చేరువ చేసింది. వ్యాపారం మీద ఎంత శ్రద్ధ పెట్టిందో నా చదువు, భవిష్యత్ మీద కూడా అంతే శ్రద్ధ పెట్టింది. ఆమెను చూసి గర్వపడతాను. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి భయపడని ధైర్యవంతురాలైన మహిళ మా అమ్మ’ తల్లి గురించి గర్వంగా చెబుతాడు షంగ్రీఫా.‘అస్సాం ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అవార్డ్’ తో సహా ఎన్నో అవార్డ్లు అందుకున్న యాంగ్మీలా ఎంతోమంది గ్రామీణ మహిళలకు స్ఫూర్తిని ఇస్తోంది. -
టేస్ట్ 'బ్లాగుం'ది..! హాబీగా ఫుడ్ బ్లాగింగ్..
నగరంలో ఫుడ్ బ్లాగింగ్ హాబీ మారుతోంది.. చెప్పుకోదగ్గ సంఖ్యలో సభ్యులు పూర్తిస్థాయి ప్రొఫెషన్స్గా స్థిరపడుతున్నారు. చారిత్రక నేపథ్యం, ఆధునిక వైవిధ్యం.. కలగలిసిన మన నగరం వైవిధ్యమైన అభిరుచులను కలిసి ఆస్వాదించడానికి బ్లాగర్లకు అనేక అవకాశాలను అందిస్తోంది. వీటిని అందిపుచ్చుకుని నగరవ్యాప్తంగా విభిన్న రుచుల విశిష్టతలను వెలుగులోకి తెస్తున్న బ్లాగర్స్..పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ను దక్కించుకుంటూ అటు భోజన ప్రియులకు, ఇటు ఆహార ఉత్పత్తుల విక్రయదారులకు ఆప్తులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ బ్లాగర్స్కు సంబంధించి నగరంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి తెలుసుకుందాం. – సాక్షి, సిటీబ్యూరోనిన్న మొన్నటి వరకూ ఫుడ్ బ్లాగింగ్ అంటే ఏంటో ఎవరికీ తెలీదు. కానీ కొంతకాలంగా నగరంలో ఫుడ్ బ్లాగింగ్ సంప్రదాయంగా మారుతోంది. ప్రస్తుతం ఫుల్–టైమ్ ఫుడ్ బ్లాగర్స్ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఈ విషయంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నయ్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆ నగరాల స్థాయిలోనే మన నగరం నుంచీ బ్లాగర్లు పెరుగుతున్నారు. నిజామ్ల నగరంలో ఫుడ్ బ్లాగింగ్ కల్చర్తో మమేకమౌతున్నారు.బ్లాగర్స్ మీట్స్..నగరంలోని ఫుడ్ బ్లాగర్స్ సోషల్ మీడియా వేదికల వారీగా వేర్వేరు టీమ్స్గా ఏర్పడుతున్నారు. ఇటీవల వార్షిక ఇన్స్టాగ్రావ్ు ఫుడ్ బ్లాగర్ల సమావేశం జూబ్లీహిల్స్లోని ఫ్రోత్ ఆన్ టాప్లో జరిగింది. దీంట్లో 70 మందికి పైగా ఫుడ్ బ్లాగర్లు ఒకే చోట సమావేశమయ్యారు. సరదా సంగీతం, ఆట పాటలతో ఉల్లాసంగా గడిపారు. ‘ఈ ఈవెంట్ ద్వారా, ఇన్ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు ఒకరినొకరు కలుసుకోవడానికీ, పలకరించుకోవడానికీ, కొత్త స్నేహితులను ఏర్పర్చుకోవడానికి వేదిక నిలుస్తుందని’ నిర్వాహకులు గత ఏడేళ్లుగా ఫుడ్ బ్లాగర్గా పేరొందిన కిరణ్ సాహూ తెలిపారు.బ్లాగర్లు వ్లాగర్లుగా, ఆ తర్వాత ఇన్స్టా రీల్స్ ద్వారా కంటెంట్ డెవలపర్స్గా.. ఇటీవల కాలంలో ఇన్ఫ్లుయెన్సర్లుగా రూపాంతరం చెందుతున్నారు. ప్రస్తుతం పలు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారం, ప్రమోషన్లను అందించడానికి వీరు ఖరీదైన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.ఫుడీ నుంచి ఇన్ఫ్లుయన్సర్గా... వ్యక్తిగతంగా ఫుడ్ లవర్ అయిన కిరణ్ సాహూ.. సిటీలో దినదిన ప్రవర్ధమానమవుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లకు కేరాఫ్లా మారారు. గత ఏడేళ్లుగా నగరంలో రుచుల జర్నీ సాగించిన ఆమె.. ఇప్పుడు రోజూ కనీసం ఒకటి నుంచి మూడు వరకూ బ్రాండ్ ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటారు.‘మేం బ్లాగింగ్లోకి ప్రవేశించినప్పుడు మొత్తం లెక్కేస్తే 10మంది బ్లాగర్లు కూడా లేరు. ఇప్పుడు అన్ని స్థాయిల్లో కలిపి 1000 నుంచి 2000 మంది ఉంటారు’ అని సాక్షితో అన్నారు. ఓ వైపు కార్పొరేట్ ఉద్యోగం.. మరోవైపు చిన్న బిజినెస్ నిర్వహిస్తూనే ఫుడ్ బ్లాగర్గా రాణిస్తున్న ఈ మాదాపూర్ నివాసి... ఇష్టమైన వ్యాపకాలు ఎన్ని చేసినా కష్టం అనిపించవు అంటూ స్పష్టం చేస్తున్నారు.పురస్కారాల వంట...సిటీ ఫుడ్ బ్లాగర్స్ లక్షల సంఖ్యలో ఫాలోవర్స్కు, మిలియన్ల సంఖ్యలో వీక్షకులకు చేరువవుతున్నారు. అంతే కాదు చెప్పుకోదగ్గ సంఖ్యలో పురస్కారాలను కూడా అందుకుంటున్నారు. మెట్రో నగరాల్లోని ఫుడ్ బ్లాగర్స్కు థీటుగా బ్రాండ్స్కు ప్రచారం చేస్తూ తగినంత రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఓ చేత్తో సంపాదిస్తూనే.. మరో చేత్తో అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నారు.బిర్యానీ ఒక్కటే కాదు...వంటగది నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి నగరంలో అత్యంత ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్స్లో ఒకరిగా మారారు హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్, ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్, మార్కెటర్ మొహమ్మద్ జుబైర్ అలీ. సమగ్ర రుచుల సమీక్షల నుంచి ఆకట్టుకునే ఫొటోగ్రఫీ వరకూ ఆయన నిర్వహించే ‘హైదరాబాద్ ఫుడ్ డైరీస్’ పేజీ అనేక ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది.రెస్టారెంట్లు లాంజ్ల నుంచి ఆకట్టుకునే వీధి తినుబండారాల వరకూ పసిగట్టి.. వాటికి బ్లాగ్లో పట్టం గట్టడమే జుబైర్ పని. హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీలకు మాత్రమే కాదని, అరుదైన రుచులను అందించే వంటకాలను కలిగిన గొప్ప నగరం అంటారాయన. గత దశాబ్ద కాలంగా జుబైర్, అర డజను అవార్డులను తన బ్యాగ్లో ఉంచుకుని, జుబైర్ అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు.ఇవి చదవండి: 'ఐసైపోతారు'..! సహజ రుచులకు ఆహారప్రియులు ఫిదా.. -
ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు కీలక సూచన.. ఇకపై..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI).. అన్ని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు తమ ఉత్పత్తుల మీద '100% ఫ్రూట్ జ్యూస్' అనే లేబుల్స్, అడ్వర్టైజ్మెంట్లను తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 1లోపు ఇప్పటికే ఉన్న అన్ని ప్రీ-ప్రింటెడ్ ప్యాకేజింగ్ మెటీరియల్లను ఎగ్జాస్ట్ చేయమని కూడా సూచించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.జ్యూస్ కవర్ మీద 100 శాతం నేచురల్.. తక్కువ చక్కెర కంటెంట్ అని రాసి ఉంటుంది. కానీ ఇలాంటి వాటిలో వంద శాతం ఫ్రూట్ జ్యూస్ ఉండదు. తప్పుడు సమాచారంతో కంపెనీలు ప్రజలను మోసం చేస్తున్నారు. ఫ్రెష్ జ్యూస్ చేసుకోవడం కష్టమని.. చాలామంది రెడిమేడ్ జ్యూస్లను కొనుగోలు చేస్తూ.. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఈ కారణంగానే కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల మీద లేబుల్స్, అడ్వర్టైజ్మెంట్లను తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది.ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త రూల్స్ ప్రకారం.. కిలో జ్యూస్లో 15 గ్రాముల కంటే ఎక్కువ చక్కర ఉంటె స్వీట్ జ్యూస్ అని లేబుల్ వేయాలి. తాజా పండ్ల రసం కాకూండా.. ప్రాసెస్ చేసిన జ్యూస్ ఆరోగ్యానికి చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. బరువు పెరగడం, గుండె జబ్బులు వంటి వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఇది డబుల్ డెక్కర్ బస్సు.. అలాగే రెస్టారెంట్ కూడా!
నగర సంచారం చేస్తూ, నోరూరించే రుచులను ఆస్వాదించే అనుభవాన్ని ప్రయాణికులకు అందిచాలనే ఉద్దేశంతో డబుల్ డెక్కర్ బస్సును రెస్టారెంట్గా మార్చేశారు. ‘బస్ట్రోనోమ్’ పేరుతో ప్రారంభించిన ఈ రెస్టారంట్ బస్సులు లండన్, పారిస్ నగరాల్లో పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఫ్రాన్స్కు చెందిన జీన్ క్రిస్టోఫ్ ఫార్నీర్, బెర్ట్రాండ్ మాథ్యూ అనే మిత్రులు 2013లో బస్సులో రెస్టారంట్ను ప్రారంభించాలని తలపెట్టారు. సరికొత్త డబుల్ డెక్కర్ బస్సును కొనుగోలు చేసి, దానిని పూర్తి స్థాయి రెస్టారెంట్లా మార్చారు. బస్సు కింది భాగంలో వంట గది, వంట సామగ్రి, సిబ్బంది ఉండటానికి వీలుగా తయారు చేసి, పైభాగాన్ని రెస్టారంట్గా తీర్చిదిద్దారు.ఇందులో 38 మంది కూర్చుని, విందు భోజనాలు ఆరగిస్తూ, పరిసరాలను పరిశీలిస్తూ నగర సంచారం చేయవచ్చు. తొలుత ‘బస్ట్రోనోమ్’ సేవలను పారిస్లో ప్రారంభించారు. పర్యాటకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో ఇటీవల లండన్లో కూడా మరో బస్సును రెస్టారంట్గా మార్చి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. -
తగ్గిన పరిశ్రమల జోరు.. ఆహార ధరల తగ్గుముఖం
న్యూఢిల్లీ: భారత్ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 25 శాతంపైగా వెయిటేజ్ ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 2023 డిసెంబర్లో మందగించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 3.8 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే నెలలో ఈ రంగం వృద్ధి స్పీడ్ 5.1 శాతం. సమీక్షా కాలంలో మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి విభాగాలు పేలవ పనితీరును ప్రదర్శించాయి. అయితే 2023 నవంబర్తో (2.4 శాతం) డిసెంబర్లో సూచీ పెరగడం (3.8 శాతానికి) కొంత ఊరటనిచ్చే అంశం. ఇక జనవరి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.1%గా నమోదైంది. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. కీలక రంగాలు ఇలా... జాతీయ గణాంకాల కార్యాలయం గణాంకాల ప్రకారం మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం వృద్ధి రేటు 3.6 శాతం (2022 డిసెంబర్) నుంచి 3.9 శాతానికి (2023 డిసెంబర్) పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి వృద్ధి 10.4 శాతం నుంచి 1.2 శాతానికి పడిపోయింది. మైనింగ్ క్షీణతలోనే ఉంది. అయితే క్షీణ రేటు 10.1 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది. తొమ్మిది నెలల కాలంలో అప్ ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల (ఏప్రిల్–డిసెంబర్) కాలాన్ని చూస్తే.. మాత్రం ఐఐపీ వృద్ధి రేటు 5.5% నుంచి 6.1%కి పెరిగింది. ఆహార ధరల తగ్గుముఖం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన ఆహార ద్రవ్యోల్బణం జనవరిలో 3 నెలల కనిష్ట స్థాయిలో 5.1 శాతానికి తగ్గింది. కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం దీనికి కారణమని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ఆహార ఉత్పత్తుల బాస్కెట్ను చూస్తే, డిసెంబర్లో ధరల భారం 9.53 శాతం పెరగ్గా, ఈ భారం జనవరిలో 8.3 శాతానికి తగ్గింది. ఆహారం, పానీయాల విభాగంలో 7.58%, హౌసింగ్ రంగంలో 3.20% ద్రవ్యోల్బణం నమోదైంది. -
సోషల్ మీడియాతో కుమారి ఆంటీకి క్రేజ్.. ప్రముఖ ఓటీటీ బిగ్ ప్లాన్!
ఇప్పుడు కాలాన్ని కలియుగం కంటే సోషల్ మీడియా యుగం అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాను ప్రజలు విపరీతంగా వాడేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఏకంగా అడిక్ట్ అయిపోయారనుకోండి. 'వాడటం మొదలు పెడితే మాకన్న బాగా ఎవరూ వాడలేరు' అనే మిర్చి సినిమా డైలాగ్ గుర్తుకొచ్చేలా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. అందువల్లే క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోతున్నారు. అలానే ఇటీవల సోషల్ మీడియాలో పేరు తెలియని వారు కూడా ఒక్కసారిగా ఫేమస్ అయిపోతున్నారు. సినిమా స్టార్లను మించి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో చరవాణి ఉండడం.. సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ పెరిగిపోవడంతో మరింత ఈజీగా మారిపోయింది. ఇటీవలే గుంటూరు కారం సాంగ్తో కుర్చీ తాత ఫేమస్ అయ్యారు. అదే స్టైల్లో రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటీకి విపరీతమైన క్రేజీ వచ్చింది. ఆమె హోటల్కు ఒక్కసారిగా కస్టమర్ల రద్దీ పెరిగిపోయింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఆమె హోటల్కు వెళ్లి వచ్చాక మరింత ఫేమస్ అయిపోయింది. దీంతో యూట్యూబర్స్ అంతా ఒక్కసారిగా కుమారి ఆంటీ వెంటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆమె బిజినెస్ ఓ రేంజ్కు దూసుకెళ్లింది. అయితే అది కాస్తా కుమారి ఆంటీకి ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది. ట్రాఫిక్కు అంతరాయం అవుతోందంటూ పోలీసులు ఆమె బిజినెస్ను అడ్డుకునేస్థాయికి తీసుకొచ్చింది. కానీ చివరికీ మళ్లీ ఆమెను సడలింపు ఇచ్చారు కూడా. అయితే ఇంతలా ఫేమస్ అయిన కుమారి ఆంటీపై ఏకంగా సినిమానే తీయనున్నట్లు తెలుస్తోంది. అసలు ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అంతకుముందు ఏం చేశారు? ఇప్పుడు ఇంత ఫేమస్ ఎలా అయ్యారు? అనే ఆసక్తికర అంశాలతో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రకటనైతే రాలేదు. కానీ ప్రస్తుతం ఈ టాపిక్ అయితే నెట్టింట అప్పుడే చర్చ మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్గా క్రేజ్ దక్కించుకున్న కుమారి ఆంటీపై డాక్యుమెంటరీ సినిమాగా వస్తే ఆమె రేంజ్ వేరే లెవెల్కు చేరుతుందంటున్నారు నెటిజన్స్. -
లక్షల విలువ చేసే కారులో 'హోమ్ మేడ్ ఫుడ్' బిజినెస్.. వీడియో వైరల్
కరోనా వైరస్ విజృంభించిన తరువాత భారతదేశంలో చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. దీంతో కొందరు డబ్బు సంపాదించడానికి మార్గాలు వెతుక్కునే క్రమంలో కొత్త ఆలోచనలకు రూపం పోశారు. గతంలో కొందరు ఖరీదైన కార్లలో కూరగాయలు విక్రయించడం, టీ విక్రయించడానికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీకి చెందిన వ్యక్తి తన కొత్త కియా కారెన్స్ కారులో ఫుడ్ విక్రయించాడు. దీనికి సంబంధించిన వీడియో హర్సిమ్రాన్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోలో గమనించినట్లతే ఒక వ్యక్తి తన కియా కారెన్స్ (Kia Carens) కారులో ఆహారం విక్రయిస్తుండం చూడవచ్చు. కియా కారు బూట్ స్పేస్లో హోమ్ మేడ్ ఫుడ్ విక్రయిస్తున్నాడు. ఆ ఫుడ్ మొత్తం తన భార్య తయారు చేసి ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సంఘటన ఢిల్లీలో ఎక్కడనేది తెలియాల్సి ఉంది. ఖరీదైన కారులో ఆహారం విక్రయించడం వెనుక ఉన్న అసలు కథ కూడా స్పష్టంగా తెలియదు. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. కియా కారెన్స్ ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 19.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు ఏకంగా 23 వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. కారెన్స్ MPV పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harsimran Singh (@therealharryuppal) -
అత్త ఆలోచనలతో కోడలి వ్యాపారం.. దెబ్బకు దశ తిరిగింది, విదేశాల్లో కూడా డిమాండ్!
Sonam Success Story: అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా.. అనే పాట ఎంత పాపులర్ అయిందో అందరికి తెలుసు. కానీ ఒక కోడలు లక్షాధికారి కావడానికి అత్త కారకురాలయింది. చాలా మంది అత్తా కోడళ్ళకు అసలు పడదు, ఇది నిజ జీవితంలో చాలా సందర్భాల్లో చూసి ఉంటారు. కానీ మనం ఈ కథనంలో చెప్పుకోబోయే అత్తా కోడళ్ళు మాత్రం దానికి పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే అత్త చనిపోయినా ఆమె జ్ఞాపకాలతో అందరికి పంచుతున్న ఈ కోడలు ఎవరు? ఆమె ఎలా ధనవంతురాలయింది? ఆమె చేసే వ్యాపారం ఏది అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం. చెన్నైకి చెందిన సోనమ్ (Sonam) అనే యువతి అదే ప్రాంతానికి చెందిన అజయ్ అనే యువకున్ని పెళ్లి చేసుకుంది. చాలా మంది అత్తలు మాదిరిగా కాకుండా సోనమ్ అత్త 'ప్రేమలత' తనను సొంత కూతురిలాగా చూసుకునేది. అయితే కొన్ని రోజులకే అత్త మరణించడంతో చాలా బాధపడి కృంగిపోయింది. ఆ తరువాత కొన్ని నెలలకు కోలుకున్న సోనమ్ ఒక రోజు తన అత్తా గదిని శుభ్రపరిచే సమయంలో ఆమెకు ఒక డైరీ కనిపించింది. ఆ డైరీ ఆమెను గొప్ప పారిశ్రామికవేత్తగా మార్చేసింది. అత్త డైరీ.. సోనమ్ చేతికి దొరికిన దొరికిన ఆ డైరీలో ఎన్నెన్నో వంటలకు సంబంధించిన రెసిపీలు ఉండటం గమనించింది. వీటన్నినీ అలాగే ఎందుకు నిరుపయోగంగా వదిలేయాలి, పది మందికి పంచితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఫుడ్ బిజినెస్ చేస్తే బాగుంటుందని భర్తతో కలిసి నిర్ణయించుకుంది. డైరీలో తనకిష్టమైన గోంగూర చట్నీ దగ్గర్నుంచి మాల్గోపొడి వరకు అన్ని రకాల వంటకాలు ఉన్నాయి. ఆ తరువాత వీటిని ప్రయత్నించాలనుకుని అలాంటి వంటకాలు తయారు చేసి భర్త అజయ్తో దగ్గరి బంధువులకు అందించడం మొదలుపెట్టింది. ఆ వంటకాలు తిన్న చాలా మంది ఫోన్ చేసి చాలా రుచిగా ఉయన్నాయని మెచ్చుకున్నారు. ఇది ఆమెను మరింత ప్రోత్సహించేలా చేసింది. వ్యాపారం ప్రారంభం.. ఒకప్పుడు వంట మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, అయితే అత్తయ్య డైరీ చూడగానే నాలో మార్పు వచ్చిందని చెబుతూనే 'ప్రేమ్ ఇటాసి' (Prem Eatacy) పేరుతో వ్యాపారం ప్రారభించించినట్లు చెప్పింది. ప్రారంభంలో సుమారు రూ. 10 లక్షల పెట్టుబడితో బిజినెస్ ప్రారంభించి రకరకాల వంటలు చేయడం మొదలు పెట్టింది. వీరి వ్యాపారం ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే న్లైన్ రిటైల్ ప్లాట్ఫారమ్ల నుంచి కూడా ఆర్డర్లను పొందగలిగే స్థాయికి ఎదిగింది. (ఇదీ చదవండి: బంగారు బుల్లెట్.. అందరి కళ్లు దానిపైనే! సోషల్ మీడియాలో వీడియో వైరల్) కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా సింగపూర్, అమెరికా నుంచి కూడా కస్టమర్లు సంప్రదించి తమ ఉత్పత్తులు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు సోనమ్ భర్త అజయ్ తెలిపాడు. ఇప్పటి వరకు వీరు 21 రకాల ఊరగాయ, పొడి, చట్నీలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఎక్కువ మంది చట్నీ, మొలగపొడి, పుదీనా కొత్తిమీర చట్నీ వంటివి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న సోనమ్ ఈ క్రెడిట్ మొత్తం మా అత్తగారికి చెందుతుందని.. ఆమె డైరీ లేకుండా ఉంటే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండే దానిని కాదని వినయంగా వెల్లడించింది. ప్రస్తుతం వీరి ఉత్పత్తులు స్టోర్లలో మాత్రమే కాకుండా, ఈ కామర్స్ వెబ్సైట్లలో కూడా లభిస్తున్నాయి. వారి ఉత్పత్తులు మొత్తం ఆర్గానిక్ పద్దతిలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించుకోకుండా తయారు చేస్తున్నట్లు సమాచారం. వీరు ఈ బిజినెస్ ద్వారా నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. -
యూరప్లో చెఫ్ అవతారమెత్తిన రైనా.. నోరూరించే రుచులతో..
Suresh Raina Restaurant: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాడు. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో రెస్టారెంట్ ఆరంభించాడు. యూరప్ నడిబొడ్డున భారత రుచులను కస్టమర్లకు వడ్డించేందుకు సిద్ధమైపోయాడు. రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా చెఫ్ అవతారమెత్తాడు ఈ మిస్టర్ ఐపీఎల్. ‘రైనా’ పేరిట మొదలెట్టిన రెస్టారెంట్ ముందు నిలబడి తమ ఉద్యోగులతో ఫొటోలకు పోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. సరికొత్త రుచులు ‘‘ఇంతకు ముందెన్నడూ రుచి చూడని వంటకాలతో మేము సిద్ధం. రుచి చూసేందుకు మీరూ సిద్ధంకండి. ఆమ్స్టర్డామ్లో రైనా ఇండియన్ రెస్టారెంట్ మొదలెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. ఫుడ్ పట్ల నాకున్న ప్యాషన్ ఇక్కడ మీరు చూడబోతున్నారు’’ అని సురేశ్ రైనా తన పోస్టులో చెప్పుకొచ్చాడు. నోరూరించే వెరైటీలు తమ రెస్టారెంట్లో ఉత్తర భారత వంటల సువాసనలతో పాటు.. దక్షిణ భారత అదిరిపోయే రుచులను కూడా అందిస్తామని రైనా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా రైనా రెస్టారెంట్లో చికెన్ చాట్, మిక్స్ పకోడా, జైతుని పనీర్ టిక్కా, తందూర్ చికెన్ టిక్కా, ఆనియన్ భాజీతో పాటు పలురకాల కెబాబ్స్ స్టార్టర్లుగా వడ్డించనున్నారు. అదే విధంగా ఢిల్లీలోని చాందినీచౌక్లో ప్రసిద్ధి పొందిన దహీ భల్లా, పానీ పూరీ, చాట్ పాప్రీ, ఆలూ చాట్, సమోసా కూడా వీరి మెనూలో ఉన్నాయి. చికెన్, మటన్, ఫిష్ సహా వెజ్టేరియన్ వెరైటీలతో కస్టమర్లను ఆకర్షించేందుకు రైనా రెస్టారెంట్ సిద్ధమైపోయింది. భార్య బ్యాంకర్గా కాగా సురేశ్ రైనా భార్య ప్రియాంక గతంలో నెదర్లాండ్స్లోని ఓ బ్యాంక్లో పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైనా తరచుగా ఆమ్స్టర్డామ్ వెళ్లేవాడు. ఈ క్రమంలో అక్కడే రెస్టారెంట్ ఆరంభించి తన కలను నిజం చేసుకున్నాడు. ఇక తాను ఫుడీనంటూ గతంలో రైనా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చిన్న తలా కెరీర్ ఇలా ఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడిన రైనా.. వరుసగా 768, 5615, 1604 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో సుదీర్ఘకాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. చిన్న తలాగా పేరొందాడు. మహేంద్ర సింగ్ ధోనికి అత్యంత సన్నిహితుడైన రైనా.. మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన వెంటనే తానూ గుడ్ చెప్పాడు. 2020 ఆగష్టు 15న రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ View this post on Instagram A post shared by Suresh Raina (@sureshraina3) -
చూడటానికి కిరాణా కొట్టు లాగే ఉంది.. నెలవారీ బిజినెస్ రూ.4 కోట్లకు పై మాటే
ఏ బిజినెస్ చేస్తే డబ్బులు బాగా సంపాదించొచ్చు. తక్కువ పెట్టుబడి. తక్కువ రిస్క్. మంచి ఇన్కమ్ కావాలి. ఏంటా బిజినెస్? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే నా లైఫ్ సెట్ అవుతుంది. నన్నెవ్వరూ ఆపలేరు. 24 గంటలూ పనిచేస్తా. తిండీ నిద్రా మానేస్తా. నాకీ ఒక్క ఆన్సర్ కావాలి. మీరూ ఇలా ఆలోచిస్తుంటే ఇది మీకోసమే. మీరెప్పుడైనా బెంగళూరు వెళ్లారా? వెళితే బెంగళూరులోని ఇందిరా నగర్ ‘రామేశ్వరం కేఫ్’ ను సందర్శించాల్సిందే. ఎందుకంటే ప్రపంచ దేశాల్లోని ఫుడ్ లవర్స్ ఈ కేఫ్లోని ఫుడ్ ఐటమ్స్ను అమితంగా ఇష్టపడతారు. చూడటానికి కిరాణా కొట్టులా? చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) పేరుతో ఈ కేఫ్లో నెలకు రూ.4.5 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇంతకీ ఈ కేఫ్ ఎవరిదో తెలుసా? రాఘవేంద్రరావు 20 ఏళ్లకు పైగా ఫుడ్ బిజినెస్లో అనుభవం ఉంది. ఆయన భార్య, సీఏగా విధులు నిర్వహిస్తున్న దివ్యా రాఘవేంద్ర రావులే ఈ కేఫ్ను ప్రారంభించారు. ఇప్పుడు ఈ కేఫ్ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందుకు కారణం కేఫ్లో జరిగే బిజినెస్సే. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ‘కల, కల.. కలలు ఆలోచనలుగా మారితే.. ఆ ఆలోచనల్ని ఆచరణలో పెడితే అనుకున్న విజయం మీ సొంతం అవుతుంది.’ అని చెప్పిన మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంటే రాఘవేంద్రరావుకు అమితమైన ప్రేమ. ఆ ప్రేమతోనే కలాం జన్మించిన రామేశ్వరం ప్రాంతం పేరుతో ‘రామేశ్వరం కేఫ్’ పేరుతో బెంగళూరులో రెండు కేఫ్లను 2021లో ప్రారంభించారు. చదవండి👉 బ్యాంకుల్లో 'అన్క్లెయిమ్డ్ డిపాజిట్', అందులో పేరుంటే మీకే సొంతం.. చెక్ చేసుకోండిలా! మా లక్ష్యం అదే రామేశ్వరం కేఫ్లో దక్షిణ భారత రుచులను దేశం అంతా విస్తరించాలనేది మాలక్ష్యం. బెంగళూరుతో పాటు చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, పూణె, అహ్మదాబాద్, ముంబై వంటి నగరాలతో పాటు రాబోయే 5 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉనికి చాటాలాని భావిస్తున్నట్లు రాఘవేంద్ర తెలిపారు. రామేశ్వరం కేఫ్లో దొరికే ఫుడ్ ఐటమ్స్ ఇవే వడ, మిని వడ,ఇడ్లీ, నెయ్యి..బటర్ ఇడ్లీ, నెయ్యి పుడి ఇడ్లీ,లెమన్ ఇండ్లీ, నెయ్యి సాంబార్ ఇడ్లీ, వెన్ పొంగల్,సక్కరై పొంగల్ తో పాటు ఇతర ఆహార పదార్ధాలను టేస్ట్ చేయొచ్చు. సుజిత్ కుమార్ నోటా రామేశ్వరం కేఫ్ మాట మార్కెట్ప్లేస్ ఉడాన్ సహ వ్యవస్థాపకుడు సుజిత్ కుమార్ ఇటీవల పాడ్కాస్ట్లో ఇదే కేఫ్ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఆ పాడ్ కాస్ట్లో ఆయన మాట్లాడుతూ ‘రామేశ్వరం కేఫ్ యాజమాన్యం రోజుకు 7,500 మందికి సర్వ్ చేస్తుంటారు. కేఫ్ విస్తీర్ణం 10 బై 10 లేదా 10 బై 15 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. నెలకు రూ.4.5 కోట్లతో ఏడాదికి రూ. 50 కోట్ల వ్యాపారం చేస్తుంది. దాదాపు 70 శాతం గ్రాస్ మార్జిన్ పొందుతున్నారని అన్నారు. అంతే ఆ కేఫ్ గురించి తెలుసుకునేందుకు భోజన ప్రియులు ఉత్సాహాం చూపిస్తున్నారు. నిఖిల్ కామత్ పాడ్ కాస్ట్లో ఇండియన్ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు కుమార్ నిఖిల్ కామత్ ‘డబ్ల్యూటీఎఫ్ ఈ-కామర్స్’ పేరుతో పాడ్ కాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమం 3వ ఎపిసోడ్లో కిషోర్ బియాని (ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు), విదిత్ ఆత్రే (మీషో సహ వ్యవస్థాపకుడు), ఉడాన్ మార్కెట్ప్లేస్ ఉడాన్ సహ వ్యవస్థాపకుడు సుజీత్ కుమార్ ఈ ఎపిసోడ్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రిటైల్, ఆన్లైన్, ఆఫ్లైన్లో వ్యాపారం, దేశ విదేశాల్లో పెట్టుబడులు గురించి చర్చించారు. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
ఆగ‘మేఘాల’ ఘుమ ఘుమల.. ఓ వంటిల్లు.. వందలాది కస్టమర్లు
సాక్షి, హైదరాబాద్: ఆకర్షణీయమైన పరిసరాలు.. అద్భుతమైన ఆహా్వనం.. అభిరుచికి తగిన ఆహారం.. అతిథి దేవోభవ అనిపించే సేవలు.. భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు రెస్టారెంట్లు పడే తాపత్రయం అంతాఇంతా కాదు. గతంలో హోటల్కు వెళ్లి తినడాన్ని జనం అంతగా ఇష్టపడేవారు కాదు. కొందరు అదేదో లగ్జరీగా భావించేవారు. ఇప్పుడు వీకెండ్లో కుటుంబంతో సహా రెస్టారెంట్కు వెళ్లడం సాధారణంగా మారిపోయింది. ఆన్లైన్ డెలివరీలు పెరిగిన నేపథ్యంలో.. వారంలో రెండు మూడుసార్లన్నా బయట ఆర్డర్ చేసి తెప్పించుకోవడమూ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ బిజినెస్ లాభదాయకమనే భావన ఉన్నప్పటికీ..ఆశించిన ఆదరణ లభించకపోతే భారీ నష్టాన్ని మూటగట్టుకోవడం మాత్రం ఖాయం. ఈ నేపథ్యంలోనే ఫుడ్ బిజినెస్కు సంబంధించి ఓ సరికొత్త ట్రెండ్ మొదలైంది. అదే క్లౌడ్ కిచెన్. దేశ, విదేశాల్లో ఎప్పట్నుంచో ఉన్న ఈ క్లౌడ్ కిచెన్లు ఇప్పుడు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ప్రారంభమవుతూ ఆదరణ పొందుతున్నాయి. ఒక వంటిల్లు.. వందలాది కస్టమర్లు అన్నట్టుగా క్లౌడ్ కిచెన్ల హవా సాగుతోంది. కరోనా సమయంలో ఇవి ఎక్కువగా పుంజుకున్నాయి.మూడేళ్ల క్రితం హైదరాబాద్లో పాతిక మించి లేని క్లౌడ్ కిచెన్లు ఇప్పుడు వందల సంఖ్యకు చేరాయి. విలాసవంతమైన రెస్టారెంట్లు..లేదు లేదు అసలు రెస్టారెంట్ అన్న భావనకు ఇది పూర్తిగా భిన్నం. హంగూ ఆర్భాటాలు ఏమీ ఉండవు. రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిలో 1/3 వంతు సరిపోతుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ సిబ్బంది, తక్కువ వ్యయ ప్రయాసలు..స్పష్టంగా చెప్పాలంటే ఒక్క వంటిల్లు మాత్రమే ఉంటుంది. నో డైన్ ఇన్..ఓన్లీ డెలివరీ. కూర్చుని తినడానికి వీలుండదు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సప్లై చేస్తారు..అంతే. క్లిక్ అయితే ఎక్కువ లాభాలు. ఆదరణ లభించకపోయినా అంతంత మాత్రంగానే నష్టం..ఇదే క్లౌడ్ కిచెన్ మూల సూత్రం. షార్ట్ టైమ్.. ఫుల్ పికప్.. జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ యాప్స్ సృష్టించిన ఈ ట్రెండ్ కరోనా విజృంభణ సమయంలో పట్టును దక్కించుకుంది. ఇంటర్నెట్ విస్తృత వ్యాప్తి, వ్యాపారంలో సాంకేతికత, ప్రత్యేక యాప్ల పెరుగుదల ఇందుకు దోహదపడింది. పెరుగుతున్న యువ జనాభా ఆదాయం, మారుతున్న జీవనశైలి, సులభమైన.. సురక్షితమైన చెల్లింపు మార్గాలు, వంటింట్లో బిజీబిజీ పరిస్థితి నుంచి కాస్త ఉపశమనం ఇత్యాదివన్నీ కూడా వీటికి ఆదరణ పెరగడానికి కారణాలుగా పేర్కొనవచ్చు. ఇంట్లో వండినట్టుండే ఆహారం నుంచి స్పెషాలిటీ లగ్జరీ డిన్నర్ల వరకు ప్రతిదానిని అందించడం ద్వారా క్లౌడ్ కిచెన్లు ఈ రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తక్కువ రేటుతో, నాణ్యమైన భోజనం, నిమిషాల్లో ఇంటి ముందు ప్రత్యక్షమవుతుండటంతో నానాటికీ వీటికి ఆదరణ పెరుగుతోంది. 2019లో దేశంలో 400 మిలియన్ల డాలర్లుగా ఉన్న క్లౌడ్ కిచెన్ల వ్యాపారం 2024 నాటికి 2 బిలియన్ల డాలర్లకు చేరుతుందని ఎఫ్ అండ్ బీ (ఫుడ్ అండ్ బివరేజెస్) పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తుండటం గమనార్హం. ఒకేచోట 100కు పైగా.. శాకాహార, ఆరోగ్యకరమైన వంటకాలు, ప్రాంతీయ రుచికరమైన వంటకాలు వంటివి అందించే ఆఫ్లైన్ రెస్టారెంట్ల సంఖ్య పెరగడాన్ని.. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ క్లౌడ్ కిచెన్ల ఏర్పాటును ఈ ఏడాది చూడవచ్చునని నిపుణులు అంటున్నారు. స్విగ్గీ, జొమాటో వంటివి..క్లౌడ్ కిచెన్లకు ఆధారంగా ఉన్నప్పటికీ, భారీ కమీషన్ల ఫలితంగా, కొన్ని క్లౌడ్ కిచెన్లు తమ సొంత యాప్లు, సెల్ఫ్ డెలివరీ ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. నాగచైతన్య వంటి సినిమా తారలను సైతం ఈ క్లౌడ్ కిచెన్స్ ఆకర్షిస్తున్నాయి. నగరంలోని డీఎల్ఎఫ్ ఏరియా లాంటి ఒకేచోట 100కు పైగా క్లౌడ్ కిచెన్లు ఉన్నాయంటే వీటికి లభిస్తున్న ఆదరణను అర్ధం చేసుకోవచ్చు. సినీహీరో నాగచైతన్య ఏర్పాటు చేసిన ‘షోయు’ ఇప్పటికే బాగా ట్రెండింగ్లో ఉంది. ట్రెండ్ను మేం ముందే ఊహించాం.. పాతికేళ్లుగా మేం మిఠాయిల తయారీలో ఉన్నాం. ఈ ట్రెండ్ని ముందే ఊహించి సహదేవ్రెడ్డి టిఫిన్స్ పేరుతో క్లౌడ్ కిచెన్ అందరికీ తెలిసే సమయానికే మేం ప్రారంభించాం. సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్, చాట్ వంటివన్నీ డెలివరీ చేస్తాం. మా కిచెన్ దిల్సుఖ్నగర్లో ఉంది. తెల్లవారుజాము 4 గంటలకే స్టార్ట్ చేసి అర్ధరాత్రి ఒంటిగంట వరకూ నిర్వహిస్తాం. సిటీలోని అన్ని ప్రాంతాల నుంచీ ఆర్డర్స్ వస్తున్నాయి. వ్యయ ప్రయాసల పరంగా చూస్తే ఇది చాలా మంచి వ్యాపారం. గృహిణులు, యువత దీన్ని బాగా అందిపుచ్చుకుంటున్నారు. –పి.అభి షేక్రెడ్డి, సహదేవ్రెడ్డి టిఫిన్స్ దూకుడు పెరగడం ఖాయం మొదట్లో కొన్ని ఐటమ్స్కే పరిమితమైనా ఇప్పుడు రెస్టారెంట్లో దొరికే వెరైటీలన్నీ అందిస్తున్నాయి. బిర్యానీల కోసం ఒకటి, పరోటాల కోసం ఒకటి, బర్గర్స్, పిజ్జాల కోసం, స్వీట్స్, పేస్ట్రీల కోసం.. ఇలా దేనికదే ప్రత్యేక కిచెన్స్ వచ్చేశాయి. అపరిమితమైన కస్టమర్స్ బేస్ అవకాశాల వల్ల వీటి దూకుడు ఇంకా పెరగడం తథ్యం. –సంకల్ప్, హైదరాబాద్ ఫుడీస్ క్లబ్ హైదరాబాద్ టాప్... గత కొంత కాలంగా రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్న మేం లగ్జరీ డైనింగ్ను కెఫెల ద్వారా అందిస్తున్నాం. మా బ్రాండ్కు ముంబయి, బెంగళూరు, చెన్నై సహా ప్రతిచోటా క్లౌడ్ కిచెన్స్ కూడా ఉన్నాయి. అయితే హైదరాబాద్లో మాకు ఆదరణ చాలా స్పీడ్గా పెరిగింది. బంజారాహిల్స్, గచ్చిబౌలి , ఎల్బీనగర్... ఇలా 4 చోట్ల మా కిచెన్స్ నిర్వహిస్తున్నాం. –భాను, లూయిస్ బర్గర్స్ -
గెలుపు ఘుమఘుమలు@ 78
గట్టిగా అనుకుని ఆచరణలో పెడితే చాలు తలుచుకున్న పని తప్పక సఫలం అవుతుంది అనే మాటలకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తారు బామ్మ ఊర్మిళా అషేర్. ఎనిమిది పదుల వయసుకు చేరువలో ఉండి తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో లక్షలాది అభిమానులను ఘుమఘుమలతో కట్టిపడేసింది.ఆటుపోట్ల జీవనాన్ని అధిగమించి తన సత్తా చూపుతోంది. కష్టాలు తాత్కాలికమే, జీవితంపై నమ్మకం కోల్పోకూడదు. విపరిణామాలు మనపైన ప్రభావం చూపకుండా ఉండేందుకు ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ధైర్య స్థైర్యాలతోనే జీవితాన్ని గెలవాలి. – ఊర్మిళా అషేర్ ‘‘మొన్న అప్లోడ్ చేసిన నా 200 వ వీడియోతో యూ ట్యూబ్ చానెల్ లక్ష మంది అభిమానులను సంపాదించింది. ఇటీవలే దేశవ్యాప్తంగా టీవీలో ప్రసారమవుతున్న ‘రసోయి షో’లో పాల్గొన్నాను. మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్ 7లో పోటీదారుగా చేరడంతో మీ అందరికీ పరిచయం అయ్యాను. ఇదంతా మీ అభిమానం వల్లే కలిగింది’ అంటూ ఆనందంగా చెబుతోంది ఊర్మిళ అషేర్. ముంబైలో ఉంటున్న ఊర్మిళ అషేర్ గుజరాతీ కుటుంబీకురాలు. తన కుటుంబం ఆర్థిక కష్టాలు తీరాలంటే ఏదో ఒక సాయం చేయాలనుకుంది. అందుకు తనకు వచ్చిన పాకశాస్త్ర ప్రా వీణ్యాన్ని పెట్టుబడిగా పెట్టింది. తన మనవడు హర్ష్తో కలిసి మూడేళ్ల క్రితం ‘గుజ్జు బెన్ న నాస్తా’ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఏడాదికి రూ.45 లక్షల టర్నోవర్ సాధిస్తూ 78 ఏళ్ల వయసులోనూ ‘గ్రేట్ బామ్మా’ అనిపించుకుంటోంది. కోల్పోనిది ధైర్యమొక్కటే.. ఊర్మిళా అషేర్కు పద్దెనిమిదేళ్ల వయసులో పెళ్లయ్యింది. భర్త చిరుద్యోగి. ముగ్గురు పిల్లలు. ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. రెండున్నరేళ్ల వయసులో కూతురు మూడవ అంతస్తు మీద నుంచి కింద పడి మరణించింది. భర్త తెచ్చే జీతం డబ్బులతో ఇంటిని నడుపుకుంటూ వచ్చింది. పెద్ద కొడుకుకి పెళ్లి చేసింది. కరోనాకు ముందు ఇద్దరు కొడుకుల్లో ఒకరు గుండెపోటుతో, మరొకరు బ్రెయిన్ ట్యూమర్తో మరణించారు. ఆ తర్వాత భర్త మరణించాడు. ఈ ఎదురు దెబ్బలు ఆమెను నిత్యం గట్టిపరుస్తూనే ఉన్నాయి. ‘మరణం అనేది పరమసత్యం. దాని గురించి ఎన్ని రోజులని ఏడుస్తూ కూర్చుంటాం. నేనెప్పుడూ నా వద్ద ఉన్న శక్తితోనే ఏం చేయగలను అనేదానిపై దృష్టిపెడతాను. ఉన్న సమస్యలు చాలవన్నట్టు నాలుగేళ్ల క్రితం నా మనవడు హర్ష్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో పై పెదవి పూర్తిగా దెబ్బతిని, ఇంటికే పరిమితం అయ్యాడు. అతను నడుపుతున్న దుకాణాన్ని కరోనా మహమ్మారి కారణంగా మూసేశాం. దీంతో ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కష్టాలు తాత్కాలికమేనని, జీవితంపై నమ్మకం కోల్పోకూడదని తెలుసు’ అని చెప్పే ఊర్మిళ ఈ విపరిణామాలు మనవడిపైన ప్రభావం చూపకుండా ఉండేందుకు ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదని, ధైర్య స్థైర్యాలతోనే జీవితాన్ని గెలవాలని చెబుతూ ఉంటుంది. ఆమె మనో నిబ్బరం, ఆత్మవిశ్వాసాలే నేడు ఏడాదికి రూ.45 లక్షల టర్నోవర్కు చేరుకునేంతగా ఫుడ్ బిజినెస్లో ఎదిగేలా చేశాయి. కష్టం వచ్చినప్పుడు ఇంకాస్త గట్టిగా ఉండాలని తన కథనే ఉదాహరణగా ఇతరులతో పంచుకుంటోంది ఈ దాదీ. వ్యాపార విస్తరణ కోడలు, మనవడితో ఉండే ఊర్మిళ తన చేతి రుచి గురించి చెబుతూ– ‘‘నాకు చిన్నప్పటి నుంచి వంటలు బాగా చేస్తాననే పేరుంది. మమ్మల్ని మేం బతికించుకోవడానికి ముందుగా గుజరాతీ చిరుతిళ్ల వ్యాపారాన్ని ప్రా రంభించాం. ఆర్డర్లు వచ్చినదాన్ని బట్టి 20–25 రోజుల్లో 500 కిలోల పచ్చళ్లను రెడీ చేశాం. దీంతోపాటు తేప్లా , ఢోక్లా, పూరన్ పోలీ.. వంటి ఇతర స్నాక్స్ కూడా అమ్మడం మొదలుపెట్టాం. డిమాండ్ను బట్టి పనివాళ్లను ఎక్కువ మందిని నియమించుకున్నాం. ఒక సంవత్సరం తిరిగేసరికల్లా మా జీవితాలే మారిపోయాయి. నేనిప్పుడు టెడెక్స్ స్పీకర్ని కూడా. నా కథలను ఇతరులతో పంచుకుంటూ, ఇతరులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటూ వివిధ నగరాలకూ ప్రయాణిస్తున్నాను. ఇప్పుడు మా ఆలోచన ఒక్కటే! నేను, మా మనవడు కలిసి అంతర్జాతీయ విమానాశ్రయాలలో ‘గుజ్జుబెన్ నాస్తా’ను ఏర్పాటు చేయాలని. అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుండి కూడా ఆర్దర్లు తీసుకుంటున్నాం. వ్యాపారాన్ని ఇంకా విస్తరిస్తేనే కదా మరింత మందికి చేరువ అయ్యేది... మా ఊరగాయలను ఆన్లైన్ ΄్లాట్ఫారమ్లలో పెట్టడానికి కావలసిన లాంఛనాలు కూడా పూర్తయ్యాయి’ అని ఉత్సాహంగా వివరించే ఊర్మిళ మాటలు నేటి యువతకూ స్ఫూర్తినిస్తాయి. -
జొమాటోకు వ్యయాల సెగ
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో కన్సాలిడెటెడ్ నష్టాలు డిసెంబర్ త్రైమాసికంలో రూ.346 కోట్లకు పెరిగిపోయాయి. అంతక్రితం ఏడాడి ఇదే కాలానికి సంస్థ నష్టం కేవలం రూ.67 కోట్లుగానే ఉంది. అధిక వ్యయాలు, ఆన్లైన్ ఫుడ్ వ్యాపారం నిదానించడం, బ్లింకిట్ నుంచి పెరిగిపోయిన నష్టాలు ఈ పరిస్థితికి దారితీశాయి. కార్యకలాపాల ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,112 కోట్ల నుంచి రూ.1,948 కోట్లకు పెరిగింది. వ్యయాలు రూ.1,642 కోట్ల నుంచి రూ.2,485 కోట్లకు చేరాయి. ‘‘పరిశ్రమ వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ వ్యాపారం గతేడాది అక్టోబర్ (దీపావళి తర్వాత) నుంచి తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా, ముఖ్యంగా టాప్ 8 పట్టణాల్లో మరింత అధికంగా ఉంది’’అని జొమాటో సీఎఫ్వో అక్షత్ గోయల్ తెలిపారు. ఫుడ్ డెలివరీ వ్యాపారం డిమాండ్ వాతావరణం సవాలుగా ఉన్నట్టు వ్యాఖ్యానించారు. ‘‘ఇటీవలి వారాల్లో డిమాండ్ పరంగా తిరిగి సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. కనుక గడ్డు పరిస్థితి ముగిసినట్టేనని భావిస్తున్నాం’’అని గోయల్ పేర్కొన్నారు. జనవరిలో దేశవ్యాప్తంగా 225 చిన్న పట్టణాల్లో తాము కార్యకలాపాలు నిలిపివేసినట్టు చెప్పారు. డిసెంబర్ త్రైమాసికంలో ఈ పట్టణాల నుంచి వచ్చిన ఆదాయం మొత్తం ఆదాయంలో 0.3 శాతమే ఉన్నట్టు తెలిపారు. దీర్ఘకాలంలో ఫుడ్ డెలివరీ వృద్ధి అవకాశాల పరంగా ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుతం పరిశ్రమలో వృద్ధి తగ్గడం అన్నది మధ్యస్థాయి మార్కెట్ విభాగంలో మందగమనం, ప్రీమియం విభాగంలో బయటకు వెళ్లి ఆహారం తీసుకోవడం, ప్రీమియం పర్యాటక యాత్రలు తదితర పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ఎబిట్డా స్థాయిలో లాభ, నష్టాలు లేని స్థాయికి 2023–24 రెండో త్రైమాసికంలో చేరుకునే విషయంలో ఎటువంటి సందేహం లేదన్నారు. సంస్థ రూ.265 కోట్ల నిర్వహణ నష్టాలు ప్రకటించగా, ఇందులో బ్లింకిట్ను మినహాయిస్తే నిర్వహణ నష్టం కేవలం రూ.38 కోట్లుగానే ఉంది. -
Zomato: ‘జొమాటో ఉద్యోగులకు భారీ షాక్!’
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వారాల వ్యవధిలో ముగ్గురు ఉన్నత స్థాయి ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేశారు. ఈ తరుణంలో జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం వర్క్ ఫోర్స్లో 4 శాతం మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నష్టాల్లో ఉన్న సంస్థలో ఖర్చును తగ్గించి లాభసాటిగా మార్చేందుకు దేశ వ్యాప్తంగా ప్రొడక్ట్, టెక్నాలజీ, కేటలాగ్, మార్కెటింగ్ విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని జొమాటో ఫైర్ చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆ ఉద్యోగులు విధులకు హాజరుకావడం లేదని సమాచారం. ఉత్పత్తిని పునరుద్ధరించే సమయంలో మిడ్లెవల్ ఉద్యోగల నుంచి సీనియర్ స్థాయి ఉద్యోగుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ స్థాయిలో విధుల నిర్వహించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి తొలగింపులు అనివార్యమైనట్లు తెలుస్తోంది. కాగా, ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చే అంశంపై ఇప్పటికే జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ సంస్థ ఉద్యోగులకు సమాచారం అందించారు. విధుల నిర్వహణలో అలసత్వం వహించిన ఉద్యోగల్ని తొలగిస్తామని చెప్పారు. ఇప్పుడు సీఈవో చెప్పినట్లుగానే తొలగింపులు ఉంటున్నాయని నివేదిక హైలెట్ చేసింది. నష్టాల్లో జొమాటో జాతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్ధిక మాంద్యంతో పాటు ఇతర కారణాల వల్ల 2022-2023 క్యూ2 లో నిరాశాజనకమైన ఫలితాల్ని రాబట్టింది. సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి జొమాటో రూ.251కోట్లు నష్టపోయింది. చదవండి👉 నాన్నకు రోడ్డు ప్రమాదం..డెలివరీ బాయ్గా ఏడేళ్ల బాలుడు -
ఆహార కల్తీకి చెక్! అధికారుల కొత్త రూల్స్.. లైసెన్స్ తీసుకుంటేనే సరి.. లేదంటే?
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఆహార పదార్థాల తయా రీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వందల సంఖ్యలో చిన్నచిన్న బండ్లపై, రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అధికంగా ఏర్పాటవుతున్నాయి. పెద్దపెద్ద హోటళ్ల నుంచి చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్న వ్యాపారులు కనీస నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల విక్రయాల్లో కనీస నాణ్యత పాటించడం లేదని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆహార పదార్థాలు కల్తీకి గురవుతున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఆహార కల్తీని కట్టడి చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు, భోజనం అందించేలా వ్యాపారులు నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో లైసెన్స్లు, రిజిస్ట్రేషన్ లేని టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, హోటళ్లపై అధికారులు దృష్టి సారించారు. వాటిని నిర్వహించే వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు చిరు వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి శనివారం లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించేందుకు నిర్ణయించారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్లు లేనివే ఎక్కువ.. ఉమ్మడి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం హోటళ్లు, బేకరీలు, టిఫిన్ సెంటర్లు, ఆహార పదార్థాల తయారీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాల్ మిల్లులు తదితర ఆహార ఉత్పత్తుల కేంద్రాలు 5 వేలకు పైగానే ఉన్నాయి. వాటిలో లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగిన హోటళ్లు, రెస్టారెంట్లు 886 వరకు ఉండగా, చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు, ఇతర ఫుడ్ కోర్టులు ఖమ్మం జిల్లాలో 1400, కొత్తగూడెంలో 700 ఉన్నాయి. మిగిలిన వాటికి లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వ్యాపారం చేసే టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఇతర ఫుడ్ కోర్టులు తప్పనిసరిగా తమ వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఆపైన వ్యాపారం చేసే వారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం లైసెన్స్ పొంది ఉండాలి. రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించే వారిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఉండి నిబంధనలు పాటించకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులకు వీలుంటుంది. సిబ్బంది కొరత.. ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఆహార పదార్థాల తయారీ సెంటర్లు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో తనిఖీ చేసేందుకు అధికారులు, సిబ్బంది సరిపడా లేరు. ఉమ్మడి జిల్లాలో ఖమ్మంలో ఒక గెజిటెడ్ అధికారితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో మరో అధికారి మాత్రమే ఉన్నారు. దీంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఆహార పదార్థాలు కల్తీ జరిగినా గుర్తించేందుకు సిబ్బంది లేక తనిఖీలు చేయలేకపోతున్నారు. రోజుకు ఒకటి రెండు హోటళ్లను కూడా అధికారులు తనిఖీ చేయలేని పరిస్థితి ఉంది. ప్రతి శనివారం మేళా.. లైసెన్స్లు, రిజిస్ట్రేషన్ లేకుండా భోజన వ్యాపారం నిర్వహిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి శనివారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో మేళా ద్వారా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఖరఖానాలు, దాల్ మిల్లులు, పిండి మిల్లులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫుడ్ కోర్టులకు లైసెన్స్లు ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు. వ్యాపారులకు అవగాహన కల్పించడంతో పాటు నాణ్యత పాటించకపోతే చట్టపరంగా తీసుకునే చర్యలను ఈ మేళా ద్వారా వివరిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన నిర్వహించిన తొలి మేళాలో 11 లైసెన్స్లు జారీ చేయగా, 20 మంది వ్యాపారులు తమ వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. లైసెన్స్లు తప్పనిసరి.. ఉమ్మడి జిల్లాలో ఉన్న హోటళ్లు, దాల్ మిల్లులు, బేకరీలు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయవద్దు. చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు, ఫుడ్ కోర్టులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు తమ వ్యాపారాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తే చర్యలు తీసుకుంటాం. నాణ్యత లేకుండా, కల్తీ వ్యాపారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రతి శనివారం రిజిస్ట్రేషన్, లైసెన్స్ మేళా కేఎంసీలో ఉంటుంది. – కిరణ్కుమార్, జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఖమ్మం -
బిలియనీర్ అదానీ భారీ పెట్టుబడులు: అంబానీకి షాకేనా?
సాక్షి, ముంబై: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ తన వ్యాపార సామాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్లో మరింత దూసుకుపోనుంది. ముఖ్యంగాఎఫ్ఎంసీజీ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించిన తర్వాత ఆసియాలోని అత్యంత ధనవంతుడు తన సామ్రాజ్య ఆహార కార్యకలాపాలను రెట్టింపు చేసేలా, స్థానిక, విదేశీ కొనుగోళ్లపై దృష్టిపెట్టడం మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. బిలియనీర్ గౌతమ్ అదానీ 400 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లతో ఆహారవ్యాపారంలోకి మరింత దూకుడుగా వస్తున్నారని యూఎస్ ఫుడ్ అండ్ అగ్రి ఆర్గనైజేషన్ తెలిపింది. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన అదానీ తన రెట్టింపు ఆదాయాలను దేశీయ ఆహార ఉత్పత్తి పరిశ్రమలో వాటాల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అదానీకి చెందిన కిచెన్ ఎసెన్షియల్స్ సంస్థ అదానీ విల్మార్ లిమిటెడ్ తమ మార్కెట్ రీచ్ను పెంచడానికి ప్రధాన ఆహారాలు, పంపిణీ కంపెనీలలో బ్రాండ్లను కొనుగోలు చేయాలని చూస్తున్నామని అదానీ విల్మార్ సీఎండీ అంగ్షు మల్లిక్ బుధవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు రానున్న మార్చి నాటికి రెండు డీల్స్ పూర్తి చేయనున్నామని కూడా మల్లిక్ వెల్లడించారు. ఇందుకు 5 బిలియన్ రూపాయలను కంపెనీ కేటాయించిందని చెప్పారు. ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాదికి 30 బిలియన్ రూపాయల ప్రణాళికా బద్ధమైన మూలధన వ్యయంతో పాటు అంతర్గత నిల్వల నుంచి అదనపు నిధులు వస్తాయని చెప్పారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా ఇ-కామర్స్ పంపిణీలో 50 శాతం వృద్ధిని సాధిస్తోందని మల్లిక్ చెప్పారు. ఫిబ్రవరినుంచి తమ ఫుడ్ కంపెనీ షేర్లు మూడు రెట్లు పెరిగియన్నారు. మెక్కార్మిక్ స్విట్జర్లాండ్ నుండి కోహినూర్ కుకింగ్ బ్రాండ్తో సహా పలు బ్రాండ్లను అదానీ విల్మార్ ఇటీవల కొనుగోలుచేసింది.తద్వారా కోహినూర్ బాస్మతి బియ్యం, రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్ కూరలు, ఫుడ్పై ప్రత్యేక హక్కులు పొందించింది. అదానీ గ్రూప్ గత ఏడాదిలో 17 బిలియన్ డాలర్ల విలువైన దాదాపు 32 కంపెనీలను కొనుగోలు చేసింది. కాగా రిలయన్స్ రీటైల్ వింగ్ రిలయన్స్ రిటైల్ సరసమైన ధరలకు అధిక నాణ్యత గల ఉత్పత్తులను అభివృద్ధి చేసి, డెలివరీ చేసే లక్ష్యంతో ఎఫ్ఎంసిజి వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఏజీఎంలో ప్రకటించింది. -
ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు షాక్.. లైసెన్స్ లేకపోతే జైలుకే!
సాక్షి,విజయనగరం: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా లైసెన్స్లు లేకుండా ఆహార పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలు అతిక్రమిస్తూ వ్యాపారాలు కొనసాగించే వ్యాపారులపై జిల్లా ఆహార కల్తీ, నియంత్రణ అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. ఇప్పటివరకు ఆహర పదార్థాల కల్తీపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార యంత్రాంగం ఇకపై నుంచి లెసెన్స్లు కూడా ఉండాలని, అవి ఉన్న వారే ఆహార విక్రయాలకు అర్హులని చెబుతోంది. ఒకవేళ లైసెన్స్ లేకుండా అమ్మకాలకు పాల్పడిన వారికి రూ.5 లక్షల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించనున్నామని అధికారులు పేర్కొంటున్నారు. పుట్టగొడుగుల్లా విక్రయ కేంద్రాలు.. జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా ఆహర పదార్థాల విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయి. చిన్నపాటి జంక్షన్లో కూడా నాలుగైదు తోపుడు బళ్లపై ఫాస్ట్ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఒకింత పెద్ద జంక్షన్ అయితే ఏకంగా పదుల సంఖ్యలో ఫాస్ట్ఫుడ్ సెంటర్లు నిర్వహణ కనిపిస్తుండడం గమనార్హం. అంతేకాకుండా చిన్నపాటి గదులను అద్దెకు తీసుకుని మరీ పకోడీ, టిఫిన్ షాపులు, నూడిల్స్, పానీపూరి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు అయితే వేల సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. ఏటా లైసెన్స్ రెన్యువల్.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఏడాదిలో రూ.12 లక్షల ఆదాయం వచ్చే హోటళ్లు, రెస్టారెంట్లు రూ.2 వేలు చెల్లించి తమ లైసెన్స్లను ఏటా రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధికారిక సమాచారం ప్రకారం జిల్లాలో 270 మంది మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, లెసెన్స్లను రెన్యువల్ చేసుకున్నారు. ఏడాదిలో రూ.12 లక్షల లోపు ఆదాయం సంపాదించే చిన్నపాటి దుకాణాలు నిర్వహించే వారు ఏడాదికి రూ.500 మాత్రమే చెల్లించి, లైసెన్స్లు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు జిల్లాలో 1,477 మంది మాత్రమే ఆ తరహా లైసెన్స్లను రెన్యువల్ చేసుకున్నారు. ఈ లెక్కన అధికారికంగా నిర్వహించే దుకాణాల కన్నా అనధికారికంగా నిర్వహించే దుకాణాలే ఎక్కువన్న విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో వాటిపై సర్కారు ఆదేశాల మేరకు చర్యలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 100 కేసుల నమోదు.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న అక్రమ వ్యాపారులకు వ్యతిరేకంగా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుండగా, కోవిడ్ కారణంగా గడిచిన రెండేళ్లలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కేసులు మాత్రమే నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో కొన్నింటిని జేసీ కోర్టుకు, మరికొన్నింటిని జిల్లా కోర్టుకు నివేదించినట్లు సమాచారం. వీటితో ఇప్పటివరకు రూ.2.50 లక్షల ఆదాయం అపరాద రుసుం కింద వసూలైనట్లు అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులకు లైసె న్స్ లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. పదార్థాలు కల్తీ చేసినా, అక్రమంగా అమ్మకాలు కొనసాగించినా జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తాం. – ఈశ్వరి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, విజయనగరం జిల్లా చదవండి: డామిట్.. కథ అడ్డం తిరిగింది -
11 మంది మహిళలు.. లడ్డుతో వ్యాపారం మొదలుపెట్టి.. ఏకంగా కార్పొరేట్ హోటళ్లలో..
‘ఐదువేళ్లు ఒక్కటైతే ఐకమత్యం, బలం’ అని చిన్నప్పటి పాఠాల్లో చదువుకున్నాం. బతుకు పాఠాల్లో అది ముఖ్యమైన పాఠం. పదకొండు మంది మహిళలు ఒకేమాట మీద నిలబడి ఐక్యత సాధించడమే కాదు... జీవితం హాయిగా సాగిపోవడానికి అవసరమైన బాటను నిర్మించుకున్నారు... దేశరాజధాని దిల్లీలో నిజాముద్దీన్ బస్తీ అని ఉంది. ఈ బస్తీని బస్తీ అనడం కంటే ‘రుచుల ఖజానా’ అనడం సబబు. ఏడువందల ఏళ్ల నాటి పాకశాస్త్ర ప్రావీణ్య పాఠాలకు ఈ గల్లీ ప్రసిద్ధి పొందింది. ఖమిరీ రోటీ నుంచి కబాబుల వరకు నోరూరించే బస్తీ ఇది.దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లు ఇక్కడ నివసించడం వల్ల భిన్నమైన వంటల రుచుల సమ్మేళనానికి వేదికగా మారింది. దిల్లీలోని భోజనప్రియులు ఒక్కసారైనా సరే ఈ గల్లీకి రావాల్సిందే. ‘జైకా’ రాకతో గల్లీకి కొత్త రుచుల కళ వచ్చింది.దిల్లీలో చిన్నాచితకా పనులు చేసుకునే పదకొండుమంది మహిళలు ఒక గ్రూప్గా ఏర్పడి ‘జైకా–ఏ–నిజాముద్దీన్’ పేరుతో వంటల వ్యాపారంలోకి దిగారు. ‘ఆరోగ్యాన్ని పాడు చేసే చిరుతిండ్లకు ప్రత్యామ్నాయంగా పోషక విలువలతో కూడిన తిండి’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.లడ్డుతో వ్యాపారం మొదలుపెట్టారు. తియ్యటి విజయం సొంతం అయింది. ‘లడ్డూ కావాలా నాయనా’ అని ఒకరినొకరు ఊరించుకోవడం మొదలైంది. లడ్డు విజయం ఇచ్చిన ఉత్సాహం లో నిహరి, షమి కబాబ్, ఖీమా ఖరేలా, షిల్లమ్ గోష్... మొదలైన 50 ఐటమ్స్ తయారీలోకి దిగారు. అవి హాటెస్ట్ సెల్లింగ్ ఐటమ్స్గా మారడానికి ఎంతో కాలం పట్టలేదు.ఈ ఉత్సాహంతో క్యాటరింగ్ వింగ్ మొదలు పెట్టారు. హోమ్ డెలివరీ, లైవ్కౌంటర్, కార్పోరేట్ ఆఫీసుల ఆర్డర్లతో వ్యాపారం నాన్–స్టాప్ స్పీడ్ అందుకుంది.‘జైకా’లో పనిచేసే పదకొండుమంది మహిళలు స్టార్హోటళ్లలో చెఫ్ల మాదిరిగానే యూనిఫాం ధరిస్తారు.తమ వ్యాపారం ద్వారా వచ్చిన లాభాలలో ఫండ్ ఏర్పాటు చేసుకున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం సభ్యులు ఇందులో నుంచి వడ్డీ లేని రుణాలు తీసుకోవచ్చు. విశేషం ఏమిటంటే, దేశంలోని కార్పోరేట్ హోటళ్లలో ‘గెస్ట్ చెఫ్’గా వీరు గౌరవాన్ని అందుకుంటున్నారు. ‘మాకు ఇంకా ఎన్నో కలలు ఉన్నాయి’ అంటుంది బృందంలో సభ్యురాలైన నూర్జహాన్. చదవండి: Blood Washing: ‘బ్లడ్వాషింగ్’ అంటే?: విదేశాల్లో బ్లడ్వాషింగ్కు పాల్పడుతున్న కోవిడ్ బాధితులు! -
ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలోకి విప్రో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎఫ్ఎంసీజీ రంగ దిగ్గజం విప్రో కంజ్యూమర్ కేర్, లైటింగ్ తాజాగా ప్యాకేజ్డ్ ఫుడ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. చిరుతిళ్లు, మసాలా దినుసులు, రెడీ టు ఈట్ విభాగంలో సుస్థిర స్థానం సంపాదించాలన్నది సంస్థ లక్ష్యం. కాగా, సంతూర్, యార్డ్లీ, చంద్రిక, గ్లూకోవిట, సేఫ్వాష్ వంటి బ్రాండ్లను సంస్థ ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే కంపెనీ తన ఉత్పత్తులను ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య మార్కెట్లలో విక్రయిస్తోంది. 2021–22లో విప్రో కంజ్యూమర్ కేర్ రూ.8,634 కోట్ల టర్నోవర్ సాధిచింది. -
100 శాతం ఆర్గానిక్ కాఫీ: ఫుడ్ బిజినెస్లోకి రిలయన్స్
సాక్షి,ముంబై: బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ, రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (ఆర్బీఎల్) ఆహార పదార్థాలు, పానీయాల రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం యూకేకు చెందిన ఫుడ్ అండ్ ఆర్గానిక్ కాఫీ చెయిన్ ప్రెటా మౌన్రేతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు సంస్థ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రెటా మౌన్రేకు దీర్ఘకాలిక మాస్టర్ ఫ్రాంచైజీగా కంపెనీ వ్యవహరించనుంది. ముందుగా ప్రధాన నగరాలు, ట్రావెల్ హబ్లతో ప్రారంభించి, ఆ తరువాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నామని ఆర్బీఎల్ ప్రకటించింది. దేశీయ వినియోగదారులకు అభిరుచులకు అనుగుణంగా తాజా, సేంద్రీయ ఆహార పదార్థాల్ని అందించాలనేదే లక్ష్యమని రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ ఎండీ దర్శన్ మెహతా వెల్లడించారు. ఆసియాలో రెండు దశాబ్దాల క్రితం తొలి ప్రెట్ ఔట్లెట్ను ప్రారంభించిన ప్రెటా మౌన్రేకు ఆర్బీఎల్తో భాగస్వామ్యం సంతోషాన్నిస్తోందని సీఈఓ పనో క్రిస్టౌ తెలిపారు. కస్టమర్లకు ఫ్రెష్ ఫుడ్తోపాటు, 100% ఆర్గానిక్ కాఫీని అందిస్తామన్నారు. కాగా అతిపెద్ద రిటైల్ ప్లాట్ఫామ్గా ఉన్న ఆబీఎల్ గత 14 ఏళ్లుగా దేశంలో గ్లోబల్ బ్రాండ్ ఉత్పత్తులను అందిస్తోంది. అలాగే ‘రెడీ టు ఈట్' అంటూ తొలిసారిగా 1986లో లండన్లో ప్రారంభమైంది ప్రెటా మౌన్రే. యూకే, యూఎస్, హాంగ్కాంగ్, ఫ్రాన్స్, దుబాయి తదితర దేశాల్లో మొత్తం 550 ఔట్లెట్లను నిర్వహిస్తోంది. ఆర్గానిక్ కాఫీ, శాండ్విచ్లు, సలాడ్లు, ర్యాప్లను అందిస్తోంది ప్రెటా మౌన్రే -
ఫిర్యాదుల పరిష్కారానికి ఏం చేస్తున్నారు..
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ ఆపరేటర్లపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన వ్యవస్థను మెరుగుపర్చుకోవడానికి తీసుకుంటున్న చర్యల గురించి 15 రోజుల్లోగా ప్రతిపాదనలను సమర్పించాలని స్విగ్గీ, జొమాటో తదితర ఆపరేటర్లను ఆదేశించింది. ప్రస్తుతం పాటిస్తున్న విధానం, అలాగే మెరుగుపర్చే ప్రతిపాదనలను ఇవ్వాలంటూ వినియోగదారుల వ్యవహారాల విభాగం బడా ఈ–కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను (ఎఫ్బీవో) ఆదేశించినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సారథ్యంలో సోమవారం ఎఫ్బీవోలతో జరిగిన సమావేశం సందర్భంగా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. గడిచిన 12 నెలల వ్యవధిలో నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్ నంబరుకు (1915) స్విగ్గీపై 3,631, జొమాటోపై 2,828 పైచిలుకు ఫిర్యాదులు వచ్చినట్లు వివరించింది. డెలివరీ చార్జీలు, ప్యాకేజింగ్ చార్జీలు, పన్నులులాంటి ప్రతి చార్జీ గురించి వినియోగదారులకు పారదర్శకంగా చూపాలని సూచించినట్లు తెలిపింది. స్విగ్గీ, జొమాటో సహా ఎఫ్బీవోలు, రెస్టారెంట్ల సమాఖ్య ఎన్ఆర్ఏఐ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హెల్ప్లైన్కి వచ్చిన ఫిర్యాదులపై ఇందులో చర్చించారు. తాము మెరుగైన సర్వీసులు అందించడానికి లేకుండా ఎఫ్బీవోలు కస్టమర్ల వివరాలను ఇవ్వడం లేదంటూ ఎన్ఆర్ఏఐ ఆరోపించింది. ప్రతి ఆర్డరుపై 20 శాతం కమీషన్ తీసుకోవడంతో పాటు డెలివరీ చార్జీలను కూడా ఎఫ్బీవోలే ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నాయని పేర్కొంది. మరోవైపు, తాము ఇప్పటికే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను అమలు చేస్తున్నామని, దీన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉందని ఎఫ్బీవోలు తెలిపాయి. -
నయా ట్రెండ్: డోర్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్ డెలివరీ బాయ్
నాగమణి సాధారణ గృహిణి భర్త ఉద్యోగి. ఓ మధ్యాహ్నం వేళ. అకస్మాత్తుగా ఇంటికి చుట్టాలు వచ్చారు. భోజన సమయం కావడంతో ఏం చేయాలో తోచక భర్తకు ఫోన్ చేసింది. కొద్ది నిమిషాల్లోనే కాలింగ్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్ డెలివరీ బాయ్ కనిపించాడు. భర్త ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన బంధువులు రీఫ్రెష్ అయ్యేలోపే తాజా వంటకాలు సిద్ధమయ్యాయి. కిరణ్, సంధ్య కొత్తగా పెళ్లయిన జంట ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వర్క్ఫ్రం హోంలో ఇద్దరూ బిజీ. ఇద్దరి షిఫ్ట్లు వేరు. ల్యాప్టాప్లో లాగినైతే క్షణం తీరిక ఉండదు. వంట చేయాలంటే కుదిరే పని కాదు. వర్క్ చేస్తూనే తమ అభిరుచులకు తగినట్టు స్మార్ట్ ఫోన్లోని ఫుడ్ డెలివరీ యాప్స్లో ఆర్డర్ చేయడం.. నిమిషాల వ్యవధిలో వచ్చే ఫుడ్ ఐటమ్స్ను తింటూనే విధులు నిర్వహించడం వారికి అలవాటుగా మారింది. డాబాగార్డెన్స్/బీచ్రోడ్డు: విశాఖ నగర వాసులు కొత్త రుచులను కోరుకుంటున్నారు. వారిని ఆకర్షించేలా వెరైటీ రుచులతో హోటళ్లు ఆహ్వానం పలుకుతున్నాయి. సాంకేతికత పెరగడం, పలు రకాల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో వంట చేసుకునే వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి ఫుడ్ డెలివరీ యాప్స్ ఓ వరంలా మారాయి. ఈ యాప్స్ ప్రత్యేక ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. ఆకలి వేస్తుందన్న సంకేతాలు రాగానే ఆర్డర్ చేస్తే సరి.. వేడివేడి ఆహార పదార్థాలు గడప ముంగిటకు వచ్చేస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు మాంసాహారం, మరొకరు శాకాహార ప్రియులైనా.. ఒకరు సౌత్ ఇండియన్.. ఇంకొకరు నార్త్ ఇండియన్ అయినా సరే.. ఏక కాలంలో వారి సంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన ఆహార పదార్థాలు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వచ్చేస్తున్నాయి. కొత్త వంటల పరిచయం నగరవాసులకు వెరైటీ ఫుడ్ అందించాలని పలు హోటళ్లు ఎప్పటికప్పుడు ఫుడ్ ఫెస్టివళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఉత్తర భారత దేశం రుచులు, నవాబులు బిర్యానీ, కోస్టల్ రుచి.. ఇలా అనేక రకాల పేర్లతో ఫుడ్ ఫెస్టివళ్లను ఏర్పాటు చేసి ఆహార ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. కొత్త రుచులు ఇంట్లో కష్టం వారంలో ఐదు రోజులు బిజీబిజీ. తీరిక లేని పనులు. ఫ్యామిలీకి టైం కేటాయించడం కూడా సాధ్యం కావడం లేదు. వీకెండ్ వచ్చిందంటే ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి రెస్టారెంట్ బాట పడుతున్నాం. మెనూలో నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి ఫ్యామిలీతో కలిసి చక్కగా భోజనం చేస్తున్నాం. వేర్వేరు అభిరుచులు ఉన్న వారికి ఇంట్లో తయారు చేయడం కొంత కష్టం. రెస్టారెంట్కో, హోటల్కో వెళితే ఎవరికి నచ్చిన ఐటమ్ వాళ్లు ఆర్డర్ చేసుకోవచ్చు. నచ్చిన వంటకాన్ని కడుపునిండా తినొచ్చు. – సీహెచ్ పవన్కుమార్, ప్రైవేట్ ఉద్యోగి ట్రెండ్ మారింది ఒకప్పటికీ నేటికి ట్రెండ్ మారింది. వర్క్ స్టైల్ కూడా మారింది. అలానే ఆహారపు అలవాట్లు, అభిరుచులూ మారాయి. వీకెండ్స్ సంస్కృతి వచ్చింది. చాలా మంది ఫ్యామిలీతో రెస్టారెంట్కో, హోటల్కో వెళ్లి భోజనం చేస్తున్నారు. మెనూలో వెరైటీలు ఉండేలా చూసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా రెస్టారెంట్లు, హోటళ్లు తమ మెనూ మార్చుకుంటున్నాయి. హోం డెలివరీ, టేక్ ఏవే తగ్గిపోయి ఆన్లైన్లో ఆర్డర్స్ పెరిగాయి. హోటల్ బిజినెస్లో 60 శాతం వరకు ఆన్లైన్ ఆర్డర్స్ ఆక్రమించేశాయి. – వాకాడ రాజశేఖర్రెడ్డి, అతిథి దేవోభవ హోటల్ యజమాని నగరంలో నయా ట్రెండ్ హీరో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. భోజన సమయంలో ఇంటికి వచ్చిన బంధువులకు ఏం వంట చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న హీరోయిన్కు హీరో మంచి ఐడియా చెప్తాడు. సిటీలో ప్రముఖ హోటల్ నుంచి ఫుడ్ రప్పించి బంధువులకు అన్ని రకాల రుచులు చూపించి వారి చేత శభాష్ అనిపిస్తాడు. ప్రస్తుతం నగరంలో ఇటువంటి ట్రెండే నడుస్తోంది. ఇంటికి వచ్చే బంధువులకు నగరంలోని లభించే కొత్త కొత్త రుచులను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి.. అందిస్తున్నారు. హోటళ్ల పేర్లూ వెరైటీనే.. విశాఖ నగర వాసులు రోజూ ఇంటి భోజనం తినేందుకు ఇష్టపడడం లేదు. సకుటుంబ సమేతంగా హోటల్కో, దాబాకో వెళ్లి సరికొత్త రుచులను ఆస్వాదించేందుకు మొగ్గు చూపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యజమానులు రెస్టారెంట్లు, హోటళ్లకు వెరైటీ పేర్లు పెడుతున్నారు. అమ్మ చేతి వంట, వంటిళ్లు, అరిటాకు, వంటకమ్.. ఇలా రకరకాల పేర్లతోనే కాదు.. బాబాయ్ హోటల్, సుబ్బయ్య హోటల్, రాజుగారి హోటల్, కుండ బిర్యానీ వంటి పేర్లతోనూ నడుస్తున్న హోటళ్లు నగరంలో తమ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. బుట్ట భోజనం, కాంబో ఆఫర్, ఫ్యామిలీ ఫ్యాక్, జంబో బిర్యానీ ఇలా స్పెషల్ ప్యాక్లు అందుబాటులో ఉన్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ.. ఉదయం ఆరు గంటల నుంచే ఆర్డర్లు మొదలవుతాయి. వాటర్ బాటిల్ నుంచి ఐస్క్రీం వరకు, టిఫిన్ నుంచి భోజనం, పసందైన బిర్యానీ వరకు అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. కొందరు కర్రీస్, స్నాక్స్ ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. రోజు రోజుకూ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇళ్లల్లో వంట చేయడం చాలా వరకు తగ్గింది. వేగంగా డెలివరీ చేయడం కూడా ఇందుకు కారణం. ఆన్లైన్ యాప్లు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. – కిరణ్, ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ ఫెస్టివల్స్కు వెళ్తుంటా.. నాకు కొత్త కొత్త రుచులంటే చాలా ఇష్టం. అటువంటి రుచులు ఇంట్లో కష్టం. అందుకే నగరంలో ఎక్కడ కొత్త రుచులు ఉన్నాయంటే అక్కడ వాలిపోతా. ముఖ్యంగా ఫుడ్ ఫెస్టివల్స్, నూతన రెస్టారెంట్లకు వెళ్లి అక్కడ రుచులన్నీ ఆస్వాదిస్తా. –హేమసుందర్ కొత్త రుచులను టేస్ట్ చేస్తాం నేను, నా భర్త ఇద్దరం ఉద్యోగం చేస్తుంటాం. ఇద్దరం కలిసి భోజనం చేయడానికి సమయం దొరకదు. అందుకే వారంలో ఒక్క రోజైనా రెస్టారెంట్కు భోజనానికి వెళ్తాం. కొత్త రుచులను టేస్ట్ చేస్తాం. –రమ్య -
బంగారు బామ్మలు..
వయసు అనేది భారం అనుకోవడం లేదు ఈ బామ్మలు. సిక్స్టీ ప్లస్లో ఫుడ్ బిజినెస్లు స్టార్ట్ చేసి ‘స్టార్’లుగా వెలిగిపోతున్నారు. ఐడియాలు యాపిల్ చెట్టుకింద మాత్రమే రావాలని లేదు. వంటగదిలో కూడా వస్తాయి. ముంబైకి చెందిన హర్షకు అలాగే వచ్చింది. లాక్డౌన్ సమయం అది. బామ్మ ఊర్మిళ అషేర్ రకరకాల ఊరగాయలు, టిఫిన్ల రుచి చూపించింది. జన్మకు మరిచిపోలేని రుచులవి. ఈ రుచులనే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం ప్రారంభించాలని ఆలోచించాడు హర్ష. బామ్మతో చెప్పాడు. ‘నీదే ఆలస్యం. నేను రెడీ’ అని ఉత్సాహం చూపించింది బామ్మ. దోక్లా, ఖాండ్లీ, గాతిచ, తెస్లా...మొదలైన గుజరాతి వంటకాల రుచులతో ‘గుజ్జు బెన్ నాష్తా’ పేరుతో ‘క్లౌడ్ కిచెన్’ మొదలుపెట్టింది ఊర్మిళమ్మ. బ్రహ్మాండమైన హిట్టు. ఆ తరువాత యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. ఎంత మంది సబ్స్క్రయిబర్స్! ఊర్మిలమ్మ వయసు 77 సంవత్సరాలు. ఇప్పుడు మనం పంజాబ్లోని చండీగఢ్కు వెళదాం. ఈ బామ్మ పేరు హర్బజన్ కౌర్. వయసు 95 సంవత్సరాలు. ‘ఒక మూలకు అదేపనిగా కూర్చోవడం అంటే రోగాలను సాదరంగా ఆహ్వానించడమే’ అని తరచుగా చెప్పే కౌర్ కొన్ని సంవత్సరాల క్రితం తీపివంటకాల వ్యాపారం మొదలుపెట్టి విజయం సాధించింది. రకరకాల వంటకాల రుచులను ఇంట్లోవాళ్లకు, చుట్టాలు పక్కాలకు చూపించే కౌర్ తన కూతురు కోరిక మేరకు ‘హర్భజన్స్’ పేరుతో మొదలు పెట్టిన తీపివంటల వ్యాపారం సూపర్హిట్ అయింది. ‘బెసన్ కీ బర్ఫీ’ అనేది తన తయారీలలో బెస్ట్ సెల్లర్గా పేరు తెచ్చుకుంది. తండ్రి దగ్గర నేర్చుకున్న వంద సంత్సరాల చరిత్ర ఉన్న ఒక వంటకం స్ఫూర్తితో ‘బెసన్ కీ బర్ఫీ’కి రూపకల్పన చేసింది కౌర్. కోల్కతాకు చెందిన ఇతి మిశ్రా వయసు 81 సంవత్సరాలు. ఆమె దృష్టిలో ‘వంట’ అనేది ‘ఈరోజు చేయాల్సిన తప్పనిసరి పని’ కాదు. ఉత్సాహంతో చేసే ఒక సృజనాత్మక ప్రయాణం. మిశ్రాకు బోలెడు బంధుగణం ఉంది. వారి నుంచి అపురూపమైన వంటకాలను నేర్చుకుంది. ఆమె వంటకాల రుచికి మైమరిచిన అతిథులు ‘నువ్వు తప్పనిసరిగా వ్యాపారం మొదలుపెట్టాల్సిందే’ అని బతిమిలాడేవాళ్లు. మిశ్రా వంటకాల రుచి విశేషాలు సోషల్ మీడియా ద్వారా అక్కడెక్కడో అమెరికా వరకు వెళ్లాయి. అలా కాలిఫోర్నియాకు చెందిన ‘ట్రావెలింగ్ స్పూన్’ సంస్థతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. తన ఇల్లే కేంద్రంగా స్వదేశీ, విదేశీ టూరిస్ట్లకు బెంగాలీ సంప్రదాయ వంటకాల రుచి చూపిస్తూ ‘భేష్’ అనిపించుకుంటుంది మిశ్రా. అరవై ప్లస్ వయసులో తమిళనాడులోని చెట్టినాడ్లో ‘ది బంగ్లా’ పేరుతో హెరిటేజ్ హోటల్ ప్రారంభించి విజయం సాధించింది మీనాక్షి మెయప్పన్. చిల్లి గార్లిక్ ఫిష్ నుంచి చికెన్ విత్ బ్లాక్ పెప్పర్ వరకు ఎన్నో వంటకాలు ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మీనాక్షి వయసు 88 సంత్సరాలు. ఇప్పటికీ అదే ఉత్సాహంతో పనిచేస్తుంది. ‘నా వయసును వెనక్కి తీసుకెళుతుంది ఆ ఉత్సాహమే’ అని చమత్కరిస్తుంది మీనాక్షమ్మ. వీరు మాత్రమే కాకుండా ముంబైకి చెందిన కోకిలా పరేఖ్ (80 సంవత్సరాలు) ‘కేటీ–మసాల’, 80 సంవత్సరాల రాధా దాగా ‘త్రిగుణి ఈజీ ఈట్స్’... మొదలైనవి విజయపథంలో దూసుకువెళుతున్నాయి. వంటరుచులలోనే కాదు వ్యాపారనైపుణ్యాలలోనూ తమ సత్తా చాటుతున్నారు బంగారు బామ్మలు. -
బాబా రామ్దేవ్ కీలక నిర్ణయం..పేరు మార్చేందుకు సిద్ధం..!
న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రామ్దేవ్కు చెందిన రుచి సోయా పేరు మారనుంది. పతంజలి ఫుడ్స్గా నామకరణం చేసే అవకాశం ఉందని కంపెనీ సోమవారం ప్రకటించింది. అలాగే పతంజలి ఆయుర్వేద పోర్ట్ఫోలియోలో ఉన్న ఫుడ్ బిజినెస్ను సంస్థలో విలీనం చేసే అంశంలో అత్యంత సమర్థవంతమైన విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా ఇటీవలే రుచి సోయా రూ.4,300 కోట్లు సమీకరించింది. పతంజలి ఆయురేŠవ్ద ఫుడ్ వ్యాపారాన్ని రుచి సోయాకు కొన్ని నెలల్లో బదిలీ చేయనున్నట్టు గత నెలలో రామ్దేవ్ ప్రకటించారు. పతంజలి ఆయుర్వేద ఆహారేతర, సంప్రదాయక ఔషధాలు, వెల్నెస్ విభాగాల్లో పనిచేస్తుందని వెల్లడించారు. రుచి సోయా కేవలం వంట నూనెలు, ఆహారం, ఎఫ్ఎంసీజీ, న్యూట్రాస్యూటికల్స్, ఆయిల్ పామ్ సాగు విభాగాలపై దృష్టిసారిస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం రుచి సోయా 57,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తోంది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెద్ద ఎత్తున పెంచాలన్నది ప్రణాళిక. బిస్కెట్స్ వ్యాపారాన్ని పతంజలి ఆయుర్వేద గతేడాదే రూ.60 కోట్లకు రుచి సోయాకు బదిలీ చేసింది. పతంజలి ఆయుర్వేద, రుచి సోయాను వచ్చే అయిదేళ్లలో భారత్లో అతిపెద్ద ఫుడ్, ఎఫ్ఎంసీజీ సంస్థగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యమని రామ్దేవ్ స్పష్టం చేశారు. హిందుస్తాన్ యూనిలీవర్ తర్వాత రెండవ అతిపెద్ద ఫుడ్, ఎఫ్ఎంసీజీ సంస్థగా పతంజలి ఆయుర్వేద నిలిచిందన్నారు. చదవండి: గోద్రెజ్ ఇండస్ట్రీస్ అనూహ్య నిర్ణయం...ఇప్పుడు ఆ రంగంలోకి కూడా ఎంట్రీ..! -
వ్యాపారంలోకి నాగ చైతన్య.. వెంకటేశ్ కూతురి రిప్లై చూశారా?
అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. రీసెంట్గానే బంగార్రాజు చిత్రంతో హిట్ కొట్టిన చై ప్రస్తుతం ఓ వెబ్సిరీస్లో నటిస్తున్నాడు. సమంతతో విడాకుల అనంతరం అటు ప్రొఫెషనల్గానే కాకుండా పర్సనల్ లైఫ్లోనూ చైలో చాలానే మార్పు కనిపిస్తుంది. ఇదివరకు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండని చైతూ ఈ మధ్యకాలంలో మాత్రం యాక్టివ్గా ఉంటున్నాడు. సినిమా ప్రమోషన్స్తో పాటు తనకి సంబంధించిన అప్డేట్స్ని సైతం అప్పుడప్పుడూ నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా చై ఫుడ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. షోయూ పేరుతో హైదరాబాద్లో ఓ సరికొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సైతం చై తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దీనికి వెంకటేశ్ కూతురు ఆశ్రిత.. 'ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావా' అంటూ బెస్ట్ విషెస్ అందించింది. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
మెను ఏదైనా నోరు ఊరాల్సిందే.. అట్లుంటది టేస్ట్ మరి!
సాక్షి,సిరిసిల్లఅర్బన్: టిఫిన్ కావాలంటే ఇప్పుడు హోటళ్లకే వెళ్లాల్సిన అవసరం లేదు. తక్కువ ధరకు స్వచ్ఛమైన, రుచికరమైన వేడి, వేడి టిఫిన్ ప్రస్తుతం మోబైల్ వాహనం రూపంలో అందుబాటులోకి వచ్చాయి. జిల్లా కేంద్రంలో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ, ముఖ్యంగా జనసంచారం ఉన్న ప్రధాన కూడళ్లలో మొబైల్ టిఫిన్ సెంటర్ల ద్వారా అందిస్తున్నారు. కేవలం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు అందుబాటులో ఉండే ఈ సెంటర్లో దోసా, ఇడ్లీ, వడ, బోండా, పూరి నిమిషాల్లో తయారు చేసి వేడి, వేడిగా అల్లం చట్నీతో అందిస్తున్నారు. రుచి, శుచికి ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో వినియోగదారులు వీటి వద్ద క్యూ కడుతున్నారు. ప్రజాదరణ పెరగడంతో వీటి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. రహదారులే అడ్డాలుగా.. జిల్లా కేంద్రంలో విద్యానగర్, రగుడు, కొత్త చెరువు, బస్టాండ్, పెద్దూరు తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులను అడ్డాలుగా చేసుకొని చిరువ్యాపారులు మొబైల్ టిఫిన్ సెంటర్లను నడిపిస్తున్నారు. వీటికి అద్దె చెల్లించడం, నిర్వహణ ఖర్చులు లేకపోవడంతో హోటళ్లలో ఉండే ధరల కంటే తక్కువ ధరలకే టిఫిన్స్ అందిస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి మోబైల్ టిఫిన్ సెంటర్ల వ్యాపారం నిరుద్యోగులకు వరంలా మారింది. నిర్వహణకు అయ్యే ఖర్చు తక్కువగానే ఉండడంతో వీటి ఆధారంగా రోజుకు రూ.4 నుంచి రూ.5 వేల వరకు సంపాదిస్తున్నారు. వీరు జీవనోపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఐదేళ్లుగా నడుపుతున్నా మాది తంగళ్లపల్లి గ్రామం. దాదాపు ఐదేళ్లుగా మొబైల్ టిఫిన్ సెంటర్ని నడిపిస్తున్నా. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో విద్యానగర్ చౌరస్తా వద్ద వాహనాన్ని నిలిపి ఉంచుతా. నాతో పాటు మరో ఇద్దరం దీని వల్ల ఉపాధి పొందుతున్నాం. – తలగోప్పుల రాజు, మొబైల్ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు నాణ్యతకే ప్రాధాన్యత స్వచ్ఛమైన, రుచికరమైన టిఫిన్స్ అందించడంతో ఆదరణ పెరుగుతోంది. అలాగే హోటళ్లలో కంటే తక్కువ ధరకు అందిస్తున్నాం. వాహనదారులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఆగి మరి తిని వెళ్తుంటారు. – మనోహార్, సిరిసిల్ల, మొబైల్ సెంటర్ నిర్వాహకుడు రుచికరంగా ఉంటుంది కొత్త చెరువు వద్ద ఒక మోబైల్ టిఫిన్ సెంటర్ ఉదయం అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరకు రుచికరంగా అందిస్తుండడంతో వాహనదారులు, వ్యాపారులు ఇక్కడే టిఫిన్ చేసి వెళ్లారు. నిర్వాహకులు అల్పాహరాన్ని రుచితో పాటు శుచి, శుభ్రత పాటిస్తున్నారు. – సందవేణి శ్రీనివాస్, సిరిసిల్ల -
20 రకాల కూరలతో సుష్టుగా తినొచ్చు.. ధర తక్కువే! ఎక్కడో తెలుసా?
కూసుమంచి (ఖమ్మం జిల్లా): భోజనం చేసేందుకు ఏదైనా హోటల్కు వెళ్తే ఓ నాలుగు కూరలు, ఒక చట్నీ, సాంబారు, పెరుగుతో సరిపెడతారు. దీంతో కడుపు నిండినట్టు అనిపించనప్పటికీ సర్దుకుపోతాం. ఒకవేళ ఎక్కువగా తీనాలంటే మరింత ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత ఖర్చు పెట్టలేని వారు అసంతృప్తితోనే బయటకు వస్తుంటారు. కానీ కూసుమంచిలోని నాగన్న, శివ హోటళ్లలో మాత్రం 20కి పైగా రకాల కూరలను వడ్డిస్తూ భోజన ప్రియులను సంతృప్తి పరుస్తున్నారు. సామాన్యులు వెచ్చించగల బడ్జెట్లోనే పసందైన భోజనం అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు. ఇలాంటి హోటళ్లు ఎక్కడా లేవంటూ పలువురు మెచ్చుకుంటున్నారు. (చదవండి: భక్తుల వద్ద హోంగార్డు చేతివాటం, క్రిమినల్ చర్యలకు ఈవో ఆదేశం) నాగన్నతో మొదలు.. కూసుమంచిలోని నాగన్న (రామకృష్ణ ) హోటల్లో గత కొన్నేళ్లుగా వివిధ కూరలతో భోజనాలు వడ్డిస్తున్నారు. దీంతో ఈ హోటల్ ప్రత్యేకతను సంతరించుకుంది. కూసుమంచిలో ఖమ్మం– సూర్యాపేట రాష్ట్రీయ రహదారి పక్కన ఉండటంతో ఇక్కడ 24 కూరల భోజనం గురించి తెలుసుకుని అనేక మంది ప్రయాణికులు ఆగి మరీ భోజనాలు చేస్తుంటారు. పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు కూడా ఈ హోటల్లో భోజనం చేసి అభినందించారు. ఈ హోటల్ యజమాని బెల్లంకొండ నాగన్న గత 20 ఏళ్లకు పైగా సేవలు అందిస్తూ గుర్తింపు పొందారు. శివ హోటల్కు క్రేజ్.. కూసుమంచిలోని సూర్యాపేట రోడ్డులో ఏర్పాటు చేసిన శివ హోటల్ సైతం నాగన్న హోటల్ మాదిరిగా 24 కూరలను అందిస్తూ క్రేజ్ను సొంతం చేసుకుంటుంది. ఈ హోటల్లో కూరలతో పాటు చికెన్ కర్రీని అదనంగా వడ్డించడం ప్రత్యేకత. కాలానుగుణంగా అందుబాటులో ఉన్న అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలను యజమాని శివ సొంతంగా కొన్నింటిని పండిస్తూ, మరికొన్ని కొనుగోలు చేస్తూ 20 కూరలకు తగ్గకుండా భోజనాలు అందిస్తున్నారు. వెజిటేరియన్ కాకుండా నాన్వెజ్లో భాగంగా బిర్యానీ, చికెన్, చేప కూరలను ప్రత్యేకంగా అందిస్తున్నారు. అనతికాలంలోనే ఈ హోటల్ కూడా ఆదరణ పొందింది. మండల ప్రజలతో పాటు ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన వారు ప్రత్యేకంగా కూసుమంచికి వచ్చి భోజనాలు చేస్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. (చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ముఖం చాటేశాడు..) వడ్డించే కూరలు... కూసుమంచిలోని నాగన్న, శివ హోటళ్లలో వివిధ రకాల కూరలు వడ్డిస్తున్నారు. వాటిలో పప్పు, దోసకాయ, దొండకాయ, గోరుచిక్కుడు, చిక్కుడు కాయ, సొరకాయ, పొట్లకాయ, వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బీట్రూట్, బంగాళదుంప, చామగడ్డ, క్యారట్, కాకరకాయ, టమాట, బీర, సొరకాయ, బెండకాయ, పాలకూర, బచ్చలికూర, చుక్క కూర, గోంగూర, మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడితో పాటు సాంబారు, పెరుగు వడ్డిస్తారు. కాగా కూరలు సీజన్ను బట్టి కొంచెం మారుతుంటాయి. అయినప్పటికీ 20 కూరలకు తగ్గకుండా వడ్డిస్తుండటం ప్రత్యేకత. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా భోజనం రూ.100 మాత్రమే తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడా చూడలేదు.. మాది వరంగల్ జిల్లా కేసముద్రం. మేం కూసుమంచికి పనిమీద వచ్చాం. ఇక్కడ 20 కూరల భోజన హోటల్ బోర్డు చూసి వచ్చి తిన్నాం. ఇన్ని కూరలు వడ్డించే హోటల్ ఎక్కడా చూడలేదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. కూరలు కూడా చాలా బాగున్నాయి. – లక్ష్మి, కేసముద్రం, వరంగల్ జిల్లా తృప్తి మిగులుతుంది.. మా హోటల్లో రోజూ 20కి తగ్గకుండా కూరలు తయారు చేస్తాం. కస్టమర్ల తృప్తి మేరకు భోజనాలు వడ్డిస్తున్నాం. భోజన ప్రియుల అభిరుచి మేరకు నాన్వెజ్ ఐటమ్స్ కూడా ప్రత్యేకంగా తయారు చేస్తున్నాం. మంచి భోజనం అందిస్తున్నామనే తృప్తి మిగులుతుంది. – భూక్యా శివ, శివ హోటల్ యజమాని -
కాసులు కురిపిస్తున్న వ్యాపారం, ఇప్పుడు.. ఎప్పుడూ.. ఎవర్గ్రీనే !
డాబాగార్డెన్స్(విశాఖ): మామ్మూళ్ల బెడద లేదు. కరెంటు.. ఇంటి అద్దె ఖర్చు లేదు. ఒకే వ్యాపారం చేయాలన్న ఒత్తిడి లేదు. నచ్చిన చోట మెచ్చిన వ్యాపారం. టిఫిన్ సెంటర్ నుంచి షర్బత్ బండి వరకు.. వినియోగదారులకు మెచ్చే ఆహారం. మొబైల్ బిజినెస్ ఇప్పుడు.. ఎప్పుడూ.. ఎవర్గ్రీన్ ట్రెండ్. పట్టణీకరణ పెరగడంతో సాటి మానవుడి అవసరాలు, ఆలోచనల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. బిజీబిజీ జీవనంలో శుచి, శుభ్రతతో ఉన్న వస్తువులు తమ వాకిట్లో లేదా తాము విధులు నిర్వహించే చోట, ఆఫీసుకు వెళ్లే మార్గంలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. జీవనం యాంత్రికం అయిపోవడంతో హోటళ్లు, షాపులకు వెళ్లే సమయం చాలా మందికి దొరకడం లేదు. దీంతో వినియోగదారుల అవసరాలకు తగిన విధంగానే వ్యాపారులు తమ వ్యాపార పద్ధతులను మార్చుకున్నారు. వాహనాల్లో మొబైల్ హోటళ్లు, షర్బత్లు సిద్ధం చేస్తున్నారు. పచ్చళ్లు, కాయగూరలు, విద్యుత్ బల్బులు, స్వీట్లు, దుస్తులు, కొబ్బరి బొండాలు, ఐస్క్రీంలు, పలు రకాల పండ్లు కూడా ఆటోల ద్వారా విక్రయిస్తున్నారు. దీని వల్ల వినియోగదారుల చెంతకే ఆహార పదార్థాలు చౌకైన ధరలకు అందడం ఒక విషయమైతే.. వ్యాపారులు కూడా ఒకే చోట ఉండి అ క్కడి పరిస్థితుల మీదనే ఆధార పడకుండా ఎక్కడ, ఏ సమయంలో వ్యాపారం జరుగుతుందంటే అక్కడ వాలిపోతున్నారు. ఫలితంగా వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం నగరంలో గజం స్థలం ధర చుక్కలంటడం, పైగా రోడ్డు పక్కన తోపుడు బండి పెట్టుకుందామన్నా పలు విధాల ఒత్తిళ్లు, మామ్మూళ్లు బెడద ఎక్కువైపోయింది. వీటన్నింటిని నుంచి విముక్తితో పాటు కరెంటు, ఇంటి అద్దె వంటి తదితర ఇబ్బందులు లేకపోవడంతో ఈ మొబైల్ వ్యాపారమే చాలా భేషుగ్గా ఉందని వ్యాపారులు అంటున్నారు. వినియోగదారులు అయితే హోటల్కు వెళ్లి వేచి ఉండాల్సిన పని లేకుండా పనులకు వెళ్లే దారిలోనే టిఫిన్ కానిచ్చేస్తున్నారు. పండ్లు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాపారాలు జీవీఎంసీ పరిధి దక్షిణ నియోజకవర్గంలో కొకొల్లాలు. నగరంలోని సౌత్జైల్రోడ్డులో ఫుడ్ ఆన్ వీల్స్ ఘుమఘుమలు పంచుతున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా వాటికి బ్రేక్ ఇచ్చారు. ఇక సాయంత్రమైతే చాలు.. చినవాల్తేరు, బీచ్రోడ్డు పలు ప్రాంతాల్లో ఫుడ్ ఆన్ వీల్స్.. వందలాది బండ్లు అక్కడకు చేరుకుంటాయి. చేతిలో కార్డు ఉండే చాలు. చక చకా ఏం కావాలో అవి తినొచ్చు. ఏటీఎం డెబిట్/క్రెడిట్ కార్డ్స్తో పాటు పేటీఎం, గూగూల్ పే.. ఇలా ఎన్నో రకాలుగా నగదు చెల్లించేయొచ్చు. సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి వరకు (ప్రస్తుతం కర్ఫ్యూ అమల్లో ఉన్నందున రాత్రి 9 గంటల వరకే) ఇక్కడ టిఫిన్, నూడిల్స్, చికెన్ జాయింట్లు..ఫ్రైడ్ రైస్.. అన్ని రకాల చికెన్ వంటకాలతో పాటు చల్లని పానీయాలు కూడా మొబైల్ వ్యాన్ల ద్వారానే లభిస్తున్నాయి. మొత్తానికి ఈ బిజినెస్ ఇటు వినియోగదారులకు.. అటు వ్యాపారులకు ఇద్దరికీ సంతృప్తిని కలిగిస్తోంది. -
జొమాటోకు రెట్టింపు నష్టం
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటోకు సెప్టెంబర్ క్వార్టర్లో నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. రూ.435 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.230 కోట్లుగానే ఉన్నాయి. ఆదాయం రూ.426 కోట్ల నుంచి రూ.1,024 కోట్లకు పెరిగింది. తన నిర్వహణలోని ఫిస్టో కంపెనీని క్యూర్ఫిట్కు 50 మిలియన్ డాలర్లకు విక్రయించనున్నట్టు ప్రకటించింది. అలాగే మరో 50 మిలియన్ డాలర్లను క్యూర్ఫిట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా (మొత్తం 100 మిలియన్ డాలర్లు) 6.4 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. బిగ్ఫూట్ రిటైల్ సొ ల్యూషన్స్ (షిప్రాకెట్)లో 75 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్కు ఒప్పందం చేసుకుంది. మ్యాజిక్పిన్ రూ. 446 కోట్ల సమీకరణ రిటైల్ సంస్థల ఆఫర్ల వివరాలను వినియోగదారులకు అందించే డిజిటల్ సంస్థ మ్యాజిక్పిన్ కొత్తగా 60 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 446 కోట్లు) సమీకరించింది. ఫుడ్ సర్వీసుల సంస్థ జొమాటోతో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్లు లైట్స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్ కూడా ఈ విడత ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ తెలిపింది. -
‘ఆహార’ బిల్లుల్లో లైసెన్స్ నంబరు తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆహార వ్యాపార సంస్థలు ఇకపై తమ ఇన్వాయిస్లు, బిల్లుల్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు నంబరు లేదా రిజిస్ట్రేషన్ నంబరును తప్పనిసరిగా పొందుపర్చాల్సి ఉంటుంది. అక్టోబర్ 2 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట సమాచారం లేకపోవడం వల్ల చాలా మటుకు ఫిర్యాదులు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. తాజా పరిణామంతో నిర్దిష్ట ఎఫ్ఎస్ఎస్ఏఐ సంఖ్యతో ఆహార వ్యాపార సంస్థపై వినియోగదారులు ఆన్లైన్లో ఫిర్యాదు చేయడానికి వీలవుతుందని తెలిపింది. ‘‘లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్ అధికారులు ఈ విషయానికి విస్తృతంగా ప్రచారం కల్పించాలి. అక్టోబర్ 2 నుంచి కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి’’ అని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. ఆహార వ్యాపార వ్యవస్థ చాలా భారీగా ఉంటుందని, ఆపరేటర్లకు కేటాయించే 14 అంకెల ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబరు అంత సులభంగా కనిపించకపోవచ్చని, అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపింది. ఫలితంగా పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలంటే వినియోగదారుకు చాలా కష్టసాధ్యంగా ఉంటుందని పేర్కొంది. నియంత్రణ సంస్థలు సైతం సదరు ఫిర్యాదు మూలాలను గుర్తించి, సత్వరం పరిష్కరించడానికి సాధ్యపడటం లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ప్రస్తుతం ప్యాకేజ్డ్ ఆహార ఉత్ప్తతులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబరును తప్పనిసరిగా ముద్రించాల్సి ఉంటున్నప్పటికీ.. రెస్టారెంట్లు, మిఠాయి షాపులు, కేటరర్లు, రిటైల్ స్టోర్స్ వంటివి పాటించడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
స్వీట్ ఎక్స్పెరిమెంట్
ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. ఒక్కో సమస్య కొత్తదారిలో నడిపిస్తుంది కూడా. అలా ఆర్తి తనకు తానుగా వేసుకున్న కొత్త దారి చక్కెర అంత తియ్యగా ఉంది. చక్కెర తినలేని వాళ్ల కోసం చక్కెర లేని తీపి రుచులను అందిస్తోంది ఆర్తి. చక్కెర తినలేని తన జీవితాన్ని తియ్యగా మలుచుకుంది. చెవులకు ఏమైంది! ఆర్తి రస్తోగి బెంగళూరమ్మాయి. డయాబెటిస్ ఆ ఫ్యామిలీ హిస్టరీలోనే ఉంది. రకరకాల ఆహార నియమాలు పాటించక తప్పదు. ఇంటిల్లి పాదీ దేనినీ సంతోషంగా తినడానికి వీల్లేదు. ‘ఇది తింటే షుగర్ లెవెల్స్ పోతాయి, అది తింటే బరువు పెరిగి ఇతర సమస్యలకు కారణమవుతుంది...’ అంటూ నోరు కట్టుకుని రోజులు వెళ్లదీయడమే. ఇక చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు అయితే దగ్గరగా చూడడానికి కూడా ఇష్టపడేవాళ్లు కాదు. పిల్లల దృష్టి వాటి మీద పడిందంటే వాటిని మనం తినకూడదని నచ్చచెప్పాలి, పిల్లల మనసు గాయపడుతుంది. అందుకే ఇంట్లో అవేవీ కనిపించడానికి వీల్లేనంత నియమానుసారంగా పెంచుకొచ్చారు అమ్మానాన్నలు. అలా ఆర్తి గాజు బొమ్మలా పెరిగిందని చెప్పాలి. అందరిలాగానే స్కూలుకెళ్లి చదువుకుంది. తినగలిగిందేదో తింటూ కాలేజ్ చదువు పూర్తి చేసింది. కారణం ఏమిటో తెలియదు, ఇరవ మూడేళ్ల వయసులో ఆమెకు వినికిడి తగ్గడం మొదలైంది. ఏ డాక్టరూ కారణం ఇదని తేల్చలేకపోయారు. డయాబెటిస్ కారణంగా ఎదురైన అనుబంధ సమస్యలుగానే గుర్తించారు. వినికిడి ఎనభై శాతం తగ్గిందని మాత్రం నిర్ధారించగలిగారు. ఉన్న ఇరవై శాతం వినికిడితోనే ఉద్యోగం తెచ్చుకుంది. మాటలు కనిపించేవి ఆర్తి సంపాదించింది మామూలు ఉద్యోగం కాదు. పెద్ద కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో ఉద్యోగం. ఆమె ఆరోగ్యంతో ఎదురీది జీవితంలో నిలబడడంలో ఆమె వంతు లోపమేమీ లేదు. కానీ ఆర్తి ఆ ఉద్యోగం లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. తోటి ఉద్యోగులు చూసే చూపులను తట్టుకోవడం కష్టమైంది. ‘ఎన్నిసార్లు చెప్పాలి’ అనే చిరాకు వినిపించేది కాదు, కానీ వాళ్ల ముఖాల్లో కనిపించేది. ఆ ఒత్తిడిని తట్టుకోవడం కష్టమైంది. బాధను అదిమిపెట్టడానికి ఆమె ఎంచుకున్న మార్గం ఐస్క్రీమ్. నిజమే ఇంట్లోనే ఐస్క్రీమ్ తయారు చేసుకోగలిగిన చిన్న మెషీన్ని కొనుక్కుంది. ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత ఐస్క్రీమ్తో ప్రయోగాలు చేయడం. తాను చేసుకున్న షుగర్ ఫ్రీ ఐస్క్రీమ్ తింటూ సహోద్యోగుల నుంచి ఎదురైన వివక్షను మర్చిపోవడానికి ప్రయత్నించేది. ఆ ప్రాక్టీస్ ఆమెను మరింతగా ప్రయోగాల్లోనే మునిగిపోయేటట్లు చేసింది. ఐస్క్రీమ్ పుస్తకాలను చదివింది. అక్కడితో ఆగిపోకుండా ‘ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు’ అనుకుంటూ షుగర్ ఫ్రీతోపాటు గ్లూటెన్ ఫ్రీ, కీటో ఫ్రెండ్లీ కుకీలు, చాక్లెట్లు, బ్రౌనీ, కేక్ల మీద ప్రయోగం చేసింది. తన ప్రయోగాలను ఫుడ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ డిపార్ట్మెంట్కు పరీక్షకు పంపించింది. సలహా బాగానే ఉంది ‘చాలా బాగా చేస్తున్నావ్, సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. ఇక సొంతంగా స్టార్టప్ పెట్టెయ్’ అని తిన్నవాళ్లు ఓ సలహా ఇచ్చేసే వాళ్లు. ‘స్టార్టప్ పెట్టాలంటే బ్యాంకు తనకు లోన్ ఇస్తుందా?’ సమాధానం లేని ప్రశ్న. అన్నీ బాగున్న వాళ్లకే బ్యాంకులు అంత త్వరగా లోన్ ఇవ్వవు. స్టార్టప్ పెట్టాలనే ఆలోచన మానుకుని ఏదో ఓ ఉద్యోగం లో చేరేటట్లు చేస్తుంటాయి. అలాంటిది ఉద్యోగం లో కొనసాగ లేని వైకల్యం ఉన్న తనకు లోన్ ఎలా వస్తుంది? అనుకుని స్నేహితుల సూచనను పక్కన పెట్టేసింది. అయితే... ఓ బలహీన క్షణంలో ఈ ఉద్యోగం ఇక వద్దు అని నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేసింది. అప్పుడు కుటుంబం ఆమెకు అండగా నిలిచింది. ఇంట్లో అందరూ చేయగలిగినంత సహాయం చేశారు. అలా 2019లో ఆమె తన స్టార్టప్ను ప్రారంభించింది. అప్పుడు ఆర్తికి నలభై ఏళ్లు. రెండేళ్లు గడిచాయి. ఫుడ్ బిజినెస్ లో భారీ నష్టాలైనా వస్తాయి లేదా త్వరగా బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. ఇప్పుడామె బెంగళూరులో పది బ్రాంచ్లను నిర్వహిస్తోంది. ఆన్లైన్లో పాతిక రాష్ట్రాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ‘‘ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ గా మారిపోతోంది. డయాబెటిక్ వాళ్లు రుచిని చంపుకుని బతకాల్సిన అగత్యం లేకుండా అన్ని రుచులనూ తినగలిగేటట్లు చేయడం సంతోషంగా ఉంది. వ్యాపారం కోసం వచ్చిన ఆలోచన కాదు. నా కష్టం నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన’’ అంటున్నారు ఆర్తి. తీవ్రంగా గాయపడి ఉండడం వల్లనో ఏమో ఆర్తి తన అవుట్లెట్లలో వికలాంగులు, ఎల్జీబీటీలను ఉద్యోగంలో చేర్చుకుంది. -
నిమిషాల్లో వేడి ఆహారం ‘రెడీ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్-19 కారణంగా ప్రతి ఇంటా ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రధానంగా ఆహారం విషయంలో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో హోటళ్లకు వెళ్లడం తగ్గిపోయింది. స్విగ్గీ, జొమాటో ద్వారా ఫుడ్ తెప్పించే బదులు ఇంటి వంటకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే సౌకర్యం కోరుకునే యువత రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ఉత్పత్తుల వైపు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. ఇంటి నుంచి విధులు నిర్వర్తించడం, ఆన్లైన్ క్లాసులు వెరశి ఈ ప్రొడక్ట్స్కు డిమాండ్ను పెంచుతున్నాయి. కంపెనీలు సైతం భారతీయ రుచులను అందిస్తూ కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. కోవిడ్–19 చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. అయితే రెడీ టు ఈట్, రెడీ టు కుక్ మార్కెట్కు మాత్రం ఇది కలిసి వచ్చింది. విమానాల్లో మాదిరిగా రైలు ప్రయాణికులకు సైతం బ్రాండెడ్ కంపెనీల రెడీ టు ఈట్ ఆహారం త్వరలో అందుబాటులోకి రానుంది. (వీడియోకాలింగ్ ఫీచర్తో సరికొత్త టీవీలు: ధర ఎంతో తెలుసా?) సౌకర్యవంతం కావడంతో..: కొన్నాళ్ళుగా వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకుతోడు కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, పనిచేసే మహిళల సంఖ్య పెరుగుదలతో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. లాక్డౌన్ కాలంలో రెడీ టు కుక్, రెడీ టు ఈట్ ఉత్పత్తులకు విపరీత డిమాండ్ వచ్చింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని అమ్మమ్మాస్ బ్రాండ్తో రెడీ టు కుక్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ మంగమ్మ ఫుడ్స్ ఎండీ ప్రతిమ విశ్వనాథ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇంటి వంట కోసం వినియోగదారుల వ్యయం 61% పెరిగిందని రెడ్సీర్ కన్సల్టింగ్ చెబుతోంది. అసోచాం సర్వే ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులుగా ఉన్న కుటుంబాల్లో సమయాభావం కారణంగా రెడీ టు ఈట్ ఆహారానికి 79% ప్రాధాన్యత ఇస్తున్నాయి. రుచిలో ఏమాత్రం తీసిపోని విధంగా ఉండడం, సులభంగా వండుకోవడానికి, తినడానికి సౌకర్యంగా ఉండడం ఈ ఉత్పత్తుల ప్రత్యేకత. పుట్టుకొస్తున్న కంపెనీలు: రెడీ టు ఈట్, రెడీ టు కుక్ రంగంలోకి కొత్త కొత్త కంపెనీలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే దాదాపు అన్ని కంపెనీలు కూడా స్థానికంగా పాపులర్ అయిన ఉత్పత్తులను ఆఫర్ చేస్తుండడం విశేషం. ఎంటీఆర్, గిట్స్, టేస్టీ బైట్, ఐటీసీ కిచెన్స్ ఆఫ్ ఇండియా, టాటా క్యూ, ద టేస్ట్ కంపెనీ, జూబిలెంట్ ఫుడ్వర్క్స్, అదానీ విల్మర్, లిషియస్, అమూల్, హల్దీరామ్స్ తదితర కంపెనీలు ప్రధానంగా ఈ రంగంలో పోటీపడుతున్నాయి. కాగా, దేశంలో 71 శాతం ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడతారని అంచనా. అయితే ప్రస్తుత ఇన్స్టంట్ ఫుడ్ సంస్థలు వీరి కోసం ఏమీ చేయలేకపోయాయి. ఈ విషయంలో హైదరాబాద్కు చెందిన ద టేస్ట్ కంపెనీ దేశంలోనే తొలిసారిగా మాంసాహార ఉత్పత్తులను అందిస్తోంది. వీటి తయారీకి ఎంతో శ్రమించామని, కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన ఉందని ద టేస్ట్ కంపెనీ వ్యవస్థాపకుడు రాజు వనపాల తెలిపారు. (ఐడీబీఐ బ్యాంక్కు భారీ ఊరట) ఫాస్ట్ ఫుడ్ను మించి.. రెడ్సీర్ ప్రకారం రెడీ టు కుక్ ఉత్పత్తుల మార్కెట్ 2019లో రూ.2,100 కోట్లుంది. సగటున 18 శాతం వార్షిక వృద్ధితో ఇది 2024 నాటికి రూ.4,800 కోట్లకు చేరనుంది. రూ.8,000 కోట్లున్న రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ విపణి వచ్చే అయిదేళ్లలో రెండింతలు కానుంది. ఇన్స్టాంట్ నూడుల్స్ మార్కెట్ విలువ రూ.10,000 కోట్లుగా ఉంది. స్విగ్గీ రిపోర్టు ప్రకారం 2019, 2020లో భారతీయులు పిజ్జా, పాస్తా, నూడుల్స్ బదులుగా ఎక్కువగా బిర్యానీ, మసాలా దోశ, దాల్మఖనీని ఆర్డర్ చేశారు. భారతీయ ఫుడ్తో ఇక్కడి కస్టమర్లకు అనుబంధం ఉండడంతో రెడీ టు ఈట్ బ్రేక్ ఫాస్ట్, మీల్ మార్కెట్ రానున్న కొన్ని ఏళ్లలో ఫాస్ట్ ఫుడ్ మార్కెట్ను మించిపోవడం ఖాయంగా కనపడుతోంది. (నగ్నంగా బైక్పై హల్చల్ : పోలీసుల వేట!) -
రేటు కోతకు గణాంకాలు ‘సై’!
న్యూఢిల్లీ: సరళతర ద్రవ్య పరపతి విధానం దిశలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరో కీలక చర్య తీసుకునేందుకు వీలు కల్పించే ఆర్థిక గణాంకాలు మంగళవారం వెలువడ్డాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2020 డిసెంబర్లో 4.59 శాతంగా నమోదయ్యింది. అంటే 2019 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ద్రవ్యోల్బణానికి సంబంధించి పరిగణనలోకి తీసుకునే ఉత్పత్తుల బాస్కెట్ ధర 4.59 శాతం పెరిగిందన్నమాట. 15 నెలల కనిష్ట స్థాయి ఇది. ఇక పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2020 నవంబర్లో 1.9 శాతం క్షీణించింది. అంతక్రితం రెండు నెలలు వృద్ధి బాటలో నడిచిన సూచీ మళ్లీ క్షీణతను చూడ్డం గమనార్హం. కేంద్రం ఆర్బీఐకి ఇస్తున్న నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 6 – 2 శాతం శ్రేణిలో (ప్లస్2 లేదా మైనస్2తో 4 శాతం వద్ద) ఉండాలి. ఈ లెక్కన తాజా సమీక్షా నెల్లో రిటైల్ ద్రవ్యోల్బణం గాడిన పడినట్లే భావించాల్సి ఉంటుంది. 2021 ఫిబ్రవరి 3 నుంచి 5 వరకూ ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన ద్వైమాసిక సమావేశం జరగనుంది. పారిశ్రామిక ‘పేలవం’ కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణించింది. అటు తర్వాత ఆగస్టు 2020 వరకూ మైనస్గానే కొనసాగింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వరుసగా 0.48 శాతం, 4.2 (అక్టోబర్లో గత 3.6 శాతం అంచనాల నుంచి మరింత మెరుగుపరచడం జరిగింది) శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే నవంబర్లోనే తిరిగి క్షీణతను నమోదుచేసుకున్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయ తాజా ప్రకటన వివరించింది. 2019 నవంబర్లో ఐఐపీ 2.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. తాజా సమీక్షా నెల 2020 నవంబర్లో వేర్వేరుగా వివిధ రంగాల తీరును చూస్తే.... తయారీ: ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన ఈ విభాగం 1.7 శాతం క్షీణించింది. మైనింగ్: క్షీణత 7.3 శాతం. విద్యుత్: ఈ విభాగంలో 3.5 శాతం వృద్ధి నెలకొంది. భారీ యంత్ర పరికరాలు, డిమాండ్కు సంకేతంగా పరిగణించే క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తిలో 7.1 శాతం క్షీణ రేటు నమోదయ్యింది. కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి 0.7 శాతం పడిపోయింది. నాన్ కన్జూమర్ డ్యూరబుల్స్: ఇక దుస్తులు, సబ్బులు, టూత్ పేస్టుల ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగానికి సంబంధించిన ఈ విభాగంలో సైతం 0.7 శాతం క్షీణరేటే నమోదుకావడం ఆందోళనకరమైన అంశం. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 15.5 శాతం క్షీణత పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 15.5 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో స్వల్పంగానైనా 0.3 శాతం వృద్ధి నమోదయ్యింది. తగ్గిన ఆహార ధరా భారం... రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో లక్ష్యాల మేరకు 4.59%కి దిగిరావడానికి శాంతించిన ఆహార ఉత్పత్తుల ధరలు కొంత కారణం. ఆర్బీఐ నిర్దేశిత స్థాయిలోకి రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే తొలిసారి. కూరగాయల ధరలు నవంబర్లో 10.41% తగ్గాయి (నవంబర్లో 15.63% పెరుగుదల). ఆహార ద్రవ్యోల్బణం మొత్తంగా చూస్తే, 3.41% తగ్గింది (16 నెలల కనిష్టం). నవంబర్లో ఈ రేటు 9.5%. తృణ ధాన్యాల ధరల్లో కేవలం 0.98% పెరుగుదల నమోదయ్యింది. నవంబర్లో 2.32% పెరుగుదల రేటు ఉంది. తాజా గణాంకాల నేపథ్యంలో ఆర్బీఐ రేటు కోత లేదా ప్రస్తుత సరళ విధానం కొనసాగించడానికి మార్గం సగమం అయ్యిందని నిపుణులు భావిస్తున్నారు. -
క్రికెటర్స్.. ‘గేమ్’చేంజర్స్..!
కొన్నాళ్ల క్రితం దాకా ఎక్కువగా ఫుడ్ బిజినెస్ వైపు మొగ్గు చూపిన క్రికెటర్లు ప్రస్తుతం ఇతరత్రా రంగాలపై దృష్టి పెడుతున్నారు. ఫ్యాషన్, ఫిట్నెస్, గ్రూమింగ్ ఉత్పత్తులు మొదలైన వాటిపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా కోచ్ రవి శాస్త్రి కూడా ఈ జాబితాలో చేరాడు. 23 యార్డ్స్ పేరిట పురుషుల సౌందర్య సాధనాల శ్రేణిని ప్రవేశపెట్టాడు. ఇందుకోసం ఆదూర్ మల్టీప్రొడక్ట్స్ సంస్థతో జట్టు కట్టాడు. 23 యార్డ్స్ బ్రాండ్తో బాడీ వాష్, షేవింగ్ జెల్, డియోడరెంట్, శానిటైజర్ వంటి ఉత్పత్తులు లభిస్తాయి. ప్రస్తుతానికి ఆన్లైన్ మాధ్యమంలోనే వీటిని విక్రయిస్తున్నారు. దేశీయంగా పురుషుల గ్రూమింగ్ ఉత్పత్తుల మార్కెట్ దాదాపు రూ. 5,000 కోట్ల పైచిలుకు ఉంటుందని అంచనా. కోహ్లి అండ్ కో..: ఇప్పటికే చాలా మంది మాజీ, ప్రస్తుత క్రికెటర్లు.. ఇలాంటి వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఫ్యాషన్ లేబుల్ రాంగ్, ఇండియన్ సూపర్ లీగ్ టీమ్ ఎఫ్సీ గోవాలో వాటాలు ఉన్నాయి. అలాగే జిమ్ చెయిన్ చిజెల్, స్టార్టప్ సంస్థలు స్పోర్ట్ కన్వో, స్టెపథ్లాన్ కిడ్స్లోనూ ఇన్వెస్ట్ చేశాడు. అటు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఫిట్నెస్ క్లబ్ స్పోర్ట్స్ఫిట్, ఫిట్నెస్.. లైఫ్స్టైల్ బ్రాండ్ సెవెన్, ఐఎస్ఎల్ టీమ్ చెన్నయిన్ ఎఫ్సీలో పెట్టుబడులు పెట్టాడు. అదే బాటలో మరో క్రికెటర్ కేఎల్ రాహుల్ గతేడాది గల్లీ బ్రాండ్ పేరుతో దుస్తుల విభాగంలోకి అడుగుపెట్టాడు. ఇందుకోసం జెకో ఆన్లైన్ అనే రిటైల్ సంస్థతో జట్టు కట్టాడు. తాజా ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ టీమ్లతో చేతులు కలిపాడు. గల్లీ బ్రాండ్తో ఆన్లైన్ గేమింగ్ వ్యాపార విభాగంలోకి కూడా అడుగుపెట్టడంపై రాహుల్ దృష్టి పెడుతున్నాడు. ఇక, 2019 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు యజువేంద్ర చహల్ తన సొంత లైఫ్స్టయిల్ బ్రాండ్ చెక్మేట్ను ప్రవేశపెట్టాడు. గతంలో యువరాజ్ సింగ్ కూడా హెల్తియన్స్, వ్యోమో, కారటిసన్, జెట్సెట్గో వంటి సంస్థల్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేస్తే సరిపోదు .. సాధారణంగా క్రికెటర్లు ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తే దానికి బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా వ్యవహరిస్తుంటారు. ఇందుకు గాను సదరు వ్యాపారంలో ఎంతో కొంత వాటాలు తీసుకోవడం ద్వారా ఇన్వెస్టరుగా మారుతుంటారు. అంతే తప్ప ప్రత్యేకంగా డబ్బులు ఇన్వెస్ట్ చేసే క్రీడాకారులు చాలా తక్కువగా ఉంటారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అయితే, దీర్ఘకాలంలో చూస్తే కేవలం బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం వల్ల ఉపయోగం లేదని బ్రాండింగ్ ప్రొఫెషనల్స్ అభిప్రాయపడ్డారు. సదరు వ్యాపారంలో వారు కూడా చురుగ్గా పాలుపంచుకుంటేనే ఉపయోగం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఉదాహరణకు కేఎల్ రాహుల్ను చూస్తే.. గల్లీ బ్రాండ్కి సంబంధించి డిజైన్ నుంచి రంగుల ఎంపిక దాకా అన్ని విషయాల్లోనూ చురుగ్గా పాలుపంచుకుంటాడు. ఇన్వెస్టర్లుగా మారిన క్రీడాకారులు ఆయా వ్యాపారాల్లో చురుగ్గా పాలుపంచుకుంటేనే ప్రయోజనాలు ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. లాభదాయకమేనా.. క్రికెటర్లు పెట్టుబడులు పెట్టిన వ్యాపారాలు .. లాభాలు ఆర్జించడంలో మిశ్రమ ఫలితాలు కనపరుస్తున్నాయి. కోహ్లికి చెందిన రాంగ్ బ్రాండ్ను ప్రమోట్ చేసే యూనివర్సల్ స్పోర్ట్స్బిజ్ (యూఎస్పీఎల్) వేల్యుయేషన్ ప్రస్తుతం రూ. 1,200 కోట్ల పైగా ఉంటుంది. కానీ ఇది ఇంకా లాభాల్లోకి మళ్లాల్సి ఉంది. యాక్సెల్, అల్టీరియా క్యాపిటల్ వంటి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. కోహ్లి ఇటీవలే మరో రూ. 13.2 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. యూఎస్పీఎల్ ఏర్పాటైన తొలినాళ్లలో సచిన్ టెండూల్కర్ కూడా ఇన్వెస్ట్ చేశాడు. అటు ధోనీకి చెందిన సెవెన్ బ్రాండ్ సైతం చెప్పుకోతగ్గ స్థాయిలో ప్రాచుర్యం పొందలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2016లో ప్రవేశపెట్టిన ఈ బ్రాండ్ దుస్తులు.. అన్ని ఈ–కామర్స్ సైట్లలోనూ కనిపిస్తున్నప్పటికీ కేవలం ధోనీ ఆకర్షణ శక్తి మీదే వీటి అమ్మకాలు ఎక్కువగా ఆధారపడి ఉంటున్నాయని వివరించాయి. -
లాక్డౌన్ ఎఫెక్ట్: ఆహార రంగంలోకి టెక్ కంపెనీలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుమ్మేస్తున్న నేపథ్యంలో భారతీయ టెక్ స్టార్టప్ కంపెనీలు మునుగకుండా మనుగడ సాగించేందుకు అనేక మార్గాలు అనుసరిస్తున్నాయి. తమకేమాత్రం సంబంధంలేని రంగాల్లోకి అడుగుపెట్టి సాధ్యమైనంత మేరకు రాణించేందుకు కృషి చేస్తున్నాయి. పర్యాటక వ్యాపారంలోకి అడుగుపెట్టిన ట్రావెల్ ఏజెంట్ ‘మేక్మైట్రిప్’ దగ్గరి నుంచి ఇంటి, ఆఫీసుల అద్దెల నుంచి ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలకు మధ్యవర్తిత్వం వహించే ‘నో బ్రోకర్’ సంస్థ, సొంత డ్రైవింగ్ కోసం కార్లను అద్దెకిచ్చే ‘జూమ్కార్’ వరకు ఆహార సంబంధిత వ్యాపారాల్లోకి అడుగు పెట్టాయి. కంపెనీ ఆవిర్భావ లక్షిత వ్యాపారాన్ని ‘కరోనా’ కాటేయడంతో ఈ టెక్ సంస్థలన్నీ ప్రత్మామ్నాయ వ్యాపారాలను ఎంచుకోక తప్పలేదు. ‘లక్షిత కార్యకలాపాలు నడవనప్పుడు వినియోగదారులకు అందుబాటులో ఉండడానికి ఇదో మార్గం. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి సంస్థ మూతపడకుండా రక్షించుకోవడంతోపాటు అంతోఇంతో రెవెన్యూను కూడగట్టుకోవడానికి తప్పని మరో ఆవిష్కరణ’ అని స్టార్టప్ల రంగానికి చెందిన స్వతంత్య్ర విశ్లేషకులు హరీష్ హెచ్వీ వ్యాఖ్యానించారు. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన నేపథ్యంలో దేశంలోని పలు టెక్ కంపెనీలు కిరాణా సరకులు, ఆహారం, కూరగాయల సరఫరా రంగంలోకి అడుగుపెట్టాయి. కొత్త రంగం ద్వారా భారీగా డబ్బులు సంపాదిద్దామనే యావ కాకుండా, తగిన నెట్వర్క్ ఉన్నప్పుడు సంస్థను మూసుకోవడం ఎందుకనే ఈ కొత్త వ్యాపార రంగంలోకి ఎక్కువ సంస్థలు అడుగు పెట్టాయని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు బెంగళూరుకు చెందిన ‘నోబ్రోకర్హుడ్’ కంపెనీకి ఐదు లక్షల ఇళ్లు కలిగిన రెండువేల సొసైటీలతో నెట్వర్క్ ఉంది. వారందరికి వినిమయ వస్తువులు, కిరాణ సరకులను సరఫరా చేయడం కోసం ఐటీసీ, బిగ్ బాస్కెట్ లాంటి కంపెనీలతో ఒప్పందం చేసుకొంది. ఇక్కడ బ్రోకర్ కంపెనీ డెలివరీలు నేరుగా చేయడం లేదు. సొసైటీలు ‘నోబ్రోకర్హుడ్’ యాప్ ద్వారా కావాల్సిన సరకులు బుక్ చేసుకొని, అవే స్వీకరిస్తాయి. వాటిని ఇంటింటికి పంచే బాధ్యతను సొసైటీలే తీసుకుంటున్నాయి. ఓ భవనంలోకి సందర్శకులను అనుమతించేందుకు ఉద్దేశించిన నోబ్రోకర్హుడ్ యాప్ ఇప్పుడు సరకుల సరఫరా కోసం మూడింతలు పెరిగిందట. ఇప్పుడు ‘నోబ్రోకర్హుడ్’ కంపెనీ కేవలం వినిమయ వస్తువులు, కిరాణా సరకుల సరఫరకే కాకుండా అంటురోగాలు లేని ప్రాంతాలను సూచించే సంస్థగాను మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు ఉన్నాయా, లేవా ? అన్న విశయాలను కూడా ఈ యాప్ ద్వారా తెలియజేస్తోంది. ఈ సంస్థకు వ్యవస్థాపక సీఈవోగా అమిత్ కుమార్ అగర్వాల్ వ్యవహరిస్తున్నారు. కిరాణా సరఫరాల రంగంలోకి ‘కౌట్లూట్’ సంస్థ, నీంజాకార్ట్, ఇండస్ఫ్రెష్, విలేజ్ ఆగ్రో, ఫామ్ఫ్రెష్ సంస్థలతో కలసి కిరాణా సరకులను సరఫరా చేస్తోంది. ‘పేనియర్బై’ లాంటి ఫిన్టెక్ కంపెనీ ‘బైనియర్బై’ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా నాలుగు లక్షల కిరాణ దుకాణాల ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. లాక్డౌన్ సందర్భంగానే ఈ కంపెనీ ఇంతటి పురోగతి సాధించింది. ఈ సంస్థ వినియోగదారుల నుంచి ఎలాంటి సర్వీస్ చార్జీలను ఇంకా వసూలు చేయడం లేదు. దుకాణదారులు మాత్రం రెండు నుంచి ఎనిమిది శాతం వరకు సర్వీసు కింద చెల్లిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు సమయంలో ‘పేటీఎం’ ఎలా వ్యాపారాన్ని నిర్వహించిందో ఇప్పుడు లాక్డౌన్ సందర్భంగా తాము వ్యాపారాన్ని నిర్వహించామని సంస్థ వ్యవస్థాపక సీఈవో ఆనంద్ కుమార్ బజాజ్ చెప్పారు. -
ఫుడ్ డెలివరీలోకి అమెజాన్
న్యూఢిల్లీ: అమెరికన్ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ .. భారత్లో కార్యకలాపాలను జోరుగా విస్తరిస్తోంది. కేవలం ఆన్లైన్ షాపింగ్ పోర్టల్కే పరిమితం కాకుండా కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. తాజాగా ఫుడ్ డెలివరీ సేవలను కూడా ప్రారంభించనుంది. తద్వారా ఈ విభాగంలో దిగ్గజాలైన స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని మార్చిలో ప్రకటించవచ్చని, ప్రైమ్ నౌ యాప్ ద్వారా ఈ సర్వీసులు అందించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. íస్విగ్గీ, జొమాటోలు డిస్కౌంట్లలో కోత పెట్టి, కఠిన వ్యయ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్న పరిస్థితుల్లో అమెజాన్ ఎంట్రీ ఇవ్వబోతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ ఈమధ్యే తమ ఉబెర్ఈట్స్ ఇండియాను జొమాటోకు విక్రయించేసిన సంగతి తెలిసిందే. సమగ్ర వ్యాపార వ్యూహం.. ‘ప్రైమ్’ పెయిడ్ చందాదారులకు.. నిత్యావసరాలు, ఆహారం మొదలుకుని ఎలక్ట్రానిక్స్, ఇతరత్రా గృహావసరాల ఉత్పత్తుల శ్రేణిని కూడా అందించే వ్యూహంలో భాగంగానే అమెజాన్ ఈ కొత్త విభాగంలోకి ప్రవేశిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్కెట్లోకి ప్రవేశించేందుకు అమెజాన్ మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చోదని.. మార్కెట్లోకి ఎప్పుడొచ్చామన్నది కాకుండా.. చివర్లో వచ్చినా కూడా గెలవొచ్చన్నది ఆ సంస్థ సిద్ధాంతమని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఫుడ్ బిజినెస్నే అమెజాన్ ఎందుకు ఎంచుకున్నది వివరిస్తూ.. కన్జూమర్ టెక్నాలజీతో ముడిపడి ఉన్న వ్యాపార విభాగాల్లో ఫుడ్ డెలివరీకి అత్యధికంగా ఆదరణ ఉంటుందని .. తర్వాత స్థానాల్లో నిత్యావసరాలు, ఎఫ్ఎంజీసీ, సాధారణ ఈ–కామర్స్ లావాదేవీలు ఉంటాయని ఓ ఇన్వెస్టర్ వివరించారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కాస్త ఎక్కువ ఖర్చు పెట్టే వినియోగదారులు, మళ్లీ మళ్లీ కొనుగోళ్లు చేసే వారిని ఆకర్షించాలన్నది అమెజాన్ వ్యూహం. ప్రస్తుతానికి అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను సొంత ఉద్యోగులకే అమెజాన్ అందిస్తోంది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్, బెల్లందూరు, హరలూరు, మరతహళ్లి, వైట్ఫీల్డ్ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. హోటళ్లతో ఒప్పందాలు .. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తికి చెందిన కాటమారన్ వెంచర్స్, అమెజాన్ ఇండియా కలిసి ఏర్పాటు చేసిన ప్రైవన్ బిజినెస్ సర్వీసెస్ సారథ్యంలో ఈ కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ డైరెక్టర్ (ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగం) రఘు లక్కప్రగడ ఈ వ్యూహానికి సారథ్యం వహిస్తున్నారు. పోటీ సంస్థలతో పోలిస్తే తక్కువ కమీషన్ కోట్ చేస్తూ హోటళ్లు, రెస్టారెంట్లతో ప్రైవన్ బిజినెస్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. సుమారు 10–15 శాతం కమీషన్ను అమెజాన్ ప్రతిపాదిస్తోంది. స్విగ్గీ, జొమాటోలతో పోలిస్తే ఇది దాదాపు సగం. లాజిస్టిక్స్పై భారీగా పెట్టుబడులు ఫుడ్ డెలివరీ వ్యాపారం విజయవంతం కావాలంటే అమెజాన్ ఎక్కువగా లాజిస్టిక్స్, రెస్టారెంట్ వ్యవస్థ, టెక్నాలజీ, మార్కెటింగ్పై గణనీయంగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని నిపుణులు తెలిపారు. అలాగే, స్విగీ.. జొమాటోలను ఢీకొనాలంటే.. కొరియన్, జపనీస్ మొదలైన వంటకాలు కూడా అందించే రెస్టారెంట్లతో అమెజాన్ ప్రత్యేక ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశముందని వివరించారు. ఇటీవలే 350 మిలియన్ డాలర్లతో ఉబెర్ఈట్స్ను జొమాటో కొనుగోలు చేసింది. అటు స్విగ్గీ కూడా ఇటీవలే ప్రస్తుత ఇన్వెస్టరు, దక్షిణాఫ్రికా దిగ్గజం నాస్పర్స్ సారథ్యంలో మరికొందరు ఇన్వెస్టర్ల నుంచి సుమారు 113 మిలియన్ డాలర్లు సమీకరించింది. -
అదిరిపోయే ఆఫర్లు.. ఇంకెందుకు ఆలస్యం
కొత్త సంవత్సరం ఎన్నో ఆశలను, ఆశయాలను తీసుకువస్తుంది. ప్రతి ఏడాది మనకు అనేక జ్ఞాపకాలను, అనుభూతులను అందిస్తుంది. వీటికితోడు కొన్ని చేదు అనుభవాలను సైతం ఇస్తుంది. గడిచిన ప్రతి క్షణం రేపటికి ఒక జ్ఞాపకమే. మంచి చెడుల సమ్మేళనమే జీవితం. అలాంటి జీవితంలో మరో నూతన అధ్యాయాన్ని స్వాగతిస్తూ.. న్యూ ఇయర్కు వెల్కమ్ చెబుతాం.. న్యూ ఇయర్ ఇంకో నెల రోజులు ఉంది అనగానే వేడుకలు, సంబరాల గురించి మదిలో ఆలోచనలు మెదులుతాయి. గత ఏడాది కంటే భిన్నంగా ఈసారి డిసెంబర్ 31 వేడుకల నిర్వహణకు హైదరాబాదీయులు తహతహలాడుతున్నారు. మొదట్లో ఈ కల్చర్కు ఇంత క్రేజు లేకున్నా రానూ రానూ పరాయి వేడుకపై మోజు బంగారం ధరలా పెరుగుతూనే ఉంది. ఇక ఈ నూతన సంవత్సర సంబరాలలో ప్రజలను ఆకర్షించే వాటిలో ఆఫర్లు ప్రధానమైనవి. కేకుల నుంచి ఫేస్ క్రీమ్ వరకు అన్ని ఆఫర్లే (క్లాతింగ్, ఫుట్వేర్, జ్యూవెల్లరీ, ఫుడ్, కాస్మోటిక్స్).. వీటిలో మరీ ముఖ్యమైనది ఫుడ్. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఫుడ్ను ఇష్టపడని వారంటూ ఉండరు. అసలే హైదరాబాదీలు భోజన ప్రియులు. ఇక ఆఫర్లు కనిపిస్తే ఊరుకుంటారా... లేదండోయ్ ఆవురావురంటూ లాంగిచేయడమే. చాలా సందర్బాల్లో ఫుడ్ ఫెస్టివల్స్ను సైతం నిర్వహిస్తుండటం తెలిసిందే. మరీ ఫుడ్కు ఉన్న డిమాండేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. ఆఫర్లే ఆఫర్లు... నగరంలో ఇంచుమించుగా 12వేల వరకు చిన్న, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా. మరో 10వేల దాకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మెస్లు హోటల్ ఉన్నాయి. హోటళ్లు, రిసార్ట్లు ప్రజలను ఆకర్షించేందుకు వినూత్నడిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్లతో తలుపులు తెరుస్తున్నాయి. నోరూరించే ఆహారాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. రెస్టార్లెంటు, హోటళ్లు, దాబాలు, చిన్న చిన్న హోటళ్లు సైతం తమదైన రీతిలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒకటి కొంటే మరొకటి ఉచితమని,, ఒక్కొదానిపై 30, 40, 50 శాతం వరకు డిస్కౌంట్ను ప్రకటిస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లయితే బఫేపై వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తున్నాయి. కొన్నిచోట్ల అన్లిమిటెడ్ ఫుడ్, బేవరేజ్ను ఆఫర్ చేస్తున్నారు. పేరుగాంచిన హోటళ్లు పాశ్చాత్య వంటకాలు, కాక్టైల్స్, మాక్టైల్స్ను రుచి చూపించనున్నాయి. నాన్ వెజ్ ఆఫర్లు.. ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిది ముద్ద దిగదు. అలాంటిది వేడుకల్లో నాన్ వెజ్ లేకుంటే.. నో నో తప్పకుండా ఉండాల్సిందే అంటున్నారు హైదరాబాదీలు. మరీ నాన్ వెజ్ లవర్స్ వారి కోసం ప్రముఖ రెస్టారెంట్లు ఇస్తున్న ఆఫర్లు ఏంటో తెలుసుకుందాం. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు... ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్బంలో బిర్యాని లాంగించేస్తూ ఉంటారు. వీటిలో చికెన్, మటన్, మష్రూమ్,ఫిష్ బిర్యానీలు ప్రత్యేకం. ఈ సారి ఈ బిర్యానిపైలపై ఆఫర్లు ఆశించిన స్థాయిలో లేనట్లు కన్పిస్తోంది. సాధారణ రోజుల్లో బిర్యాని ధర రెస్టారెంట్లను బట్టి 150 నుంచి 300 వరకు ఉండగా... న్యూ ఇయర్ సందర్భంగా ఈ ధరను 100 నుంచి 250 లోపు తగ్గించారు. అదేవిధంగా కొన్ని రకాల ఐటమ్లపై 10 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ను అందిస్తున్నాయి. ఇక స్టాటర్లు, సూప్లు ధరలు అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఆన్లైన్ ఫుడ్ సర్వీసింగ్.... ఆన్లైన్ ఫుడ్ సర్వీస్లు వచ్చాక నగరంలో తిండికి కొదవే లేకుండా పోయింది. యాంత్రిక టెక్నాలజీ వచ్చాక బిజీ సిటీ లైఫ్లో అటు ఉద్యోగం ఇటు జీవితాన్నిసమన్వయం చేయలేక నానా తాంటాలు పడుతున్న కుటుంబాలు ఎన్నో. అలాంటి వారికి ఆన్లైన్ ఫుడ్ డెలీవరీ యాప్లు ఎంతగానో దోహదపడుతున్నాయి. కేవలం తినాలనుకున్న సమయానికి అరగంట ముందు కావాల్సిన ఫుడ్ను ఆర్డర్ చేసుకుంటే సరి. దీనికి కావాల్సింది. కేవలం సంబంధిత యాప్ను డౌన్లోడ్ చేసుకోవడమే. హోటల్ కు వెళ్లి తినేవారు తగ్గడంతో ఆన్లైన్ ఫుడ్ సర్వీస్లను డిమాండ్ పెరిగింది. ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించడంతో ఫుడ్డీస్ రెస్టారెంట్లకు క్యూ కడుతున్నారు. వెజ్, నాన్వెజ్, ఫాస్ట్ఫుడ్ ఐటమ్ ఏదైనా సరే మనీ ఉంటే చాలు. మీ దరికి విచ్చేస్తుంది. అంతేగాక 10 శాతం నుంచి 50 శాతం వరకు డిస్కౌంటు లభిస్తుంది. పైగా డెలివరీ కూడా ఫ్రీ... అర్థరాత్రి అపరాత్రి అన్న తేడా కూడా లేదు. ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడంటే అక్కడ మీరు కోరుకున్న ఆహారం.. మీ చెంతకు చేరుతుంది. దీంతో ఫుడ్ ఆర్డరింగ్ అనేది చాలామంది జీవితాలలో ఓ ఫ్యాషన్లో మారిపోయింది. ఫేమస్ ఫుడ్ యాప్లు ఆన్లైన్ ఫుడ్ యాప్లో స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్, ఫుడ్ పాండా వంటివే అధికం. సిటీలో నిత్యం అమ్ముడయ్యే ఫుడ్లో 60శాతం మేర ఆన్ లైన్ డెలివరీలే ఉంటాయి. ఒక్క స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థనే నగరంలో రోజూ 80వేల ఆర్డర్ల వరకు యాప్ ద్వారా విక్రయిస్తోంది. ఇలా మిగతా ఫుడ్ డెలివరీ సంస్థలు అన్ని కలిసి దాదాపు ప్రతి నెల 10లక్షలకు పైనే ఆర్డర్లను చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే తమ వద్దకు ఫుడ్ వస్తుండటంతో ఈ యాప్లకు క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ప్రత్యేక ప్యాకేజీల రూపంలో తమ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. భోజన ప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఇంకేముంది ఆర్డర్ చేసిన అరగంటలో నోరూరించే వంటకాలు మన ముంగిట ప్రత్యక్షమవుతున్నాయి. ప్రమోషన్ ఆఫర్లు, డిస్కౌంట్ల వర్షాలు.. కొద్ది తేడాతో దాదాపు అన్ని సంస్థలు ఒకే విధమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా బిర్యానీలు, పిజ్జాలు, మిల్క షేక్లు,ఫ్యామిలీ ప్యాక్ వంటివి అధికంగా ఉన్నాయి. ఈ న్యూ ఈయర్కు మరీ ఏ సంస్థ ఏ ఆర్డర్ను అందిస్తోందో ఓ లుక్కేద్ధాం... జొమాటో...న్యూ యూజర్లకు 40 శాతం డిస్కౌంట్ను అందిస్తుంది. అంతేగాక ప్రోమో కోడ్లు అందిస్తుంది. అలాగే పేటీఎం యూపీఐ ద్వారా రూ. 350 మించి కొనుగోలు చేస్తే 30 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది. ఇందుకు ZOMATO300 కోడ్ను ఆప్లై చేయాలది. అదే విధంగా స్నాక్స్పై 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. టాప్ రెస్టారెంట్లలో రూ. 99 కంటే కొనుగోలు చేస్తే 50 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది. ఇందుకు ZOMATO కోడ్ను అప్లై చేయాలి. కోటక్ మహీంద్ర కార్డు ద్వారా రూ. 250 కంటే ఎక్కు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ను అధికంగా రూ75 వరకు అందిస్తోంది. ప్రత్యేక పార్టీ ఆఫర్ పేరుతో రూ .500 విలువైన ఆహార ఆర్డర్లలో రూ .1000 వరకు ఆదా ఇస్తుంది. ఇది కేవలం ఎంచుకున్న రెస్టారెంట్లలో మాత్రమే. స్విగ్గీ.. కొత్త యూజర్లకు 33 శాతం డిస్కౌంట్ను ఇస్తుంది. దీంతోపాటు ఫ్రీ డెలివరీ లభిస్తుంది. ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నీ కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. ఆఫర్లు కూడా వారికే ఎక్కువ ఉంటాయి. సంబంధిత రెస్టారెంట్ల ద్వారా WELCOME50... ద్వారా 50 శాతం డిస్కౌంట్ను ఇస్తుంది. 150LPAYNEW ద్వారా 150 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. రెండు మీడియం పిజ్జాలను ఒక పిజ్జా ధరకే పిజ్జా హట్ ద్వారా ఇస్తోంది. ఉబర్ ఈట్స్.. ఉబర్ రైడ్లతోపాటు ఉబర్ ఈట్స్ ఆహార డెలివరీ యాప్ ప్రముఖంగా నిలుస్తోంది అన్ని రకాల పదార్థాలపై 30 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది. సెలక్టెడ్ రెస్టారెంట్ల నుంచి 50 శాతం బిర్యానిపై డిస్కౌంట్ను అందిస్తోంది. సంబంధిత రెస్టారెంట్లపై30,40, 50 శాతం వరకు కూడా తగ్గింపును అందిస్తోంది. వీటికి ఎలాంటి ప్రోమో కోడ్ అవసరం లేదు. నేచురల్ ఐస్ క్రీం నుంచి కప్ ఐస్ క్రీమ్నుఒకటి కొంటే ఒకటి ఉచితంగా అందిస్తోంది. మిల్క్ షేక్లను కేవలం 99 రూపాయలకే అందిస్తోంది. HYDFEAST50, HYDFEAST30, HYDFEAST20 ద్వారా 50,30, 20 శాతం డస్కౌంట్ను ఇస్తుంది బేకరీల్లో బారులు.. న్యూయర్ దగ్గర పడుతుండటంతో బేకరీలలో కేకుల తయారీలు జోరందుకున్నాయి. కేకుల్లో వెజ్, నాన్ వెజ్, పేస్ట్రీస్ వంటివి.. విభిన్న రకాల ఆకృతిలో అందుబాటులో ఉన్నాయి.. ఒక్కో బేకరీలలో దాదాపు 500 నుంచి 1000 కేకుల వరకు తయారీ చేస్తున్నారు. నూతన సంవత్సర సందర్భంగా కేక్లు కొనుగోలు చేసేందుకు బేకరీ నిర్వాహకులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. బేకరీలలో అయితే. కేజీ కేకు 400 రూపాయలు, అర కేజీ కేకు 200 రూపాయలకే అందిస్తున్నాయి. అంతేగాక వీటికి 500 ఎంఎల్ కూల్డ్రింక్, మిక్చర్ వంటివి ఉచితంగా అందజేస్తున్నాయి. వీటితోపాటు పిజ్జా, బర్గర్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, బేకరీలు ఆఫర్లను జోరుగా అందిస్తున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే న్యూ ఇయర్ ఆఫర్లను ఆరగించండి.. - గుండా భావన (వెబ్ డెస్క్ ప్రత్యేకం) -
కనువిందుగా... కడుపు నిండుగా...
ఆ హోటల్కు హంగు ఆర్భాటాలు ఏమీ ఉండవు. అక్కడకు చేరేదాకా ఒక హోటల్ ఉంటుందన్న భావన, మన ఆకలి తీర్చే అన్నదాత ఉంటాడన్న స్ఫురణే మనకు రాదు. ఆ హోటల్కు ఒకసారి విచ్చేసి భోజనం చేస్తే మాత్రం ‘అన్నదాతా సుఖీభవ’ అనాల్సిందే. ప్రచార పటాటోపం కన్నా, అన్నార్తుల జిహ్వచాపల్యానికి అనుగుణంగా 24 రకాల కూరలతో సుష్టుగా భోజనం పెట్టి సంతృప్తి పరుస్తున్న నాగన్న హోటల్ ఈ వారం ఫుడ్ ప్రింట్స్... ఉపాధి కోసం ఉన్న ఊరు వదిలి ఎక్కడికో వెళ్లడం ఎందుకనుకున్నారు బెల్లంకొండ నాగన్న. ఖమ్మం–సూర్యాపేట ప్రధాన రహదారిలో మండల కేంద్రమైన కూసుమంచిలో 1995లో ఒక హోటల్ను ప్రారంభించారు. ఇంటి పట్టునే ఉండి వ్యాపారం చేసుకోమని అమ్మ ఇచ్చిన సలహాతో నాగన్న అక్కడే ఉండి, సమీప బంధువుల స్థలంలో చిన్న పూరిపాకలో హోటల్ ప్రారంభించారు. పోటీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న తపనతో నాగన్న విస్తరినిండా కూరలు వడ్డించి ఆకలితో వచ్చేవారిని సంతృప్తి పరచాలనుకున్నారు. 24 కూరలతో కూడిన శాకాహార భోజనాన్ని రూ.10కే అందించడం ప్రారంభించారు. లాభనష్టాల గురించి ఆలోచించలేదు. వెనుకడుగు వేయకూడదన్న లక్ష్యంతో 24 ఏళ్లుగా 24 కూరల హోటల్ను నడుపుతూనే ఉన్నాడు. వంటకాలను నాగన్న కుటుంబ సభ్యులే తయారు చేస్తారు. తెల్లవారు జామున ఐదు గంటలకు భార్య మణెమ్మతో కలిసి పని ప్రారంభిస్తే, మధ్యాహ్నం దాకా అదే వ్యాపకం. హోటల్కు ఎంతమంది వచ్చినా.. ఏ రకమైన కూరైనా భార్య మణెమ్మ వండాల్సిందే, నాగన్న వడ్డించాల్సిందే. తనకున్న పొలంలో కూరగాయలు పండిస్తూ, వాటినే హోటల్కు వినియోగిస్తున్నారు. సొంత పాడి నుంచి పెరుగు తయారు చేస్తారు. నాణ్యమైన భోజనానికి చిరునామాగా ఉన్న తన పేరు వినియోగదారుల హృదయాలలో పది కాలాల పాటు ఉండాలని ఆయన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటారు. సొంత పొలంలో పండించిన ధాన్యాన్ని మర ఆడించి, ఆ బియ్యాన్ని హోటల్కు వినియోగిస్తున్నారు. – మాటేటి వేణుగోపాల్, సాక్షిప్రతినిధి, ఖమ్మం మా హోటల్ గురించి ఎక్కడా ప్రచారం ఉండదు. భోజనానికి వచ్చిన వారు మరో పదిమందికి తెలియజేయడం వల్లే వ్యాపారం ఎదుగుతోంది. మా హోటల్లో భోజనం చేయడానికి ఇక్కడి కూరల విశిష్టత, ప్రత్యేకత తెలుసుకున్న అనేకమంది ఇతర ప్రాంతాల నుంచి పనిగట్టుకుని వస్తారు. రాజకీయ ప్రముఖులు, అధికారులు సైతం మా వంటను చవిచూసినవారే. సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు మా హోటల్ అడ్రస్ తెలుసుకుని 24 కూరల భోజనాన్ని రుచి చూస్తుంటారు. భోజనప్రియుల జిహ్వచాపల్యానికి అనుగుణంగా ప్రయోగాలు చేస్తుంటాం. బీట్రూట్తో కూర మాత్రమే కాదు, పచ్చడి సైతం చేసి మెప్పిస్తాం. క్యారట్, ముల్లంగి, క్యాబేజీ, టొమాటో, వంకాయ, దోసకాయ, బెండ, బీర, చిక్కుడు, గోరు చిక్కుడు, బుడమ దోస, కాకర వంటి కాయగూరలతో రోజుకో రకం తయారు చేస్తాం. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నట్లుగా ఎవరికి నచ్చిన కూర వారు తింటారు. అన్నీ నచ్చిన వారు తిని మరోసారి వేయమంటే నాకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. కాష్ కౌంటర్ దగ్గర కూర్చోవడం ఇష్టం ఉండదు. తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే కూర్చుంటాను. వినియోగదారులతో కలిసి వారికి ఆనందం కలిగేలా వడ్డించడమే నాకు ఇష్టం. అందుకే నేను వాళ్లలో కలిసిపోతాను. – నాగన్న, హోటల్ యజమాని -
చుప్పుల కోట
ఇవి గప్చుప్గా విదేశాలకు సైతం ప్రయాణిస్తున్నాయి... ఒక్కసారి చుప్పులను పంటి కింద ఉంచి కరకరలాడిస్తే చాలు... మళీ మళ్లీ కావాలని అడగకుండా ఉండలేరు... సుమారు 40 సంవత్సరాలుగా చుప్పులను తయారుచేస్తూ, సారవకోట పేరును ప్రపంచ పటంలోకి తీసుకువెళ్తున్నారు ఆనందరావు. ఇదే ఈవారం మన ఫుడ్ ప్రింట్స్... చుప్పులు వాసన వస్తేనే చాలు నోరూరిపోతుంది. వాటిని వెంటనే తినాలనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండల కేంద్రానికి రాగానే బస్సులో పడుకున్నవారిని సైతం నిద్రలేపుతుంది ఈ రుచి. ఇవి చాలా కాలం నుంచే ప్రసిద్ధి చెందాయి. జాతీయ రహదారిని ఆనుకుని ఈ గ్రామం ఉండటం వల్ల ఒడిషా వెళ్ళేవారంతా వీటిని కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు. ఈ చుప్పులకు సుమారు 40 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇతర దేశాలలో ఉన్న తమ పిల్లలకు వీటిని పంపించడం ఆనవాయితీగా మారింది. అందువల్ల వీటి ప్రత్యేకత ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. ఇదీ చరిత్ర 1960 సంవత్సరంలో జలుమూరు నుండి పొట్ట చేత పట్టుకుని ఈ గ్రామానికి వలస వచ్చారు తంగుడు వంశీయులు. బతుకు తెరువు కోసం చుప్పుల తయారీని ప్రారంభించారు. అప్పటి నుంచి చుప్పుల తయారీ కుటీర పరిశ్రమగా మారింది. తంగుడు వంశీయులు తమకు తెలిసిన మెళకువలను ఉపయోగించి మరిన్ని వైశ్య కుటుంబాలకు నేర్పించారు. ఇప్పుడు ప్రస్తుతం సుమారు 12 కుటుంబాల వారు వీటిని తయారుచేసి, కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఆనందరావు మాది ఒరిస్సాలో గునుపూరు. మేం ఏడుగురు అన్నదమ్ములం. జీవనోపాధి కోసం 40 సంవత్సరాల క్రితమే ఇక్కడకు వచ్చాం. నా చిన్నప్పటి నుంచి తాతగారి దగ్గర నర్సన్నపేటలో ఉండేవాడిని. వివాహం అయ్యాక సారవకోట వచ్చాను. మేము వ్యాపారస్థులం, ఎవ్వరికీ అరువు పెట్టం. అలా చేస్తే, వ్యాపారంలో నష్టపోతామని మా నమ్మకం. వ్యాపారం ప్రారంభించిన కొత్తలో రెండు డబ్బాల చుప్పులు తయారు చేసి అమ్మేవాళ్లం. వ్యాపారంలో లాభం అంతగా రాకపోయినా, నష్టం ఉండేది కాదు. వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. జాగ్రత్తగా నీడలో ఉంచితే, పాడు కావు. ఎండలో పెడితే మూడు రోజులకే పాడైపోతాయి. ఎప్పుడైనా ఊరు వెళ్లాలనుకుంటే మా పని ఆపుకుంటాం. మా ఆవిడ పేరు సత్యవతి. ఆవిడే తయారు చేస్తుంది. నేను దుకాణంలో కూర్చుని వ్యాపారం చూసుకుంటాను. అలసట చూపకూడదు... చుప్పుల తయారీలో ఏమాత్రం ఏమరుపాటు చూపినా వీటి నాణ్యత, రుచి దెబ్బతినే ప్రమాదం ఉంది. చుప్పుల తయారీకి సాంబమసూరి, సి ఆర్ రకం బియ్యాన్నే వినియోగిస్తున్నారు. ఇందులోకి దేశవాళీ నువ్వులనే వాడతారు. వీటిని సాధారణంగా మహిళలే తయారు చేస్తారు. ముందుగా బియ్యాన్ని కడిగి అరబెట్టి, తరువాత మెత్తని పిండిగా తయారు చేస్తారు. పొట్టు తీసిన నువ్వులను, బియ్యప్పిండిలో కలిపి తగినన్ని నీళ్లు, ఉప్పు, వాము కలిపి పలచగాను, చిక్కగాను కాకుండా పిండి కలుపుకుంటారు. ఈ పిండితో వృత్తాకారంగా చుట్టి, సుమారు అరగంట సేపు ఆరబెట్టి, నూనెలో దోరగా వేయిస్తారు. ఇదీ చుప్పుల తయారీ విధానం. నెలకు 50 వేల రూపాయల టర్నోవర్ ఉంది. పెళ్ళిళ్ల సీజన్లో మంచి గిరాకీ ఉంటుంది. సారెలో చుప్పులను తప్పనిసరిగా చేయించుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం, పర్లాకిమిడి, తెంబూరు, పాతపట్నం, నరసన్నపేట ప్రాంతాలను ఈ కుటుంబీకులే చుప్పులు సరఫరా చేస్తున్నారు. – కందుల శివశంకర్, సాక్షి, శ్రీకాకుళం – ఫొటోలు: వై. గణేష్, సారవకోట -
మనసులు దోసేశాడు
ఒక్క నిముషం కూడా తీరిక లేకుండా (ఇంటర్వ్యూ చేసే సమయంలో సాక్షితో మాట్లాడేంత సమయం కూడా ఇవ్వలేదు) ఇడ్లీ–దోశల తయారీలో బిజీగా ఉన్నారు గోవింద్. మీ దోసెలో ప్రత్యేకత ఏంటి?’ అని అడిగితే, ‘మీరే తిని చూడండి! అర్థమవుతుంది’ అంటూ నవ్వుతూ తల తిప్పకుండా, అవలీలగా దోసె వేసేసి, దాని మీద పల్చగా ఉండే ఉప్మా వేసి, ఆ పైన, ఉల్లి తరుగు, బటర్ వేస్తారు, చివరగా మసాలా కారం జల్లి. బటర్ను బాగా కరిగిస్తూ, ఉప్మా కారం మసాలాలు దోసె అంతా పట్టేలా చేస్తారు. ఆ తరవాత మళ్లీ ఉల్లి తరుగు, టొమాటో తరుగు, కొత్తిమీర చల్లుతాడు. చివరగా చీజ్ వేస్తారు. దానిని కూడా కరిగించి, బాగా కరకరలాడే దోసె తయారుచేసి, వేడివేడిగా అందిస్తారు గోవింద్.ఈ రుచి కోసం ఉదయాన్నే పెద్ద క్యూ సిద్ధమవుతుంది. చార్మినార్ సమీపంలోని గుల్జార్హౌజ్ దగ్గర గత 30 ఏళ్లుగా వినియోగదారులకు వివిధ రకాల రుచులను అందిస్తున్నారు. ప్రధాన రోడ్డులోని చౌరస్తా దగ్గర రోడ్డు పక్కన బండిపై తన కుటుంబ సభ్యులతో కలిసి గోవింద్ ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఏళ్ల తరబడి పరిచయం ఉన్న వాళ్లు గోవింద్ను ఆప్యాయంగా భాయ్..భాయ్ అంటూ పలకరిస్తుండడంతో...గోవింద్ కాస్తా...గోవింద్ భాయ్గా మారిపోయారు. ఈ ఘుమఘుమల ప్రక్రియ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా సాగుతూనే ఉంటుంది. దోసెలు మాత్రమే కాదు, ఆ పక్కనే తాజాగా ఇడ్లీ కూడా సిద్ధమవుతూ ఉంటుంది. గోవింద్ వేసే దోసె ఆహారప్రియుల నోరూరిస్తుంది. తన చుట్టూ నిరీక్షిస్తున్న కస్టమర్ల విన్నపాలు వింటూ, వాటికి అనుగుణంగా ఫలహారాలు తయారు చేయడంలో తలమునకలైనా, ఆ ముఖంలో ఒత్తిడి కనపడదు. దోసె, ఇడ్లీ, వడ, ఫ్రైడ్ ఇడ్లీలతోపాటు అక్కడ ప్రత్యేకంగా లభించే చట్నీ కోసం ఎంతసేపైనా వేచి చూస్తారు కస్టమర్లు. అందరికీ గోవింద్ భాయ్ దోసె వేసిన తరవాత, పైన వేసే చీజ్, బటర్, ఉల్లి తరుగు, ఆలుగడ్డ, టొమాటో, రహస్యంగా తయారుచేసుకున్న మసాలాలు, చీజ్... ఇవన్నీ దోసెను కమ్మేస్తుంటే, ఆ దోసెలు రంగురంగుల సీతాకోకచిలుకల్లా ప్లేట్లలోకి ఎగిరి వస్తుంటాయి. కరిగించిన బటర్ వేయడం వల్ల, టొమాటో ముక్కలు మెత్తబడి, రుచికరంగా తయారవుతుంది దోసె. ఇలా తయారైన దోసెను ఆకు మీదకు తీసి, ఆ ఆకును పేపర్ మీద ఉంచి అందిస్తారు. అది నోట్లో పెట్టుకోగానే అమృతం సేవించినట్లు అనుభూతి చెంది ‘జై గోవిందా!’ అనకుండా ఉండలేరు. ఒకేసారి ఎనిమిది దోసెలు వేస్తారు గోవింద్ భాయ్. – పిల్లి రాంచందర్, సాక్షి చార్మినార్, హైదరాబాద్ స్వయం కృషితో.... మా నాన్న పేరు రాఘవులు. మాది పేద కుటుంబం. మేం ముగ్గురం అన్నదమ్ములం. పెద్దన్న నర్సింహం గుల్జార్హౌజ్ ఆగ్రా హోటల్ ఎదురుగా ఉన్న ఫుట్పాత్ మీద బండి పెట్టి, ఇడ్లీ–దోసె తయారు చేయడం ప్రారంభించారు. ఆయన దగ్గర మేమందరం పని చేసాం. ఆయన స్ఫూర్తితో 1990లో సొంతంగా ఇడ్లీ బండి పెట్టి, వ్యాపారం మొదలుపెట్టాను. వెయ్యి రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన నా వ్యాపారం బాగా ఎదిగింది. నాకు మంచి ఆదాయం వస్తుండటంతో, మా పిల్లలను చదివించుకుంటున్నాను. కష్టపడి పని చేస్తే ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడితే నలుగురికీ ఆదర్శంగా ఉంటారు. – గోవింద్ భాయ్ -
రోడ్డు పక్కనే టిఫిన్స్ అమ్ముతారు.. ఎందుకంటే..
ముంబై : డబ్బు దానం చేసే స్తోమత లేకపోతేనేం.. తమ విలువైన సమయాన్ని దానం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు ముంబైకి చెందిన ఓ జంట. తమ పనిమనిషి చేసే వంటకాలు అమ్మిపెడుతూ ఆమె కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ముంబైకి చెందిన అశ్వినీ షెనాయ్ షా, ఆమె భర్త ఎంబీఏ పట్టభద్రులు. ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఉన్నంతలో హాయిగా బతుకుతున్నారు. ఈ క్రమంలో తమ ఇంట్లో పనిచేసే మహిళ కష్టాలు విని వీరు చలించిపోయారు. ఆమె భర్త పక్షవాతంతో బాధ పడుతున్నాడని తెలిసి.. ఆ కుటుంబానికి ఎలాగైనా అండగా నిలవాలనుకున్నారు. అయితే సదరు మహిళ ఆర్థిక సహాయం తీసుకోవడానికి తిరస్కరించడంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ క్రమంలో ఆమెకు వంటలో ప్రావీణ్యం ఉందని తెలుసుకున్న షా దంపతులు.. తన కోసం ఓ చిన్న కొట్టును ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకే ఆమె చేసే వంటకాలు తీసుకుని కొట్టుకు వెళ్లి.. పది గంటల దాకా విక్రయిస్తారు. తద్వారా వచ్చిన సొమ్మును తమ పనిమనిషికి అందజేస్తారు. వీరి దయాగుణానికి సంబంధించిన విషయాలను దీపాళి భాటియా అనే నెటిజన్ ఫేస్బుక్లో షేర్ చేశారు. ‘గాంధీ జయంతి రోజు నాకు బయట ఎక్కడా ఆహారం కనిపించలేదు. ఇంతలో ముంబైలోని కండీవాలీ స్టేషను బయట ఇద్దరు వ్యక్తులు టిఫిన్స్ అమ్మడం చూశాను. వారి దగ్గర పోహా, ఉప్మా, పరాటాలు, ఇడ్లీ ఉన్నాయి. ఎంతో రుచికరమైన ఆ వంటకాలను తింటుండగానే ఇలా వీధిలో ఎందుకు అమ్ముతున్నారు. మీరు చేసే టిఫిన్స్కు మంచి ఆదరణ వస్తుంది. హోటల్ పెట్టవచ్చు కదా అని సలహా ఇచ్చాను. అప్పుడు వాళ్లు చెప్పిన సమాధానం విని నా మనసు ఉప్పొంగిపోయింది. తమ పనిమనిషికి సాయం చేసేందుకు రోజుకు ఆరు గంటల పాటు ఇలా ఆహార పదార్ధాలు అమ్ముతారట. నిజంగా వీరిద్దరూ చాలా గొప్ప పనిచేస్తున్నారు’ కదా అని దీపాళి ఫేస్బుక్లో రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో.. ‘మీ సేవాగుణానికి హ్యాట్సాఫ్.. మనసు ఉంటే మార్గం ఉంటుందని నిరూపించారు. ఆదర్శ జంట’ అంటూ షా దంపతులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఆహారానికి మతం లేదు
న్యూఢిల్లీ: ‘ఆహారానికి మతం లేదు. ఆహారమే ఓ మతం’ అన్న జొమాటో ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారి నెటిజన్ల మన్ననలు అందుకుంటోంది. ఈ కామెంట్ వైరల్ కావడం వెనుక పెద్ద కథే ఉంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన పండిత్ అమిత్ శుక్లా జొమాటోలో మంగళవారం ఆహారం ఆర్డర్ చేశాడు. ఆహారాన్ని డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి ముస్లిం కావడంతో డెలివరీ బాయ్ని మార్చాలని, లేదా ఆర్డర్ను క్యాన్సిల్ చేసి రిఫండ్ ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే మత ప్రాతిపదికన ఆహారాన్ని అందించే వ్యక్తులను మార్చబోమంటూ జొమాటో బదులిచ్చింది. తనకు రిఫండ్ కూడా వద్దని కేవలం క్యాన్సిల్ చేయండి చాలు, మిగిలింది నేను లాయర్లతో చూసుకుంటానని అతడు బదులిచ్చాడు. దీంతో జొమాటో స్థాపకుడు దీపిందర్ గోయల్ రంగంలోకి దిగారు. ‘భారతదేశం, దేశంలోని వైవిధ్యమైన మా వినియోగదారులు, భాగస్వాములు మాకు గర్వకారణం. మా విలువల పరిరక్షణలో వ్యాపారం నష్టపోయినా బాధలేదు’ అని ట్వీట్ చేశారు. ఈ వ్యవహారాన్నంతా అమిత్శుక్లానే స్క్రీన్షాట్లు తీసి మరీ ట్విట్ట ర్లో ఉంచాడు. దీంతో నెటిజన్లు శుక్లాను ఓ ఆటాడుకుంటున్నారు. తమరు ఆర్డర్ చేసిన ఫుడ్ను ముస్లిం తయారుచేయలేదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అంటూ ఓ వ్యక్తి వ్యంగ్యంగా శుక్లాని విమర్శించారు. తమరు నడిపే వాహన ఇంధనం కూడా అక్కడి ముస్లిం ఇంధనమే (ఆ దేశాల నుంచే దిగుమతి అవుతోంది) అంటూ మరోవ్యక్తి ట్వీట్ చేశారు. ఈ తతంగమంతా చూసిన కొందరు అధి కారులు కూడా దీనిపై స్పందించారు. ‘కంపెనీని అభినందించేందుకు నాకో కారణం దొరికింది. యాప్ను ప్రేమిస్తున్నాను’ అంటూ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ‘సెల్యూట్ దీపిందర్ గోయల్ ! అసలైన భారతీయుడివి నువ్వే.. నిన్ను చూసి గర్విస్తున్నాం’ అని మాజీ ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ అన్నారు. నేను పేదవాన్ని... ఏం చేయగలను ! ‘జరిగిన ఘటనతో నేనెంతో బాధపడ్డాను. కానీ ఏం చేయగలను, మేమంతా పేదవాళ్లం. బాధలు తప్పవు’ అంటూ అమిత్ శుక్లాకు ఆహారం డెలివరీ చేసేందుకు వెళ్లిన ఫయాజ్ అన్నారు. ‘ఆర్డర్ అందుకున్న తర్వాత లొకేషన్ కోసం ఆయనకు ఫోన్చేశాను. ఆర్డర్ కాన్సిల్ చేశాను అన్నాడు’ అని వివరించారు. -
విదేశీ రుచులకు ఫిదా..
సాక్షి, విశాఖపట్నం : ఒకప్పుడు ఏదైనా విదేశీ వంటకం టేస్ట్ చేయాలి అంటే కాస్తా శ్రమించేవారు. ఏ దేశం స్పెషల్ కావాలంటే.. ఆ దేశానికి వెళ్లి తీరాల్సిందే. అది వీలుకాని వారు.. విదేశాల నుంచి వచ్చిన వారితో మాట్లాడుతూ.. అక్కడి ఫుడ్ గురించి చెబితే తిన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పర్యాటక స్వర్గధామంగా భాసిల్లుతున్న నగరంలో రోజుకో రెస్టారెంట్ పుట్టుకొస్తోంది. దేశ, విదేశాల ఫుడ్ మెనూ అంతా నగరం నలుమూలల వ్యాపించేసింది. ఆయా రెస్టారెంట్లలో ఇటాలియన్, మెక్సికో, చైనా, ఫ్రాన్స్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల వంటలు నగర ప్రజల నోరూరిస్తున్నాయి. ఫ్యామిలీతో కలసి నచ్చిన వంటకాలు రుచి చూడాలంటే ఖచ్చితంగా గులాబీ నోటు జేబులో ఉండాల్సిందే. సిటీలో ఫుడ్లవర్స్ని నోరూరిస్తున్న వంటకాలను మనం ఓసారి టేస్ట్ చేద్దాం.... ఇరగదీస్తున్న ఇటాలియన్ రుచులు... ఇటలీ దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రఖ్యాతి ఉందో..అక్కడ లభించే ఫుడ్కు అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉంది. ఒకప్పుడు ఇటలీకే పరిమితమైన ఫిష్, పొటాటోస్, రైస్, కార్న్, సాసేజెస్, పోర్క్, విభిన్న రకాల ఛీజ్లు... ఇటాలియన్ వంటకాలను చవులూరించేలా మారుస్తున్నాయి. కార్న్తో చేసే ‘పొలెంటా’ నగరంలో కూడా నోరూరిస్తున్నాయి. ఇద్దరు కలసి ఇటాలియ న్ రుచులను చూడాలంటే కనీసం రూ.1000 నుంచి రూ.2వేలు వెచ్చించాల్సిందే. లెబనీస్... వెరీ వెరీ టేస్టీ బాస్... డ్రైఫ్రూట్స్ను విరివిగా ఉపయోగించే లెబనీస్ శైలి వంటకాలు కూడా నగరంలో ఆదరణకు నోచుకుంటున్నాయి. శెనగలు ఎక్కువగా వాడే వీరి వంటకాల్లో... ఆల్ షీమీ కోఫ్తాడజాజ్, కబ్సా బిర్యానీ, ఖబ్సాలాహమ్ వంటివి నగరంలో ఫుడీస్కు చేరువయ్యాయి. ఆలివ్ ఆయిల్తో ఈ వంటకాలు చేయడం కూడా ఆరోగ్యప్రియుల ఆదరణకు కారణం. మైండ్లో ఫిక్సయితే..మెక్సికన్ టేస్ట్ చెయ్యాల్సిందే... మెక్సికన్ను మనం సినిమాల్లో చూసి ఉంటాం. సిటీలో సైతం మెక్సికన్ వంటకాలు మైండ్బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. స్పైసీగా ఉండాలంటే మాత్రం మెక్సికన్ ఫుడ్పై ఓ కన్నెయ్యాల్సిందే. భారతీయ వంటకాల శైలికి దగ్గరగా ఉండడం కూడా మెక్సికన్ క్యుజిన్ని సిటీæజనులకు దగ్గర చేస్తోంది. వ్రోప్స్, నాథూస్, కేజూన్స్పైస్... వంటివి నగరంలో బాగా ఫేమస్ ఫుడ్గా పేరొందింది. చిప్టోల్ చికెన్ నగర భోజన ప్రియులు మెచ్చే స్టార్టర్గా మారిపోయింది. ఫ్యామిలీతో వెళ్లి మెక్సికన్ రుచులను ఆరగించాలంటే రూ.750నుంచి రూ.2వేలు ఉండాల్సిందే. గ్రీక్ ఫుడ్.. వెరీ గుడ్.. లేట్గా వచ్చినా లే‘టేస్ట్’ అనిపించుకుంటున్నాయి గ్రీక్ రుచులు. రోజ్మేరీ, థైమ్, బేసిల్ (తులసి) వంటి హెర్బ్స్ (వివిధ రకాల ఆకులు) అధికంగా మేళవించే ఈ వంటకాలు ఇప్పుడిప్పుడే నగరానికి పరిచయమవుతున్నాయి. అలాగే వెరైటీ బ్రెడ్స్ కూడా ఈ గ్రీక్ క్యుజిన్కు స్పెషల్. ప్రస్తుతానికి వెజ్ ముసాకా, ఎమిస్టా వంటి వంటకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. హాట్.. హాట్.. ఆఫ్ఘాన్ ఫుడ్... ఆఫ్ఘనిస్తాన్ వంటకాలు కూడా.. ఫుడీస్ని కట్టిపడేస్తున్నాయి. అక్కడి ప్రజల అభిరుచుల మేరకు తయారు చేసే వంటకాలన్నీ ఇప్పుడు నగరంలోని ఫుడ్డీలకు అందించడం హాట్టాప్క్గా మారుతోంది. నగరంలోని పలు రెస్టారెంట్లలో లభిస్తున్న విదేశీ వంటకాలను టెక్కీలు టేస్ట్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ‘కుబ్లీ పలావ్’ భోజనప్రియుల్ని లొట్టలేయిస్తోంది. అదిరే.. అదిరే.. అరేబియన్ అమెరికా క్యుజిన్ను పోలి ఉండే అరేబియన్ శైలి వంటకాలు కూడా నగరంలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. కబ్సా, మురమ్మరాతో పాటు బఖాదరా వంటి డిజర్ట్లు కూడా నగర ఫుడీస్కు ఫేమస్. అరేబియన్ వంటకాల్లో డ్రైఫ్రూట్స్ బాగా వినియోగించడం సిటీలో మరింత ఆదరణకు కారణమైంది. థాయ్.. ఇది చాలా టేస్ట్ గురూ... థాయ్లాండ్ అంటే గుర్తొచ్చేది ఒక్క మసాజే కాదు.. వంటకాలు కూడా ఆ దేశంలో మైమరిపిస్తాయి. ఉడికించిన, కాస్త కఠినంగా ఉండే రైస్, లెమన్గ్రాస్, స్వీట్ జింజిర్, నూనెలు తక్కువగా ఉపయోగించే ఆరోగ్యకరమైన ఆహారశైలిగా దీనికి పేరు. నగరంలో తోఫూ, బేసిల్–లెమన్ సూప్, పహాడ్క్రాపావో మొదలైన థాయ్ఫుడ్ బాగా ఆదరణ పొందుతున్నాయి. ఇక రొయ్యల వంటకాలంటే లొట్టలేసే ప్రియులకైతే థాయ్... సూపరోయ్. థాయ్ వంటకాల్ని ఇద్దరు కలసి టేస్ట్ చేయాలంటే రూ.1000 పైనే ఖర్చవుతుంది. అభిరుచులకు అనుగుణంగా.... సిటీలోని ఫుడ్డీల అభిరుచికి అనుగుణంగా రెస్టారెంట్లు వస్తున్నాయి. దీన్నిబట్టి సిటీలోని పలు రెస్టారెంట్లలో విదేశీ వంటకాలు హల్చల్ చేస్తున్నాయి. రుచులతో పాటు ఆయా రెస్టారెంట్లలో వినోదం కూడా ఉండటం విశేషం. వివిధ దేశాల ప్రజలు విశాఖలో పర్యటిస్తున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా సిద్ధం చేస్తున్న ఫుడ్.. నగర వాసులకూ ఫేవరెట్గా మారుతున్నాయి.– శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ -
రోజూ మిల్క్ సెంటరే
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మీదుగా గలగల పారే గోదావరి మీదుగా రాజమండ్రి చేరుకున్నవారు, మెయిన్ రోడ్లోకి ప్రవేశిస్తారు. నల్లమందు సందు చివరగా ఉన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని అనుకుని చిన్న షాపు కనిపిస్తుంది. అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం చేతుల్లో రోజ్మిల్క్, సేమ్యా, కోవాలతో తయారయిన గ్లాసులు కనువిందు... కాదు కాదు... నోటికి విందు చేస్తుంటాయి. ఎక్కడెక్కడ నుంచో షాపింగుకి వచ్చినవారు తమ లిస్టులో విధిగా రోజ్మిల్క్ను చేర్చుతారు. ఒక్క గ్లాసుడు సేవించగానే షాపింగ్ అలసట పోయిందనుకుంటారు. ఇదీ కథ... గుబ్బా సింహాచలం రాజమండ్రి వాస్తవ్యులు. 1950 నాటికి రోజ్ మిల్క్ అంటే రాజమండ్రిలోనే కాదు, రాష్ట్రంలోనే ఎవరికీ తెలియదు. మంచి ప్రమాణాలతో కూడిన రోజ్ మిల్క్ తయారు చేసి, వినియోగదారులకు నిత్య విందు అందించాలన్న అభిలాష కలిగింది ఆయనకు. పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న సింహాచలం నాటిన మొక్క ఇంతై, ఇంతింతై, మరియు తానంతై అన్నట్లుగా రోజ్ మిల్క్ వ్యాపారం వృద్ధి చెందింది. మూడు తరాలుగా ఆయన వారసులకు కల్పవృక్షంగా నిలబడుతోంది. నగరవాసులకు హాట్ ఫ్యావరేట్... కూల్ డ్రింక్ అనగానే కేవలం వేసవిలో మాత్రమే తీసుకునే పానీయం అనుకుంటారు. ఇక్కడకు వచ్చేవారికి ఋతువులు, కాలాలతో పని లేదు. ఏడాది పొడవునా ఈ ‘రోజ్ మిల్క్’ ప్రజలకు హాట్ ఫ్యావరేట్గానే ఉంటుంది. నిత్యం ఈ దుకాణం ముందు జనం గుంపులుగా చేరి, రోజ్మిల్క్ సేవించడం సర్వసాధారణం. రెండో తరం... గుబ్బా సింహాచలం తరువాత, 1982 నుంచి ఆయన కుమారులు రామచంద్రరావు, శ్రీనివాస్లు ఈ వ్యాపారాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు మూడో తరానికి చెందిన రామచంద్రరావు కుమారులు రిషిక్, వంశీలు కూడా ఈ వృత్తిలోనే స్థిరపడ్డారు. ఇదే విజయ రహస్యం... రుచికరమైన రోజ్ మిల్క్ కోసం వీరు స్వంత డెయిరీని నిర్వహిస్తున్నారు. కల్తీ లేకుండా స్వచ్ఛమైన పాలను మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే అంత రుచి. ఈ పాలలో బాదం, సుగంధి (చలువ కోసం) కలుపుతారు. శుద్ధిచేసిన నీటితో తయారు చేసిన ఐస్ను మాత్రమే ఉపయోగిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ రోజ్మిల్క్ను ఒక్కసారి రుచి చూస్తే, ఇక జన్మలో ఎవరూ వదిలిపెట్టరు. డయాబెటిక్ వారి కోసం ప్రత్యేకంగా సుగర్ ఫ్రీ రోజ్ మిల్క్ను తయారు చేస్తూ, వారిక్కూడా రుచి అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎసెన్స్ సీసాలకు డిమాండ్... రాజమండ్రి రోజ్ మిల్క్కు విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వరకు డిమాండ్ ఉంది. రాజమండ్రి రోజ్మిల్క్కు మాత్రం ఎక్కడా బ్రాంచీలు లేవు. ఎందరో సెలబ్రిటీలకు ఎంతో ఇష్టమైనది.. ‘దివిసీమ ఉప్పెన బాధితుల కోసం విరాళాలు సేకరించిన సమయంలో నాటి అగ్రనటులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులకు నా చేతితో ఈ పానీయాన్ని అందించాను. ఇది నాకు గర్వకారణం. దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి పాదయాత్రలో భాగంగా, బూరుగుపూడి వచ్చినప్పుడు ఈ పానీయాన్ని అందించాను. ఆ సమయంలో ఆయన కొద్దిపాటి అస్వస్థులుగా ఉన్నారు. ఈ రోజ్మిల్క్ను ఆయన ఎంతగానో ఇష్టపడ్డారు. వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఇటీవల పాదయాత్రలో ధవళేశ్వరం వచ్చినప్పుడు, రోజ్ మిల్క్ను పంపాను. జమున, ఆలీ, అనంత్, రవితేజ, వినాయక్, రాజబాబు వంటి సినీ ప్రముఖులు మా రోజ్ మిల్క్ను రుచి చూశారు. ఏడు దశాబ్దాలుగా మా రోజ్ మిల్క్ను ఆస్వాదిస్తున్నావారూ ఉన్నారు. మాకు ఇంతకు మించిన తృప్తి వేరే ఏముంటుంది? – గుబ్బా రామచంద్రరావు (సింహాచలం కుమారుడు) -
ఆహా ఏమి రుచి..!
సాక్షి, ఎదులాపురం(ఆదిలాబాద్) : పట్టణంలో పలువురు వెరైటీ హాట్ హాట్ ఐటమ్స్ను అదిరేటి రుచుల్లో అందిస్తూ ఆదరణ పొందుతున్నారు. పట్టణంలో మిర్చీ బజ్జీ, వడలు, పకోడీల వ్యాపారం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే పలువురు రోటిన్కు భిన్నంగా కొత్తరకమైన ఆహార పదార్థాలను అందిస్తూ తమదైన శైలీలో వ్యాపారాలు చేస్తూ ఆదరణ చూరగొంటున్నారు. పట్టణవాసులు సైతం వాటిని తినేందుకు మక్కువ చూపుతున్నారు. వెజ్.. నాన్వెజ్లో.. రోటీన్కు భిన్నంగా వెజ్.. నాన్వెజ్లలో పలురకాల వెరైటీలతో పట్టణానికి చెందిన పలువురు వ్యాపారాలను ప్రారంభిస్తూ పట్టణవాసుల ఆదరణ చూరగొంటున్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్లో రోడ్ సైడ్లో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వెజ్ ఐటమ్ పోహవింగ్స్ మినహా మిగితా నాన్వెజ్ ఐటమ్స్ చికెన్ కబాబ్, బొంగు చికెన్, చికెన్ పకోడాలను వితౌట్ ఆయిల్ నిప్పురవ్వలపై చేసి అందిస్తున్నారు. బొంగు చికెన్ నార్మల్ రూ.180కి, బటర్ అయితే రూ.200, కబాబ్ రూ.100కి ఐదు పీస్లు, పోహవింగ్స్ రూ.20కినాలుగు పీస్లు, చికెన్ పకోడా ప్లేట్ రూ.50గా అందిస్తున్నారు. ప్రారంభించి రెండు మాసాలు.... అందరిలా కాకుండా భిన్నంగా వ్యాపారం చేయాలనుకునేవాణ్ణి. పట్టణంలో లేని ఇతర ప్రాంతాల్లో ఆదరణ పొందుతున్న వైరటీ రకాలను అక్కడికి వెళ్లి నేర్చుకున్నాను. స్థానికంగా వ్యాపారం మొదలు పెట్టి రెండు నెలలు అవుతోంది. వెజ్, నాన్వెజ్లో పలు రకాల వెరైటీలను అందిస్తున్నాను. వెజ్లో పోహవింగ్స్, నాన్ వెజ్లో చికెన్ కబాబ్, బొంగు చికెన్, చికెన్ పకోడా అందుబాటులో ఉంటాయి. పట్టణ ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఆర్డర్పై చేయించుకుంటున్నారు. చికెన్ కర్రీని ఆర్డర్పై సైతం చేసి అందిస్తాం. – నవీన్, నిర్వాహకుడు -
బిజినెస్ రంగంలో నయా ట్రెండ్..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని శివార్లలోని ఆదిభట్ల ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేసే వెంకటేశ్వర్రావు అదనపు ఆదాయం కోసం వ్యాపార మార్గం పట్టాడు. అన్నిరంగాల వారికి అవసరమయ్యే పని అయితే ఆదరణ ఉంటుందని గుర్తించి.. రెస్టారెంట్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనను తన తోటి నలుగురు సహచరులకూ చెప్పాడు. జీతానికి తోడుగా మరింత ఆదాయం సంపాదించవచ్చనే వారూ ముందుకు వచ్చారు. తలా రూ.5 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టి రెస్టారెంట్ ప్రారంభించారు. ఇలా కేవలం వెంకటేశ్వర్రావు, అతడి స్నేహితులు మాత్రమేకాదు.. హైదరాబాద్లో ఎంతో మంది ఐటీ ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం బిజినెస్ అడుగులు వేస్తున్నారు. అందులో కొందరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతుంటే.. మరికొందరు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు వంటివి ప్రారంభిస్తున్నారు. ఇలా ‘అదనపు’ మార్గం పడుతున్నవారిలో సగం మంది వరకు కేవలం తమ వాటా పెట్టుబడి పెట్టి, లాభాలు పంచుకుంటుండగా... మిగతావారు నేరుగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఇక బ్యాంకు రుణాలతో ఇళ్లు కొనుగోలు చేసి, అద్దెకివ్వడం.. ఈ అద్దె సొమ్ముతోనే రుణ వాయిదాలు కట్టేసి ఇళ్లు సొంతం చేసుకోవడం వంటివి చేస్తున్నవారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సగం మందికిపైగా.. హైదరాబాద్లోని ఐటీ సంస్థల్లో సుమారు 6 లక్షల మంది వరకు ఉద్యోగులు ఉన్నట్టు అంచనా. ఇందులో సగం మందికిపైగా తమ ఉద్యోగానికి తోడు అదనపు సంపాదన మార్గంపై దృష్టి సారించారని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ఇందులో చాలా మంది తమ ఆదాయాన్ని మంచి రాబడులు ఇచ్చే పెట్టుబడులకు, భూములు, ఇళ్ల కొనుగోళ్లకు మళ్లిస్తుండగా.. కొందరు నేరుగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఐదారుగురు టెకీలు కలసి హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు వంటివి నెలకొల్పుతున్నారు. ముఖ్యంగా టెకీల్లో సగం మంది వరకు స్టాక్ మార్కెట్లో, పెద్దగా రిస్కు లేని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. మరో 20 శాతం మంది వరకు రియల్ ఎస్టేట్, ఫ్లాట్లు, ఇళ్ల, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, ఐస్క్రీం పార్లర్లు వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతున్నారు. నలుగురు కలసి.. వరంగల్కు చెందిన వెంకటేశ్వర్రావు అనే టెకీ.. ముగ్గురు సహచరులతో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. నలుగురు కలసి తలా పది లక్షలు వేసుకుని, బ్యాంకుల నుంచి మరో రూ.24 లక్షలు రుణం తీసుకుని పెట్టుబడి పెట్టారు. రూ.60 లక్షలతో శామీర్పేట ప్రాంతంలో ఎకరం భూమిని కొనుగోలు చేసి.. విల్లాల కోసం డెవలప్మెంట్కు ఇచ్చారు. ఏడాది తిరిగేలోపు అక్కడ భూమి విలువ పెరగడంతోపాటు విల్లాల నిర్మాణం కూడా పూర్తయ్యే దశకు వచ్చింది. దానిని విక్రయించడంతో వారికి పెట్టుబడి పోను ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున లాభం వచ్చింది. ఇలా చాలా మంది టెకీలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. మరికొందరు సొంతంగా ఫ్లాట్ల బిజినెస్ చేస్తున్నారు. కొందరు తమ వద్ద ఉన్న సొమ్ముతో, బ్యాంకు రుణాలతో ఇళ్లను కొనుగోలు చేసి.. అద్దెకు ఇస్తున్నారు. ఆ అద్దెలనే రుణ వాయిదాలుగా చెల్లిస్తూ.. ఇళ్లను సొంతం చేసేసుకుంటున్నారు. ఇంకొందరు బిల్డర్లకు పెట్టుబడిగా డబ్బులు సమకూర్చి.. లాభాల్లో 10 శాతం వరకు వాటాగా తీసుకుంటున్నారు. ‘ఫుడ్’ వ్యాపారాలే ఎక్కువ.. చాలా మంది టెకీలు.. పెట్టుబడి తక్కువగా ఉండటం, సులభంగా వ్యాపారం చేయగలగడం, నష్టాలు వచ్చే అవకాశాలు లేకపోవడంతో రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల వంటి వ్యాపారాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇలా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండే ఆదిభట్ల, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో.. రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, కెఫేల వంటివాటిని ప్రారంభించారు. నలుగురైదుగురు కలసి ఒక్కొక్కరు రూ.రెండు మూడు లక్షల వరకు పెట్టుబడులు పెట్టి.. ఈ వ్యాపారాలు పెడుతున్నారు. ఎవరైనా తెలిసినవారిని పెట్టుకుని వాటిని నడిపిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వెళ్లి వాటిని చూసుకుంటున్నారు. కొందరు టెకీలు బార్లు, పబ్బుల వంటివాటిల్లోనూ పెట్టుబడులు పెట్టి.. వాటాలు తీసుకుంటున్నారు. ఐస్క్రీమ్లు.. మిల్క్ షేక్లు.. హైదరాబాద్లోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో టెకీగా పనిచేసిన శివప్రసాద్ కొత్త కాన్సెప్ట్తో వ్యాపారంలోకి దిగారు. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడల్లో మిల్క్షేక్, షేకెన్ స్లైస్ పేరుతో ఔట్లెట్లు ప్రారంభించారు. ఒక్కోదానికి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టగా.. రోజుకు రూ.30 వేల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. అందులో రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు లాభం ఉంటోందని శివప్రసాద్ చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్లోనూ రెండు ఔట్లెట్లు పెట్టేందుకు శివప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. ఇక బాగా క్రేజ్ ఉన్న ఐస్క్రీమ్ పార్లర్లవైపు కూడా టెకీలు దృష్టి సారించారు. ఖమ్మంకు చెందిన రమేశ్ రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టి జూబ్లీహిల్స్లోని ఓ ప్రముఖ ఐస్క్రీం పార్లర్లో 20శాతం వాటా తీసుకున్నారు. హోం డెలివరీ చేయడానికి ఓ ప్రత్యేకమైన యాప్ సైతం తయారు చేయించారు. ఆయన పదో తరగతి స్నేహితులు వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. వేతనాల్లో పెరుగుదల తక్కువగా ఉండటంతోనూ.. ఐటీ ఉద్యోగాల్లో భారీగా వేతనాలు అందడం వాస్తవమే అయినా.. కొంతకాలంగా వేతనాల్లో పెరుగుదల తక్కువగా ఉంటోందని కొందరు టెకీలు పేర్కొంటున్నారు. కొన్నేళ్ల కింద ఏటేటా వేతనాల పెరుగుదల భారీగా ఉండేదని.. ఇప్పుడు ఏటా ఐదు నుంచి పది శాతం మేర మాత్రమే వేతనాలు పెరుగుతున్నాయని అంటున్నారు. దీనికితోడు తమ ఆదాయాన్ని మంచి పెట్టుబడిగా పెట్టి.. మరింత ఆదాయం పొందాలన్న ఆలోచన కారణంగా వ్యాపారాల వైపు దృష్టి సారిస్తున్నట్టు చెబుతున్నారు. -
తదుపరి టార్గెట్.. మెక్ డోనాల్డ్స్!
పతంజలి ఆయుర్వేద పేరుతో మార్కెట్లో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న యోగా గురు బాబా రాందేవ్.. ఇప్పుడు బహుళ జాతీయ ఫుడ్ చైన్ మెక్ డోనాల్డ్స్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దాంతోపాటు కేఎఫ్సీ, సబ్వే రెస్టారెంట్లను కూడా టార్గెట్ చేసేలా ఉన్నారు. కొత్తగా రెస్టారెంటు వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టి.. అసలైన భారతీయ వంటకాలను అందించడం ద్వారా వాటి వ్యాపారాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెస్టారెంట్ల చైన్ ఓపెన్ చేయాలని పతంజలి గ్రూపు తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని రాందేవ్ స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే టూత్ పేస్టు నుంచి రకరకాల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి.. వాటికి మంచి ఆదరణ కూడా పొందిన పతంజలి సంస్థ.. ఇప్పుడు మూలికలు, ప్రత్యేకంగా శరీరానికి మేలుచేసే పదార్థాలతో కూడిన ఆహారాన్ని భారతీయులకు అందించాలని భావిస్తోంది. పతంజలి బిస్కట్ల లాంటి వాటికి ఇప్పటికే చాలామంది అభిమానులు ఉన్నారు. దాంతో ఇప్పుడు ఫుడ్ రీటైలింగ్లోకి అడుగుపెడితే కచ్చితంగా మిగిలినవాళ్లకు గట్టి పోటీ ఇవ్వగలమన్న విశ్వాసాన్ని పతంజలి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో జరుగుతున్న మొత్తం రీటైల్ వ్యాపారంలో 57 శాతం వాటా ఆహార ఉత్పత్తులదే. 2025 నాటికి ఈ మార్కెట్ మూడు రెట్లు పెరిగి దాదాపు రూ. 71 లక్షల కోట్లు అవుతుందని అంచనా. డామినోస్ పిజ్జా లాంటి చాలామంది ఈ రంగంలో ఇప్పటికే పాతుకుపోయి ఉన్నారు. అయినా అవసరమైతే ఎంత పెట్టుబడి అయినా పెట్టి మరీ ఆహార వ్యాపారాన్ని కొల్లగొట్టాలన్నది రాందేవ్ వ్యూహంలా కనిపిస్తోంది. భారతీయులకు అనారోగ్యకరమైన ఆహారాన్ని అందించడం ఎందుకని.. ఆహారంతో పాటే ఆరోగ్యాన్ని కూడా ఇస్తే మంచిది కదా అని ఆయన అంటున్నారు. ఆహార పదార్థాలు, పౌష్టిక పదార్థాలు, సౌందర్య సాధనాలు.. వీటన్నింటికీ ఉన్నట్లే రీటైల్ ఫుడ్ చైన్లకు కూడా మంచి గిరాకీ ఉంటుందని ఆశిస్తున్నారు. -
నాడు పూటకూళ్ల ఇళ్లు.. నేడు ఇంటర్నెట్టే వంటిల్లు!
ఒక్క క్లిక్తో ఇంటికే కోరుకున్న ఆహారం ఇప్పుడంటే కాలు బయటపెడితే వీధికో హోటల్.. ఆ కాలు కూడా బయటపెట్టనివారికి ఎన్నో సైట్లు.. యాప్లు.. ఒక్క క్లిక్తో కోరుకున్న ఫుడ్డు రెక్కలు కట్టుకొని మరీ ఇంటికి వచ్చేస్తోంది..! ఆహార వ్యాపారం మూడు పువ్వులు.. ముప్పయ్యారు కాయల్లా విస్తరించింది. ఇది ఇప్పుడు. మరి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి పరిస్థితి ఎలా ఉండేది? ఆ రోజుల్లో భోజనం ఏమాత్రం వ్యాపారం కాదు. మానవతా దృక్పథంతో చేసే ఓ కార్యక్రమం. ఆ రోజుల్లో చదువుకోవడానికి వెళ్లే వారు.. ఓ సుబ్బమ్మ, ఓ రమణమ్మ, ఓ వెంకమ్మ.. పేరు ఏదైనా వారి ఇళ్లలో పూటకూళ్లు తింటూ చదువుకునేవారు. మహాత్మాగాంధీ కూడా పోర్బందర్ విడిచి వెళ్లినపుడు ఇలా పూటకూళ్ల ఇళ్లలో తిన్నవారే. ఎందరో తమ సొంత డబ్బులతో అన్నదానం చేసి ఔదార్యం చాటుకునేవారు. పూటకూళ్లు పెట్టేవారు. విస్తరేసి.. అంబలి, సంకటి, జొన్న రొట్టెలు, గోంగూర పచ్చడి, ఎర్రకారం, గడ్డ పెరుగుతో కొసరి కొసరి వడ్డించే వారట. తిండి తిన్న వారు జేబులో ఉన్న అణానో, పైసానో ఇచ్చి వెళ్లేవారు. అదీ లేని వారు ‘అన్నదాతా.. సుఖీభవా’ అంటూ ఆశీర్వదించిపోయే వారు. నాడు డబ్బులివ్వలేదని నేటిలా పిండి రుబ్బించడమో.. పోలీసులకు పట్టించడమో చేసే వారు కాదు. ఇప్పుడా ఆప్యాయత లేదు.. విస్తరాకు భోజన మూ లేదు! అయితే తిరుపతి నగరంలో మాత్రం పూటకూళ్ల ఇళ్లు ఇప్పటికీ ఉండటం విశేషం. ఆకట్టుకునే పేర్లతో మెస్లు, హోటళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. గోంగూర, వంకాయ, వంటిల్లు, అరిటాకు, తాలింపు, సొంతిల్లు, చట్నీస్, మిస్టర్ ఇడ్లీ, దస్ వెరైటీస్ దోశ, అప్పడం, తృప్తి, సంతృప్తి.. తదితర పేర్లతో వెలసిన హోటళ్లు వెజ్జూ.. నాన్ వెజ్జూలో సవాలక్ష రకాల ఐటమ్స్తో వంటకాలు వండి వారుస్తున్నాయి. ‘ఆన్లైన్లో భోజనం’ కూడా హల్చల్ చేస్తోంది. కోరుకుంది తెచ్చేందుకు స్విగ్గీ, ఫుడ్పాండ, జొమాటో.. తదితర సైట్లతోపాటు ప్రత్యేక యాప్లు పుట్టుకొచ్చాయి. -
ఐఐటీలో చదివి.. రెస్టారెంట్ పెట్టిన కుర్రోళ్లు!!
వాళ్లిద్దరూ ఐఐటీ ఖరగ్పూర్లో చదివారు. అంతర్జాతీయ కంపెనీల నుంచి భారీ వేతనాలతో మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ, వాటన్నింటినీ కాదని వాళ్లు రాజస్థాన్లోని కోటాలో ఐఐటీ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల కోసం టిఫిన్ సెంటర్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. బికనీర్కు చెందిన పంకజ్, ఆచల్ అనే ఈ ఇద్దరూ మొదట అక్కడ కోచింగ్ తీసుకునేటప్పుడు సరైన తిండి దొరక్క చాలా ఇబ్బందులు పడ్డారు. ఆహారంలో ఏమాత్రం నాణ్యత లేకపోవడం ఒక సమస్య అయితే, కావల్సిన సమయానికి ఆహారం దొరక్కపోవడం మరో సమస్య. అందుకే.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ఆహారం, సరైన సమయానికి.. అదికూడా సరసమైన ధరలకు అందించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుందని, అటు విద్యార్థుల సమస్యలు తీరడంతో పాటు తమ ఆదాయం కూడా బాగుంటుందని భావించారు. ముందుగా అన్నిరకాల అంచనాలు వేసుకుని.. వెంటనే ఈ సంవత్సరం జనవరి నెలలో తమ హోటల్ ప్రారంభించారు. అప్పుడే తమకు 250 మంది రెగ్యులర్ కస్టమర్లున్నారని వీళ్లిద్దరూ చెబుతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా తమ హోటల్ చైన్ మొదలుపెట్టాలని వీళ్లు భావిస్తున్నారు. మాగ్మా ఫిన్కార్ప్, స్క్వైర్ లాంటి అంతర్జాతీయ కంపెనీల నుంచి భారీ ప్యాకేజీలతో వచ్చిన ఆఫర్లను కూడా వాళ్లు తిరస్కరించారు.