Godfather
-
గాడ్ ఫాదర్ సీక్వెల్ ఉండబోతుందా..?
-
చూపు... రీమేక్ వైపు...
ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలు మరో భాషలో రీమేక్ కావడం సాధారణమే. అయితే పాన్ ఇండియా ఫార్ములా వచ్చిన తర్వాత కూడా రీమేక్ మంత్రం వెండితెరపై వినిపిస్తోంది కొందరు తారలు రీమేక్ చిత్రాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. రీమేక్ చిత్రాలవైపు ఓ చూపు చూస్తున్న ఆ స్టార్స్పై ఓ లుక్ వేయండి. మలయాళ హిట్ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్ఫాదర్’లో ఇటీవల చిరంజీవి నటించిన విషయం తెలిసిందే. మరో రీమేక్ ‘బోళా శంకర్’లో కనిపించనున్నారాయన. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్గా తమన్నా, చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. 2015లో అజిత్ హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు రీమేక్గా ‘బోళా శంకర్’ తెరకెక్కుతోందని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేయాలను కుంటున్నారు. మరోవైపు మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ (2019) తెలుగు రీమేక్ రైట్స్ను దక్కించుకున్నారు హీరో–నిర్మాత మంచు విష్ణు. మోహన్బాబు మెయిన్ లీడ్ రోల్లో ఈ సినిమా తెరకెక్క నుందని సమాచారం. అలాగే మరో మలయాళ చిత్రం ‘పొరింజు మరియం జోస్’ (2019) తెలుగులో రీమేక్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నాగార్జున హీరోగా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వం వహిస్తారట. ఇక హీరో పవన్ కల్యాణ్ కెరీర్లోని రీమేక్ చిత్రాల్లో తమిళ చిత్రం ‘తేరి’ కూడా చేరనుందని టాక్. ఈ సినిమాకు దర్శకుడిగా తొలుత సుజిత్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల హిట్ సాధించిన తమిళ చిత్రాల్లో ఒకటైన ‘మానాడు’ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దగ్గర ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తారని ప్రచారం జరిగినా, ఆ తర్వాత రవితేజ, సిద్ధు జొన్నలగడ్డల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ నిర్మాణ భాగస్వామిగా ‘లక్కీ కీ’ అనే సౌత్ కొరియన్ మూవీ తెలుగు తెరపైకి రానుంది. ఇందులో సమంత ఓ లీడ్ రోల్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా మలయాళ హిట్ ఫిల్మ్ ‘హెలెన్’ తెలుగులో ‘బుట్ట బొమ్మ’గా రూపొందుతోంది. అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ హీరోలుగా నటిస్తున్నారు. శౌరి చంద్ర శేఖర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. ఇంకా తమిళ హిట్ ఫిల్మ్ ధనుష్ ‘కర్ణన్’ తెలుగులో రీమేక్ కానున్నట్లు, ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించ నున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలు ‘నాయట్టు’, ‘డ్రైవింగ్ లైసెన్స్’, ‘బ్రో డాడీ’, తమిళ చిత్రం ‘వినోదాయ చిత్తమ్’, హిందీ ‘డ్రీమ్ గాళ్’, ‘దే దే ప్యార్ దే’ ‘బదాయీ దో’ వంటివి కూడా తెలుగులో రీమేక్ అయ్యే అవకాశం ఉంది. ఇవే కాదు.. ఈ రీమేక్ జాబితాలో మరికొన్ని చిత్రాలు చేరతాయి. -
‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్?
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మలయాళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్లు కీ రోల్ పోషించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. చదవండి: ఓటీటీకి వచ్చేసిన ది ఘోస్ట్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు గాడ్ ఫాదర్ ఓటీటీ రైట్స్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఈ మూవీని అందుబాటులోకి తెచ్చేందుకు నెట్ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోందట. అంతేకాదు ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 19 నుంచి గాడ్ ఫాదర్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. -
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ టైటిల్ వెనుక ఇంత కథ ఉందా?
ఒక సినిమా జనాల్లోకి వెళ్లడానికి టైటిల్ చాలా ఉపయోగపడుతుంది. కొన్ని టైటిల్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తాయి. అలాంటి వాటిల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం..మలయాళ సూపర్ హిట్ లూసీపర్కి తెలుగు రీమేక్. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదదలైన ఈ చిత్రం.. సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ సినిమా టైటిల్ చిరంజీవి స్టార్డమ్కి చక్కగా సరిపోయింది. అయితే మొదట ఈ సినిమాకు వేరే టైటిల్ అనుకున్నారట. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ టైటిల్ని సూచించారట. తాజాగా ఈ విషయాన్ని తమన్ ఓ ఇంటర్వూలో తెలిపారు. (చదవండి: సినిమా ఛాన్స్.. ఇంటికి పిలిచాడు.. దర్శకుడి బాగోతం బయటపెట్టిన నటి) ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ అంతా సర్వాంతర్యామి వర్కింగ్ టైటిల్తో పూర్తయింది. ఈ సినిమా కథని హీరో డార్క్లో నుంచి జరుపుతున్నాడు. అది మనకు తెలియదు. అన్ని సీన్స్లో బ్రహ్మా(చిరంజీవి) ఉండరు. కానీ ఆయన గురించే మాట్లాడుకుంటారు. అందుకే నాకు దేవుడిలా అనిపించాడు. ఇంగ్లీష్ టైటిల్ పెడితే బాగుంటుదనిపించి ‘గాడ్ ఫాదర్’ సూచించాను. సెంటిమెంట్ పరంగా కూడా కలిసిసొస్తుందని చిరంజీవికి ఊరికే చెప్పాను. గతంలో మీరు నటించిన గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు టైటిల్స్ లెటర్ జీ(G )తో మొదలయ్యాయి. బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి అని చిరంజీవితో అనడంతో.. ఆయన కూడా ఓకే చెప్పేశాడు’అని తమన్ చెప్పుకొచ్చాడు. అయితే గాడ్ ఫాదర్ టైటిల్ విషయంలో హాలీవుడ్ నుంచి అభ్యంతరం వ్యక్తం అయిందట. దీంతో నిర్మాతలకు వారి నుంచి అనుమతి తీసుకున్నారట. సినిమా విడుదలక వారం ముందు ఓన్ఓసీ లభించినట్లు నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెప్పారు. -
కాస్టింగ్ కౌచ్పై స్పందించిన బిగ్బాస్ దివి..
బిగ్బాస్ బ్యూటీ దివి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్బాస్ సీజన్ 4లో హౌజ్లో అడుగుపెట్టిన ఆమె తనదైన ఆట తీరు, ముక్కుసూటి తనంతో అందరిని ఆకట్టుకుంది. ఉన్నది కొద్ది రోజులైన హౌజ్లో తనదైన మార్క్ వేసుకుంది. హౌజ్ నుంచి బయటకు వచ్చాక దివి వరుస సినిమా ఆఫర్లు అందుకుంటుంది. హీరోయిన్గా ప్రస్తుతం ఆమె ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్బాస్ 4 సీజన్ ఫినాలేకు అతిథిగా వచ్చిన చిరు.. దివికి తన సినిమాల్లో ఆఫర్ ఇస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: నయన్ సరోగసీ వివాదం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం? చెప్పినట్టుగానే దివికి గాడ్ఫాదర్లో ఓ కీ రోల్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు చిరు. ఇందులో దివి రేణుకగా నటించి మెప్పించింది. ఈ మూవీ ఇప్పుడు బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఈనేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్లో చానల్తో దివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమెకు కాస్టింగ్ కౌచ్పై ప్రశ్న ఎదురైంది. మోడల్గా ఎప్పుడో కెరీర్ మొదలు పెట్టిన మీరు ఇప్పుడు నటిగా ఫుల్ బిజీ అయ్యారని, ఈ ప్రయాణంలో ఎప్పుడైన కాస్టింగ్ కౌచ్ను ఎదుర్కొన్నారా? అని యాంకర్ ప్రశ్నించారు. చదవండి: సైలెంట్గా పెళ్లి చేసుకోబోతున్న బిగ్బాస్ బ్యూటీ! వరుడు అతడేనా? దీనిపై దివి స్పందిస్తూ.. ‘ఇప్పటివరకు నేను కాస్టింగ్ కౌచ్ను ఫేస్ చేయలేదు. మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్.. ఇలా నాకు వచ్చిన అవకాశాలను చేస్తూ వచ్చాను. అందుకే అలాంటి సమస్యలు నాదాకా రాలేదనుకుంటా. మన ప్రవర్తన బట్టి ఎదుటివారు ప్రవర్తిస్తుంటారు. వారెవరికీ నా గురించి కానీ, నాతో మాట్లాడే ఛాన్స్ నేను ఇవ్వలేదు. అయితే ఇద్దరు(ఒక అమ్మాయి-అబ్బాయి) ఒకరినొకరు ఇష్టపడి కమిట్ అవ్వడంలో అభ్యంతరం లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువగా అదే జరుగుతోంది” అని చెప్పుకొచ్చింది దివి. -
‘గాడ్ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ ఈ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా గాడ్ఫాదర్ చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాను బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. గాడ్ఫాదర్ చూసి రజనీకాంత్ తన రివ్యూ ఇచ్చారని, ఇది తనకు బెస్ట్ మూమెంట్ అంటూ డైరెక్టర్ మోహన్ రాజా ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్! ఈ మేరకు మోహన్ రాజా ట్వీట్ చేస్తూ.. ‘సూపర్ స్టార్ ‘గాడ్ఫాదర్’ సినిమా చూశారు. ఈ మూవీ చాలా చాలా బాగుంది అన్నారు. ప్రత్యేకంగా తెలుగు వెర్షన్ కోసం చేసిన అనుసరణలు అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. ధన్యవాదాలు తైలవా(రజనీకాంత్) సార్, నా జీవితంలోని అత్యుత్తమ క్షణాలలో ఇది ఒకటి’ అంటూ మురిసిపోయాడు. కాగా డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలకపాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. Superstar watched #Godfather 😇 Excellent!! very nice!! very interesting!!! are few of the remarks in his detailed appreciation on the adaptions made for the Telugu version. Thank u so much Thalaiva @rajinikanth sir, one of the best moments of life.. means a lotttt 🙏 pic.twitter.com/AFdT7oOoBe — Mohan Raja (@jayam_mohanraja) October 10, 2022 -
ఆ వార్తలు మాకు చిరాకు కలిగించాయి : మీడియాపై చిరు అసహనం
ఒక సినిమాను ఎప్పుడు ప్రమోట్ చేయాలి? ఏ సినిమాను ఎక్కడ హైప్ చేయాలి? అనే విషయాలు దర్శకనిర్మాతలకు తెలియదా? మేం ఏం చేయాలో కూడా మీరే( మీడియా) నిర్ణయిస్తే ఎలా? అని మీడియాపై మెగాస్టార్ చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. గాడ్ఫాదర్ భారీ విజయం సాధించడంతో శనివారం చిత్ర యూనిట్ హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘గాడ్ఫాదర్’ని ఒరిజినల్ లూసిఫర్ కంటే బెటర్గా చేశాం. మా టీమంతా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఆ సమయంలో మీడియాలో వచ్చే కొన్ని వార్తలు మాకు చిరాకు కలిగించాయి. సినిమాను సరిగా ప్రమోట్ చేయడం లేదని, హైప్ లేదని వార్తలు రాశారు. మేం ఏం చేయాలో కూడా మీరే నిర్ణయిస్తే ఎలా? అని చిరంజీవి ప్రశ్నించారు. (చదవండి: అలాంటివాడిని కూడా ఇంటికి ఆహ్వానించాడు..అది చిరంజీవి సంస్కారం) ‘గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్షం పడినప్పటికీ నేను స్పీచ్ ఇచ్చాను. ఒకవేళ నేను మాట్లాడకపోతే మీడియా మరోలా వార్తలు రాసి కంపు చేసేదనే భయంతో ఆ రోజు స్పీచ్ ఇచ్చాను. కానీ అదే మీడియా.. ఈ సినిమా బాగుందనే టాక్ వచ్చిన తర్వాత గాడ్ఫాదర్ గురించి అత్యద్భుతంగా రాసి మమల్ని ఎంకరేజ్ చేసింది. ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి, ప్రతి ఒక్కరు ఈ చిత్రం గురించి మాట్లాడుకునేలా చేసిన మీడియాకు కృతజ్ఞతలు’అని చిరంజీవి అన్నారు. -
అలాంటివాడిని కూడా ఇంటికి ఆహ్వానించాడు..అది చిరంజీవి సంస్కారం
దసరా సందర్భంగా హైదరాబాద్లక్ష హరియాణా గవర్నర్ బండారు దత్తత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ వేడుకలో చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో గరికపాటి మాట్లాడుతుంటే.. అక్కడ జనాలు పట్టించుకోకుండా చిరంజీవితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూశారు. దీంతో ఆగ్రహించిన గరికపాటి.. చిరంజీవి ఫోటో సెషన్ ఆపేసి స్టేజ్ మీదకు రాకుంటే..తాను వెళ్లిపోతానని హెచ్చరించాడు. ఈ వ్యాఖ్యలు చిరంజీవి అభిమానులను బాధించాయి. నాగబాబుతో సహా మెగా అభిమానులంతా గరికపాటిపై దండెత్తారు. సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేశారు. చివరకు చిరంజీవికి గరికపాటి క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం చల్లారలేదు. (చదవండి: గాడ్ఫాదర్ ఆ రేంజ్ బ్లాక్బస్టర్: చిరంజీవి) తాజాగా ప్రముఖ ఛాయగ్రాహకుడు ఛోటా కె. నాయుడు కూడా గరికపాటిపై ఫైర్ అయ్యాడు. శనివారం జరిగిన ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ మీట్లో ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ.. ‘ఇండియన్ స్క్రీన్ పై చిరంజీవిగారితో పోలిక పెట్టడానికి ఎవరూ సరిపోరు. ఆల్ స్టార్స్ చిరంజీవిగారే. రీసెంట్గా అభిమానంతో ఫోటోలు తీసుకుంటుంటే... ఆయన ఎవరో.. మాట్లాడేవాడు మహాపండితుడు(గరికపాటి). ఆయన అలా మాట్లాడవచ్చా అండీ. అది తప్పు కదా. అలాంటివాడిని కూడా చిరంజీవి ఇంటికి ఆహ్వానించారు. అది కదా సంస్కారం. ఇది కదా మేం నేర్చుకుంటున్నాం’ అని అన్నారు. ఛోటా కె. నాయుడు అలా మాట్లాడుతున్న సమయంలో చిరంజీవి చేతులెత్తి నమస్కారం పెట్టారు. -
'గాడ్ఫాదర్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
థియేటర్లో టపాసులు కాల్చిన ఫ్యాన్స్, వీడియో వైరల్
చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరీ జగన్నాథ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. రామ్చరణ్, ఆర్బీ చౌదరి నిర్మించారు. మలయాళ హిట్ మూవీ లూసిఫర్కు రీమేక్గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా స్క్రీనింగ్లో సల్లూభాయ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. థియేటర్లో 'తార్మార్..' పాట ప్లే అవుతున్న సమయంలో కొందరు అభిమానులు టపాసులు కాల్చారు. దీంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు ఇదెక్కడి మాస్ రా మావా అంటూ కామెంట్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా గతంలో సల్మాన్ నటించిన అంతిమ్ మూవీ రిలీజైనప్పుడు కూడా అభిమానులు ఇలానే చేశారు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్.. అలాంటి పనులు చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. కానీ గాడ్ఫాదర్ సినిమా విషయంలో మాత్రం హీరో మాటను సైతం లెక్క చేయకుండా మరోసారి థియేటర్లో టపాసులు కాల్చారు. Imagine what happen when tiger 3 release 🔥💥💥 Mass hysteria #SalmanKhan𓃵 #GodFather #Chiranjeevi pic.twitter.com/ZYJBcMFmyE — Abhishek❤️✨ (@salman_ka_abhi) October 8, 2022 చదవండి: గుణశేఖర్ కూతురి నిశ్చితార్థం నటిని షోరూమ్లో బంధించిన సిబ్బంది -
Godfather: చిరు మెచ్చాడు.. బ్లాక్ బస్టర్ కొట్టాడు
మెగాస్టార్ ఒక రీమేక్ మూవీలో నటిస్తున్నాడు అంటే ఆ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్. మెగా హిస్టరీ తీసి చూస్తే ఆ విషయం ఇట్టే అర్ధమైపోతుంది. ఠాగూర్, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీనంబర్ 150, ఇందుకు సింపుల్ ఎగ్జాంపుల్స్. కొంత బ్రేక్ తర్వాత చిరు మరో రీమేక్తో తిరిగొచ్చాడు. ‘గాడ్ ఫాదర్’గా మారి దసరాకి థియేటర్స్కు పూనకాలు తీసుకొచ్చాడు. ఖైదీ నంబర్ 150తో చిరు రీఎంట్రీ ఇచ్చింది మొదలు.. చిరు ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఒకప్పటి మెగాస్టార్ వేరు. ఇప్పుడు మన చూస్తున్న మెగాస్టార్ వేరు. అందుకే సైరా వచ్చింది. ఆ తర్వాత ఆచార్య విడుదలైంది. ఇప్పుడు గాడ్ ఫాదర్ వచ్చింది. ‘రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయలు నా నుంచి దూరం కాలేదు’ అనే డైలాగ్ గాడ్ ఫాదర్కు ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చింది. 2019 మలయాళం బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ తెలుగు రీమేకే ఈ గాడ్ ఫాదర్. లూసిఫర్ కథనం, పాత్రలపై మెగాస్టార్ మనసు పారేసుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు కూడా లూసిఫర్ స్టోరీ బాగా నచ్చింది. తన తండ్రి స్టీఫెన్ గట్టుపల్లి పాత్రలో నటిస్తే చూడాలనుకున్నాడు. అలా లూసిఫర్ తెలుగు రీమేక్ ప్రారంభమైంది. మాలీవుడ్లో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. అయినా ఈ మూవీని చిరు ఎందుకు రీమేక్ చేస్తున్నాడని చాలా మంది అనుకున్నారు. కానీ మెగాస్టార్ రీజన్స్ మెగాస్టార్కు ఉన్నాయి. ఏ సబ్జెక్ట్లో తాను నటిస్తే ఆడియెన్స్ రిసీవ్ చేసుకుంటారో, ఆయనకు తెల్సినంతగా మరెవరికి తెలియదు. ‘గాడ్ ఫాదర్’తో మరోసారి ఆ విషయం రుజువైంది. సైరాతో చాలా ఏళ్ల తర్వాత బాలీవుడ్ ఆడియెన్స్కు హాయ్ చెప్పారు చిరు. ఇప్పుడు గాడ్ఫాదర్తో మరోసారి బీటౌన్ ప్రేక్షకులను పలకరించాడు. అందుకు మెయిన్ రీజన్ సల్మాన్ ఖాన్, గా డ్ ఫాదర్ లో కీలకమైన పాత్రలో నటిం చడమే. గాడ్ ఫాదర్ మూవీతో తొలిసారి సల్మా న్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. పైగా చిరు చేసిన రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసి, ఈరోల్ చేశాడు. అందుకే అతనికి దాదాపు 20 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసాడట చిరు. కాని సల్మాన్ ఖాన్ సింపుల్గా 20 కోట్ల ఆఫర్ను రిజెక్ట్ చేసాడట. పైగా తన చిత్రంలో చిరు నటించాల్సి వస్తే, మీరు కూడా నన్ను రెమ్యునరేషన్ అడుగుతారా అంటు ఎదురు ప్రశ్నించాడట. సల్మాన్ తనపై చూపించిన ప్రేమను చూసి మెగాస్టార్ చలించిపోయారట. గాడ్ ఫాదర్కు ముందు ఈ మూవీకి బైరెడ్డి, రారాజు అనే టైటిల్స్ వినిపించాయి. అలాగే నయనతార పాత్రకు ఎంపిక చేసే ముందు సుహాసిని, విద్యాబాలన్ పేర్లు వినిపించాయి. గాడ్ ఫాదర్లో నయన్ సత్య ప్రియ పాత్రలో కనిపించింది. కేవలం 10 సినిమాల అనుభవం ఉన్న సత్యదేవ్ కు చిరు స్వయంగా ఫోన్ చేసి స్టోరీ అంతా చెప్పి సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించాల్సిందిగా కోరారట. గాడ్ ఫాదర్కు సంబధించి మరో విశేషం ఏంటంటే, ఫర్ ది ఫస్ట్ టైమ్ చిరు ఈ చిత్రంలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. -
బాలీవుడ్లో ‘గాడ్ ఫాదర్’ హవా.. 600 స్క్రీన్స్ పెంపు
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. హిందీలో గాడ్ ఫాదర్కు వస్తున్న రెస్పాన్స్తో అక్కడ మరో 600 స్క్రీన్స్ని పెంచినట్లు చిరంజీవి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. (చదవండి: వెనక్కి తగ్గా.. ఓడిపోలేదు.. సమంత పోస్ట్ వైరల్) ‘గాడ్ ఫాదర్’పై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి నా ధన్యవాదాలు. ఈ చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే రూ.69 కోట్ల వసూళ్లను రాబట్టినందుకు ఆనందిస్తున్నా. ఈ రోజు(అక్టోబర్ 8) నుంచి హిందీ బెల్ట్లో మరో 600 స్క్రీన్స్ని పెంచుతున్నాం. మా చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా చేసిన ప్రేక్షకులకు, నా అభిమానులకు ధన్యవాదాలు .జై హింద్’అని చిరంజీవి చెప్పుకొచ్చాడు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార ఇతర కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు. Another 600 screens added for #GodFather in Hindi 💥💥 Megastar @KChiruTweets thanks the audience for giving the HUMONGOUS BLOCKBUSTER 💥 -https://t.co/qO2RT7dqmM#BlockbusterGodfather 🔥@BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @ActorSatyaDev pic.twitter.com/R04HA1nm2c — Konidela Pro Company (@KonidelaPro) October 8, 2022 -
మెగా హిట్ ‘గాడ్ ఫాదర్’.. ఓటీటీ స్ట్రీమింగ్ అందులోనేనా?
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘గాడ్ ఫాదర్’ గురించే చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్కు తెలుగు రీమేక్ ఇది. తెలుగు ప్రేక్షకుల అభిరిచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి తెరకెక్కించాడు దర్శకుడు మోహన్ రాజా. (చదవండి: బాక్సాఫీస్పై ‘గాడ్ ఫాదర్’దండయాత్ర.. రెండో రోజూ భారీ కలెక్షన్స్) దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం..ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.69 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి మెగాస్టార్ సత్తాని మరోసారి ప్రపంచానికి చూపించింది. ఈ వారాంతంలో ఈజీగా రూ.100 కోట్ల క్లబ్లోకి చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్స్లో సందడి చేస్తున్న ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు ‘గాడ్ ఫాదర్’ డిజిటల్ రైట్స్ని దక్కించుకుందట. రూ. 57 కోట్లకు తెలుగు, హిందీ భాషల హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 8 వారాల తర్వాతే ఓటీటీలోకి ఈ చిత్రం రానుందట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజుల వరకు ఆగాల్సిందే. -
కోహినూర్ మెరుపు తగ్గొచ్చు కానీ వ్యాల్యూ తగ్గదు.. నాగబాబు ట్వీట్ వైరల్
ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి హిట్ కొట్టాడు. తమ అభిమాన హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించాలని చాలా కాలంగా మెగాస్టార్ అభిమానులు కోరుకుంటున్నారు. చిరు టైటిల్ పాత్రలో నటించిన సైరా, ఆచార్య చిత్రాలు ఆశించిన స్థాయిల్లో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో మెగా అభిమానులు కాస్త నిరాశ చెందారు. ముఖ్యంగా ఆచార్య ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇలాంటి తరుణంలో ‘గాడ్ ఫాదర్’తో భారీ హిట్ ఇచ్చాడు ‘అన్నయ్య’. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం.. తొలిరోజే రూ. 38 కోట్లు కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లో రూ.69 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మెగాస్టార్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. చాలా కాలం తర్వాత చిరంజీవి భారీ విజయం సాధించడంతో మెగా అభిమానులతో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్విటర్ వేదికగా ‘గాడ్ ఫాదర్’ విజయంపై స్పందిస్తూ చింజీవిని కొహినూర్ డైమాండ్తో పోల్చాడు. (చదవండి: బాక్సాఫీస్పై ‘గాడ్ ఫాదర్’ దండయాత్ర..రెండో రోజూ భారీ కలెక్షన్స్) ‘కోహినూర్ డైమండ్ కూడా కొన్నిసార్లు పాలీష్ తగ్గితే మెరుపు తగ్గొచ్చు కానీ దాని వాల్యూ ఎప్పుడు తగ్గదు .సరైన పాలీష్ (గాడ్ ఫాదర్ )పడితే కోహినూర్ డైమండ్ మిరుమిట్లు కొలిపే వెలుగు ని తట్టుకోవటం కష్టం’అంటూ నాగబాబు ట్వీట్ చేశాడు. మలయాళ మూవీ ’లూసీఫర్’కు తెలుగు రీమేకే ‘గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. కోహినూర్ డైమండ్ కూడా కొన్నిసార్లు polish తగ్గితే మెరుపు తగ్గొచ్చు కానీ దాని వేల్యూ ఎప్పుడు తగ్గదు .సరైన polish (గాడ్ ఫాదర్ )పడితే కోహినూర్ డైమండ్ మిరుమిట్లు కొలిపే వెలుగు ని తట్టుకోవటం కష్టం. — Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022 -
అమెరికాలో " గాడ్ ఫాదర్ " సక్సెస్ సెలబ్రేషన్స్
-
బాక్సాఫీస్పై ‘గాడ్ ఫాదర్’ దండయాత్ర.. రెండో రోజూ భారీ కలెక్షన్స్
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్ ఇది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం.. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. చాలా కాలం తర్వాత చిరంజీవి రేంజ్కి తగ్గ సినిమా రావడంతో ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ‘గాడ్ ఫాదర్’పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.38 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించిన ‘గాడ్ ఫాదర్’.. రెండో రోజు కూడా అదే దూకుడు ప్రదర్శించింది. రెండో రోజు వరల్డ్ వైడ్గా రూ.31 కోట్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాకు తొలి రోజు భారీ స్థాయిలో కలెక్షన్స్ రావడం సహజమే. సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ డేతో పోలిస్తే సెకండ్ డే 20 నుంచి 30 శాతం వసూళ్లు పడిపోతాయి. కానీ గాడ్ ఫాదర్ విషయంలో అలా జరగలేదు. రెండో రోజు కూడా భారీ వసూళ్లును సాధించి రికార్డు సాధించింది. రెండు రోజుల్లో మొత్తం రూ.69 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సినిమాకు హిట్ టాక్ రావడం, దసరా సెలవులు కొనసాగుతుండడంతో వీకెండ్లోగా ఈ సినిమా ఈజీగా రూ.100 కోట్ల మార్క్ను దాటేస్తుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. -
గాడ్ ఫాదర్ టీంతో స్పెషల్ చిట్ చాట్
-
గాడ్ఫాదర్ ఫస్ట్డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే
చిరంజీవి-మోహన్ రాజా కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్'. దసరా సందర్భంగా బుధవారం(అక్టోబర్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే హిట్ తెచ్చుకుంది. దీంతో తొలి రోజు ఈ మూవీ భారీగా వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ. 38 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో 20.9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. గాడ్ ఫాదర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే.. నైజాం: రూ. 3.25 కోట్లు ఉత్తరాంధ్ర: రూ. 1.25 కోట్లు సీడెడ్: రూ.3.05 కోట్లు నెల్లూరు: రూ.57 లక్షలు గుంటూరు: రూ.1.75 కోట్లు కృష్ణా జిల్లా: రూ.73 లక్షలు తూర్పు గోదావరి: రూ.1.60 కోట్లు పశ్చిమ గోదావరి: రూ.80 లక్షలు ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఏపీలో 6.70 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. 'గాడ్ ఫాదర్' సినిమాకు మొదటి రోజు 13 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు సమాచారం. -
Godfather Review: గాడ్ ఫాదర్ మూవీ రివ్యూ
టైటిల్: గాడ్ ఫాదర్ నటీనటులు: చిరంజీవి, సల్మాన్ఖాన్,నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్,తదితరులు నిర్మాతలు: రామ్ చరణ్, ఆర్.బీ చౌదరి దర్శకత్వం: మోహన్రాజా సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ : నీరవ్ షా ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేశ్ విడుదల తేది: అక్టోబర్ 5, 2022 కథేంటంటే ముఖ్యమంత్రి పి.కె రామదాసు అలియాస్ పీకేఆర్ అకాల మరణంతో జన జాగృతి పార్టీ(జేజేపీ) పెద్దల కన్ను సీఎం సీటుపై పడుతుంది. తదుపరి సీఎం కావాలని అతని అల్లుడు జైదేవ్(సత్యదేవ్) భావిస్తాడు. సీఎం సీటు కోసం పార్టీలోని కొంతమంది అవినీతిపరులతో చేతులు కలుపుతాడు. అయితే పీకేఆర్ సన్నిహితుడు, జేజేపీ పార్టీ కీలక నేత బ్రహ్మ తేజ(చిరంజీవి)మాత్రం జైదేవ్ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ సీఎం కాకుండా చేస్తాడు. దీంతో జైదేవ్ అతన్ని హత్య చేయించేందుకు కుట్రలు పన్నుతాడు. ఆ కుట్రలను బ్రహ్మ తేజ ఎలా తిప్పి కొట్టాడు. జైదేవ్ అసలు స్వరూపం భార్య సత్యప్రియ(నయనతార)కు ఎలా తెలిసింది? , అసలు బ్రహ్మ ఎవరు ? పీకేఆర్తో అతనికి ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో వచ్చిన మసూన్ భాయ్(సల్మాన్ ఖాన్) ఎవరు? చివరకు బ్రహ్మ ఎవర్ని ముఖ్యమంత్రిని చేశాడు? దాని కోసం ఎలాంటి పరిస్ధితులను ఎదురుకున్నాడు? అనేదే మిగతా కథ ఎలా ఉందంటే.. గాడ్ ఫాదర్ సినిమా మలయాళ హిట్ మూవీ లూసిఫర్కి రీమేక్. మోహన్ లాల్ నటించిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది. అంతేకాదు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అలాంటి సినిమాను ఎంచుకొని చిరంజీవి పెద్ద సాహసమే చేశాడు. కథపై నమ్మకంతో సినిమా చేశానని చెప్పాడు. చిరంజీవి నమ్మకం నిజమైంది. లూసిఫర్ చూసిన వాళ్లు కూడా గాడ్ ఫాదర్ని ఎంజాయ్ చేస్తారు. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మాతృకలో కొన్ని మార్పులు చేశాడు దర్శకుడు మోహన్ రాజా. తనదైన స్క్రీన్ప్లేతో అద్భుతంగా కథను ముందుకు నడిపించాడు. పీకేఆర్ మరణంతో సినిమా ప్రారంభం అవుతుంది. ప్రధాన పాత్రలను పరిచయం తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇద్దరు బలమైన,తెలివైన నాయకులు జైదేవ్(సత్యదేవ్), బ్రహ్మ(చిరంజీవి) ఆడే రాజకీయ చదరంగం అందరిని ఆకట్టుకుంది. ఇంటర్వెల్ ముందు చిరు పలికే డైలాగ్స్ ఫాన్స్ని ఈలలు వేయిస్తుంది. ఇక సల్మాన్ ఖాన్ ఎంట్రీతో సినిమా మరోస్థాయికి వెళ్తుంది. మసూద్ గ్యాంగ్ బ్రహ్మకు ఎందుకు సహాయం చేసింది?బ్రహ్మ నేపథ్యం ఏంటి.. చివరకు ఎవరిని సీఎం చేశారు?ఇలా సెకండాఫ్ సాగుతుంది. టిపికల్ నెరేషన్తో కొన్ని చోట్ల పొలిటికల్ డ్రామాను ఆకట్టుకునే విధంగా మలచలేకపోయాడు. హీరోయిజం ఎలివేషన్ మీదే ఎక్కువ దృష్టిపెట్టాడు. ప్రతి సీన్ చిరంజీవి అభిమానులను దృష్టిలో పెట్టుకొని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు అయితే అదిరిపోతాయి. ఎవరెలా చేశారంటే.. చిరంజీవి నటనకు వంక పెట్టాల్సిన పనిలేదు. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తాడు. బ్రహ్మతేజ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్లో కూడా అద్భుతంగా నటించాడు. తన అభిమాన హీరోతో స్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో సత్యదేవ్ రెచ్చిపోయి నటించాడు. విలన్ జైదేవ్ పాత్రకి వందశాతం న్యాయం చేశాడు. ముఖ్యంగా తన నిజ స్వరూపం గురించి నయనతార కు చెప్పే సన్నివేశంలో సత్యదేవ్ నటన చాలా బాగుంటుంది. అతిధి పాత్రలో సల్మాన్ ఖాన్ అదరగొట్టేశాడు. యాక్షన్ సీన్స్లో అద్భుతంగా నటించి మాస్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాడు. ముఖ్యమంత్రి పీకేఆర్ కూతురు, సత్యదేవ్ భార్య సత్యప్రియగా నయన తార తనదైన నటనతో ఆకట్టుకుంది. సునీల్, బ్రహ్మాజీ, పూరి జగన్నాథ్, షఫీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కే.వెంకటేశ్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
‘గాడ్ ఫాదర్’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్ ఇది. అప్పట్లో ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేశారు. తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. తెలుగులో డబ్ అయి, ఓటీటీలో అందుబాటులో ఉన్న సినిమాను మెగాస్టార్ మళ్లీ రీమేక్ చేయడంతో ‘గాడ్ ఫాదర్’పై అందరికి ఆసక్తి పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఎలా నటించారనే విషయం మీద సర్వత్రా అందరిలో ఆసక్తి నెలకొంది. దానికితోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాలు మధ్య నేడు(ఆక్టోబర్ 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. ‘గాడ్ ఫాదర్’తో చిరంజీవి మళ్లీ సూపర్ హిట్ కొట్టాడని నెటిజన్స్ అంటున్నారు. ‘బాస్ ఈజ్ బ్యాక్’అని ట్వీట్స్ చేస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అదిరిపోయిందని చెబుతున్నారు. మాతృకలో ఉన్న మెయిన్ పాయింట్ని చెడగొట్టకుండా తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా సినిమాలో భారీ మార్పులే చేశారని చెబుతున్నారు.ఇక మరికొంతమంది అయితే గాడ్ ఫాదర్ యావరేజ్ సినిమా అంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Better than Lucifer… Boss @KChiruTweets 👍🏻 & @ActorSatyaDev 👌🏻Thaman score good konni scenes ki… KCPD petti d’garu entra BGM laaga 😂 NajaBhaja Timber depot sequence 🔥 Just ahh makeup & hairstyle care tiskunte baundedi… #GodFather — 𝕽𝖆𝖛𝖎𝖎 (@Ravii2512) October 5, 2022 #Godfather A Good Political Action-Thriller that is a faithful remake which sticks true to the core but has changes that keep the proceedings engaging. Megastar and Thaman show all the way. Fine job of making changes without spoiling the core. Good One👍 Rating: 3/5 — Venky Reviews (@venkyreviews) October 4, 2022 Sare inka fact to be agreed so mana boss @KChiruTweets kuda hit kottesadu malli #GodFather tho 🔥🔥🔥🔥 . Congrats to the entire team and especially for mega fans 🤟🤟 !! #GodFatherOnOct5th #GodFatherReview pic.twitter.com/7ErWNcmrHP — Akash Raju 🔥🔥 (@Raju_SSMB) October 5, 2022 Lucifer movie telugu lo release ayipoyi andharu chusaru and chala mandiki anthaga ekkaledu kuda… ilanti movie ni remake chesi…andhari uuhalani thaar maar chesi, mee range lo hit talk vastundi ante @KChiruTweets 🔥🙏🏽 Boss is always beyond fans expectations #GodFather — Anudeep (@AnudeepJSPK) October 5, 2022 First half Good and Second Half Average 👍👍 @MusicThaman anna gattiga duty chesadu 🔥 Production values 👌👌 SatyaDev performance 💥💥 Boss lo aa timing miss avuthundi and dlgs kuda yedho cheppali annattu cheppadu 👍 Finally Average film 🙂 2.5/5 👍#GodFatherReview https://t.co/21gK3i9D7x — Gopi Nath NBK (@Balayya_Garu) October 4, 2022 Hearing blockbuster response all over 💥🔥😎 #Godfather ఆయన స్థాయి వేరు... ఆయన స్థానం వేరు..🦁 అక్కడ ఉన్నది Boss ra Bacchas After a Gap BOSS IS BACK! 👑@KChiruTweets #BlockBusterGodFather pic.twitter.com/HzESnXuY5F — Muzakir Ali (@Muzakirali_07) October 5, 2022 ఒక ఇంద్ర,tagore, స్టాలిన్,ఎలానో #godfather కూడ ఆ లిస్ట్ లో చేరిపోయింది.hatters kooda అంటారు మూవీ చూసిన తర్వాత #Lucifer కంటే #godfather బాగుంది అని, elevation scence Ki @MusicThaman ichina bgm🔥🔥🔥,ippudu ravalamma tollywood #mohanalal fans, — yuga cherry (@yuga_cherry) October 5, 2022 #Godfather Review: 3.75/5 Perfect and Pure Mass & Family Entatainer Chiranjeevi Swag is Next Level Sallu Bhai did his Roll Perfectly 👍👍#GodFatherReview pic.twitter.com/mN5cV1BD6a — Rusthum (@JanasenaniPK) October 4, 2022 #Godfather first half works 👍 Decent execution. ✅ 1st half review:#Chiranjeevi’s swag and elevation 👍 Satya Dev is brilliant Lot of Goosebump moments for fans !! BGM is spot on 👍 Very Engaging and high on drama Waiting for 2nd half #Salman’s magic#GodfatherReview — Santosh R. Goteti (@GotetiSantosh) October 5, 2022 -
చిరంజీవి ‘గాడ్ఫాదర్’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
కన్నీళ్లు తెప్పించే ఘటన.. ‘సినీ గాడ్ఫాదర్’ను కళ్లారా చూడాలని.. ఇంతలోనే
అనంతపురం సప్తగిరి సర్కిల్: మెగాస్టార్ చిరంజీవి అంటే నిలువెల్లా ఆ యువకుడికి అభిమానం. కళ్లారా చూడాలన్న తాపత్రయం. సినీ గాడ్ఫాదర్ను హైదరాబాద్ వెళ్లి చూసే అవకాశం ఎలాగూ ఉండదు. బుధవారం అనంతపురం వస్తున్నారని తెలిసి.. మిత్రుడిని వెంటబెట్టుకొని గుత్తి నుంచి ద్విచక్ర వాహనంపై ఆత్రంగా బయల్దేరాడు. మరో పదినిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటాడు. అంతలోనే గార్లదిన్నె వద్ద మృత్యువు అతన్ని ప్రమాద రూపంలో కబళించింది. చదవండి: గాడ్ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే? అయితేనేం అభిమానం “చిరంజీవి’గా వెలుగునివ్వాలని అతని కుటుంబ సభ్యులు భావించారు. నేత్రాలను దానం చేస్తే.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగునిస్తాడని భావించారు. అనుకున్నదే తడవుగా నేత్రాలను దానం చేశారు. గుత్తి పట్టణానికి చెందిన రాజశేఖర్ (22) కళ్లను అతని కుటుంబ సభ్యులు సాయిట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ద్వారా నేత్రాలను గురువారం సేకరించారు. కళ్లను సేకరించిన వారిలో సాయిట్రస్ట్ సభ్యులు విజయసాయి, నారాయణ, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి టెక్నీషియన్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
గాడ్ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే?
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: నగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బుధవారం జరిగిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జేబు దొంగలు రెచ్చిపోయారు. కేవలం గంట వ్యవధిలోనే 300 సెల్ఫోన్లను అపహరించారు. దీంతో ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాట్బాట్ సేవలకు 24 గంటల వ్యవధిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చదవండి: కట్టుకున్నవాడు ఖతం.. ప్రియుడు, కూతురితో కలిసి.. దాదాపు 270 మందికి పైగా తమ సెల్ఫోన్లు అపహరణకు గురైనట్లు చాట్బాట్కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అలాగే అనంతపురం త్రీటౌన్ పోలీసు స్టేషన్కు 20, టూటౌన్ పోలీసు స్టేషన్కు 18 రాతపూర్వక ఫిర్యాదులు అందాయి. -
Godfather Pre Release Photos: అనంతపురంలో ‘గాడ్ఫాదర్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
అనంతపురం: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్ ఫాదర్’
గార్లదిన్నె(అనంతపురం జిల్లా): అనంతపురం వేదికగా బుధవారం నిర్వహించిన ‘గాడ్ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషాదాన్ని మిగిల్చింది. తమ అభిమాన హీరోని చూడాలన్న ఆత్రుత ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాలు.. గుత్తి మండలం చెర్లోపల్లికి చెందిన రాజశేఖర్(23), అభిరామ్ స్నేహితులు. వీరికి చిరంజీవి అంటే చెప్పలేనంత అభిమానం. చదవండి: కేబుల్ బ్రిడ్డి వద్ద టెన్షన్.. దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య! దీంతో అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న గాడ్ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై కుక్క అడ్డు రావడంతో వేగాన్ని నియంత్రించుకోలేక అదుపు తప్పి కిందపడ్డారు. రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్పంగా గాయపడ్డ అభిరామ్ను స్థానికులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తొక్కిసలాటలో గాయపడ్డ యువతి అనంతపురం శ్రీకంఠంసర్కిల్: స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన గాడ్ఫాదర్ ఈవెంట్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. భారీగా అభిమానులు తరలిరావడంతో మైదానం కిక్కిరిసింది. అభిమాన హీరోని చూడాలనే ఆత్రుత కారణంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో అనంతపురంలోని రహమత్నగర్కు చెందిన అఖిల అనే యువతి తీవ్రంగా గాయపడింది. పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
GOD FATHER Pre Release: అభిమానులే నాకు గాడ్ఫాదర్స్
‘‘మీరు(అభిమానులు) నన్ను ‘గాడ్ఫాదర్’ అని అంటున్నారు. కానీ, ఏ గాడ్ఫాదర్ లేకుండా వచ్చిన నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి, ఈ స్థాయి ఇచ్చిన ప్రతి అభిమాని నాకు ‘గాడ్ఫాదర్’. చిరంజీవి వెనకాల ఏ గాడ్ఫాదర్ లేరని అంటుంటారు.. కానీ నేను ఇప్పుడు అంటున్నాను.. నా వెనకాల లక్షలమంది గాడ్ఫాదర్స్ ఉన్నారు.. నా అభిమానులే నా ‘గాడ్ఫాదర్స్’’ అని చిరంజీవి అన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. నయనతార, సల్మాన్ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం అనంతపురంలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ‘గాడ్ఫాదర్’ ట్రైలర్ను రిలీజ్ చేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఈ నేల తడుస్తుంది. ఈ రోజు కూడా ఇలా వర్షం కురవడం శుభ పరిణామంగా అనిపిస్తోంది. ఇక ‘గాడ్ఫాదర్’ విషయానికొస్తే.. మలయాళ హిట్ మూవీ ‘లూసిఫర్’ చిత్రాన్ని నేను తెలుగులో ‘గాడ్ఫాదర్’గా చేయడానికి ప్రధాన కారణం రామ్చరణ్. దర్శకుడు మోహన్ రాజా పేరును కూడా చరణే సూచించాడు. మాపై నమ్మకం, ప్రేమ, గౌరవంతో ‘గాడ్ఫాదర్’ కథ వినకుండా నటించిన సల్మాన్ఖాన్గారికి థ్యాంక్స్. నయనతార ఈ సినిమా ఒప్పుకోవడం మా విజయానికి తొలిమెట్టు. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాలో భాగస్వాములవడంసంతోషం. తెలుగువారికి జాతీయ అవార్డులు రావడం అరుదు. అలాంటిది చిన్న వయసులోనే జాతీయ అవార్డు సాధించిన తమన్కు అభినందనలు. మా సినిమాకి రీ రికార్డింగ్ అద్భుతంగా ఇచ్చాడు. పొలిటికల్ అండ్ ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది.. ప్రేక్షకులను అలరిస్తుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను. నేను సినిమా చూశాను కాబట్టే ఇంత ఆత్మ విశ్వాసంతో మాట్లాడుతున్నాను. కానీ, ప్రేక్షకుల తీర్పును ఎప్పుడూ గౌరవిస్తాం. మా సినిమాతో పాటు విడుదలవుతున్న నా మిత్రుడు నాగార్జున ‘ది ఘోస్ట్’, గణేష్ ‘స్వాతిముత్యం’ సినిమాలు కూడా విజయం సాధించాలి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు.. రెండూ ప్రేక్షకులచేత ఆదరించబడినప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తమన్, ఫైట్మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో కాస్త స్తబ్ధత ఏర్పడింది. జయాపజయాలు మన చేతుల్లో ఉండవని తెలుసు. కానీ ప్రేక్షకులను అలరించలేకపోయామే, వారిని అసంతృప్తికి గురిచేశామే అనే బాధ ఉంది. దానికి సమాధానం, నాకు ఊరట ఈ ‘గాడ్ఫాదర్’. ఈ సినిమా కచ్చితంగా నిశ్శబ్ధ విస్ఫోటనం అవుతుంది.. ఇందుకు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలి. బుధవారం ఉదయం ఓ విషాదం చోటు చేసుకుంది. సూపర్స్టార్ కృష్ణ గారి సతీమణి, సోదరుడు మహేశ్బాబుగారి మాతృమూర్తి ఇందిరాదేవిగారు మృతిచెందారు. ఆ కుటుంబం విషాదంలో ఉంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. -
GodFather Pre Release Event: చిరంజీవి, సల్మాన్లకు భారీ కటౌట్స్
చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళ మూవీ ’లూసీఫర్’కు తెలుగు రీమేక్ ఇది. సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 5న తెలుగు, హిందీలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్ది ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో జోరు పెంచింది చిత్ర యూనిట్. నేడు(స్టెప్టెంబర్ 28) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ రాయలసీమ ప్రాంతంలోని అనంతపురంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్తో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరుకానుంది. ఇప్పటికే అనంతపురంలో ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. ప్రీరిలీజ్ వేడుక కోసం అక్కడ చిరంజీవి, సల్మాన్ ఖాన్లకు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. డ్రోన్స్ ద్వారా చిరు, సల్మాన్ కటౌట్లపై పుష్పాల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇప్పటి వరకు రిలీజైన టీజర్, పాటలతో పాటు చిరు చెప్పిన ఓ డైలాగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రీరిలీజ్ ఈవెంట్తో గాడ్ ఫాదర్కు భారీ హైప్ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. -
నా కల నెరవేరింది
‘‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నయ్యకి(చిరంజీవి) నేను పెద్ద అభిమానిని. ఆయన స్ఫూర్తితో నటుడు కావాలని కలలుకని, అయ్యాను. నా నటనని అన్నయ్య ప్రశంసించడం మాటల్లో వర్ణించలేని గొప్ప అనుభూతి. ఆయనతో నటించాలనే నా ఇన్నేళ్ల కల ‘గాడ్ఫాదర్’ చిత్రంతో నేరవేరింది’’ అని హీరో సత్యదేవ్ అన్నారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. హీరో సల్మాన్ ఖాన్, హీరోయిన్ నయనతార, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 5న తెలుగు, హిందీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన సత్యదేవ్ పంచుకున్న విశేషాలు... ► అన్నయ్య(చిరంజీవి) ఒక షూటింగ్లో లంచ్కి రమ్మని పిలిస్తే వెళ్లాను. ఒక సినిమా(గాడ్ఫాదర్) ఉందని కథ చెప్పడం మొదలుపెట్టారు. నేను ఆయనకి వీరాభిమానిని.. గురువుగా భావించిన వ్యక్తి ఆయన. అలాంటిది ఆయన నాకు కథ, నా పాత్ర గురించి చెప్పడం ఆశ్చర్యమనిపించింది.. వెంటనే చేస్తాను అని చెప్పా. ఆ క్షణం చాలా గొప్పగా అనిపించింది. అయితే ఆ పాత్ర చేస్తున్నపుడు అందులోని లోతు అర్థమైంది.. అప్పుడు చిన్న టెన్షన్ మొదలైంది. కానీ, అన్నయ్యగారు నటుడిగా నాపై పెట్టిన బాధ్యత ముందు భయాలు తొలగిపోయాయి. గతంలో ఎప్పుడూ చేయని పాత్ర ఈ సినిమాలో చేశా. ► అన్నయ్య గ్రేస్, ఆరాకి వంద శాతం సరిపడే కథ ‘గాడ్ఫాదర్’. చిరంజీవిగారిని మెగాస్టార్ అని ఎందుకు అంటారో ఆయనతో పనిచేస్తున్నప్పుడు అర్థమైంది. ఆయన చాలా క్రమశిక్షణగా, మా కంటే చాలా ఎనర్జిటిక్గా ఉంటారు. ప్రతి డైలాగ్ నేర్చుకుంటూ తర్వాతి సన్నివేశం గురించి ఆలోచించడం గ్రేట్. ► సల్మాన్ఖాన్గారు సెట్స్లో చాలా సింపుల్గా, సరదాగా ఉంటారు. దర్శకుడు మోహన్ రాజాగారు నా పాత్రని చాలా స్టయిలిష్, పవర్ హంగ్రీ, గ్రీడీ.. ఇలా చాలా పవర్ ఫుల్గా డిజైన్ చేశారు. అందరిలానే సోలో హీరోగా చేయాలనే ఉంటుంది. అయితే మంచి పాత్ర వస్తే క్యారెక్టర్స్ కూడా చేస్తాను. ► అన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఉంది. తన సినిమాలతో సౌత్, నార్త్ అనే బౌండరీలు లేకుండా ఇండియన్ సినిమా అనేలా చేసిన రాజమౌళిగారికి హ్యాట్సాఫ్. నేను నటించిన ‘గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ, రామ్ సేతు’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘ఫుల్ బాటిల్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో డాలీ ధనుంజయతో కలసి ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నాను. -
ఆ పొలిటికల్ డైలాగ్పై స్పందించిన మెగాస్టార్.. అలా అవుతుందని ఊహించలేదు
మోహన్రాజా దర్శకత్వంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం 'గాడ్ఫాదర్'. ఈ చిత్రంలో మెగాస్టార్కు జోడిగా నయనతార నటిస్తోంది. ఇటీవల రిలీజైన గాడ్ఫాదర్ ట్రైలర్లో చిరంజీవి డైలాగ్ క్రియేట్ చేసిన హైప్ అంతా ఇంతా కాదు. 'రాజకీయాలకు దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అన్న డైలాగ్ ఓ రేంజ్లో అభిమానులను ఊపేసింది. అయితే తాజాగా మెగాస్టార్ ఆ డైలాగ్పై స్పందించారు. (చదవండి: ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాకు అతనే గాడ్ఫాదర్: చిరంజీవి) గాడ్ ఫాదర్ పొలిటికల్ డైలాగ్పై తాజాగా యాంకర్ శ్రీముఖితో జరిగిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ స్పందించారు. మెగాస్టార్ మాట్లాడుతూ 'ఆ డైలాగ్ ఇంత ప్రకంపనలు సృష్టిస్తుందనుకోలేదు.. ఇది కూడా ఓ రకంగా మంచిదే.. అభిమానుల్లో అంత బలంగా ఈ డైలాగ్ దూసుకెళ్తుందని ఊహించలేదని' అని అన్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా చిరంజీవితో ప్రత్యేక విమానంలో ఇంటర్వ్యూ జరిగింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్కి తెలుగు రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 5న థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. -
బాలీవుడ్ మార్కెట్పై మెగా హీరోల కన్ను
టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్లో రోజు రోజుకు ఆదరణ పెరిగిపోతుంది. ప్రభాస్ మొదలు నిఖిల్ వరకు ప్రతి తెలుగు హీరోని బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీంతో తెలుగు హీరోల టార్గెట్ మారిపోయింది. ముఖ్యంగా మెగా హీరోలు బాలీవుడ్ మార్కెట్పై గట్టిగా ఫోకస్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి వరుణ్ తేజ్ వరకు..మెగా హీరోలంతా బీటౌన్ బాట పట్టారు. సైరాతో చిరంజీవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక దశలో ఆచార్యను కూడా అక్కడ విడుదల చేయాలనుకున్నారు. కానీ టాలీవుడ్లోనే ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో..తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. కానీ ఇప్పుడు గాడ్ఫాదర్తో మరోసారి బాలీవుడ్కు వెళ్తున్నాడు చిరు. ఈ సారి సల్మాన్ఖాన్ కూడా తోడవ్వడంతో బాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 5న గాడ్ఫాదర్ విడుదల కాబోతుంది. ఇక ఆర్ఆర్ఆర్తో బీటౌన్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయన్నారు. ఇకపై చరణ్ నటించే ప్రతి సినిమా కూడా హిందీలో విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక చిరు,చరణ్తో పాటు పవన్ కల్యాణ్ కూడా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. గతంలో సర్దార్ గబ్బర్సింగ్తో హిందీ మార్కెట్లోకి అడుగుపెట్టిన పవన్.. తర్వాత కొన్నాళ్లపాటు బీటౌన్ ప్రేక్షకులను దూరంగా ఉన్నారు. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’చిత్రంతో మరోసారి బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇక వరుణ్ తేజ్ కూడా బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నాడు. గని తర్వాత సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే పాన్ ఇండియా చిత్రంలో వరుణ్ నార్త్ ఆడియన్స్ని పలకరించబోతున్నాడు. శక్తి ప్రతాప్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాకు అతనే గాడ్ఫాదర్: చిరంజీవి
మోహన్రాజా దర్శకత్వంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం 'గాడ్ఫాదర్'. ఈ చిత్రంలో మెగాస్టార్కు జోడిగా నయనతార నటిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్కి తెలుగు రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. ప్రమోషన్స్లో భాగంగా గాడ్ ఫాదర్ మూవీ చిత్రబృందం సరికొత్తగా ప్లాన్ చేసింది. ఏకంగా ఆకాశంలో ఇంటర్వ్యూ నిర్వహించింది. (చదవండి: God Father: గాడ్ఫాదర్ సెన్సార్ పూర్తి.. డైరెక్టర్ ట్వీట్ వైరల్) ప్రత్యేక విమానంలో తిరుగుతూ చిరంజీవిని యాంకర్ శ్రీముఖి ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూకి సంబంధించి తాజాగా ప్రోమోలను రిలీజ్ చేయగా నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన తార్ మార్ టక్కర్ మార్ సాంగ్ అభిమానులను ఓ రేంజ్లో ఊర్రూతలూగిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 5 రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ’ సర్టిఫికేట్ ఇచ్చింది. త్వరలోనే అనంతపురంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ ప్రోమోలో 'రాజకీయాలకు దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అన్న డైలాగ్ ప్రేక్షకుల్లో మరింత హైప్ క్రియేట్ చేసింది. ప్రోమోలో చిరంజీవి లుక్ అదిరిపోయిందంటూ శ్రీముఖి అనడంతో నవ్వుతూ సమాధానాలిచ్చాడు మెగాస్టార్. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కేవలం ప్రేమతో చేశాడు. హ్యాట్సాఫ్ టు సల్మాన్ భాయ్ అంటూ చిరు ప్రశంసించారు. పూరీ జగన్నాథ్లో కమాండింగ్ ఉన్న నటుడు ఉన్నాడని చూసిన తరువాత మీరే ఆశ్చర్యపోతారు అన్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ ఆరో ప్రాణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనే గాడ్ ఫాదర్. నిశ్శబ్ద విస్పోటనం అంటూ మెగాస్టార్ ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగింది. అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువే ఈ సినిమాలో చూస్తారని మెగాస్టార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూ సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 25న ప్రసారం కానుంది. ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. -
మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' డిజిటల్ రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. నయనతార, సత్యదేవ్, సల్మాన్ఖాన్, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఫ్యాన్సీ ధరకే విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ను దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగు, హిందీలో కలిపి నెట్ఫ్లిక్స్ రూ.57 కోట్లు చెల్లించినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దసరా కానుకగా వచ్చేనెల 5న ఈ సినిమా విడుదల చేయనున్నారు. రాయలసీమలోని అనంతపురం వేదికగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈవెంట్ ఎప్పుడు నిర్వహిస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో వచ్చిన మలయాళ సూపర్హిట్ ‘లూసిఫర్’ తెలుగులో రీమేక్గా వస్తోంది‘. ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ తీసుకొచ్చేందుకు పృథ్వీరాజ్ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్తో చేయిస్తున్నారు. చిరంజీవి సోదరి పాత్రలో నయనతార కనిపించనుండగా.. విలన్ పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నారు. -
సంచలనం రేకెత్తిస్తున్న ‘మెగా’ డైలాగ్.. దీని ఆంతర్యం ఏంటి?
మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన చిత్రంలోని ఓ డైలాగ్ను షేర్ చేయడం ఇటు ఇండస్ట్రీతో పాటు రాజకీయవర్గాల్లోనూ హాట్టాపిక్గా నిలిచింది. ఆయన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ చిత్రంలోని ఓ పవర్ఫుల్ డైలాగ్ను చిరు తాజాగా షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ రాజకీయపరంగా ఆసక్తిని పెంచుతున్నాయి. చదవండి: ‘సీతారామం’ మూవీపై ‘ది కశ్మీర్ ఫైల్స్ ’డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు మంగళవారం చిరు ట్వీట్ చేస్తూ.. ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటూ తన వాయిస్ ఓవర్తో ఉన్న ఆడియోను షేర్ చేశారు. దీంతో చిరు రాజకీయ రీఎంట్రీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆయన ఈ డైలాగ్ షేర్ చేయడం వెనక ఆంతర్యం ఏంటా? అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. pic.twitter.com/6UQ1QwNsWi — Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2022 -
మళ్లీ బుక్కైన తమన్.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ఫాదర్ నుంచి నిన్న విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రోమోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ప్రోమో చిరుతో కలిసి సల్మాన్ స్టెప్పులేశాడు. టార్ మార్ టక్కర్ మార్ అంటూ ఫాస్ట్ బీట్తో ప్రొమో అదిరిపోయిందంటూ కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రొమో సాంగ్ విన్న కొందరు తమన్ను సోషల్ మీడియా వేదికగా ఆటాడేసుకుంటున్నారు. మళ్లీ దొరికిపోయాడంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకి అసలు సంగతేంటంటే.. తమన్ కంపోజ్ చేసిన ఈ ‘తార్ మార్ టక్కర్ మార్’ పాట అచ్చం రవితేజ క్రాక్ చిత్రంలోని ‘డండనకర నకర.. నకర’ పాటలాగే ఉందని అంటున్నారు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. అయితే ఈ పాటను కంపోజ్ చేసింది కూడా తమనే. దీంతో ‘ఏంటి.. తమన్ నువ్వు ఇక మరావా?.. రెండు పాటలకు ఒకే బీట్ వాడావంటూ’ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ‘మెగాస్టార్ లాంటి పెద్ద హీరో చిత్రానికి పని చేస్తున్నప్పుడు కొంచం డిఫరేంట్ ఉండాలి కదా’ అని తమన్పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ రెండు పాటలను పోలుస్తూ నెటిజన్లు ‘ఏంటమ్మా.. తమన్ ఇది చూసుకోవాలి కదా’ అంటూ అతడిని ఏకిపారేస్తున్నారు. కాగా ఇలా కాపీ కొట్టి దొరికపోవడం తమన్కు ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా పలు పాటలకు కాపీ కొట్టి తమన్ దొరికిపోవడం.. అతడిని నెటిజన్లు ట్రోల్ చేయడం సాధారణమైంది. చదవండి: నేను సినిమాలు మానేయాలని కోరుకున్నారు, అది బాధించింది: దుల్కర్ -
తార్ మార్ టక్కర్ మార్.. చిరుతో కలిసి దుమ్ములేపిన సల్మాన్ ఖాన్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గాడ్ఫాదర్’. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ నుంచి మేకర్స్ తరచూ ఏదోక అప్డేట్ వదులుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల చిరు బర్త్డే సందర్భంగా విడుదలైన సినిమా టీజర్కు మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పటికే విడుదలై ఫస్ట్లుక్ పోస్టర్లకు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ పేరుతో తాజాగా ఈ సినిమాలో తొలి సాంగ్ ప్రోమోను వదిలింది చిత్ర బృందం. చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! పెప్పీ నెంబర్గా వస్తున్న ఈ పాటలో మెగాస్టార్ చిరుతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా దుమ్ములేపాడు. వారిద్దరు చేసిన స్వాగ్ మూమెంట్స్ ఈ పాటను మరో లెవెల్కు తీసుకెళ్లనున్నట్లు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ‘తార్ మార్ టక్కర్ మార్’ అంటూ సాగుతున్న ఈ పాట ప్రోమో మెగా ఫ్యాన్స్కు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫుల్ సాంగ్ను సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. -
చిరంజీవి 'గాడ్ఫాదర్'లో సత్యదేవ్ క్యారెక్టర్ ఇదే
‘గాడ్ ఫాదర్’ కోసం జై దేవ్ అవతారం ఎత్తారు సత్యదేవ్. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినివను నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సత్యదేవ్ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. ఇందులో జై దేవ్ పాత్ర చేశారు సత్యదేవ్. చిరంజీవి తమ్ముడిగా ఆయన క్యారెక్టర్ ఉండనుందని సమాచారం. ఇక దీంతో పాటు మూవీ రిలీజ్ డేట్ పై కూడా సాలిడ్ క్లారిటీ ఇచ్చేశారు. సినిమా అనుకున్నట్లుగానే అక్టోబర్ 5 నే రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్లో తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు. Presenting versatile actor @ActorSatyaDev as the wily 'Jaidev' from #GodFather ❤️🔥 - https://t.co/rSZusB3TTy#GodFatherOnOct5th 💥 Megastar @KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @LakshmiBhupal @AlwaysRamCharan @ProducerNVP pic.twitter.com/TupFBOIxs2 — Konidela Pro Company (@KonidelaPro) September 12, 2022 -
రిస్క్గా మారిన రీమేక్స్.. అసలు ప్రాబ్లమ్ అదే!
టాలీవుడ్ అంటేనే రీమేక్స్ అడ్డా. వేరే ఇండస్ట్రీస్లో సూపర్ హిట్టైన సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తుంటారు. ప్రస్తుతం చిరు మాలీవుడ్ బ్లాక్ బస్టర్ లూసీఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నాడు. అలాగే వేదాళం చిత్రాన్ని భోళాశంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. అయితే రాను రాను రీమేక్స్లో నటించడం మన హీరోలకు పెద్ద రిస్క్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా అదే క్యారెక్టర్ని మాటిమాటికి రిపీట్ చేయాల్సి రావడమే అసలు ప్రాబ్లమ్గా మారనుంది. ఇండియా వైడ్గా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్లో ఇప్పుడు హిట్టైన సినిమాలకు సీక్వెల్స్ తీయడం ఆనవాయితీగా మారుతోంది. చిరు నటించే గాడ్ ఫాదర్ ఓరిజినల్ వర్షన్ లూసీఫర్ కు త్వరలోనే సీక్వెల్ తెరకెక్కిస్తాంటున్నాడు దర్శకుడు దర్శకుడు ప్రముఖ హీరో పృథ్వీరాజ్. అదే జరిగితే చిరు మరోసారి గాడ్ ఫాదర్ గా మారాల్సి వస్తోంది.గతంలో మున్నాభాయ్ సిరీస్ను రీమేక్స్ చేసిన చిరు, రెండు సార్లు శంకర్ దాదాగా మారాడు. (చదవండి: ఒక్క ట్వీట్తో ఫ్యాన్స్కి షాకిచ్చిన రానా) వరుణ్ తేజ్ కూడా ఇప్పుడు గద్దలకొండ గణేష్ గా మారాల్సిన సమయం ఆసన్నమైంది.ఎందుకంటే గద్దలకొండ గణేష్ ఓరిజినల్ వర్షన్ జిగర్తాండ కు సీక్వెల్ అనౌన్స్ చేసాడు తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు. జిగర్తాండ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాండ్ గా మాస్ గా సీక్వెల్ వీడియో రిలీజ్ చేశాడు. సో త్వరలోనే వరుణ్ కూడా ఇప్పుడు గద్దలకొండ గణేష్ స్టోరీని కంటిన్యూ చేయాలంటే రీమేక్ చేయకతప్పదు. ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ అవుతుంది. ఇప్పటికే దృశ్యం, దృశ్యం2 చిత్రాల్లో కనిపించాడు వెంకటేశ్. త్వరలోనే దృశ్యం 3 తీస్తానంటున్నాడు జీతుజోసెఫ్. సో వెంకీ మళ్లీ దృశ్యం 3 చేయాల్సి ఉంటుంది. కన్నడ బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీని తెలుగులో కిరాక్ పార్టీ పేరుతో రీమేక్ చేశాడు నిఖిల్. ఇప్పుడు ఈ సినిమకు సీక్వెల్ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిఖిల్ కూడా కిరాక్ట్ పార్టీ2తో తిరిగొస్తాడా అనేది చూడాల్సి ఉంది. -
గాడ్ ఫాదర్ని కలిసిన లైగర్
ముంబైలో ‘గాడ్ ఫాదర్’ని కలిశారు ‘లైగర్’. చిరంజీవి హీరోగా మోహన్రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరిగింది. చిరంజీవి, సల్మాన్ ఖాన్లపై ప్రభుదేవా కొరియోగ్రఫీలో ఓ పాటను చిత్రీకరించారు. కాగా ‘లైగర్’ ప్రమోషన్స్ కోసం ముంబైలో ఉన్న ఈ సినిమా టీమ్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లొకేషన్కి వెళ్లింది. చిరంజీవి, సల్మాన్తో కాసేపు టైమ్ స్పెండ్ చేసింది. ఇక్కడున్న ఫొటో ఆ లొకేషన్కి సంబంధించినదే. ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబరులో దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘లైగర్’ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. -
సల్మాన్తో మెగాస్టార్ స్టెప్పులు.. కనువిందు ఖాయం
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పేస్తే ఎలా ఉంటుంది? ఐ ఫీస్ట్లా ఉంటుంది. చిరంజీవి కూడా ఈ మాటే అంటున్నారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరు, సల్మాన్ కాంబినేషన్ లో ఈ చిత్రం కోసం ఓ పాట చిత్రీకరిస్తున్నారు. (చదవండి: కేరాఫ్ లండన్ అంటున్న టాలీవుడ్ స్టార్స్) ‘‘భాయ్ (సల్మాన్)తో కలిసి కాలు కదుపుతున్నాను. ప్రభుదేవా అద్భుతంగా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఐ ఫీస్ట్ ఖాయం’’ అని ఈ సందర్భంగా చిరంజీవి పేర్కొన్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. నయనతార కీలక పాత్ర చేస్తుండగా, దర్శకుడు పూరి జగన్నాధ్ అతిథి పాత్ర చేస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన లూసీఫర్కి తెలుగు రీమేక్ ఇది. ఈ ఏడాది విజయదశమి సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. Shaking a leg with The Bhai @BeingSalmanKhan for #GodFather @PDdancing is at his Choreographing Best!! A sure shot Eye Feast!!@jayam_mohanraja @AlwaysRamcharan@MusicThaman @SuperGoodFilms_@KonidelaPro #Nayanthara @ProducerNVP @saregamasouth pic.twitter.com/mRjXRNhaJB — Chiranjeevi Konidela (@KChiruTweets) July 29, 2022 -
ఈ దసరాకు బరిలో దిగే చిత్రాలివే.. తలపడనున్న చిరు-నాగ్
ఈ ఏడాది దసరా పండగ బాక్సాఫీస్ ఫైట్కి రంగం సిద్ధం అవుతోంది. దసరా బరిలో నిలిచేందుకు హీరోలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చిరంజీవి ‘గాడ్ఫాదర్’ చిత్రంతో దసరాకు వచ్చేందుకు రెడీ అయ్యారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ఫాదర్’ సినిమాకు మోహన్రాజా దర్శకుడు. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కీలక పాత్రలు చేస్తున్నారు. సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేస్తామని చిత్రబృందం పేర్కొంది. కానీ విడుదల తేదీ ప్రకటించలేదు. ఇక రిలీజ్ డేట్ను కూడా ఫిక్స్ చేసుకుని పండగ బరిలో నిలిచారు హీరో నాగార్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ ‘ది ఘోస్ట్’లో నాగార్జున హీరోగా నటించారు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 5న థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించిన చిత్రం ఇది. ఇంకోవైపు నిఖిల్ కూడా దసరా బరిలో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘స్పై’. ఈ సినిమాను దసరా సందర్భంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడం, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. కె. రాజశేఖర్ రెడ్డి కథ అందించి, నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అలాగే నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ రెండు చిత్రాలు కూడా దసరాకు రిలీజవుతాయన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రబృందాలు రిలీజ్ గురించి స్పష్టత ఇవ్వలేదు. ఇక దసరా పండక్కి ఓ నాలుగు రోజుల ముందే రవితేజ ‘రావణాసుర’ రిలీజ్ కానుంది. రవితేజ హీరోగా సుధీర్వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా సెప్టెంబరు 30న విడుదలవుతుంది. అనుకున్న ప్రకారం రిలీజైతే దసరా పండక్కి కొన్ని థియేటర్స్లో అయినా ‘రావణాసుర’ ఉంటాడు. సేమ్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పొన్నియిన్ సెల్వన్’ కూడా సెప్టెంబరు 30నే రిలీజ్ కానుంది. ఈ సినిమా కూడా దసరా సమయానికి కొన్ని థియేటర్స్లో ప్రదర్శనకు ఉండే చాన్సెస్ లేకపోలేదు. ఈ చిత్రంలో విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యా రాయ్ ప్రధాన తారలుగా నటించారు. దసరా పండగ సందర్భంగా మరికొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్కి గురి పెడుతున్నాయి. -
చిరంజీవి కీలక నిర్ణయం.. ఇక అక్కడ కూడా రికార్డులు బద్దలే!
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఈ ఏడాదంతా ఫుల్ బిజీగా ఉన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘గాడ్ఫాదర్’ రిలీజ్కు సిద్ధంగా ఉంది. మరోవైపు మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న ‘భోళాశంకర్’ షూటింగ్ కూడా జెడ్ స్పీడ్లో జరుగుతోంది. ఇక బాబీ దర్శకత్వం తెరకెక్కే చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిరంజీవి భావిస్తున్నారు. చేతిలో ఉన్న ఈ మూడు చిత్రాలే కాకుండా.. మరో రెండు సినిమాలకు కూడా త్వరలో అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారని టాక్. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బీజీగా ఉన్న చిరు.. తాజాగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తునాయి. త్వరలోనే ఆయన డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నారట. (చదవండి: మహారాజా సుహేల్ దేవ్గా రామ్చరణ్!) ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్స్ కంటే ఎక్కువగా ఓటీటీల వైపే మొగ్గచూపుతున్నారు.దీంతో బడా హీరోలు సైతం ఓటీటీ సినిమాలకు, వెబ్ సిరీస్లకు సై అంటున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటీటీ కోసం వెబ్ సిరీస్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొన్ని ఓటీటీ సంస్థలు చిరంజీవిని సంప్రదించినట్లు సమాచారం. వారి దగ్గరు ఉన్న కొత్త కాన్సెప్ట్లను కూడా వినిపించారట. అయితే తన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్తో తన క్యారెక్టర్ చాలా ఫవర్ఫుల్ ఉండేలా కథను సిద్ధం చేసుకొని రమ్మని చెప్పారట. చిరు ఓటీటీ ఎంట్రీ అంటే మాములు మాటలు కాదు. ఆయన రేంజ్కి తగ్గ కథ దొరకాలి. మరి చిరుకు నచ్చే కంటెంట్ని ఏ ఓటీటీ సంస్థ అందిస్తుందో చూడాలి. ఒకవేళ అన్ని కుదిరి చిరంజీవి ఓ మంచి వెబ్ సిరీస్తో వస్తే మాత్రం ఓటీటీ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
గాడ్ ఫాదర్ వస్తున్నాడు
‘గాడ్ఫాదర్’ రాకకు రంగం సిద్ధమైంది. చిరంజీవి హీరోగా మోహన్రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘గాడ్ఫాదర్’. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లుగా శుక్రవారం చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు, సంగీతం: తమన్. -
చిరంజీవితో బాక్సాఫీస్ వార్కి సై అంటున్న తమిళ స్టార్!
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య ఏ రేంజ్ లో మెగా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిందో తెలిసిందే. అందుకే ఇక ఆలస్యం చేయకుండా వారిని ఎంటర్ టైన్ చేసేందుకు గాడ్ ఫాదర్ మూవీతో తిరిగి రావాలని చిరు కోరుకుంటున్నాడు. ఆగస్ట్ 15.. హాలీడే వీకెండ్ను టార్గెట్గా చేసుకుంటూ తన కొత్త సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నాడు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అయితే ఆగస్ట్ రెండో వారంలో గాడ్ఫాదర్ రిలీజ్ ఉంటుందని కేవలం ఇండస్ట్రీ వర్గాలు మాత్రమే చెప్పుకొస్తున్నాయి. అంతేకానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే.. ఆగస్ట్ సెకండ్ వీక్పై ఖర్చీఫ్ వేశాడు తమిళ స్టార్ హీరో విక్రమ్. ఆయన హీరోగా తెరకెక్కిన ‘కోబ్రా’ చిత్రం ఆగస్ట్ 11న సౌత్ మొత్తం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో బాక్సాఫీస్ వద్ద చిరు, విక్రమ్ల మధ్య యుద్దం తప్పనిసరి అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఆగస్ట్ రెండో వారంలో కేవలం చిరు, విక్రమ్లు మాత్రమే పోటీ పడడం లేదు.. బోనస్గా అఖిల్, సమంత కూడా వచ్చేస్తున్నారు. అఖిల్ ఏజెంట్, సామ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ యశోద కూడా అదే వారంలో విడుదల కాబోతున్నాయి. యూత్స్టార్ నితిన్ నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’కూడా బరిలో నిలవబోతున్నాయి. మరి ఈ బాక్సాఫీస్ వార్లో గెలిదేవరో చూడాలి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఆచార్య’లో సత్యదేవ్ అతిథి పాత్ర, గర్వంగా ఉందన్న చిరు
Chirajeevi Praises Actor Satyadev: నటుడు సత్యదేవ్పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించాడు. చిరంజీవి తాజా చిత్రం ఆచార్యలో సత్యదేవ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు ‘గాడ్ఫాదర్’లో కూడా ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. రీసెంట్గా గాడ్ఫాదర్లో సెట్లోకి అడుగు పెట్టాడు సత్యదేవ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ చిరంజీవితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మేరకు సత్యదేవ్ ట్వీట్ చేశాడు. చదవండి: బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్! ‘అన్నయ్యా.. నటన జీవితంతో తమాలాంటి ఎదరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్నిచూసే నటుడిగా మారాను. ఈ రోజు ఆచార్య సినిమాలో మీతోపాటు కాసేపైనా నటించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమ శిక్షణ దగ్గర నుంచి చూఇ నేర్చుకునే అవకాశం దక్కింది’ అంటూ సత్యదేవ్, చిరుపై అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక అతడి ట్వీట్కు మెగాస్టార్ ఫిదా అయ్యాడు. అతడి ట్వీట్కు తన అభిమానిగా సత్యదేవ్ను చూసి గర్వపడుతున్నానంటూ చిరు స్పందించాడు. చదవండి: అర్థరాత్రి 12 గంటలకు.. సమంతకు విషెస్ చెప్పిన హీరో ‘డియర్ సత్యదేశ్. థ్యాంక్యూ. నీలాంటి చక్కటి నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషంగా ఉంది. ఆచార్యలో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం. ఇక గాడ్ఫాదర్ చిత్రంలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం’ అంటూ చిరు రాసుకొచ్చారు. కాగా మెహన్ రాజా దర్శకత్వంలో గాడ్ఫాదర్ చిత్రం మలయాళం లూసీఫర్ మూవీకి రీమేక్. పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం సత్యదేశ్ కీ రోల్ పోషిస్తున్నాడు. చిరు తాజా ట్వీట్తో సత్యదేవ్ ఇందులో ప్రతికథానాయకుడిగా కనిపంచానున్నాడనే ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. కాగా ప్రస్తుతం గాడ్ఫాదర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. డియర్ @ActorSatyaDev ..Thank you. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం.. #Acharya లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం..#Godfather సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం..So proud of you. God bless! https://t.co/L0R7yw1Tti pic.twitter.com/P4zqp78SbE — Acharya (@KChiruTweets) April 28, 2022 -
చిరంజీవి సినిమాలో పూరి జగన్నాథ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ హిట్ ఫిల్మ్ ‘లూసీఫర్’కు తెలుగు రీమేక్ ఇది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అతని పాత్రకు సంబంధించిన షూటింగ్ని కూడా పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి కలిసి ఓ పాటకు స్టెప్పులేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో స్టార్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఓ పాత్ర పోషించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవియే ట్విటర్ వేదికగా వెల్లడించాడు.‘నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే ‘గాడ్ ఫాదర్’లో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు’అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో పూరి ఓ జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార, సత్యదేవ్, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే introducing my @purijagan in a special role,from the sets of #Godfather pic.twitter.com/8NuNuoY33j — Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2022 -
‘నాటు నాటు’కు ధీటుగా చిరు-సల్మాన్ స్టెప్పులేస్తే..?
ఆర్ఆర్ఆర్లో ఇద్దరు స్టార్స్ని నటింపజేసి,బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాడు రాజమౌళి. సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. ‘నాటు నాటు’ పాటకు ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన స్టెప్పులు మరో ఎత్తు. తారక్, చరణ్ ఇద్దరు టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్స్ కావడంతో నాటునాటు పాటను ప్రేక్షకులు చూపు తిప్పుకోకుండా చూస్తున్నారు. ఇప్పుడు ‘నాటు నాటు’సాంగ్ని చిరంజీవి ఫాలో అవుతున్నాడట. ఆయన హీరోగా నటిస్తున్న ‘గాఢ్ ఫాదర్’లో సల్మాన్తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నారట. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే చిరంజీవితో కలిసి ఓ పాటకు స్టెప్పులేసేందుకు రెడీ అవుతున్నాడట. మెగాస్టార్ స్టెప్పుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లు.ఆచార్య కోసం ‘లాహే లాహే’, ‘సానా కష్టం’ పాటలలో చిరంజీవి వేసిన స్టెప్స్ రేపు థియేటర్స్ లో దుమ్మురేపడం ఖాయం. ఇక గాఢ్ ఫాదర్లో చిరంజీవి మరింత రెచ్చిపోయి, స్టెప్పులు వేయనున్నాడట. అయితే సల్మాన్ డ్యాన్స్ చేయడం చాలా అరుదు. కేవలం తన ఛరిష్మాతో,కొన్ని సిగ్నేచర్ స్టెప్ప్ తో అలరిస్తుంటాడు సల్మాన్.కాని మెగాస్టార్ తో డ్యాన్స్ అంటే మాత్రం భాయ్ కూడా రెచ్చిపోయడం ఖాయం అనుకుంటున్నాడు ఫ్యాన్స్. చిరు, సల్మాన్ స్టెప్పులు గాడ్ ఫాదర్ సినిమాకు నాటు నాటు రేంజ్ కిక్ ఇస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా గాడ్ ఫాదర్ కు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తన ట్యూన్ తో చిన్న సైజ్ మెగా తుపాన్ తీసుకురావడం ఖాయం. -
ఆస్కార్... ఆశ్చర్యం
కోవిడ్ కారణంగా గత రెండు అస్కార్ అవార్డుల ప్రదానోత్సవాల్లో ఊహించినంత ఉత్సాహం కనబడలేదు. పైగా ఆస్కార్ అవార్డ్స్ ప్రోగ్రామ్ రేటింగ్ కూడా పడిపోయింది. వీటికి తోడు ఈసారి ఆస్కార్ అవార్డుల్లోని 8 విభాగాలకు ముందుగానే అవార్డులు ఇచ్చి, ఆ ఫుటేజీని లైవ్ టెలికాస్ట్ రోజు ప్రదర్శించాలని ఆస్కార్ నిర్వాహకులు ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. రేటింగ్ను పెంచడం, విమర్శలను తగ్గించుకోవడం కోసం ఆస్కార్ నిర్వాహకులు కొన్ని సర్ప్రైజ్లను ప్లాన్ చేశారట. ఇందులో భాగంగా క్లాసిక్ చిత్రాలను సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ‘జేమ్స్బాండ్’ సిరీస్లోని తొలి సినిమా ‘డాక్టర్ నో’ (1962) విడుదలై 60 సంవత్సరాలు కావస్తోంది. అలాగే మరో హాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ (1972) చిత్రం యాభై సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ 94వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ఈ రెండు చిత్రాలను సెలబ్రేట్ చేసే విధంగా ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు ఆస్కార్ నిర్వాహకుల్లో ఒకరైన విల్ పాకర్ పేర్కొన్నారు. ఈ సర్ప్రైజెస్ ఏంటి? అనేవి మరో రెండు రోజుల్లో తెలుస్తుంది. ఈ నెల 27న లాస్ ఏంజిల్స్లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. -
గాడ్ఫాదర్: ముంబైకి బై..బై చెప్పేసిన చిరంజీవి
Salman Khan And Chiranjeevi Wrap Godfather Shooting Schedule: ముంబైకి బై బై చెప్పారు ‘గాడ్ఫాదర్’. చిరంజీవి హీరోగా మోహన్రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రం తెరకెక్కుతోంది. మలయాళ హిట్ ఫిల్మ్ ‘లూసీఫర్’కు ఇది తెలుగు రీమేక్. ఇటీవల ముంబైలో ప్రారంభమైన ఈ సినిమా లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ సోమవారం ముగిసింది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, సల్మాన్ఖాన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఓ యాక్షన్ సీక్వెన్స్తో పాటుగా, ఓ సాంగ్ను కూడా చిత్రీకరించారట. కాగా ‘గాడ్ఫాదర్’ నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్లో స్టార్ట్ కానుందని సమాచారం. నయనతార, సత్యదేవ్, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ఒకే సెట్లో సల్మాన్, చిరంజీవి
టాలీవుడ్ స్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒకే స్టూడియోలోకి అడుగుపెట్టనున్నారు. డైరెక్టర్ స్టార్ట్ అనగానే గెట్.. సెట్.. షూట్ అంటూ నటించడానికి రెడీ అవుతున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఓ కీలక పాత్ర చేయనున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ శనివారం ముంబయ్లో ఆరంభం కానుందని టాక్. కజ్రత్లోని ఎన్డీ స్టూడియోలో జరగనున్న ఈ షెడ్యూల్లో చిరంజీవి, సల్మాన్ పాల్గొనగా కొన్ని యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషన్ సీన్స్ కూడా చిత్రీకరించనున్నారని టాక్. దాదాపు వారం పాటు ఈ షెడ్యూల్ జరుగుతుందట. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమా మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్. ఇందులో నయనతార కీలక పాత్ర చేస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
చిరంజీవి సినిమా కోసం హాలీవుడ్ పాప్ సింగర్!
రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య, మోహన్ రాజాతో గాడ్ ఫాదర్.. బాబీ డైరెక్షన్లో భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆచార్య షూటింగ్ పూర్తి చేసుకున్న చిరు ఇటీవల ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో గాడ్ ఫాదర్కు సంబంధించి అప్డేట్స్ వరుసగా బయటకు వస్తున్నాయి. ఈ మూవీలో నటించే హీరోయిన్స్, మిగతా తారగణంకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: బిగ్బాస్ 5: స్పెషల్ ఎపిసోడ్లో ఆది, 25 నిమిషాలకే షాకింగ్ రెమ్యునరేషన్! ఈ నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ నుంచి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సెషన్ తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోని పాటలకు మరింత హైప్ క్రియేట్ చేసేందుకు హాలీవుడ్ పాప్ సింగర్ను రంగంలోకి దించబోతున్నాడట తమన్. బ్రిట్నీ స్పియర్ చేత ఓ పాట పాడించడానికి తమన్ ప్లాన్ చేస్తున్నాడట. దీనిపై ఆమెతో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. ఇదే నిజమైతే గాడ్ ఫాదర్ మేకర్స్ ఆమెకు భారీగా పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఏ పాటకైనా దాదాపు 20 నుంచి 30 కోట్లు రూపాయల పారితోషికం తీసుకుంటుందని సమాచారం. చదవండి: కూతురు పేరు చెప్పేసిన హీరోయిన్ శ్రియ సరన్ ఇంతటి డిమాండ్ ఉన్న బ్రిట్నీ స్పియర్తో పాట పాడిస్తారా? లేక ఇది వార్తలకే పరిమితమవుతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే మోహన్ రాజా ‘గాడ్ ఫాదర్’ను భారీగా ప్లాన్ చేస్తున్నాడట. పరిశ్రమకు చెందిన పలువరు స్టార్లను ఇందులో భాగస్వామ్యం చేయబోతున్నాడట. ఇప్పటికే ఈ మూవీలో ఓ అతిథి పాత్రకు బాలీవుడ్ కండట వీరుడు సల్మాన్ ఖాన్ను స్పంద్రించినట్లు గతంలో వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ కనిపించదని సమాచారం. గాడ్ ఫాదర్ తర్వాత చిరు బాబీతో భోళా శంకర్ మూవీని ప్రారంభించన్నాడు. -
సుడోకు రూపకర్త కన్నుమూత
టోక్యో: అంకెలతో ఆసక్తి పుట్టించే సుడోకు రూపకర్త మాకి కాజీ కన్నుమూశారు. బైల్ డక్ట్ కేన్సర్తో బాధపడుతూ 69 ఏళ్ల వయసులో మరణించారని ఆయన స్థాపించిన నికోలి కో. సంస్థకు చెందిన ఉద్యోగులు వెల్లడించారు. 2004 నుంచి ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. జపనీయులు సుడోకును స్థానికంగా సుజి–వా–డోకుషిన్–ని–కగిరు అని పిలుస్తారు. దాన్ని షార్ట్కట్లో సుడోకుగా వాడుకలోకి వచ్చింది. మాకి కాజీ దాదాపు 30 దేశాల్లో సుడోకు పజిల్స్ గురించి చెబుతూ పర్యటించారు. సుడోకు చాంపియన్షిప్ల ద్వారా దాదాపు 100 దేశాల్లో 20 కోట్ల మందికి చేరువయ్యామని నికోలి కంపెనీ తెలిపింది. -
‘గాడ్ఫాదర్’ నటుడి కన్నుమూత
హాలీవుడ్ నటుడు అలెక్స్ రొకో (79) శనివారం లాస్ ఏంజెలెస్ సమీపంలో స్టూడియో సిటీలోని తన నివాసంలో కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా మాఫియా సినిమాలకు మాతృకగా నిలిచిన ‘గాడ్ఫాదర్’లో కీలకమైన ‘మో గ్రీన్’ పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ఐదు దశాబ్దాల పాటు నటుడిగా రాణించారు. కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతున్న రొకో ప్రశాంతంగా కన్నుమూసినట్లు ఆయన మేనేజర్ సుసాన్ జషరీ మీడియాకు వెల్లడించారు. 1965లో ‘మోటార్ సైకో’ చిత్రంతో హాలీవుడ్లోకి అడుగుపెట్టిన అలెక్స్ రొకో, ‘గాడ్ఫాదర్’ (1972) ఘనవిజయంతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ అభిమాన గణాన్ని ఏర్పరచుకున్నారు. ‘గాడ్ఫాదర్’లో రొకో తన విలక్షణమైన గొంతుతో పలికిన ‘యూ డోంట్ బై మీ ఔట్.. ఐ బై యూ ఔట్.. అండ్ డూ యూ నో హూ ఐయామ్..?’ అనే డైలాగు ఆయనకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘ది ఫ్రెండ్స్ ఆఫ్ ఎడ్డీ కోయల్’, ‘ఫ్రీబీ అండ్ ద బీన్’, ‘దట్ థింగ్ యూ డూ’, ‘ఎ బగ్స్ లైఫ్’ వంటి చిత్రాల్లోనూ రొకో తన ప్రత్యేకతను చాటుకున్నారు. మెసచుసెట్స్లోని కేంబ్రిడ్జ్లో 1936 ఫిబ్రవరి 29న పుట్టిన రొకో, 1960లలో సదరన్ కాలిఫోర్నియాకు మకాం మార్చారు. సినిమాల్లోకి రాకముందు కొద్దికాలం బార్టెండర్గా పనిచేశారు. హాలీవుడ్ నటి శాండీ ఎలైన్ గారెట్ను 1966లో పెళ్లాడారు. ఆమె 2002లో మరణించిన తర్వాత నటి షానన్ విల్కాక్స్ను పెళ్లాడారు. రొకోకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. -
నాకు ‘గాడ్ఫాదర్’ లేడు
⇒ అందుకే నిషేధం పడింది ⇒ ఇప్పటికీ చెబుతున్నా... నేను తప్పు చేయలేదు ⇒ శ్రీశాంత్ ఇంటర్వ్యూ ముంబై: భారత క్రికెట్లో తనకెవరూ గాడ్ఫాదర్ లేడని అందుకే జీవితకాల నిషేధం అనుభవిస్తున్నానని క్రికెటర్ శ్రీశాంత్ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినందుకు శ్రీశాంత్పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే తన మాట ఎవరూ వినలేదని, కేవలం ఐదు నిమిషాల్లోనే బోర్డుపెద్దలు తన తలరాతని నిర్ణయించారని వాపోతున్న శ్రీశాంత్ ఇంటర్వ్యూ... బీసీసీఐ మీకు అన్యాయం చేసిందని అనుకుంటున్నారా? అది అన్యాయం కంటే ఎక్కువ. అయినా నేను దాని గురించి మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే నా కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. నాకు ఎక్కువ మందిని శత్రువులుగా చేసుకునే ఉద్దేశం లేదు. ఒకటి మాత్రం స్పష్టం, నేను తప్పు చేసినట్లు కోర్టు చెప్పలేదు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నా గురించి, నా ఆట గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. నాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు. ఒకవేళ ఉంటే కోర్టులో తేలిపోతుంది. బీసీసీఐ అవినీతి నిరోధక అధికారుల ముందు కేసును ఉంచినప్పుడు నీకు సరిగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదా? వాళ్లు నా మాటలు సరిగ్గా వినకుండానే ఐదు నిమిషాల్లో నా తలరాతను నిర్ణయించారు. ఈ సంఘటనల గురించి బీసీసీఐ చూసుకుంటుందని, విచారణ నుంచి నన్ను బయటపడేలా చేస్తానని బీసీసీఐ నాకు తెలిపిందని నేను అధికారులతో చెప్పాను. తర్వాత నేను కిందికి వచ్చి నా కార్లో కూర్చున్నాను. అప్పుడే మీడియా నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి. నాపై జీవితకాలం నిషేధం విధించారని తెలుసుకొని దిగ్భ్రాంతి చెందాను. నాకు క్రికెట్లో గాడ్ఫాదర్ లేడు. అందుకే ఈ స్థితి. నా జీవితంలో సాధించింది మొత్తం దేవుడి దయవల్లే సాధ్యమైంది. కేవలం అప్పటి పరిస్థితుల ఆధారంగా నన్ను నిందితుడిగా పేర్కొన్నారు. నాపై సూటిగా ఎలాంటి ఆరోపణలు లేవు. ఇప్పటి వరకు ఏవీ నిరూపణ కాలేదు. బీసీసీఐ మొత్తాన్ని మార్చాలని సుప్రీంకోర్టు సూచిస్తోంది. ఒకవేళ అదే జరిగితే మీరు మళ్లీ ఆడగలరని ఆశిస్తున్నారా? అవును. నేను జాతీయ జట్టుకే ఆడాలని ఆశించడం లేదు. కేరళ రాష్ట్ర జట్టు, ఫస్ట్ క్లాస్, కౌంటీల్లో ఎక్కడైనా సరే నన్ను ఆడేందుకు అనుమతించాలని కోరుకుంటున్నా. నేను క్రికెట్ను చాలా ఇష్టపడతాను. కాస్త సమయం తీసుకున్నా అన్నీ బయటపడతాయి. అందుకోసం నేను దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. నా క్రికెట్ కెరీర్ను తిరిగి కోరుకుంటున్నాను. ప్రస్తుతం నా వయసు 31-32 ఏళ్లు. ఇంకా నాలుగైదేళ్లు ఆడగలను. గత రెండు సంవత్సరాలు ఎంత కష్టంగా గడిచాయి? నా శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదు. ఈ రెండేళ్లు కేవలం అవమానాలు మాత్రమే ఎదురయ్యాయి. అన్నింటికంటే ఎక్కువ బాధాకరమైన విషయం... మా ఇంటికి 500 మీటర్ల దూరంలోనే ఉన్న కొచ్చి మైదానంలోకి వెళ్లలేకపోవడం. అందుకు ప్రతిరోజు బాధపడతాను. సుప్రీం కోర్టు విచారణను గమనిస్తున్నారా? అవును. ఏదైనా గొప్ప నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నాను. నా కేసు విషయానికొస్తే ఒక విషయం మాత్రం స్పష్టం.. కోర్టులో నేను ప్రధాన నిందితుడిగా లేను. సహ నిందితుడిగా మాత్రమే ఉన్నాను. నాపై ఎటువంటి చార్జ్షీట్ లేదు. నా తరఫు న్యాయవాదులు జనవరి 13న వాదించనున్నారు. నేను నిర్ధోషిగా బయటపడతానని భావిస్తున్నాను. అంటే మీపై నిషేధం విధించాక ఎటువంటి మంచి జరగలేదంటారా? అలాంటిదేమీ లేదు. త్వరలో నేను తండ్రిని కాబోతున్నాను.