Hunting
-
ఇన్స్టాలో లైక్ల కోసం వన్యప్రాణుల వేట
వేంపల్లె: ఇన్స్ట్రాగామ్లో లైక్ల కోసం ఓ యువకుడు పెంపుడు కుక్కలతో వేటకు వెళ్లి అడవిలో జంతువులను చంపి, ఆ వీడియోలను అప్లోడ్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. దీన్ని గమనించిన తెలంగాణ జంతు ప్రేమికులు ఆ యువకుడికి అదిరిపోయే షాక్ ఇచ్చారు. కట్చేస్తే వేంపల్లి ఫారెస్ట్ అధికారులు అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం వడ్డేపల్లెలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కడప జిల్లాలోని గాలివీడు మండలం, వడ్డేపల్లికి చెందిన బత్తల చిరంజీవి పెంపుడు కుక్కలతో సమీపంలోని కొండల్లోకి వెళ్లి, అడవి జంతువులను వేటాడి, వాటిని చంపి, లైకుల కోసం ఇన్స్ట్రాగామ్లో పోస్టులు పెట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. అతను చేసే వీడియోలు వైరల్గా మారాయి. వీటిని తెలంగాణ జంతు ప్రేమికులు గమనించి, వెంటనే కడప జిల్లా డీఎఫ్వో సందీప్రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వేంపల్లె ఫారెస్టు అధికారులకు సమాచారమిచ్చి అతడిని అరెస్టు చేయాలని ఆదేశించారు. వేంపల్లె ఫారెస్టు అధికారి బాలసుబ్రమణ్యం తన సిబ్బందితో వెళ్లి బత్తల చిరంజీవిని అరెస్టు చేసినట్లు మీడియాకు తెలిపారు. -
పుతిన్ కక్ష సాధింపు..! ప్రత్యర్థి భార్యపై వారెంట్
మాస్కో: అయిదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వేట ఆగలేదు. ప్రత్యర్థులు చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు కొనసాగుతోంది.గతంలో జైలులో వివాదాస్పదంగా మృతి చెందిన అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని భార్య యులియా నవల్నయాపై తాజాగా అరెస్టు వారెంట్ జారీ అయింది. తీవ్రవాదసంస్థలో చేరినందుకుగాను వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.యులియాను రెండు నెలలు నిర్బంధంలో ఉంచేందుకు పోలీసులకు అనుమతిచ్చినట్లు మాస్కోలోని బాస్మన్నే కోర్టు వెల్లడించింది. తనపై వారెంట్ జారీ అవడం పట్ల యులియా తీవ్రంగా స్పందించారు. పుతిన్ ఒక హంతకుడు, వార్ క్రిమినల్, జైలులో ఉండాల్సిన వాడని మండిపడ్డారు. యులియాపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు ఆమె సిబ్బంది ఎక్స్(ట్విటర్)లో ధృవీకరించారు.యులియా భర్త, పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈయన మృతిపై అమెరికా సహా పలు దేశాలు స్పందించాయి. నవాల్ని మృతి చెందిన తర్వాత ఆయన పోరాటాన్ని ముందుకు తీసుకువెళతానని భార్య యులియా ప్రతిజ్ఞ చేశారు. -
సముద్రంలో తిరగబడిన బోటు
వేటపాలెం: బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం, పొట్టిసుబ్బయ్యపాలెం మత్స్యకారులకు సంబంధించిన బోటు సముద్రంలో సోమవారం రాత్రి బోల్తాకొట్టింది. అందులో వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరు గంటల పాటు సముద్రంలోనే ఉండిపోయారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన కొండూరు రాములు, పెద్ద కుమారుడు కొండూరు గోవిందు, చిన్నకుమారుడు చిట్టిబాబు, కఠారివారిపాలేనికి చెందిన కఠారి శ్రీను నలుగురు కలిసి సోమవారం సాయంకాలం బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో వేట సాగించేటప్పుడు అలల తాకిడికి బోటులోకి సముద్రం నీరు పెద్ద మొత్తంలో చేరుకొని తిరగబడింది. అందులో ఉన్న నలుగురు సముద్రం నీటిలో పడిపోయారు. వీరి పై వేట సాగించే వల పడింది. నలుగురు సముద్రం నీటిలోపలకు వెళ్లి వలను తప్పించుకొని ఈతకొట్టుకొంటూ తిరగబడిన బోటు పై భాగానికి ఎక్కి కూర్చున్నారు. వీరి వద్ద ఉన్న సెల్ఫోన్లు నీటిలో పడిపోవడంతో సమాచారం ఇవ్వడానికి వీలు పడలేదు. ఆరు గంటల పాటు తిరగబడిన బోటు పైనే కూర్చున్నారు. చిన్నగంజాం మండలం, చిన్నంగారివారిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు మంగళవారం తెల్లవారుజామున వేట ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైన బోటు పై భాగంలో కూర్చొని ఉన్న నలుగురిని గమనించారు. వెంటనే వారిని తమ బోటులో ఎక్కించుకొని తెల్లవారుజామున 5 గంటలకు పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామానికి తీసుకొచ్చారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరు గంటల పాటు సముద్రం నీటిలోనే ఉండిపోయామని మత్స్యకారులు తెలిపారు. వల, బోటు, ఇంజన్లు ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రూ.6.50 లక్షలు నష్ట పోయామని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
క్యాచ్ ద ట్రాప్..!
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల వేట నిరోధానికి స్పెషల్ డ్రైవ్ ‘క్యాచ్ ద ట్రాప్’కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీ శాఖ ప్రారంభించింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు, విషపదార్ధాలు, పేలుడు పదార్ధాలు వంటివి ఉపయోగించకుండా కార్యాచరణను శుక్రవారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల పరిశీలన ద్వారా వేటగాళ్ల గుర్తింపు, పరికరాల స్వాదీనం, గత రికార్డులు, కేసుల ప్రకారం సోదాల నిర్వహణ వంటివి అమలు చేస్తోంది. వివిధ రకాల వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు ఉపయోగించి అటవీ జంతువులను చంపడం/వేటాడటాన్ని గతంలోనే నిషేధించడం తెలిసిందే. వేటకు అడ్డుకట్ట..: అడవి జంతువుల నుంచి వ్యవసాయ పంటల నష్ట నివారణకు కొందరు, అటవీ జంతువుల మాంసం వినియోగం, వ్యాపారానికి మరికొందరు సాగిస్తున్న జంతువుల వేటకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ప్రత్యేక డ్రైవ్ లో అధికారులు వీలైనన్ని అటవీ ప్రాంతాలను పరిశీలించి వేటగాళ్లను గుర్తించడంతో పాటు వారు వాడే పరికరాలను స్వాదీనం చేసుకోవటం వంటి చర్యలను చేపడుతున్నారు. గత రికార్డులు, కేసులను పరిశీలించి అనుమానితులను సోదా చేసి వేటకు ఉపయోగించే పరికరాలను స్వాదీనం చేసుకుంటున్నారు. ముందుగా అడవిని ఆనుకుని ఉండే వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాలు, ప్రాంతాలను క్షేత్ర సా్థయిలో పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్వాదీనం చేసుకున్న అన్ని వేటలకు ఉపయోగించే మెటీరియల్/పరికరాలు సరిగ్గా రికార్డ్ చేయటంతో పాటు, సురక్షితమైన కస్టడీ కోసం వాటిని హైదరాబాద్కు రవాణా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రోత్సాహం అందించనున్నారు. వేట సమాచారం ఇస్తే రివార్డులు..: వేటకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చే ఇన్ఫార్మర్లకు తగిన రివార్డులు అందజేయనున్నారు. అయితే వారి గుర్తింపును రహస్యంగా ఉంచనున్నారు. చట్టవిరుద్ధమైన వేట, అందుకోసం ఉపయోగించే వస్తువుల సమాచారం తెలిస్తే సంబంధిత జిల్లా అటవీ అధికారికి లేదా 9803338666 నంబర్కు, లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు తెలియజేయవచ్చునని అటవీ శాఖ సూచించింది.. -
వజ్రాల వేటకు వచ్చి వ్యక్తి మృతి
నందిగామ(చందర్లపాడు): పొరుగు రాష్ట్రం నుంచి వజ్రాల వేట కోసం వచ్చి ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో చోటుచేసుకుంది. చందర్లపాడు ఎస్ఐ రామకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్కు చెందిన ఇస్రం రాంబాబు (40) ఆటో డ్రైవర్గా పని చేస్తాడు. చందర్లపాడు మండలం గుడిమెట్ల అటవీ ప్రాంతంలో కొంతకాలంగా వజ్రాల వేట పేట కొనసాగుతున్న సంగతి పాఠకులకు విదితమే. ఈ క్రమంలో రాంబాబు కూడా వజ్రాలు అన్వేషించేందుకు గత మూడు రోజుల క్రితం గుడిమెట్ల వచ్చాడు. బుధవారం వజ్రాల వేటకు వచ్చిన కొందరు రాంబాబు మృతి చెంది ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో చందర్లపాడు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడంతోపాటు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.వజ్రాల వేటకు వచ్చిన వ్యక్తి హత్యకు గురయ్యాడా? లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల మృతి చెందాడా అనే అంశాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సౌర పడవలతో చేపలవేట
సాక్షి, హైదరాబాద్: చేపల వేటలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక విధానాలను ప్రవేశ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య ప్రయత్నాలను ఆరంభించింది. రాష్ట్రంలోని భారీ జలాశయాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులకు అవసరమైన యంత్ర సామగ్రిని సమకూర్చేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తెప్పలతో చేపల వేట సాగిస్తున్న మత్య్సకారులకు సౌరశక్తితో నడిచే పడవలు అందజేయాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఉనికిలో ఉన్న సుమారు వందకుపైగా జలాశయాల్లో.. దాదాపు లక్ష మందికి పైగా మత్య్సకారులకు తెప్పలతో చేపల వేట జీవనాధారంగా ఉంది. లోతైన నీటిలో తెప్పలపై అనేక మంది మత్స్యకారులు ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు మృతి చెందుతున్నారు. తెప్పపై నుంచి వల వేయడం, తెడ్డు సాయంతో పడవ ముందుకు నడపడంలో అనేక ఇబ్బందులొస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. వీటిన్నింటిని గుర్తించి మత్స్యకారుల మేలు కోసం ఇకపై సౌరశక్తి పడవలు సమకూర్చాలని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య నిర్ణయించింది. మరబోట్లతో అధిక వ్యయం: చేపల వేటకు ఉపయోగించే డీజిల్, పెట్రోల్ మరబోట్ల వినియోగం ఖర్చుతో కూడుకున్నదని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ చెప్పారు. ఇంధన ఖర్చులు లేని పర్యావరణహితమైన మార్గాలను పరిశీలించినట్టు తెలిపారు. కేరళలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ టెక్నాలజీతో తెలంగాణకు సౌరశక్తి పడవులను తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్లోని ‘బిట్స్ పిలాని’సంస్థ నిపుణులతో శనివారం చర్చలు జరిపామని పేర్కొన్నారు. సహకారం అందించేందుకు బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ మోరపాకల శ్రీనివాస్, ప్రొఫెసర్ సంతాను కోలే తదితరులు హామీ ఇచ్చారని రవీందర్ తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర జలాశయాలన్నింటిలోనూ సౌరశక్తితో నడిచే పడవులను ప్రవేశపెడతామని రవీందర్ వెల్లడించారు. -
సిగ్నల్ లేకపోయినా క్షణాల్లో సమాచారం
సాక్షి, అమరావతి: మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో మత్స్య సంపదను వేటాడే వేళ గంగపుత్రులు ఆపదలో చిక్కుకుంటే.. రక్షించేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఇస్రో అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెల్ సిగ్నల్ అందకపోయినా.. రక్షణ పరిధిలోకి తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్ మైళ్ల వరకు రాష్ట్ర పరిధిలో ఉండగా.. 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు దేశీయ జలాలు. 200 నాటికల్ మైళ్ల దూరం దాటితే అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లు తీరం నుంచి 4 నాటికల్ మైళ్ల వరకు వెళ్తుంటాయి. మోటరైజ్డ్ బోట్లు 12 నాటికల్ మైళ్ల వరకు, మెకనైజ్డ్ బోట్లు 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు వెళ్లి వేట సాగిస్తుంటాయి. రాష్ట్రంలో 1,610 మెకనైజ్డ్, 22 వేల మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 1.60 లక్షల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఇప్పటివరకు వేట సాగించే మత్స్యకారులకు ఇన్కాయిస్ సంస్థ శాటిలైట్ ద్వారా సముద్రంలో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రదేశాలను (పీఎఫ్జెడ్–పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్) గుర్తించి బోట్లలో అమర్చే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏఐఎస్), మత్స్య శాఖ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్స్ ద్వారా 12 నాటికల్ మైళ్ల పైబడి దూరం వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు సమాచారం అందిస్తున్నాయి. ఈ సమాచారం సంప్రదాయ, మోటరైజ్డ్ బోట్లకు అందించే అవకాశం లేదు. పైగా ఇది 2–3 రోజులు మాత్రమే ఉపయోగపడుతుంది. మరో వైపు ఏదైనా ఆపదలో ఉంటే తమ క్షేమ సమాచారం మొబైల్స్కు ఉండే సిగ్నల్స్పై ఆధారపడి ఉంటుంది. సిగ్నల్ మిస్ అయితే తీరానికి కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతుంది. ఈ పరిస్థితికి ఇక చెక్ పెడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. 100 శాతం సబ్సిడీపై.. కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్పాండర్)ను 12 నాటికల్ మైళ్లకు పైబడి దూరం వెళ్లే మరబోట్లు, మెకనైజ్డ్ బోట్లకు అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.36,400 విలువైన ఈ పరికరాన్ని 100 శాతం సబ్సిడీతో అమర్చనున్నారు. తీరంలో గస్తీ కోసం అభివృద్ధి చేసిన ఐఆర్ఎన్ఎస్ (నావిక్), జీపీఎస్ శాటిలైట్స్తో ఈ డివైస్ అనుసంధానమై పనిచేస్తుంది. బోట్లలోని మత్స్యకారుల వద్ద ఉండే స్మార్ట్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే చాలు సిగ్నల్తో సంబంధం లేకుండా రెండువైపులా సమాచారాన్ని పరస్పరం పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. సమయం వృథా కాకుండా.. మరోవైపు ఇన్కాయిస్ సంస్థ అందించే పీఎఫ్జెడ్ సమాచారాన్ని కచ్చితమైన లొకేషన్స్తో బోట్లలోని మత్స్యకారులకు పంపడం వలన వారు క్షణాల్లో అక్కడకు చేరుకొని వేట సాగించడం ద్వారా సమయం, ఆయిల్ ఆదా అవుతుంది. పట్టుబడిన మత్స్యసంపదను ఏ సమయంలో ఏ రేవుకు తీసుకొస్తే మంచి రేటు వస్తుందో కూడా ఈ డివైస్ ద్వారా సమాచారం పంపిస్తారు. దీంతో తీరానికి చేరుకున్న తర్వాత తగిన ధర లేక మత్స్యకారులు నష్టపోయే పరిస్థితి ఉండదు. అయితే ఈ డివైస్ పనిచేయాలన్నా, సిగ్నల్తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ పనిచేయాలన్నా.. సంబంధిత బోట్లలో రీ జనరేట్ చేసుకునే పవర్ సిస్టమ్ అవసరం ఉంటుంది. వైపరీత్యాల వేళ అప్రమత్తం చేయొచ్చు తుపాను హెచ్చరికలు, అకాల వర్షాలు, ఈదురు గాలులకు సంబంధించిన సమాచారాన్ని ఈ డివైస్ ద్వారా లోతు జలాల్లో వేట సాగించే అన్నిరకాల బోట్లకు క్షణాల్లో పంపించి వారిని అప్రమత్తం చేయవచ్చు. లోతు జలాల్లో ఉన్నవారిని సాధ్యమైనంత త్వరగా తీరానికి చేరుకునేలా హెచ్చరికలు జారీ చేయొచ్చు. ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే ఈ డివైస్ ద్వారా సమాచారం పంపితే శాటిలైట్ ద్వారా గ్రౌండ్ స్టేషన్కు చేరుతుంది. అక్కడ నుంచి క్షణాల్లో ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేçస్తున్న మోనిటరింగ్ స్టేషన్స్తోపాటు కోస్ట్ గార్డు, మెరైన్, నేవీ విభాగాలతోపాటు సమీపంలో ఉండే కమర్షియల్ వెసల్స్కు కూడా సమాచారం అందిస్తారు. తద్వారా క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఆపదలో ఉన్న వారిని ప్రాణాలతో రక్షించే అవకాశం ఉంటుంది. దశల వారీగా అమర్చుతాం కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్పాండర్)ను లోతు జలాల్లో మత్స్య వేట సాగించే బోట్లకు దశల వారీగా అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తొలి దశలో 4,484 బోట్లలో అమర్చనున్నాం. అక్టోబర్ నాటికి వీటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. – వీవీ రావు, జేడీ, మత్స్య శాఖ (సముద్ర విభాగం) -
వేట మొదలెట్టిన టైగర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడంటే
-
ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట
పూంచ్: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఐదుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భారత సైన్యం వేట ముమ్మరం చేసింది. డ్రోన్లు, జాగిలాలతోపాటు హెలికాప్టర్తో గాలింపు కొనసాగిస్తోంది. బాటా–డోరియా అటవీ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నారు. గాలింపు చర్యలను సైనిక, పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందం శుక్రవారం ఘటనా స్థలాన్ని సందర్శించింది. గురువారం ముష్కరుల దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన ఐదుగురు చనిపోవడంతోపాటు మరొకరు గాయపడిన సంగతి తెలిసిందే. అమర జవాన్ల మృతదేహాలకు ఉన్నతాధికారులు శుక్రవారం నివాళులర్పించారు. అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో హై అలర్ట్ విధించారు. నియంత్రణ రేఖ వద్ద నిఘాను పటిష్టం చేశారు. ముష్కరుల దుశ్చర్యను ఖండిస్తూ బీజేపీ, వీహెచ్పీ, రాష్ట్రీయ బజరంగ్ దళ్, శివసన, డోగ్రా ఫ్రంట్, జమ్మూ స్టేట్హుడ్ ఆర్గజనైజేషన్ జమ్మూలో భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. -
వేటకు వేళాయె..రా!
సాక్షి, అమలాపురం/ఉప్పలగుప్తం: విస్తారమైన సముద్ర తీరం.. అపారమైన మత్స్యసంపద.. వేటలో సిద్ధహస్తులైన మత్స్యకారులకు కోనసీమ సముద్ర తీరం మత్స్య సంపదకు అక్షయపాత్రే. అందుకే స్థానిక మత్స్యకారులతోపాటు వేటలో నిష్ణాతులైన అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతానికి చెందిన అనేకమంది మత్స్యకారులు కుటుంబాలతో ఇక్కడకు వలస వచ్చి వేటను సాగిస్తుంటారు. ఏటా ఎనిమిది నెలల పాటు ఇక్కడి తీరంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సముద్ర తీరాన్ని ఆనుకుని పలు మత్స్యకార గ్రామాలున్నాయి. కాట్రేనికోన మండలం పల్లం, చిర్రయానాం, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, అల్లవరం మండలం నక్కా రామేశ్వరం, మలికిపురం మండలం తూర్పుపాలెం వద్ద సముద్రతీరం గట్టు మీద పదుల సంఖ్యలో గుడిసెలతో చిన్నచిన్న గ్రామాలు కనిపిస్తుంటాయి. అంతమాత్రాన ఇవి రెవెన్యూ రికార్డుల్లో నమోదైన గ్రామాలు కాదు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పరిసర ప్రాంతాల నుంచి వేట కోసం ఇక్కడకు వలస వచ్చిన మత్స్యకారుల ఆవాసాలు. ఒక విధంగా ఇవి ‘వలస’ గ్రామాల కింద లెక్క. పూరి గుడిసెలు, రేకుల షెడ్లలో నివాసం. వినాయక చవితి తరువాత మత్స్యకారులు నక్కపల్లి నుంచి నేరుగా బోట్ల మీద తాము నివాసముండే ప్రాంతాలకు కుటుంబాలతో సహా వస్తారు. అప్పటి నుంచి మేలో సముద్ర వేట నిషేధం విధించే వరకు ఎనిమిది నెలలపాటు ఇక్కడే నివాసముంటారు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు సముద్ర వేటకు వెళ్లడం.. శనివారం వేటకు సెలవు పెట్టి స్థానికంగా మార్కెట్ పనులు చూసుకోవడం వీరి దినచర్య. గడిచిన 25 ఏళ్లుగా మత్స్యకారులు ఇక్కడకు వలస వస్తుండడం గమనార్హం. కోనసీమకు ఎందుకు వలస అంటే.. గోదావరి నదీపాయలతోపాటు ప్రధాన మురుగునీటి కాలువలు మొగల ద్వారా సముద్రంలో కలుస్తాయి. సముద్ర ఉప్పునీటిలో మొగల ద్వారా చప్పనీరు వివిధ మార్గాల ద్వారా పెద్దఎత్తున చేరడంవల్ల ఈ తీరంలో మత్స్యసంపద అధికంగా దొరుకుతుంది. నక్కపల్లి తీరం కన్నా కోనసీమ తీరంలోనే మత్స్య సంపద అధికంగా దొరుకుతుందని వీరు చెబుతుంటారు. పండుగప్ప, చందువా, కొయ్యింగ, బొమ్మిడి చుక్క, గులిగింత, మడ పీత, చుక్కపీత, టైగర్ రొయ్యలు, జెల్లలు, ఇసుక దొందులు, టేకు చేపలతోపాటు అత్యంత ఖరీదైన ‘కచ్చిడి చేప’లు కూడా దొరుకుతాయి. కచ్చిడి చేప ఖరీదు రూ.75 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటోంది. స్థానిక మత్స్యకారుల ఎదురు పెట్టుబడి వలస మత్స్యకారులకు స్థానిక మత్స్యకార వ్యాపారులు ఎదురు పెట్టుబడి పెడతారు. సీజన్లోని ఎనిమిది నెలలకు గాను బోటుకు వచ్చి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తారు. వలస మత్స్యకారులు వేటాడి తెచ్చిన మత్స్య సంపద ద్వారా వచ్చిన ఆదాయంలో పదిశాతం ఈ వ్యాపారులు తిరిగి తీసుకుంటారు. తెల్లవారుజాము నుంచే వేట.. నిజానికి.. ఈ మత్స్యకారులు తెల్లవారుజామునే బృందాలుగా బోటు మీద వేటకు బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంట, రెండు మధ్య వేట నుంచి తిరిగి వస్తారు. మత్స్య సంపదకు తీరాన్ని ఆనుకునే వేలం నిర్వహిస్తారు. గులిగింత, ఎర్ర గులిగింత, కచిడి, కూనాలు, పండుగప్ప, చందువాలు ఇటు చెన్నై, అటు కోల్కతా, హైదరాబాద్ మార్కెట్లకు ఎగుమతి అవుతుంటాయి. మిగిలిపోయిన చేపలను మత్స్యకార మహిళలు ఎండబెట్టి ఎండుచేపలుగా తయారుచేస్తారు. వేటకు వెళ్లే బోటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు విలువ చేసే మత్స్య సంపద వస్తోంది. ఏటా క్రమం తప్పకుండా.. మా ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీల కాలుష్యంవల్ల కొన్నేళ్లుగా వేట గిట్టుబాటు కావడంలేదు. ఇక్కడ మాకు వేటకు వెళ్లడానికి పడవలు గట్టుపై పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మత్స్య సంపద మా ప్రాంతంలో కన్నా ఇక్కడ ఎక్కువ. – దోని చిన్నా, వేంపాడు గ్రామం, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా మత్స్య సంపద ఎక్కువ ఈ జిల్లాలో గోదావరి పాయలు ఎక్కువ. చప్పనీరు, ఉప్పునీరు కలిసే చోట మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. మా ప్రాంతం కన్నా ఇక్కడ రెట్టింపు ఆదాయం వస్తోంది. 8 నెలలు ఇక్కడే ఉంటాం. – సోడిపల్లి అప్పలరాజు, రాజయ్యపేట, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా మేం పెట్టుబడి పెడతాం నాకు సొంతంగా రెండు బోట్లు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నుండి వేట నిమిత్తం ఈ ప్రాంతానికి వస్తున్న మత్స్యకారులకు మేం పెట్టుబడి పెడతాం. వేటలో వచ్చే ఆదాయంలో 10% మాకు ఇవ్వాలి. వారికి ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటాం. – బొమ్మిడి రాంబాబు, వ్యాపారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
గుడ్న్యూస్: క్విక్ హీల్ న్యూ వెర్షన్ 23 లాంచ్
పుణె: సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లు అందించే ‘క్విక్ హీల్’ మాల్వేర్ను గుర్తించే ‘వెర్షన్ 23’ని విడుదల చేసింది. వ్యవస్థలపై సైబర్ దాడులను గుర్తించడమే కాకుండా, ముప్పు తీవ్రతను అంచనా వేస్తుందని కంపెనీ తెలిపింది. లోతైన విశ్లేషణ టూల్స్తో దాడులను నిరోధిస్తుందని వెల్లడించింది. దీనివల్ల సైబర్ దాడుల ముప్పును గుర్తించే సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. ర్యామ్సమ్వేర్ నుంచి రక్షణ, ఎప్పటికప్పుడు ఇంజన్ స్కానింగ్, యాంటీ ట్రాకర్, బ్రీచ్ అలర్ట్ తదితర ఫీచర్లతో ఈ నూతన టెక్నాలజీ పనిచేస్తుందని తెలిపింది. ‘‘కరోనా సంక్షోభం తర్వాత సైబర్ దాడులు అసాధారణ స్థాయిలో పెరిగాయి. ఈ దాడులు ఎంతో అత్యాధునికంగా ఉంటున్నాయి. కనుక వీటిని సాధారణ యాంటీ వైరస్లు గుర్తించలేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెర్షన్ 23ని రూపొందించాం’’అని క్విక్ హీల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సంజయ్ కట్కర్ తెలిపారు. -
పులినే ఒక ఆట ఆడుకున్న కోతి.. వీడియో వైరల్
పెద్ద పులి కనిపిస్తే ఏ జంతువైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాల్సిందే. కానీ, ఓ కోతి మాత్రం నువ్ పులి అయితే.. నాకేంటి ఇది నా అడ్డా చూసుకుందాం రా.. అన్న విధంగా ప్రవర్తించింది. తన కోతి చేష్టలతో పులినే ఒక ఆట ఆడుకుంది. వానరాన్ని వేటాడేందుకు పులి ప్రయత్నించి చెట్టుపై నుంచి పడిపోయిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియో ప్రకారం.. చెట్టుపై ఉన్న ఓ కోతిని వేటాండెందుకు పులి ప్రయత్నించింది. చిటారు కొమ్మన ఉన్న వానరాన్ని పట్టుకునేందుకు పులి సైతం చెట్టుపైకి ఎక్కింది. కొమ్మలపై అటూ ఇటూ అలవోకగా దూకటం కోతులకు పుట్టుకతో వచ్చే విద్య. అదే నైపుణ్యంతో పులిని ఆటాడుకుంది కోతి. చేతికి అందినట్లు అంది మరో కొమ్మపైకి దూకుతూ పులికి ముచ్చెమటలు పట్టించింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీశ్ శరన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షా 74 వేల మంది వీక్షించారు. 8,300 లైకులు వచ్చాయి. हालात का ‘शिकार’ pic.twitter.com/myHtQ3qw5s — Awanish Sharan (@AwanishSharan) March 3, 2022 ఇదీ చదవండి: జీవితాంతం చదువుకుంటూ వృద్ధుడిగా మారిపోతా.. పిల్లాడి మాటలకు నెటిజన్లు ఫిదా -
అప్పట్లో .. చీతాలు వేటకుక్కల్లా..
మన దేశంలో 70 ఏళ్ల క్రితమే చీతాలు అంతరించిపోయాయి. వాటిని తిరిగి దేశంలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి ఎనిమిది చీతాలను తెచ్చి కునో నేషనల్ పార్క్లో వదిలింది. దీనితో దేశవ్యాప్తంగా ఈ చీతాలు ఏమిటి, వాటి బలం, వేగం ఏమిటన్నదానిపై పెద్ద చర్చే జరుగుతోంది. కానీ అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఒకప్పుడు మన దేశంలో చీతాలను పెంపుడు వేటకుక్కల్లా వినియోగించేవారు. ఇళ్ల వద్ద మేకలు, గొర్రెల్లా కట్టేసుకునేవారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కాస్వాన్ దీనికి సంబంధించి 1939 నాటి ‘వైల్డర్నెస్ ఫిల్మస్ ఇండియా లిమిటెడ్’ తీసిన వీడియోలు, ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేశారు. మిగతావి అంతరించక ముందే స్పందించాలి చీతాలను వేటకుక్కల్లా వాడుకోవడంతోపాటు.. అడవుల్లోని చీతాలను సరదాకు వేటాడేవారని ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ వివరించారు. పెంపుడు చీతాల సాయంతో ‘హంటింగ్ పార్టీ’లను నిర్వహించేవారని.. ఇలాంటివన్నీ కలిసి చీతాలు అంతరించిపోవడానికి కారణమైందని పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని రకాల జంతువులు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాయని.. వాటి సంరక్షణపై దృష్టిపెట్టకుంటే చీతాల తరహాలో వాటిని కూడా ఫొటోల్లోనే చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. పెంపుడు కుక్కల్లా పెంచుకుని.. అప్పట్లో అడవుల్లోంచి చీతాలను పట్టుకుని వచ్చి పెంపుడు కుక్కల్లా పెంచుకునేవారు. వాటిని ఇంటి ముందు కట్టేసేవారు. జింకలు, దుప్పులను వేటాడటానికి చీతాలను వినియోగించేవారు. ఆ చీతాల కళ్లకు గంతలు కట్టి ఎడ్ల బండ్లపై జింకలు, దుప్పులు ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్లేవారు. అక్కడ కళ్లగంతలు విప్పి వదిలేసేవారు. చీతాలు వేగంగా పరుగెత్తి జింకలు, దుప్పులను వేటాడేవి. అప్పుడు వాటి యజమానులు వెళ్లి.. ఆ జింకలు, దుప్పులను చంపి మాంసం తెచ్చుకునేవారు. ఈ సమయంలో ఆ జంతువుల రక్తాన్ని, కొంత మాంసాన్ని చీతాలకు పెట్టేవారు. ఈ దృశ్యాలన్నీ కూడా వైల్డర్నెస్ వీడియోలో స్పష్టంగా ఉన్నాయి. ►సాధారణంగా చీతాలు ప్రశాంతంగా ఉంటాయి. అనవసరంగా దాడి చేయవు. అందుకే మనుషులు వాటిని సులువుగా పెంచుకోగలిగారని నిపుణులు చెబుతున్నారు. ►బ్రిటన్కు చెందిన మరియన్ నార్త్ అనే బయాలజిస్ట్, ఆర్టిస్ట్ 1878లో విడుదల చేసిన పుస్తకంలోని ఒక పెయింటింగ్ను కూడా పర్వీన్ పోస్ట్ చేశారు. రాజస్థాన్లోని ఆల్వార్లో ఇళ్ల ముందు పెంపుడు కుక్కల్లా చీతాలను కట్టేసిన చిత్రం అది. ►1921–22 సమయంలో బ్రిటన్కు చెందిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాజస్థాన్లో జింకలను వేటడానికి పెంపుడు చీతాలతో వెళ్తున్నప్పటి ఫొటోను, 1947లో ఛత్తీస్గఢ్లో కింగ్ ఆఫ్ కొరియా మూడు చీతాలను వేటాడి చంపిన ఫొటోను పర్వీన్ షేర్ చేశారు. ►ఒక్క చీతాలు అనే కాదు.. పులులు, సింహాలు, చిరుతç³#లులు, అడవి ఏనుగులు వంటి జంతువులను కూడా నాటి రాజులు, బ్రిటిషర్లు సరదా కోసం, గొప్పగా చూపుకోవడం కోసం వేటాడేవారు. ►952లో భారత ప్రభుత్వం మన దేశంలో ఆసియన్ చీతాలు అంతరించిపోయినట్టు అధికారికంగా ప్రకటించింది. ►అసలు మన దేశంలో తొలుత వన్యప్రాణి సంరక్షణ చట్టం లేదు. 1972లో తొలిసారిగా ‘వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్’ పేరిట చట్టాన్ని తెచ్చారు. వేగం ఎక్కువ.. దూరం తక్కువ చీతాలు గంటలకు వంద కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు. కేవలం మూడు సెకన్లలోనే అంత వేగాన్ని అందుకుంటాయి కూడా. కాకపోతే 30, 40 సెకన్లకు మించి ఆ వేగాన్ని కొనసాగించలేవు. అందుకే వేచి చూసి వేటకు దిగుతాయి. 30, 40 సెకన్లలో జంతువును చంపలేకపోతే వదిలేస్తాయి. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటాయి. సీనియర్ జర్నలిస్టు సంజయ్ తాను రాసిన పుస్తకంలో చీతాలకు సంబంధించి ఇలాంటి కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కేవలం సెకన్లలోనే సూపర్ స్పీడ్ అందుకునేలా, వేగంగా మలుపు తిరిగేలా చీతాల శరీర నిర్మాణం ఉంటుంది. చీతాల కళ్ల నుంచి నోటి వరకు ఉండే నల్లని చార సౌర కాంతి రిఫ్లెక్షన్ నుంచి కాపాడుతుందని.. దీనితో వాటి కళ్లు దూరంలో ఉన్న జంతువులను సైతం స్పష్టంగా చూడగలవని నిపుణులు చెబుతుంటారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. పులులు, సింహాలు, చిరుతల తరహాలో చీతాలు గర్జించవు. పిల్లుల్లా ధ్వనులు చేస్తాయి. ఎప్పుడైనా ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే గుర్రుమని శబ్దం చేస్తాయి. చీతాల సగటు జీవితకాలం పన్నెండేళ్లు. జూలలో మాత్రం 20 ఏళ్ల వరకు బతికే అవకాశం ఉంది. అయితే చీతాల పిల్లల్లో మరణాల శాతం ఎక్కువ. పదింటిలో ఒకటే బతికి పెద్దది అవుతుంది. అందుకే వాటి జాతి వేగంగా పెరిగే అవకాశాలు తక్కువ. -
కొండచిలువతో పోట్లాడుతున్న కంగారు: వీడియో వైరల్
ప్రకృతి నియమం ప్రకారం ప్రతి జీవి ఏదో ఒకదానికి ఆహారమవుతుంది. ఆ తరుణంలో కొన్ని జంతువులు క్రూరంగా వేటాడటాన్ని చూస్తే చాలం భయానకంగా ఉంటుంది. ఆ క్రూర జంతువులు నుంచి ఈ జంతువు తప్పించుకుంటే బావుండును అనిపిస్తుంది కూడా. అచ్చం అలాంటి జుగుప్సకరమైన సంఘటన ఈ వైరల్ వీడియోలో చోటు చేసుకుంది. ఆ వీడియోలో ఒక కంగారును కొండచిలువ గట్టిగా చుట్టి చంపేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇంతలో మరో కంగారు జంప్ చేసుకుని వచ్చి మరీ తన స్నేహితుడిని విడిపించేందకు శతవిధాల యత్నిస్తుంటుంది. కానీ మరోవైపు కొండ చిలువ ఏదో విధంగా చంపి తినేందుకు చూస్తుంటుంది. కానీ కంగారు మాత్రం తనకు చేతనైనంత మేర ఆ కొండచిలువను రకరకాలుగా కొరుకుతూ తన స్నేహితుడుని విడిపించేందుకు ప్రయత్నించడం చూస్తేంటే ఒక విధమైన భావన కలుగుతుంది. కొండచిలువకు చిక్కిన ఆ కంగారు బతికితే బావుండును అనిపిస్తుంది. View this post on Instagram A post shared by Wildlifeanimall (@wildlifeanimall) -
పులి తీయించుకున్న ఫస్ట్ ఫొటో.. స్పెషల్ ఏంటో తెలుసా?
అడవుల్లో వేటాడుతున్న పులి చిత్రాలు మనం చాలా చూసి ఉంటాం.. ఇది కూడా అలాంటిదే అనుకోవద్దు. దీనికో ప్రత్యేకత ఉంది. ఇది మన దేశంలోని అడవుల్లో పులి వేటాడుతుండగా తీసిన తొలి చిత్రం. ఈ ఫొటోను అప్పటి ఐఎఫ్ఎస్ అధికారి ఫ్రెడ్రిక్ వాల్టర్ చాంపియన్ తీశారు. 1925లో ఆయన తీసిన ఈ ఫొటో ‘ది ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్’ పత్రిక మొదటి పేజీలో ప్రచురితమైంది. ఈ విషయాన్ని నార్వేకు చెందిన మాజీ రాయబారి ఎరిక్ సొహైమ్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఫ్రెడ్రిక్ 1947 వరకూ బ్రిటిష్ సైన్యంలో ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ అధికారిగా పనిచేశారు. వన్యప్రాణులను వేటాడకుండా.. తన తోటి అధికారులకు భిన్నంగా వాటిని తన కెమెరాలో బంధించడంపై ఆసక్తి చూపేవారు. పులులను సహజసిద్ధమైన అటవీ వాతావరణంలో ఉండగా ఫొటో తీయాలన్నది ఫ్రెడ్రిక్ కల.. ఎనిమిదేళ్ల ప్రయాస అనంతరం ఆయన ట్రిప్–వైర్ ఫొటోగ్రఫీ ద్వారా తాను అనుకున్నది సాధించారు. ట్రిప్ వైర్ ఫొటోగ్రఫీ అంటే.. కెమెరాకు తగిలించిన వైరును జంతువులు తిరుగాడే ప్రాంతాల్లో ఉంచుతారు. వాటి కాలు తగలగానే.. వైర్ లాగినట్లు అయి.. ఫొటో క్లిక్మంటుంది. అదే టెక్నిక్ తర్వాతి కాలంలో మరింత అభివృద్ధి చెంది.. కెమెరా ట్రాప్ ఫొటోగ్రఫీగా మారింది. ప్రస్తుతం పులుల గణనకు, పరిశీలనకు దీన్నే ప్రామాణికంగా వాడుతున్నారు. – సాక్షి సెంట్రల్డెస్క్ -
లైవ్లో పులి వేట: నోట మాట రాక కెవ్వు కేక!
ఇంతవరకు మనం పులి జంతువులను వేటాడటం వంటి సన్నివేశాలు డిస్కవరి ఛానెల్స్లోనే చూసి ఉంటాం. నిజానికి ఎవ్వరూ నేరుగా చూసేంత ధైర్యం చేయం. కానీ రాజస్థాన్లో సరదాగా నేషనల్ పార్క్కి వెళ్లిన పర్యటకుల మాత్రం పులి దాడి ఎలా ఉంటుందో చూసి దెబ్బకు బిత్తరపోయి చూస్తుండిపోయారు. (చదవండి: పక్షవాతంతో కుర్చీలో.. అయినా ట్విటర్లో ‘హలో వరల్డ్’ ట్వీట్! ఎలాగంటే..) అసలు విషయంలోకెళ్లితే....రాజస్తాన్లోని రణథంబోర్ నేషనల్ పార్కులో పర్యాటకులు సఫారి వాహనాల్లో పర్యటించారు. అయితే అనుకోకుండా ఇంతలో అక్కడకి ఒక వీది కుక్క ఆ వాహనాల గుండా సంచరించింది. ఇంతలో మొదటి సఫారి వాహనం నుంచి రెండో సఫారి వాహనం వద్దకు వస్తున్న కుక్కపై ఉన్నట్టుండి ఒక పులి ఒక్క ఊదుటున దాడి చేసి పొదల మాటుకి తీసుకుపోయింది. దీంతో అక్కడ ఉన్న పర్యాటకులంతా భయంతో ఒక్కసారిగా కేకలు వేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ప్రెసిడెంట్ అనీష్ అంధేరియా ట్విట్టర్ పోస్ట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో "పులి కుక్కపై దాడి చేసి చంపడం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల కుక్కల ద్వారా డిస్టెంపర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పులులకు సంక్రమించే అవకాశం ఉంది. దీంతో పులుల జనాభా తగ్గుతుంది. వన్యప్రాణుల మనుగడకు ఈ కుక్కలు ముప్పుగా మారాయి అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!) Tiger kills dog inside R'bhore. In doing so it is exposing itself to deadly diseases such as canine distemper that can decimate a tiger population in no time. Dogs have emerged as a big threat to wildlife. Their presence inside sanctuaries needs to be controlled @ParveenKaswan pic.twitter.com/t7qDR1MvNl — Anish Andheria (@anishandheria) December 27, 2021 -
మధ్యప్రదేశ్లో రణదీప్ పులి వేట: వైరల్ వీడియో
ఇంతవరకు మనం చాలా వైరల్ వీడియోలు చూశాం. టూరిస్ట్లపై దాడిచేసిన పులలకు సంబంధించిన వీడియోలు. టూరిస్ట్ బండి గుంతలో పడిపోతే తీసిన వీడియోలను చూశాం. కానీ వీటన్నింటికి భిన్నంగా బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా స్వయంగా వీడియో తీసిన పులి వేటాడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (చదవండి: టెస్లా కారులో పుట్టిన తొలి పాపగా రికార్డు!!) అసలు విషయంలోకెళ్లితే...బాలివుడ్ నటుడు రణదీప్ కపూర్ మధ్యప్రదేశ్లోని సాత్పురా టైగర్ రిజర్వ్లో పులి ఆవుని వేటాడుతున్న వీడియోని చిత్రీకరించాడు. డిస్కవరీ ఛానెల్స్లో పులి వేటాడుతున్న దృశ్యాలు చూసినప్పుడే శరీరం గగ్గురపాటుకి గురవుతుంది. అలాంటిది ప్రత్యక్ష్యగా రణదీప్ చూడటమే కాక వీడియో తీశాడు. అంతేకాదు ఆ వీడియోకి "ఇది నా పులి వేట" అనే క్యాప్షన్ జోడించి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఐఎఫఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ పులి ఆవుని పట్టుకోవడంతో విజయవంతమైందా అంటూ ట్వీట్ చేశారు. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: భారత్లో జీరో రూపాయి నోటు ఉందని మీకు తెలుసా!...) My first tiger hunt .. #SatpuraTigerReserve pic.twitter.com/J9iWp9vRlC — Randeep Hooda (@RandeepHooda) December 19, 2021 -
African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!!
ఓటింగ్, మెజారిటీ, ప్రజాస్వామ్యం.. ఇవన్నీ మనషులకు మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. ఈ పద్ధతిని ఆఫ్రిక అడవుల్లోని శునకాలూ పాటిస్తుంటాయి. మద్దతు, ఏకాభిప్రాయం గురించి మాట్లాడుకుంటాయట. ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ అది నిజం. తుమ్ములతో ఏకాభిప్రాయానికి వచ్చి, శునకస్వామ్యాన్ని నిలబెట్టుకుంటాయి. తుమ్ములే వీటి భాష. వేటకు వెళ్లే ముందు అవన్నీ సమావేశమవుతాయి. అందులో పది కుక్కలు తుమ్మితే చాలు, అన్నీ మూకుమ్మడిగా వేట ప్రారంభిస్తాయి. అయితే అన్ని కుక్కల తుమ్ములకు ఒకే ప్రాధాన్యం ఉండదు. నాయకత్వం వహించే కుక్కలు తక్కువ సార్లు తుమ్మినా వేట ప్రారంభించాల్సిందే. సమావేశంలో కనీస హాజరు(కోరం) ఉండేలా చూసుకుంటాయట. పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైన విషయాలు అవి. చదవండి: World's Smallest Revolver: బొమ్మ రివాల్వర్ అనుకునేరు.. నిజమైనదే! -
కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం వేట
-
బడా స్మగ్లర్ కోసం వేట.. ‘ఆపరేషన్ మాణిక్యం’ ప్రారంభం
తమిళనాడుకు చెందిన ఇతను ఎలా ఉంటాడో తెలియదు.. కనీసం ఇప్పటి వరకు సరైన ఆనవాళ్లు కూడా లేవు. అయితే పోలీసులు వారం కిందట మాణిక్యం ఇద్దరు కొడుకులతో పాటు జిల్లాలో అతని ముఖ్య అనుచరుడు, టీడీపీ నేతల దన్ను దండిగా ఉన్న నాయుడును వల వేసి పట్టుకున్నారు. దీంతో ఇప్పుడు టార్గెట్ మాణిక్యం ఆపరేషన్ను పోలీసులు వేగవంతం చేశారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రెండుమూడేళ్ల కిందట అడపాదడపా ఎర్రచందనం దుంగలను పట్టుకుని ఫొటోలకు ఫోజులివ్వడం అలవాటైన పోలీసులు ఇప్పుడు రూటుమార్చారు. దుంగలతోపాటు ఎర్రచందనం దొంగలను కూడా పట్టుకుని స్మగ్లర్ల గుండెల్లో నిద్రపోతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్ పెట్టి స్మగ్లర్ల వేటలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎర్రచందనం ప్రధాన స్మగ్లర్ తమిళనాడుకు చెందిన మాణిక్యం ఇద్దరు కుమారులతో పాటు ఆ ముఠాలో కీలకంగా ఉన్న జిల్లాకు చెందిన దేవానంద నాయుడును అరెస్టు చేశారు. చంద్రగిరి నియోజకవర్గం ఐతేపల్లికి చెందిన నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలకు సన్నిహితుడు. ఓ రకంగా చెప్పాలంటే ఆ పార్టీ కార్యకర్త అన్నది బహిరంగ రహస్యం. దాదాపు పదేళ్ల కిందట ఎర్రచందనం అక్రమ రవాణాలోకి అడుగుపెట్టిన నాయుడు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెలరేగిపోయాడు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతల అండదండలతో అంచెలంచెలుగా ఎదిగి.. స్మగ్లింగ్లో ఆరితేరాడు. ప్రధాన స్మగ్లర్ మాణిక్యంకు ముఖ్యమైన అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు. ముఠాలో ఆ నలుగురే కీలకం శేషాచలం అటవీ ప్రాంతంలోని విలువైన ఎర్ర బంగారం కోసం స్మగ్లర్లు కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో తిష్ట వేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన మాణిక్యం అక్కడి నుంచి రూటు మార్చి శేషాచలంలోని ఎర్రచందనంపై కన్నేశాడు. ఇందుకు అవసరమైన బ్యాచ్ని సిద్ధం చేసుకున్నాడు. ఆ బ్యాచ్లో రాజకీయ పలుకుబడి, ఐదేళ్ల క్రితం అధికారంలో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉన్న వారిని ఎంచుకున్నాడు. వీరిలో ప్రముఖమైన వ్యక్తి ఐతేపల్లి వాసి దేవానంద నాయుడు. ఇతనితో పాటు తన ఇద్దరు కుమారులు ఎం.మనోజ్కుమార్, ఎం.అశోక్కుమార్ను ఆ ముఠాలో చేరి్పంచాడు. మొత్తంగా ఈ నలుగురు ముఠా సభ్యులను లీడ్ చేస్తూ విచ్చలవిడిగా స్మగ్లింగ్కు పాల్పడ్డాడు. శేషాచలంలో నాణ్యమైన ఎర్రచందనం ఎక్కడ దొరుకుతుంది, ఆ ప్రాంతానికి ఎలా వెళ్లాలి.. అనేది నాయుడు స్కెచ్ గీస్తాడు. ఇక మాణిక్యం కొడుకులు ముఠాతో కలిసి ఆ ఎర్రచందనం చెట్లను నరకడం, తర్వాత వాటిని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం వంటి పనులు పూర్తి చేస్తారు. ఆ తర్వాత వాటిని తరలించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తారు. చెట్లు నరికేందుకు అడవిలో ఉన్న కూలీలకు నిత్యావసర సరుకుల సరఫరా పని కూడా చేస్తారు. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా ఓ పథకం ప్రకారం ఆ నలుగురూ చేస్తూ వస్తున్నారు. ముగ్గురు చిక్కారు కరోనా లాక్డౌన్ సమయంలో అడవిలోకి చొరబడిన స్మగ్లర్లు భారీగా ఎర్రచందనం చెట్లను నరికి దుంగలను సిద్ధం చేశారు. వాటిని తరలించే వరకు అడవిలోని పలు ప్రాంతాల్లో పూడ్చిపెట్టారు. వారం రోజుల కిందట వాటిని బయటకు తీసి చెన్నైకి తరలిస్తుండగా జిల్లా పోలీసులు కాపుకాచి తమిళనాడులోని వేలూరు సమీపంలో పట్టుకున్నారు. కంటైనర్తో పాటు ఐతేపల్లికి చెందిన నాయుడు, మాణిక్యం ఇద్దరు కుమారులు కూడా పోలీసులకు పట్టుబడ్డారు. ఇక కంటైనర్లో ఉన్న ఎర్రచందనం దుంగలన్నీ నాణ్యమైనవే అని పోలీసులు తేల్చారు. పోలీసులు స్వా«దీనం చేసు కున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.5 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు పట్టుబడిన వారి నుంచి సమాచారం తీసుకున్న పోలీసులు మాణిక్యం వేటలో ఉన్నట్టు సమాచారం. -
ఉసురుతీసిన ఉడుముల వేట
డోర్నకల్: ఉడుములు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు రెండు బండరాళ్ల మధ్య చిక్కుకుని ఓ యువకుడు మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారానికి చెందిన జక్కుల వెంకన్న సోమవారం ఉదయం ఉడుములు పట్టేందుకు ఖమ్మం రూరల్ మండలం పొడిశెట్టిగూడెం గ్రామ పరిధిలోని గుట్టపైకి వెళ్లాడు. ద్విచక్ర వాహనం, రెండు పెంపుడు కుక్కలతో వెళ్లిన ఆయన.. మంగళవారం ఉదయం వరకు ఇంటికి రాలేదు. దీంతో అతని ఆచూకీ కోసం గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో పొడిశెట్టిగూడెం సమీపంలోని గుట్ట సమీపంలో ద్విచక్రవాహనం నిలిపి ఉండటం, సమీపంలో కుక్కలు కనిపించడంతో గుట్టపైకి వెళ్లి వెతకగా.. రెండు బండరాళ్ల మధ్య వెంకన్న మృతదేహం కనిపించింది. ప్రొక్లయినర్తో భారీ బండరాయిని తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఖమ్మం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఖైరతాబాద్: తిమింగలం వాంతి పేరుతో మోసం..) -
జొన్న గిరి లో వజ్రాల వేట
-
భార్యకు వాలెంటైన్స్ డే గిఫ్ట్గా ఓ ప్రాణం
కేప్టౌన్ : ఎదుటి వ్యక్తి మీదున్న ప్రేమను తెలియజేయటానికి కానుకలు ఇవ్వటం పరిపాటి. వాలెంటైన్స్ డే రోజున ఇష్టమైన వారికోసం ఏమివ్వాలా అని ఆలోచించి.. వారికిష్టమైనదేదో తెలుసుకుని దాన్ని బహుమతిగా ఇస్తుంటారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఓ భర్త కూడా అలానే చేశాడు. ఓ జంతువు ప్రాణాన్ని ఆమెకు కానుకగా ఇచ్చాడు. దాన్ని వేటాడి చంపే అవకాశాన్ని కలిగించాడు. వివరాల్లోకి వెళితే.. సౌత్ ఆఫ్రికా, లిమ్పోపో ప్రావిన్స్కు చెందిన మెరెలిజె వాన్ డెర్ మెర్వే(32)కు జంతువులను వేటాడ్డం అంటే మహా సరదా. తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పటినుంచి వేటాడుతోంది. ఓ బలిష్టమైన నల్ల జిరాఫీని చంపాలని 2016నుంచి అనుకుంటోంది. 2017లో అవకాశం చేతి వరకు వచ్చి జారిపోయింది. అప్పటినుంచి వెయ్యి కళ్లతో జిరాఫీకోసం వెతకసాగింది. రెండు వారాల క్రితం ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి జిరాఫీ ఆచూకీ చెప్పాడు. ( వైరల్: మీరు ఊహించని టైటానిక్ మరో క్లైమాక్స్) వేటాడిన జిరాఫీతో మెరెలిజె వాన్ డెర్ మెర్వే దీంతో తన కోరిక గురించి భర్త గెర్హర్డెన్ట్ నెల్కు వివరించింది. వాలెంటైన్స్ డే రోజు భార్యను సన్ సిటీలోని ఫైవ్ స్టార్ హోటల్కు తీసుకెళదామనుకున్న అతడు.. తన ప్లాన్ను రద్దు చేసుకున్నాడు. అందుకు బదులు జిరాఫీని చంపటానికి భార్యకు అవసరమైన డబ్బులు ఇచ్చాడు. మెరెలిజె వాన్ డెర్ మెర్వే జిరాఫీ ఉంటున్న అడవిలోకి వెళ్లి దాన్ని వేటాడి చంపింది. దాని గుండెను బయటకు తీసిన తర్వాత చేతుల్తో పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. -
తొలకరి వర్షాలతో గ్రామాల్లో వజ్రాల వేట..
కర్నూలు, తుగ్గలి: అదృష్టం వజ్రమైతే కష్టాలు తీరిపోవడమే కాకుండా క్షణాల్లో లక్షాధికారి కావచ్చు. చేయాల్సిందల్లా నేలకేసి తీక్షణంగా చూస్తూ వెళ్లాలి అంతే. మెరుగు రాయి కంటపడితే చేతిలోకి తీసుకుని పరీక్షగా చూడాలి. పది మందికి చూపించాలి. వజ్రమని రూఢీ అయితే వ్యాపారే సంప్రదిస్తారు. వజ్రం జాతి, రంగు చూసి కారెట్ల రూపంలో లెక్కించి కొనుగోలు చేస్తారు. రహస్యంగా, టెండర్ పద్ధతినవ్యాపారులు వజ్రాలు కొనుగోలు చేస్తుంటారు. (రైతుకు చిక్కిన రూ.కోటి వజ్రం..) తొలకరి వర్షాలకు జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి, జీ.ఎర్రగుడి,బొల్లవాని పల్లి, చెన్నంపల్లి, పీ.కొత్తూరు, చిన్న జొన్నగిరి, రాంపురం, ఉప్పర్లపల్లి తదితర గ్రామాల్లో వజ్రాల వేట మొదలైంది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉదయాన్నే పొలాల్లో వాలిపోతున్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉదయం, సాయంత్రం ఎర్ర నేలల్లో తిరుగుతూ వజ్రాన్వేషణ చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రూ.2లక్షల విలువైన రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో విలువైన వజ్రాలు లభ్యమవుతుంటాయి. వజ్రాన్వేషణ కోసం ఏటా ఇతర జిల్లాల నుంచి జనం వచ్చేవారు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది జనం తాకిడి బాగా తగ్గింది. -
అడవిలో వేట..
సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లాలో వన్యప్రాణుల వేట నిత్య కృత్యంగా మారుతోంది. చట్టాలు ఎన్ని వచ్చినా అడవి జంతువులు, పక్షులకు రక్షణ లేకుండా పోయింది. దట్టమైన అడవుల్లో ఉచ్చులు పెట్టి వేటగాళ్లు హతమారుస్తున్నారు.. ఎండలు మండుతున్నందున వన్య ప్రాణులు నీటికోసం అల్లాడుతూ కిలో మీటర్ల కొద్ది దురం వెళ్లి నీటి దప్పికను తీర్చుకుంటున్నాయి. ఇదే అదనుగా చేసుకుని వేటగాళ్లు వాటిని వెంటాడి మట్టుబెడుతున్నారు. జిల్లాలోని ఖానాపురం మండలం బండమీది మామిడి తండాలో బుధవారం రెండు కొండ గొర్రెల తలలు లభించాయి. ఈ నెల 28న శాయంపేట మండలం చలివాగు ప్రాజెక్ట్ దగ్గర విషపు గుళికలు చల్లి వలస పక్షులను చంపారు. వరుస ఘటనలు జరగడంతో ఫారెస్ట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రెండు కొండ గొర్రెల తలలు లభ్యం ఖానాపురం మండలం బండమీది మామిడితండాలో రెండు కొండ గొర్రెల తలలు గడ్డి వాములో లభించాయి. బుధవారం సమాచారం అటవీశాఖ అధికారులకు తెలియగానే వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. రెండు తలలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంటి సమీపంలో ఉన్న గడ్డి వాములో ఉండడంతో ఆ ఇంటి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కత్తులు, మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ అధికారులు పోలీసుల సహకారంతో విచారణకొనసాగిస్తున్నారు. వేటగాళ్లు ముఠాగా ఏర్పడి వీటిని చంపినట్లు సమాచారం. వలస పక్షులకు విషపు గుళికలు జిల్లాలోని శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారు చలివాగు ప్రాజెక్టు పరివాహక ప్రాంతానికి ప్రతీ సంవత్సరం వేల పక్షులు ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నాయి. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండడం, నాచు, చేపలు ఆహారంగా దొరకడంతో పక్షులు ఆవాస ప్రాంతంగా మార్చుకున్నాయి. విసిలింగ్ డక్స్ , టఫ్టడ్ డక్స్ ,కూమ్బ్ డక్స్ , కామన్ పింటైల్ లాంటి అనేకరకాల పక్షులు సీజనల్గా కనిపిస్తుంటాయి. ఇదే అదనుగా భావించి పిట్టలు పట్టేవాళ్లు, వేటగాళ్లు వాటిని వెంటాడి వేటాడి చంపుతున్నారు. విషపు గులికలు చెరువులోని తామెర ఆకులపై చల్లుతున్నారు. మృతిచెందిన పక్షులను వేటగాళ్లు సేకరించి ఒక్కో పక్షిని రూ 100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. మంసం ప్రియులు ఇతర ప్రాంతాల పక్షులు కావడంతో ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఇది వ్యాపారంగా మారిపోయిందని అక్కడి స్థానికులు తెలుపుతున్నారు. ఇటీవల వరుసగా పక్షులు చనిపోతుండడంతో అటవీ శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. పక్షుల కళేబరాలను సేకరించి ఎలా చనిపోయాయో తెలుసుకునేందుకు హైదరాబాద్లోని ల్యాబ్కు పంపినట్లు తెలిసింది. విచారణ చేస్తున్నాం ఖానాపురం మండలంలో రెండు కొండ గొర్రెలను చంపిన ఘటనపై విచారణ కొనసాగిస్తున్నాం. ఒకరిని అదుపులోకి తీసుకున్నాం. చలివాగు ప్రాజెక్ట్ వద్ద వలస పక్షులను విషపు గుళికల ద్వారా చంపేస్తున్నారని తెలిసింది. దానిపై కూడా విచారణ చేస్తున్నాం. వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 9 ప్రకారం వన్యప్రాణులను, పక్షులను వేటాడి చంపితే వెంటాడి చంపిన నేరం. జరిమానాతో పాటు జైలు శిక్షను విధిస్తారు. –పురుషోత్తం, జిల్లా అటవీ శాఖ అధికారి -
పులి మీద పుట్ర
-
రేప్లకు ఫలితం ఇదే. రేపిస్ట్లూ జాగ్రత్త..!
ఢాకా: హెర్క్యులస్.. ఈ పేరు ప్రస్తుతం బంగ్లాదేశ్లో మారుమ్రోగుతోంది. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాఖీ’ సినిమా గుర్తుందా?. ఆ సినిమాలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని పెట్రోల్ పోసి తగలపెడతాడు హీరో. అలాంటివాడే ఈ హెర్క్యులస్. గత రెండు వారాల వ్యవధిలో.. ముగ్గరు ‘గ్యాంగ్ రేప్’ నిందితులు హత్యకు గురయ్యారు. వారిని హత్య చేసిన విధానం ఒకేలా ఉంది. మృతదేహాల మెడలో, వారు చేసిన నేర వివరాలున్న కాగితం ఉంది. ఫిబ్రవరి 1న పోలీసులు ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మదరసాలో చదివే ఓ బాలికను గ్యాంగ్ రేప్ చేసినవారిలో ఒకడైన రాకిబ్ అనే వ్యక్తి మృతదేహమది. ‘నా పేరు రాకిబ్. నేనో రేపిస్ట్ను. మదరసాలో చదివే ఓ యువతిని రేప్ చేశా’ అని మృతదేహం మెడలోని కాగితంలో రాసిఉంది. ‘రేప్లకు ఫలితం ఇదే. రేపిస్ట్లూ జాగ్రత్త – హెర్క్యులస్’ అనే మరో వాక్యం ఉంది. అదే గ్యాంగ్ రేప్లో పాల్గొన్న మరో నిందితుడు సాజల్ మృతదేహాన్ని జనవరి 24న పోలీసులు గుర్తించారు. అంతకుముందు, ఓ పరిశ్రమ కార్మికురాలిని గ్యాంగ్రేప్ చేసిన నిందితుడి మృతదేహం ఇదే స్థితిలో లభ్యమైంది. దీంతో పోలీసులు హెర్క్యులస్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
రెక్కల పర్వతం
యువరాజు సుసేనుడు తనకెంతో ఇష్టమైన వేటకు బయలుదేరాడు సపరివార సమేతంగా. ఒకసారి వేటకు వస్తే కనీసం వారం పదిరోజులైనా సమయం తెలియక లీనమైపోతాడు. ఈసారి మహారాణి అనారోగ్యం, మహారాజు దేశ సుభిక్షానికై తలపెట్టిన యజ్ఞం వంటి కార్యక్రమాలవల్ల ఆరునెలలు వేటకు వెళ్ళలేకపోయాడు. ఇప్పుడిక అవన్నీ ఓ కొలిక్కివచ్చి కాస్త వీలు చిక్కగానే వేటకు బయలుదేరాడు సుసేనుడు తండ్రి వారింపదలచినా పట్టించుకోకుండా.అందమైన ఒక లేడి పిల్లను అనుసరిస్తూ వాయువేగంతో వెళ్ళగల తన గుర్రాన్నేసుకుని సైన్యానికంటే చాలాదూరమైపోయి అడవిలోలోపలికి వచ్చేశాడు సుసేనుడు. వున్నట్టుండి కళ్ళముందు వెళ్ళిన లేడి కనిపించకుండా మాయమైపోయింది. సుసేనుడు చుట్టూ పరికించాడు. మరికాస్తముందుకెళ్ళే సరికి ఓ పర్వతం కనిపించింది. దానిమీదికి ఎక్కిందేమోనని విశాలంగా ఉన్న ఆ పర్వతం మొదలు నుంచి గుర్రాన్ని కొంచెం పైకి ఎక్కించాడు సుసేనుడు. వేగంగా చీకట్లు అలుముకున్నాయి. ఒక చెట్టు క్రింద గుర్రాన్ని వదిలి, చిన్న నెగడు వెలిగించి క్రూరమగాలు దగ్గరికి రాకుండా చేసి చెట్టెక్కి పెద్ద కొమ్మమీద విశ్రమించాడు. ఉదయకిరణాల పలకరింపుతో మెలకువ వచ్చింది. గబగబా చెట్టు దిగి గుర్రాన్నెక్కి పర్వతం క్రిందకు వచ్చాడు. కానీ, రాత్రి తాను వచ్చిన చోటు కాదని త్వరగానే గ్రహించాడు. అదొక నదీ తటాకం. స్వచ్ఛంగా వుంది నీళ్ళు.స్నానపానాలుచేసి దొరికిన పళ్ళేవో తిన్నాడు. గుర్రం కూడా గడ్డి మేయసాగింది.దగ్గర్లో గలగల నవ్వులు వినిపించి ఉలిక్కి పడ్డాడు. మెల్లగా ఆ దిక్కుకు వెళ్ళి చూస్తే, కొందరు కన్యలు నదిలో జలకాలాడుతూ తనకు అర్ధం కాని భాషలో మాట్లాడుకోసాగారు. వారిలో ఒకమ్మాయి సుసేనుడ్ని పసిగట్టి తోటి వారికి తెలియకుండా అతన్ని సమీపించింది. సుసేనుడు ఆశ్చర్యంగా చూశాడు. ‘ఎవర్నువ్వు? ప్రాణాలమీద ఆశలేక వచ్చావా?‘ అంటూ గంభీరంగా గద్దించి అడిగింది.‘మీరెవరు? ఇది అడవి కదా? ఎవరైనా వచ్చే అవకాశం వుంది. నేనెందుకు రాకూడదు? మీలాగే నేనూ వచ్చా‘ అన్నాడు సుసేనుడు.‘ఇది అడవికాదు. పర్వతపురి ద్వీపం. మేము నలుగురం పర్వతపురి రాజు గోవర్ధనుని పుత్రికలం. నీవిక్కడికి ఎలా వచ్చావు?‘ అని ప్రశ్నించింది. అతనాశ్చర్యపోయి తన వృత్తాంతం చెప్పాడు.‘ఓ..అయితే రాత్రి మేము వాహ్యాళిగా ఎక్కి వచ్చిన శంఖు పర్వతాన్ని నీవు ఎక్కావన్నమాట‘ అని నవ్వింది.‘అదేమి పర్వతం? దాన్నెక్కితే నేనిక్కడికి ఎలా రాగలిగాను?‘ అంటూ అడిగాడు ప్రసేనుడు.‘అది మా ప్రయాణాలకోసం వాడుకునే రెక్కల పర్వతం. సరే. నీ వునికి గుర్తిస్తే శిరచ్ఛేదం చేయిస్తారు రాజు. నిన్ను నా మందిరం లో దాస్తాను. ఈలోపు మరోసారి అక్కడికెళ్ళినపుడు నిన్ను అక్కడికి చేర్చుతాను‘ అని సుసేనుడ్ని, గుర్రాన్ని ముత్యం, పగడం గా మార్చి హారంలో ధరించి తన భవనానికి వెళ్ళింది.ఆమెకున్న శక్తి వల్ల రాత్రి మనిషి, గుర్రమై పగలు ముత్యం పగడం గా మారటం మరో సోదరి గమనించి ఆరాత్రి తాను తస్కరించి గులాబి, బంతి పువ్వులుగా మార్చి తనమందిరానికి తీసుకెళ్ళింది. మూడవ రోజు మరో సోదరి చూసి ఉంగరము, కంకణముగా చేసి తనతో పట్టుకుపోయింది. నాలుగవరోజు అందరికంటే చిన్న చెల్లెలు తెలుసుకుని తన శక్తితో పావురము, చిలుకగా మార్చి వారిమీది జాలితో బయటకుతెచ్చి వదిలిపెట్టింది. ఇద్దరూ శంఖుపర్వతం చేరగానే దానికి పెద్దపెద్ద రెక్కలు మొలిచి గాల్లోకి ఎగిరింది. సముద్రాలుదాటి వారిని మళ్ళీ అడవిలో వదిలి వెళ్ళిపోయింది.బ్రతుకుజీవుడా అనుకుంటూ యువరాజు తనకోసం భయపడి గాలిస్తున్న సైనికులను చేరి కోటకు వెళ్ళాడు. కానీ, అతనా నలుగురు కన్యలనూ వారి అపురూప లావణ్యాన్ని మరువలేక బెంగతో మంచం పట్టాడు.విషయం తెలుసుకున్న మహారాజు గోవర్ధనుడికి సందేశం పంపగా, అప్పటికే అతని గారాల పుత్రికలు సుసేనుడినే తమ కలల రాకుమారుడని తండ్రికి తెలిపి వుండటంతో సంతోషించి తన పుత్రికలనిచ్చి వివాహం చేశాడు. వారి శక్తి యుక్తులే కాక, మామగారి అండ కలిగినందున శత్రువుల భయం లేకుండా అనేక సంవత్సరాలు నిరాటంకంగా రాజ్యపాలనచేశాడు సుసేనుడు. -
వేటగాడు 3
మహారాష్ట్రలోని యవత్మాల్ ప్రాంతంలో 14 మందిని పొట్టనపెట్టుకున్న మ్యానీటర్ ‘అవని’(ఆడపులి)ని మట్టుపెట్టిన షార్ప్ షూటర్ నవాబ్ అస్ఘర్ అలీ ఖాన్ హైదరాబాదీనే. తన తాత, తండ్రుల నుంచి ఈ ‘వేట’ను వారసత్వంగా తీసుకున్నారు. గతంలో తండ్రి నవాబ్ షఫత్ అలీ ఖాన్కు సాయంగా కొన్ని ఆపరేషన్స్లో పాల్గొన్నా... నేరుగా ఆయన చేపట్టిన తొలి ఆపరేషన్ ‘అవని’దే. నగరంలోని రెడ్హిల్స్ ప్రాంతానికి చెందిన షఫత్ దేశంలోని ఐదు రాష్ట్రాలకు సలహాదారుడిగా ఉండి, ఇప్పటి వరకు 27 మ్యానీటర్లు, మదపుటేనుగుల్ని మట్టుపెట్టారు. – సాక్షి, హైదరాబాద్ జంతు ప్రేమికులూ దాగున్నారు... అస్ఘర్ తండ్రి షఫత్ అలీ ఖాన్ చేసిన ‘వేట’ల సంఖ్య 27కు చేరింది. 1976 నుంచి ‘వేటాడుతున్న’ఈయన గతంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న 8 ఏనుగులు, 5 పులులు, 13 చిరుతల్ని హతమార్చారు. బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల కోరిక మేరకు ఆయా రాష్ట్రాల్లో రైతులు, ప్రజలను ఇబ్బంది పెడుతున్న 1,500 అడవి గేదెలు, 15,200 అడవి పందులు, 1,300 అడవి కుక్కల్ని చంపారు. ఈ వేటగాళ్లల్లో జంతు ప్రేమికులూ దాగి ఉన్నారు. అంతరించిపోతున్న పులుల సంతతిపై ‘ప్రాజెక్ట్ టు సేవ్ ది టైగర్’పేరుతో ఈ తండ్రీకొడుకులు అధ్యయనం చేస్తున్నారు. ‘ఆడ పులి కేవ లం 111 రోజులకే కాన్పు వస్తుంది. ఒక కాన్పులో కనీసం 3 నుంచి 4 పిల్లలు పుడతాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా 1970ల్లో 20 వేలున్న పులుల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. అందుకే దీనిపై అధ్యయనం చేస్తున్నాం’అని చెప్తారు వారు. పులులు అంతరించిపోకుండా కొన్ని పరిష్కారాలనూ చూపుతూ త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. వారసత్వంగా వస్తున్న ‘వేట’... నవాబ్ అస్ఘర్ అలీ ఖాన్ చిన్నప్పటి నుంచి తుపాకులు, గుర్రాల మధ్య పెరిగారు. ఆయన తాత బహదూర్ బ్రిటిష్ ఇండియాకు ఫారెస్ట్ అడ్వయిజర్గా వ్యవహరించారు. బ్రిటీష్ హయాంలో ఏనుగులతో ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి. అప్పట్లో బహదూర్ 50 ఏనుగులు, 10 మానీటర్లను మట్టుపెట్టారు. అస్ఘర్ తండ్రి షఫత్ అలీ ఖాన్ 1976లో 19 ఏళ్ల వయస్సులోనే తొలి ‘తూటా’పేల్చారు. కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న హెచ్డీ కోటలో 19 మందిని పొట్టనపెట్టుకున్న ఏనుగును హతమార్చారు. అలా మొదలైన ఆ కుటుంబం ‘వేట’ఇప్పటికీ కొనసాగుతోంది. షఫత్ అలీ ఖాన్ బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వాలకు అటవీ విభాగం అడ్వయిజర్గా పని చేస్తున్నారు. అక్కడున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు శిక్షణ ఇచ్చి వస్తుంటారు. మ్యాన్ మానిమల్ కన్ఫ్లిక్ట్, తుపాకీల్లో తర్ఫీదు ఇవ్వడంతో ఈయనకు ప్రత్యేకత ఉంది. నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి, మ్యానీటర్లు, మదపుటేనుగుల్ని మట్టుపెట్టే అలీ ఖాన్ పలుమార్లు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. అనేక ఉదంతాల్లో మృత్యువు క్రూరమృగాల రూపంలో కొన్ని మీటర్ల దూరం వరకు వచ్చి ‘చచ్చింది’. తొలి ప్రాధాన్యం పట్టుకోవడానికే ఇస్తా..: అస్ఘర్ మహారాష్ట్రలో తిప్పేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీ నుంచి ఐదేళ్ల వయసున్న అవని అనే ఆడపులి 20 నెలల క్రితం గర్భవతిగా ఉండి ఆహారం కోసం యవత్మాల్ వరకు వెళ్లింది. ఆ ప్రాంతంలో ఉన్న అడవి నుంచి పొలాల్లోకి వెళ్లి ఆహారం కోసం వెతుక్కుంది. ఈ నేపథ్యంలో అక్కడకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. దీంతో ఇతర జంతువుల కంటే మనుషుల్ని వేటాడటం తేలికని గుర్తించిన పులి మ్యానీటర్గా మారి పంజా విసురుతూ వచ్చింది. ఈ పులి 8 నెలల తర్వాత ప్రసవించింది. దీనికి జన్మించిన 2 పులి పిల్లల వయస్సు ప్రస్తుతం ఏడాది. ఈ మూడూ కలసి యవత్మాల్ చుట్టూ ఉన్న 12 కి.మీ. పరిధిలో సంచరిస్తూ... తల్లి మనుషుల్ని వేటాడి చంపేస్తుండగా... మూడూ కలసి మృతదేహాలను తింటున్నాయి. ఇలా ఇప్పటి వరకు ఈ మ్యానీటర్ చేతిలో 14 మంది చనిపోయారు. సెప్టెంబర్ రెండో వారంలో అక్కడకు చేరుకుని వేట మొదలెట్టా. శుక్రవారం అవని హతమైంది. దీని కూనలు ఇంకా అక్కడే సంచరిస్తున్నాయి. వీటిని పట్టుకోవాల్సి ఉంది. నా తొలి ప్రాధాన్యం వాటికి మత్తుమందు ఇచ్చి పట్టుకోవడానికే. ఇలా తల్లి, రెండు పిల్లలు కలసి జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ చంపి తినడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. అలాగే వీటిని వేటాడే అవకాశం దక్కడమూ అరుదే. -
అడవి పంది.. ఆగమైతంది!
జూలై ఒకటిన తెల్లవారుజామున సిద్దిపేట మీదుగా వస్తున్న టాటా ఏస్ వాహనం జనగామ పట్టణంలోకి రాగానే డివైడర్ను ఢీ కొట్టింది. అక్కడికి వెళ్లి పరిశీలించిన పోలీసులు వాహనంలో అడవి పందులను చూసి నివ్వెరపోయారు. వాటిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. చనిపోయిన 3 పందులను ఖననం చేసి, మిగిలిన 9 పందులను సమీపంలోని అడవుల్లో అధికారులు వదిలేశారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా కరీంనగర్–వరంగల్–ఖమ్మం రహదారిపై పోలీసులు ఓ వాహనాన్ని ఆపారు. అందులో 2 వరుసలుగా పందులున్నాయి. తొలుత సాధారణ పందులు అనుకున్న పోలీసులు తర్వాత దగ్గరగా చూసి ఆశ్చర్యపోయారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు వద్ద ఉండే వేటగాళ్ల నుంచి ఒక్కో అడవి పందిని రూ. 5 వేల చొప్పన కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని.. బెంగళూరు, హైదరాబాద్లోని రెస్టారెంట్లకు సరఫరా చేస్తారని విచారణలో తేలింది. సాక్షి, హైదరాబాద్: పంటలను నాశనం చేస్తున్నాయనే కారణంతో అడవి పందులను చంపేందుకు ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపును కొందరు అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అడవి పందుల మాంసానికి అంతటా డిమాండ్ ఉండటంతో మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరుకు, తనిఖీలకు ఆస్కారంలేని హైదరాబాద్లోని హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. రోజూ సగటున 25 వాహనాలు మన రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. పకడ్బందీగా రవాణా అడవి పందుల అక్రమ రవాణా వ్యాపారులు ఎక్కడికక్కడ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నారు. పందులను వేటాడి ప్రాణాలతోనే గమ్య స్థానాలకు చేర్చేలా ప్రత్యేక వ్యవస్థ నిర్మించుకున్నారు. పందులను వేటాడే నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసి వారంలో ఓ రోజు కచ్చితంగా పందులను తీసుకొచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. వారి భాష, యాస కూడా వ్యాపారానికి ఉపయోగపడేలా జాగ్రత్త పడుతున్నారు. పందులు అరవకుండా మూతిని తాళ్లతో కట్టేస్తున్నారు. జిల్లా దాటగానే వాహనాలను మార్చేందుకు ప్రతి ప్రాంతానికి ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాత్రిపూటే ఈ అక్రమ రవాణా జరుగుతోంది. అధికారులు ఆరాతీస్తే సాధారణ పందులని చెప్పి దాటవేస్తున్నారు. కొన్ని చోట్ల వారిని మచ్చిక చేసుకుని దందా సాగిస్తున్నారు. రవాణాకు సాంకేతిక నైపుణ్యాన్నీ వాడుకుంటున్నారు. వేటాడి బంధించిన పందుల ఫొటోలను వ్యాపారులకు పంపండంతో పని మొదలవుతుంది. వ్యాపారులు అంగీకరించగానే ఒక్కో జిల్లా దాటుతూ, వాహనాలను మార్చుతూ అసలు సూత్రధారులు ప్రత్యక్షంగా లేకుండానే పని పూర్తవుతుంది. ఆహారం కోసం చంపితే నేరం అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న అదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నుంచి పందుల రవాణా ఎక్కువగా జరుగుతోంది. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాలు ఈ ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి గ్రామాల్లోని వ్యవసాయ పంటల్లోకి నిత్యం అడవి పందులు వస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం పంటలకు నష్టం చేస్తున్న సందర్భాల్లో అడవి పందులను చంపడం నేరం కాదు. ఆహారం కోసం చంపితే శిక్షార్హులు. చట్టంలోని 9, 39, 48, 49, 51 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. కానీ పంట నష్టం కారణం చూపి అక్రమార్కులు పందులను వేటాడుతున్నారు. వాట్సాప్లోనే అంతా.. అడవి పంది మాంసానికి ఇటీవల డిమాండ్ పెరుగుతోంది. పెద్ద పెద్ద హోటళ్లలోనూ అడవి పంది మాంసాన్ని ప్రత్యేక వంటకంగా చేస్తున్నారు. కొన్ని పెద్ద నగరాలు, పట్టణాల్లో ముందుగా ఆర్డర్ ఇచ్చిన వారికి ఉదయమే వాటిని సరఫరా చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో కిలో రూ. 500.. నగరాల్లో కిలో రూ. 800 చొప్పున మాంసాన్ని విక్రయిస్తున్నారు. బెంగళూరు నుంచి కవ్వాల్ వరకు అడవి పంది ఎలా ఉంది, దాని ధర ఎంత విషయాలన్నీ వాట్సాప్లోనే జరుగుతున్నాయని, ఒప్పందం కుదరగానే రవాణా మొదలవుతుందని పోలీసులు చెబుతున్నారు. -
రంగురాళ్ల వేట మొదలైంది !
గుడిమెట్ల (నందిగామ): వజ్రాలు, రంగురాళ్లకు ఈ ప్రాంతం అత్యంత ప్రసిద్ధిగాంచింది. అనాది నుంచి కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వజ్రాల వేట కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కంచికచర్ల మండల పరిధిలోని పరిటాల, చందర్లపాడు మండల పరిధిలోని గుడిమెట్ల (రామన్నపేట), కృష్ణాతీరం వజ్రాల గనిగా వాసికెక్కింది. మనసు పెట్టి అన్వేషణ సాగిస్తే, ఏదో ఒకటి దొరుకుతుందన్న నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. సాధారణరకం మొదలుకొని రూ.లక్షల విలువ చేసే వజ్రాలు లభ్యమైన సందర్భాలు అనేకం ఉండటమే ఇందుకు నిదర్శనం. అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం కూడా పరిటాల చెరువులోనే లభించిందని ఓ కథనం ప్రచారంలో ఉంది. కొనసాగుతున్న అన్వేషణ.. గుడిమెట్ల ప్రాంతంలో వజ్రాలు అధికంగా లభిస్తుండటంతో దశాబ్ధాల క్రితం చందర్లపాడులో వజ్రాల కర్మాగారం కూడా ఉండేది. రెండు దశాబ్ధాల క్రితం వరకు వజ్రాల వేట ముమ్మరంగా సాగేది. రాను రాను అన్వేషకుల సంఖ్య ఎక్కువ కావడంతో వీటి లభ్యత తగ్గిపోయింది. అయితే, ఇప్పటికీ ఆశావహులు తొలకరి జల్లులు కురిస్తే చాలు వజ్రాల వేటకు బయలుదేరుతారు. ఇందుకోసం వీరు ప్రధానంగా చందర్లపాడు మండల పరిధిలోని గుడిమెట్ల శివార్లలో కృష్ణానది ఒడ్డును ఎంచుకుంటారు. ఇక్కడే తవ్వకాలు అధికంగా సాగిస్తారు. కొందరు ఏకంగా భోజనాలు సిద్ధం చేసుకొని వచ్చి మరీ అన్వేషణ సాగిస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేట కొనసాగించి చీకటి పడుతున్న వేళ ఇళ్లకు వెళ్లిపోతుంటారు. ఏటా తొలకరి జల్లుల సమయంలో ఇక్కడ వజ్రాల వేట ప్రారంభమవడం ఆనవాయితీ. పొరుగు జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి వజ్రాల వేట సాగిస్తుంటారు. ప్రతినిత్యం 200 మంది వరకు ఇక్కడ అన్వేషణ సాగిస్తుండటం గమనార్హం. ఇక్కడ వజ్రాలతోపాటు రంగురాళ్లు కూడా అధిక సంఖ్యలో లభ్యమవుతాయి. దీంతో కూలి ఖర్చుకు ఢోకా ఉండదని చెబుతారు. కొందరైతే వర్షాకాలంలో ఏకంగా వజ్రాల వేట కోసమే గుడిమెట్ల గ్రామంలో ఇళ్లు అద్దెకు తీసుకొని నెలలపాటు అక్కడే నివాసముంటారని గ్రామస్తులు చెబుతున్నారు. -
కుందేలు వేటగాళ్ల అరెస్టు
ఎల్లారెడ్డి: కుందేలును వేటాడినవారిని అరెస్టు చేసినట్లు ఎల్లారెడ్డి అటవీశాఖ రేంజ్ అధికారి రాధాకిషన్ గురువారం తెలిపారు. మండలంలోని దేవునిపల్లి గ్రామ శివారులో కుందేళ్లను వేటాడుతూ, వేటగాళ్లు పట్టుబడినట్లు ఆయన తెలిపారు. ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన మండిరాం, భీమా అనే ఇద్దరు యువకులు కుందేళ్లతో పట్టుబడినట్లు ఆయన తెలిపారు. అటవీశాఖ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. -
ట్రంప్ ఓ పిచ్చోడు: హీరోయిన్
న్యూ ఢిల్లీ : ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాల్లో నిలవడం హీరోయిన్ సోనమ్ కపూర్కు కొత్తేంకాదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ‘పిచ్చివాడు’ అని వార్తల్లో నిలిచింది. ఇంతకు సోనమ్... ట్రంప్ను ఇలా అనడానికి కారణం అమెరికాకు చెందిన ప్రముఖ హాస్యనటి, టీవీ కార్యక్రమాల వ్యాఖ్యాత ఎలెన్ డిజెనెరస్ చేసిన ట్విట్. ఎలెన్ తన ట్విటర్ అకౌంట్లో ఒక ఫోటోను పోస్టు చేసింది. అందులో ‘మన అధ్యక్షుడు ఏనుగులు, మిగతా జంతువుల వేటకు అనుమతిచ్చాడు. ఇది భయానకమైన విషయం, మనందరం కలసికట్టుగా దీన్ని వ్యతిరేకిద్దాం’ అని ఉంది. అంతేకాక ‘ఏనుగుల పట్ల దయగా ఉండండి’ అనే సందేశాన్ని వ్యాప్తి చేయాల్సిందిగా ఆమె తన అభిమానులందరిని కోరింది. అందుకు సోనమ్ స్పందిస్తూ ‘వేటాడటం భారతదేశంలో చట్టవిరుద్ధమైనది, ఈ విషయంలో ప్రపంచం మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సి ఉంది. వేటను అనుమతించిన ట్రంప్ ఒక పిచ్చివాడు’ అని ట్విట్ చేసింది. ఇప్పుడే కాదు గతంలోనూ ట్రంప్ మెరిల్ స్ట్రీప్ని ‘ఓవర్ రేటెడ్ నటి’ అన్నందుకు ట్రంప్ను తీవ్రంగా విమర్శించింది. ట్రంప్ను ఉద్దేశిస్తూ ‘మన నాయకులకు కనీసం తెలివి అనే రూపం అయినా ఉంటుంది, కానీ ఇతడు మాత్రం జోకర్’ అంటూ ట్విట్ చేసింది. ప్రస్తుతం సోనమ్ కపూర్ ‘వీరే ది వెడ్డింగ్’ చిత్రంలో నటిస్తుంది. ఇందులో సోనమ్తో పాటు కరీనా కపూర్ ఖాన్, స్వర భాస్కర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
దాచేపల్లిలో రంగురాళ్ల వేట
దాచేపల్లి: దాచేపల్లికి ఆరు కిలోమీటర్ల దూరంలోని శంకరపురం– భట్రుపాలెం గ్రామాల మధ్య ఉన్న కొండలో రంగురాళ్ల వేట యథేచ్ఛగా సాగుతోంది. వ్యాపారులు నియమించి మధ్యవర్తుల ఆధ్వర్యంలో కొందరు వ్యక్తులు రేయింబవళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. కొండలో సూమారుగా 100కి పైగా సొరంగాలు తీశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో సొరంగం 50 నుంచి 70 అడుగుల లోతులో ఉండటం విశేషం. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ కిందికి దిగి కొందరు రాళ్ల వేట సాగిస్తున్నారు. రహస్యంగా రవాణా.. రంగురాళ్లను చాకచక్యంగా గుంటూరు జిల్లా కేంద్రంతో పాటు విజయవాడ, ప్రకాశం జిల్లా తెలంగాణాలోని హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడెం, రాజస్థాన్, హిమచల్ప్రదేశ్కు తరలిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యపట్టణాలకు చెందిన వ్యాపారులు మధ్యవర్తుల సాయంతో ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. లోకల్ కార్మికులు 10, 20 కిలో చొప్పున రంగురాళ్లను మూటలుగా కట్టి ఆటోలు, కార్లలో తరలిస్తున్నారు. కాట్రపాడు, భట్రుపాలెం గ్రామాల పరిధిలోని కృష్ణా నది నుంచి కూడా తెలంగాణాలోకి రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడికక్కడే కోవర్టులు ఏర్పాటు చేసుకుని రవాణా సాగించడం గమనార్హం. గతేడాది నవంబర్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టినా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. ఈ రాళ్లకు మస్త్ గిరాకీ.. శంకరపురం కొండలో నుంచి తీసే రంగురాళ్లకు గిరాకీ బాగానే ఉందని తెలుస్తోంది. దొరికిన రాళ్లలో అష్టముఖి, పంచముఖి ఆకారపు రాళ్లు తయారీకి పనికొచ్చేవి ఉంటే ఇక పండగే. వాటి ధర సుమారు రూ.10 వేలకు పైగా ఉంటుందని అంచనా. ఇతర వాటర్పీస్, గంజిరాళ్లయితే కిలో రాళ్లు రూ.5 వేల చొప్పున పలుకుతాయని తెలుస్తోంది. కొండ నుంచి తీసే సాధారణ రాళ్లు కూడా కిలో రూ.5 వేల చొప్పున కొనుగోలు చేస్తారని తెలిసింది. ఒకే రాయి 5 కిలోల బరువు ఉంటే దానికి ప్రత్యేక పారితోషికాలట. సదరు రాళ్లను ఇతర ప్రాంతాలకు తరలించి రాతి బొమ్మలు, కొయ్యబొమ్మలు, పూసల దండలు, ఆభరణాల మధ్యలో ధగధగ మెరిసే రాళ్లుగా మారుస్తారని సమాచారం. అధికారులకు అనధికార సవాల్.. దాచేపల్లి పరిసర ప్రాంతంలోని శంకరపురం, భట్రుపాలెం, దాచేపల్లి, కాట్రపాడు గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు తవ్వకాలు చేపడుతూ అధికారులకు అనధికార సవాళ్లు విసురుతున్నారు. అటవీశాఖ పరిధిలో సరిపడా సిబ్బంది లేకపోవడంతోనే తవ్వకాలను కట్టడి చేయలేకపోతున్నామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఉన్న అరకొర సిబ్బందితో నిఘా పెట్టడం కష్టతరంగా మారిందని వాపోతున్నారు. ఒకవేళ తనిఖీ చేసినా తవ్వకాలు చేపడుతున్న కూలీలు దాడులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దమ్ముంటే తమన పట్టుకోమని సవాల్ విసురుతున్నట్లు అధికారులు చెప్పడం గమనార్హం. ఇది ఇలా ఉండగా మరోవైపు ఆ శాఖ అధికారుల్లో కొందరు మామూళ్లకు అలవాటు పడి నిఘా సంగతి మరచిపోయారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. మరణాలు సంభవించాయి.. రెండేళ్ల క్రితం ఈ ప్రాంతంలో రంగురాళ్ల వేటకు సొరంగంలోకి వెళ్లిన ఓ కూలి మృతి చెందాడు. ఘటన బయటకు రాకుండా మధ్వవర్తులు జాగ్రత్తలు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ కొండపై వందమందికిపైగా కూలీలు విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాత్రిళ్లు టార్చిలైట్లు, జనరేటర్లనూ ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ఈ మూడేళ్లలో సుమారు వందల టన్నుల రంగురాళ్లు హద్దులు తరలివెళ్లాయనేది ఓ అనధికార అంచనా. తవ్వకాలు జరిపితే రౌడీ షీట్లు తెరుస్తాం.,. కొండల్లో అక్రమంగా రంగురాళ్ల కోసం తవ్వకాలు జరిపే ఊరుకోం. సదరు వ్యక్తులు పట్టుబడితే రౌడీషీట్లు తెరుస్తాం. వారి వెనుక ఎంతటి వారైనా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. – అద్దంకి వెంకటేశ్వర్లు, ఎస్సై, దాచేపల్లి -
ఆడపులి కోసం వేట షురూ..!
సాక్షి, సిటీబ్యూరో: సిటీ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ మహారాష్ట్రలో మరో ఆపరేషన్ చేపట్టారు. యవత్మాల్ జిల్లాలో మ్యానీటర్గా మారి బీభత్సం సృష్టిస్తున్న ఆడపులి కోసం శనివారం వేట ప్రారం భించారు. ఇదే రాష్ట్రంలోని థూలే జిల్లాలో మ్యానీటర్గా మారిన ఓ చిరుతను గత శనివారం మట్టుపెట్టారు. ఈ ఆపరేషన్ ముగించుకుని సిటీకి వచ్చిన అలీ ఖాన్ శనివారం మళ్లీ యవత్మాల్ చేరుకున్నారు. తమ తొలి ప్రాథాన్యం ఆ పులికి మత్తుమందు ఇచ్చి (ట్రాంక్విలైజింగ్) పట్టుకోవడమే అని ఆయన ఆదివారం ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. యవత్మాల్ జిల్లాలోని పంథర్కావ్డా, తెపీశ్వర్ గ్రామాలకు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తొలిసారిగా 2014లో ఓ ఆడపులి ప్రవేశించింది. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాలు అప్పట్లో తొలిసారిగా ఈ పులిని చిత్రీకరించాయి. గత ఏడాది హఠాత్తుగా మ్యానీటర్గా మారిన ఈ ఆడపులి గ్రామాలపై దాడులు ప్రారంభించింది. తొలినాళ్ళల్లో పొలాలు, ఇళ్ళ బయట ఉన్న పశువులు, మేకల్ని చంపేది. అయితే పశువులు, మేకల కోసం జనావాసాల మధ్య సంచరించడంతో దీనికి మనుషులంటే భయంపోయింది. దీంతో కనిపించిన వారిపై దాడి చేసి చంపడం మొదలెట్టింది. గత ఏడాది నలుగురిని చంపిన ఈ ఆడ పులి అనేక మందిని గాయపరిచింది. కొన్నాళ్ళ పాటు స్తబ్ధుగా ఉన్న ఈ పులి ఈ నెల మొదటి వారం నుంచి మళ్ళీ విజృంభించింది. తొమ్మిది రోజుల వ్యవధిలో ఏకంగా ఐదుగురిని చంపేసింది. వీరిలో ముగ్గురి మృతదేహాలను అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్ళి తినేసింది. గత శనివారం అడాన్ గ్రామ శివార్లలో ఓ రైతుపై దాడి చేసి చంపేసిన ఈ పులి అతడి ఎడమకాలను పూర్తిగా తినేసింది. ఈ ఘటనతో ఈ గ్రామంతో పాటు పంథర్కావ్డా, తెపీశ్వర్ గ్రామాల్లోనూ ఉద్రిక్తత నెలకొంది. దీంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. దీనిపై స్పందించిన అధికారులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారం రోజులు ప్రయత్నించినా కనీసం దాని ఆచూకీ కూడా కనిపెట్టలేకపోయారు. దీంతో యవత్మాల్ డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ కేఎం అపర్ణ హైదరాబాద్కు చెందిన నవాబ్ షఫత్ అలీ ఖాన్ను ఆహ్వానించారు. శనివారం అక్కడకు చేరుకున్న ఆయన ఆదివారం నుంచి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అలీ ఖాన్ ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ... ‘ప్రాథమికంగా ఆ పులి ఆచూకీని కనిపెట్టాలి. పగటిపూట ఎక్కడ తల దాచుకుంటోందో గుర్తించాలి. ఆపై అది మ్యానీటర్గా మారడానికి కారణాలను విశ్లేషించాలి. ఈ పులికి మత్తుమందు ఇచ్చి బంధించడానికే తొలి ప్రాధాన్యం ఇస్తూ ఆపరేషన్ చేపట్టాం’ అన్నారు. -
గన్తో వేటాడుతూ బుక్ అయిన మంత్రి
-
గన్తో వేటాడుతూ బుక్ అయిన మంత్రి
సాక్షి, ముంబై : సోషల్ మీడియాలో ఇప్పుడు మహారాష్ట్ర మంత్రి గిరీశ్ దత్తాత్రేయ మహాజన్ చేసిన పని వైరల్ అవుతోంది. పిస్టోల్తో ఓ చిరుతను ఆయన వేటాడుతున్న దృశ్యాలవి. సోమవారం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆయన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. జలగావ్ జిల్లా ఛలీస్గావ్లో గత కొన్ని రోజులుగా ఓ చిరుత సంచారం స్థానికుల్లో భయాందోళనలు రేపుతోంది. వరుసగా మనుషులు, పశువులను బలి తీసుకుండటంతో దానిని వేటాడేందుకు అటవీ శాఖ కూడా వేటగాళ్లకు అనుమతి ఇచ్చింది. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా ఎవరూ ఇంత వరకు దాని అంతు చూడలేకపోయారు. ఆ గ్రామం తన నియోజకవర్గం కిందకే రావటంతో స్వయానా మహాజనే రంగంలోకి దిగారు. సోమవారం అటుగా వెళ్తున్న ఆయన కాన్వాయ్ ఆపించి మరీ తన లైసెన్స్ రివాల్వర్తో చిరుతను వేటాడేందుకు యత్నించారు. అయితే అది వారికి చిక్కలేదు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజా సంక్షేమం మాట పక్కనపెట్టి.. తనకు అవసరం లేకపోయినా మంత్రి ఇలా తుపాకీతో వేటాడం సరికాదన్న విమర్శలను కాంగ్రెస్ పార్టీనేతలు సహా పలువురు వినిపిస్తున్నారు. అయితే మంత్రి మాత్రం తన పనిని సమర్థించుకుంటున్నారు. కాగా, మహాజన్కు వివాదాలు కొత్తేం కాదు. మద్యం బ్రాండ్లకు మహిళల పేర్లు పెడితే అమ్మకాలు భారీగా పెరుగుతాయని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది ఈయనగారే. అంతేకాదు గతంలో ఓ వివాహ వేడకకు గన్తో దర్శనమిచ్చి కలకలమే రేపాయాయన. -
3,700 కి.మీ వేటకెళ్లిన పుతిన్ చొక్కా విప్పేసి..
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ను మీరు ఎప్పుడైన గమనించారా.. దాదాపు ఎక్కువగా మాట్లాడకపోయినా ఆయన చేష్టలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంటాయి. కాలక్షేపానికి, మనసును తేలిగ్గా ఉంచుకునేందుకు ఆయన చేసే పనులు ఎంత ఆసక్తిగా ఉంటాయో ఓ పట్టాన చెప్పనక్కర్లేదు. మొన్నామధ్య బీజింగ్లో చైనా రష్యా దేశాల ద్వైపాక్షిక చర్యలకు వెళ్లిన పుతిన్ చైనా అధ్యక్షుడు జీజిన్పింగ్ వచ్చే వరకు ఖాళీగా ఉండకుండా పియానో వాయిస్తూ అందరిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పటికే జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్లో దిట్ట అయిన ఆయన పియానో కూడా వాయించడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అందరినీ మరింత ఆశ్చర్యపరిచేలా ఆయన చేపల వేటలో నిమగ్నమయ్యారు. అది కూడా ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లుగా. కొంతమంది స్నేహితులతో కలిసి మంగోలియన్ సరిహద్దులోగల దక్షిణ సైబీరియాలోని రిపబ్లిక్ ఆఫ్ టివా ప్రాంతానికి గాలం తీసుకొని వెళ్లారు. ఇది మాస్కోకు 3,700కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి వెళ్లిన పుతిన్ మూడు రోజులపాటు సరదాగా గడుపుతూ చొక్కా విప్పేసి నదిలోకి దిగేశారు. ప్రత్యేక మాస్క్లు ధరించి నీటి అడుగుకు వెళ్లి చేపల వేట కొనసాగించారు. వివిధ రకాలుగా స్మిమ్మింగ్ చేస్తూ పెద్ద పెద్ద చేపలను స్వయంగా గాలంతో పట్టేశాడు. ఆ సమయంలో ఆయనతో రష్యా రక్షణ మంత్రి సెర్జీ షోయిగు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చి తెగ హల్ చల్ చేస్తున్నాయి. 64 వయసులో కూడా ఆయన శరీరదారుఢ్యం చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఇప్పటికీ ఆయనకు ఆరుపలకల దేహం కనిపిస్తుందంటే పుతిన్ తన ఆరోగ్యం విషయంలో ఇప్పటికీ అంత శ్రద్ధ తీసుకుంటారా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. -
‘కోటలో వేట’పై హరీశ్ సీరియస్
- సమగ్ర విచారణకు ఆదేశం - విచారణకు ఆదేశించిన అటవీ శాఖ మంత్రి సాక్షి, హైదరాబాద్: రిసార్టు ముసుగులో కొనసాగుతున్న అటవీ జంతువుల వేటపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ మేరకు ‘సాక్షి’లో ‘కోటలో వేటగాడు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. రిసార్టు కార్యకలాపాలు, అందులో కొనసాగుతున్న అటవీ జంతువుల వేటపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, నిజం నిగ్గు తేల్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రిసార్టులు, ఫాం హౌస్లలో జరిగే కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచాలని సిద్దిపేట సీపీ శివకుమార్ను ఆదేశించారు. ఇదే అంశంపై అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. అటవీ జంతువులను ఎన్క్లోజర్స్ పెట్టి ఎలా బంధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యథేచ్ఛగా జెల్లీ ఫిష్ వేట
తుస్సుమంటున్న చేపల వేట నిషేధం మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు జీవనోపాధి లేక.. అంటున్న మత్స్యకారులు ఇప్పటికీ అందని నష్టపరిహారం ఒక పక్క సముద్రంలో చేపల వేట నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని అధికారులు చెబుతుంటే.. మరో పక్క జెల్లీ షిష్ వేట యథేచ్ఛగా సాగుతోంది. వేట నిషేధానికి ముందే నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించనందున.. జీవనోపాధికి మరో దారి లేక జెల్లీ షిష్ వేట సాగుతోందని పలువురు మత్స్యకారులు అంటున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూలై 15 వరకు చేపల వేట నిషేధం అమల్లో ఉంది. ఇంతవరకూ మత్స్యకారులకు ఒక్క పైసా కూడా నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించలేదు. జెల్లీ షిష్ వేట విషయం నిజమేనని అధికారులూ అంగీకరిస్తున్నారు. కాట్రేనికోన (ముమ్మిడివరం) : సముద్ర జలాలలో మత్స్య సంపద ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 61 రోజులు చేపల వేటపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన అధికారులు దళారులతో చేతులు కలపడంతో జెల్లీ ఫిష్ (రోఫిలిమా ఇస్యూలెంటమ్) వ్యాపారం జోరుగా సాగుతోంది. నెలవారీ మామూళ్లతో కాకినాడ కేంద్రంగా జెల్లీ ఫిష్ ఎక్స్పోర్టు భారీగా సాగుతోంది. మత్స్యకారులు వేటాడి తెచ్చిన జెల్లీ ఫిష్లను సిమెంట్ కుండీలు, తార్పాలతో కట్టిన మడులలో ఉప్పు వేసి ఊరబెట్టి టన్నులు చొప్పున ఎగుమతి చేస్తున్నారు. చేపల వేట నిషేధం ఎందుకు? మత్స్య సంపద పునరుత్పత్తి కాలంలో చేపల వేట, పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు, చమురు సంస్థలతో సముద్ర జలాలు కలుషితమై గుడ్లు పెట్టేందుకు విఘాతం కలుగుతుంది. మత్స్యసంపద అభివృద్ధి కోసం చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలం (నిషేధ సమయం)లో చేపలను వేటాడితే ఏపీ సముద్ర జల మత్స్య (క్రమబద్దీకరణ) చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిఉంది. మత్స్య శాఖ, కోస్టల్, మెరైన్, ఎన్పోర్సుమెంట్ విభాగాలు సంయుక్తంగా పని చేసి నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిఉంది. పలు గ్రామాల్లో యథేచ్ఛగా వేట... ఉప్పాడ, కోనపాపపేట, భైరవపాలెం, దరియాలతిప్ప, కొత్తపాలెం, బలుసుతిప్ప తదితర ప్రాంతాలో భారీ ఎత్తున జెల్లీ ఫిష్లను సేకరించి ఎగుమతులు చేస్తున్నారు. సుమారు 30 కేజీల బరువు ఉన్న జెల్లీ ఫిష్ రూ.1,800ల నుంచి రూ.2,500లకు ధర పలుకుతుంది. నీటిలో తేలియాడుతూ జీవించే జెల్లీ.. మే, జూన్ నెలలో అధికంగా వస్తుంది. ధర అధికంగా ఉండడంతో మత్స్యకారులు వేట నిషేధాన్ని లెక్క చేయడం లేదు. చక్రం తిప్పుతున్న హోం గార్డు! చేపల వేటను నియంత్రించాల్సిన అధికారులు నెలవారీ మామూళ్లతో నిద్ర మత్తులో జోగుతున్నారు. జెల్లీ ఫిష్ వ్యాపారులు, మత్స్యకారులను భయపెట్టి భారీ మొత్తంలో సొమ్ము వసూలు చేయడంలో ఒక హోం గార్డు చక్రం తిప్పాడనే ఆరోపణలు ఉన్నాయి. జెల్లీ ఫిష్కు మంచి డిమాండ్ జెల్లీ ఫిష్ను చైనా, థాయిలాండ్, జపాన్, మలేషియా, ఇండోనేషియా, కొరియా తదితర దేశాలలో ఆహారంగా తీసుకుంటారు. వారు తీసుకునే ఆహారంలో ఇన్ గ్రీడియంట్స్గా తీసుకోవడంతో మంచి డిమాండ్ ఉంది. జెల్లీ ఫిష్లో మంచి పోషకవిలువలు అధికంగా ఉండడంతో సలాడ్స్, ఐస్క్రీమ్, రోస్టెడ్ చికెన్ విత్ జెల్లీ ఫిష్, రోస్టెడ్ డక్ అండ్ జెల్లీ ఫిష్ సలాడ్స్, న్యూడిల్స్గా వంటలు తయారు చేస్తుంటారు. జీవనోపాధి లేక... చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం మత్స్యకారులకు చెల్లించ వలసిన నష్ట పరిహారాన్ని నేటికీ ఇవ్వలేదు. దీంతో నిషేధ సమయంలో జీవనోపాధిని కోల్పోయిన మత్స్యకారులు ఉపాధి కోసం జెల్లీ ఫిష్ చేపల వేట చాటుమాటున చేస్తున్నారు. నిషేధ సమయానికి ముందే నష్ట పరిహారం అందజేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదోమోనని పలువురు అంటున్నారు. ఈ విషయంపై ఎఫ్డీఓ రాంబాబును వివరణ కోరగా సముద్ర జలాలలో నిషేధం ఉందని, పాయలలో జెల్లీ ఫిష్లను మత్యుకారులు పట్టుకుంటున్నారని అంగీకరించారు. -
వేటగాళ్ల ఉచ్చుకు చిరుత బలి
- నీటి కోసం వచ్చి.. ఉచ్చులో చిక్కగా ఉరిపడిన వైనం - సిద్దిపేట జిల్లా మహ్మదాపూర్ గుట్టల్లో ఘటన హుస్నాబాద్ రూరల్: నీటి కోసం కొండ దిగిన చిరుత వేటగాళ్ల ఉచ్చులో చిక్కి బలైంది. దాదాపు 8 గంటలపాటు తండ్లాడిన చిరుత చివరకు ప్రాణం విడిచింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టల్లో బుధ వారం వెలుగు చూసింది. అనభేరి ప్రభాకర్ రావు సమాధుల సమీపంలో ఉపాధిహామీ పనులు చేసేందుకు బుధవారం ఉదయం కూలీలు వెళ్లారు. వీరికి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల గాలించగా చిరుత పులి కళేబరం కనిపించింది. వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత నాలుగు కాళ్లు నరికేసి ఉన్నాయి. చిరుత కాళ్లకు, మెడకు ఉరి పడ్డట్లు తెలుస్తోంది. ఉచ్చుల నుంచి తప్పించుకోవడానికి చిరుత 7 నుంచి 8 గంటలపాటు పెనుగులాడినట్టు శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా తెలుస్తోంది. చిరుత ఎక్కడో ఉచ్చుకు చిక్కి చనిపోగా... వేటగాళ్లు గుట్ట మీదకు తీసుకొచ్చి, చిరుత గోళ్ల కోసం దాని కాళ్లు నరికి తీసుకెళ్లినట్టు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. చిరుత కళేబరం నుంచి కొన్ని భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు అటవీ అధికారులు పంపించారు. ఆ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని డీఎఫ్ఓ శ్రీధర్రావు తెలిపారు. -
జాతులే భారత సంతతికి మూలం!
లండన్: ఆఫ్రికా, ఇరాన్, మధ్య ఆసియాల నుంచి గత 50,000 ఏళ్లలో వచ్చిన వేర్వేరు వలసల కారణంగానే భారత సంతతి ప్రజలు ఏర్పడ్డారని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఉపఖండంలో వ్యక్తుల జన్యువుల్ని విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ హడ్డర్స్ఫీల్డ్ పరిశోధకులు వెల్లడించారు. వేట ఆధారంగా జీవించే జాతి ఒకటి దాదాపు 50 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి ఉపఖండానికి వలస వచ్చిందని పరిశోధకులు చెప్పారు. అనంతరం దాదాపు 10–20 వేల ఏళ్ల క్రితం అంటే మంచు యుగం ముగిశాక ఇరాన్ ప్రాంతం నుంచి వలసలు ప్రారంభమయ్యాయని వారు తెలిపారు. ఇక మధ్య ఆసియా జాతులు గత 5,000 ఏళ్లలోనే ఉపఖండానికి వలస వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. -
జింకను వెంబడించి చంపిన కుక్కలు
-
తీవ్ర గాయాలతో చుక్కలదుప్పి మృతి
వేటగాళ్ల పనేనన్న అనుమానం? హవేలి ఘణాపూర్ (మెదక్): తీవ్రగాయాలతో చుక్కలదుప్పి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. హవేలి ఘనాపూర్ మండలం గాజిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో చుక్కలదుప్పి శుక్రవారం తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతుండగా అధికారులు గుర్తించి మెదక్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ దుప్పి కుక్కలదాడిలో గాయాలపాలై మృతి చెందినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి దేవీలాల్ తెలిపారు. మృతి చెందిన దుప్పిని పోస్టుమార్టం నిమిత్తం మెదక్కు తరలించినట్లు చెప్పారు. ఈ చుక్కలదుప్పి కుక్కలదాడిలో గాయపడిందా.. లేక ఎవరైనా వేటగాళ్ల వేటలో గాయపడిందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. -
దుప్పులను వేటాడింది మేమే...
⇒ లొంగిపోయిన వేటగాళ్లు...ముగ్గురి రిమాండ్ ⇒ కరీంనగర్ సబ్ జైలుకు తరలింపు ⇒ పరారైన నాలుగో నిందితుడు టీఆర్ఎస్ నేత అక్బర్ఖాన్ ⇒ నాలుగు రోజులుగా పట్టించుకోని పోలీసులు సాక్షి, భూపాలపల్లి/మంథని: మహదేవపూర్ అడవుల్లో దుప్పులను వేటాడింది తామేనంటూ ముగ్గురు నిందితులు శుక్రవారం సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహదేవ పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రభాను ఎదుట ఈనెల 24న లొంగిపోగా, వీరిని అదేరోజు రాత్రి 11 గంటలకు పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి నాగేశ్వర రావు ఎదుట హాజరుపరిచారు. అనంతరం కరీంనగర్ సబ్జైలుకు తరలించారు. కోర్టుకు సమర్పించిన రిమాండు పత్రంలో మొత్తం నలు గురిని నిందితులుగా పేర్కొన్నారు. ఏ–1గా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీకి చెందిన నలువాల సత్యనారాయణ అలి యాస్ సత్తెన్న(55), ఏ–2గా జయశంకర్ జిల్లా మహ దేవపూర్ మండలం ఖాన్పూర్కు చెందిన మహ్మద్ ఖలీముల్లాఖాన్(25), ఏ–3గా జయ శంకర్ జిల్లా మహదేవపూర్ మండలం ఖాన్పూర్ కు చెందిన అస్రార్ అహ్మద్ ఖురేషీ(28), ఏ–4గా మహదేవపూర్ మండలానికి చెందిన టీఆర్ఎస్ నేత మహ్మద్ అక్బర్ఖాన్ను పేర్కొన్నారు. అక్బర్ పరారీలో ఉన్నాడు. రెండు లైసెన్స్డ్ తుపాకులు.. నిందితుల్లో ఇద్దరి వద్ద లైసెన్స్డ్ తుపాకులు ఉన్నాయి. సత్తెన్న తుపాకీతోపాటు 150 తుటా లను పోలీసులకు అప్పగించాడు. అక్బర్కు చెందిన లైసెన్సు తుపాకీ వేట కొనసాగినప్పుడు తన వెంట ఉన్నట్లు రిమాండ్ డైరీలో పేర్కొన్నా రు. ఈ ప్రాంతంలో వేటాడేందుకు వచ్చే వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు అక్బర్ మీద ఉన్నాయి. నిందితులు అక్బర్కు చెందిన గెస్ట్హౌస్లో ఈనెల 19న సమావేశమయ్యారు. అక్కడ మద్యం సేవించిన అనంతరం ఈ ముగ్గురి తోపాటు మరో ఇద్దరు కారులో వన్యప్రా ణులను వేటాడేందుకు సర్వాయిపేట వైపునకు వెళ్లినట్లుగా పేర్కొన్నారు. అక్బర్ 4 రోజులు దర్జాగా తిరిగి నట్లు స్థానికులు చెబుతున్నారు. కేసులో కీలకంగా మారిన అక్బర్ ను అరెస్టు చేస్తే పెద్ద తలకాయల గుట్టురట్టయ్యే ఆస్కారముండేది. కేసులో ప్రధానపాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్న వ్యక్తులను తప్పించేం దుకు విచారణ మంద కొడిగా సాగిస్తున్నారనే ఆరోపణ లున్నాయి. వేట వెనుక మంత్రుల హస్తం దుప్పుల వేట కేసులో రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులకు సంబంధముందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మహదేవపూర్ జెడ్పీ టీసీ సభ్యురాలు హసీనాభాను భర్త, టీఆర్ఎస్ నేత అక్బర్ఖాన్ నిందితుడిగా పేర్కొన్న నేపథ్యం లో ఆ మంత్రుల పాత్రా ఉందని అంటున్నారు. వేటకు సంబంధించి వాస్తవాలు సేకరించేందుకు అటవీశాఖ విజిలెన్స్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ శ్రీనివాస్ మహదేవపూర్ అటవీ ప్రాంతంలో వస్తున్నట్లు సమాచారం. స్థానికులు, అటవీశాఖ, పోలీసుల నుంచి వివరాలు రాబట్టనున్నారు. నన్ను బలిపశువును చేస్తున్నారు దుప్పులవేట కేసులో ఏ –1 ఆగ్రహం దుప్పులవేట కేసులో ఏ–1 నిందితుడిగా నలువాల సత్యనారాయణ అలియాస్ సత్తెన్న అప్రూవర్గా మారేందుకు ప్రయత్నించాడు. ప్రధాన నిందితులను తప్పించేందుకు తనను బలిపశువు చేస్తున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వేట ఘటనపై మీడియాలో కథనాలు రావడం, అసెంబ్లీలో చర్చకు రావడం, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించిన నేపథ్యంలో సత్య నారా యణ, ఖలీముల్లాఖాన్, అస్రార్ అహ్మద్ ఖురేషీ లు మహదేవపూర్ పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. సత్య నారాయణను ఏ1గా, మిగిలిన ఇద్దరిని ఏ 2, ఏ 3లుగా పేర్కొంటూ తొలుత రిమాండ్ డైరీ రూపొం దించినట్లు సమాచారం. అక్బర్ఖాన్ను వదిలి తనను ఏ1గా ఎలా పేర్కొంటారని సత్యనా రాయణ ఎదురు తిరిగి నట్లు తెలుస్తోంది. దీంతో అసలుకే ఎసరు వస్తుందని అక్బర్ను ఏ4గా పేర్కొన్నట్లు తెలిసింది. అక్బర్ పోలీసు స్టేషన్ నుంచి వెళ్లిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్ పూర్తి చేసి శుక్రవారం రాత్రి మిగిలినవారిని జడ్జి ఎదుట హాజరుపరిచారు. -
ప్రాణం తీసిన చేపల వేట సరదా
– నదిలో పడి యువకుడి మృతి – దామరచర్ల మండల పరిధిలో ఘటన దామరచర్ల చేపల వేట సరదా ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన దామరచర్ల మండలం అడవిదేవులపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని తిమ్మాపురంకు చెందిన ధనావత్ జవహర్లాల్(23) కొందరు గ్రామస్తులతో కలిసి మంగళవారం అడవిదేవులపల్లి టెయిల్పాండ్ సమీపంలోని కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో జవహర్లాల్ పట్టుతప్పి నదిలో పడి పోయాడు. దీనిని గుర్తించిన తోడుగా వెళ్లినవారు బాధితుడిని నది నంచి బయటకు తీశారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
వేటలేక.. పూట గడవక..
* మొన్నటి వరకు వేటకు విరామం.. * ఇప్పుడేమో భయంతో ఊరు దాటని పరిస్థితి * రెండు నెలలుగా పస్తులు * దుర్భరస్థితిలో పాల్మన్పేట గంగపుత్రులు నక్కపల్లి/పాయకరావుపేట: ఏక్షణాన ఏంజరుగుతుందోనన్న భయంతో కంటిమీద కునుకు లేకుండా పాల్మన్పేట గంగపుత్రులు ప్రాణ భీతితో కాలం వెళ్లదీస్తున్నారు. నాలుగు రోజులు క్రితం వందలాది మంది అల్లరి మూకలు మూకుమ్మడిగా వచ్చి తమపై జరిపిన దాడి నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు. గ్రామంలో ఎవరిని కదిపినా కన్నీటిపర్యంతమవుతున్నారు. అసలే రెండు నెలలపాటు వేటసాగక ఇంటివద్ద పస్తులున్న వీరిపై ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులు గోరుచుట్టుపై రోకటి పోటు మాదిరిగా తయారయ్యాయి. వారం రోజులనుంచి ప్రాణ భయంతో వేటకు వెళ్లక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రామంలో సుమారు 2500 మంది మత్య్సకారులు జీవిస్తున్నారు. వీరిలో 90 శాతం మంది వైఎస్సార్సీపీ మద్దతుదారులే ఉన్నారు. తమకు పూర్తిస్థాయి భద్రత లభించే వరకు వేటకు వెళ్లడం సాధ్యంకాదని, వైరివర్గం నివసించే గ్రామం మీదుగానే తాము వేటకు వెళ్లాలని వారు పేర్కొంటున్నారు. రెండు నెలలుగా పస్తులు ఇక్కడి మత్స్యకారులకు వేటకు వె ళ్తే తప్ప పూటగడవదు. అందరూ గంగమ్మ తల్లినే నమ్ముకుని జీవిస్తున్నారు. వేట విరామం కారణంగా ఏప్రిల్ 15 నుంచి జూన్15 వరకు రెండు నెలల పాటు వీరు ఏ పనీలేకుండా ఇళ్ల వద్దే ఉన్నారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇచ్చే పరిహారం సకాలంలో ఇవ్వడం లేదు. దీనికి తోడు తీరప్రాంతం వెంబడి ఏర్పాటవుతున్న రసాయన పరిశ్రమలు కూడా వీరి ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. కంపెనీల నుంచి విడుదలయ్యే వ్యర్థ రసాయనాలు సముద్రంలో వదలడం వల్ల మత్స్య సంపద నాశనమవుతోంది. ఈ ప్రాంతంలో వేటసాగక పొట్టచేతపట్టుకుని ఇతర జిల్లాలకు వలసపోతున్నారు. ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్న వీరిపై రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్న భౌతిక దాడులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు పక్క పక్క గ్రామాల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణను ఆసరాగా తీసుకుని పొరుగు జిల్లాకు చెందిన వారు వీరిపై దాడులకు పాల్పడంతో వణికిపోతున్నారు. తమపై దాడిచేసిన వారిపై ఫిర్యాదు చేశామని, దీన్ని జీర్ణించుకోలేక మళ్లీ దాడులకు తెగబడతారేమోనన్న భయం వీరిని వెంటాడుతోంది. గ్రామంలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసినప్పటికీ వీరిలో భయం వీడలేదు. ఈ దాడులకు సంబంధించి పోలీసులు ఇంతవరకు 58 మందిని అరెస్టుచేశారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. రక్షణ కల్పించాలి మా వాళ్లు వేటకు వెళ్తే తప్ప మా కడుపులు నిండవు. ప్రాణాలకు తెగించి ఆటుపోట్ల మధ్య సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మమ్మల్ని రాజకీయంగా అణగదొక్కాలని ఒక వర్గం వారు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. దీన్నీ అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మాప్రాణాలకు భద్రత కల్పించాలి. మాకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత. - పిక్కి మేరి, పాల్మన్పేట బాధితురాలు కుట్రలో భాగమే దాడులు మా వాళ్లు అమాయకులు, మాలో మాకు వచ్చిన గొడవలను ఇతర గ్రామాల వారు అలుసుగా తీసుకుని రాజకీయంగా అణగదొక్కాలని దాడులుచేశారు. వీరికి ప్రభుత్వంలో పెద్దల అండ ఉంది. ప్రత్యర్థులు లేకుండా చేయాలనే కుట్రలో భాగమే ఈ దాడులు. ఏ సంబంధంలేని పది గ్రామాల వారు వచ్చి మమ్మల్ని హత్యచేయాలని చూశారు. - కె.గోపి, మత్స్యకారుడు -
సమాజం కోసమే...వేట
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్కు చెందిన హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ బీహార్ రాష్ట్రంలో మరో వేట ప్రారంభించారు. అక్కడి మకామా ప్రాంతంలో పంట పొలాలను ధ్వంసం చేస్తున్న నీల్గాయిల వేట ప్రారంభించారు. ఈ విషయంపై గురువారం కేంద్ర మంత్రులు మేనకాగాంధీ, ప్రకాష్ జవదేకర్ మధ్య మాటల యుద్ధం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు..మకామా ప్రాంతంలోని అడవుల నుంచి బయటకు వచ్చి సమీపంలోని పొలాలపై నీల్గాయిలు దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. తీవ్రంగా నష్టపోతున్న రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. వాటిని కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా సాధ్యం కాకపోవడంతో ఆ ప్రభుత్వం హైదరాబాద్కు చెందిన ప్రముఖ వేటగాడు షఫత్ అలీ ఖాన్ను పిలిచింది. దీంతో ఆయన ఆదివారం అక్కడికి చేరుకుని రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో చర్చించారు. పరిస్థితుల్ని అధ్యయనం చేసిన తర్వాత నీల్గాయిలను అవసరమైన సంఖ్యలో కాల్చిచంపడమే పరిష్కారమని నిర్ణయించారు. దీనికి బీహార్ ప్రభుత్వంతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ సైతం అనుమతి తెలపడంతో అలీ ఖాన్ తన ఆపరేషన్ ప్రారంభించారు. మకామా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల్లో కాపుకాసిన ఆయన నాలుగు రోజుల్లో 300 నీల్గాయిలను చంపారు. ఈ విషయంపై ఓ జాతీయ ఛానల్ గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్న జంతు ప్రేమికురాలు మేనకాగాంధీని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఆమె తన సహచర మంత్రి ప్రకాష్ జవదేకర్తో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ను ‘వేట’పై తీవ్రంగా విమర్శించారు. దీనికి జవదేకర్ సైతం ఘాటుగా స్పందించడంతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మేనకాగాంధీ సదరు జాతీయ ఛానల్తో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి వచ్చిన షూటర్ కుటుంబం మూడు తరాలుగా జంతువుల్ని వేటాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ‘సాక్షి’ ఫోన్ ద్వారా షఫత్ అలీ ఖాన్ను సంప్రదించగా... ‘మూడు తరాల నుంచి మా కుటుంబం వేటాడుతోంది సమాజం కోసమే. మ్యానీటర్స్గా మారిన పులులు, చిరుతలతో పాటు అమాయకుల్ని పొట్టనపెట్టుకున్న ఏనుగుల్ని మాత్రమే చంపాం. ప్రతి అంకంలోనూ ఆయా ప్రభుత్వాలు అధికారికంగా కోరి, అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ పని చేస్తున్నాం. పట్టుకోవడం, మత్తు ఇవ్వడం సాధ్యం కాని పక్షంలోనే ఆఖరి అవకాశంగా ఆయా జంతువుల్ని చంపాల్సి వస్తోంది. మకామాలో నిరుపేద రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలోనే నీల్గాయి(బ్లూబుల్స్)లను వేటాడాల్సి వస్తోంది. ఏసీ గదుల్లో కూర్చునే వారు క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలియక, అర్థం చేసుకోలేక కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని అన్నారు. -
జీహెచ్ఎంసీ కుక్కల వేట షురూ
హైదరాబాద్: హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో గ్రామసింహాల బెడదపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం ఉదయం ఎల్బీనగర్ పరిధిలోని సిరినగర్లో వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే విధంగా కుక్కలను బంధించే కార్యక్రమం చేపడతామని చెప్పారు. నగరంలో ఏడాదికి వెయ్యికిపైగా కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. కుక్కకాటు బాధితులతో నిత్యం ఐపీఎం, ఫీవర్ ఆస్పత్రులు రద్దీగా ఉంటున్నాయి. బస్తీల్లో రాత్రి పూట సంచరించేందుకు జనం జంకుతున్నారు. వీటన్నిటితో ‘సాక్షి’ మినీ మొదటిపేజీలో గురువారం కథనం ప్రచురితమైంది. -
సిద్థిపేటలో కృష్ణజింకను చంపిన దుండగులు
-
ఉగ్ర వేట
-
జాతీయ పక్షులను చంపితే జైలుకే...
జగిత్యాల : జాతీయపక్షి నెమలిని చంపిన కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమాన విధిస్తూ కరీంనగర్ జిల్లా జగిత్యాల మొదటి అదనపు జుడీషియల్ మేజిస్ట్రేట్ రమేష్ సోమవారం తీర్పునిచ్చారు. జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద జిల్లాలో జైలుశిక్ష విధించడం ఇదే తొలిసారి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతిరెడ్డి తెలిపిన వివరాలు.. జగిత్యాల మండలం తారకరామనగర్కు చెందిన వనం రవి, కుంభం పోచయ్య కూలీలు. వీరు మల్యాల మండలం రాజారాం గ్రామ సమీపంలోని రామస్వామి గుట్టపై వన్యప్రాణుల కోసం వలలు ఏర్పాటు చేశారు. 2011 ఆగస్టు 19 వలల్లో రెండు నెమళ్లు చిక్కాయి. రవి, పోచయ్య ఆ నెమళ్ల ఈకలు పీకి, అమ్మేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సమ్మిరెడ్డి, వెల్దుర్తి బీట్ ఆఫీసర్ రఘుపతి వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఇది పసిగట్టిన రవి, పోచయ్య నెమళ్లను వదిలేసి పారిపోయూరు. అటవీ అధికారులు నెమళ్లను స్వాధీనం చేసుకుని వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసేలోపే అవి మృతి చెందాయి. చనిపోయిన నెమళ్లకు పోస్టుమార్టం నిర్వహించి, రవి, పోచయ్యపై జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో తొమ్మిది మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో రవి, పోచయ్యలకు శిక్ష విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆర్నెల్లు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. -
వరంగల్ ఉపఎన్నికల బరిలో బీజేపి
-
'సూది సైకో' కోసం గాలింపు తీవ్రం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో విద్యార్థులు, మహిళలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న ఇంజక్షన్ సైకో కోసం పోలీసుల గాలింపు తీవ్ర తరం చేశారు. అందులోభాగంగా మెడికల్ రిప్రజెంటేటీవ్స్తో ఆదివారం పోలీసు ఉన్నతాధికారులు ఏలూరులో సమీక్ష నిర్వహించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో పని చేసి మానివేసిన కాంపౌండర్ల వివరాలను కూడా సేకరిస్తున్నారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇంజక్షన్లు విక్రయించవద్దని ఈ సందర్భంగా మెడికల్ షాపులకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సైకో కోసం జిల్లావ్యాప్తంగా 15 చెక్పోస్ట్లు ఏర్పాటు చేశారు. అలాగే 40కి పైగా ప్రత్యేక పోలీసులు బృందాలు సైకో కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడి ఊహాచిత్రం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాల్లో పోలీసులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. -
గంగమ్మే కాపాడింది..
సురక్షితంగా విశాఖ చేరుకున్న మత్స్యకారులు మల్కాపురం(విశాఖపట్నం): వేటకు బయలుదేరి గల్లంతైన జాలరులు ఎట్టకేలకు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు వేటకు ఈనెల 17నుంచి నడిసముద్రంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. గంగమ్మ తల్లే కాపాడిందంటూ వారు కంటతడి పెట్టారు. వివరాలిలా..కాకినాడ దుమ్మిలపేట,దుర్గమ్మవీది ప్రాంతానికి చెందిన అర్జిల అప్పారావు,కె.చిన్నారావు,దోని నర్సింహమూర్తి, దాసరి దానయ్య, పేల్ల మహేష్,అర్జిల శ్రీనులు ఈ నెల 16 తేదిన చేపల వేటకొసం కాకినాడ తీరం నుంచి బయలు దేరారు. మర్నాడు తుఫాన్ కారణంగా వర్షానికి సముద్రంలో చిక్కుకున్నారు. ఒడ్డుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వల,లంగర్ను ఉపయోగించి ఒడ్డుకు చేరేందుకు విఫలయత్నం చేశారు. ఈదుకుంటూ ఒడ్డుకు చేరాలనే ఆలోచనవచ్చినా సాధ్యంకాదని విరమించుకున్నారు. దీంతో తమ జీవితాలు అంతమయ్యాయని భావించారు. భయం..ఆందోళనల మధ్య ఐదు రోజుల పాటు తిండి,నిద్ర కరవైంది. ఈనేపథ్యంలో ఈనెల 22న వారికి ఆశారేఖగా దూరం నుంచి ఓ నౌక కనిపించింది. వెంటనే వీరికి కొత్త ఊపిరి వచ్చింది. హెచ్పీసీఎల్ అయిల్వార్ఫ్ వద్ద నాప్తా లోడు కోసం హల్దీయా ( నుంచి సపూర్ణస్వరాజ్ అనే నౌక విశాఖ వస్తున్న నౌక ఇది. రక్షించాలంటూ జాలర్లు తెలపువర్ణంతో కూడి వస్త్రాన్ని చూపడంతో నౌకా సిబ్బంది గమనించి కెప్టెన్ ఎం.వి.రాధికమీనన్ కు తెలిపారు. వెంటనే అమె నౌకపై నుంచి చూసి కొందరు ఆపదలో వున్నారని గుర్తించారు. సిబ్బంది వారిని చాకచక్యంగా బోటునుంచి నౌక పైకి తీసుకువచ్చారు. వెంటనే తినడానికి తిండి పెట్టియోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తరువాత హెచ్పీసీఎల్ యాజమాన్యానికి నౌక కెప్టెన్ ఫోన్లో సమాచారం అందించారు. వారు పోర్టు,మత్యశాఖ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. జిల్లా మత్యశాఖ అధికారులు వీరిని తరలించేందుకు పలు కారణాలు చూపారు. చివరకు హెచ్పీసీఎల్ ఈడీ శ్రీగణేష్ బాధితులను విశాఖకు తీసుకురాావాలని ఆదేశించారు. దీంతో బాధిత మత్స్యకారులను నౌకలో సోమవారం రాత్రి ఏడు గంటలకు విశాఖలో హెచ్పీసీఎల్ పైపుల్న్ వద్ద గల అయిల్వార్ఫ్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ కిందకు దిగిన మత్స్యకారులకు జిల్లా మత్యశాఖ జెడీ కోటేశ్వరావు,ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్,ఏపి మెకనైజిడ్ ఫిషింగ్ బోట్ అప్రేటర్స్ అసోసియోషన్ అధ్యక్షులు పి.సి.అప్పారావు,హెచ్పీసీఎల్ చీఫ్మెనేజర్ సి.హెచ్.రత్నకర్,మేనేజర్ హిందీ డాక్టర్ మహదేవ్,చీఫ్ మేనేజర్ నాగేశ్వరావు,టి.రామ్ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. అప్పటికే అక్కడున్న కుటుంబ సభ్యులను చూసిన మత్స్యకారుల ఆనందానికి అవధుల్లేవు. -
పాణాలతో వత్తామనుకోనేదు..
‘తిండీ తిప్పల్నేవు.. తాగేందుకు గుక్కెడు నీళ్లు నేవు.. కంటిమీద కునుకు నేదు.. ఏకంగా ఆరు రోజులు పగలు రాత్రి బిక్కు బిక్కుమంటూ నడిసంద్రంలో గడిపాం. అలల ఉధృతికి ఎటు పోతన్నామో తెలవనేదు. పెళ్లాం.. పిల్లల్ని మళ్లీ చూసుకుంటామన్న నమ్మకం నేదు. అసలు పాణాలతో బయటపడతామని కలలో కూడా ఊహించనేదు..’ ఇది సోమవారం తీరానికి చేరుకున్న గంగపుత్రుల ఆవేదన. - తిండీ లేదు.. తాగటానికి నీళ్లూ లేవు - భార్యా బిడ్డలను చూస్తామనుకోలేదు - ఎలా బతికామో ఆ దేవుడుకే తెలియాలి - తీరానికి చేరుకున్న విశాఖ, తూర్పుగోదావరి మత్స్యకారులు సాక్షి, విశాఖపట్నం: వేటకు వెళ్తేకాని వారికి పూటగడవదు. సముద్రంతో సహజీవనం చేస్తుంటారు. అలలతో పోరాటం చేస్తారు. కానీ ఏ అల వచ్చి కాటేస్తోందో..ఏ మృత్యుకెరటానికి బలవుతామో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిందే. వేటకెళ్లే మగవారు ఇంటికి చేరుకునే వరకు ఇంటిల్లిపాది కళ్లల్లో వత్తు లేసుకుని ఎదు రు చూడాల్సిందే.. ఇదీ గంగపుత్రుల జీవనం. గతేడాది హుద్హుద్ చేదుజ్ఞాపకాలు ఇంకా కళ్లెదుటనుంచి దూరం కాకుండానే ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగండం వారిని వణికించింది. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లి నడిసంద్రంలో చిక్కుకున్నారు. ఆరు రోజుల పాటు నరకం చూశారు. ఇంజిన్లు చెడిపోయాయి. సెల్ఫోన్లు, వైర్లెస్ సెట్లు మూగబోయాయి. వలలు గాలి వాటానికి కొట్టుకుపోయాయి.తెచ్చుకున్న వంట సామాగ్రి, బియ్యం, నిత్యావసరాలతో పాటు చివరకు మంచినీళ్లు కూడా సముద్రం పాలయ్యాయి. బోటు ఎటు వెళ్తుందో.. తామెక్కడ ఉన్నామో కూడా తెలియని పరిస్థితి. పగటి పూట ఎలా గడిపినా చీకటి పడితే ఏం జరుగుతుందో తెలియక క్షణమొక యుగంగా గడిపారు. నడిసంద్రంలో చుక్కాని లేని నావలా గడిపిన ఆ గంగపుత్రులు బతుకు జీవుడా అంటూ ఒడ్డుకు చేరుకున్నారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పది బోట్లు సోమవారం తీరానికి చేరుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా సుబ్బంపేట, హుకుంపేట, ఎస్.పెరుమాళ్లపురానికిచెందిన 59మంది విశాఖ ఫిషింగ్ హార్బర్కు చేరుకోగా,జిల్లా ఎస్.రాయవరానికి చెందిన మైలపల్లి కాశీరావు, మైలపల్లి కోటయ్యలు విజయనగరం జిల్లా చింతపల్లి రేవు వద్ద తీరానికి చేరుకున్నారు. పెరుమాళ్లపురానికి చెందిన బోట్నెంబర్ 424లో ఎం.జగ్గారావు, గంటా దేవుడు, ఎం.కుమారస్వామి, మైలపల్లి భూషిత్, మేరుగు రమణ, మేరుగు ఎల్లారి, బోటు నెంబర్ 1448లో సీహెచ్ కాశీరావు, పి.గోపి, ఎం.శ్రీను, సీహెచ్ చల్లారావు, జి.మాణిక్యం, టి.మాణిక్యంలతో పాటు ఉప్పాడ మండలం సుబ్బంపేటకు చెందిన బోట్ నెంబర్ 9320లో చొక్కా ఎల్లయ్య, సూరాడి తాతబాబు, సూరాడ గోవిందు, సూరాడదుర్గ, మైలపల్లి యోహాను, కుప్పరి నాగేశ్వరరావు, గరికిన గంగ రాజులు సురక్షితంగా సోమవారం తీరానికి చేరుకున్నారు. విశాఖ మత్స్యశాఖ ఏడీ కోటేశ్వరరావు వీరు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. -
‘మిషన్’కు నిధుల వేట!
సాక్షి, హైదరాబాద్: రానున్న ఐదేళ్లలో సుమారు రూ.25 వేల కోట్ల ఖర్చుతో 46 వేల చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ లక్ష్యంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్), మరమ్మతు, నవీకరణ, పునరుద్ధరణ (ట్రిపుల్ఆర్)ద్వారా కొంతమేర నిధులు రాబట్టుకోవడంలో సఫలమైన ప్రభుత్వం వరల్డ్బ్యాంకు, జైకా (జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ) నిధులను తెచ్చుకునే ప్రయత్నాల్లో మునిగింది. మొత్తంగా 46,531 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ ఏడాది 9,577 చెరువులను లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 4,873 చెరువుల పనులు ఆరంభమై పనులు కొనసాగుతున్నాయి. మున్ముందు పనులకు నిధుల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం నాబార్డ్, కేంద్రాన్ని సాయం కోరింది. చిన్న తరహా సాగునీటి పథకాల నిర్మాణంలో భాగంగా 1,600 చెరువులకు రూ.380 కోట్లు ఇచ్చేందుకు నాబార్డ్ ముందుకొచ్చింది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా 90 శాతం, 10 శాతం వాటాలతో ట్రిపుల్ఆర్ పథకం కింద 335 చెరువుల పునరుద్ధరణకు రూ.292 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సానుకూలత తెలిపింది. మరో రూ.2,500 వేల కోట్ల కోసం... సామాజిక ఆధారిత చెరువుల నిర్వహణ ప్రాజెక్టు కింద సుమారు 5వేల చెరువుల పునరుద్ధరణకు రూ.2,500 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రపంచ బ్యాంకుతో చర్చలు జరిపేందుకు సమాయత్తమయ్యారు. గతంలో సైతం వరల్డ్ బ్యాంకు 1,182 చెరువుల పునరుద్ధరణకు రూ.436 కోట్లు కేటాయించింది. ఇక జైకా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టిన సర్కారు చిన్నతరహా వనరుల పునరుద్ధరణకు వారి నుంచి ఆర్థిక చేయూత కోసం ప్రయత్నిస్తోంది. -
వేట
ఎక్కడో అడవిలో తలదాచుకుంటున్న వన్యప్రాణులు పలువురు మానవ మృగాల చేతిలో ప్రాణాలు వదులుతున్నాయి. జల్సాలకు అలవాటుపడ్డ వారు అటవీ జంతువులను హతమారుస్తున్నారు. తమ సరదాల కోసం మూగజీవాలను బలితీసుకుంటున్నారు. ఇందుకు జన్నారం పరిధిలోని టైగర్జోన్ను ఎంచుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక జీవి ప్రాణాలు తీస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. అటవీ అధికారులేమో పలుచోట్ల బాధితులను పట్టుకుంటున్నా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా వన్యప్రాణుల వేట మాత్రం ఆగడం లేదు. ఉట్నూర్ : జన్నారం వైల్డ్లైఫ్ అటవీ డివిజన్ (వన్యప్రాణి సంరక్షణ విభాగం) పులుల సంరక్షణ కేంద్రం వేటగాళ్లకు నిలయంగా మారింది. కేంద్ర ప్రభుత్వం కవ్వాల్ అటవీ ప్రాంతాన్ని 42వ టైగర్ జోన్గా గుర్తించింది. కవ్వాల్ అభయారణ్యం వన్యప్రాణి విభాగంలో అధికారిక లెక్కల ప్రకారం 673 రకాల మొక్కలు, పది రకాల ఉభయచర జంతువులు, 34 రకాల సరిసృపాలు, 270 రకాల పక్షి జాతులు, 75 రకాల క్షీరజాతులు మనుగడ సాగిస్తున్నాయి. అడవులు వేగంగా అంతరిస్తుండడంతో వాటికి మనుగడ లేకుండాపోతోంది. పదుల సంఖ్యలో వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. కవ్వాల్ అభయారణ్యంలో వన్యప్రాణుల రక్షణకు అటవీ అధికారుల నిఘా అంతంత మాత్రంగానే ఉండడంతో నిత్యం ఏదో ఒక చోట అటవీ జంతువుల బలవుతున్నాయి. మామూళ్లకు కక్కుర్తి పడి కొంత మంది కిందిస్థాయి అటవీ సిబ్బంది వేటగాళ్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రిళ్లు బ్యాటరీలు, బరిసెలు, వలలు, విద్యుత్ వైర్లు, బైండింగ్ తీగలు తదితర సామగ్రితో వేటగాళ్లు అడవుల్లోకి వెళ్లి వాటిని వెంటాడుతున్నారు. రాత్రి వేళ జంతువులు దాహార్తి తీర్చుకోడానికి సాసర్వెల్స్, గ్రామాల సమీపంలో ఉండే చెరువులు, ఇతర నీటి వనరుల ప్రాంతాలకు వస్తుంటారు. ఆ సమయంలో వేటగాళ్లు మాటువేసి వాటిని వేటాడుతున్నారు. జంతువులకు తాగునీరందించేందుకు అటవి శాఖ వారు ఏర్పాటు చేసిన సాసర్వెల్స్ను వేటగాళ్లు వేటకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అభయారణ్యంలోని బీర్సాయిపేట, తాళ్లపేట, జన్నారం, ఇందన్పల్లి అటవీ రేంజ్ల్లోని పలు బీట్లలో జంతువుల వేట ముమ్మరంగా సాగుతోంది. ఆదివారం వచ్చిందంటే.. వీకెండ్ అయిన ఆదివారం వచ్చిందంటే చాలు ఉట్నూర్, జన్నారం పట్టణ ప్రాంతాలతోపాటు ఇందన్పల్లి, ఖానాపూర్, బీర్సాయిపేట తదితర గ్రామాలు వన్యప్రాణుల మాంసంతో నిండిపోతున్నాయి. వేటగాళ్లు నేరుగా ఇళ్లలోకి మాంసాన్ని సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం పలువురిని ఏజెంట్లుగా కూడా పెట్టుకుంటున్నారు. ముందుగానే ఎవరెవరికి ఏ మాంసం ఎంత కావాలో వివరాలు తీసుకుంటూ.. లేదా గ్రామానికి చెందిన వారే పలువురు వేటగాళ్లతో నేరుగా ఫోన్లో కోడ్ భాషలో మాట్లాడుతూ మాంసాన్ని తెప్పించుకుంటున్నారు. ఇదంతా ఉదయం నాలుగు గంటల నుంచి 6 గంటలలోపే జరిగిపోతోంది. మరికొందరేమో ఆడవారిని రంగంలోకి దింపి వన్యప్రాణుల మాంసాన్ని ఆటో, జీప్ ప్రయాణాల ద్వారా మంచిర్యాల, లక్సెట్టిపేట, నిర్మల్, ధర్మపురి, జగిత్యాల, కరీంనగర్, గోదావరిఖని ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. పలు వ్యాధులున్న వారికి ఫలానా జంతువు మాంసం తింటే తగ్గిపోతుందని ప్రచారంలో ఉండడంతో వాటికి సంబంధించి ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. ఒక్కో వన్యప్రాణి మాంసం కిలో ధర రూ.400 నుంచి రూ.1200 వరకు పలుకుతోంది. దీంతో ఈ అక్రమ దందా రూ.లక్షల్లోనే జరుగుతోంది. ఈ వ్యవహారంలో సంబంధిత శాఖకు చెందిన పలువురు అధికారులకు హస్తం ఉండడంతో దందా గుట్టుచప్పుడు కాకుండా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. నిఘా అంతంతే.. 1965లో కవ్వాల్ను అటవి ప్రాంతంగా గుర్తించిన ప్రభుత్వాలు 1972లో వన్యప్రాణి సంరక్షణ విభాగంగా గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత 2011లో కవ్వాల్ అభయారణ్యంలో 892.23 చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియాగా.. 1,119.68 చదరపు కిలోమీటర్లు బఫర్ ఏరియాగా గుర్తిస్తూ 42వ పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. దీంతో వన్యప్రాణులను అన్నిరకాలు రక్షించేందుకు వేట నిరోధక దళాలు అటవీ సెక్షన్ అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలనూ నియమించింది. ఈ బృందాలు నిరంతరం అడవుల్లో తిరుగుతూ వన్యప్రాణులను సంరక్షించాలి. కానీ.. వన్యప్రాణులను కాపాడడంలో వారు విఫలమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిలో కొంత మంది ఎనిమల్ ట్రాకర్స్, బేస్ క్యాంపుల్లోని వారు వేటగాళ్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కింది స్థాయి సిబ్బంది నిఘా లోపంతో అడవుల్లో యథేచ్ఛగా వేటా సాగుతోంది. దీనికితోడు అడవులు వేగంగా అంతరిస్తుండడంతో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది..!! కేసులు సరే.. చర్యలేవీ..? జన్నారం వైల్డ్లైఫ్ డివిజన్లోని ఇందన్పల్లి, తాళ్లపేట, బీర్సాయిపేట, జన్నారం అటవీ రేంజ్ల పరిధిలో జనవరి 2011 నుంచి ఇప్పటివరకు ఏడు నీలుగాయిలు, మూడు దుప్పిలు, ఐదు అడవి పందులు, ఒక కొండగొర్రె, రెండు సాంబర్లు, ఒక చిరుత, ఐదు చుక్కల దుప్పిలు, ఒక సింగోళి, నాలుగు జింకలు వేటగాళ్ల ఉచ్చుకు బలయ్యాయి. ఇందుకు దాదాపు 86 మంది వేటగాళ్లపై కేసులు నమోదైనట్లు సమాచారం. గత నెల ఐదో తేదీన జన్నారం అటవీ రేంజ్ పరిధిలోని అడవిలో నీలుగాయిని వే టాడి మాంసం విక్రయిస్తున్న వారిని అటవీ అధికారులు పట్టుకున్నారు. అల్లినగర్కు చెందిన 19 మందిపై కేసులు నమోదు చేశారు. అదీకాక వెలుగులోకి రాకుండా మరెన్నో వన్యప్రాణులు బలి అవుతూనే ఉన్నాయి. అయితే.. వేటగాళ్లపై కేసులు నమోదు చేస్తున్న అధికారులు ఆ తదుపరి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వేటగాళ్లపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పులులు మిమిక్రీ చేస్తాయా?!
జంతు ప్రపంచం ►పుట్టిన తర్వాత ఓ వారం రోజుల వరకూ పులులకు కళ్లు కనిపించవు. ఆ తర్వాతే మెల్లగా అన్నీ కనిపిస్తాయి. చూపు స్పష్టమవడానికి కాస్త సమయం పడుతుంది. పులికి ఎంత బలముంటుందంటే... అది తనకంటే రెండు రెట్లు పెద్దదైన జీవిని కూడా చాలా తేలిగ్గా చంపేయగలదు! ►ఆహారం విషయంలో పులులు చాలా స్వార్థంగా ఉంటాయి. ఒక జంతువును చంపి తిన్న తర్వాత ఇంకా మిగిలితే... దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి, ఆకులతో కప్పి మరీ దాచిపెడతాయి. ఆ తర్వాత మళ్లీ ఆకలేసినప్పుడు వెళ్లి తింటాయి! ►పులి పిల్లలు రెండేళ్ల వరకూ తల్లిని అంటిపెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే అవి పద్దెనిమిది నెలల వరకూ వేటాడలేవు. అందుకే వేటలో నైపుణ్యం సంపాదించాక గానీ తల్లిని వదిలి వెళ్లవు! ►ఇవి ఒంటరిగా వేటాడటానికి ఇష్టపడతాయి. పైగా రాత్రిపూటే వేటాడతాయి! ►ఎంత ఒంటరిగా ఉండటానికి ఇష్టపడినా, సాటి పులి విషయంలో ఇవి చాలా స్నేహంగా మెలగుతాయి. తాను ఆహారాన్ని తింటున్నప్పుడు అక్కడికి మరో పులి వస్తే, దానికి తమ ఆహారాన్ని పంచుతాయివి! ఎందుకంటే, పులి ఆహారం కోసం, తనను తాను రక్షించుకోవడం కోసం తప్ప ఏ ప్రాణినీ చంపదు. పరిశీలిస్తుందంతే. అందుకే ఎప్పుడైనా పులి ఎదురుపడితే కంగారుపడి దాన్ని రెచ్చగొట్టకుండా... దాని కళ్లలోకే చూస్తూ, మెల్లగా వెనక్కి నడుస్తూ పోవాలని జీవ శాస్త్రవేత్తలు చెబుతుంటారు! ►పులులకు మిమిక్రీ చేయడం తెలుసు. ఒక్కోసారి వేటాడబోయే జంతువుని మోసగించడానికి, ఆ జంతువులాగే శబ్దాలు చేయడానికి ప్రయత్నిస్తాయి! పులుల జ్ఞాపకశక్తి మనుషుల కంటే ముప్ఫైరెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి అవి దేనినైనా గుర్తు పెట్టుకున్నాయంటే... చనిపోయేవరకూ మర్చిపోవు. -
కొత్త నియోజకవర్గం వేటలో బొత్స
-
వేటకు వెళ్లి.. ప్రియురాలిని కాల్చేసిన ప్రియుడు
ఓ అమ్మడు తన ప్రియుడితో కలిసి వేటకు వెళ్లింది. అక్కడ ఆమె పొదలచాటుగా నక్కి వెళ్లేసరికి.. లేడిపిల్ల దొరికిందనకుంటూ ఆ ప్రియుడు తన తుపాకి గురిపెట్టి కాల్చాడు. అంతే, బుల్లెట్ కాస్తా అమ్మడి కాల్లోకి దిగిపోయింది!! ఈ సంఘటన అమెరికాలో జరిగింది. ప్రియురాలు ఆడ్రే మేయో (24)ను తుపాకితో కాల్చినందుకు జార్జియాకు చెందిన మాథ్యూ టైలర్ వెబ్ (23)పై పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్లిద్దరూ కలిసి వెబ్ ఇంటి డాబా మీదకు వెళ్లారు. అక్కడకు సమీపంలో ఉన్న అడవిలో కొన్ని లేళ్లు వెళ్తున్నాయి. దాంతో వాటిని వేటాడాలని మాథ్యూ అనుకున్నాడు. ముందుగా ఆమె ఇంటివద్దే ఉండిపోదామనుకున్నా, తర్వాత తానూ వస్తానంది. ఇంతలో పొదలమాటున ఏదో సవ్వడి వినిపించడంతో మాథ్యూ తన తుపాకి తీసుకుని కాల్చాడు. కానీ లేడిపిల్ల అరుపులకు బదులు తన స్నేహితురాలి కేక వినిపించింది. వెంటనే అక్కడకు వెళ్లి తన జాకెట్ తీసి కాలి గాయం చుట్టూ కట్టాడు. మేయో అక్కడినుంచి ఆస్పత్రికి వెళ్లింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. అయితే, రోడ్డుకు 150 అడుగుల దూరంలో తుపాకితో కాల్పులు జరిపినందుకు గాను మాథ్యూపై కేసు నమోదుచేశారు.