illegal transport
-
సీఎం సొంత నియోజకవర్గంలో అక్రమ గ్రానైట్ రవాణా
-
పెన్నా నదిలో ‘వసూళ్ల గేటు’
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అనుచరుడు గుర్రప్ప అలియాస్ గురివిరెడ్డి ఏకంగా పెన్నా నదిలో అనధికార గేటు పెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. ఒంటెద్దు బండికి రూ.150, రెండు ఎడ్ల బండ్లకు రూ.300, ట్రాక్టర్కు రూ.1,000 నుంచి రూ.1,200 చెల్లిస్తే కానీ పెన్నా నదిలోకి అనుమతించడం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా పెన్నా నదిలో గేటు ఏర్పాటు చేశారు. గ్రామ పరిధిలోని కొందరు వ్యక్తులు పెన్నా నదిలోని ఇసుకకు మీకు ఎందుకు గేటు చార్జీలు చెల్లించాలని సోమవారం వాగ్వాదానికి దిగడంతో ఈ పంచాయితీ రూరల్ పోలీస్ స్టేషన్కు చేరింది. అయినా ఫలితం లేకపోయింది. గేటు దగ్గర వసూళ్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.అక్రమ రవాణాకు అడ్డారామాపురం గ్రామం ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. పెన్నా నది ఒడ్డునే గ్రామం ఉండటంతో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఇక్కడ నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మండల పరిధిలోని పెన్నా నది పరీవాహక గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. -
కరీంనగర్లో పొన్నం ట్యాక్స్
సాక్షి, హైదరాబాద్: రామగుండం ఎన్టీపీసీ విద్యు త్ కేంద్రం నుంచి ఫ్లైయాష్ (బూడిద) తరలింపులో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. కరీంనగర్లో రేవంత్, పొన్నం ట్యాక్స్ అమలవుతున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, డాక్టర్ సంజయ్తో కలిసి తెలంగాణభవన్లో కౌశిక్రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. 32 టన్నుల బూడిద తరలించాల్సిన లారీలో 72 టన్నులు తరలిస్తున్నారని, వే బిల్లుల్లో ఎన్ని టన్నులు తరలిస్తున్నారనే విషయం పేర్కొనడం లేదని చెప్పారు.బూడిద అక్రమరవాణా ద్వారా మంత్రి పొన్నం రోజూ రూ.50 లక్షలు సంపాదిస్తుండగా, ఆయన అన్న కుమారుడు అనూప్ ఈ వసూ ళ్లు చేస్తున్నారన్నారు. ఓవర్లోడ్తో వెళుతున్న 13 లారీలను ఇటీవల తాను స్వయంగా పట్టుకొని అధికారులకు అప్పగించినా, రెండు లారీ లు సీజ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలను తాను పట్టుకోవడంతో రూటు మార్చి హుస్నా బాద్ మీదుగా దందా కొనసాగిస్తున్నారని కౌశిక్రెడ్డి చెప్పారు. ఇకపై ఏ మార్గంలో ఫ్లైయాష్ తరలించినా బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుంటారని హెచ్చరించారు. ఓవర్లోడ్తో వెళుతు న్న ఫ్లైయాష్ లారీల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థి అఖిల్ మరణించాడన్నారు. ఎన్టీపీసీ వివరాలు దాచిపెడుతోంది ఫ్లైయాష్ అక్రమ రవాణా జరుగుతున్నా, ఎన్టీపీసీ అధికారులు వివరాలు దాచిపెడుతూ చోద్యం చూ స్తున్నారని కౌశిక్రెడ్డి అన్నారు. అధికారుల తీరుపై ఢిల్లీలో ఆ సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా మని చెప్పారు. ఓవర్లోడ్ దందాపై బీఆర్ఎస్ కేడ ర్ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందన్నారు. తప్పు లు చేస్తున్న అధికారుల వివరాలు రెడ్బుక్లో నమో దు చేసి అధికారంలోకి వచి్చన తర్వాత చర్యలు తప్పవని హెచ్చరించారు. హరీశ్రావుపై ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ అనవసర విమర్శలు చేస్తున్నారని, ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే హరీశ్రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చే స్తారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. -
పోలీసులుగా మీకు ఆత్మగౌరవం లేదా? హోంమంత్రి తీవ్ర వ్యాఖ్యలు
Karnataka Home Minister Araga Jnanendra Slams Cops: కర్ణాటక హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర పోలీసులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు వైరల్గా మారాయి. పశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకుంటారని పోలీసులుపై మండిపడ్డారు. కొంతమంది పోలీసులు లంచాలు తినే కుక్కల్లా బతుకుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడిన వీడియో రికార్డింగ్ వైరల్గా మారింది. అయితే పుశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకొని కొంతమంది పోలీసులు వారిని వదిలేస్తున్నారని, విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆత్మగౌరవం ఉండదా? అని ప్రశ్నించారు. వధించడం కోసం పశువులను రవాణా చేయడం కర్ణాటక ప్రభుత్తం నిషేధించిన విషయం తెలిసిందే. తాను పోలీసులందరినీ విమర్శించడం లేదని, డబ్బు కోసం పశువుల అక్రమ రవాణాదారులతో కుమ్మక్కైన పోలీసులను మాత్రమే విమర్శిస్తున్నానని తెలిపారు. -
బూడిదకు భారీగా వసూళ్లు
సాక్షి, పాల్వంచ: కేటీపీఎస్ నుంచి వెలువడే బూడిద (యాష్) తరలింపులో వసూళ్ల దందా సాగుతోంది. అధికారుల అండదండలతో కొందరు ప్రైవేటు వ్యక్తులు భారీగా డబ్బు దండుకుంటున్నారు. బూడిదను తరలించాలంటే చేయి తడపనిదే బండి కదలని పరిస్థితి నెలకొంది. ఈ బూడిదను ఉచితంగా అందించాల్సి ఉండగా.. పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు ముట్టజెపితే వెంటనే లోడ్ చేయడం, లేదంటే వెయిటింగ్ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. అధికారులు తమ చేతికి మట్టి అంటకుండా ప్రైవేట్ వ్యక్తులతో ఈ దందాను ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్న చందంగా విస్తరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ఓఅండ్ఎం, 5, 6, 7 దశల్లో విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో బొగ్గును మండించడం ద్వారా నిత్యం బూడిద విడుదల అవుతుంది. దీన్ని పుల్లాయిగూడెం, సురారం తదితర ప్రాంతాల్లో ఉన్న యాష్ పాండ్లకు పంపిస్తుంటారు. సిమెంట్ ఫ్యాక్టరీలకు, ఇతర అవసరాలకు మెట్రిక్ టన్నుకు రూ.50 చొప్పున ముందే డీడీ రూపంలో చెల్లిస్తే బూడిదను అందిస్తారు. అయితే సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే ట్యాంకర్లకు బూడిద అందించే క్రమంలో చేతివాటం ప్రదర్శిస్తుండడం ఇక్కడ ‘మూమూలు’గా మారింది. ఇక ఉచితంగా అందించే వారినుంచి అయితే వేల రూపాయలు దండుకుంటున్నారు. డబ్బు ఇవ్వని వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి రోజూ వందల సంఖ్యలో ట్యాంకర్లు, టిప్పర్లు, లారీలు వస్తుంటాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్థానికంగా కొందరు ప్రైవేట్ వ్యక్తులు జోక్యం చేసుకుని భారీ ఎత్తున అక్రమాలకు తెరలేపుతున్నారు. రవాణా చేసే క్రమంలో లారీలపై కనీసం పట్టాలు కూడా కట్టుకోకుండా వెళుతున్నారని పలువురు వాపోతున్నారు. లబోదిబోమంటున్న బ్రిక్ వ్యాపారులు... యాష్ పాండ్ల నుంచి బూడిదను తీసుకెళ్లేందుకు కొందరు జెన్కో యాజమాన్యం నుంచి అనుమతి తీసుకుని లారీల ద్వారా తరలిస్తుంటారు. అంతేగాక సైలోల నుంచి కూడా తీసుకెళుతుంటారు. ఈ క్రమంలో ఒక్కో లారీకి కనీసం రూ.1000 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తుంటారు. ఇలా అక్రమంగా వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయి అధికారికి బండికి రూ.500 ఇవ్వాలని, కింది స్థాయిలో మామూళ్లు యథావిధిగా ఉంటాయని చెపుతూ వేల రూపాయలు వసూలు చేస్తున్నారని పలువురు బ్రిక్స్ ఇండస్ట్రీ నిర్వాహకులు వాపోతున్నారు. ఈ వ్యాపారులే కాకుండా భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, వరంగల్, గుడివాడ తదితర ప్రాంతాల నుంచి రోజుకు 400 పైగా వాహనాల్లో బూడిద తరలిస్తున్నారంటే ఈ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ వ్యక్తులకు గాకుండా నేరుగా బ్రిక్స్ కంపెనీలు, సిమెంట్ ఫ్యాక్టరీల వారికే బూడిద చేరేలా చర్యలు తీసుకోవాలని, పైవేట్ దందాపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. మా దృష్టికి తీసుకొస్తే చర్య తీసుకుంటాం డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. డబ్బు తీసుకుని బూడిదను అందించకూడదు. అలా ఇబ్బంది పడిన వ్యక్తులు ఎవరైనా నేరుగా మాకు ఫిర్యాదు చేస్తే తప్పక చర్య తీసుకుంటాం. – రవీందర్, ఇన్చార్జ్ సీఈ -
పొదలకూరులో అక్రమంగా తరలిస్తున్న నగదు స్వాధీనం
-
ఇసుక అక్రమ రవాణాపై దాడులు
ప్రొద్దుటూరు క్రైం : ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. స్వయంగా డీఎస్పీ దాడులు నిర్వహించారు. డీఎస్పీ ఎప్పుడు బయటికి వెళ్లినా గన్మెన్ ఉంటారు. ప్రభుత్వం కేటాయించిన వాహనంలోనే ఆయన ఎక్కడికైనా వెళ్తారు. అయితే ప్రొద్దుటూరు డీఎస్పీ మాత్రం మంకీ క్యాప్ ధరించి, బైక్పై వెళ్లారు. వివరాల్లోకి వెళితే.. శనివారం వేకువజామున పెన్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో డీఎస్పీ శ్రీనివాసరావు దాడులు నిర్వహించారు. మంకీ క్యాప్ ధరించి బైక్లో పెన్నా నదికి వెళ్లే రహదారి వద్దకు వెళ్లారు. పెన్నా నదిలో కొన్ని ట్రాక్టర్లకు ఇసుకను నింపుకుంటూ ఉండగా పోలీసుల రాకను గమనించడానికి కొందరు ఫైలెట్లు బైపాస్ రోడ్డులో నిల్చున్నారు. డీఎస్పీ నేరుగా వారి వద్దకు వెళ్లి బైక్ ఆపారు. అయితే మంకీ క్యాప్ పెట్టుకొని ఉండడంతో వారు డీఎస్పీని గుర్తు పట్టలేదు. అక్కడే 15 నిమిషాల పాటు నిల్చొని ఉండి డీఎస్పీ వారి సంభాషణలు విన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఏమైనా ఉందేమోనని ఆరా తీశారు. తర్వాత మంకీ క్యాప్ను తొలగించి అక్కడున్న ఫైలెట్లను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. డీఎస్పీని చూసి ట్రాక్టర్ల డ్రైవర్లు పరారయ్యారు. అయితే ఒక ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ను పట్టుకొని స్టేషన్కు తరలించారు. కఠిన చర్యలు పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. రోజూ ఇసుక రవాణా చేస్తున్న వారిని గుర్తించి బైండోవర్ చేయాలని వన్టౌన్ సీఐ రామలింగరాజును ఆదేశించారు. డీఎస్పీ స్వయంగా దాడులకు పూనుకోవడంతో ఇసుకాసురుల్లో వణుకు పుడుతోంది. ఇసుక రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిని వన్టౌన్కు పిలిపించి డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇకపై ఇలా జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. -
అటు కలప.. ఇటు ఇసుక
ఇందల్వాయి : మండలంలో వాగులు, ఆడవులు పు ష్కలంగా ఉన్నా రెవెన్యూ, ఫారెస్టు అధికారుల పర్యవేక్షణ, సమన్వయ లోపం వల్ల క్రమేపీ అవి చీకటి దందా చేస్తున్న అక్రమార్కుల చేతుల్లో పడి వాటి సహజ స్వరూపాన్ని కోల్పోతున్నాయి. ఇసు క, కలప అక్రమ రవాణదారులపై నామమాత్రపు దాడులు చేస్తున్నా అధికారులు వారికి చట్టరీత్యా సరైన శిక్షలు వేయించడంలో విఫలమవుతుడటం తో వారు మళ్లి పాత దందానే కొనసాగిస్తున్నారు. అధిక దనార్జనే లక్ష్యంగా అడవుల్ని నరుకుతు, వా గుల్ని తవ్వుతూ ఇసుక, కలపను అక్రమంగా రవా ణ చేస్తూ ప్రకృతి స్వరూపాన్నే మార్చుతూ రైతు లకు, సామాన్య ప్రజలకు పరోక్షంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మా ణాలు, సీసీ రోడ్లు అని అభివృద్ధి పనుల పేరుతో అనుమతులు తీసుకొని నల్లవెల్లి, గౌరారం, మల్లా పూర్, లోలం, లింగాపూర్, సిర్నాపల్లి వాగుల్లోంచి అనధికారంగా రాత్రి వేళల్లో ఇష్టరాజ్యంగా ఇసుక ను తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని, అడవుల్లోని విలువైన కలప కూడా కింది స్థాయి అటవీ శాఖ అధికారుల కనుసన్నల్లోనే రాత్రి వేళల్లో అక్రమరవాణ జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాగుల్లోకి, ఆడవుల్లోకి ట్రాక్టర్లు వెళ్లకుండా అధికారులు నామ మాత్రపు కందకాలు తవ్వుతున్నా వాటిని పూడ్చేసి మరీ అక్రమార్కులు తమ దందాను కొనసాగిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అక్రమార్కుల ధనదాహానికి అడవులు తరిగిపోయి వన్యప్రాణలు జనావాసాల్లోకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. ఈ దుండగుల వికృత చేష్టలకు సరిపడా వర్షాలు పడట్లేదని, వాగుల్లో ఇసుక లేకపోవడంవల్ల భూగర్భ జలాలు పెరగడంలేదని, అడవుల్లో ఆశ్రయం లేక వన్యప్రాణులు గ్రామాల్లోకి, పంట పొలాల్లోకి వచ్చి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రకృతిని నాశనం చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న చీకటి దందాకోరులపై రెవెన్యు,ఫారెస్టు, పోలీసు అధికారులు సమన్వయంతో మూకుమ్మడి దాడు లు చేసి వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని, విలువైన ప్రకృతి సంపదలకు రక్షణ కల్పించి ప్రకృతి సమతుల్యతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
ద్వారకా తిరుమల గవర్నమెంట్ హాస్టల్లో అరాచకం
-
నిబంధనలకు విరుద్ధంగా వెదురు రవాణా
శృంగవరపుకోట రూరల్ : మండలంలోని బొడ్డవర పంచాయతీ శివారు గాదెల్లోవ గిరిజన ప్రాంతం నుంచి నిబంధనలకు విరుద్ధంగా వెదురు రవాణా జరుగుతోంది. గాదెల్లోవ ప్రాంతం నుంచి వెదురు మోపులు రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన విషయమై బుధవారం ఉదయం విలేకరులకు సమాచారం అందింది. దీంతో విలేకరులు ఆ ప్రాంతానికి వెళ్లే సరికి భారీ సంఖ్యలో వెదురు మోపులు రవాణాకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వెదురు మోపులు ఉంచిన స్థలంలోను, చుట్టు పక్కల మనుషుల జాడ మాత్రం లేదు. వెదురు మోపుల రవాణా విషయమై బొడ్డవర వద్ద పలువురిని ప్రశ్నించగా ఎప్పటికప్పుడు గాదెల్లోవ, దబ్బగుంట, తదితర ప్రాంతాల నుంచి వెదురుతో పాటు ఇతర కలప కూడా పెద్ద ఎత్తున రవాణా జరుగుతోందని స్పష్టం చేశారు. అలాగే కాశీపట్నం, తదితర ఏజెన్సీ ప్రాంతాల నుంచి బొగ్గు మూటలు కూడా క్రమం తప్పకుండా సైకిళ్లపై అక్రమంగా తరలుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అటవీశాఖ సిబ్బంది, అధికారులు మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. వెదురు మోపుల అక్రమ రవాణా విషయమై విజయనగరం రేంజ్ అటవీశాఖ గార్డు బ్రహ్మాజీ వద్ద ప్రస్తావించగా, గాదెల్లోవ ప్రాంతం విశాఖ జిల్లా అనంతగిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా గిరిజన ప్రాంతాల నుంచి జరుగుతున్న వెదురు, కలప, బొగ్గుల రవాణాపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత..!
రేగోడ్(మెదక్): నల్ల మట్టి కాసుల వర్షం కురిపిస్తోంది.. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అక్రమార్కులు చెరువును కొల్లగొడుతూ నల్లమట్టిని జిల్లా దాటిస్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. ఈ తతంగం సోమవారం వెలుగుచూసింది. మండలంలోని కొత్వాన్పల్లి చెరువు మరమ్మతు కోసం రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో సుమారు రూ. 46 లక్షలు మంజూరు చేసింది. పూడిక తీతలో భాగంగా చెరువులో మట్టిని తీస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏ గ్రామంలోని చెరువు మట్టిని ఆ ఊరి రైతులే తీసుకెళ్లాలి. ఇతర వ్యక్తులు ఎవరూ మట్టిని తీసుకోకూడదు. కానీ ఇక్కడ ఏకంగా మెదక్ జిల్లా కొత్వాన్పల్లి చెరువు నుంచి సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామ శివారులోకి టిప్పర్లలో నల్లమట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నా అడిగేనాథడు లేకుండా పోయారు. నల్లమట్టికి డిమాండ్ ఉండటంతో ఇదే అదనుగా భావించిన కొందరికి వరంగా మారింది. టిప్పర్లను లీజ్కు తీసుకుని వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్ల మట్టి మాయలో పడిన కొందరు చెరువును తోడేస్తున్నారు. నల్లమట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చెరువును తవ్వేస్తున్నా.. అధికారులది ప్రేక్షక పాత్రా..? లేక వారికి తెలియకుండానే దందా జరుగుతోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నల్లమట్టిని ఏకంగా జిల్లానే దాట వేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ తతంగంపై విచారణ జరిపించాలని పలువురు పేర్కొంటున్నారు. -
ఖజానాకు గండి
దేశంలోనే ప్రసిద్ధి చెందిన తాండూరు నాపరాతి అక్రమంగా తరలిపోతోంది. నిత్యం వందకు పైగా లారీలు రాయల్టీ లేకుండా.. రాయల్గా సరిహద్దులు దాటుతున్నాయి. చెక్పోస్టుల వద్ద నిఘా కరువైంది. దీంతో సర్కారీ ఆదాయానికిగండి పడుతోంది. ఈ తంతు చానాళ్లుగా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. తాండూరు : తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్ మండలాల్లో వేలాది ఎకరాలలో నాపరాతి నిక్షేపాలున్నాయి. తాండూరు మండలంలోని ఓగిపూర్, మల్కాపూర్, కొటబాసుపల్లి, కరన్కోట్, సిరిగిరిపేట్లో, బషీరాబాద్ మండలంలోని ఎక్మాయి, కొర్విచెడ్, నవల్గ, క్యాద్గిరా, జీవన్గిలో ఈ సహజ సంపద విరివిగా లభిస్తోంది. ఆయా గ్రామాల్లోని గనుల నుంచి వెలికితీçస్తున్న నాపరాతిని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. తాండూరు నుంచి నిత్యం సూమారు 400 లారీల వరకు నాపరాయి రవాణా అవుతోంది. తెలంగాణలోని జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఒడిశా, ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అయితే ప్రతీరోజు వందలాది లారీల్లో నాపరాయి రవాణా జరుగుతున్నా కొన్నింటి నుంచి మాత్రమే రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఫీజు అందుతోంది. మిగతా వాహనాలు ఎలాంటి ఫీజులు లేకుండానే యథేచ్ఛగా తరలివెళ్తున్నాయి. రాయల్టీ లేకుండా రవాణా సాగిస్తున్న వ్యాపారులు, ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు 50 నుంచి 70 లారీల వరకు రాయల్టీ లేకుండా రవాణా.. నాపరాతి తరలింపు పర్యవేక్షణ కోసం భూగర్భ వనరుల శాఖ ఆధ్వర్యంలో తాండూరు మండలం గౌతాపూర్, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ సర్కిల్ళ్ల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే సంబంధిత సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహించడం లేదు. చెక్పోస్టుల నిర్వహణ బాధ్యతలను హోంగార్డులే చూసుకుంటున్నారు. మైనింగ్ మాఫియా పెద్దల హస్తంలో ఉండటంతో అందినకాడికి దండుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ ఖజనాకు గండి.. తాండూరు ప్రాంతంలో ఖనిజ సంపద తరలింపులో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. నాపరాతి రవాణాతో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వ్యాపారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. -
రేషన్బియ్యం పట్టివేత
గద్వాల క్రైం: ఇది నా ఇలాఖా.. ఇక్కడి ప్రాంతాల్లో పేదల రేషన్ బియ్యానికి నేనే పెద్ద డేగను..! నా కళ్లు గప్పి నా ప్రాంతంలోని రేషన్ బియ్యం విక్రయాలు చేసి తీసుకువెళ్తావా.. అంటూ గద్వాలకు చెందిన ఓ ముఠా సభ్యులు ఆక్రోశం..? ఎక్కడైతే ఏంటి.. కారుచౌకగా బియ్యం దొరుకుతాయంటే ఎవరి ప్రాంతంలోనైనా గుట్టుగా కొని సొమ్ము చేసుకుంటాం అంటూ.. కేటీదొడ్డి మండలానికి చెందిన మరో ముఠా సభ్యుల ఎదురుదాడి..!? ఇలా రెండు ముఠా సభ్యులు గద్వాల ప్రాంతంలో రేషన్ బియ్యం కొనేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీదొడ్డికి చెందిన ముఠా సభ్యులు గద్వాల నుంచి రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకుని.. గద్వాలకు చెందిన ముఠా సభ్యులు వారిపై దాడి చేసి బియ్యం తరలిస్తున్న ఆటోను ధ్వంసం చేశారు. ప్రాణభయంతో కేకలు వేయగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పట్టణ పోలీసులు అక్కడికి చేరుకోగా.. దాడి చేసిన ముఠా సభ్యులు పారిపోయారు. బియ్యం తరలిస్తున్న గూడ్స్ ఆటో, ఇద్దరు వ్యక్తులను పట్టణ పోలీసుస్టేషన్కు తరలించారు. ఈ సంఘటన బుధువారం తెల్లవారుజామున మండలంలోని చేనుగోనిపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దారి కాచి దాడి.. కాలూరుతిమ్మన్దొడ్డి మండల కేంద్రానికి చెందిన రాము, నరేష్లు గూడ్స్ ఆటోలో సుమారు 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చెనుగోనిపల్లి గ్రామం నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుట్టుగా తరలిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న మరో ముఠా సభ్యులు దారి కాచి ఆటోను పట్టుకున్నారు. ఆటోలోని బియ్యం ఎక్కడికి తరలిస్తున్నారు..? ఎవరు పంపిచారంటూ ఆటోపై దాడి చేశారు. అంతటితో ఆగక ఇద్దరిపై దాడి చేశారు. దెబ్బలకు తాళలేక వారు కేకలు వేయగా గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో ముఠా సభ్యులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. దీంతో ఆటోను, ఇద్దరు వ్యక్తులను పట్టణ పోలీసుస్టేషన్కు తరలించారు. కొనుగోళ్లపై పోటాపోటీ.. గద్వాలలో రేషన్ బియ్యం కొనుగోళ్లు చేసేందుకు అక్రమార్కుల మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్లుగా సాగుతుంది. ప్రభుత్వం సబ్సిడీ రూపంలో నిరుపేదలకు చౌకధర దుకాణాల ద్వారా కిలో రూపాయికి అందజేస్తుంది. అయితే బయటి మార్కెట్లో సుమారు రూ.20 ధర పలుకుతుంది. అయితే రేషన్ బియ్యం లబ్ధిదారుల నుంచి రూ.10–15 వెచ్చించి వివిధ వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు. అయితే రేషన్ బియ్యం అక్రమంగా కర్ణాటకకు తరలించి అక్కడి ప్రైవేట్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంగా మారుస్తారు. ఇలా చేసిన బియ్యాన్ని వ్యాపారులతో కుమ్మక్కై బయటి మార్కెట్లో కిలో రూ.30–35లకు అమాయక ప్రజలకు విక్రయిస్తారు. లాభసాటి వ్యాపారం కావడంతో జిల్లాకేంద్రంలో రేషన్ బియ్యం కొనుగోలు చేసేందుకు పలు ముఠా సభ్యులు పోటీ పడుతున్నారు. వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల నుంచే కాక ఇతర జిల్లాల నుంచి గద్వాల, డ్యాం, ఆత్మకూర్ మీదుగా కర్ణాటకలోని రాయిచూర్కు నిత్యం రేషన్ బియ్యం తరలిస్తున్నారు. కేసు నమోదు.. ఈ విషయమై గద్వాల పట్టణ పోలీస్స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ స్పందిస్తూ అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సిబ్బందికి సమాచారం రావడంతో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అయితే బియ్యం తరలిస్తున్న వారిపై దాడి చేసిన విషయమై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. రెండు క్వింటాళ్ల నల్లబెల్లం.. మన్ననూర్ (అచ్చంపేట): అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామ అటవీశాఖ చెక్పోస్టు వద్ద రెండు క్వింటాళ్ల నల్లబెల్లం, 40 కిలోల పటికి పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని దోర్నాల నుంచి ఇండిగో కారులో నల్లబెల్లం అక్రమంగా తరలిస్తున్నారని దోమలపెంట పోలీసులకు సమాచారం అందడంతో నిఘా ఉంచారు. ఈ క్రమంలో అచ్చంపేట పట్టణ సమీప గ్రామాలకు చెందిన రమేష్, భరత్లు బెల్లంతో అక్కడికి వచ్చారు. కారుతోపాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సిద్ధిఖ్, ప్రేమ్కుమార్, ఉపసర్పంచ్ ప్రసాద్ సంబంధిత అచ్చంపేట ఎక్సైజ్ అధికారులు శంకరయ్య, రమేష్, ఆంజనేయులుకు సమాచారం అందించి నిందితుల నుంచి అక్రమ బెల్లంను వారికి అప్పగించారు. బెల్లం ఎక్కడి నుంచి సరఫరా అవుతున్న విషయాలను దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామన్నారు. -
ఒంటెలు సరఫరా చేస్తుందెవరు..?
ప్రజలు మాంసాహారం తీసుకోవడాన్ని బాగా ఇష్టపడుతున్నారు. ప్రజల డిమాండ్కి తగినట్లుగా స్థానికంగా మాంసం లభించకపొవడంతో ఆ వ్యాపారం చేసే వారు.. అక్రమ పద్ధతుల ద్వారా మాంసం సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన మాంసాన్ని స్టార్ హోటల్స్, రెస్టారెంట్లతో పాటు మాంసం ప్రియులకు వివిధ రకాల జంతువుల పేర్లు చెప్పి విక్రయిస్తూ రూ.లక్షలు సంపాధిస్తున్నారు. గతంలో అడవి పందులు, జింకలను కొసి విక్రయించే వ్యాపారులు డిమాండ్ పెరగడంతో భారీ జంతువులపై కన్నెశారు. మునుగోడు : భారీ జంతువుల్లో ఒకటైన ఒంటెని కొస్తే అధిక మొత్తంలో మాంసం వస్తుందని వ్యాపారులు భావించారు. ఎడారి ప్రాంతాలైయినా హర్యానా, గుజరాత్, రాజాస్థాన్ ప్రాంతాల నుంచి వయస్సు మీదపడిన ఒంటెలను కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి మాంసంగా మార్చుతున్నారు. ఒంటెలను అక్కడ నుంచి ఇక్కడికి ఎవరు రవాణా చేస్తున్నారు. ఎంతకు విక్రయిస్తున్నారు.. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఉన్నా అవి ఎలా హైదరాబాద్కి వస్తున్నాయనే సందేహలు వ్యక్తమవుతున్నాయి. ఊకొండిలో ఒంటెలను కొస్తూ పట్టుబడిన దుండగులు సైతం ఆ ప్రాంతాలకు వెళ్లకుండానే హైదరాబాద్ నుంచి ఫోన్లలో బేరాలు చేసుకుని.. డబ్బు ఆన్లెన్ ద్వారా వారి ఖాతాల్లో జమచేసి ఒంటెలు తీసుకుంటున్నట్లు సమచారం. కానీ ఈ దందా ఎప్పటి నుంచి సాగుతోంది.. అలా అమ్మేవాళ్లు ఎవరు.. అనే విషయాలను పోలీసులు రాబట్టలేక పోయారు. పోలీసులు లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మాంసం విక్రయించేదెక్కడో? ఒక ఒంటెను కోస్తే 350 నుంచి 400ల కేజీల మాంసం వస్తుంది. ఇక్కడ ఒకేసారి 25 నుంచి 30కిపైగా ఒంటెలను కోస్తుండడంతో దాదాపు 10 నుంచి 15 టన్నుల మాంసం ఉత్పత్తి అవుతుంది. ఈ మాంసాని ఎక్కడా విక్రయిస్తారు. ఎంతకు విక్రయిస్తారనేది ఇప్పటికీ తేలలేదు. హైదరాబాద్లో అమ్ముతున్నట్లు నిందితులు చెబుతున్నా అందులో నిజం లేదనిపిస్తోంది. హైదరాబాద్లో ఒకే రోజు 10 టన్నుల మాంసాని విక్రయించడం చాలా కష్టం. ఆ మాంసం మొత్తం ఇతర రాష్ట్ర, దేశాలకు సరఫరా చేస్తున్నారనే.. ఆరోపణలు అనేకం ఉన్నాయి. మాంసాన్ని ఎక్కడకు సరఫరా చేస్తున్నారు.. ఎలా చేస్తున్నారనే విషయంపై విచారిస్తే.. వ్యాపారంలో ఉన్న బడా బాబుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒంటెల సరఫరా, మాంసం విక్రయంపై నిఘా పెడితే దందా గుట్టు రట్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 25మంది రిమాండ్ మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండిలో ఒంటెల వధ కేసులో 25మందిని స్థానిక పోలీసులు శుక్రవారం రిమాండ్కు తరలించారు. చండూరు సీఐ రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరబాద్కు చెందినా మహ్మ ద్ ఖాజ కురేష్, అబ్జల్ కురేష్లు..పశుమాంసం వ్యాపారులు. ప్రస్తుతం ఒంటె మాంసానికి బాగా డిమాండ్ ఉండటంతో వాటిని అప్పుడప్పుడు కొస్తూ ఉండేవారు. ఇటీవల హైదరాబాద్లో ఒంటెల మాంసం విక్రయాలపై పోలీసులు దాడులు చేయడంతో..సదరు వ్యాపారులు మునుగోడుకు చెందిన మాంసం వ్యాపారి ఖయ్యూంతో పరిచయం ఏర్పర్చుకున్నారు. ఒంటెలను కోసేందుకు నిర్మానుష్యమైన వ్యవసాయ భూమి కావాలని అడగగా, ఊకొండి గ్రామానికి చెందినా మాజీ సర్పంచ్ నిమ్మ ల స్వామిని సంప్రదించాడు. అతను తన భూమిని నెలకు రూ.2500 చొప్పున లీజుకు ఇచ్చాడు. దీంతో వ్యాపారులు బుధవారం రాత్రి 28 ఒంటెలని తీసుకొని ఊకొండికి వచ్చారు. వాటిని కోసేందుకు 19 మంది కూలీలను వెంటతెచ్చుకున్నారు. ఒంటెలను కోస్తుండగా గ్రామస్తుల సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను పోలీసులు విచారించి శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. -
తాడిపత్రిలో చెలరేగిపోతున్న గ్రానైట్ మాఫియా
తాడిపత్రి: నిజాయతీ అధికారికి బదిలీ సన్మానం చేసిన తాడిపత్రి మాఫియా.. అడ్డూఅదుపు లేకుండా గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడుతోంది. ఈ ప్రాంతంలో ఎక్కడా క్వారీలు లేకపోయినా.. వ్యాపారం కోట్లలో సాగుతుండటం గమనార్హం. ప్రకాశం జిల్లా చీమకుర్తి, కర్నూలు జిల్లా ఆదోని, డోన్, కదిరి, కనికిగి, చిత్తూరు తదితర ప్రాంతాల్లోని క్వారీల నుంచి ఇక్కడికి గ్రానైట్ గుండ్లు సరఫరా అవుతున్నాయి. ఒక లోడు గ్రానైట్ బోల్టర్లు క్వారీ నుంచి ఫ్యాక్టరీకి చేరాలంటే రూ.60వేల నుంచి రూ.70వేల రాయల్టీ చెల్లించాల్సి ఉంది. ఇక్కడే దందా మొదలవుతోంది. లగాన్ బృందం రంగంలోకి దిగి అధికారుల చేతులు తడుపుతూ పని కానిచ్చేస్తోంది. మైనింగ్ లీజుదారులు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. సేల్ట్యాక్స్ 12శాతం చెల్లించి ఒక్కో గుండు కొలతను బట్టి రాయల్టీ మీటరుకు రూ.3వేలు చొప్పున చెల్లించాలి. కానీ కొన్ని క్వారీల్లో నాసిరకం గుండ్లు ఉండడం వల్ల మంచి గుండ్లకు, నాసిరకం గుండ్లకు ఒకటే రాయల్టీ ధర నిర్ణయించడంతో క్వారీ లీజుదారులు, ప్యాక్టరీ యజమానులతో కుమ్మక్కై క్యూబిక్ మీటరు రూ.60వేల నుంచి రూ.70వేల విలువ చేసే ఖనిజానికి.. మీటరు రూ.7వేల విలువ చేసే ఖనిజానికి ప్రభుత్వం తేడా లేకుండా ఒకే ధరను నిర్ణయించింది. దీంతో తాడిపత్రి లాంటి ప్రాంతాలకు నాసిరకం గుండ్లను తరలించడంతో ఈ సమస్య ఉత్పన్నమౌతోంది. జీఎస్టీలో కూడా ట్యాక్స్ బిల్లు వేసేటప్పుడు అధిక ధర కలిగిన ఖనిజానికి తక్కువ ధర కలిగిన ఖనిజానికి విలువలో తేడా లేకుండా బిల్లు వేస్తున్నారు. దీంతో ఒంగోలు లాంటి పారిశ్రామిక ప్రాంతంతో పోల్చుకుంటే ఇక్కడ తేడా భారీగా ఉంటోంది. మామూళ్ల కోసం మాయాజాలం గ్రానైట్ రాయి ఐదువేల అడుగులు ఉంటే ఫ్యాక్టరీ యజమానులు 2,500 అడుగులకు మాత్రమే బిల్లు తయారు చేస్తారు. చెక్పోస్టు వద్ద అక్కడున్న అధికారుకులకు మామూళ్లు ముట్టజెప్పి సీలు వేయించుకుంటారు. దీంతో ఇతర ప్రాంతాల్లో అధికారులు వాహనాన్ని ఆపినప్పుడు బిల్లు చెక్ చేసినట్లు ఉండటంతో అంతోఇంతో తీసుకుని వదిలేస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి యథేచ్ఛగా గండి పడుతోంది. నిజాయతీగా పనిచేసే అధికారులకు బెదిరింపులు తాడిపత్రిలో మైనింగ్ మాఫియాకు అడ్డూఅదుపులేకుండా పోతున్న తరుణంలో గతంలో గుత్తి మైనింగ్ విజిలెన్స్ విభాగంలో అసిస్టెంట్ జియాలజిస్ట్గా ఉన్న ప్రతాపరెడ్డి మైనింగ్ మాఫియాపై కొరడా ఝళిపించారు. కేవలం లక్షల్లో ఉన్న ఆదాయన్ని కోట్ల రూపాయలకు చేర్చారు. ఇక తమ ఆటలు సాగవన్న ఆ మాఫీయా తాడిపత్రికి చెందిన ఓ ముఖ్యనేత సహకారం కోరారు. వచ్చే ఆదాయంలో వాటా ఇచ్చేందుకు ఒప్పందం కుదరడంతో ఏజి ప్రతాప్రెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి అవినీతి మకిలి అంటించారు. ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఆయనకు క్లీన్చిట్ ఇచ్చారు. దీంతో సదరు ముఖ్య నేత మైనింగ్ శాఖ మంత్రి వద్ద పంచాయితీ పెట్టి మరీ ఆయనను బదిలీ చేయించారు. ఆ తర్వాత మాఫియా యథేచ్ఛగా తమ దందా సాగిస్తోంది. లగాన్ అంటే.. ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీల నుంచి గుండ్లను తీసుకుని ఫ్యాక్టరీకి సరఫరా చేసి యజమానుల వద్ద రూ.10వేల నుంచి రూ.15వేలు చొప్పున వసూలు చేసే ఈ తతంగాన్ని లగాన్గా పిలుస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత అనుచరుల కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగుతోంది. 20 మంది సభ్యులు ఈ లగాన్ గ్యాంగ్లో ఉంటారు. క్వారీ నుంచి ఫ్యాక్టరీకి గుండ్లు చేరే వరకు మార్గమధ్యంలో ఎవరూ అడ్డుకోకుండా చూసుకోవడం వీరి బాధ్యత. అక్రమ రవాణాను క్వారీల వద్దే అడ్డుకుంటాం తాడిపత్రి ప్రాంతంలో గ్రానైట్ క్వారీలు ఎక్కడా లేవు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి గుండ్లు వస్తాయి. క్వారీల వద్ద గుండ్ల రవాణాను అడ్డుకుంటున్నాం. ఈ విషయమై క్వారీ యజమానులతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇప్పటికే అక్రమంగా గుండ్లను తరలించే లారీలను సీజ్ చేసి లక్షల్లో జరిమానా విధించాం. ఇక ముందు కూడా దాడులను ముమ్మరం చేస్తాం. – వెంకటేశ్వరరెడ్డి, మైనింగ్ ఏడీ -
పెన్నా గర్భశోకం
►పామిడిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ►పోలీసుల అండతో రెచ్చిపోతున్న ఇసుకాసురులు ►గుంతలమయమైన పెన్నాతీరం ►కన్నెత్తి చూడని రెవెన్యూ, మైనింగ్ అధికారులు అక్రమార్కులు పెన్నానదిని తోడేస్తున్నారు. అనుమతులు లేకండానే ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పామిడిలో ఈ ఇసుకదందా తీవ్రం కావడంతో ఈ ప్రాంతంలోని పెన్నాతీరం గుంతలమయమై కనిపిస్తోంది. ఆక్రమణలు కూడా ఎక్కువ కావడంతో నది కుంచించుకుపోతోంది. ఇంత జరుగుతున్నా ఇటు మైనింగ్ అధికారులు గానీ, ఇటు పోలీసులు గాని కన్నెత్తి చూడడం లేదు. - పామిడి: మూడు దశాబ్దాల క్రితం పెన్నానదిలో ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలు కనిపించేవి. అప్పట్లో 15 అడుగుల లోతులోనే నీరు పుష్కలంగా లభించేది. రాను రాను అక్రమ ఇసుక రవాణా ఊపందుకోవడంతో ఇసుక తిన్నెలు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం పామిడిలో 150 అడుగుల్లో కూడా నీరు లభ్యంకాని పరిస్థితి. దీంతో పట్టణంలో ఎన్నడూలేని విధంగా నీటిఎద్దడి తీవ్రతరమైంది. మరోవైపు పామిడి సమీపంలో పెన్నానదిలో ఆక్రమణలు ఎక్కువ కావడంతో మైదానాన్ని తలపిస్తోంది. కొందరు ఏకంగా నదిలోనే తోటలు సాగు చేస్తున్నారు. రోజుకు రూ.4 లక్షలు విలువ గల ఇసుక తరలింపు గతంలో శింగనమల మండలంలో ఉల్లికల్లు, పెద్దవడుగూరు మండలంలో ఈరన్నపల్లి గ్రామాల వద్ద ఇసుకరీచ్లు ఉండేవి. గతంలో అక్కడి నుంచి మాత్రమే ఇనుక తరలించేలా నిబంధనలు ఉండేవి. ఏడాది క్రితం ఇసుక రీచ్లు ఎత్తివేశారు. దీంతో అధికారపార్టీ నేతలు ఇసుక అక్రమ రవాణా దందాకు పామిడిని కేంద్రంగా చేసుకున్నారు. పామిడి సమీపంలోని పెన్నానది నుంచి రోజుకు రూ.4 లక్షలు విలువ చేసే ఇసుకను అక్రమంగా రవాణ చేస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్లు, ట్రిప్పర్లు, లారీల్లో రోజుకు వంద ట్రిప్పులు చొప్పున ఇసుకను బెంగుళూరు, అనంతపురం, గుంతకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్య పట్టణాల్లో అపార్ట్మెంట్ల నిర్మాణానికి, గుంతకల్లు పరిధిలోని రైల్వే డబ్లింగ్ పనులకు ఈ అక్రమ ఇసుకను తరలిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ధర గుంతకల్లు, వజ్రకరూరు ప్రాంతాలకు ఒక ట్రాక్టర్ ధర రూ.3 వేలు పలుకుతోంది. అదే అనంతపురానికి అయితే రూ.4 వేలు. ట్రిప్పర్ ఇసుక అయితే రూ.18 వేలు పలుకుతోంది. బెంగుళూరు వంటి ముఖ్య పట్టణాలకు టెన్వీలర్ లారీ ఇసుక రూ.1.30 లక్షలు పలుకుతుండడంతో ఇసుకాసురుల అక్రమార్జన మూడు పువ్వులు... ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఈక్రమంలోనే అక్రమ రవాణాను అఽడ్డు రాకుండా పోలీసులకు మామూళ్లు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే జిల్లా ఎస్పీగా అశోక్కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పోలీసులు అడపా...దడపా...దాడులు నిర్వహిస్తున్నా...పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాను అరికట్టకపోతే పెన్నాతీరం మైదానంలా మారిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైదానంగా మారింది నదిలోని ఇసుక యథేచ్ఛగా తరలించడంతో దిన్నెలు కరిగిపోయాయి. నది మైదాన ప్రాంతంగా మారింది. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో పట్టణంలో నీటిఎద్దడి నెలకొంది. –ఎస్ రఘునాథ్ దత్తు, పామిడి. కంపచెట్లమయం పెన్నానదిలో కంపచెట్లు దట్టంగా పెరిగాయి. ఆక్రమణలు, తోటలు, అక్రమ కట్టడాలతో నది కుచించుకుపోతోంది. దీంతో భవిష్యత్లో నది మాయమయ్యే పరిస్థితి నెలకొంది. –ఎం రంగనాయకులు, పామిడి కొండాపురం. అక్రమ రవాణను అడ్డుకుంటాం పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి సహజసంపదను కాపాడతాం. ఇసుకను రవాణా చేసే వారెవరైనా, ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. పోలీసులకు మామూళ్లు అందుతున్నాయన్న మాటల్లో వాస్తవం లేదు. ఒకటిన్నర నెల వ్యవధిలో 13 ట్రాక్టర్లు, 2 ట్రిప్పర్లు సీజ్ చేసి, రూ.3.15 లక్షల జరిమానా వసూలు చేశాం. పోలీసుల పనితీరుకు ఇదే నిదర్శనం. - రవిశంకర్రెడ్డి, ఎస్ఐ, పామిడి -
అనుచితం
- ‘ఉచిత ఇసుక’ ముసుగులో యథేచ్ఛగా దందా - ట్రాక్టర్లు, ట్రిప్పర్లతో కర్ణాటకకు అక్రమ రవాణా - ఇసుకాసురుల్లో అధికార పార్టీ నేతలే అధికం - చోద్యం చూస్తున్న పోలీస్, రెవెన్యూ (సాక్షిప్రతినిధి, అనంతపురం) ఇసుక వ్యాపారం అధికార పార్టీ నేతలకు లాభసాటిగా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఇసుక దందా ఏ స్థాయిలో సాగుతోందో, తద్వారా ఆ పార్టీ నేతలు అనతి కాలంలోనే ఏ మేరకు ఆర్జించారో అందరికీ తెలిసిన సత్యమే. డ్వాక్రా మహిళల పేరుతో ఇసుకరీచ్ల్లో పెత్తనం చేసి రూ.కోట్లు దండుకున్నారు. ‘ఇసుక మాఫియా’ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతో విధిలేని పరిస్థితుల్లో రీచ్లను రద్దు చేసింది. తర్వాత ఇసుకను ఉచితంగానే తీసుకెళ్లొచ్చని ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ దందా ఆగలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఇసుక పాలసీని రూపొందించినప్పుడు జిల్లాలోని శింగనమల మండలం ఉల్లికల్లు, తాడిమర్రి మండలం చిన్నచిగుల్లరేవు, పెద్దపప్పూరు మండలం చిన్న ఎక్కలూరు రీచ్లకు అనుమతి ఇచ్చింది. ఇవి ఏర్పాటైన మూన్నెళ్లలోనే ప్రభుత్వానికి రూ.2.57 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే.. ఇదే కాలంలో జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ప్రభుత్వానికి వచ్చిన దానికంటే ఐదు రెట్ల అధిక ఆదాయాన్ని పొందారు. ఒక్కో ప్రజాప్రతినిధి రోజూ రూ.10 లక్షల ఆదాయమే లక్ష్యంగా తవ్వకాలు సాగించారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా హాయిగా ఇంటికి చేరే సొమ్ము కావడంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టారు. ఇది శ్రుతిమించిపోవడంతో ఎట్టకేలకు ప్రభుత్వం రీచ్లను రద్దు చేసింది. 12 రీచ్లలో మాత్రమే అనుమతి ఉచితం అమలు చేసిన తర్వాత జిల్లాలో 12 రీచ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రామగిరి మండలం పేరూరులో ఒకటి, కంబదూరు మండలంలో 4, బ్రహ్మసముద్రం మండలంలో 4, ముదిగుబ్బ మండలం పెద్దచిగుళ్లరేవు, కళ్యాణదుర్గం, కణేకల్లు మండలాల్లోని తమ్మసముద్రం, రాచేమర్రి రీచ్లకు అనుమతులు మంజూరు చేసింది. ఇక్కడి నుంచి ఎవరైనా ఇంటి అవసరాలకు ఇసుక తీసుకెళ్లవచ్చు. ఒక్కో ఇంటి వద్ద 4–5 ట్రాక్టర్ల ఇసుక నిల్వ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ నిల్వ ఉంటే అధికారులు తనిఖీ చేసి కేసు నమోదు చేస్తారు. భారీ అపార్ట్మెంట్లు, ఇతర కట్టడాలకు ఇసుక అవసరమైతే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అనుమతించిన రీచ్లలో మాత్రమే తవ్వాలి. కానీ జిల్లాలోని అనుమతి లేని ఉల్లికల్లు, చిన్న ఎక్కలూరు, చిన్న చిగుల్లరేవుతో పాటు దాదాపు ఇసుక లభించే అన్ని ప్రాంతాల్లోనూ తవ్వకాలు సాగిస్తున్నారు. అయినా రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. 3.88 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకానికి అనుమతి 12 రీచ్లలో 3,88,847 క్యూబిక్ మీటర్ల మేర ఇసుక తవ్వుకునేందుకు అనుమతిచ్చారు. ఈ ఏడాది జనవరి 28న భూగర్భ గనులశాఖ అధికారులు రీచ్లలో తనిఖీలు నిర్వహించారు. వారి లెక్క ప్రకారం అప్పటి వరకూ 42,500 క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే తవ్వారు. అయితే.. అధికారులు నిర్ధేశించిన ప్రాంతాల్లోనే కాకుండా నదిలో ఇసుక లభ్యత ఎక్కడ ఉంటే అక్కడ తవ్వకాలు సాగించారు. దీన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. భారీ ఆదాయం.. రీచ్ల నుంచి దగ్గర్లోని పట్టణ ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాలకూ ఇసుక తరలిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు జిల్లా నుంచి భారీగా ఇసుక తరలిపోతోంది. అక్కడ టిప్పర్ ఇసుక రూ.50వేలకు విక్రయిస్తున్నారు. భారీ వాహనాలైతే లోడు రూ.లక్ష వరకూ అమ్ముతున్నారు. ఈ లెక్కన రోజుకు పది లారీల ఇసుక తరలిస్తే చాలు అక్రమార్కుల పంట పండినట్లే! ఇసుక వ్యాపారుల్లో అధికార పార్టీ నేతలే అధికంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికితోడు అధికారులు, పోలీసులను కూడా వారు ‘మంచి’గా చూసుకుంటున్నారు. దీంతో దందా అడ్డూ అదుపు లేకుండా సాగిపోతోంది. -
ప్యాంటుకు ప్రత్యేక పాకెట్స్!
బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ఏర్పాటు విమానాశ్రయంలో 952 గ్రాముల బంగారం స్వాధీనం సాక్షి, హైదరాబాద్: దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమ రవాణా చేయడానికి నిర్ణయించుకున్న వ్యక్తి తెలివిగా వ్యవహరిం చాడు. తన ప్యాంటుకు ప్రత్యేకంగా జేబులు ఏర్పాటు చేయించుకున్నాడు. వాటిలో 952 గ్రాముల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో సర్ది తీసుకువచ్చాడు. సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ దాడి చేసి పట్టుకున్నాయి. దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో వచ్చిన స్మగ్లర్ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. ఇతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు తనిఖీ చేసి ప్యాంటు లోపలి భాగంలో ఏర్పాటు చేసుకున్న రహస్య జేబులు గుర్తించారు. వాటిలో ఉన్న 952 గ్రాముల బరువున్న 9 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీని రూ.27.9 లక్షలుగా నిర్ధారించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. -
మాయాజాలం
- రాయల్టీ ఒక ఖనిజానికి రవాణా మరొకటి.. - షిటైట్ స్థానంలో వైట్సేల్ తరలింపు - ఏడాదిగా సాగుతున్న దందా - ప్రభుత్వాదాయానికి భారీగా గండి తాడిపత్రి : వ్యాపారులు రాయల్టీ మాయాజాలానికి పాల్పడుతున్నారు. ఒక ఖనిజానికి రాయల్టీ చెల్లిస్తూ మరొక దాన్ని తరలిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి భారీగా గండి పడుతోంది. ఏడాదిగా ఈ దందా సాగుతున్నా..అడ్డుకట్ట వేయడంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, గనుల శాఖ అధికారులు విఫలమవుతున్నారు. తాడిపత్రి ప్రాంతంలో పలు ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి గ్రానైట్, నల్లబండలు, డోలమైట్, షిటైట్, వైట్సేల్ తదితర ఖనిజాలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా షిటైట్ ఖనిజానికి దేశవ్యాప్తంగానూ, విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. పేపర్, సబ్బులు, పేస్టులు, మందుల తయారీలో ఈ ఖనిజాన్ని అధికంగా ఉపయోగిస్తుంటారు. తాడిపత్రి ప్రాంతంలో లభ్యమవుతున్న షిటైట్.. చైనాకు కూడా ఎగుమతి అవుతోంది. ప్రభుత్వానికి టన్ను షిటైట్పై రూ.500 రాయల్టీతో పాటు రూ.150 చొప్పున డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ (డీఎంఎఫ్) చెల్లించాలి. ఇదే తరహాలో ఉండే వైట్షేల్ ఖనిజానికి టన్నుపై రాయల్టీ రూ.60 మాత్రమే. దీంతో వ్యాపారులు వైట్షేల్కు ఉపయోగించే రాయల్టీలతో షిటైట్ను రవాణా చేస్తున్నారు. ఒకప్పుడు పూర్తిగా ‘జీరో’ బిజినెస్ జరిగేది. అయితే.. వాటికి బిల్లులు తప్పకుండా ఉండాలని, ఆన్లైన్లో రసీదులు కావాలని సరుకులను దిగుమతి చేసుకునే పెద్ద పరిశ్రమలు నిబంధన పెడుతుండడంతో వ్యాపారులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఏడాదిగా రాయల్టీల దందా సాగుతున్నా..అధికారులు మాత్రం ఆలస్యంగా గుర్తించారు. వైట్షేల్ ఖనిజ లభ్యత తక్కువగా ఉన్నా..రాయల్టీలు మాత్రం పెద్దఎత్తున తీసుకుంటుండటంతో వారికి అనుమానం వచ్చింది. రెండు నెలల క్రితం యాడికి మండలం రాయలచెరువు, పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు, కొండుపల్లి గ్రామాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గనుల్లో ఖనిజ లభ్యత, రవాణా, పౌడర్ పరిశ్రమల్లో ఉన్న ఖనిజం మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు. ఏకంగా 22 మందికి నోటీసులు జారీ చేశారు. రికార్డులు సమర్పించాలని, రాయల్టీల వివరాలను చూపాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది మాత్రమే రికార్డులు చూపించారు. అలాగే జనవరి నుంచి ఇప్పటివరకు రాయల్టీ ఒకటి, ఖనిజం మరొకటి కల్గిన పది ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఒక్కో దానిపై రూ.25వేల జరిమానా విధించారు. ఇలా అక్రమంగా నెలకు దాదాపు రూ.కోటి విలువైన ఖనిజం తరలిపోతున్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం అప్పుడప్పుడు దాడులు చేస్తున్నారు. అక్రమ రాయల్టీలు వినియోగిస్తున్న వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇందులో అధికార పార్టీకి చెందిన నాయకులు ఉండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. అక్రమాలు వాస్తవమే–వెంటేశ్వరరెడ్డి, గనుల శాఖ సహాయ సంచాలకులు, తాడిపత్రి రాయల్టీల మాయాజాలం మా దృష్టికి రావడంతో తనిఖీలు చేశాం. 10 వాహనాలను సీజ్ చేసి పోలీసులకు అప్పగించాం. జరిమానా కూడా విధించాం. అక్రమంగా రవాణా చేస్తున్న వారికి నోటీసులు జారీచేసి.. ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. నెల ఖనిజం జారీ చేసిన రాయల్టీలు నవంబర్ డోలమైట్ 28,675 నవంబర్ షిటైట్ 1,700 నవంబర్ వైట్షేల్ 3,300 డిసెంబర్ డోలమైట్ 39,350 డిసెంబర్ షిటైట్ 719 డిసెంబర్ వైట్షేల్ 4,450 జనవరి డోలమైట్ 19,440 జనవరి షిటైట్ 1,209 జనవరి వైట్ షేల్ 2,000 -
ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని హంద్రీనీవా నది పరీవాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణాపై హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారికి లక్ష రూపాయల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించాలని ఆదేశించింది. అక్రమంగా ఇసుక తరలింపుపై గతంలో జిల్లా కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 320 ట్రాక్టర్లను సీజ్ చేశామని, సీజ్ చేసిన ఇసుకను కర్నూలు 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచామని ప్రభుత్వం తెలిపింది. మరి దీనిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదని హైకోర్టు ప్రశ్నించింది. అడ్డగోలుగా ఇసుకను తరలిస్తున్న వారికి జీవో నెంబర్ 42 ప్రకారం రూ. లక్ష జరిమానా ఎందుకు వేయలేదని ఎస్పీ, కలెక్టర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఇకపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో భూగర్భ గనుల శాఖాధికారి కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
పక్కా దగా..
ముఠాలుగా ఏర్పడి ధనార్జనే ధ్యేయంగా దందా నిలువరించని సాంకేతిక పరిజ్ఞానం పౌర సరఫరాల శాఖలో వేళ్లూనుకున్న అక్రమాలు తూతూమంత్రంగా తనిఖీలు పేదలకు పూర్తిస్థాయిలో అందని బియ్యం బినామీ పేర్లతో రేషన్ బియ్యం పక్కదారి పేదల బియ్యం పక్కదారిపడుతోంది. రూపాయికి కిలోబియ్యం పథకం కొందరికి కాసులు కురిపిస్తోంది. పక్కా ప్రణాళికతో సాగుతోన్న ఈ గోల్మాల్ దందాతో రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. జిల్లాలో డీలర్ల పేరుతో సాగుతున్న ఈ బినామీల దందా వెనుక పెద్దల హస్తాలున్నట్లు తెలుస్తోంది. సరుకులు దారి మళ్లిస్తున్న ఈ వ్యవహారంపై తనిఖీలు తూతూమంత్రంగా నిర్వహిస్తూ తమవంతు సహకరిస్తున్నారు కొందరు అధికారులు. పౌర సరఫరాల శాఖలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న జియో ఫెన్సింగ్ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ దగాను ఏమాత్రం నిలువరించలేకపోతోంది. మహబూబ్నగర్ న్యూటౌన్ : వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను కొందరు తమకు అనుకూలంగా మార్చుకొని పేదల బియ్యాన్ని నొక్కేసి సొమ్ము చేసుకుంటున్నారు. పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖలతో పాటు జియోఫెన్సింగ్ యాప్ కూడా పనిచేస్తున్నప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు రావడంలేదు. దొడ్డిదారిన బియ్యం తరలిపోతున్నా అక్రమాలను కట్టడి చేయడానికి అధికారులు సాహసించడం లేదు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న దళారులు రెచ్చిపోయి బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారు. ప్రతినెల చౌకధర దుకాణాల ద్వారా పేదలకు చేరాల్సిన బియ్యాన్ని దళారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు అవినీతి మత్తులో జోగుతున్నారనే ఆరోపణలున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 3,66,813 రేషన్ కార్డులున్నాయి. అందులో 3,39,393 ఆహార భద్రత కార్డులు, 27,164 అంత్యోదయ కార్డులు, 256 అన్నపూర్ణ కార్డులున్నాయి. ఆహార భద్రత కింద కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా సీలింగ్ విధించకుండా ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ 6కిలోల చొప్పున బియ్యం సరఫరా చేస్తుంది. ప్రతినెల 8222 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. జిల్లాకేంద్రం మహబూబ్నగర్ పట్టణంలోనే మొత్తం 86 రేషన్ డీలర్ షాపులు ఉన్నాయి. ఒకరిద్దరి చేతుల్లోనే దాదాపు 37డీలర్ షాపులు నడుస్తున్నట్లు సమాచారం. గత నాలుగేళ్లుగా కొత్త డీలర్ల నియామకాలు లేకపోవడంతో కొంతమందికి ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇన్ చార్జ్ లుగా వ్యవహరిస్తున్న కొందరు డీలర్లు ఇదే అదనుగా భావించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బియ్యం అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జియో ఫెన్సింగ్యాప్ ఉఫ్... పౌర సరఫరాల శాఖలో బియ్యం సరఫరా, పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న జియోఫెన్సింగ్ యాప్ ఆశించిన ఫలితాన్నివ్వడం లేదు. బియ్యాన్ని సరఫరా చేసే లారీలకు జియో మ్యాపింగ్ చేశారు. డీలర్లు, గోదాం అధికారులు, పౌర సరఫరాల అధికారుల ఫోన్ నెంబర్లకు ఈ జియో ఫెన్సింగ్ యాప్ను అనుసంధానించారు. గోదాం నుంచి బియ్యం లారీ బయలుదేరి స్టేజ్–2 అధికారి పర్యవేక్షణలో ఎంఎల్ఎస్ పాయింట్కు చేరుతుంది. లారీ బయలుదేరడం, ఎంఎల్ఎస్ పాయింట్కు చేరడం వంటి ప్రక్రియ జియోఫెన్సింగ్ యాప్లో నమోదవుతుంది. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి చౌకధర దుకాణాలకు చేరిన వెంటనే సంబందింత డీలర్ సంతకం చేసి బియ్యాన్ని స్టాక్ చేసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తం సంబందిత యాప్ సర్వర్లో నమోదు చేస్తారు. దీంతో స్టాక్ వచ్చినట్లు లబ్ధిదారులకు, అధికారులకు సమాచారం వెళ్తుంది. అలా లారీ బయలుదేనప్పటి నుంచి ఎక్కడెక్కడ వెళ్లిందనేది తెలుస్తుంది. ఇంతమంచి వ్యవస్థ ఉన్నా కేవలం యాప్ను సక్రమంగా వినియోగించకపోవడం వల్లే బియ్యం అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ధనార్జనే లక్ష్యంగా.. రూపాయికి కిలో బియ్యం అందజేసి పేదవారి కడుపు నింపాలనే ప్రభుత్వ ఆశయానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు బినామీ డీలర్లు రూ.12నుంచి రూ.14ల వరకు బియ్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో కొందరు వ్యక్తులు ఇదే పనిగా తిరుగుతున్నారు. కొనుగోలు చేసిన రేషన్ ను పక్కాప్లాన్ తో ప్యారా బాయిల్డ్ రైస్మిల్లులకు చేరుస్తున్నారు. రాత్రికిరాత్రే బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్కు తరలిస్తున్నారు. ప్రభుత్వానికే తిరిగి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ముఠాగా ఏర్పడి రూ.కోట్ల దందా.. పేదల బియ్యాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు జిల్లాలో పెద్ద ముఠానే పనిచేస్తోంది. దీనంతటికీ కల్వకుర్తిలోని ఓ బియ్యం మిల్లు వ్యాపారి ఏజెంటుగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్నగర్, అలంపూర్, గద్వాల, జడ్చర్లలో కొందరు బడావ్యక్తుల ద్వారా ఈ అక్రమ వాపారాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి అడ్డు చెప్పకుండా జిల్లాస్థాయిలో కొందరు అధికారులకు ప్రతినెలా కొంత మొత్తాన్ని ముట్టజెప్పి మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. కఠిన చర్యలు తీసుకుంటాం పేదలకు ఆహార భద్రత కింద అందజేస్తున్న బియ్యాన్ని అక్రమంగా దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డీలర్ షాపులపై డిసెంబర్ నుంచి పర్యవేక్షణ పెంచుతాం. పౌర సరఫరాల శాఖ విభజన ఇంకా పూర్తికాలేదు. ఉమ్మడి జిల్లా కేటాయింపులే ఉన్నాయి. ఈనెలాఖరులోగా విభజన పూర్తవుతుంది. చిన్న జిల్లాలో మా టీంతో రేషన్ షాపులపై నిరంతర పర్యవేక్షణ పెంచుతాం. డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. బినామీ దందాను ఎట్టి పరిస్థితుల్లో సహించబోం. - శారదా ప్రియదర్శిని, డీఎస్ఓ -
ఇసుక మాఫియా ఇష్టారాజ్యం
జోరుగా అక్రమ రవాణా పట్టుకుంది గోరంత.. వదిలేసింది కొండంత తొమ్మిది నెలల్లో 20 కేసులు మామూళ్ల మత్తులో అధికారులు మెదక్ రూరల్: అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్ల మత్తులో పడిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్ మండల పరిధిలోని అవుసులపల్లి, మల్కాపూర్ తండా, బూర్గుపల్లి, రాజ్పేట్, గాజిరెడ్డిపల్లి, సర్దన, ముత్తాయిపల్లి, ర్యాలమడుగు, బొల్లారం, రాయిన్పల్లి, హవేలిఘనపూర్, కూచన్పల్లి తదితర గ్రామాల్లో రాత్రింబవళ్లు తేడాలేకుండా ఇసుక రవాణా జరుగుతోంది. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తూ అక్రమార్కులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులకు స్థానికులు çసమాచారం ఇచ్చినా వారు మాత్రం తమ విధులు నిర్వహించకుండా మామూళ్లకు ఆశపడి పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను సైతం వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొమ్మిది నెలల్లో మండలంలోని ఆయా గ్రామాల్లో పోలీసుల దృష్టికి వచ్చిన కేసులు కేవలం 20 మాత్రమే. మంజీరా పరివాహక ప్రాంతం నుండి వందల సంఖ్యల్లో ఇసుక ట్రిప్పులు తరలిస్తున్నా అధికారులు మాత్రం గోరంత పట్టుకుని..కొండంత వదిలేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే వారికి వత్తాసు పలుకుతుండడంతో అధికారుల తీరుపై ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై కొరడా ఝుళిపించి వాల్టా చట్టాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
గ్రానైట్ అక్రమాలను అరికట్టాలి
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా మంకమ్మతోట : జిల్లాలో అనుమతులు లేకుండా, అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు చేపట్టడాన్ని అరికట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రానైట్ అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో అనుమతులు లేకుండా గ్రానైట్ తవ్వకాలు చేపడుతుంటే రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖనిజ సంపదను దోపిడిచేస్తూ భూమిపై జీవరాశులకు నిలువలేకుండా చేస్తున్నా మాఫియాను అడ్డుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీల్లో బ్లాస్టింగ్ చేపట్టడం వల్ల శబ్ద, వాయు కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు సైతం ముప్పు ఉందన్నారు. జిల్లాలో 613 గ్రానైట్ క్వారీలకు అనుమతి ఉంటే 800 వరకు క్వారీలు నడుస్తున్నాయన్నాని తెలిపారు. గ్రానైట్ అక్రమ తరలింపును అడ్డుకునేందుకు చెక్పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. మైన్స్ ఎండీ కార్యాలయాన్ని కలెక్టరేట్ సముదాయంలోకి మార్చాలన్నారు. పదేళ్లుగా సాగుతున్న గ్రానైట్ అక్రమ దందాపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ కె.నగేష్, సెగ్గెం రాజేష్, సొల్లు అజయ్వర్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వరాల శ్రీనివాస్, గాలి ప్రశాంత్బాబు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మోకెనపెల్లి రాజమ్మ, సంయుక్త కార్యదర్శి గడ్డం జలజరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు దేవరనేణి వేణుమాధవ్రావు, వినుకొండ రామకృష్ణరెడ్డి, మందరాజేష్, నాయకులు సిరి రవి, జక్కుల యాదగిరి, సాన రాజన్న, దుబ్బాక సంపత్, గండి శ్యామ్, కంది వెంకటరమణారెడ్డి, బండమీది అంజయ్య, పావురాల కనుకయ్య, చొక్కాల రాము, గంటుక సంపత్ పాల్గొన్నారు. -
ఇసుక దొంగలు
హైటెక్ యంత్రాలతో యథేచ్ఛగా దోపిడీ నది మొత్తం గుంతలమయం తాత్కాలిక సచివాలయం పేరుతో అక్రమ రవాణా రోజూ వేలాది వాహనాల్లో తరలింపు సాక్షి, అమరావతి : కృష్ణా నదిలో దొంగలు పడ్డారు. బంగారం.. నగదు.. వస్తువులు దొంగలించే వారు కాదు. నదీమతల్లి గర్భంలో ఇసుకను దోచేస్తున్నారు. హైటెక్ యంత్రాల సాయంతో నది పొడవునా ఇసుక విచ్చలవిడిగా తోడేస్తున్నారు. టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. అక్కడి నుంచి చెన్నై, కర్నాటక, హైదరాబాద్కు తరలించి రూ.కోట్లు జేబులు నింపుకుంటున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్న ఈ భారీ దోపిడీ తాత్కాలిక సచివాలయ నిర్మాణం పేరుతో జరుగుతుండటం గమనార్హం. ఈ దోపిడీ వెనక కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రి, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ స్థాయి నాయకులు అనేక మంది ఉన్నారు. ఏ రాష్ట్రాల్లో దొరకని ఇసుక సంపద కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో నిక్షిప్తమై ఉంది. విలువైన ఈ ప్రకృతి సంపదపై అధికారపార్టీ నేతల కన్నుపడింది. తుళ్లూరు మండలం వెలగపూడిలో సచివాలయ నిర్మాణ పనులు వీరి దోపిడీకి రాచమార్గమైంది. ‘తాత్కాలికం’ మాటతో ఇసుక దోపిడీకి తెరతీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి కూతవేటు దూరంలో ఉండవల్లి, వెంకటపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం, రాయపూడి, బోరుపాళెం, అమరావతి, మల్లాది, అచ్చంపేట ఇసుక రీచ్లు ఉన్నాయి. వీటిలో నాలుగు రీచ్ల నుంచి మాత్రమే ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి. హైటెక్ యంత్రాలతో తోడివేత.. ఇసుక తోడేందుకు అక్రమార్కులు హైటెక్ యంత్రాలను దించారు. ఉండవల్లి సమీప నదిలో నుంచి హైటెక్ యంత్రాలు (డ్రెజ్జింగ్) సాయంతో ఇసుకను తోడుతున్నారు. నదిలో అనేక చోట్ల యంత్రాలు వినియోగిస్తున్నారు. మరి కొన్నిచోట్ల భారీ జేసీబీలు, క్రేన్లు ఉపయోగిస్తున్నారు. లింగాయపాలెం పరిధిలో రెండు మూడు రీచ్లు ఉన్నాయి. వీటిలో ఒక చోట, తాళ్లాయపాలెం, బోరుపాలెం రీచ్లో డ్రెజ్జింగ్ మిషన్లతో ఇసుక తోడుతున్నారు. డ్రెజ్జింగ్ మిషన్ పడవపై ఏర్పాటు చేస్తారు. ఆ పడవ నది మధ్యలోకి తీసుకెళ్తారు. నదిలో పైపును విడిచిపెట్టి డ్రెజ్జింగ్ మిషన్ను స్టార్ట్ చేస్తారు. విద్యుత్ మోటార్ ద్వారా నీరు ఎలా వెలుపలకి వస్తాయో.. అలా ఇసుక డ్రెజ్జింగ్ మిషన్ ద్వారా వెలుపలకు వస్తోంది. ఆ ఇసుకను క్రేన్, జేసీబీలతో పెద్ద పెద్ద గుట్టలుగా పోస్తున్నారు. ఒక డ్రెజ్జింగ్ మిషన్ ద్వారా రోజుకు 120 క్యూబిక్ మీటర్ల ఇసుక తోడుతోంది. నదీ తీరంలో ఐదు డ్రెజ్జింగ్ మిషన్ల ద్వారా ఇసుకను తోడుతున్నారు. క్రేన్, జేసీబీలు లెక్కలేనన్ని నదిలో నుంచి ఇసుక తోడుతున్నాయి. రోజూ వేలాది వాహనాలలో రవాణా.. సచివాలయ నిర్మాణానికి 50 నుంచి 75 టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలించే ఇసుక తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. లింగాయపాలెం ఇసుక రీచ్ వద్ద రోజుకు వెయ్యి లారీల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. లింగాయపాలెం మరో రీచ్ వద్ద రోజుకు 500 ట్రాక్టర్ల ఇసుక తరలి వెళ్తోంది. బోరుపాలెం రీచ్ నుంచి రోజుకు 1800 లారీల ఇసుక తరలిపోతోంది. ఇంకా వెంకటంపాలెం, అమరావతి, మల్లాది తదితర రీచ్ల నుంచి మరో వెయ్యి లారీలు. ఇలా రోజుకు సుమారు పది వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఒక లారీ ఇసుక రూ.ఆరు వేల నుంచి రూ.పది వేల చొప్పున విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.1500 నుంచి రూ.రెండు వేల వరకు పలుకుతోంది. కృష్ణా నదిలోని ఇసుకను గుంటూరుకు చేరవేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ ఒకరు వెల్లడించారు. ఇసుక ఇష్టానుసారంగా తోడేయటంతో నది గర్భంలో పెద్ద లోయ ఏర్పడుతోంది. అమరావతి సమీపంలోని కృష్ణానదిలో ఇసుక అక్రమ రవాణాతో ఏర్పడ్డ లోయలో పడే మంగళవారం ఐదుగురు యువకులు మృతి చెందడం గమనార్హం. -
తమ్మిలేరు ఇసుకపై రగులుతున్న సెగ
లోపూడి(ముసునూరు): ఇటీవల ప్రభుత్వం ఉచిత ఇసుక తోలకాలపై ఆంక్షలు సడలిం చింది. తమ్మిలేరు ఇసుక యధేచ్ఛగా తరలిపోతోంది. రెండు నెలల క్రితం మండలంలోనూ, సమీప మండలాల్లోని మరుగుదొడ్లు, గృహ అవసరాలకు గ్రామ సెక్రటరీల ద్వారా టోకెన్లు ఇచ్చి ఇసుక రవాణా చేయడానికి రెవెన్యూ, పోలీస్ వర్గాలు అనుమతులు ఇచ్చాయి. మరుగుదొడ్లు, గృహ అవసరాలకు కాకుండా వ్యాపారాల నిమిత్తం ట్రాక్టర్ల యజమానులు నూజి వీడు, చాట్రాయి మండలంలోని కొన్ని ప్రాంతాలు విస్సన్నపేట మండలాలకు అధిక ధరలకు తరలిస్తున్నారు. మండలంలోని తమ్మిలేరు పరివాహక ప్రాంత రైతులు ఇసుక తరలి పోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వలసపల్లి, గుళ్లపూడి, బలివే రేవుల నుంచి ఇసుక తరలించకుండా రైతులు నిలిపివేస్తున్నారు. అటువైపు అవకాశం లేకపోవడంతో అక్రమార్కులు లోపూడి రేవు నుంచి కొద్దిరోజులుగా వందల సంఖ్యలో ఇసుక తరలిస్తున్నారు. తమ్మిలేరులో చలమతీస్తే మంచినీరు దొరకని పరిస్థితి ఏర్పడిందని, పరివాహక ప్రాంతంలోని బోర్లు అడుగంటిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం గ్రామస్తులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇసుక తోలకాలను అడ్డుకోవాలని నిర్ణయించారు. ఇసుక ట్రాక్టర్లను నిలపడానికి తమ్మిలేరు దారిలో వ్యక్తిని నియమించారు. రోజువారి ఇసుక తవ్వకాలను నిర్వహిస్తున్న ట్రాక్టర్ యజ మానులు అడ్డుకున్నవారిని తిట్టడంతో వివాదం చెలరేగింది. ట్రాక్టర్ల యజమానులు తమను కులం పేరుతో దూషిస్తున్నారని, ఇసుక తోలడంతో ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. సమస్యను అధికారులు పరిష్కరించాలని ప్రజలు కోరు తున్నారు. -
కొనసాగుతున్న అక్రమ రవాణా
చిలమత్తూరు : అధికార పార్టీ నేతల అండదండలతో మండలంలో బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఒత్తిళ్ల కారణంగా అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గత మంగళవారం కొyì కొండ సమీపం నుంచి కర్ణాటకలోని కోలార్కు వెళ్తున్న రెండు లారీలను వాణిజ్య పన్నుల శాఖ స్పెషల్ ఏసీటీఓ బేబీనందా పట్టుకుని, అందులోని 33 టన్నుల బస్తాల బియ్యాన్ని సీజ్ చేసి పోలీస్స్టేçÙన్కు తరలించారు. కాగా లారీలను ఓపెన్ చేయకుండా ఎలాంటి ఉత్తర్వులు లేకుండా తూతూ మంత్రంగా రూ.2లక్షల వరకు అపరాధ రుసుం చెల్లించి వదిలేసినట్లు అధికారులు తెలిపారు. కాగా రెండు రోజుల నుంచి ఇదే రీతిలో కొత్తచెరువు ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతల లారీలు వెళ్తున్నా అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే.. బియ్యం లారీలు పట్టుకున్నప్పటి నుంచి అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని విలేకరుల సమావేశంలో స్పెషల్ ఏసీటీఓ స్వయంగా వెల్లడించారు. దీని ఆధారంగా చూస్తే అపరాధ రుసుం తూతూమంత్రంగా చెల్లిస్తేనే వదిలేసినట్లు తెలుస్తోంది. -
జోరుగా దేశీదారు
మహారాష్ట్ర నుంచి అక్రమ రవాణా గ్రామాల్లో విచ్చలవిడిగా విక్రయాలు పట్టించుకోని ఎక్సైజ్శాఖ అధికారులు తలమడుగు (తాంసి) : తాంసి మండలంలో దేశీదారు (మహారాష్ట్ర మద్యం) వ్యాపారం జోరుగా సాగుతోంది. సరిహద్దునే మహారాష్ట్ర ఉండడంతో అక్కడి మద్యం ఇక్కడ ఏరులై పారుతోంది. రోడ్డు మార్గంలోనే కాకుండా, కాలినడకన, ఎండ్లబండ్లు, రైళ్ల ద్వారా తాంసికి రవాణా అవుతోంది. మండలంలోని సరిహద్దు గ్రామాలు కరంజి, గుబిడి, అంతర్గావ్, అర్లి, గోముత్రి, భీంపూర్కు దేశీదారు వస్తోంది. ఇక్కడి నుంచి ఇతర గ్రామాలకు సరఫరా అవుతోంది. మండలంలోని 23 గ్రామపంచాయతీల్లో ఐదు, ఆరు గ్రామాలు మినహా అన్ని పంచాయతీల్లో ఈ దందా నడుస్తున్నా ఎకై ్సజ్శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో సారా వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. సరఫరా ఇలా.. రోడ్డు గుండా వీలు లేకపోతే కొండ సమీపంలోని పొలాల్లో డంప్ చేసి గ్రామాలకు తరలిస్తున్నారు. మన మద్యం అధిక రేట్లు ఉండడం..దేశీదారు తక్కువ ధరతోపాటు కిక్ ఎక్కువ ఉండడంతో మద్యం ప్రియులు దేశీదారుకు దాసోహం అవుతున్నారు. వ్యాపారులు వారి అలుసును ఆసరాగా చేసుకొని ఈ దందాను ఎంచుకున్నారు. దీన్ని నియంత్రించాల్సిన ఎకై ్సజ్ అధికారులు మాముళ్ల మత్తులో పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కానీ గ్రామాల్లో స్థానిక పోలీస్ ఎసై ్స దాడులు చేసి ఇటీవల దేశీదారు పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో కూడా ఈ మద్యం లభించగా కేసులు నమోదు చేశారు. చెక్పోస్ట్ లేకనే.. మండల సరిహద్దులో ఎలాంటి చెక్పోస్ట్ లేకపోవడం వ్యాపారులకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. అడిగే వారు లేక దర్జాగా దేశీదారు తెచ్చి విక్రయిస్తున్నారు. ఇది తాగి యువకులు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఎకై ్సజ్ శాఖ అధికారులు నిద్రమత్తు వీడి ఈ దందాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. కేసులు నమోదు చేస్తున్నాం మండలంలో అన్ని గ్రామాల్లో తిరుగుతూ దేశీదారు విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. మూడు నెలల్లో ఐదు సార్లు దేశీదారు విక్రయించిన వారిని పట్టుకొని కేసు నమోదు చేశాం. ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నాం. దేశీదారు విక్రయిస్తున్నట్లు మాదష్టికి వస్తే తప్పక చర్యలు తీసుకుంటాం. – రాములు, ఎక్సైజ్ ఎస్సై తాంసి -
ఇసుక అక్రమ రవాణా... ముగ్గురి అరెస్ట్
కొవ్వూరు(పశ్చిమగోదావరి): గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని ముగ్గురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం సీతంపేట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. లారీని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇసుక తరలించడానికి ఉపయోగించిన బోటును వదిలేయడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న వైఎస్సార్సీపీ నాయకులు
యలమంచిలి (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలోని ఇసుక ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో.. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ర్యాంపు వద్దకు చేరుకొని అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అడ్డుకుని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అక్రమ రవాణాను అరికట్టాలని ధర్నాకు దిగారు. -
పేలుడు పదార్థాల అక్రమ రవాణ ముఠా అరెస్ట్
పేలుడు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు యువకులను రాజేంద్రనరగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రహదారి పై వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బైక్పై పెలుడు పదార్థాలను తీసుకెళుతున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 150 జిలెటిన్ స్టిక్స్, 150 డిటోనేటర్స్తో పాటు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల అక్రమ రవాణ కింద కేసు నమోదు చేసిన పోలీసులు వీటిని ఎక్కడికి తీసుకువెళుతున్నారు..? ఎక్కడి నుంచి తెచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
గోల్డెన్ రూట్.. దుబాయ్ టు హైదరాబాద్
► వ్యవస్థీకృతంగా బంగారం అక్రమ రవాణా ► సూత్రధారులుగా రియల్టర్లు, బడా వ్యాపారులు ► సహకరిస్తున్న కస్టమ్స్, విమాన, హౌస్ కీపింగ్ సిబ్బంది ► ప్రత్యేక సర్జరీలతో ‘క్యారియర్లు’ సిద్ధం ►గత ఏడాది శంషాబాద్లో చిక్కింది 150 కేజీల పైనే 2014 జనవరి 12న ఐదు కేజీలు... 15న ఒక కేజీ... ఫిబ్రవరి 10న అర కేజీ... 28న రెండున్నర కేజీలు... మార్చి 4న ఒకటిన్నర కేజీలు... 13న ఆరున్నర కేజీలు... 20న 1.9 కేజీలు... ఏప్రిల్ 1న ఆరున్నర కేజీలు...5న ఒకటిన్నర కిలోలు... ఆ మరుసటి రోజు 685 గ్రాములు... మే 12న రెండు కిలోలు... 9న 15.7 కేజీలు... 30న 387 గ్రాములు... జూన్ 1న ఒకటిన్నర కిలోలు... సెప్టెంబర్లో రెండు కేజీలు... శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న అక్రమ బంగారం లెక్కలివి. మొత్తమ్మీద గత ఏడాది 150 కేజీల పైనే ఈ ఎయిర్పోర్ట్లో పట్టుబడింది. సాక్షి, సిటీబ్యూరో: దుబాయ్ కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ వ్యవహారంలో అనేక మంది పాత్రధారులుగా... నగరానికి చెందిన కొందరు బడాబాబులు సూత్రధారులుగా ఉంటున్నారు. భారత మార్కెట్లో బంగారం ధర పెరగడంతో పాటు దిగుమతి సుంకం పైకి... రూపాయి విలువ కిందికి చేరడమే స్మగ్లర్లకు కలిసి వస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎలా చూసినా కేజీ బంగారం అక్రమ రవాణా చేస్తే కనిష్టంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల లాభం ఉంటోందని అంచనా వేస్తున్నారు. స్మగ్లర్లకు స్వర్గధామంగా దుబాయ్ దుబాయ్... ఇప్పటి వరకు కేవలం హవాలా రాకెట్లకు మాత్రమే పేరుగాంచగా... ఇప్పుడు బంగారం అక్రమ రవాణాకూ కేంద్రంగా మారిపోయింది. ఆ దేశంలో ఆదాయపు పన్ను లేకపోవడంతో మనీలాండరింగ్ వ్యవహారమే ఉత్పన్నం కాదు. దీంతో ఇక్కడి నుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని అక్కడకు పంపి... దాన్ని బంగారంగా మార్చి ఇక్కడికి తీసుకు వస్తున్నారు. దుబాయ్లో ఓ వ్యక్తి ఎంత భారీ మొత్తంలో అయినా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దాన్ని విమానంలోకి తీసుకువచ్చేటప్పుడు కూడా కేవలం చోరీ సొత్తు కాదని ఆధారాలు చూపిస్తే చాలు. అధికారులు అభ్యంతరం చెప్పరు. దీన్ని ఆసరాగా చేసుకుని అక్కడ చాలా తేలిగ్గా విమానంలోకి బంగారాన్ని తరలించేస్తున్న స్మగ్లర్లు ఇక్కడ బయటకు తీసుకువచ్చే సమయాల్లోనే పట్టుబడుతున్నారు. క్యారియర్లను ఏర్పాటు చేసుకుని... ఈ పరిణామాల నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు భారీగా అక్రమ రవాణాకు పాల్పడటం ద్వారా లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వ్యవస్థీకృత ముఠాలతో పాటు హైదరాబాద్కు చెందిన బడా బాబులు రంగంలోకి దిగారు. ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ యజమాని, రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకుడు క్యారియర్లను ఏర్పాటు చేసుకుని దందా ప్రారంభించారని ఇప్పటికే కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అబ్దుల్ ఖాదర్, సుజాత్ అలీ సహా మరికొందరు మధ్యవర్తుల ద్వారా కేరళకు చెందిన వారితో పాటు పాతబస్తీకి చెందినయువకులు, యువతులు, మహిళలకు కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి టిక్కెట్లు కొనిచ్చి విదేశాలకు పంపడం ద్వారా తిరిగి వచ్చేటప్పుడు అక్కడి తమ ముఠా సభ్యుల సహకారంతో బంగారం ఇచ్చి పంపిస్తున్నారు. వీరిని సాంకేతిక పరిభాషలో ‘క్యారియర్లు’ అంటారు. కలసి వస్తున్న విమాన సర్వీసులు అంతర్జాతీయ సర్వీసులను నడిపే అన్ని విమానయాన సంస్థలూ మార్గ మధ్యలో దేశవాళీ సర్వీసుగా మార్పును ప్రోత్సహించవు. కేవలం కొన్ని మాత్రమే ఈ విధానాన్ని అవలంభిస్తున్నాయి. దీని ప్రకారం దుబాయ్ తదితర దేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుగా ప్రారంభమైన ఓ విమానం దేశంలోకి ప్రవేశించిన తరవాత దాన్ని దేశవాళీ సర్వీసుగా వినియోగిస్తుంది. డొమెస్టిక్ ట్రావెల్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న... అప్పటికప్పుడు కొనుగోలు చేసిన ప్రయాణికులను దేశీయంగా అంతర్జాతీయ ప్రయాణికులతో కలిపి గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. దీంతో పాటు ఈ ఎయిర్లైన్స్ టిక్కెట్లు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే సమయంలో కల్పిస్తున్న మరో సౌకర్యం కూడా స్మగ్లర్లకు కలిసి వస్తోందని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అనేక మందితో స్మగ్లర్ల ములాఖత్... కస్టమ్స్ తనిఖీల్లో బంగారం చిక్కకుండా సురక్షితంగా విమానాశ్రయం బయటకు తీసుకు రావడానికి స్మగ్లర్లు అనేక మందితో ములాఖత్ అవుతున్నారు. ఎయిర్లైన్స్ సిబ్బందితో పాటు హౌస్ కీపింగ్ వారితోనూ సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. క్యారియర్ ప్రయాణిస్తున్న విమానం వివరాలను వీరికి స్మగ్లర్లు ముందే చెప్పి డ్యూటీల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ల్యాండ్ అయిన వెంటనే క్యారియర్లు విమానం లోపల... ఎయిర్పోర్ట్లో ఉన్న మూత్రశాలల్లోకి వెళ్లి తమ వద్ద ప్యాక్ చేసి ఉన్న బంగారాన్ని అందులో వేసేస్తారు. ఆ రోజు ప్యాక్ను ఎక్కడ వేయాలన్నది ఎయిర్లైన్స్, హౌస్కీపింగ్ సిబ్బంది సూచనల మేరకు వీరికి ముందే చెప్తారు. ఆపై క్యారియర్ కస్టమ్స్ క్లియరెన్స్ తరవాత బయటకు వచ్చి నిర్ణీత ప్రాంతంలో ఎదురు చూస్తారు. అంతర్జాతీయ విమానాల హడావుడి తగ్గిన తరవాత ఎయిర్లైన్స్, హౌస్కీపింగ్ సిబ్బంది డస్ట్బిన్స్లోని ప్యాకెట్లను గ్రౌండ్ ఫ్లోర్ ద్వారా తనిఖీలకు చిక్కకుండా చెత్త మాదిరిగా బయటకు తీసుకువచ్చి మళ్లీ క్యారియర్లకు అందిస్తారు. దీని నిమిత్తం వీరికి కేవలం నామమాత్రం చెల్లిస్తారు. కొందరు కస్టమ్స్ అధికారులు సైతం ఇదే తరహాలో స్మగ్లర్లకు సహకరిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. క్లెయిమ్ చెయ్యకుంటే వేలమే కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను గుర్తించడానికి 95 శాతం ప్రొఫైలింగ్ పద్ధతినే అనుసరిస్తారు. ప్రయాణికుడి ప్రవర్తన, నడవడికతో పాటు పాస్పోర్ట్లో ఉన్న వివిధ దేశాల ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులు, విదేశంలో ఉన్న సమయం... తదితరాలను పరిగణనలోకి తీసుకుని అనుమానితులను గుర్తిస్తారు. బయటి రాష్ట్రాల్లో జారీ అయిన పాస్పోర్డులు కలిగిన వారు ఇక్కడ ల్యాండ్ అయినా అనుమానించి తనిఖీలు చేస్తారు. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం వెనుక భారీ కుట్ర లేకపోతే దాన్ని తిరిగి అప్పగించడానికే ప్రాధాన్యం ఇస్తారు. స్మగ్లర్ బంగారం తనదే అని క్లెయిమ్ చేసుకుంటే దాని విలువపై 50 నుంచి 60 శాతం కస్టమ్స్ డ్యూటీ వసూలు చేసి ఇచ్చేస్తారు. ఇలా చేయాలంటే ‘వైట్ మనీ’ జమ చేయాల్సి ఉండటంతో అనేక మంది వదిలేస్తారు. ఎవరూ క్లెయిమ్ చేయకపోతే ఆ బంగారాన్ని చెన్నై, ముంబైలలోని కస్టమ్స్ కార్యాలయాలకు తరలించి అక్కడ వేలం ద్వారా విక్రయిస్తారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. మధ్య సీట్లలోనే మతలబు... వ్యవస్థీకృత ముఠాలు ప్రణాళిక ప్రకారం అక్రమాలు సాగిస్తున్నాయి. అక్రమ బంగారంతో దుబాయ్ నుంచి బయలుదేరే ఓ ఏజెంట్ ఈ ఇంటర్నేషనల్ కమ్ డొమెస్టిక్ విమానంలో ఢిల్లీ లేదా ముంబై వరకు వస్తాడు. బంగారం ఉన్న బ్యాగ్ను అతడు కూర్చున్న సీటు కిందే వదిలి అంతర్జాతీయ ప్రయాణికుడిగా ఆయా మెట్రోల్లో విమానం దిగి కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకుని బయటకు వచ్చేస్తాడు. నేరుగా డిపాచర్ లాంజ్కు వెళ్లి అదే విమానంలో హైదరాబాద్ వెళ్లడానికి అనువుగా ముందే బుక్ చేసుకున్న టిక్కెట్ తో దేశవాళీ ప్రయాణికుడిగా అంతకు ముందు కూర్చున్న సీటులోనే కూర్చుంటాడు. అనుకున్న ప్రకారం అతడు హైదరాబాద్ చేరినా... దేశవాళీ ప్రయాణికుడు కావడంతో ఎలాంటి కస్టమ్స్ తనిఖీలు లేకుండా విమానాశ్రయం నుంచి బంగారంతో సహా బయటకు వచ్చేస్తున్నాడు. కొన్ని సంస్థల విమాన టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికుడు తమకు అనువైన సీటునూ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని స్మగ్లర్లు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నిర్ణీత సమయానికి ముందుగానే విడివిడిగా ఒకే విమానంలో టిక్కెట్లు బుక్ చేసుకుంటూ... రెండు సర్వీసుల్లోనూ ఒకే సీటును ఎంచుకుంటున్నారు. విమానంలో రెండు వైపులా మూడేసి చొప్పున సీట్లు ఉంటాయి. వీటిలో మధ్యలో ఉండే రెండు సీట్లకూ డిమాండ్ తక్కువగా ఉంటుంది. దీంతో ఆ సీట్లనే ఎంచుకుని ఇబ్బంది లేకుండా పథకాన్ని అమలు చేస్తున్నారు. శస్త్రచికిత్సతో రెక్టమ్ కన్సీల్మెంట్... అత్యధిక శాతం స్మగ్లర్లు బంగారాన్ని బ్యాగుల అడుగు భాగంలో ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్ బాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పౌడర్ డబ్బాలతో పాటు మెబైల్ చార్జర్స్లోనూ దాచి తీసుకువచ్చేవారు. ఆ తరవాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తీసుకువచ్చారు. ఆపై రెక్టమ్ కన్సీల్మెంట్ జోరుగా సాగుతున్నట్టు గత ఏడాది వెలుగులోకి వచ్చిన మూడు కేసులు నిర్థారిస్తున్నాయని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. సుదీర్ఘ కాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా కేజీ వరకు బంగారాన్ని పెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుంటున్న క్యారియర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న ఉల్లి స్వాధీనం
సాలూరు: విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని చిన్నబజారు జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 35 బస్తాల ఉల్లి, 5 బస్తాల వెల్లుల్లిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి బిల్లులు లేకపోవటంతో పట్టుకున్న ఉల్లిపాయలను, వెల్లుల్లి పాయలను స్థానిక తహశీల్దార్కు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పశు మాఫియా.. ఘోరాతి ఘోరం!
ప్రతివారం 25వేల పశువుల రవాణా లారీల్లో కుక్కి, తాళ్లతో కట్టి తరలింపు వారానికి రూ.12.50 కోట్ల లావాదేవీలు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం విజయనగరం కంటోన్మెంట్: వారపు సంతలంటే ఒకప్పుడు పాడి ఆవులతోనూ, దుక్కిటెడ్లతోనూ కళకళలాడేవి. రైతులే స్వయంగా క్రయవిక్రయాలు జరిపేవారు. అందమైన బలిష్టమైన పాడి, దుక్కిపశువులుండే ఆ సంతలు ఇప్పుడు మాఫియా నీడలో నడుస్తున్నాయి. అప్పట్లో నెలకు రూ.పది వేల వ్యాపారం జరిగితే అదే పెద్ద రికార్డు కింద లెక్క. కానీ ఇప్చడు వారానికే దాదాపు రూ.12 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. బక్కచిక్కిన శరీరంతో దీనంగా ఆహారం కోసం, గుక్కెడు నీటికోసం ఎదురు చూస్తున్న పశువులే సంతల్లో దర్శనమిస్తున్నాయి. ఒడిశాలో పశువుల రవాణా నిషేధం. దీంతో అక్కడి మారుమూల ప్రాంతాల నుంచి దళారులు దాదాపు వారం రోజుల పాటు గ్రాసం, నీరు ఇవ్వకుండా నడిపిస్తూ తీసుకువచ్చి జిల్లాలోని మానాపురం, అచ్యుతాపురం,అలమండ తదితర సంతల్లో లారీల్లో కుక్కి కేరళ, తమిళనాడుకు పశువులను తరలిస్తున్నారు. జిల్లాలో పెదమానాపురం పశురవాణాకు ప్రధాన కేంద్రంగా మారింది. పశువుల రవాణాలో కనీస నిబంధనలు పాటించడంలేదు. ఒక వేగన్లో 30 నుంచి 45 వరకూ పశువులను కుక్కి తరలిస్తున్నారు. మాంసం కోసమే కదా అని పశువుల కాళ్లు విరగొట్టి మరీ ఒక దానిపై మరో పశువును ఎక్కించి తరలిస్తున్నారు. పశువుల తరలింపులో కనీస నిబంధనలు కూడా పాటించడంలేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. అడ్డుకోవాల్సిన పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పశుమాఫియాకు సహకరిస్తుండడంతో వారి వ్యాపారం కోట్లకు పడగలెత్తింది. వారానికి 25 వేలు.. సంతల వారీగా ఒక వారంలో తరలించే పశువుల సంఖ్య ఇది..! జిల్లాలోని పార్వతీపురం, బబ్బిలి, కూనేరు, అడ్డాపుశీల, సాలూరు, అచ్యుతాపురం, కంది వలస, మోపాడలతో పాటు పెదమానాపురం సంతల నుంచి ప్రతీ వారం 25 వేలకు పైబడి పశువులు అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఒక్కొక్క పశువును రూ.4వేల నుంచి రూ.15వేల వరకూ కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క పశువు ఖరీదు సగటున రూ.5వేలకు లెక్కిస్తే 25 వేల పశువుల ధర రూ.12.50 కోట్లవుతుంది. 44 పోలీసు స్టేషన్లు.. 20 చెక్పోస్టులు ఒడిశా నుంచి ఆంధ్రా దాటే వరకూ ఎన్నో చెక్పోస్టులు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కానీ ఎక్కడా పశు రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. పశువులతో పాటు, జిల్లాకు చెందిన వాటిని కూడా రవాణా చేస్తున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రాకు వచ్చేందుకు రెండు దారులున్నాయి. ఆ మార్గాల గుండా పశువులు ఆంధ్రాలోకి ప్రవేశిస్తున్నాయి. జిల్లాలో 44 పోలీస్ స్టేషన్లు, రెండు పోలీస్ చెక్పోస్టులున్నాయి. పాచిపెంట మీదుగా వచ్చినపుడు పి కోనవలస చెక్ పోస్ట్, అక్కడే పోలీస్ స్టేషన్, సాలూరులో సర్కిల్ కార్యాలయం, రామభద్రపురంలో పోలీస్ స్టేషన్, బూర్జి వలస, పెదమానాపురంలలో పోలీస్ స్టేషన్లు, గజపతినగరంలో సర్కిల్ కార్యాలయం ఆ తరువాత బండపల్లి, విజయనగరం పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కానీ ఎక్కడా ఈ పశు రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. స్థానిక నేతల సహకారంతోనే.. జిల్లాలో అన్ని రంగాల వారితో పరిచయముంటున్న కొందరు చోటామోటా స్థానిక నాయకులతో ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ పశురవాణా వ్యాపారులు సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. పశురవాణాలో ఆటంకాలు ఎదురైనప్చడు ఈ నేతలు రంగంలోకి దిగుతారు. వెంటనే సెటిల్ మెంట్లకు తెర తీస్తారు. వారితో బేరం పెట్టుకుని మరెప్పుడూ ఈ పశు రవాణా జోలికి రాకుండా సెటిల్ చేస్తారు. అది ఒక్కసారే కావచ్చు! లేదా ప్రతీ వారం పెన్షన్ పద్ధతిలోనూ కావచ్చు. మొత్తానికి ఏదో ఒక సెటిల్ మెంట్ ఖాయం. ఈ సెటిల్ మెంట్ అనేది చిన్న చిన్న వాళ్లయితే ఒకేసారి ఎంతో కొంత మొత్తాన్ని జేబులో పెట్టి పంపేస్తారు. నిత్యం వీడితో గొడవ పడాల్సి ఉంటుందని భావిస్తే ప్రతీ నెలా కొంత మొత్తం ఇస్తామని పరస్పర అంగీకారం జరుగుతుంది. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలకు మామూళ్లు? జిల్లాలో పశు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ,పోలీస్ అధికారులు ప్రతినెలా పెద్ద ఎత్తున ఠంచనుగా మామూళ్లు అందుతుండడం వల్లే పశుఅక్రమ రవాణాకు అడ్డూ ఆపూ లేకుండా జరిగిపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఉన్న సంతలతో పాటు ఒడిశాలోని చిత్ర తదితర సంతల నుంచి కొనుగోలు చేసి మానాపురం వరకూ తరలిస్తారు. కాలినడకన మానాపురం వరకూ తరలించేందుకు స్థానికులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒక్కో వ్యక్తికి 20 నుంచి 50 పశువులను అప్పగిస్తారు. వారు పశువులను తరలించినందుకుగాను ఒక్కొక్క పశువుకు రూ.150 నుంచి 200 వరకూ చెల్లిస్తారు. రాత్రీ పగలు అనే తేడా లేకుండా పశువులకు విశ్రాంతి ఇవ్వకుండా వారం రోజుల పాటు నడిపించి మానాపురం సంతకు తీసుకువస్తారు. అలా తీసుకువచ్చిన పశువులకు గడ్డి, నీరు ఇవ్వకుండా మానాపురం వద్ద సామర్థ్యానికి మించి లారీల్లో కుక్కి తాళ్లతో బంధించి రవాణా చేస్తున్నారు. చెన్నై, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. ఆవేదన భరితంగా అంబారావాలు రవాణా సమయంలో పశువులు దయనీయంగా అరుస్తున్నా పట్టించుకోవడం లేదు. వాటికి గడ్డీ, నీరు ఇవ్వకుండా తాళ్లతో బంధించి వందల కిలోమీటర్లు రవాణా చేస్తుండడంతో ఆకలికి అవి దీనంగా అరుస్తుంటే పెద్ద కర్రలతో కొట్టి వాటి నోరు మూయించి హింసిస్తున్నారు. వారు పెట్టే హింస భరించలేక కబేళాకు వెళ్లకముందే పశువులు వాహనాల్లోనే మరణిస్తున్నాయి. -
షూలో మూడు కిలోల బంగారం..
శంషాబాద్(హైదరాబాద్): బూట్లలో దాచుకుని అక్రమంగా రవాణా చేస్తున్న మూడు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం అర్ధరాత్రి దుబాయి నుంచి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విమానంలో వచ్చిన హైదరాబాద్కు చెందిన ఓ ప్రయాణికుడి తీరును అనుమానించిన అధికారులు అతడిని పూర్తిగా తనిఖీ చేశారు. అతడు వేసుకున్న షూ లోపలి భాగంలో మూడు కిలోల బరువున్న బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వాటి విలువ రూ.75 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.30 లక్షల ఇసుక డంపులు స్వాధీనం
నల్లగొండ (దామెరచర్ల) : అక్రమంగా తరలించడానికి సిద్ధం చేసిన మూడు ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుక విలువ రూ. 30 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి శివారులో గురువారం జరిగింది. వాడపల్లి గ్రామం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టిన రెవెన్యూ అధికారులకు గ్రామ శివారులో మూడు ఇసుక డంపులు కనిపించాయి. దీంతో అధికారులు వాటిని సీజ్ చేశారు. దామరచర్ల తహశీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. సీజ్ చేసిన ఇసుక డంపులను మైన్స్ అధికారులకు అప్పగిస్తామని ఆమె తెలిపారు. -
3 ట్రాక్టర్ల కంకర సీజ్
బుచ్చిరెడ్డిపాళెం: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం నాగాయకుంట నుండి అక్రమంగా గ్రావెల్ను తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కొడవలూరుకు చెందిన చక్కా నారయ్య, ఆయన అనుచరులు 3 ట్రాక్టర్లలో శనివారం ఉదయం గ్రావెల్ను అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచారంతో వీఆర్వో మోహన్, ఎస్ఐ శ్రీనివాసరావు దాడిచేశారు. ఈ దాడిలో 3 ట్రాక్టర్లతో పాటు ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. గ్రావెల్ తరలిస్తున్న వ్యక్తులు పరారయ్యారు. వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ముల్కలపల్లి టు ఆఫ్రికా
పేదల కడుపు నింపే బియ్యం అక్రమార్గాన విదేశీ బాట పడుతోంది. కిలో రూపాయి బియ్యానికి ‘సన్నని’ మెరుగులు దిద్ది జిల్లా సరిహద్దులు దాటించి విదేశాలకు తరలిస్తున్నారు. ఇందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఓ ముఠానే ఏర్పడడం గమనార్హం. డీలర్లు, ఈ బియ్యం రుచించని లబ్ధిదారుల వద్ద .. ఈ ముఠా కొనుగోలు చేసి ఏకంగా లారీల్లో పాలిషింగ్కు నల్లగొండ, వరంగల్ జిల్లాలకు తరలిస్తోంది. ఇక్కడ పాలిషింగ్ చేసి కాకినాడ పోర్టుకు.. అక్కడి నుంచి ఆఫ్రికన్ దేశాలకు అమ్మకం పెడుతున్నారు. రీసైక్లింగ్ చేసిన రేషన్ బియ్యూన్ని జిల్లాలోనూ సన్న బియ్యంలో కలిపి అమ్ముతున్నారు. ఖమ్మం: జిల్లాకు ప్రతినెల రేషన్ బియ్యం 14 వేల టన్నులు సరఫరా అవుతుంది. రేషన్ అర్హత ఉన్న లబ్ధిదారులు, హాస్టళ్లకు వీటిని పంపిణీ చేస్తున్నారు. ప్రతినెల పలు చోట్ల రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తూ అక్రమార్కులు దొరి కిన ఘటనలు కోకొల్లలు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేశామని సంబంధిత అధికారులు ఎప్పుడూ చెబుతున్నా రేష న్ బియ్యం మాత్రం పక్కదారి పట్టే పరంపరంకు బ్రేక్ పడ డం లేదు. గతంలో కొంతమంది డీలర్లు ఈ బియ్యాన్ని అమ్మకానికి పెట్టి సస్పెండ్ అయ్యారు. అయినా కొంత మంది ఇదే మార్గం కాసులు కురిపిస్తుండడంతో గుట్టుచప్పుడు కాకుండా అమ్మకానికి పెడుతూనే ఉన్నారు. ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు 19 రేషన్ దుకాణాలపై కేసులు నమోదు చేయడం ఇం దుకు నిదర్శనం. ఈ ఏడాది ప్రారంభం నుంచి మే 15 వరకు జిల్లా వ్యాప్తంగా 139 కేసులు నమోదయ్యాయి. రూ.12.30 లక్షల విలువ చేసే ప్రజా పంపిణీ సరుకులను అధికారుల దాడిలో స్వాధీనం చేసుకున్నారు. ఇంత మొత్తంలో పట్టుబడుతున్నా అధికారులు మాత్రం నామ మత్రపు కేసులు పెడుతుండడంతో ఈ మర్గాన్నే ఎంచుకున్న ఓ ముఠా జిల్లాలో యథేచ్ఛగా ఈ దందాను కొనసాగిస్తోంది. కోదాడ, డోర్నకల్.. జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం సేకరించడానికి బైక్లు, ఆటోలతో కూడిన ఓ ముఠా ఏర్పాటు అయింది. రేషన్ డీలర్ల వద్ద మిగిలిన బియ్యంతో పాటు అమ్మకానికి పెడుతున్న కొంతమంది లబ్ధిదారుల నుంచి ఈ ముఠా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తుంది. కేజీ రూపాయి బియ్యానికి రూ.8 నుంచి రూ.10 వరకు వీరి నుంచి కొనుగోలు చేస్తారు. ఇవన్నీ 25 కేజీలు, 50 కేజీల బ్యాగులుగా చేసి ఆటోలు, లారీల్లో రీసైక్లిం గ్కు తరలిస్తారు. జిల్లాలోని ముల్కలపల్లి కేంద్రంగా ఎక్కువగా ఇలా బియ్యం రీసైక్లింగ్ అవుతున్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం ఉంది. అలాగే జిల్లా సరిహద్దున ఉన్న నల్లగొండ జిల్లా కోదాడ, వరంగల్ జిల్లా డోర్నకల్, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా జగయ్యపేటకు వీటిని తరలిస్తున్నారు. అక్కడ మిల్లర్లు రీసైక్లింగ్ చేసి ఏకంగా సన్నం బియ్యంలో మిక్స్ చేసి రూ.35 నుంచి రూ.40 వరకు అమ్ముతూ అక్రమ దందాకు తెరలేపారు. నిఘా లేకపోవడంతోనే.. జిల్లాలో రీసైక్లింగ్ చేసిన రేషన్ బియ్యం విదేశాలకు కూడా సరఫరా చేస్తున్నారంటే.. ప్రజా పంపిణీ వ్యవస్థ నిఘా కొరవడడమేనన్న ఆరోపణలున్నాయి. జిల్లా నుంచి ఇలా గుట్టుచప్పుడు కాకుండా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ పోర్టు ద్వారా ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నట్లు విజిలెన్స్ ఎస్పీ పేర్కొనడం గమనార్హం. అధికారుల కన్నుగప్పి భారీ ఎత్తున రేషన్ బియ్యం ఇలా సరిహద్దులు దాటి పోతుందనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా కొంతమంది మిల్లర్లు కూడా ఈ బియ్యా న్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి లేవీ పెడుతున్నట్లు సమాచారం. జిల్లా సరిహద్దులో నిఘా పటిష్టంగా లేకపోవడంతో ఓ ముఠా రేషన్ బియ్యం దందాను జోరుగా కొనసాగిస్తోంది. సరిహద్దులో వ్యవసాయ శాఖ చెక్పోస్టులు ఉన్నా నామ మాత్రంగా తనిఖీల వల్ల రేషన్ బియ్యం సరిహద్దులు దాటుతోంది. ప్రధానంగా టాస్క్ఫోర్స బృందం లేకపోవడం రేషన్ అక్రమార్గం పట్టడానికి కారణమవుతోంది. డీలర్లు ఎంత బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేశారు..? మిగిలినది ఎంత..? మిల్లర్లు లేవీకి ఏ బియ్యం పెడుతున్నారు..? తదితర కోణాల్లో అధికారుల పర్యవేక్షణ చేయకపోవడంతోనే బియ్యం పక్కదారి పడుతోందంటున్నారు. నామ మాత్రంగా కేసులు.. రేషన్ పట్టుబడిన విషయంలో అధికారులు ఇప్పటి వరకు నామ మాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో కొన్నాళ్లకే బెయిల్ తెచ్చుకొని నిందితులు మళ్లీ రేషన్ బియ్యం దందా చేస్తున్నారు.కాగా గురువారం ఖమ్మంలో .. కొణిజర్ల నుంచి కోదాడ తరలిస్తున్న 120 క్వింటాళ్ల బియ్యాన్ని సివిల్ సప్లయ్, విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇలా తరలిస్తున్న ముఠా సభ్యులపై గతంలో పల్లుమార్లు రేషన్ బియ్యం అక్రమార్గం పట్టించడంపై కేసులు నమోదయ్యాయి. అయితే రేషన్ బియ్యం పట్టుబడిన విషయంలో తొలిసారిగా అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈసీ యాక్టు 1955 సెక్షన్ 7,8 కింద వీరిపై కేసులు పెట్టారు. క్రిమినల్ కేసులతో కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు చెబుతున్నా ప్రజా పంపిణీ వ్యవస్థలో నిఘాను పటిష్టం చేయాల్సి ఉంది. -
కోణార్క్ ఎక్స్ప్రెస్ లో 129 కేజీల గంజాయి
మహబూబాబాద్ : కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో అక్రమంగా తరలిస్తున్న 129 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో విశాఖ నుంచి ముంబైకి గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో రైల్వే పోలీసులు రైలు మహబూబాబాద్ స్టేషన్లో ఆగగానే తనిఖీలు నిర్వహించారు. నిందితులు మొత్తం 129 కేజీల గంజాయిని 8 భాగాలుగా విభజించి వేరు వేరు సంచుల్లో ఉంచి రవాణా చేస్తున్నారు. రైల్వే పోలీసులు 129 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కలపకు కాళ్లు !
తాడేపల్లి రూరల్ : అక్రమంగా కలప తరలింపు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లు నరికి సొమ్ము చేసుకుంటున్న వారి దందా అధికమైంది. అడిగే వారు లేకపోవడంతో యథేచ్ఛగా దోచుకుంటున్నారు. తాడేపల్లి మండలం గుండిమెడలో జరుగుతున్న అక్రమ కలప తరలింపు వ్యవహారం ఇది.. వివరాల్లోకి వెళితే... గ్రామంలోని ఇసుక క్వారీ సమీపంలో కృష్ణానదీ చెంత దాదాపు 300 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇక్కడ ఇంగ్లిషు కంప చెట్లు ఇతర చెట్లు భారీగానే ఉన్నాయి. అక్రమార్కుల కన్ను వీటిపై పడింది. ఇంకేముంది వెనుకా ముందు ఆలోచించకుండా పర్యవరణానికి మేలు చేసే చెట్లను విక్షణారహితంగా నరికివేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీని కోసం కూలీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిత్యం గుంటూరు, తెనాలి తదితర ప్రాంతాలకు ట్రాక్టర్లు, లారీల్లో తరలిస్తున్నారు. పెద్ద పెద్ద దుంగలను నరికి గుట్టలుగా పేర్చి అమ్ముకుంటున్నారు. అయితే, ఊరికి దూరంగా ఎక్కడో లోపల ఇసుక క్వారీకి అవతల ఈ తతంగం అంతా జరుగుతుండడంతో, బాహ్య ప్రపంచానికి కలప అక్రమ తరలింపు గురించి తెలియడం లే దు. అక్రమ ఆదాయానికి అలవాటు పడ్డ కొందరు ఈ చెట్లతో వ్యాపారం సాగిస్తున్నారు. రోజు కూలికి ఆశపడి వచ్చే కూలీలు ఇవేమీ తెలియక చెట్లు నరికే పనిలో నిమగ్నమైపోతున్నారు. అసైన్డ్ భూమిలోకి అందునా పంచాయతీ లంక భూముల్లోకి ప్రవేశించాలంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పని సరిగా ఉండాలి. కానీ, అక్రమార్కులు ఇవేమీ లేకుండానే చెట్లను నరుకుతూ, పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. మరో వైపు లక్షలు సంపాదిస్తున్నారు. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సైతం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. లక్షల విలువ చేసే ప్రభుత్వ సంపద అక్రమంగా తరలి పోతుంటే ఏ అధికారి స్పందించక పోవడంపై పలువురు మండిపడుతున్నారు. ఇకనైనా అక్రమార్కుల ఆగడాలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు. -
ఇసుక మాఫియా.. మజాకా!
నిఘా పెంచడంతో గాడిదలపై అక్రమ రవాణా జోగిపేట: సర్కారు ఒక్కడుగు ముందుకేస్తే.. దాన్ని అడ్డుకునేందుకు ఇసుక మాఫియా మూడు అడుగులు వేస్తోంది. మంజీర నది ఒడ్డును ఇప్పటికే పూర్తిగా ఊడ్చేసిన ఇసుక మాఫియా.. నది మధ్యలోని నాణ్యమైన ఇసుక తరలించేందుకు సరికొత్త ఎత్తుగడ వేసింది. అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెంచిన నేపథ్యంలో.. లారీలు, ట్రాక్టర్లను వదిలేసి గాడిదలను రంగంలోకి దించింది. వాహనాలు నది మధ్యలోకి వెళ్లలేక పోవ డం.. పోలీసు నిఘా ఎక్కువ అవడం మాఫియాకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో నది మధ్యలోకి వెళ్లి నాణ్యమైన ఇసుక తీసుకురావడంతోపాటు, ఎవరికీ కనిపించకుండా కొండలు, పొదలు, పంట పొలాల మధ్య నుంచి ఇసుక తరలించేందుకు గాడిదలను ఉపయోగిస్తోంది మాఫియా. ఇందుకోసం పొరుగు రాష్ట్రం నుంచి గాడిదలను, వాటి యజమానుల కుటుంబాలను రప్పించింది. ఒక్కో గ్యాంగ్ సగటున 20- 25 గాడిదలను వినియోగిస్తోంది. ఒక్కో గాడిద ట్రిప్పుకు 50 నుంచి 60 కిలోల ఇసుక మోస్తుంది. మెదక్ జిల్లా రాయికోడ్ మంజీర పరీవాహక ప్రాంతం నుంచి నిజామాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామం ఎల్గోయ్ వరకుఇదే పరిస్థితి. వందల సంఖ్యలో గాడిదల గుంపులు ఇసుకను తరలిస్తున్నాయి. గాడిదలు మోసుకొచ్చే నాణ్యమైన ఇసుక ట్రిప్పుకు రూ.800 చొప్పున గాడిదల యజమానులకు వ్యాపారులు చెల్లిస్తున్నారు. -
డెలివరీ చలానాలే వే బిల్లులు!
- ఎమ్మెస్టీ ప్రయాణికులే రవాణా సారధులు - పలాస నుంచి యథేచ్ఛగా జీడిపప్పు అక్రమ రవాణా - బిల్లులు ఉండవు.. పన్నులు చెల్లించరు - ఎగుమతులు మొత్తం ఆరుగురు బ్రోకర్ల చేతుల్లోనే - ప్రతి నెలా కోట్లలో ఎగుమతులు - ఆ మేరకు పన్ను ఆదాయం కోల్పోతున్న ప్రభుత్వం పలాస : జీడి పరిశ్రమలకు కేంద్రమైన శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి జీడిపప్పు రకరకాల మార్గాల్లో యథేచ్ఛగా అక్రమ రవాణా అవుతోంది. పక్కనున్న ఒడిశాతోపాటు పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు ఎటువంటి బిల్లులు లేకుండానే రవాణా చేస్తున్నారు. గతం నుంచీ ఇది జరుగుతున్నా పలాస మార్కెట్ కమిటీ(ఏఎంసీ) అధికారులు ఇటీవల దాడి చేసి రూ.28 లక్షల విలువైన జీడిపప్పును సీజ్ చేయడంతో ఈ అక్రమ రవాణా బాగోతం మరోమారు చర్చనీయాంశమైంది. దీంతో సంబంధిత శాఖల అధికారులు దీనిపై దృష్టి సారించారు. జీడిపప్పు వ్యాపారులు పన్ను ఎగవేస్తూ, ఎటువంటి వే బిల్లులు లేకుండానే రవాణా చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతోంది. కాశీబుగ్గలోని ట్రాన్స్పోర్టు కంపెనీల పేరుతో అడ్డుగోలుగా రవాణా చేస్తున్నారు. పలాస-కాశీబుగ్గ పట్టణాల పరిధిలో 600 పైచిలుకు జీడిపప్పు పరిశ్రమలకు వాణిజ్య పన్నుల శాఖ లెసైన్సులు ఉండగా, కేవలం ఆరుగురు బ్రోకర్లే ఎగుమతుల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీరి చేతుల మీదుగానే ప్రతి నెలా కోట్లాది రూపాయల విలువైన రవాణా లావాదేవీలు జరుగుతున్నాయి. జీడిపప్పు కంపెనీల యజమానులు ఎటువంటి అనుమతులు లేకుండానే బ్రోకర్లకు పప్పును విక్రయిస్తుండగా, వారు తమ సొంత ట్రాన్స్పోర్టు సంస్థల ద్వారా విచ్చలవిడిగా రవాణా చేస్తున్నారు. ఎమ్మెస్టీల ద్వారా.. మరోవైపు పలాస రైల్వేస్టేషన్ మీదుగా నిత్యం రాకపోకలు సాగించే రైళ్ల ద్వారా కూడా జీడిపప్పు అక్రమంగా తరలిపోతోంది. దీనికి నిరుద్యోగులను పావులుగా ఉపయోగించుకుంటున్నారు. పలాస నుంచి బరంపురం తదితర పట్టణాలకు మంత్లీ సీజన్ టిక్కెట్ల(ఎమ్మెస్టీ)తో ప్రయాణికుల మాదిరిగా రైళ్లలో వెళ్లే ఈ యువకుల ద్వారా క్వింటాళ్ల కొద్దీ జీడిపప్పును రవాణా తరలిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా వారికి కొంత సొమ్ము ముట్టజెబుతున్నారు. జీడిపప్పు రవాణాలో భారీగా పన్ను ఎగవేత జరుగుతున్నట్లు వివిధ శాఖల అధికారులే ఆరోపిస్తున్నారు. ఇటీవల అక్రమంగా జీడి పప్పు రవాణా అవుతున్నట్టు తెలియడంతో అధికారులు నిఘా వేసి జీడి పప్పును పట్టుకుంటున్నారు. అధికారుల నుంచి వే బిల్లులు తీసుకోకుండా పలాస కాష్యూమానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఇచ్చే డెలివరీ చలానానే వే బిల్లుగా చూపిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్న విషయంలో దాడుల్లో బయటపడింది. పలాస రైల్వే స్టేషన్ నుంచి కూడా అక్రమ రవాణా అవుతున్నట్టు గుర్తించారు. ఇదిలా ఉండగా పలాస నుంచి గొప్పిలి మీదుగా ఒడిశాకు లారీలు, ఇతర వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కూడా గుర్తించారు. అక్రమ రవాణాదారులు పలాస పీసీఎంఏ ఇచ్చిన డెలివరీ చలానాలనే ఉపయోగిస్తున్నారని పలాస మార్కెట్ కమిటీ కార్యదర్శి చిన్నికృష్ణ చెప్పారు. ఆ చలానాను ఆయన చూపిస్తూ జీడిపప్పు ఎగుమతి చేసేటప్పుడు మార్కెట్ కమిటీకి కూడా ఒక శాతం పన్ను కట్టాల్సి ఉన్నా చాలామంది దాన్ని ఎగవేస్తూ దొంగదారుల్లో రవాణా చేస్తున్నారని చెప్పారు. మొత్తానికి అక్రమ రవాణా ఉదంతం మరోమారు వెలుగు చూడటంతో అధికారులు దాడులకు పథకం రూపొందించారు. ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్న ట్రాన్స్పోర్టు కంపెనీలపై నిఘా పెట్టారు. -
ఇసుక తరలిస్తున్న వాహనాలు స్వాధీనం
కొవ్వూరు: నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలోని పోతిరెడ్డి పాలెం గ్రామం వద్ద పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను ఆదివారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో కొవ్వూరు ఎస్ఐ సుధాకర్ రెడ్డి ఆకస్మికంగా దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇసుక వ్యాపారులు పెన్నా నది నుంచి రాత్రి సమయాల్లో ఇసుక తరలిస్తుంటారు. స్వాధీనం చేసుకున్న 25టైర్ల వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించారు. -
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నిరోధించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఎం నాయక్ అధికారులను ఆదే శించారు. బుధవారం ‘ ఇసుక గోతుల్లో నిఘా పాతర’ అన్న శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. ఈ మేరకు తన కార్యాల యంలో జరిగిన జిల్లా అధికారుల సమీ క్ష సమావేశంలో కలెక్టర్ ప్రత్యేకంగా ఇసుక అక్రమ రవాణా గురించి మాట్లాడారు. అన్ని రీచ్లకూ గ్రామైక్య సంఘాలను రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. వా రి ద్వారానే అమ్మకాలు జరపాలని, మీ సేవలో జమ అయిన మొత్తాలను సం బంధిత సంఘాలకు చెల్లించాలని ఆదేశించారు. దీని వల్ల ఇసుక అక్రమ రవాణాను నివారించవచ్చునన్నారు. ము ఖ్యంగా కోటగండ్రేడు ఇసుక రీచ్కు మ రిన్ని వాహనాలు రిజిస్ట్రేషన్తో పాటు డ్రైవర్ల సంఖ్యను పెంచాలని చెప్పారు. రాత్రి పూట గస్తీ పెంచడానికి సెక్యూరి టీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమవేశంలో జేసీ రామారావు, ఏఎస్పీ రమణ, డీఆర్డీఏ పీడీ పెద్ది రాజు, ఏపీడీ సుధాకర్, పాల్గొన్నారు. వ్యవసాయ శాఖలో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం వ్యవసాయ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో బహుళ ప్రయోజన విస్తరణాధికారుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్టు కలెక్టర్ నాయక్ తెలిపారు. దరఖా స్తు ఫారాలు విజయనగరం. ఎన్ఐసీ. ఇన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిర్ణీత ప్రొఫార్మాలో భర్తీ చేసిన దరఖాస్తులను వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా వ్యవసాయ సంయుక్త సంచాలకులు, సెలక్షన్ కమిటీ మెంబర్ సెక్రటరీ, కలెక్టరేట్ విజ యనగరం-535003 అన్న చిరునామా కు పోస్టల్ ద్వారా గాని, నేరుగా గాని పంపాన్నారు. 2014-15 సంవత్సరానికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతి ప్రకా రం 92 పోస్టులకు నియామకాలు జరుపుతామని, నెలకు రూ. 8 వేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పారు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల వయస్సు 2014 జూ లై 1కి 18 నుంచి 40 ఏళ్లు లోపు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సు సడ లింపు ఉంటుందన్నారు. ఏజీ, ఉద్యాన, మెట్ట వ్యవసాయంలో బీఎస్సీ అర్హత ఉన్న వారికి తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమాదారులు, ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం గుర్తింపు పొం దిన సీడ్ టెక్నాలజీ, డి ప్లమా/ప్లాంట్ ప్రొటెక్షన్/ఆల్కానిక్ పార్మింగ్లలో అర్హ త ఉన్న వారికి రెండో ప్రాధాన్యత, వృక్ష శాస్త్రంలో సైన్స్ పట్ట భద్రులకు మూడో ప్రాధాన్యత ఇస్తామన్నారు. అభ్యర్థుల ఎంపిక తొలిప్రాధాన్యంలో వచ్చిన దరఖాస్తు దారులను కమిటీ ఎంపిక చేస్తుం దని, తగినంత మంది అభ్యర్థులు లేకపోతే రెండో ప్రాధాన్యతలోని అభ్యర్థులను తీసుకుంటారన్నారు. అప్పటికీ ఖా ళీలు భర్తీ కాకపోతే మూడో ప్రాధాన్యతలోని అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు. ఎంపికలో ప్రతిభ కు 80 శాతం మార్కులు, మౌఖిక పరీ క్షకు 20 శాతం మార్కులు ఉంటాయన్నారు. అభ్యర్థులు తహశీల్దార్ జారీ చేసిన నివాస ధ్రువీకరణపత్రం, 4 నుం చి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫి కేట్స్ దరఖాస్తుకు జత పరచాలన్నారు. -
రూ. 12 లక్షలు విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు: ఎర్రచందనం అక్రమ రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది. ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించడానికి అటవీ అధికారులు ఎప్పుటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉన్నారు. స్మగ్లింగ్ కార్యాకలపాలను అడ్డుకున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు అటవీ ప్రాంతాల్లో నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోని బాకరా పేట అటవీప్రాంతంలో రూ. 12 లక్షల విలువ చేసే ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు ఎర్రచందనాన్ని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
35 బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
ప్రకాశం: రేషన్ బియ్యం అక్రమ రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది. అక్రమంగా రేషన్ బియ్యం, కిరోసిన్ వంటి నిత్యావసర వస్తువులను తరలిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలోని మర్రిపూడి మండలం కాకర్లలో రేషన్ బియ్యం అక్రమ రవాణా శనివారం వెలుగులోకి వచ్చింది. అక్రమంగా తరలిస్తున్న 35 బస్తాల రేషన్ బియ్యంతో పాటు 200 లీటర్ల కిరోసిన్ను గ్రామస్తులు పట్టుకున్నట్టు సమాచారం. -
పెన్సిడిల్ సిరప్ అక్రమ రవాణాదారులపై కేసులు
కామారెడ్డి: బంగ్లాదేశ్కు పెన్సిడిల్ సిరప్ బాటిళ్లను అక్రమంగా తరలించిన వ్యవహారంలో నిందితులపై డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ సెక్షన్ 18 ప్రకారం కేసులు నమోదు చేసినట్టు ఔషధ నియంత్రణ శాఖ నిజామాబాద్ అసిస్టెంట్ డెరైక్టర్ సురేంద్రనాథ్ సాయి తెలిపారు. గత నెలలో బంగ్లాదేశ్కు పెన్సిడిల్ సిరప్ బాటిళ్లు సరఫరా చేస్తుండగా దేశ సరిహద్దులలో పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకు వచ్చింది. దీనికి సంబంధించి ఏడీ మంగళవారం కామారెడ్డిలోని ఔషధ నియంత్రణ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ డెరైక్టర్ అమృత్రావు ఆదేశాల మేరకు తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన ఏడుగురు ఏడీలు ఈ వ్యవహా రంపై విచారణ జరిపారన్నారు. కామారెడ్డిలో 9, ఆర్మూర్లో ఒకటి, నిజామాబాద్లో ఆరు దుకాణాల్లో తనిఖీలు జరపగా, కామారెడ్డిలోని అజంతా ఏజెన్సీలోనే అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ అయిందన్నారు. 2013 ఫిబ్రవరి నుంచి పట్టుబడే నాటి వరకు 2.39 లక్షల బాటిళ్లు తెప్పించినట్టు పేర్కొన్నారు. 30 వేల బాటిళ్లకు బిల్లులు కూడా లేవన్నారు. ఈ వ్యవ హారంలో హైదరాబాద్కు చెందిన మహేందర్ కీలక పాత్ర పోషించారని వివరించారు.అజంతా ఏజెన్సీ సరఫరా చేసిన 2.39 లక్షల బాటిళ్ల విలువ రూ. రెండు కోట్ల పైమాటేనని పేర్కొన్నారు. -
ఎర్రచందనం అక్రమ రవాణా
రోడ్డు ప్రమాదంతో వెలుగులోకి.. శంషాబాద్ రూరల్: లారీలో గుట్టుగా తరలిస్తున్న ఎర్రచందనం యాక్సిడెంట్తో బయటపడింది. బుధవారం తెల్లవారుజామున ఔటర్ రింగు రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. తుక్కుగూడ వైపు నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ వస్తున్న ఓ లారీ (ఏపీ 21వై-2777)ని హమీదుల్లానగర్ సమీపంలో వెనక నుంచి మరో లారీ ఢీకొంది. దీంతో ముందు వెళ్తున్న లారీ బోల్తా పడింది. వాహనంలో ఉన్న పెట్టెలు కింద పడడంతో అందులో అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఒక్కోపెట్టెలో 10 దుంగలు ఉండగా మొత్తం పది పెట్టెలు లారీలో ఉన్నాయి. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ.5 లక్షలు ఉంటుందని ఫారెస్టు అధికారులు అంచనా వేస్తున్నారు. లారీ ముందు భాగంలో ఏపీ 21వై 2777 నంబరు ఉండగా, వెనక భాగంలో ఏపీ 22వై 2777 నంబరు ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు. -
ప్రైవేటు చక్రాలకు బ్రేకులు!
నిబంధనలు ఉల్లంఘించి తిరిగే వాహనాలను నియంత్రించండి ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులకు మంత్రి మహేందర్రెడ్డి ఆదేశం సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యంతో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పర్మిట్లు, అనుమతులతో సంబంధం లేకుండా స్టేజీ క్యారియర్లుగా తిరుగుతూ ఆర్టీసీ ఆదాయానికి తూట్లు పొడుస్తున్న ప్రైవేటు వాహనాలను వెంటనే నియంత్రించాలని ఆదేశించింది. ఓవైపు ఆదాయానికి గండికొడుతూనే మరోవైపు ఓవర్ లోడ్తో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నందున ఆ వాహనాల నియంత్రణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించింది. సీఎం ఆదేశం మేరకు రవా ణామంత్రి మహేందర్రెడ్డి బుధవారం ఆర్టీసీ, రవాణా అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ప్రధాన పరిపాలన కార్యాలయం బస్భవన్లో జరిగిన భేటీలో రవాణా ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు, రవాణా శాఖ కమిషనర్ జగదీశ్వర్, ఆర్టీసీ జేఎండీ రమణరావు, జేటీలు, ఈడీలు పాల్గొన్నారు. ప్రైవేటు వాహనాల ఆగడాలను నియంత్రించాలంటే నిర్దిష్టంగా ఏం చేయాలన్న సూచనలేవీ సమావేశంలో చర్చకు రాకపోవటం గమనార్హం. ముఖ్యంగా రవాణా అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. 439 మార్గాల్లో అక్రమ రవాణా తెలంగాణలో 3,597 మార్గాలుంటే వాటిల్లో 439 రూట్లలో ప్రైవేటు వాహనాలు అక్రమంగా తిరుగుతున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చా రు. వీటివల్ల ఆర్టీసీ ఏటా దాదాపు రూ.400 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతోందని పేర్కొన్నారు. పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తుండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తోందన్నారు. దీంతో మంత్రి వెంటనే వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, దీనిపై సీఎం పట్టుదల తో ఉన్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ ఆర్ఎం, రవాణాశాఖ డీటీసీ స్థాయిలో ప్రతి మంగళవారం, ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖ కమిషనర్లు నెలలో ఒకసారి సమావేశమై ఎప్పటికప్పుడు చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. తాను ప్రతి మూడు నెలలకోమారు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తానని చెప్పారు. ఇటీవల సీఎం మంజూరు చేసిన రూ.150 కోట్లతో కొత్త బస్సులు కొంటామన్నారు. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు 100 వరకు ఏసీ బస్సులు నడిచేలా చూస్తామన్నారు. ఖమ్మం, కరీంనగర్లకు 30 చొప్పున ఏసీ బస్సులు సమకూరుస్తామని పేర్కొన్నారు. చూపులకు అందంగా ఉండే రంగులతో కొత్త బస్సులు ఆకట్టుకుంటాయని, త్వరలో తెలంగాణ ఆర్టీసీకి కొత్త లోగో సిద్ధం చేస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్లు శుభ్రంగా ఉండేలా చూడడంతోపాటు పరిసరాల్లో చెట్లు పెంచి ప్రయాణికులకు మంచినీటి వసతి మెరుగుపరచాలని ఆదేశించారు. ఆర్టీసీని విభ జన జరగాలి: టీఎంయూ తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఎంయూ నేతలు అశ్వత్థామరెడ్డి తదితరులు మంత్రిని కోరారు. ఆర్టీసీ వేతన సవరణ, ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్, డీఏ బకాయిల చెల్లింపు అంశాలపై వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ఆర్టీసీని పరిరక్షించేందుకు ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ నేతలు రాజిరెడ్డి తదితరులు మంత్రిని కోరారు. -
గాడి తప్పిన పౌరసరఫరాల వ్యవస్థ
సాక్షి, గుంటూరు : రేషన్ బియ్యం అక్రమ రవణా జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతోంది. నియంత్రించాల్సిన పౌరసరఫరాలశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో జిల్లాలో రేషన్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ బియ్యాన్ని మిల్లులకు తరలించి సంచులు మార్చి రీసైక్లింగ్ చేసి, రైతుల నుంచి ధాన్యం సేకరణ చేయకుండా మళ్లీ లెవీ కింద ఈ బియ్యాన్నే ఇస్తున్నారు. జిల్లాలోని కొన్ని ముఠాలు పక్కా ప్రణాళికతో ఇతర రాష్ట్రాలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాయి. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కొత్త కార్డులు ఏవీ? ఆధార్ అనుసంధానంతో జిఆ్లలో బోగస్ రేషన్కార్డులకు చెక్ పడింది. ఇంత వరకు బాగానే ఉన్నా కొత్తగా రేషన్కార్డుల కోసం రచ్చబండ-3లో 73,000 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వారికి కార్డులు ఇచ్చే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 14,19,952 రేషన్ కార్డులన్నాయి. వీటిలో దాదాపు 46,52,994 మంది సభ్యులున్నారు. ఇందులో దాదాపు 97 శాతం కార్డులను ఆధార్తో అనుసంధానం చేశారు. దాదాపు 3,38,918 యూనిట్లు బోగస్విగా గుర్తించడంతో జిల్లాలో 1.5 లక్షల తెల్లరేషన్ కార్డులకు బియ్యం సరఫరా ఆగిపోయింది. దీనికితోడు దసరా పండుగకు పేదలకు అదనంగా చక్కెర సరఫరా విషయంపై ప్రభుత్వం ఇంత వరకు నిర్ణయాన్ని ప్రకటించలేదు. సిబ్బంది కొరత... పౌరసరఫరాల శాఖలో సిబ్బంది కొరత పట్టి పీడిస్తోంది. జిల్లాలో దాదాపు 96 మంది సిబ్బంది ఉండాలి. కాని 34 మంది మాత్రమే ఉండటంతో పర్యవేక్షణ కొరవడి ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నేరుగా బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. గ్రేపర్చేజింగ్ అసిస్టెంట్లు (జీపీఏలు) 8 మంది ఉండాలి. అవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డీటీలు 19 మందికి గాను ఇద్దరు మాత్రమే ఉన్నారు. స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు 6 ఖాళీగా ఉన్నాయి. దీంతో బియ్యం అక్రమ రవాణాపై సిబ్బంది పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. వీటన్నింటిపై దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతను జిల్లా ప్రజలు వేడుకుంటున్నారు. నేడు అధికారులతో మంత్రి సునీత సమీక్ష పాతగుంటూరు: పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత బుధవారం జిల్లా పర్యటనకు వస్తున్నట్లు పౌర సమాచార శాఖ అధికారులు తెలిపారు. అనంతపురం నుంచి కొండవీడు ఎక్స్ప్రెస్లో బుధవారం తెల్లవారుజామున ఆమె గుంటూరు చేరుకుంటారు. ఆర్ అండ్బీ అతిథి గృహంలో బస చేస్తారు. ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో లెవీ విషయమై సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడే జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు రేపల్లె నియోజకవర్గం బే తపూడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. -
పేదల బియ్యం పక్కదారి!
- డీలర్లు.. మిల్లర్ల మాయాజాలం - అక్రమంగా తరలుతున్న రూ.కిలో బియ్యం - గుట్టుగా మహారాష్ట్రకు తరలింపు - మన మిల్లుల్లోనూ రీసైక్లింగ్ - అనంతరం మార్కెట్కు... - పౌరసరఫరాల మంత్రి ఇలాఖాలోనే అవినీతి దందా! సాక్షి, కరీంనగర్ : రేషన్ బియ్యం అక్రమంగా తరలుతోంది. బియ్యం అక్రమ రవాణాలో డీలర్ల పాత్ర కీలకంగా మారింది. కొంత మంది డీలర్లు తమకు వచ్చిన బియ్యాన్ని కోటా నుంచి మిగుల్చుకుంటే.. ఇంకొందరు పేదలకు ఇవ్వాల్సిన దాంట్లో సగం కోటా ఇవ్వకుండా స్థానికంగా ఉండే రైస్మిల్లర్లు, దళారులు, వ్యాపారులకు రూ.10 నుంచి రూ.15కు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు దళారులు, వ్యాపారులు నేరుగా ఆ బియ్యాన్ని రోడ్డు, రైలు మార్గాల ద్వారా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అక్కడ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి (మరపట్టి) జిల్లాకు తీసుకొచ్చి.. మళ్లీ మనకే బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.23 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ అక్రమ రవాణాపై రెవెన్యూశాఖ రైల్వేస్టేషన్లపై నిఘా పెట్టి అప్పుడప్పుడు దాడులు చేస్తుండగా అక్రమంగా తరలుతోన్న క్వింటాళ్లకొద్దీ బియ్యం పట్టుబడుతోంది. అధికారుల దాడులు తెలుసుకున్న కొందరు రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా బియ్యాన్ని రైళ్లలో సరిహద్దు దాటిస్తున్నారు. గతంలో మహారాష్ట్రలోనే జరిగే రీసైక్లింగ్ ఇప్పుడు మన జిల్లాలోని పలు రైస్మిల్లుల్లోనూ జరుగుతున్నట్లు సమాచారం. కొందరు డీలర్లు మిల్లర్లకు ఐదారు రూపాయలకు కిలో బియ్యం విక్రయిస్తున్నారు. మిల్లర్లు.. ఆ బియ్యాన్ని స్థానిక మిల్లుల్లో మరపట్టించి.. బహిరంగ మార్కెట్లో కిలో రూ.23 నుంచి రూ.27కు అమ్ముతున్నారు. రేషన్బియ్యం పక్కదారి పట్టడం వెనక పలువురు రేషన్ డీలర్లు.. కాంట్రాక్టర్లతోపాటు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదల పొట్ట కొట్టి బియ్యాన్ని పక్కదారి పట్టించిన చాలామంది డీలర్లు ఇప్పటికే లక్షలు గడించారు. ఇటు మిల్లర్లూ అదే బియ్యాన్ని మార్కెట్లో అధిక ధరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. తాజాగా ఈ నెల 15న.. విజిలెన్స్ అధికారులు కరీంనగర్లోని ఓ రైస్ మిల్లులో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జిల్లాలో జరుగుతున్న అవినీతి దందాకు అద్దం పడుతోంది. అదే రాత్రి జూలపల్లి మండలంలో 12 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. అక్రమంపై కొరడా ఝుళిపించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగడంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. సాక్షాత్తూ.. రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే అవినీతి దందా ఈ స్థాయిలో జరగడం చర్చనీయాంశమైంది. తరలింపు తీరిది! బియ్యం అక్రమ రవాణాకు రైలు, రోడ్డు మార్గాలను ఎంచుకున్న దళారులు, వ్యాపారులు డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని ప్లాస్టిక్ బస్తాల్లో నింపి రోజుకు కొన్ని బస్తాల చొప్పున గుట్టుచప్పుడు కాకుండా జమ్మికుంట, పొత్కపల్లి, ఓదెల, కొలనూరు, పెద్దపల్లి, రాఘవపురం, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని బెల్లంపల్లి, రేచినిరోడ్డు, ఆసిఫాబాద్ రోడ్డు, కాగజ్నగర్, సిర్పూర్ రైల్వేస్టేషన్ల నుంచి తరలిస్తారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా విరూర్ స్టేషన్కు బియ్యాన్ని చేరవేస్తారు. బస్తాలన్నీ ఒకే ప్రాంతం నుంచి లోడ్ చేసే సమయం ఉండకపోవడం.. అందరికీ అనుమానం వచ్చే అవకాశాలు ఉండడంతో దళారులు చాకచక్యంగా బియ్యాన్ని లారీలో నింపుకుని జిల్లా పరిధిలో ఉన్న రైల్వేస్టేషన్లలో కొన్ని, కొన్ని చొప్పున డంప్ చే సుకుంటూ పోతున్నారు. మరో రోడ్డు మార్గాన్ని ఎంచుకున్న వ్యాపారులు జిల్లాలో పలు కేంద్రాలను చేసుకుని సిద్దిపేట- కామారెడ్డి మీదుగా మహారాష్ట్రకు బియ్యాన్ని తరలిస్తున్నారు. సుల్తానాబాద్, నిమ్మలపల్లి, వేములవాడ నుంచి బియ్యం లారీ ద్వారా పెద్ద ఎత్తున మహారాష్ట్రకు వెళ్తుంది. ఈ దందాతో దళారులకు అన్ని ఖర్చులు పోనూ ప్రతి నెలా రూ.3 లక్షలు మిగులుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. - ఈ నెల 15న కరీంనగర్ మండలం రేకుర్తి నుంచి ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు 12 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా జూలపల్లి మండలం వడ్కాపూర్ శివారులో పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. - 15న జిల్లా కేంద్రంలోని ఓ రైస్మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 99.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. - 12న కొడిమ్యాల నుంచి సిరిసిల్లకు ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 7.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు వేములవాడలో పట్టుకున్నారు. - 4న.. ఓదెల మండలం కొలనూరులో 15 క్వింటాళ్లు పట్టుకున్నారు. - గత నెల 5న.. సుల్తానాబాద్లో ట్రాలీలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని రె వెన్యూ, డీటీసీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. - మే నెలలో సిరిసిల్ల మండలం పెద్దూరు వద్ద 6 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. - మార్చి 11న.. వేములవాడలో వాహనంలో 23 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. - జమ్మికుంట రైల్వేస్టేషన్ కేంద్రంగా.. రేషన్ బియ్యం రైళ్లో అక్రమంగా మహారాష్ట్రకు తరలుతోంది. మార్చి 29న జమ్మికుంటలో 10 క్వింటాళ్లు.. నాలుగు నెలల వ్యవధిలో 50 క్వింటాళ్ల బియ్యం మహారాష్ట్రకు తరలిస్తుండగా.. రెవె న్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
వయా వైజాగ్
- రూటు మార్చిన ‘ఎర్ర’దొంగలు - విశాఖపట్టణంలో వెలుగుజూసిన దుంగలు - జిల్లాకు రానున్న అక్కడి పోలీసులు - అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు బృందం - 60 రోజుల్లో అక్రమ రవాణా అరికడతామంటున్న ఎస్పీ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు. ఎవరికీ అనుమానం రాని రీతిలో విశాఖపట్టణం నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. పోలీసుల విచారణలో ఈ విషయం వెల్లడైంది. చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లర్లపై అక్కడి పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎటూ పాలుపోని స్మగ్లర్లు పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాపై దృష్టిసారించారు. ఇక్కడి నుంచి విశాఖపట్టణం మీదుగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇటీవల అక్కడ రెండు కంటైనర్లలో భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. రెండుసార్లుగా సుమారు రూ.9.5 కోట్ల విలువైన దుంగలు చిక్కడంతో ఉలిక్కిపడిన విశాఖపట్టణం పోలీసులు లోతుగా ఆరా తీశారు. ఈ దుంగలు గూడూరులోని ఓ వేర్హౌస్ నుంచి లోడ్ చేసి పంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ సమావేశం కూడా నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవాల్ నియమించారు. ఈ బృందం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఓ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసుకోనుంది. జాతీయ రహదారిపై వెళ్లే కంటైనర్ ట్రాలీలు, లారీలు తదితర అన్ని వాహనాలపై నిఘా పెట్టి తనిఖీలు చేయనుంది. ఈ బృందంలోని మరో విభాగం అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారుల్లోను, సరిహద్దుల్లోను ప్రత్యేకంగా చెక్పోస్టులను ఏర్పాటు చేయడానికి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా, విశాఖపట్టణం నుంచి ఒక పోలీసు బృందం త్వరలో నెల్లూరు రానునున్నట్లు తెలిసింది. నెల్లూరు కేంద్రంగా ఎర్రచందనం రవాణా జరగడంపై వీరు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు నెల్లూరు నుంచి విశాఖపట్నం పోర్టు ద్వారా తరలించిన దుంగల వివరాలను సేకరించడానికి వీరు వస్తున్నట్లు తెలుస్తోంది. -
మకిలీ...
సాక్షి, గుంటూరు: ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, వర్షాలు కురవగానే రైతులు ఆత్రంగా విత్తనాలు కొనుగోలు చేస్తారని గ్రహించి నకిలీ విత్తన వ్యాపారులు తమ పనిలో తాము నిమగ్నమయ్యారు. నకిలీ విత్తనాల అక్రమ రవాణా వార్తలతో రైతులు బెంబేలెత్తి పోతున్నారు. గతంలో ఓ కంపెనీకి చెందిన నకిలీ మిర్చి విత్తనాలను వేసిన రైతులకు మొక్క ఏపుగా పెరగడం తప్ప పూత, కాయ రాకపోవడంతో తీవ్రంగా నష్టాలపాలయ్యారు. ఈ ఏడాది రాష్ట్ర విభజనకు తోడు, వర్షాలు లేకపోవడంతో నాగార్జున సాగర్ కాలువల ద్వారా సాగు నీరందడం కష్టమేనని భావించిన రైతులు వరి తగ్గించి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల ద్వారా నకిలీ విత్తనాల రవాణా నకిలీ విత్తనాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసేందుకు కొందరు అక్రమార్కులు ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలను అక్రమ రవాణా మార్గాలుగా ఎంచుకుంటున్నారు. ప్రైవేటు వాహనాల్లో తరలిస్తే పోలీసులు, విజిలెన్స్, వ్యవసాయాధికారుల దృష్టి పడుతుందని భావించి ట్రాన్స్పోర్టు వాహనాల్లో నకిలీ విత్తనాలను రవాణా చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని అనేక ప్రాంతాలకు వీటిని చేర్చినట్టు తెలుస్తోంది. బుధవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. విచిత్రమేమిటంటే నరసరావుపేట, సత్తెనపల్లి, కారంపూడి, దాచేపల్లి వంటి ప్రాంతాల్లో వివిధ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల్లోనే నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. దీంతో రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్కరోజు దాడులు నిర్వహిస్తేనే వేల కొద్దీ పత్తి, మిర్చి విత్తనాల ప్యాకెట్లు పట్టుబడ్డాయని, ఇంకా గోడౌన్లకు ఎన్ని చేరాయోననే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని గోడౌన్లలో తనిఖీలు నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఏ ప్రాంతంలో దొరికితే అక్కడి అధికారిపై చర్యలు నకిలీ విత్తనాలపై తనిఖీలు నిర్వహించకుండా అక్రమార్కులతో కుమ్మక్కై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వ్యవసాయశాఖ అధికారులపై నిఘా ఉంచాం. జిల్లాలో అన్ని మండలాల్లో తనిఖీలు నిర్వహించమని చెప్పినా కొందరు చేయకపోవడంతో గుంటూరు కార్యాలయం నుంచి టీమ్లు పంపాం. ఈ దాడుల్లో అనేక ప్రాంతాల్లో నకిలీ విత్తనాలను పట్టుకున్నాం. వ్యవసాయశాఖ కమిషనర్ అనుమతి తీసుకుని ఏ ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు, పురుగుమందులు పట్టుబడతాయో ఆయా పరిధుల్లో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికైనా అధికారులు నకిలీ విత్తనాలపై దృష్టి సారించి తనిఖీలు ముమ్మరం చేయాలి. -వల్లూరు శ్రీధర్, వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ -
అక్రమాలు ఇంకెన్నాళ్లు.. ఇకపై సాగవు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్: గుట్టుచప్పుడు వ్యాపారాలు సాగించే అక్రమార్కుల కు ఇకపై గుండెదడ పట్టుకోనుంది. ఎవరు ఫిర్యాదు చేస్తారు లే అని ఇంతవరకు యథేచ్ఛగా అక్రమ లావాదేవీలు నెరిపిన వారి వ్యాపారాలు ఇక సాగవు. ఎందుకంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ప్రజాభాగస్వామ్యంతో పనిచేస్తుం ది. పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం నుంచి కంది పప్పు, కిరోసిన్ తదితర సబ్సిడీ సరుకుల అక్రమ రవాణాపై విజిలె న్స్ కన్ను పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా అక్రమార్కులపై దృష్టి సారించారు. ఇక నుంచి అక్రమ రవాణా చేసే సమాచారాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ప్రజల నుంచి కోరుతోంది. ఒక్క పౌరసరఫరాల సరుకులే కాదు, ప్రభుత్వ పన్నులు ఎగ్గొట్టి చేసే అక్రమ రవాణాపైనా దృష్టి సారించింది. సరుకుల అక్రమ రవాణా సమాచారాన్ని, అక్రమ వ్యాపారాల సమాచారాన్ని తమకు వెంటనే అందివ్వాలంటూ ఒక ఫోన్ నంబర్ను కూడా ప్రకటించింది. 8008203248 నంబరుకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరుతున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇక ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఆక్రమార్కుల ఆటలు కట్టించాలని నిశ్చయించింది. దీనిపై ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందని భావిస్తోంది. జిల్లాలో ప్రతి నెలా 6లక్షల కార్డు దారులకు బియ్యం, కిరోసిన్, కింది పప్పు, పామాయిల్, పంచదార, చింతపండు, ఇతర వస్తువులు సరఫరా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా సరుకులు సరఫరా అవుతున్నప్పటికీ వాటిని డీలర్లకు సరఫరా చేశాక అవి మళ్లీ నేరుగా వ్యాపారుల దగ్గరకే చేరుతున్నాయి. వీటిని తిరిగి మిల్లర్లకు అమ్ముతున్నారన్న ఆరోపణలున్నాయి. వీటిపై పలుమార్లు విజిలెన్స్ దాడులు నిర్వహించినా నామమాత్రంగా ఉండేవి. కానీ ఈసారి ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడంతో ఈ వ్యవస్థ కఠినతరం కానుంది. విజిలెన్స్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగం కూడా అక్రమాలను అరికట్టి నిధుల లేమి నుంచి కాస్తయినా బయట పడాలని ఆశిస్తోంది. ఈ వ్యవస్థ ను పటిష్టపరిస్తే వివిధ రకాలైన వస్తువులనుంచి రావాల్సిన పన్నులు, ఇతర బకాయిలు వసూలై ప్రభుత్వ ఖజానాకు పడిన గండిని కొంతయినా పూడ్చగలమని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి విజిలెన్స్ శాఖ ఈ జిల్లాపై దృష్టి సారించింది. దీని ప్రకారం ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించి వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని కేసులు బనాయించడమే కాకుండా భారీ మొత్తంలో అపరాధ రుసుములు విధించేం దుకు సమాయత్తమవుతోంది. పన్నులు ఎగవేసే వ్యాపారా లు, ప్రభుత్వ రాబడికి నష్టం కలిగించే చర్యలకు పూనుకుంటే ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారు లు హెచ్చరిస్తున్నారు. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలతో రంగంలోకి దిగుతున్నామని ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదో రకం ఉపాధి..! ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి సరఫరా అవుతున్న పీడీఎస్ బియ్యంలో 30 శాతం మాత్రమే సద్వినియోగమవుతున్నాయన్న లెక్కలున్నాయి. కొన్ని డిపోల నుంచి ఈ బియ్యం నేరుగా వ్యాపారుల వద్దకు వెళ్లిపోతున్నాయి. వాస్తవానికి ఈ రేషన్ బియ్యం వ్యాపారాన్నే ఉపాధిగా మలుచుకుని కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయంటే ఈ అక్రమ వ్యాపా రం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. గ్రామా ల్లో ఉన్న వ్యాపారులు మండల కేంద్రాలు, సమీప పట్టణా ల్లో ఉన్న వ్యాపారులకు ఈ బియ్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రతి నెలా ఈ బియ్యం తినని కుటుంబాల నుంచి సేకరించి పెద్ద వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఆ బియ్యానికి పాలిషింగ్ చేరి బహిరంగ మార్కెట్లో అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల ఈ బియ్యాన్నే మిల్లర్లకు లెవీకి ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీటిని అరికట్టే కోణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పక్కాగా నిఘా పెట్టడంతో పేదల బియ్యం పక్కదారి పట్టవనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్,ఇతర పరికరాలు అక్రమంగా రైల్లో రవాణా అవుతున్నాయి. వీటికి చెల్లించాల్సిన లక్షలాది రూపాయల పన్నులను ఎగ్గొడుతు వ్యాపారుల ఆటకూడా కట్టిస్తామని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. -
ప్రాణాలు తీస్తున్న ఇసుక తరలింపు
దోమకొండ,న్యూస్లైన్ : మండలంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాతో పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అర్ధరాత్రి వేళల్లో, తెల్లవారుజామున అతివేగంగా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తుండడంతో మండలంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయమై బాధిత కుటుంబాల వారు పోలీస్స్టేషన్ల వద్ద ధర్నాలు చేసి ఆందోళన నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. గత జూన్లో మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన యువకుడు నక్కరాజు పనుల నిమిత్తం జనగామ వచ్చి తిరిగి వెళుతుండగా వేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అదే సంఘటనలో మరో యువకుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడు. కాగా నక్కరాజు శవంతో గ్రామస్తులు బీబీపేటలోని పోలీస్స్టేషన్లో దాదాపు నాలుగు గంటలు ధర్నా చేయగా కామారెడ్డి రూరల్ సీఐ హరికుమార్ వచ్చి వారిని సముదాయించారు. అదే విధంగా జనగామ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామం సీతారాంపల్లిలో రెండు నెలల క్రితం వీఆర్ఏ మల్లేషం ఉదయం 5గంటలకు స్వగ్రామం నుంచి జనగామకు విధుల కోసం సైకిల్పై వెళుతుండగా ఇసుక ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. తాజాగా గురువారం తెల్లవారుజామున అంచనూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధుడిని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఆ వృద్ధుడికి వెంటనే దోమకొండలోని ఆస్పత్రిలో చికిత్సలు చేయించి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఇంత వరకు దానికి కారకులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇసుక మాఫియా ఆగడాలు మితిమిరాయి. రెవెన్యూ అధికారుల అండ, పోలీసుల సహకారంతో వారు విచ్చలవిడిగా ఇసుక దందా సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రివేళల్లో ఇసుకను కామారెడ్డితో పాటు హైదరాబాద్ లాంటి పట్టణాలకు లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తుజాల్పూర్ గ్రామం జిల్లా సరిహద్దులో ఉండటం ఇసుక మాఫియాకు కలిసి వచ్చింది. మెదక్ జిల్లా నస్కల్, రాంపూర్ల మీదుగా ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకొని ఇసుక మాఫియా అంతుచూడాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలో ఆకస్మిక దాడులు చేసి ఇసుక డంపులను సీజ్ చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం
భద్రాచలం సమీపంలోని నందిగామ వద్ద భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తోన్న కలపను అటవీశాఖ అధికారులు బుధవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు. అలాగే వాహనాన్ని కూడా స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. పట్టుబడిన కలప విలువ బహిరంగ మార్కెట్లో రూ.2 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వివరించారు.