Golden Temple
-
మూడో రోజుకు చేరిన సుఖ్బీర్ ప్రాయశ్చిత్త దీక్ష
చండీగఢ్: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో జరిగిన హత్యాయత్నం నుంచి తృటిలో బయటపడిన పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్సింగ్ బాదల్ ప్రాయశ్చిత్త దీక్షను వరుసగా మూడో రోజు యథాతథంగా కొనసాగించారు. ఆయన గురువారం రూప్నగర్ జిల్లాలోని తఖ్త్ శ్రీకేస్గఢ్ సాహిబ్ గురుద్వారా బయట కాపలాదారుడిగా(సేవాదార్) విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జెడ్ ప్లస్ భద్రత కలిగిన సుఖ్బీర్సింగ్ ఉదయం 9 గంటలకు చక్రాల కురీ్చలో గురుద్వారాకు చేరుకున్నారు. కాపలాదారుడి దుస్తులు ధరించి, చేతిలో ఈటెతో విధుల్లో చేరారు. తర్వాత కొంతసేపు సిక్కు కీర్తనలు విన్నారు. ఇక్కడి వంటశాలలో పాత్రలు శుభ్రంచేశారు. సుఖ్బీర్ సింగ్తో ఆయన భార్య, ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్, కుమారుడు అనంత్బీర్ సింగ్ బాదల్, కుమార్తెలు హర్కీరత్కౌర్ బాదల్, గుర్లీన్ కౌర్ బాదల్ సైతం వంటశాలలో సేవలందించారు. 2007 నుంచి 2017 దాకా పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా సిక్కు అత్యున్నత సంస్థ అకల్ తఖ్త్ సుఖ్బీర్ సింగ్కు మతపరమైన శిక్ష విధించిన సంగతి తెలిసిందే. స్వర్ణ దేవాలయంలోపాటు మొత్తం ఐదు గురుద్వారాల్లో రెండు రోజుల చొప్పున పది రోజులపాటు సేవాదారుడిగా పనిచేయాలని అకల్ తఖ్త్ ఆదేశించింది. స్వర్ణ దేవాలయంలో రెండో రోజు బుధవారం ప్రాయశ్చిత్త దీక్షల ఉండగా సుఖ్బీర్ సింగ్పై హత్యాయత్నం జరిగింది. మాజీ ఉగ్రవాది నారాయన్ సింగ్ జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. -
అకాల్ తఖ్త్.. ఆదేశిస్తే ఏదైనా చేయాల్సిందే!.. మరి ఉల్లంఘిస్తే?
అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చేసిన పాపాలకుగానూ(తప్పిదాలు).. ఏకంగా డిప్యూటీ సీఎంగా పని చేసిన ఓ వ్యక్తికి శిక్షలు విధించింది సిక్కు మతానికి చెందిన అకాల్ తఖ్త్. బాత్రూంలు, వంటగదులు, వరండాలు కడగడం.. షూలు, చెప్పులను శుభ్రం చేయడం లాంటి పనులు చేయాలని హుకుం జారీ చేసింది. ఆ ఆదేశాల్ని ఉల్లంఘించకుండా సుఖ్బీర్ సింగ్ బాదల్ శిరసావహించారు. ఈ క్రమంలోనే ఆయనపై జరిగిన హత్యాయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. అకాల్ తఖ్త్ విధించిన ఈ శిక్షల గురించి తెలిసి చాలామంది ముక్కున వేలేసుకున్నారు.సిక్కు మత సమగ్రతను కాపాడుకోవడంతో పాటు తప్పు చేసిన వ్యక్తికి తన తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చి.. తద్వారా మత సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ వ్యక్తిని మార్చుకోవడమే అకాల్ తఖ్త్ ఉద్దేశం. అయితే.. ఇక్కడే కొన్ని సందేహాలు కలగకమానవు. అసలు అకాల్ తఖ్త్ను నడిపించేదెవరు?. ఒకవేళ ఆ శిక్షకు తలొగ్గకపోతే ఏం చేస్తారు?. నిజంగానే తీవ్ర పరిణామాలు ఉంటాయా?. సాధారణంగా అకాల్ తఖ్త్ విధించే శిక్షలను పరిశీలిస్తే..బహిరంగ క్షమాపణలు.. తప్పు చేసినవాళ్లతో సిక్కు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిస్తారుపాప పరిహారం కింద.. సేవా కార్యక్రమాల్లో(బాత్రూంలు, వంటగది, వరండాలు శుభ్రం చేయడం.. వంట చేర్చి వార్చడం, కాపలా పని, వగైరా) ద్వారా పాప పరిహారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. బహిష్కరణ.. నేర తీవ్రతను బట్టి సిక్కు సమాజం నుంచి వాళ్లను వెలివేస్తారు. ఇది కొంత కాలపరిమితితో ఉంటుంది. తద్వారా.. మతపరమైన కార్యక్రమాల్లో వాళ్లు భాగం కాలేరు. మరి ఈ శిక్షలను ఉల్లంఘిస్తే..?ఎవరైనా అకాల్ తఖ్త్ శిక్షలను గనుక ఉల్లంఘిస్తే.. పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.శాశ్వత బహిష్కరణ.. అకాల్ తఖ్త్ శిక్షలకు తలొగ్గనివాళ్లను శాశ్వతంగా సిక్కు సమాజం నుంచి వెలివేస్తారు.సామాజిక బహిష్కరణలో భాగంగా.. సిక్కు కమ్యూనిటీ నుంచి వాళ్లకు ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎలాంటి సాయం అందించరు. తద్వారా.. వాళ్లను ఒంటరిని చేసేస్తారు.ఆధ్యాత్మిక సయోధ్య.. దండించడం బదులు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నం చేస్తారు. కౌన్సెలింగ్లాంటివి ఇప్పించి.. వాళ్లను మళ్లీ దారిలో పెట్టే ప్రయత్నం చేశారు.పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం మరొకటి ఉండదంటారు కదా. ఒత్తిడి చేయడం ద్వారా వాళ్లు తమ తప్పులను ఒప్పకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు.ఇవేవీ పని చేయని క్రమంలో.. సిక్కు సంఘాలే రంగంలోకి దిగుతాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాయి. అయితే.. ఇన్నేళ్ల కాలంలో పరిస్థితి ఇంతదాకా ఏనాడూ రాలేదు.అకాల్ తఖ్త్ ద్వారా శిక్షించబడిన వాళ్లు ఎందరో.. వాళ్లలో కొందరు ప్రముఖులూ ఉన్నారు.మహారాజా రంజిత్ సింగ్సిక్కుల తొలి చక్రవర్తి. పరమతానికి చెందిన నృత్యకారిణిని వివాహం చేసుకున్నారనే నేరం కింద అకాల్ తఖ్త్ ఆయనకు కొరడాతో దెబ్బలు తినాలని శిక్ష విధించింది. అయితే ఆయన క్షమాపణలు చెప్పడంతో మన్నించి వదిలేసింది తఖ్త్.జ్ఞానీ జైల్సింగ్భారత మాజీ రాష్ట్రపతి. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ టైంలో ఆయన రాష్ట్రపతిగా ఉన్నారు. స్వర్ణ దేవాలయంలోకి ఆర్మీని అనుమతించారనే నేరం కింద ఆయన్ని అకాల్ తఖ్త్ శిక్షించింది. అయితే రాత పూర్వకంగా క్షమాపణలు కోరుతూ ఆయన లేఖ రాశారు.బూటా సింగ్కేంద్ర మాజీ మంత్రి. ఈయన్ని కూడా ఆపరేషన్ బ్లూ స్టార్ కిందే శిక్షించింది అకాల్ తఖ్త్. శిక్షను అంగీకరించిన ఆయన.. కమ్యూనిటీ సేవలో పాల్గొన్నారు కూడా.సుర్జిత్ సింగ్ బర్నాలాపంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. ఆపరేషన్ బ్లాక్ థండర్(అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లోకి బ్లాక్ క్యాట్ కమాండోలను అనుమతించడంలో ఈయన పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆయన్ని కాస్త కఠినంగానే శిక్షించారు. అకాల్ తఖ్త్కు జరిమానా కట్టడంతో బూట్లు శుభ్రం చేసి.. సిక్కు ప్రార్థనల్లో పాల్గొని తన పాపపరిహారం చేసుకున్నారాయన. సుఖ్వీర్సింగ్ బాదల్పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం. శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2007-17 మధ్య కాలంలో పార్టీతోపాటు వారి ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు అకాల్ తఖ్త్ నిర్ధారించింది. ఇందులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు మద్దతు ఇవ్వడం కూడా ఉంది. ఈ విషయంలో పార్టీ చీఫ్ సుఖ్బీర్ను దోషిగా తేల్చింది. అయితే తాను చేసిన తప్పులను అంగీకరించిన(మూడు నెలల కిందటే) సుఖ్బీర్ బేషరతు క్షమాపణలు చెప్పారు. ఆపై కాలు ఫఫ్రాక్చర్ అయ్యి వీల్ చైర్కు పరిమితమైనా సరే.. అభియోగాలు ఎదుర్కొంటున్న తోటి పార్టీ నేతలతో కలిసి ఇప్పుడు అకాల్ తఖ్త్ విధించిన శిక్షలను అనుభవించారు. అకాల్ తఖ్త్.. ఒరిజినల్ పేరు అకాల్ బుంగా. సిక్కులు పవిత్రంగా భావించే ఐదు తఖ్త్లలో ఇది ఒకటి. పంజాబ్ అమృత్సర్ దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్లో ఉంది. సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగం. సిక్కు మతగురువు గురు హరగోవింద్ జూన్ 15, 1606లో దీనిని అమృత్ సర్లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్లో నెలకొల్పారు. ఆ ప్రాంతంలోనే ఆయన బాల్యమంతా గడిచిందన్న వాదన ఒకటి ఉంది. 👉పిరి-మిరి అంటే.. ఆధ్యాత్మికంగానే కాకుండా సిక్కు సమాజానికి ఎదురయ్యే ఆందోళనల మీద చర్చ జరిపే ఉద్దేశంతో ఒక తాత్కాలిక అధికార వేదికను గురు హరగోవింద్ స్థాపించారు. పిరి-మిరికి ప్రతీకగా ఈ వేదికపై రెండు కత్తులను ఉంచారాయన. హర్గోవింద్తో పాటు బాబా బుద్ధా, భాయ్ గురుదాస్లు అకాల్ తఖ్త్ ఏర్పాటులో భాగమయ్యారు. 👉సిక్కుల అత్యున్నత విభాగంగా అకాల్ తఖ్త్కు పేరుంది. సర్బత్ ఖాల్సా యావత్ సిక్కు సంఘాలకు అత్యున్నత అధికారి కాగా.. జతేదార్(లీడర్)ను అకాల్ తఖ్త్ అధికార ప్రతినిధిగా గుర్తిస్తారు. సిక్కులకు మతపరమైన అధికారానికి కేంద్రంగా ఉన్న అకాల్ తఖ్త్ను అభివర్ణిస్తారు. 👉 పంజాబ్తో పాటు పాట్నా, బీహార్, మహారాష్ట్రలలో ఇలాంటి అధికార కేంద్రాలే ఉన్నాయి. అకాల్ తఖ్త్ నుంచి జారీ అయ్యే హుకామ్నామా(ఆదేశాలను).. ప్రతీ సిక్కు పాటించడం తప్పనిసరి. 👉 అకాల్ తఖ్త్ అనేది.. ఆకాలంలో అణచివేతకు వ్యతిరేకంగా చేసిన సిక్కులు చేసిన పోరాటానికి గుర్తు. అయితే ఈ సిక్కుల సార్వభౌమాధికార ప్రతీకపై దాడులు జరిగాయి. 18వ శతాబ్దంలో అహ్మద్ షా అబ్దాలీ దాడులతో మొదలై.. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్లో అకాల్ తఖ్త్ దెబ్బ తింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో తాత్కాలికంగా అకాల్ తఖ్త్ నిర్మాణం జరిగినప్పటికీ.. దానిని ప్రభుత్వ వ్యతిరేక వర్గం ధ్వంసం చేసి.. పునఃనిర్మించుకున్నారు. ఆపరేషన్ బ్లూస్టార్లో.. దామ్దామి తక్సల్ 14వ జతేదార్ అయిన జర్నైల్ సింగ్ భింద్రన్వాలేపై.. పంజాబ్లో అతివాద సంస్థను నడిపిస్తున్నాడనే అభియోగాలు ఉన్నాయి. 1983 జులైలో.. అకాలీదళ్ అధ్యక్షుడు హర్చరణ్ సింగ్ లాంగోవాల్, అప్పటి అకాల్ తఖ్త్ జతేదర్ల ఆహ్వానం మేరకు బింద్రాన్వాలే గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్కి చేరుకున్నాడు. అక్కడ అరెస్ట్కు భయపడి అకాల్ తఖ్త్లో తలదాచుకున్నాడు. అయితే.. అతని జాడ కనిపెట్టిన అప్పటి ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. భారత సైన్యానికి అనుమతి ఇచ్చింది. 1984 జూన్ 3 నుంచి జూన్ 5వ తేదీల మధ్యలో.. గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ నడిచింది. ఈ ఆపరేషన్లో అకాల్ తఖ్త్ భారీగా డ్యామేజ్ అయ్యింది. మిలిటెంట్లకు, ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో భింద్రాన్వాలే చనిపోయాడు.ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత.. అకాల్ తఖ్త్ను తిరిగి నిర్మించేందుకు అప్పటి జతేదార్ బాబా సంతా సింగ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఇందుకు కేంద్రం నుంచి నిధుల సమీకరణ కూడా చేయాలనుకున్నాడు. అయితే.. అందుకు సిక్కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అయ్యింది. అయినా కూడా సర్బత్ ఖాల్సా సహకారంతో జతేదార్ నెలన్నర వ్యవధిలోనే(1984, ఆగష్టు 11) అకాల్ తఖ్త్ నిర్మాణం పూర్తి చేశారు. అయితే.. అదే సర్బత్ ఖాల్సా కూల్చేయాలని తీర్మానం చేసింది. జనవరి 1986లో కూల్చేసి.. బాబా సంతా సింగ్ను సిక్కు మర్యాదను దెబ్బ తీశాడనే కారణం చూపించి వెలివేసింది. 2001లో తిరిగి ఆయన్ని సిక్కు కమ్యూనిటీలో చేర్చుకుంది. అయితే.. సిక్కులకు న్యాయ పీఠంగా అకాల్ తఖ్త్ కొనసాగుతున్నప్పటికీ.. కాలక్రమంలోని పరిణామాలు(నిర్మాణాలపరంగా) మాత్రం ఆ సాంస్కృతిక వారసత్వాన్ని మాత్రం బాగా దెబ్బతీసింది. -
సుఖ్బీర్ సింగ్పై కాల్పులు.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: పంజాబ్లోని స్వర్ణ దేవాలయంలో మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై జరిగిన హత్యాయత్నంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవిద్ కేజ్రీవాల్ స్పందించారు. శిరోమణి అకాలీదళ్ నేత బాదల్ జరిగిన కాల్పుల ఘటన.. పంజాబ్ ప్రతిష్టను తీసేందుకు జరిగిన కుట్రగా అభివర్ణించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడిలో అనేక శక్తులు పాల్గొన్నాయని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నేడు పంజాబ్లో ఊహించని ఓ సంఘటన జరిగిందన్నారు. పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.పంజాబ్ మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై ఓ వ్యక్తి కాల్పులకు ప్రయత్నించాడు. కానీ ఈఘటనలో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనను నేను ఖండిస్తున్నాను. అయితే పంజాబ్, పంజాబీ ప్రజల పరువు తీసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందన్నది ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.. ఇందులో అనేక శక్తులు ఉన్నాయి' అని ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ అన్నారు.అయితే కాల్పుల సమయంలో పంజాబ్ పోలీసులు వ్యవహరించిన తీరును కేజ్రీవాల్ ప్రశంసించారు. అంతేగాక ప్రతిచోటా పంజాబ్లో శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి కానీ ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి ఏంటని కేజ్రీవాల్ ప్రశ్నించారు.కాగా సర్వదేవాలయం ఎదుట సుఖ్బీర్ సింగ్ బాదల్పై బుధవారం తెల్లవారుజామున హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఆయన సేవాదార్గా శిక్ష అనుభవిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు బాదల్పై కాల్పులకు తెగబడ్డాడు. అయితే అతని వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తమవ్వడంతో బుల్లెట్లు గోడను తాకాయి. ఈ ప్రమాదంలో బాదల్కు ఎలాంటి గాయాలు అవ్వలేదు.కాల్పులు జరిపిన వ్యక్తిని మాజీ ఉగ్రవాది నరైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. గతంలో అతడు ఖలిస్తానీ కార్యకలాపాల్లో అలాగే బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) ఉగ్రవాదిగా పనిచేసినట్లు తెలిసింది.కాల్పుల ఘటన అనంతరం సుఖ్బీర్ తన శిక్షను కొనసాగించారు. సతీమణి హర్సిమ్రత్కౌర్ బాదల్తో కలిసి స్వర్ణదేవాలయంలో వంటపాత్రలు శుభ్రం చేశారు. ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ‘సుఖ్బీర్ బాదల్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించా’’ అని వెల్లడించారు. -
పంజాబ్ స్వర్ణ దేవాలయం వద్ద కాల్పుల కలకలం
-
స్వర్ణ దేవాలయంలో పేలిన తూటా... సుఖ్బీర్పై హత్యాయత్నం
అమృత్సర్/చండీగఢ్: సిక్కులకు పరమ పవిత్రమైన అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో దారుణం చోటుచేసుకుంది. శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్సింగ్ బాదల్ (62)పై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఉదయం 9.30 గంటలకు నారైన్ సింగ్ చౌరా అనే మాజీ ఉగ్రవాది అత్యంత సమీపానికి దూసుకొచ్చి ఆయనపై పిస్తోల్తో కాల్పులు జరిపాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకొని దూరంగా లాక్కెళ్లారు. తూటా గురి తప్పడంతో సుఖ్బీర్ సింగ్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. మీడియా కెమెరాల్లో రికార్డయిన ఈ హత్యాయత్నం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2007 నుంచి 2017 దాకా పంజాబ్లో అకాలీదళ్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా మతాచారం ప్రకారం స్వర్ణదేవాలయం ప్రవేశద్వారం వద్ద సుఖ్బీర్ సింగ్ మంగళవారం కాపలాదారు (సేవాదార్)గా మారారు. బుధవారం ఆయన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. కాపలాదారు దీక్షలో ఉండగానే హత్యాయత్నం జరిగింది. కాలికి గాయమవడంతో చక్రాల కుర్చీలో కూర్చొని ఉన్న సుఖ్బీర్ వైపు నారైన్ నెమ్మదిగా నడుస్తూ వచ్చాడు. అంతా చూస్తుండగానే జేబులోంచి పిస్తోల్ బయటకు తీసి సుఖ్బీర్పై గురిపెట్టాడు. ఆయన పక్కనే నిల్చున్న ఏఎస్సై జస్బీర్ సింగ్ వెంటనే నారైన్ చేతిని దొరకబుచ్చుకొని వెనక్కి నెట్టేశాడు. దాంతో తూటా గురి తప్పి ఆలయ ప్రవేశద్వారం గోడలోకి దూసుకెళ్లింది. ఇతర పోలీసు సిబ్బంది సుఖ్బీర్ చుట్టూ రక్షణ వలయంగా నిల్చున్నారు. భద్రతా సిబ్బందితో పాటు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ టాస్్కఫోర్స్ సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. కాల్పుల సమాచారం తెలియగానే సుఖ్బీర్ భార్య, ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుఖ్బీర్కు జెడ్ ప్లస్ భద్రత ఉంది. నారైన్ను డేరాబాబా నానక్ ప్రాంతానికి చెందిన మాజీ ఉగ్రవాదిగా గుర్తించారు. అతడిని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పిస్తోల్ స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండడం వల్లే సుఖ్బీర్సింగ్కు ప్రాణాపాయం తప్పిందని అమృత్సర్ పోలీసు కమిషనర్ గురుప్రీత్సింగ్ భుల్లార్ చెప్పారు. నిందితుడు ఒంటరిగానే స్వర్ణదేవాలయానికి వచ్చాడని తెలిపారు. హత్యాయత్నానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. నిందితుడిని చాకచక్యంగా అడ్డుకున్న ఏఎస్ఐ జస్బీర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సుఖ్బీర్పై కాల్పుల ఘటనను వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన వెనుక కారణాలు నిగ్గుతేల్చి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆఖల్ తక్త్ నిర్దేశం ప్రకారం స్వర్ణ మందిరంలో మతపరమైన సేవ అందిస్తున్న సుఖ్బీర్ను హత్య చేయాలని చూడడం చాలా బాధాకరమని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ చీఫ్ హర్జీందర్ సింగ్ ధామీ అన్నారు. ఇదిలా ఉండగా, ఖలిస్తాన్ ఉద్యమాన్ని సుఖ్బీర్ సింగ్ వ్యతిరేకిస్తున్నందుకే ఆయనను హత్య చేయాలని చౌరా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పంజాబ్పై బీజేపీ కుట్ర: కేజ్రీవాల్ సుఖ్బీర్పై హత్యాయత్నాన్ని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. పంజాబ్లో ఆప్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను, పోలీసులను అప్రతిష్టపాలు చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. శాంతిభద్రతలను ఎలా కాపాడాలో పోలీసులు చూపించారని కొనియాడారు. హత్యాయత్నంపై సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసులను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆదేశించారు. పంజాబ్లో ఆప్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ఆరోపించారు. ఆప్ సర్కారు అసమర్థత వల్లే ఈ సంఘటన జరిగిందని మండిపడ్డారు. దీనికి మాన్ బదులివ్వాలని డిమాండ్ చేశారు. Amritsar : सुखबीर सिंह बादल पर जानलेवा हमला #SukhbirSinghBadal #Punjab #GoldenTemple pic.twitter.com/S5x0EegGRE— Adv Jony Ambedkarwadi 🇮🇳 (@TheJonyVerma) December 4, 2024ఎవరీ చౌరా? సుఖ్బీర్సింగ్ బాదల్పై కాల్పులు జరిపిన నారైన్ సింగ్ చౌరా (68) గతంలో కరడుగట్టిన ఉగ్రవాది అని పోలీసులు చెప్పారు. తీవ్రవాద ఘటనల్లో, ఖలిస్తానీ ఉగ్రవాద కార్యకలాపాల్లో అతడి హస్తముందని వెల్లడించారు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల్లో చురుగ్గా పని చేశాడని తెలిపారు. అతడిపై ఆయుధాలు, పేలుడు పదార్థాల అక్రమ రవాణా సహా 12కుపైగా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. → గురుదాస్పూర్ జిల్లా చౌరా గ్రామంలో పుట్టిన చౌరా చిన్నప్పుడే ఖలిస్తానీ తీవ్రవాదం పట్ల ఆకర్శితుడయ్యాడు.→ ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్, అకల్ ఫెడరేషన్ వంటి సంస్థల్లో పని చేశాడు. పంజాబ్ మాజీ సీఎం బియాంత్సింగ్ హత్య కేసు నిందితులతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయి. → బురైల్ జైలును బద్ధలు కొట్టి, ఖైదీలు తప్పించుకొని పారిపోయిన ఘటనకు చౌరాయే సూత్రధారి అని ఆరోపణలున్నాయి.→ చౌరా 1984లో పంజాబ్లో ఉగ్రవాదం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు పాకిస్తాన్కు పారిపోయాడు. అక్కడి నుంచే పంజాబ్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించాడు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు అందజేశాడు. → పాకిస్తాన్లో ఉన్నప్పుడే గెరిల్లా యుద్ధరీతులపై, దేశద్రోహంపై పుస్తకాలు రాశాడు. ఖలిస్తాన్ విరుద్ధ్ సాజిష్ అనే వివాదాస్పద పుస్తకం అతడు రాసిందే. → పంజాబ్లో రాజకీయంగా ప్రాబల్యం కలిగిన బాదల్ కుటుంబం అంటే చౌరాకు మంట. మితవాదులంటే అతడికి నచ్చదు. 1980వ దశకం నుంచి బాదల్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడుతున్న హవారా గ్రూప్లో చౌరా కూడా సభ్యుడే. → చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. → చౌరా తొలిసారిగా 2013 ఫిబ్ర వరి 28న పంజాబ్లోని తార్న్ తరన్లో అరెస్టయ్యాడు. అప్ప ట్లో మొహాలీలోని అతడి నివా సంలో భారీ ఎత్తున ఆయుధా లు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. -
పాత్రలు కడిగి, షూస్ శుభ్రం చేసిన మాజీ డిప్యూటీ సీఎం.. కారణం ఇదే
అమృత్సర్ : సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగంగా పరిగణించే అకాల్ తఖ్త్ విధించిన శిక్షను పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ పాటిస్తున్నారు.అకాల్ తఖ్త్ విధించిన శిక్షలో భాగంగా మంగళవారం అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్లో సుఖ్బీర్ సింగ్ బాదల్ నీలిరంగు ‘సేవాదర్’ దుస్తులు ధరించారు. కాలికి గాయం కావడంతో కాలికి గాయం కావడంతో వీల్ చైర్లో కూర్చొని పాత్రల్ని కడిగారు. షూస్ను శుభ్రం చేశారు. అకాల్ తఖ్త్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్తో పాటు శిరోమణి అకాలీదళ్ పార్టీ నేతలకు సైతం ఈ శిక్షను అనుభవిస్తున్నారు. సుఖ్బీర్ సింగ్ బాదల్తో పాటు పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజిథియా సైతం పాత్రల్ని కడిగారు. ఈ శిక్షను అనుభవించే సమయంలో అకాలీదళ్ నేతల మెడలో వారు ఏ తప్పులు చేశారు. అందుకు గాను అకాల్ తఖ్త్ ఏ శిక్షలు విధించిందో తెలిపేలా ఓ పలకను కూడా ఉంచింది. అధికారంలో ఉండగా అనేక తప్పిదాలుపంజాబ్లో బీజేపీతో దశాబ్ద కాలంగా పొత్తు పెట్టుకున్న సమయంలో శిరోమణి అకాలీదళ్ అనేక మతపరమైన తప్పిదాలకు కారణమని అకాల్ తఖ్త్ పేర్కొంది. ఆ సమయంలో సుఖ్ బీర్ సింగ్ బాదల్ సహా ఆయన అనుచరులు 2007-2017 మధ్య అధికారంలో ఉన్న సమయంలో తప్పులు, మతపరమైన దుష్ప్రవర్తనలకు పాల్పడ్డారని ఈ ఏడాది ఆగస్ట్లో అకాల్ తఖ్త్ తేల్చింది. డేరా బాబాకు మద్దతుగా నిలిచారని సుఖ్ బీర్ సింగ్ బాదల్ పలు నేరాలకు పాల్పడిన డేరా బాబాకు మద్దతుగా నిలిచారని తెలిపింది. చేసిన తప్పులకు సుఖ్ బీర్ సింగ్ బాదల్ శిక్ష విధించింది. శిక్షలో భాగంగా స్వర్ణ మందిర్ సహా పలు గురుద్వారాల్లో సేవాదార్లుగా పని చేయాలంటూ శిక్ష ఖరారు చేసింది. సేవాదార్లుగా మరుగుదొడ్లు, వంటశాలలు శుభ్రం చేయాలని, బూట్లు తుడవాలని ఆదేశించింది. అయితే,వారు చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పినా అకాల్ తఖ్త్ అంగీకరించలేదు. దీంతో అకాత్ తఖ్త్ విధించిన శిక్షలో భాగంగా సుఖ్ బీర్ సింగ్ బాదల్ సేవాదార్గా పనిచేశారు. VIDEO | Punjab: Shiromani Akali Dal leader Sukhbir Singh Badal serves as a 'sewadar' at Golden Temple in Amritsar.#PunjabNews (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/c6lRVUbRX6— Press Trust of India (@PTI_News) December 3, 2024 -
మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్కు అకాల్ తఖ్త్ శిక్ష
ఛండీగఢ్: సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగంగా పరిగణించే అకాల్ తఖ్త్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాను గతంలో చేసిన పలు తప్పులకు సుఖ్బీర్ సింగ్ బాదల్ గురుద్వారాల్లో పాత్రలు, బూట్లు, టాయిలెట్లను శుభ్రం చేయాలని ఆదేశించింది. అంతేకాదు.. సుఖ్బీర్ సింగ్ బాదల్ తండ్రి, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్కు గతంలో ఇచ్చిన ఫఖర్-ఎ-కౌమ్ (సిక్కు సమాజానికి గర్వకారణం) బిరుదును కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో పాటు శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్గా ఉన్న ఆయన రాజీనామాను ఆమోదించి.. ఆరు నెలల్లోగా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని సూచించింది.2007 నుండి 2017 వరకు పంజాబ్లో అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన తప్పులకు సుఖ్బీర్ సింగ్ బాదల్ క్షమాపణలు చెప్పడంతో అకాల్ తఖ్త్ ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అకాల్ తఖ్త్ ఆదేశాల్ని సుఖ్బీర్ సింగ్ బాదల్ పాటించనున్నారు. VIDEO | Five high priests headed by Akal Takht Jathedar Giani Raghbir Singh pronounce punishment for former Punjab deputy CM Sukhbir Singh Badal for religious misconduct.On August 30, Sukhbir was declared ‘tankhaiya’ by Akal Takht, which held him guilty of religious misconduct… pic.twitter.com/MwPKXI1OS3— Press Trust of India (@PTI_News) December 2, 2024 -
ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆధ్యాత్మికత వైపు..
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ చెప్పుకొనేదే.. నగరంలో ఉరుకులు పరుగుల జీవితం.. మానసిక సమస్యలు, చిరాకులు, కుటుంబ సమస్యలకు దారి తీస్తున్నాయనే విషయం తెలిసిందే. ఒత్తిళ్లు తట్టుకోలేక ఆందోళనలకు గురవుతూ.. మత్తుపానీయాలకు బానిసలు అవుతున్నారు. కంపెనీల్లో ఒత్తిడి ఎంతలా ఉందంటే ఒత్తిడి నుంచి బయటపడేందుకు పలు కంపెనీల్లో ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్స్ ఏర్పాటు చేశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.చాలామంది ఉద్యోగులు వారాంతాల్లో కుటుంబంతో, స్నేహితులతో కలిసి జాలీగా గడిపేందుకు ప్లాన్స్ చేసుకుంటారు. సమీపంలోని ప్రశాంతంగా ఉండే రిసార్టులకు కొందరు వెళ్తుంటారు. మరికొందరు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ కుటుంబసభ్యులతో గడుపుతుంటారు. అయితే కొందరు ఉద్యోగులు.. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం భక్తి చింతన, ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే యువత కొత్త దారి వెతుక్కుంటూ.. నగరంలోని, శివారు ప్రాంతాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాల వైపు పరుగులు పెడుతున్నారు.ఎందుకిలా..? సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ప్రాజెక్టులు, టార్గెట్లు, రిపోర్టులు, సబి్మషన్లు ఇలా ఒక్కటేమిటి ఎన్నో ఒత్తిళ్లతో రోజును భారంగా గడుపుతుంటారు. నెలాఖరు రాగానే లోన్లు, ఈఎంఐలు కట్టేందుకు నానా తిప్పలు మరింత కామన్. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆల్కహాల్, సిగరెట్ వంటి అలవాటు చేసుకుని, అధికంగా సేవిస్తుంటారు. దీనికి తోడు ఎలాంటి శారీరక వ్యాయామాలు లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దీంతో కలల ప్రపంచం ఒక్కసారిగా నేలకు దిగిపోతుంటుంది. అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొత్త దారి వెతుక్కుంటారు. సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ అనగానే వీకెండ్స్ పార్టీలకు వెళ్తుంటారు అని భావిస్తుంటారు. కానీ అక్కడికి వెళ్లినా కూడా తమ ఉద్యోగ జీవితాల ద్వారా వచ్చే ఒత్తిడిని తట్టుకునేంత ప్రశాంతత దొరకట్లేదని ఆధ్యాతి్మక చింతన మార్గాన్ని ఎంచుకుంటున్నారు.చిన్న వయసులోనే..వారాంతాల్లో నగరంలోని పలు దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు యువతీ, యువకులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని పలు ప్రముఖ ఆలయాలు, ఆధ్మాత్మిక క్షేత్రాలతో పాటు శివారు ప్రాంతాల్లోని నగరాలకు కూడా ఉద్యోగులు క్యూ కడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రమే కాకుండా విద్యార్థులు కూడా ఇక్కడికి చేరుకుని చిన్న వయసులోనే వారిలో ఏర్పడిన ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. ముఖ్యంగా ఏకాంతంగా కూర్చుని దేవుడి ముందు ధ్యానం చేసుకుంటూ కనిపిస్తున్నారు. నగరంలోని ఇస్కాన్ టెంపుల్స్, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వంటి క్షేత్రాల్లో నృత్యాలు చేస్తూ తన్మయత్వం చెందుతున్నారు. కృష్ణుడి సంకీర్తనలు, భజనలు చేసుకుంటూ వారిలోని ఆధ్యాత్మిక భావాన్ని చాటుకుంటున్నారు. జీవితానికి కొత్త ఒరవడిని చూపుకొంటున్నారు. జీవిత సత్యాన్ని తెలుసుకునేందుకు అన్వేషిగా బయల్దేరుతున్నారు.ఆ రోజులే బాగున్నాయి.. చాలీచాలని డబ్బులతో ఉద్యోగం కోసం వెతుక్కుంటూ హైదరాబాద్లో తిరిగిన రోజులే బాగున్నాయి. అప్పుడు ఉద్యో గం వస్తే చాలు అనుకునే వాడిని. ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. అయినా ఏదో పోగొట్టుకున్న వెలితి ఉంది. సవాలక్ష సమస్యలు చుట్టు ముడుతున్నట్లు ఉంది. ప్రశాంతత అనే మాటే కరువైంది. నెలాఖరు రాగానే లోన్లు.. ఈఎంఐల వెంట పరిగెత్తాల్సి వస్తోంది. డబ్బులు అన్నీ ఇవ్వదనే విషయం అవగతమవుతోంది. అందుకే భక్తి మార్గం ప్రశాంతతను ఇస్తుందనే ఉద్దేశంతో ప్రతి వారం ఏదైనా గుడికి వెళ్లి ఒంటరిగా కాసేపు గడుపుతాను. – నల్లం నవీన్, సాఫ్ట్వేర్ ఇంజినీర్మనసుకు ప్రశాంతత నాకు ఆధ్యాతి్మక భావన ఎక్కువ. చిన్నప్పటి నుంచి దేవాలయాలకు వెళ్లడం, పూజా కార్యక్రమాలు చేపట్టడం అలవాటు. పెళ్లయిన తర్వాత ఉద్యోగం, విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడి ఎదుర్కొంటున్నాం. వారంలో శని, ఆదివారాలు రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. పిల్లలు, ఇల్లు కుటుంబాన్ని చూసుకోవడానికే సరిపోతుంది. శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఆలయాలకు వెళ్తుంటాం. తిరుపతి, శ్రీశైలం, అరుణాచలం, వేములవాడ, యాదగిరిగుట్ట, ఈ మధ్య స్వర్ణగిరి వెళ్లాం. – నిహారికారెడ్డి, మియాపూర్ -
Baisakhi: పంజాబ్లో మొదలైన వైశాఖ మాస వేడుకలు.. (ఫోటోలు)
-
గిన్నెలు కడిగిన రాహుల్ గాంధీ.. స్వర్ణ దేవాలయంలో పూజలు..
అమృత్సర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వర్ణ దేవాలయంలో ప్రార్ధనలు నిర్వహించి అనంతరం 'కర సేవ'లో పాల్గొని భక్తులకు ప్రసాదాలు వడ్డించిన గిన్నెలను కడిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన భారత్ జోడో యాత్ర సందర్బంగా గత కొంత కాలంగా జనంతో మమేకమవుతూ వస్తున్నారు. ఇటీవల రైల్వే కూలీగానూ, వడ్రంగిగానూ సామాన్యులతో సమయం గడిపిన ఆయన ఈ రోజు స్వర్ణదేవాలయంలో పనివాడిగా మారిపోయారు. ఈ రోజు ఉదయం 11.15 గంటలకు ప్రత్యేక విమానంలో పంజాబ్ వచ్చిన ఆయన అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయంలో తలకు నీలిరంగు పాగాను ధరించి మొదట ప్రార్ధనలు నిర్వహించిన ఆయన అనంతరం 'కర సేవ'లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ భక్తులకు ప్రసాదాన్ని అందించే గిన్నెలను కడిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అయ్యింది. Rahul Gandhi cleans utensils in the Golden Temple, Amritsar#RahulGandhiInGoldenTemple pic.twitter.com/G4GJaAYxG1 — Syed Z🇮🇳INDIA (@syed_zakir_1947) October 2, 2023 అంతకుముందు రాహుల్ గాంధీ పర్యటన గురించి అక్కడి కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా కార్యకర్తలకు సందేశమిచ్చారు. రాహుల్ గాంధీ సఖ్చంద్ శ్రీ హార్మిందర్ సాహిబ్ను స్మరించుకునేందుకు అమృత్సర్ వస్తున్నారు. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన. ఆయన ప్రైవసీని మనం గౌరవించాలి. కాబట్టి కార్యకర్తలు ఎవ్వరూ ఆయనను కలిసేందుకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన మళ్ళీ వచ్చినప్పుడు కలిసి మీ మద్దతు తెలపాలని కోరారు. Shri @RahulGandhi ji is coming to Amritsar Sahib to pay obeisance at Sachkhand Shri Harmandir Sahib. This is his personal, spiritual visit, let’s respect his privacy. Request all party workers to not be physically present for this visit. You all can show your support in spirit &… — Amarinder Singh Raja Warring (@RajaBrar_INC) October 2, 2023 ఇది కూడా చదవండి: వందే భారత్ రైలుకు తప్పిన పెనుప్రమాదం -
కాబోయే భర్తతో కలిసి ప్లేట్లు కడిగిన బాలీవుడ్ నటి
-
అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!
ఆమె బాలీవుడ్లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్. ఓవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గత నెలలో ఈమెకు నిశ్చితార్థం జరిగింది. త్వరలో తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి కూడా చేసుకుబోతుంది. అలాంటి ఆమె.. ఇప్పుడు సడన్ గా ఓ చోట ప్రత్యక్షమైంది. కాబోయే భర్తతో కలిసి ప్లేట్లు కడిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ గా మారాయి. ఇంతకీ ఏం జరిగింది? ఎవరా బ్యూటీ? బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు కాస్తో కూస్తో తెలుసు. శుద్ధ్ దేశీ రొమాన్స్, కేసరి తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం 'చమ్కీలా' అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు అక్షయ్ కుమార్ తో కలిసి 'ద గ్రేట్ ఇండియా రెస్క్యూ' సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇది అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) రాఘవ్తో పెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దాతో హీరోయిన్ పరిణీతి చోప్రాకు పెళ్లి కుదిరింది. గత కొన్నేళ్లుగా వీళ్లు డేటింగ్ లో ఉన్నారు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకుండా, బయటపడకుండా చాలా జాగ్రత్తపడ్డారు. గత నెలలో అంటే మే 13న వీళ్లకు నిశ్చితార్థం జరిగింది. దీనికి కొన్ని రోజుల ముందు మాత్రమే.. ఈ జంట గురించి న్యూస్ బయటకొచ్చింది. త్వరలో రాజస్థాన్ లో వీళ్లిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. గోల్డెన్ టెంపుల్లో త్వరలో పెళ్లి చేసుకోనున్న పరిణీతి-రాఘవ్.. శనివారం ఉదయం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్(స్వర్ణ దేవాలయం)ని కనిపించారు. దర్శనానంతరం అన్నదాన సత్రంలో ప్లేట్లు కడిగే సేవలో పాల్గొన్నారు. ఈ ఫొటోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవాలయంలో రాఘవ్-పరిణీతి తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. (ఇదీ చదవండి: 'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్కి అక్క?) -
గుర్బానీ ప్రసారాలు ఉచితం
చండీగఢ్: సిక్కులు పఠించే పవిత్ర శ్లోకం గుర్బానీ ఇకపై ఉచితంగా ప్రఖ్యాత స్వర్ణదేవాలయం నుంచి ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన బ్రిటిష్కాలంనాటి చట్టానికి చేసిన సవరణ ప్రతిపాదనలకు పంజాబ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. మంగళవారం శాసనసభలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం ప్రకటించారు. ఇన్నాళ్లూ గుర్బానీని రాష్ట్రంలో శక్తివంతమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన ప్రైవేట్ చానెల్ పీటీసీ ప్రసారం చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ) మండిపడింది. ‘ఆ చట్టాన్ని పార్లమెంట్ చేసింది. దీనికి సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. సిక్కుల మత సంబంధ వ్యవహారాలకు ఆప్ ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోంది’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘చట్ట పరిధిపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఇది రాష్ట్ర పరిధిలోనిది’ అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ గుర్బానీ వినిపించేటపుడు అడ్వర్ట్టైజ్మెంట్లు ఉండకూడదనే ఉద్దేశంతో∙ప్రత్యక్షంగా ఉచితంగా ఆడియో, వీడియో ప్రసారాలు చేస్తున్నాం’ అని ప్రభుత్వం ప్రకటించింది. పీటీసీ ప్రైవేట్ చానెల్కు అధిపతి అయిన శిరోమణి అకాళీదళ్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకే సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. -
స్వర్ణ దేవాలయం సమీపంలో మరో పేలుడు.. స్థానికుల భయభ్రాంతులు..
చండీగఢ్: పంజాబ్ అమృత్సర్లోని స్వర్ణదేవాలయం సమీపంలో మరో పేలుడు ఘటన జరిగింది. సోమవారం ఉదయం 6:30 గంటల సమయంలో హెరిటేజ్ స్ట్రీట్లో భారీ శబ్దంతో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక్కరు గాయపడ్డారు. శనివారం రాత్రి కూడా ఇదే ప్రాంతంలో పేలుడు జరగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఒకే ప్రాంతంలో వరుస పేలుళ్లు జరుగుతుండటంతో స్థానికులు హడలిపోతున్నారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని శాంపిల్స్ సేకరించారు. Punjab | Bomb Squad and FSL team at the spot after a suspected bomb explosion was reported near Golden Temple in Amritsar https://t.co/EBubbzqAFU pic.twitter.com/yx0dROANqw — ANI (@ANI) May 8, 2023 ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పంజాబ్ డీజీపీ తెలిపారు. ఇది ఐఈడీ పేలుడు కాదని స్పష్టతనిచ్చారు. తక్కువ తీవ్రతగల పేలడు అని పేర్కొన్నారు. అయితే పేలుళ్లకు గల కారణాలు పోలీసులకు అంతుచిక్కడం లేదు. ఇది ఉగ్రవాదుల దాడి కాదని మాత్రం తెలిపారు. శనివారం జరిగిన ఘటనలో పేలుడు పదార్థాలతో పాటు మెటల్ను ఉపయోగించినట్లు వెల్లడించారు. రెస్టారెంట్లోని చిమ్నీలో ఈ పేలుడు జరిగింది. ఈ ధాటికి కిటికీ అద్దాలు ధ్వంసమై రోడ్డుపై ఆటోలో వెళ్తున్న ఆరుగురు అమ్మాయిలు గాయపడ్డారు. చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుడు.. ఆరుగురు అమ్మాయిలకు గాయాలు
చండీగఢ్: పంజాబ్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు అమ్మాయులు గాయపడ్డారు. పేలుడు శబ్దం వినగానే ఆలయంలోని భక్తులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఉగ్రదాడి జరిగి ఉంటుందని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది ఉగ్రదాడి కాదని చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. శాంతియుతంగా ఉండాలని సూచించారు. Video: Several injured in blast near #Amritsar's Golden Temple https://t.co/GWEtgJ37sH pic.twitter.com/XwLJxvg1T0 — TOIChandigarh (@TOIChandigarh) May 7, 2023 ఫోరెన్సిక్ టీం పేలుడు జరిగిన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ లభించిన కొంత పౌడర్ను స్వాధీనం చేసుకుంది. దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు. పేలుడు ధాటికి కిటికీ అద్దాలు ధ్వంసమై రోడ్డుపై ఆటోలో వెళ్తున్న ఆరుగురు అమ్మాయిలకు స్వల్పగాయాలయ్యాయని ఓ స్థానికుడు తెలిపాడు. చదవండి: బైక్లే ఉన్నాయ్.. జనాలేరీ?.. బీజేపీ శ్రేణులపై అమిత్షా సీరియస్ -
స్వర్ణ దేవాలయం వద్ద మహిళకు చేదు అనుభవం..!
ఒక మహిళకు గోల్డెన్ టెంపుల్ చేదు అనుభవం ఎదురైంది. ముఖంపై జాతీయ జెండాను పెయింట్ వేసుకున్నందుకు పంజాబ్లోని స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశానికి నిరాకరించారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో ఆ మహిళ ఇది భారతదేశం కాదా అని ప్రశ్నించింది. గార్డు అంతటితో ఆగకుండా ఇది పంజాబ్ అంటూ దురుసుగా ప్రవర్తించాడు. గార్డు మాటలు విని మహిళ కంగుతింది. ఈ ఘటనను సదరు బాధితురాలు ఫోన్లో రికార్డు చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తర్వాత గార్డు మహిల ఫోన్ని లాక్కునేందుకు ప్రయత్నించడంతో ఆమె అక్కడ నుంచి వెనుదిరిగింది. కాగా ఈ ఘటనపైపై గోల్డెన్ టెంపుల్ని నిర్వహించే శిరోమణి గురుద్వార్ పర్బంధక్ కమిటీ స్పందించి గార్డు దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరింది. అయితే ఆ మహిళ ముఖంపై ఉన్న జెండాపై ఆశోక చక్రం లేనందున అది రాజకీయ పార్టీ జెండా అయి ఉంటుందని భావించి ఉంటాడని వివరణ ఇచ్చింది. ఈ మేరకు దేవాలయ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవాల్ మాట్లాడుతూ.. ప్రతి మత స్థలానికి దానికంటూ ఒక పత్యేక విధివిధానాలు ఉంటాయి. మేము ప్రతి ఒక్కరిని స్వాగతిస్తున్నాం. ఆ అధికారి ప్రవర్తించిన తీరుకి క్షమాపణలు కోరతున్నాం అని చెప్పారు. Woman denied entry to Golden Temple because she had a India 🇮🇳 flag painted on her face! The man who denied her entry into Golden Temple said this is Punjab, not India@AmitShah @PMOIndia @narendramodi @GoldenTempleInd @ArvindKejriwal Is bande ko Pakistan ke Punjab bhejo pic.twitter.com/nSgbOxVkoN — HARSH KESHRI (@HarshKeshri2209) April 17, 2023 (చదవండి: దీన్ని ఎవరు విచారిస్తారు?: మహారాష్ట్ర విషాదంపై ఉద్ధవ్ థాక్రే ఫైర్) -
పోలీసులకు లొంగిపోయే యోచనలో అమృత్పాల్ సింగ్?.. వీడియో విడుదల
పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తాన్ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ తిరిగి పంజాబ్లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. గోల్డెన్ టెంపుల్ వద్ద పోలీసుల ముందు లొంగిపోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. తప్పించుకునే అవకాశం లేకపోవడంతో భయంతో అమృత్పాల్.. చివరకు తన మనసు మార్చుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులకు లోంగిపోతాడనే ఊహాగానాల మధ్య పరారీలో ఉన్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ బుధవారం వీడియో విడుదల చేశాడు. ఇందులో పంజాబ్ పోలీసులపై విమర్శలు గుప్పించాడు. ఒకవేళ పోలీసులకు తనను అరెస్టు చేయాలనే ఉద్దేశ్యం ఉంటే.. ఇంటికి వచ్చి అరెస్టు చేసేవారని అన్నాడు. తను అరెస్ట్కు భయపడే వ్యక్తి కాదని చెప్పాడు. పంజాబ్ ప్రభుత్వం నా అరెస్ట్ కోసం కాదు.. మొత్తం సిక్కు సమాజంపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అతని సన్నిహతులను అరెస్టు చేయడం, అస్సాం జైలులో వారిని నిర్బంధించడం గురించి కూడా వీడియోలో మాట్లాడాడు. ప్రజల మనస్సులలో ప్రభుత్వం సృష్టించిన భయాన్ని తొలగించడానికి బైస్కాహి సందర్భంగా తల్వాండి సబోలో సమావేశం నిర్వహించాలని అకల్ తఖ్త్ జాతేదార్ గియానీ హర్ప్రీత్ సింగ్ను అభ్యర్థించినట్లు తెలిపాడు. పోలీసుల నుంచి పారిపోయిన తర్వాత వారిస్ పంజాబ్ దే చీఫ్ విడుదల చేసిన మొట్టమొదటి వీడియో ఇదే కావడం గమనార్హం. అయితే అమృత్పాల్ ఈ వీడియోలో ప్రత్యేక రాష్ట్రం లేదా ఖలిస్తాన్ గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. #BREAKING: Khalistani Radical Amritpal Singh releases a new video from hiding in Punjab. Requests Jathedar of Akal Takht to call Sarbad Khalsa (congregation of Sikhs) to discuss issues to save Punjab. Dares Punjab CM Bhagwant Mann and Punjab Police. pic.twitter.com/vhcDN1lBaE — Aditya Raj Kaul (@AdityaRajKaul) March 29, 2023 కాగా ఖలిస్తాన్ సానూభూతి పరుడు అమృత్పాల్ సింగ్ కోసం పోలీసులు 10 రోజులుగా విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. ఈ నెల 18వ తేదీన పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకున్న అతడు వేషాలు మార్చకుంటూ పారిపోతున్నాడు. ఈ క్రమంలోనే రాష్ట్రం విడిచి వెళ్లిన్నట్లు గుర్తించారు. అయితే తాజాగా వారిస్ పంజాబ్ దే చీఫ్ మంగళవారం హోషియార్పూర్ మీదుగా అమృత్సర్కు వచ్చిన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అమృతపాల్ సింగ్, అతని సహాయకులు మంగళవారం అర్థరాత్రి తర్వాత హోషియపూర్లోని ఓ గ్రామంలో దాక్కున్నారనే సమాచారంతో పంజాబ్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించారు. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా.. మార్నియన్ గ్రామంలోని గురుద్వారా వద్ద అమృతపాల్ సింగ్ ఇన్నోవా కారును వదిలిపెట్టి అక్కడి పొలాల్లోకి పారిపోయాడు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఖలిస్తాన్ నేత కోసం విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. అనుమానితుల్ని పట్టుకునేందుకు రోడ్లపై చెక్పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల్లోని గ్రామాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. గోల్డెన్ టెంపుల్ చుట్టూ, అకల్ తఖ్త్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. త్వరలోనే అతను లొంగిపోయే అవకాశం ఉన్నందున అమృత్సర్ అంతటా హై అలర్ట్ కొనసాగుతోంది. చదవండి: 2025 కాదు 2050లో కూడా బీజేపీ గెలవదు.. కేజ్రీవాల్ జోస్యం.. -
భార్య బర్త్డేకి స్పెషల్ విషెస్...గోల్డెన్ టెంపుల్కి బన్నీ ఫ్యామిలీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టిన రోజు నేడు(సెప్టెంబర్ 29). ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ దర్శనానికి వెళ్లాడు బన్నీ. సంప్రదాయ దుస్తులు ధరించి దర్శనం చేసుకున్నారు. పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ఉండి కూడా ఒక సాధారణ వ్యక్తిలా గోల్డన్ టెంపుల్ ను సందర్శించడం అల్లుఅర్జున్ లోని సింప్లిసిటీ కి నిదర్శనం అని చెప్పాలి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ‘హ్యాపీ బర్త్డే క్యూటీ’ సోషల్ మీడియా ద్వారా భార్యకు బర్త్డే విషెస్ చెప్పాడు బన్ని. స్నేహారెడ్డి కెక్ కట్ చేస్తున్న ఫోటోని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్డే క్యూటీ’అని పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిలది ప్రేమ వివాహం. 2011 మార్చ్ లో వీరి పెళ్లి జరిగింది. 2014లో అబ్బాయి అయాన్, 2016లో అమ్మాయి అర్హ జన్మించారు. Happy Birthday Cutie 💖 pic.twitter.com/LL5nEaOmjg — Allu Arjun (@alluarjun) September 29, 2022 -
గోల్డెన్ టెంపుల్లో ఫ్యామిలీతో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
బంజారాహిల్స్ లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ లో కృష్ణాష్టమికి ఏర్పాట్లు
-
గోల్డెన్ టెంపుల్లో 'ఆర్ఆర్ఆర్' త్రయం.. ప్రత్యేక పూజలు
Rajamouli Ram Charan Jr Ntr Visit Amritsar Golden Temple For RRR: ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా పేరు ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం అశేష ప్రేక్షక జనం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ సయమం దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్లో స్పీడ్ పెంచింది జక్కన్న టీం. మార్చి 19న కర్ణాటకలోని చిక్బళ్లాపూర్లో గ్రాండ్గా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు మేకర్స్. మార్చి 20న గుజరాత్లోని బరోడా, ఢిల్లీలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా సోమవారం (మార్చి 21) పంజాబ్లోని అమృత్సర్లో పర్యటించింది ఈ చిత్రబృందం. అమృత్సర్లో పర్యటించిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అక్కడి గోల్డెన్ టెంపుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అవ్వాలని డైరెక్టర్ రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కోరుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆర్ఆర్ఆర్ చిత్రం బృందం ప్రకటించింది. కాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. The tRRRio visited the divine Golden Temple in Amritsar to seek blessings for our #RRRMovie#RRRTakeOver #RRROnMarch25th pic.twitter.com/LfZcbHnOLM — RRR Movie (@RRRMovie) March 21, 2022 -
రాహుల్కు.. హర్సిమ్రత్ కౌర్ బాదల్ చురకలు.. అలాంటి ప్రచారాలు మానుకోవాలి
చండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మాజీ కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ట్విటర్ వేదికగా మండిపడ్డారు. కాగా, రాహుల్ గాంధీ గత బుధవారం పంజాబ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అమృత్ సర్లోని స్వర్ణ దేవాలయంను సందర్శించారు. ఈ నేపథ్యంలో రాహుల్ తన జేబులో నుంచి చోరీ జరిగినట్లు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై హర్సిమ్రాత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ.. ఒక జెడ్ క్యాటగిరి భద్రతను కల్గిఉన్నారని.. ఆయనతోపాటు పంజాబ్ సీఎం చన్నీ, డిప్యూటి సీఎం సుఖ్ జీందర్ సింగ్ రంధావా, ఓపీ సోనిలుకూడా ఉన్నారన్నారు. ఇలాంటి చోట చోరీ జరగటం ఏంటని ప్రశ్నించారు. పవిత్రమైన ప్రదేశానికి చెడ్డపేరు తెచ్చేల వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు. భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా ప్రవర్తించకూడదన్నారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని రాహుల్కు చురకలంటించారు. అయితే, రాహుల్ ఆరోపణలపై.. పూర్తి వివరాలను వెల్లడించలేదని ఎంపీ హర్సిమ్రాత్ కౌర్బాదల్ అన్నారు. కాగా, రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బుధవారం రోజు జలంధర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నవిషయం తెలిసిందే. హర్ సిమ్రాత్ వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆమె పోస్ట్కు రీట్వీట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయడం అపచారమని అన్నారు. రాజకీయ విభేదాలకు అతీతంగా బాధ్యతతో, పరిపక్వతతో ప్రదర్శించాలని తెలిపారు. గతంలో నరేంద్రమోదీ తీసుకువచ్చిన చట్టాలు.. రైతుల జేబులు కొట్టడం లాంటివేనని అన్నారు. Who picked @RahulGandhi's pocket at Sri Harmandir Sahib?@CHARANJITCHANNI? @sherryontopp? or @Sukhjinder_INC? These were the only 3 persons allowed by Z-security to get near him. Or is it just one more attempt to bring bad name to our holiest shrine, after the 'be-adbi' incidents? — Harsimrat Kaur Badal (@HarsimratBadal_) January 29, 2022 చదవండి: ఒక వైపు నామినేషన్లు.. మరోవైపు రాజీనామాలు -
ఆ నిందితులను బహిరంగంగా ఉరితీయాలి: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
చంఢీఘడ్: పంజాబ్లోని స్వర్ణదేవాలయం, కపుర్త ఘటనలకు సంబంధించిన కుట్రదారులను బహిరంగంగా ఉరితీయాలని పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు. ఆయన మాలేర్కోట్లలో జరిగిన సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొంత మంది కావాలనే మత విద్వేశాలు రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసేలా కుట్రలతో.. పంజాబ్లో అశాంతిని సృష్టిస్తున్నారన్నారు. ఇప్పటికే స్వర్ణదేవాలయం ఘటనపై సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. నిన్న సీఎం చన్నీ(డిసెంబరు 19)న స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. వరుస ఘటనలతో ఆయా ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు భద్రతను పెంచాయి. ప్రజలు సంయమనం పాటించాలని సీఎం కోరారు. కాగా, స్వర్ణదేవాలయంలోని నిశిద్ధ ప్రాంతం, కపుర్త జిల్లా నిజాంపూర్ లోని గురుద్వారా పైకెక్కి పవిత్ర జెండా (నిషాన్ సాహిబ్)ను తొలగించడానికి ప్రయత్నించిన వ్యక్తులు స్థానికుల మూకదాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలను ఇప్పటికే పలు రాజకీయపార్టీలు ఖండించాయి. ఈ ఘటనపై ఇప్పటికే సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. చదవండి: 'పార్టీ కోసం నా జీవితం అర్పించా.. కాషాయం విడిచేది లేదు' -
సిక్కుల జెండా అపవిత్రానికి యత్నం
కపుర్తలా/అమృత్సర్/న్యూఢిల్లీ: అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలోని నిషిద్ధ ప్రాంతాన్ని అపవిత్రం చేసి, మూకదాడిలో ఒక వ్యక్తి హతమైన ఘటన జరిగి 24 గంటలైనా గడవకమునుపే పంజాబ్లో మరోచోట అలాంటి పరిణామమే చోటుచేసుకుంది. తాజా ఘటనకు కపుర్తలా వేదికైంది. అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్లో చోటుచేసుకుంటున్న ఈ ఘటనలపై ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ఆందోళన వ్యక్తం చేసింది. కపుర్తలా జిల్లా నిజాంపూర్లోని గురుద్వారా వద్దకు ఆదివారం ఉదయం ఒక గుర్తు తెలియని వ్యక్తి చేరుకున్నాడు. గురుద్వారా పైకెక్కి అక్కడున్న పవిత్ర జెండా(నిషాన్ సాహిబ్)ను తొలగించేందుకు యత్నించాడు. గమనించిన గ్రామస్తులు అతడిని వెంటాడి పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడని పోలీసులు చెప్పారు. కపుర్తలా పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ.. గురుద్వారా పైనున్న జెండాను తొలగించేందుకు అగంతకుడు ప్రయత్నించాడని చెప్పారు. ఏవిధమైన అపవిత్రత చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. స్వర్ణదేవాలయంలో ఘటనపై సిట్ స్వర్ణదేవాలయంలో శనివారం జరిగిన ఘటనపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి సుఖ్జీందర్ సింగ్ రణ్ధావా వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నారు. సిట్ నివేదిక రెండు రోజుల్లో అందుతుందని చెప్పారు. శనివారం నాటి ఘటనపై ఆయన మాట్లాడుతూ.. మూకదాడిలో హతమైన వ్యక్తి ఉదయం 11 గంటల సమయంలో ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీ ఫుటేజీని బట్టి తేలిందన్నారు. కానీ, అతడెవరో గుర్తించాల్సి ఉందన్నారు. అతడి లక్ష్యం ఏమిటి? ఆలయంలోకి ఏ మా ర్గంగుండా ప్రవేశించాడు? వెంట వేరెవరైనా ఉన్నా రా? అనే విషయాలపై క్షుణ్నంగా దర్యాప్తు జరుపు తామని చెప్పారు. అతడి వద్ద సెల్ఫోన్, పర్స్, ఐ డెంటిటీ కార్డువంటివి ఏవీ లేదని తెలిపారు. ఘట న నేపథ్యంలో రాష్ట్రంలోని గురుద్వారాలు, దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. ఇలా ఉండగా, ఆదివా రం సాయంత్రం సీఎం చరణ్జిత్ సింగ్ చన్ని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొన్ని స్వార్థ శక్తులు ఈ ఘటనకు కుట్ర చేసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. అశాంతిని సృష్టించేందుకు కుట్ర.. స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆర్ఎస్ఎస్ ఖండించింది. సమాజంలో అశాంతిని ప్రేరేపించేందుకు జరిగిన కుట్రగా పేర్కొంది. ఇలాంటి ఘటనలకు ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే అన్నారు. -
స్వర్ణ దేవాలయంలో కలకలం
అమృత్సర్: అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కొందరు కొట్టిచంపారు. శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్కు చెందిన సుమారు 30 ఏళ్లున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోపలున్న బంగారు గ్రిల్స్పై నుంచి దూకి నిషిద్ధ పూజా మందిరంలోకి ప్రవేశించాడు. అక్కడున్న కత్తిని పట్టుకుని, గురుగ్రంథ్ సాహిబ్ను పఠిస్తున్న పూజారి వైపుగా వెళ్లాడు. ప్రమాదాన్ని పసిగట్టిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ) టాస్క్ఫోర్స్ సభ్యులు అతడిని పట్టుకుని ఎస్జీపీసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. విషయం తెలిసి ఆగ్రహంతో అక్కడికి చేరుకున్న కొందరు ఆ అగంతకుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో మరణించాడు. మృతుని వివరాలు, ఇంకెవరైనా అతడితోపాటు ఉన్నారా? తదితర విషయాలపై సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ భందాల్ చెప్పారు. -
గోల్డెన్ టెంపుల్ గురించి ఈ విషయాలు తెలుసా?
పంజాబ్ రాష్ట్రం, అమృత్సర్ నగరం. ప్రఖ్యాత స్వర్ణదేవాలయం, బయట రాష్ట్రాల వాళ్లకు ‘అమృత్సర్ బంగారు దేవాలయం’గానే గుర్తింపు. ఆ బంగారు ఆలయం పేరు హర్మందిర్ సాహిబ్. నిజానికి హరిమందిర్. వాడుకలో హర్మందిర్ అయింది. దర్బార్ సాహిబ్ అని కూడా అంటారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు అనే అర్థాలు కావు. ‘హరి’ అంటే దేవుడు అనే అర్థంలో పెట్టిన పేరు. ఈ ఆలయం సరస్సు మధ్య ఉంటుంది. ఆ సరస్సు పేరు ‘అమృత సర’. అమృతంతో నిండిన సరస్సు అని అర్థం. ఆ ప్రదేశానికి ఆ పేరు కూడా ఈ సరస్సు పేరుతోనే వచ్చింది. ఇది ఆలయం కోసం తవ్విన సరస్సు. బంగారంటి పేరు మనకు అమృతసర్ గోల్డెన్ టెంపుల్ అనగానే గుర్తు వచ్చే సంఘటన ఆపరేషన్ బ్లూ స్టార్. ఆ తర్వాత ఇందిరా గాంధీ దారుణ హత్య. ఆ తర్వాత అల్లర్లు, ఖలిస్థాన్ ఉద్యమం. ఈ ప్రభావం మన దగ్గర ఒక తరాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంకా ముందుకు వెళ్తే... ఈ ఆలయ నిర్మాణం, దాడులకు గురవడం అనేది చర్విత చరణంగా సాగింది. ఎన్ని దాడులు జరిగినా మొక్కవోని దీక్షతో పునర్నిర్మించుకోవడంలో సిక్కుల సంకల్పబలం అర్థమవుతోంది. మొదట బంగారు తాపడం ఉండేది కాదు. మహారాజా రంజిత్ సింగ్ 19వ శతాబ్దంలో సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన తరవాత ఈ మందిరాన్ని మరోసారి పునర్నిర్మించాడు. అప్పుడు బంగారు తాపడం చేయించాడు. అప్పటి నుంచి ఆలయం స్వర్ణదేవాలయంగా గుర్తింపులోకి వచ్చింది. అప్పటి వరకు వాడుకలో ఉన్న పేర్లన్నీ మరుగున పడిపోయాయి. ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో నామినేట్ అయి ఉంది. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. గుడి ముందు... ఊరు తర్వాత సాధారణంగా ఊరు విస్తరించిన తర్వాత గుడి వెలుస్తుంది. ఊరందరి కలయిక కోసం, సామూహిక కార్యక్రమాల నిర్వహణ కోసం విశాలమైన గుడి ప్రాంగణం ఉపకరిస్తుంటుంది. ఇక్కడ మాత్రం ముందు మందిరాన్ని కట్టారు. మందిరం నిర్వహణకు అవసరమైన ఇతర నిర్మాణాలను కొనసాగించారు. అందుకవసరమైన పని వాళ్లు నెలల పాటు నివసించాల్సి వచ్చింది. వాళ్ల కోసం ఇళ్లు కట్టారు. మనుషుల జీవికకు అవసరమైన వస్తువులన్నీ ఉన్న చోట దొరకాలి. అందుకోసం వ్యాపారులను ఆహ్వానించారు. అలా ఊరయింది. సిక్కుల ఆరాధ్యమందిరం. ఈ ఒక్క ఆలయాన్ని సందర్శించడం వల్ల 68 ఆలయాలను దర్శించిన ఫలితం వస్తుందని చెబుతారు. ఇక్కడ సిక్కులు నిర్వహించే భోజనశాలలో సర్వమానవాళికీ అనుమతి ఉంటుంది. శాకాహార భోజనం వండి పెడతారు. రోజుకు లక్షమంది వరకు ఇక్కడ భోజనం చేస్తారు. వందేళ్ల వంటశాల ధాబా పేరు కేసర్ దా ధాబా. గోల్డెన్ టెంపుల్కి కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇది వందేళ్లు దాటిన వంటశాల. జాతీయ నాయకులు లాలా లజపతి రాయ్, జవహర్లాల్ నెహ్రూ ఆ తర్వాత ఇందిరా గాంధీ కూడా ఈ ధాబాలో నోరూరించే లాచ్చా పరాఠా, దాల్ మఖానీ కోసం లొట్టలు వేసేవాళ్లు. అయితే ఈ ధాబా వందేళ్ల నుంచి ఇక్కడ లేదు. లాలా కేసర్ మాల్, అతడి భార్య పార్వతి 1916లో పాకిస్తాన్లోని షేక్పురాలో మొదలుపెట్టారు. దేశవిభజన సమయంలో ఆ దంపతులు ధాబాను అమృతసర్కు మార్చారు. అప్పట్లో లాచ్చా రోటీ– దాల్ మఖానీ మాత్రమే వండేవాళ్లు. ఇప్పుడు వేడిగా కరకరలాడే హాట్ క్రిస్ప్ పరాఠా, మీగడ లస్సీ, పంజాబీ థాలీ, ఫిర్నీ కూడా వండుతున్నారు. ఇప్పుడు కాని మీరు కాని స్వర్ణదేవాలయాన్ని కాని చూడడానికి వెళ్లినట్లయితే... అప్పుడు ఈ ధాబాలో పంజాబీ వంటకాలను రుచి చూడడం మర్చిపోవద్దు. రోజంతా వండుతూనే ఉంటారు పంజాబీ వంటకాలను రాగి పాత్రలో ఎనిమిది నుంచి పన్నెండు గంటల సేపు ఉడికిస్తారు. రాజ్మా గింజలు, తాజా మీగడ, పెరుగుతో దాల్ మఖానీ ఉడుకుతున్న పెద్ద గుండిగ ఒక పక్క. మరో పక్క ఒక పాత్రలో ఫిర్నీ, పెద్ద పెద్ద రాగి, ఇత్తడి పాత్రలు కళ్ల ఎదురుగానే ఉంటాయి. రోజంతా తక్కువ మంట మీద వంటలు తాజాదనం కోల్పోకుండా వేడి మీద ఉంటాయి. -
గోల్డెన్ టెంపుల్కు విదేశీ నిధులు: అమిత్షా
సాక్షి, న్యూఢిల్లీ: అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్కు విదేశీ నిధులను అనుమతించడంపై హోం మంత్రి అమిత్షా స్పందిచారు. విదేశీ సహకార (రెగ్యులేషన్) చట్టం, 2010పై ఈ రోజు తీసుకున్న నిర్ణయం మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్షా అన్నారు. ఇది సిక్కు సమాజ అత్యుత్తమ సేవా స్ఫూర్తిని మరోసారి తెలియజేస్తుంది’ అని తెలిపారు. ‘శ్రీ హర్మందిర్ సాహిబ్ వద్ద విదేశీ సహకారం (నియంత్రణ) చట్టం, 2010పై ఒక మార్గదర్శకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది మన సిక్కు సోదరీమణుల అత్యుత్తమ సేవా స్ఫూర్తిని మరోసారి ప్రదర్శిస్తుంది’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. ‘శ్రీ దర్బార్ సాహిబ్ ఆశీర్వాదం మనకు బలాన్ని ఇస్తుంది. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా సంగత్ సేవ చేయలేకపోయింది. శ్రీ హర్ మందిర్ సాహిబ్కు ఎఫ్సీఆర్ఏను అనుమతిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంగత్, శ్రీ దర్బార్ సాహిబ్ల సేవ బంధాన్ని మరింత పటిష్టం చేసిన క్షణం’ అని అమిత్షా తన క్యాప్షన్లో జోడించారు. ਸੇਵਕ ਕਉ ਸੇਵਾ ਬਨਿ ਆਈ ॥ PM @narendramodi ji is blessed that Wahe Guru ji has taken Seva from him. The decision on FCRA at the Sri Harmandir Sahib is a pathbreaking one which will once again showcase the outstanding spirit of service of our Sikh sisters and brothers. — Amit Shah (@AmitShah) September 10, 2020 పంజాబ్లోని సచ్ఖండ్ శ్రీ హర్మాందిర్ సాహిబ్-దర్బార్ సాహిబ్కు 2010లో విదేశీ సహకారం (నియంత్రణ) చట్టం కింద ఐదేళ్ల వరకు చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ను మంజూరు చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇది సేవ కార్యక్రమాలు నిర్వహించడానికి విదేశీ నిధులును సేకరించడానికి వీలు కల్పిస్తుంది. కొంత మంది వ్యక్తులు లేదా సంఘాలు విదేశీ సహకారం పొందటానికి, విదేశీ నిధుల వినియోగాన్ని నియంత్రించడానికి విదేశీ సహకార చట్టాన్ని కేంద్రప్రభుత్వం రూపొందించింది. విదేశీ నిధులను పక్కదోవ పట్టించడానికి చెక్ పెట్టేందుకు 2010లో ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని పార్లమెంట్ అమలు చేసింది. చదవండి: కరోనా: సర్వేలో షాకింగ్ నిజాలు -
గోల్డెన్ టెంపుల్ను దర్శించుకొన్న అమిర్
ప్రముఖ బాలీవుడ్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమిర్ ఖాన్ శనివారం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను సందర్శించారు. లాల్సింగ్ చద్దా సినిమా షూటింగ్లో భాగంగా ప్రస్తుతం పంజాబ్లో ఉన్న ఈ సూపర్స్టార్ హర్మందిర్ సాహిబ్ గురుద్వారాలో ప్రార్థనలు జరిపారు. సిక్కుల పవిత్ర మందిరంలో అడుగీడే ముందు.. వారి ఆచారం ప్రకారం తలకు వస్త్రాన్ని చుట్టుకున్నారు. ప్రస్తుతం అమిర్ లుక్కు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. లాల్సింగ్ చద్దా కోసం పంజాబీ సర్దార్గా ఆమిర్ ఖాన్ మారిపోయిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘ఫారెస్ట్ గంప్ సినిమాకు లాల్సింగ్ చద్దా హిందీ రీమేక్. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్ కథానాయిక. Actor Aamir Khan offers prayers at Gurudwara Harmandir Sahib (Golden Temple) in Amritsar. He is in Punjab for shooting of his upcoming film #LalSinghChaddha pic.twitter.com/jyZMW6LzWQ — ANI (@ANI) November 30, 2019 View this post on Instagram Aamir Khan Offers Prayers At Golden Temple In Amritsar. . . #aamirkhan #goldentemple A post shared by Instant Bollywood (@instantbollywood) on Nov 30, 2019 at 12:33am PST -
సవ్యంగా సాగిపోవాలి
తన కొత్త సినిమా ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సవ్యంగా సాగిపోవాలని ప్రార్థిస్తున్నారు హీరోయిన్ జాన్వీ కపూర్. కార్తీక్ ఆర్యన్, లక్ష్య, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించనున్న హిందీ చిత్రం ‘దోస్తానా 2’. ఈ సినిమాకు కొల్లిన్ డి కున్హా దర్శకుడు. 2008లో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం, ప్రియాంకా చోప్రా నటించిన ‘దోస్తానా’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా చిత్రీకరణ పంజాబ్లో ప్రారంభం కానుంది. చిత్రీకరణకు ముందు కాస్త సమయం దొరకడంతో అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను దర్శించుకున్నారు జాన్వీ కపూర్. ‘దోస్తానా 2’ చిత్రాన్ని బాలీవుడ్ బడా దర్శక–నిర్మాత కరణ్జోహార్ నిర్మిస్తారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ఆధ్యాత్మికం.. అక్షయం.. అమృతం
ఆలయాలు కేవలం ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితం కావని, సాటిమానవుడికి చేసే అనేకమైన సేవల ద్వారా కూడా భగవంతుడికి చేరువ కావచ్చునని నిరూపిస్తోంది హరేకృష్ణ ఉద్యమం. అందుకు నిదర్శనంగా నిలుస్తుంది తెలుగు రాష్ట్రాల్లోని మొట్టమొదటి స్వర్ణదేవాలయం హైదరాబాద్ లోని బంజారాహిల్స్లో గల∙స్వయంభూ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం. రోడ్డు నెంబర్ 12లో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం స్వయంభువుగా వెలసిందని ప్రతీతి. నిజాం కాలంలో అక్కన్న, మాదన్నలు ఇక్కడకు వచ్చి పూజలు చేసేవారని స్థానికులు చెబుతారు. శివుడు ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. అందుకే లక్ష్మీనరసింహుడి విగ్రహానికి ఎదురుగా శివుడి విగ్రహం ఉంటుంది. శివుడు తపస్సు చేయగా శ్రీ లక్ష్మి నరసింహస్వామి శివుడి శిరస్సుపై శంఖం ఉంచి దీవించాడట. అందుకే ఇక్కడి శివలింగంపై శంఖం ఉంటుంది కనుక పాంచజన్యేశ్వరుడిగా పేరు వచ్చింది. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ప్రదేశంలో అనేక అద్భుతాలు. ఆలయ విశిష్టత స్వయంభువనూ శ్రీ లక్ష్మి నరసింహస్వామి, పాంచజన్యేశ్వర స్వామి(క్షేత్ర పాలకుడు), రాధాగోవింద, జప ఆంజనేయస్వామి, గరుడ, పురాతన నారాయణ శాలగ్రామం (జల గర్భంలో ఉండే శిల) ఈ క్షేత్రంలో కొలువుదీరారు. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీవారి నందనవనం, జలపాతం, ఇక్కడికి వచ్చే భక్తులకు కనువిందు చేస్తూ, సందర్శకులకు భూతల వైకుంఠంలో ఉన్నామా అన్నంత అనుభూతి కలిగిస్తాయని ఆలయ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస తెలిపారు. నేపాల్ దేశంలోని ముక్తినాథ్ ఆలయ సమీపంలోగల గండకీ నదిలో లభించిన సాలగ్రామ శిల శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి గర్భాలయంలోనే అరుదైన ‘జలగర్భ నారాయణ సాలగ్రామ శిల’ గా భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తుంది. ప్రపంచంలోగల అతిపెద్ద సాలగ్రామ శిలల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఇక్కడ హనుమంతుడి విగ్రహానికి నాలుగు చేతులుంటాయి. రెండు చేతుల్లో శంఖచక్రాలు, మూడో చేతిలో జపమాల ఉంటుంది. నాల్గవ చేతిలో అక్షమాల ఉంటుంది. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహుడిని చూసుకుంటూ హనుమంతుడు అపురూపంగా కనిపిస్తాడు. శ్రీచతుర్భుజ జప ఆంజనేయస్వామిని భక్తులు ముందు దర్శించుకుంటారు. ఇక్కడ భక్తులు మంత్ర పీఠంలో జపం చేసి ఆలయంలోని శ్రీ రాధా గోవిందుల అర్చామూర్తుల సుందరాకృతులను మనస్సునిండా నింపుకుని హరేకృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ తన్మయత్వం పొందుతారు. తర్వాత అనంతశేషుడిపై నిల్చుని ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం క్షేత్రపాలకుడిగా ఉన్న పాంచజన్యేశ్వరుడని దర్శించుకుంటారు. హరేకృష్ణ ఉద్యమం చేస్తున్న ఆధ్యాత్మిక, సమాజ సేవ కార్యక్రమాలలో కొన్ని... దేవాలయానికి 10 మైళ్లు లోపు ఎవరూ ఆకలితో ఉండకూడదన్న హరేకృష్ణ ఉద్యమం వ్యవస్థాపకాచార్యులు శ్రీ శ్రీ ప్రభుపాదులవారి ఆశయానికి అనుగుణంగా సంస్థ తమ ప్రణాళికలను రూపొందించింది. విద్యార్థులు ఆకలి వల్ల చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో సంస్ధ ఏర్పాటు చేసిన అక్షయపాత్ర తెలంగాణలో అంకురార్పణకు ఈ ఆలయమే కేంద్రస్ధానం. మరిన్ని వివరాలకు 9396956984ను సంప్రదించవచ్చునని హరేకృష్ణ ఉద్యమం తెలంగాణ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస తెలిపారు. హరేకృష్ణ ఉద్యమం హైదరాబాద్ ఆధ్వర్యంలో యవతకి స్వశక్తికరణ సదస్సులు నిర్వహించి, ప్రతి ఆదివారం భగవద్గీత ద్వారా సమాజ విలువలతోపాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమం యువతకి ప్రస్తుత ప్రపంచం వాస్తవికతలకు వేద జ్ఞానాన్ని ఎలా అన్వయించాలో బోధిస్తుంది. అలాగే రోజువారీ జీవితంలో అనుభవించే కఠినమైన సమస్యలకు పరిష్కారాలు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, చెడు అలవాట్లను ఎలా వదిలించుకోవాలి, జీవితంలో కుంగుబాటులను అధిగమించి, ఆత్మవిశ్వాసాలను అధిగమించటం, ఇంకా సమాజంలో ఎలా కొనసాగించాలో, ఎలా పర్యవేక్షించాలంటే ఎన్నో విషయాలకు వేదికగా మారడం ముదావహం. లౌకిక విద్యాసంస్థలు ఈ ప్రకృతిని మన ఇంద్రియ భోగాల కోసం ఎలా ఉపయోగించుకోగలమో నేర్పుతాయి. కాని మనిషి ఎదుర్కొనే ఒత్తిడి, అసంతృప్తి, కుంగుబాటు, ఆవేదనలు, జయాపజయాలు, కీర్తి, అప్రతిష్టలు మొదలైన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనగలమని బోధించేవి మాత్రం ఆధ్యాత్మిక కేంద్రాలే. మంచి సమాజం ఏర్పడాలంటే ఆధ్యాత్మిక బోధనలు అత్యంత ఆవశ్యకమని హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి నమ్మకం. మన దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రాలు కావాలన్నది ఆయన తపన. మనిషికి భగవంతుడికి మధ్య ఉన్న పరమార్థాన్ని తీర్చి, కలియుగ కల్మషాలన్నిటిని పారద్రోలడానికి దేవాలయాలు దోహదం చేస్తాయి. ఇందుకోసమే భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి అనువుగా ఈ స్వర్ణదేవాలయ నిర్మాణం జరిగింది. ఈ దేవాలయం నుంచే అనేక ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా చిన్నారులకు సంస్కృతీ వారసత్వ పండుగ, యువతకు జానపదం, గృహస్తులకు ‘గిఫ్ట్’, గ్రామాల్లో ఆధ్యాత్మిక బోధన, దేవాలయంలో ఏడాది మొత్తం జరిపించే పండుగలతోపాటు ప్రముఖ తీర్థయాత్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా సమాజ సేవలో భాగంగా అక్షయపాత్ర, అన్నపూర్ణ 5 రూ. భోజనం, భోజనామృతం, సద్దిమూట, అక్షయ అల్పాహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. -
వాటికి జీఎస్టీ రీఫండ్
సాక్షి,న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లపై దేవాలయాలు , ధార్మిక, మత సంస్థలకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. ఆయా సంస్థల నుంచి వసూలు జీఎస్టీ పన్నులను తిరిగి వాటికి రీఫండ్ చేయనుంది. ఉచితంగా భోజనం అందించే ఆలయాలు, ధార్మిక సంస్థలకు ఈ చెల్లింపులను చేయనుంది. ఈ మేరకు సేవ భోజ్ యోజన పథకాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. ఇందుకు వచ్చే రెండేళ్లలో రూ.350కోట్లను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా చర్య మూలంగా తిరుమల తిరుపతి దేవస్థానం, స్వర్ణ దేవాలయ బోర్డులు గరిష్టంగా లబ్ది పొందనున్నాయి. ప్రజలకు ఉచిత భోజనం (లాంగర్) అందించే దాతృత్వ మత సంస్థల నుంచి ముడి ఆహార వస్తువుల కొనుగోలుపై వసూలు చేసిన సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (సీజీఎస్టీ) ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (ఐజిఎస్టీ) వాటాను తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, శిరోమణి అకాలీ దళ్ల ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1, 2017నుంచి జనవరి 31, 2018 వరకు ఈ మినహాయింపును వర్తింప చేయనున్నారు. -
‘ఖలిస్తాన్’కు మద్దతు ఇవ్వం
అమృత్సర్: భారత పర్యటనలో భాగంగా బుధవారం పంజాబ్ చేరుకున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. కుటుంబ సమేతంగా పంజాబీ సంప్రదాయ వస్త్రధారణతో స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ట్రూడో, కెనడా రక్షణమంత్రి హర్జిత్ సజ్జన్లు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్తో ఓ హోటల్లో దాదాపు 40 నిమిషాల సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెనడాలో ఉంటూ పంజాబ్లోని యువతను విద్వేష నేరాలు, ఉగ్రవాదంవైపు రెచ్చగొడుతున్న 9 ఖలిస్తాన్ వేర్పాటువాదుల జాబితాను అమరీందర్ ట్రూడోకు అందజేశారు. వీరిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన్ను కోరారు. భారత్ సహా మరెక్కడా వేర్పాటువాద ఉద్యమాలకు కెనడా మద్దతివ్వబోదని ట్రూడో హామీ ఇచ్చినట్లు పంజాబ్ సీఎం మీడియా సలహాదారు రవీన్ థుక్రల్ తెలిపారు. క్యూబెక్లో వేర్పాటువాద ఉద్యమాన్ని తాను ఎదుర్కొన్నాననీ, ఇలాంటి హింసతో వచ్చే ప్రమాదాలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఈ సమావేశంలో ట్రూడో చెప్పినట్లు వెల్లడించారు. ‘తమ ప్రభుత్వం ఎలాంటి వేర్పాటువాద ఉద్యమానికి మద్దతివ్వబోదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హామీ ఇవ్వడం నిజంగా ఆనందకరమైన విషయం. ట్రూడో వ్యాఖ్యలు భారత్లోని అందరికీ చాలా ఊరట కల్గించాయి. భవిష్యత్లో కూడా వేర్పాటువాద శక్తుల్ని ఏరివేయడానికి కెనడా ప్రభుత్వ సహకారాన్ని కోరుతున్నాం’ అని భేటీ అనంతరం అమరీందర్ ట్వీట్ చేశారు. అంతకుముందు శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుక్బీర్ సింగ్ బాదల్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు గోబింద్సింగ్ లంగోవాల్లు ట్రూడో కుటుంబానికి స్వర్ణ మందిరంలోకి ఘన స్వాగతం పలికారు. భార్య, ఇద్దరు చిన్నారులతో కలసి ఆలయంలో ప్రార్థనల్లో పాల్గొన్న ట్రూడో.. ఆ తర్వాత ఇక్కడి గురు రాందాస్జీ లంగర్లో కుటుంబ సభ్యులతో కలసి చపాతీలు తయారుచేశారు. -
అమృత్సర్లో షారుఖ్ సందడి
-
తమిళనాడు యాత్ర
పర్యాటకరంగానికి ఆయువుపట్టు. సహజ అందాలకు, ప్రకృతి రమణీయ తకు పుట్టినిల్లు. దేవాలయాలు కళాత్మక సౌరభాలు. గోపురాలు శిల్పకళా చాతుర్యానికి ప్రతిరూపాలు. భిన్న సంస్కతితో పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా ఆకట్టుకునే గొప్పతనం తమిళనాడు సొంతం. కన్యాకుమారి, కుంబకోణం, రామేశ్వరం, చిదంబరం, శ్రీరంగం, జంబుకేశ్వ రం, మీనాక్షి, స్వర్ణ దేవాలయం.. ఇలా ఆధ్యాత్మిక ప్రదేశాలెన్నో ఈ రాష్ట్రంలో ఉన్నాయి. శ్రీపురం స్వర్ణదేవాలయం ఇటీవలే నిర్మించిన స్వర్ణ దేవాలయం వేలూరుకు దగ్గర్లో మలైకుడి సమీప కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. చెన్నై నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల సిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉంటుంది. బృహదీశ్వర ఆలయం అత్యంత ప్రాచీన హిందూ దేవాలయంగా ప్రఖ్యాతిగాంచినది తంజా వూరు బృహదీశ్వర ఆలయం. హిందువుల పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడినది కుంబకోణంలో బ్రహ్మ దేవాలయం కావేరి, అరసలర్ నదుల మధ్య ఏర్పడింది కుంభకోణం. ఈ నగరాన్ని ‘సిటీ అఫ్ టెంపుల్స్’ గా పిలుస్తుంటారు. ఇక్కడ 188 ఆలయాలున్నాయి. చుట్టుపక్కల మరో 100 టెంపుల్స్ వరకూ ఉంటాయి. కుమ్బెస్వర టెంపుల్, సారంగపాణి టెంపుల్, రామస్వామి టెంపుల్ లు ప్రసిద్ధి చెందినవి. ప్రతి సంవత్సరం ఈ టెంపుల్ టవున్లో ‘మహామాహం’ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు కుంబకోణంకు వస్తారు. రామేశ్వరం హిందువుల పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడింది రామేశ్వరం. రామేశ్వరాన్ని విష్ణుమూర్తి ఏడవ అవతారం భావిస్తారు. రావణాసురుడి చర నుండి సీతాదేవిని కాపాడే క్రమంలో శ్రీలంక వెళ్లడానికి ఇక్కడ నుంచే రాముడు వంతెనను నిర్మించాడట. అందువల్లే రామేశ్వరానికి ఆపేరు. ఈ ప్రాంతంలో సుమారు 64 తీర్దాలు ఉండగా వీటిలో 24 ప్రాముఖ్యత గలవని, ఈ నీటిలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శ్రీసుబ్రహ్మన్యేశ్వర దేవాలయం ఈ ఆలయం తిరుచెందూర్ తూతుకుడి జిల్లాలో ఉంది. ఇక్కడ అందమైన దేవాలయాలు, తిరుచెందూర్ మురుగన్ టెంపుల్, వల్లి గుహ, దత్తాత్రేయ గుహ కలవు. కన్యాకుమారి భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రా స్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగానూ విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం, చంద్రోదయాలను చూసి పులకించని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు. తప్పక సందర్శించదగినవి వివేకానంద రాక్, తిరువళ్లువర్ విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమారి ఆలయం ముఖ్యమైనవి. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. వివేకానంద రాక్కు సమీపంలోని తిరువళ్లువర్ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇది ఆసియాలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచినది. బాణాసురుడిని సంహరించిన అమ్మవారి ‘కుమరి ఆలయం’ చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. కాంచీపురం థౌజండ్ టెంపుల్స్ నగరంగా ప్రఖ్యాతిగాంచింది. తమిళనాడులో చారిత్రక హిందూ ఆలయం మీనాక్షి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మధురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది. రంగనాధుడు రంగనాయకి అమ్మవారితో కొలువైవున్న దివ్యక్షేత్రం శ్రీరంగం. ఇది వైష్ణవ దివ్యదేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. పంచభూత క్షేత్రాలలో రెండవది జంబుకేశ్వరం. జంబుకేశ్వరానికి తిమేవ కాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రము అని అర్థం. పూర్వం ఇక్కడ అధికంగా జంబువృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి చెందిన ఆరు ప్రఖ్యాత క్షేత్రాలలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. తమిళనాడులోని మరిన్ని దర్శనీయ ప్రదేశాలను, అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలను... తెలుగు వారి ఆత్మీయ ట్రావెల్స్ ఖV టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీరూ దర్శించవచ్చు ఫిబ్రవరి 2, మార్చి 8, ఏప్రిల్ 4, మే 5, జూన్ 5న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీరు తమిళనాడు యాత్ర చేయవచ్చు. మరిన్ని వివరాలకు హైదరాబాద్, కూకట్పల్లి,ఆఒ్క ఆఫీస్ ఎదురుగా ఉన్న ఖV టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్లో సంప్రదించి కానీ, ఫోన్ చేసి కానీ వివరాలు తెలుసుకోవచ్చు. -
వంటపాత్రలు కడిగిన సీఎం
-
వంటపాత్రలు కడిగిన సీఎం
అమృతసర్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు సోమవారం స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. దేవాలయం ప్రాంగణంలో వారు స్వచ్ఛందంగా సామాజిక సేవ చేశారు. కేజ్రీవాల్ వంటశాలలో పాత్రలు కడిగారు. యూత్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా జరిగిన తప్పుకు క్షమాపణ కోరేందుకు ఆయన స్వర్ణ దేవాలయానికి వచ్చారు. సిక్కులు పరమ పవిత్రంగా భావించే 'హర్మాందర్ షాహిబ్' ఫొటోలతో యూత్ మేనిఫెస్టోను ఆప్ విడుదల చేసింది. దీంతో ప్రత్యర్థి పార్టీలు ఆప్పై విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఆప్ నేతలు గోల్డెన్ టెంపుల్ లో సేవ చేశారు. కేజ్రీవాల్ తో పాటు పార్టీ సీనియర్ నాయకులు ఆశిష్ కేతన్, లాయర్ హెచ్ ఎస్ పూల్కా, ఎంపీలు భగవంత్ మాన్, సాధు సింగ్, నటులు, ఆప్ సభ్యులు గుల్ పనాంగ్, గురుప్రీత్ గుగ్గీ తదితరులు ఉన్నారు. వీరంతా భక్తులతో కలిసి సహఫంక్తి భోజనాలు చేశారు. -
'ఆపరేషన్ బ్లూ స్టార్'కు 32 ఏళ్లు
అమృత్ సర్: సిక్కుల పవిత్ర దేవాలయం స్వర్ణ దేవాలయంపై 'ఆపరేషన్ బ్లూ స్టార్' పేరుతో జరిపిన సైనిక చర్యకు నేటికి 32 ఏళ్లు. ఈ సందర్భంగా సోమవారం గోల్డెన్ టెంపుల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు కొన్ని సిక్కు రాడికల్ గ్రూపులు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు అవతార్ సింగ్ మక్కార్ లు ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గత కొన్నేళ్లుగా దేవాలయంపై దాడి జరిగిన రోజున కొంతమంది నినాదాలు చేయడం,ఘర్షణ జరగడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో స్వర్ణ మందిరం చుట్టుపక్కల పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని పోలీసు కమిషనర్ ఏఎస్ చహల్ తెలిపారు. సిక్కు ఆలయంలో దాగి ఉన్న ఉగ్రవాదులను ఏరివేయడానికి నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 1984 సైనిక చర్యకు ఆదేశించారు. భారత దేశ చరిత్రలో ఒక రక్తసిక్త అధ్యాయంగా స్ధిరపడిపోయింది. ఈ ఆపరేషన్ లోనే వందలాది మంది (అనధికార అంచనా ప్రకారం వేలాది మంది) చనిపోగా, అనంతరం జరిగిన ప్రతీకార హత్య, మూకుమ్మడి హత్యాకాండలలో మరిన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారు. సిక్కుల ఊచకోత గురించిన కేసు ఇప్పటికీ కాంగ్రెస్ నేతలను వెన్నాడుతున్న సంగతి తెలిసిందే. కాగా సిక్కు అంగరక్షకుల చేతిలో ఇందిరాగాంధీ మరణించారు. -
నేల తుడిచి.. గిన్నెలు కడిగి.. వంట చేసి...
అందాల సుందరి ఐశ్వర్యా రాయ్ జీవితం ఎంత విలాసవంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏది కోరితే అది వండి పెట్టడానికి వంట మనుషులు, కాలు బయటపెడితే కారులో తీసుకెళ్లడానికి డ్రైవర్.. ఇలా ఐష్కి బోల్డంత మంది సేవకులు ఉంటారు. అలాంటి ఐశ్వర్యవంతురాలు ఈ మధ్య సాదాసీదా మహిళలా డ్రెస్ చేసుకుని, గుళ్లో నేల తుడిచి, వంట చేసి, భక్తులతో పాటు తాను కూడా నేల మీద కూర్చుని భోజనం చేసి, గిన్నెలు కడగడం టాపిక్ అయ్యింది. ఐష్ ఇదంతా చేసింది అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో. మామూలుగా ఐష్ అడపాదడపా గుళ్లకు వెళుతుంటారు. కానీ, ఇలాంటి సేవా కార్యక్రమం ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు చేసింది ‘సరబ్జిత్’ సినిమా కోసమే. పాకిస్తాన్ జైలులో మగ్గి, ప్రాణాలు వదిలిన పంజాబీ రైతు సరబ్జిత్ సింగ్ జీవితం ఆధారంగా ఒమంగ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సరబ్జిత్ సోదరి దల్బీర్ కౌర్గా ఐష్ నటిస్తున్న విషయం తెలిసిందే. అమృత్సర్ స్వర్ణదేవాలయంలో ఓ భక్తురాలిగా ఐష్ సేవ చేస్తున్న సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారు. అందులో భాగంగానే ఆమె నేల తుడిచి, వంట చేసి, భక్తులతో కలిసి భోజనం చేసి, గిన్నెలు కడిగారు. ఇదంతా సినిమా కోసమే అయినా ఐష్ నటిస్తున్నట్లుగా లేదనీ, నిజంగానే భక్తితో చేసినట్లు అనిపించిందని షూటింగ్ చూసినవాళ్లు పేర్కొన్నారు. తోడబుట్టినవాడు దేశం కాని దేశంలో అన్యాయంగా జైలుపాలయ్యాడనే బాధ దల్బీర్ కళ్లల్లో స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు వెండితెరపై ఈ పాత్ర చేస్తున్న ఐష్ తన కళ్లల్లో ఆ బాధను అద్భుతంగా ఆవిష్కరించగలుగుతున్నారని చిత్రబృందం అంటోంది. -
రూ. 150 కోట్లతో బంగారు ఆలయం
బాలకృష్ణుడికి రూ.150 కోట్లతో బంగారు ఆలయాన్ని నిర్మించనున్నారు. గుంటూరు జిల్లా కొండవీడు ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించాలని ఇస్కాన్ నిర్ణయించింది. దసరా రోజున ఈ ఆలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఇస్కాన్ తెలిపింది. విజయదశమినాడు స్వర్ణమందిరం ఏర్పాటు పనుల ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్నట్లు సమాచారం. మొత్తం 150 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఆలయ ప్రాంతానికి ఇస్కాన్ కొండవీడుగా నామకరణం చేసింది. చారిత్రక వెన్నముద్దల వేణుగోపాస్వామికి ఈ ప్రతిష్టాత్మక ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం చెంఘీజ్ఖాన్పేటలోని వెన్నముద్దల వేణుగోపాలస్వామి విగ్రహం ప్రపంచంలోనే అతి అరుదైనదని వేదపండితులు చెబుతున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం 60 ఎకరాలు కేటాయించింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇస్కాన్ ఆధ్వర్యంలో గోశాల నిర్వహిస్తున్నారు. స్వర్ణమందిరం చుట్టూ మహాభారత, రామాయణాలపై పురాణ గాథలను వివరిస్తూ వినూత్నరీతిలో మ్యూజియం, రోబోలు, ఆడియో, వీడియో విజువల్ ప్రదర్శనల ద్వారా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేలా ఉంటాయి. ఇంకా వేద పాఠశాల, అండర్ వాటర్ మెడిటేషన్ హాలు, ప్రాచీన శాస్త్రాలను సైన్స్ పరంగా చూపే థియేటర్లు, శ్రీకృష్ణుని లీలలను భావితరాలకు తెలిపే ధీం పార్కులు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టుకు రూ.150 కోట్లతో అంచనాలు రూపొందించామని ఇస్కాన్ దక్షిణ భారత ఛైర్మన్ సత్యగోపీనాథ్ దాస్ వివరించారు. -
ఖలిస్తాన్ నినాదాలతో మార్మోగిన ఆలయం
ఆపరేషన్ బ్లూస్టార్ 31వ వార్షికోత్సవం సందర్భంగా అమృత్సర్లో జరిగిన నివాళి కార్యక్రమంలో రెండు సిక్కు గ్రూపుల మధ్య జరిగిన దాడులు శనివారం ఉద్రిక్త వాతావరణానికి దారి తీశాయి. ఈ ఘర్షణలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. నివాళి అర్పిస్తున్న సమయంలోనే స్వర్ణదేవాలయంలో ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు మార్మోగాయి. దీంతో ప్రత్యేక ఖలిస్తాన్ని సమర్థించే, వ్యతిరేకించే రెండు సిక్కు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్వర్ణ దేవాలయం శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ)కి చెందిన సిబ్బంది , రాడికల్ గ్రూపులకు మధ్య ఘర్షణ జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. 1984 జూన్ నెలలోజరిగిన ఆపరేషన్ బ్లూస్టార్పై ఐక్యరాజ్యసమితితో విచారణ జరిపించాలని ఎన్నో ఏళ్లుగా రాడికల్ గ్రూపు డిమాండ్ చేస్తోంది. అకాలీదళ్ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గత ఏడాది కూడా ఘర్షణ జరిగింది. నాటి ఘర్షణల్లో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. -
అభివృద్ధి కోసమే భూబిల్లు
రైతుల పిల్లలు ఇతర ఉపాధి కావాలని కోరుకుంటున్నారు విపక్షాలు లేనిపోని ఆరోపణలతో తప్పుదోవ పట్టిస్తున్నాయి స్వర్ణదేవాలయాన్ని సందర్శించిన మోదీ హుస్సేనీవాలా(పంజాబ్): భూసేకరణ బిల్లుకు మద్దతు పలకాలని ప్రధాని మోదీ రైతుల పిల్లలను కోరారు. అభివృద్ధి జరగాలంటే ఈ చట్టాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చట్టంతో రైతులకు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. దీనిపై విపక్షాలు లేనిపోని ఆరోపణలతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మోదీ మండిపడ్డారు. సోమవారం పంజాబ్లోని హుస్సేనీవాలాలో జరిగిన స్వాతంత్య్ర అమరవీరులు భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల సంస్మరణ సభలో మోదీ మాట్లాడారు. ‘‘దేశం అభివృద్ధి చెందితే రైతులు, వారి తర్వాతి తరాలూ ప్రయోజనం పొందుతాయి. చాలామంది రైతుల పిల్లలు వ్యవసాయం వదిలి వేరే ఉపాధి కావాలని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు అభివృద్ధి లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? వారు ఢిల్లీ, ముంబైల్లోని మురికివాడల్లో ఉండాలని మీరు కోరుకుంటారా?’’ అని ఆయన ప్రశ్నించారు. ఆధునిక సాగు పద్ధతులు అవలంబించాలి: వ్యవసాయంలో ఎరువులను అధికంగా వినియోగిస్తుండటం పట్ల మోదీ ఆందోళన వ్యక్తంచేస్తూ.. దానివల్ల పంటలకు, భూసారానికి నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం వంటి ఆధునిక పద్ధతులను అవలంబించాలని విజ్ఞప్తిచేశారు. రైతులు గత ఏడాది లోటు వర్షపాతంతో సంక్షోభాన్ని ఎదుర్కోగా, ఈసారి వడగండ్లతో కడగండ్ల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో విస్తృతమైన కాలువల వ్యవస్థ ఉందని, రైతుల పొలాలకు నీళ్లందించేందుకు కేంద్రం ‘ప్రధానమంత్రి కృషి యోజన’ను ప్రతిపాదించిందన్నారు. నదులను అనుసంధానం చేయాలని, పాత కాలువలను మరమ్మతు చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో పంజాబ్కు ఉద్యానవన సంస్థను ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అమృత్సర్లో ఏర్పాటు చేసే ఈ సంస్థకు ‘సర్దార్ భగత్సింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్’గా నామకరణం చేస్తామని చెప్పారు. జలియన్వాలా బాగ్, స్వర్ణ దేవాలయ సందర్శన: పంజాబ్ పర్యటన సందర్భంగా మోదీ అమృత్సర్లోని జలియన్వాలాబాగ్ను సందర్శించి అక్కడ స్వాతంత్య్ర పోరాట అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. అనంతరం స్వర్ణదేవాలయాన్ని (శ్రీ హర్మందిర్ సాహిబ్ను) ఆయన సందర్శించారు. మోదీ ప్రధాని అయ్యాక ఈ దేవాలయాన్ని సందర్శించటం ఇదే తొలిసారి. ఆలయంలో దాదాపు 40 నిమిషాల పాటు గడిపిన మోదీకి ఆలయ గురువు సిరోపా (గౌరవ వస్త్రం) ప్రదానం చేశారు. కాగ్ అంచనా కన్నా పెద్ద స్కాం... దేశాన్ని అవినీతి భూతం విచ్ఛిన్నం చేసిందంటూ మోదీ యూపీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాగ్ అంచనావేసిన దానికంటే కోల్స్కామ్చాలా పెద్దది కావచ్చని.. దీనివల్ల దేశానికి చాలా నష్టం జరిగిందని మోదీ మండిపడ్డారు. ‘‘వారి పాపం వల్ల చాలా విద్యుత్ ప్లాంట్లు బొగ్గు కొరతతో మూతపడ్డాయి. మేము అధికారంలోకి వచ్చిన సమయంలో ఇది జరిగింది. అందువల్ల మేము బొగ్గు బ్లాకులను వేలానికి పెట్టాలని నిర్ణయించాం. 204 బ్లాకుల్లో 20 బ్లాకులను వేలం వేశాం. దీంతో సమకూరిన రూ. రెండు లక్షల కోట్లను ప్రభుత్వ ఖజానాలో జమ చేశాం. దీన్ని పేదల సంక్షేమానికి వినియోగిస్తాం. ఇంకా 180 బ్లాకులున్నాయి’’ అని మోదీ చెప్పారు. -
అమెరికాలోనూ అన్నదానాలు.. స్వర్ణదేవాలయమే స్ఫూర్తి!
అమృతసర్లోని స్వర్ణదేవాలయంలో నిర్వహించే 'లంగర్'తో స్ఫూర్తిపొంది.. అమెరికాలోని కొంతమంది విద్యార్థులు ఆన్ ఆర్బర్ ప్రాంతంలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లో అన్నదానాలు నిర్వహిస్తున్నారు. వీళ్లంతా గత వేసవి కాలంలో స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రతిరోజూ 60వేల మందికి కొంతమంది వాలంటీర్లు భోజనాలు పెడతారు. షిఫ్టుల వారీగా డ్యూటీలు వేసుకుని మరీ ఇలా అంతా కలిసి ఈ విధులు నిర్వర్తిస్తారు. దీన్ని చూసి అబ్బురపడిన విద్యార్థులు తమ యూనివర్సిటీలో కూడా ఈ తరహాలోనే అన్నదానం చేయడం మొదలుపెట్టారు. ప్రతి శుక్రవారం వాళ్లు పదివేల మందికి ముందుగా తయారుచేసిన ఆహారాన్ని ప్యాక్ చేసి ఇస్తున్నారు. అలా తయారుచేసినవాటిలో ఏమైనా మిగిలిపోతే అనాథాశ్రమాలకు పంపుతున్నారు. అమెరికాలో ధనవంతులతో పాటు చాలామంది పేదలు కూడా ఉన్నారని, అందువల్ల అందరూ ఇలా ముందుకు రావాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఈ 'లంగర్' అందరికీ స్ఫూర్తినిస్తుందని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ జస్ప్రీత్సింగ్ తెలిపారు. -
వైఫల్యాల మధ్య వైభవం బాధ
రాజకీయ తప్పిదాలు, చరిత్ర చేసిన గాయాలు అంత తొందరగా మాసిపోవు. కానీ గాయాల నుంచి కూడా లబ్ధి పొందేవారు ఉన్నకాల మిది. భింద్రన్వాలేను ఇప్పటికీ తమ ఆరాధ్యదైవంగా కొలిచేవారికి అక్కడ కొదవ లేదు. అధికార పక్షాలు పాలనా వ్యవహారాల దగ్గర చతికిల పడితే విపత్కర పరిణామాలు తప్పవు. పంజాబ్లో జరుతున్నది అదే. ప్రకాశ్సింగ్ బాదల్ నాయకత్వంలోని శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమి ప్రభుత్వం నీరుగారిపోయిందని ఇటీవలి పరిణామాలే సాక్ష్యం చెబుతాయి. పంజాబ్ వంటి రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడడం ఇందుకు పెద్ద నిదర్శనం. అంతే కాదు, నాయకత్వ వైఫల్యం వల్ల, గతంలో ఎన్నో గాయాలను చవిచూసిన ఆ సరిహద్దు రాష్ట్రంలో సద్దుమణిగినట్టు భావించిన సంక్షోభాలు మళ్లీ తలెత్తుతున్నాయి. ఈ నెల ఆరున స్వర్ణ దేవాలయంలో జరిగిన ఘటనలు ఇందుకు సంబంధించినవే. దేశ విభజనలో ఎంతో విషాదాన్ని మూటగట్టుకున్న ప్రాంతం పంజాబ్. సిక్కులు గాయపడిన జాతి. కాలం, రూ పం వేరు కావచ్చు కానీ, 1980 దశకంలో ఆ రాష్ట్రాన్ని కుది పేసిన ఖలిస్థాన్ రగడ ఆ దారుణ విషాదాలకు కొనసాగింపు అనే అనుకోవాలి. ఖలిస్థాన్ ఏర్పాటు నినాదంతో ఆరంభ మైన ఆందోళన ఆధునిక భారత చరిత్రలోనే రక్తసిక్త వాక్యం. ఖలిస్థాన్ పరిణామాల పతాక సన్నివేశమే ఆపరేషన్ బ్లూ స్టార్. 1984లో జూన్ 3-8 మధ్య హర్మిందర్ సాహెబ్ లేదా స్వర్ణదేవాలయం మీద జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ (సైనిక చర్య) సిక్కుల మనసులను తీవ్రంగానే గాయపరిచింది. ఖలి స్థాన్ ఏర్పాటు నినాదంతో ఉగ్రవాద పంథాలో ఉద్యమిం చిన సంత్ జర్నయిల్సింగ్ భింద్రన్వాలే ఆ మందిరాన్ని కేంద్ర కార్యాలయం చేసుకున్నాడు. నాటి ప్రధాని ఇందిర ఆదేశం మేరకు సైన్యం దాడి చేసింది. తదనంతర పరిణా మాలు అత్యంత విషాదకరమైనవి. ఆపరేషన్ బ్లూస్టార్ అనంతర పరిణామం ఇందిరాగాంధీ దారుణ హత్య. ఇందిర హత్య తదనంతర పరిణామం ఢిల్లీలో, దేశంలో సిక్కుల ఊచకోత. ఇవన్నీ చరిత్ర మీద బాధాకరమైన ముద్రలను వేసి వెళ్లాయి. ఇదంతా గతం. ఆపరేషన్ బ్లూస్టార్ దుర్ఘటన జరిగి 30 సంవత్సరాలు గ డిచిన సందర్భంగా మొన్న ఆరోతేదీన స్వర్ణ దేవాలయంలో కార్యక్రమం జరిగినపుడు అవాంఛనీయ పరిణామాలు చో టు చేసుకున్నాయి. ఖలిస్థాన్ అనుకూల నినాదాలు వినిపిం చాయి. ఆ అంశాన్ని సమర్థిస్తున్నవారు, ఇతరుల మధ్య ఘర్ష ణ జరిగింది. మత చిహ్నంగా సిక్కులు దరించే కరవాలా లతోనే, అది కూడా స్వర్ణ ఆలయంలోనే ఘర్షణకు దిగారు. పన్నెండు మంది గాయపడ్డారు. ఇదో ప్రమాద హెచ్చరిక. రాజకీయ తప్పిదాలు, చరిత్ర చేసిన గాయాలు అంత తొందరగా మాసిపోవు. కానీ గాయాల నుంచి కూడా లబ్ధి పొందేవారు ఉన్నకాలమిది. భింద్రన్వాలేను ఇప్పటికీ తమ ఆరాధ్యదైవంగా కొలిచేవారికి అక్కడ కొదవ లేదు. దేని మీద అయినా వ్యాపారం చేయగలిగిన ఘనులకు ఈ ఒక్క అంశం చాలు. అందుకే భింద్రన్వాలే ముఖాన్ని ముద్రించిన చొక్కా లను కొద్దికాలంగా అమృత్సర్ పరిసరాలలో విపరీతంగా అమ్ముతున్నారు. సున్నిత అంశానికి లొంగిపోయేవారే ఎప్పు డూ ఎక్కువమంది ఉంటారు. ముఖ్యంగా యువతరం ఇం దుకు లక్ష్యంగా ఉంటారు. అందుకే భింద్రన్వాలే బొమ్మ ము ద్రించిన టీ షర్టులు వేసుకుని కనిపించే సిక్కు యువకులు తరుచు కనిపిస్తున్నారు. 1980 దశకంలో ఆ ఉద్యమం ఏం సాధించిందో చాలామందికి అక్కరలేదు. అయినా భింద్రన్ వాలేను ఆరాధించేవారు కనిపిస్తూనే ఉన్నారు. ఇందుకు చా లా కారణాలు చెబుతున్నారు. సిక్కు యువకులు ప్రస్తుతం మత్తుమందులలో తేలియాడుతున్నారు. వారికి ఏదో విధమై న ‘ప్రతిష్ట’ కావాలి. కానీ ఆ రాష్ట్ర నాయకులలో యువకు లకు ప్రేరణ ఇవ్వగలిగిన నాయకులు ఇప్పుడు ఎవరూ లేరు. అందుకే భింద్రన్వాలేను జ్ఞాపకానికి ప్రాణ ప్రతిష్ట చేయాలని చూస్తున్నారు. 80 దశకంలో అతడి పేరు వింటే భారతదేశం మొత్తం గడగడలాడిపోయి ఉండవచ్చు. కానీ కొందరు దారి తప్పిన సిక్కుల దృష్టిలో ఆయన ఓ వీరుడు. ఇలాంటి జాడలే ప్రస్తుతం పంజాబ్లో కనిపిస్తున్నాయి. ఈ అంశాన్ని సుస్పష్టంగా ప్రపంచం ఆవిష్కరించినదే జూన్ ఆరు నాటి ఘటన. సిక్కు యువకులు ప్రస్తుతం ‘వైభవం’ కోసం పాకులా డుతున్నారు. అందుకే సంచలనంలో కూడా వారికి వైభవం కనిపిస్తున్నది. అరవింద్ కేజ్రీవాల్లో అలాంటి అంశాలు కనిపించాయి. అందుకే దేశంలో ఎక్కడా ఒక్క సీటు కూడా గెలుచుకోని ఆప్ పంజాబ్లో నాలుగు లోక్సభ స్థానాలను గెలుచుకుంది. మోడీ కంటే కేజ్రీవాల్లోనే వారికి ‘హీరో’ కనిపించాడు. ఇదంతా చూస్తుంటే సిక్కులు గత వైభవం కోసం అర్రులు చాస్తున్నారని అనుకోలేం. గత గాయాలు వారిని మళ్లీ బాధపెట్టడం మొదలయిందనడమే నిజం. భింద్రన్వాలే నామస్మరణ దానికో పైపూత మాత్రమే. డాక్టర్ గోపరాజు నారాయణరావు -
స్వర్ణ దేవాలయంలో రెండువర్గాల ఘర్షణ
అమృత్సర్, చండీగఢ్: సిక్కుల పుణ్యక్షేత్రమైన అమృత్సర్ స్వర్ణదేవాలయంలో శుక్రవారం ఉదయం రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. సుమారు అరగంటపాటు జరిగిన ఘర్షణలో 12 మందివరకు గాయపడ్డారు. అకల్తక్త్ భవనం వెలుపల కత్తులు, బల్లాలు, కర్రలతో రెండు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. దీంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి 30 ఏళ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో అకాలీదళ్ చీలికవర్గం నేత సిమ్రన్జిత్సింగ్ మాన్ మద్దతుదారులు కొందరు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేయడంతో గొడవ ప్రారంభమైందని అమృత్సర్ పోలీస్ కమిషనర్ జతిందర్ సింగ్ తెలిపారు. దానికితోడు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) సెక్యూరిటీ గార్డులు ఈ కార్యక్రమంలో సిమ్రన్జిత్సింగ్ మాన్ ప్రసంగించకుండా అడ్డుకున్నారని ఆయన వివరించారు. దాంతో గొడవ ముదిరి ఇరువర్గాలు విచక్షణారహితంగా కత్తులు, బల్లాలతో కొట్టుకున్నాయని, ఈ సంఘటనలో ఎస్జీపీసీ టాస్క్ఫోర్స్కు చెందిన ఐదుగురు సభ్యులు గాయపడ్డారని చెప్పారు. స్వర్ణదేవాలయంలో భద్రత, ఇతర వ్యవహారాలన్నీ ఎస్జీపీసీ టాస్క్ఫోర్స్ పర్యవేక్షణలోనే ఉంటాయని, దాంతో ఆలయంలోకి పోలీసులను అనుమతించలేదని జతిందర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉద్రిక్తత చల్లారిందని, పరిస్థితి అదుపులో ఉందని వివరించారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టినట్టు అకల్తక్త్ జతేదార్ జ్ఞాని గుర్బచన్ సింగ్ తెలిపారు. కొన్ని అసాంఘిక శక్తుల కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు ప్రాథమిక విచారణద్వారా తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఆలయంలో పూజాదికాలు, ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగలేదని అధికారవర్గాలు తెలిపాయి. ఎస్జీపీసీ, అకాలీదళ్ నాయకత్వంలోని పంజాబ్ ప్రభుత్వం సిక్కుల సమస్యలను పట్టించుకోవడంలేదని, పరిష్కారంకోసం నిలదీసినవారిని వేధిస్తున్నారని సిమ్రన్జిత్సింగ్ మాన్ ఆరోపించారు. 1984 జూన్లో స్వర్ణదేవాలయంలో తిష్టవేసిన మిలిటెంట్లను ఏరివేయడానికి అప్పటి ప్రభుత్వం ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనలో వెయ్యిమందివరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఏటా సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ బ్లూసార్ జరిగి 30 ఏళ్లయిన సందర్భంగా అమృత్సర్లో బంద్ పాటించారు. సీఎం బాదల్ ఖండన స్వర్ణదేవాలయంలో రెండువర్గాలు ఘర్షణకు దిగిన సంఘటనను పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్సింగ్ బాదల్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. స్వర్ణదేవాలయంలో చోటుచేసుకున్న సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులను ఎంతో బాధించిందని ముఖ్యమంత్రి విచారం వ్యక్తంచేశారు. కాగా ఈ సంఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. -
స్వర్ణదేవాలయంలో కత్తులతో ఘర్షణ
-
రెండు సిక్కు వర్గాల మధ్య ఘర్షణ
-
స్వర్ణదేవాలయంలో కత్తులతో ఘర్షణ
అమృత్సర్ : ఆపరేషన్ బ్లూస్టార్ 30వ వార్షికోత్సవం సందర్భంగా అమృత్సర్లో జరిగిన నివాళి కార్యక్రమంలో రెండు సిక్కు గ్రూపుల మధ్య జరిగిన దాడులు శుక్రవారం ఉద్రిక్త వాతావరణానికి దారి తీశాయి. అమృత్సర్లోని ప్రఖ్యాత స్వర్ణదేవాలయంలోనే ఏకంగా కత్తులతో దాడులు చేసుకోవడంతో 12 మందికి గాయాలయ్యాయి. సిక్ రాడికల్ గ్రూపు, శిరోమణి గురుద్వారా ప్రబంధ్ కమిటీ మధ్య జరిగిన గొడవలు ఉద్రిక్తతకు దారి తీశాయి. 1984 జూన్ నెలలోజరిగిన ఆపరేషన్ బ్లూస్టార్పై ఐక్యరాజ్యసమితితో విచారణ జరిపించాలని రాడికల్ గ్రూపు డిమాండ్ చేస్తోంది. అకాలీదళ్ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. నివాళి అర్పిస్తున్న సమయంలోనే రాడికల్ గ్రూపు సభ్యులు ఐక్యరాజ్య సమితి విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. అయితే, ఇలాంటి అంతర్జాతీయ పెత్తనాన్ని అంగీకరించకూడదని విశ్లేషకులు అంటున్నారు. ఆపరేషన్ బ్లూస్లార్ అనేది ఎప్పుడో గడిచిపోయిన విషయమని, పంజాబ్లో ఎన్నాళ్లుగానో పాతుకుపోయిన అకాలీదళ్ ఇప్పుడు బలహీనపడుతుంటే.. కొత్త శక్తులు బయటకు వస్తున్నాయని అంటున్నారు. ఉగ్రవాదానికి స్థావరాలుగా మారుతున్న కొత్తగ్రూపులను మాత్రం ఎప్పటికప్పుడు అణచివేయకపోతే భింద్రన్వాలే వారసులు మళ్లీ పుట్టుకొచ్చే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. స్వర్ణ దేవాలయం శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) ఆధీనంలో ఉండగా, పోలీసులు అక్కడి శాంతి భద్రతల అంశాన్ని పట్టించుకోడానికి మీనమేషాలు లెక్కపెట్టడం కూడా ఈ తరహా ఘర్షణలకు కారణం కావచ్చని అంటున్నారు. -
స్వర్ణదేవాలయాన్ని సందర్శించిన అరుణ్ జైట్లీ
-
బంగారుగుడిలో త్రిష
వేలూరు శ్రీపురం బంగారుగుడిని సినీనటి త్రిష కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీపురం చేరుకున్న నటి త్రిషకు బంగారుగుడి మేనేజర్ సంపత్, నారాయణి పీఠం డెరైక్టర్ బాలాజీ, నిర్వాహకులు స్వాగతం పలికారు. ఆమెకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక దర్శనం చేయించారు. కుటుంబ సభ్యులతో కలసి త్రిష పీఠంలోని నారాయణి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పీఠంలో కొత్తగా 70 కిలోల బంగారంతో తయారు చేసిన శ్రీ స్వర్ణలక్ష్మి విగ్రహానికి త్రిష చేతుల మీదుగా ప్రత్యేక అభిషేకాలు చేయించారు. అనంతరం శ్రీనారాయణి పీఠాధిపతి శక్తిఅమ్మ వద్ద ఆశీర్వాదాలు పొంది ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. సుమారు రెండు గంటల పాటు ఆలయంలో గడిపిన త్రిష, ఆమె కుటుంబ సభ్యులు అనంతరం చెన్నైకి బయలుదేరి వెళ్లారు. నటి త్రిష బంగారుగుడికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న భక్తులు, అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు.