Intermediate examinations
-
ఇంటర్ స్పాట్ షురూ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. ఈ నెల 16 నుంచి ఈ ప్రక్రియ మరింత ఊపందు కుంటుందని అధికారులు తెలిపారు. నెల రోజు ల పాటు ఇది కొనసాగుతుందని, పరీక్ష ముగిసిన వెంటనే విద్యార్థుల సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాల (స్పాట్ వాల్యూయేషన్)కు తరలిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 10 లక్షల మంది వరకు పరీక్షలు రాస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూల్యాంకన కేంద్రాలనూ పెంచారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి, భద్రాద్రి కొత్తగూడెంలో మరో కేంద్రం అదనంగా ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలు గు రువారం ముగియనున్న నేపథ్యంలో మూల్యాంకనం చేపట్టాల్సిన అధ్యాపకులు కొందరు ఇంకా ఇన్విజిలేషన్ విధుల్లోనే ఉన్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే వీరు కూడా ‘స్పాట్’లో భాగస్వాములవుతారని ఇంటర్ పరీక్షల విభాగం తెలిపింది. ఈ ఏడాది నుంచి మూల్యాంకనాన్ని ఆన్లైన్లో పూర్తిస్థాయిలో చేపట్టాలని భావించారు. కానీ ప్రభు త్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో ఎప్పటిలాగే సాధారణ పద్ధతిలో మూల్యాంకనం చేపడుతున్నారు. నిరంతర పర్యవేక్షణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సమాధాన పత్రాలు 60 లక్షల వరకూ ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు మూల్యాంకన కేంద్రానికి చేరుకోగానే ఓఎంఆర్ షీట్లో ఉన్న విద్యార్థి వ్యక్తిగత సమాచారం తొలగిస్తారు. దీని స్థానంలో కోడ్ నంబర్ ఇస్తారు. కోడింగ్ మొత్తం ఇంటర్ బోర్డుకు ఆన్లైన్ ద్వారా అనుసంధానమై ఉంటుంది. తద్వారా సమాధాన పత్రం ఎవరిది అనే విషయం మూల్యాంకనం చేసే వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడతారు. ఆయా కేంద్రాల్లో నిర్దేశిత సబ్జెక్టు అధ్యాపకులు సమాధాన పత్రాలను పరిశీలించి మార్కులేస్తారు. వీటిని మూడు దఫాలుగా అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత మార్కుల వివరాలు ఆన్లైన్ ద్వారా బోర్డుకు అందుతాయి. మార్కులు కంప్యూటరైజ్ చేసిన తర్వాత అధికారులు డీ కోడ్ చేస్తారు. అన్ని సబ్జెక్టు మార్కులను క్రోడీకరిస్తారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు సగటున కొన్ని పేపర్లను మరోసారి పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ అంతటిపై ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఆయా దశలను దాటిన తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. వారం ముందుగానే ఫలితాలు? ఇంటర్ పరీక్ష ఫలితాలను వీలైనంత త్వరగా వెల్లడించాలని బోర్డు భావిస్తోంది. ప్రతి ఏటా ఏ ప్రిల్ నాలుగోవారంలో వెల్లడించడం ఆనవాయితీ. అయితే ఈసారి ఇంతకన్నా ముందే రిజల్ట్స్ ఇవ్వాలని అధికారులు అనుకుంటున్నారు. మూల్యాంకన ప్ర క్రియతో పాటు డీకోడింగ్ విధానాన్ని వేగంగా పూర్తి చేసి మూడో వారంలోనే ఫలితాలు ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. వీలైనంత త్వరగా ఫలితాలు ప్రకటించేందుకు కృషి చేస్తున్నామని ఇంటర్ పరీక్షల విభాగం అధికారిణి జయప్రదాభాయ్ తెలిపారు. -
పేపర్ లీక్లు ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28 నుంచి ఇంటర్మిడియెట్ థియరీ పరీక్షలు మొదలుకానున్నాయి. 9 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వచ్చే నెల 18న ప్రారంభంకానున్న పదవ తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరుకానున్నారు. ఈ రెండు పరీక్షలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. ఉన్నతాధికారులు ఇప్పటికే పలు దఫాలుగా పరీక్షల నిర్వహణపై సమీక్షలు చేశారు. ముఖ్యమంత్రి కూడా పరీక్షల తీరుపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గతం కన్నా భిన్నంగా పరీక్షల నిర్వహణ ఉండాలని చెప్పారు. ఎక్కడా పేపర్ లీక్లు ఉండొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారుల్లో టెన్షన్ కన్పిస్తోంది. ప్రతీ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలుకొని, వాటిని చేరవేయడం, పరీక్షల తర్వాత సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాలకు తరలించడం, మూల్యాంకన నిర్వహించడం, ఫలితాల క్రోడీకరణ, వెల్లడి వరకూ సిబ్బందిని మరింత అప్రమత్తం చేశారు. గతంలో ఫిర్యాదులు లేని వారినే విధుల్లోకి తీసుకునేందుకు ప్రాధాన్యమి చ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ భయం తొలగేనా? కొన్నేళ్లుగా ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణ అధికారులకు సవాల్గా మారుతోంది. హాల్టికెట్లు మొదలుకొని, ఫలితాల వరకూ ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంది. ప్రశ్నపత్రాల్లో తప్పులు సర్వసాధారణం అవుతున్నాయి. మూల్యాంకన, ఫలితాల వెల్లడిలో జరిగిన కొన్ని పొరపాట్ల కారణంగా 2019లో ఇంటర్ బోర్డ్ వ్యవహారం వివాదాస్పదమైంది. ఆ సమయంలో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా ఇంటర్ బోర్డ్ పెద్దగా దిద్దుబాటు చర్యలు చేపట్టలేదనే విమర్శలున్నాయి. ఆ తర్వాత కూడా ఎక్కడో ఒకచోట ప్రశ్నపత్రాల్లో తప్పులు రావడం సమస్యలు తె చ్చిపెట్టింది. ఈసారి ఇలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా బోర్డ్ ముందే అప్రమత్తమైంది. నిపుణులతో ప్రశ్నపత్రాలను రూపొందించారు. గతంలో ఎలాంటి వివాదాలు లేని వారినే ఎంపిక చేసుకున్నారు. అధికారులు ముందే ఈ వివరాలను తెప్పించుకుని మరీ పరిశీలించారు. టెన్త్ పరీక్షలు గత ఏడాది వివాదాలకు దారి తీశాయి. పేపర్ లీకేజీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. సమస్యాత్మక కేంద్రాల్లో ఈసారి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్టు, ప్రైవేటు స్కూళ్లతో సంబంధాలున్న ఉపాధ్యాయులను విధులకు దూరంగా ఉంచుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. హాల్టికెట్ల ఆలస్యంపై దృష్టి : టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్టికెట్ల ఆలస్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించనుంది. ఫీజులు చెల్లించని విద్యార్థులపై ప్రైవేటు స్కూల్, కాలేజీలు పరీక్షల సమయంలో తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నాయి. డౌన్లోడ్ చేసుకునే హాల్టికెట్లపై కాలేజీ ప్రిన్సిపల్, స్కూల్ హెచ్ఎం సంతకాలు అవసరమన్న ఆందోళన కల్గిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగానే హాల్టికెట్ల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలోతప్పిదాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలుతీసుకోవాలి. పరీక్షల సమయంలో విద్యార్థులను ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లు వేధించకుండా చూడాలి. పేపర్ లీకేజి వంటి ఘటనలు జరగకుండా చూడాలి. –చింతకాయల ఝాన్సీ (ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి) ప్రైవేటుకు కొమ్ముకాయొద్దు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సహక రిస్తున్నట్టు గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. పరీక్షలు సజావుగా, ఎలాంటి ఆందోళనలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. –టి నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) -
పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అనుభ శ్రీవాస్తవ సహాయ్ వర్సెస్ కేంద్రప్రభుత్వం కేసులో జస్టిస్ ఏఎంఖన్విల్కర్ , జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూ డిన ధర్మాసనం ఆదేశాల మేరకు పాఠశాలవిద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ తరఫున ప్రభుత్వ న్యాయవాది మెహ్ఫూజ్ నజ్కీ బుధవారం అఫిడవిట్ దాఖలు చేశారు. మే నెలతో పోలిస్తే జూన్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, నిపుణులు కూడా పరీక్షల నిర్వహణ సాధ్యమేనని సూచించారని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. కరోనా ప్రొటోకాల్ పాటిస్తూ జూలై చివరివారంలో పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది. సుమారు పదిమంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపింది. కళాశాలలు నిర్వహించే ఇంటర్నల్ పరీక్షల ఫలి తాలపై ఇంటర్మీడియట్ బోర్డుకు ఎలాంటి నియంత్రణ ఉండదని, ఈ పరిస్థితుల్లో ఫైనల్ పరీక్షలకు వందశాతం మార్కులు ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీసెట్)లో 12వ తరగతి మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉందని, ఆయా అంశాలు పరిశీలించి పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరింది. అఫిడవిట్లోని మరికొన్ని ప్రధానాంశాలు ► 15 రోజుల ముందుగానే పరీక్ష తేదీలు వెల్లడిస్తాం ► 12వ తరగతి ఫలితాల వెల్లడికి పరీక్షల నిర్వహణ తప్ప ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే.. పదో తరగతి ఫలితాలు గ్రేడ్లలో ఉంటాయి. కళాశాలల్లో నిర్వహించే ఇంటర్నల్ పరీక్షల మా ర్కులపై బోర్డుకు నియంత్రణ ఉండదు. ఈ నేపథ్యంలో 12వ తరగతి ఫైనల్ ఫలితాలు వందశాతం వెల్లడికి, ఇంటర్నల్ మార్కుల అసెస్మెంట్కు అవకాశం ఉండదు. ► పరీక్షలకు 12వ తరగతికి 5,19,510 మంది, 11వ తరగతికి 5,12,959 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ► ఒకరోజు 11వ తరగతి, మరోరోజు 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తాం. ► పరీక్ష హాలులో 15 నుంచి 18 మంది మాత్రమే విద్యార్థులను అనుమతిస్తున్నాం. గది సైజు 25–25 పరిమాణంలో ఉంటుంది. విద్యార్థుల మధ్య 5 అడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం ► విద్యార్థి పరీక్ష గది వివరాలు కళాశాల ప్రాంగణంలో పలుచోట్ల ప్రదర్శిస్తాం. దీంతో విద్యార్థులు గుమిగూడే అవకాశం ఉండదు. ఒక రోజు ముందే ఆ వివరాలు వెల్లడిస్తాం. ► bei.ap.gov.inలో నో యువర్సీట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ► పరీక్ష కేంద్రం వద్ద వైద్యాధికారి, మెడికల్ కిట్ ఏర్పాటు చేస్తున్నాం. ► విద్యార్థులు గుంపులుగా రాకుండా.. ముందుగానే వారిని అనుమతించాలని పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించాం. ► కళాశాలలోకి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు వేర్వేరుగా ఉంటాయి. ► పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం కోసం 50 వేల సిబ్బందిని నియమించాం. ► పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ విద్యార్థుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని తగిన భద్రత, రక్షణ ఏర్పాట్లతో పరీక్షలు నిర్వహిస్తాం. -
ఇంటర్ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి: మంత్రి ఆదిమూలపు
-
ఏపీ: ఈరోజు సాయంత్రం నుంచి ఇంటర్ హాల్టికెట్లు డౌన్లోడ్
సాక్షి, విజయవాడ: ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్లో ఎటువంటి మార్పులు లేవని, మే5 నుంచి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్ పరీక్షలు అనివార్యమని, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మే 5 నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థలు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు(ఏప్రిల్ 29) సాయంత్రం ఆరు గంటల నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం. ఇందకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1452 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. గతేడాదితో పోల్చితే ఈ సారి అదనంగా 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 146 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా గుంటూరులో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాకు కోవిడ్ స్పెషల్ అధికారిని నియమించాం. పరీక్షా కేంద్రాలను ప్రతిరోజు శానిటైజ్ చేస్తాం. ప్రతి పరీక్షా కేంద్రంలో థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేశాం. విద్యార్థుల భవిష్యత్, భద్రత ప్రభుత్వ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ప్రతి సెంటర్లో ఒక పారా మెడికల్ సిబ్బందితో పాటు ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేస్తాం. కోవిడ్ లక్షణాలు ఉంటే వారిని ఐసోలేషన్ రూమ్లో పరీక్ష రాయిస్తాం. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణ జరపనున్నాం. దేశంలో ఎక్కడా ఇంటర్ పరీక్షలు రద్దు చేయలేదు. అన్ని భద్రతా ప్రమాణాలతో పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్షలపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయొద్దు’’ అని సురేష్ కోరారు. చదవండి: సీఎం జగన్ నన్ను బతికిస్తున్నాడమ్మా.. -
జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను బుధవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వెలగపూడిలోని సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం జూలై 1 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. టెన్త్లో 7 పేపర్లు: పాఠశాలలను 220 రోజులు నిర్వహించాల్సి ఉండగా కరోనా వల్ల ఈసారి 167 రోజులే నిర్వహించగలుగుతున్నాం. సిలబస్లో 35 శాతం తగ్గించి పరీక్షలు నిర్వహిస్తాం. జూన్ 5వ తేదీ వరకు పదో తరగతి క్లాసులు నిర్వహిస్తాం. జూన్ 7నుంచి 16వ తేదీ వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో ఏడు పేపర్లు ఉంటాయి. లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2, ఇంగ్లిష్, లెక్కలు, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులలో 100 మార్కులకు ఒక్కొక్క పేపర్ చొప్పున ఉంటుంది. సైన్స్కు మాత్రం రెండు పేపర్లు ఉంటాయి. ఫిజికల్ సైన్స్ 50 మార్కులకు, బయలాజికల్ సైన్స్ 50 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తాం. జూలై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం మే నెల 15వ తేదీ వరకు 1 నుంచి 9వ తరగతి క్లాసులు నిర్వహిస్తాం. ఈ సారి వేసవి సెలవులు లేవు. పరిస్థితిని బట్టి ఒంటిపూట బడులు నిర్వహించే విషయంపై నిర్ణయం తీసుకుంటాం. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మే 3 నుంచి 15 వరకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తాం. మే 16 నుంచి జూన్ 30 వరకు సెలవులు ఇస్తాం. జూలై 1న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. మే 5 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ఇంటర్మీడియెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించిన విధంగా మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తాం. మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు రెండు సెషన్లుగా జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తాం. ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్షల ఫీజును 30 శాతం పెంచాల్సి ఉంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఫీజులు పెంచొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దాంతో గత ఏడాది మాదిరిగానే పరీక్ష ఫీజు రూ.490, దరఖాస్తు ఫీజు రూ.10, ప్రాక్టికల్స్ ఫీజు రూ.190 చొప్పున మాత్రమే ఈ ఏడాది వసూలు చేస్తాం. గత ఏడాది కరోనా కారణంగా అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ నిర్వహించలేకపోయాం. ఈ ఏడాది నిర్వహించే పరీక్షలతోపాటు ప్రస్తుతం రెండో సంవత్సరంలో ఉన్నవారు మొదటి ఏడాది పరీక్షలు ఇంప్రూవ్మెంట్ కోసం రాసుకోవచ్చు. గత ఏడాది ఇంటర్మీడియెట్ పాస్ అయిన వారు కూడా ఇప్పుడు ఆ పరీక్షలకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసే అవకాశం కల్పించాం. -
ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ భౌతికదూరం తదితర జాగ్రత్తలతో సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రారంభమైంది. మొత్తం 10.64 లక్షల మంది వివిధ కాంబినేషన్ల కోర్సులతో ఇంటర్ మొదటి, రెండో సంవత్సర పరీక్షలు రాశారు. వీరికి సంబంధించి 60 లక్షలకుపైగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని ఇంటర్మీడియెట్బోర్డు కార్య దర్శి ఎం.రామకృష్ణ తెలిపారు. రోజూ రెండు షిఫ్టుల్లో మూల్యాంకనం జరుగుతుందని పేర్కొన్నారు. ఒక్కొక్క ఎగ్జామినర్కు ఉదయం 15, మధ్యాహ్నం 15 చొప్పున 30 పేపర్లు ఇస్తామని, పరిస్థితిని బట్టి వీటి సంఖ్య కొంత పెంచి మూల్యాంకనాన్ని త్వరగా ముగించి ఫలితాలు వెల్లడిస్తామనిì తెలిపారు. గతంలో జిల్లాకొకటి చొప్పున 13 మూల్యాంకన కేంద్రాలుండగా ఇప్పుడు వాటిని మొత్తం 46 కేంద్రాలకు పెంచినట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో 6 కేంద్రాలు, అనంతపురం జిల్లాలో 5, నెల్లూరు, ప్రకాశం, తూ.గోదావరి జిల్లాల్లో 4 చొప్పున, శ్రీకాకుళం, విశాఖ, ప.గోదావరి, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 3 చొప్పున, విజయనగరం జిల్లాలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
జూన్ 3న ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో వాయిదా పడిన ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు జూన్ 3వ తేదీన ఇంటర్ ద్వితీయ సంవత్సర జియాగ్రఫీ పేపర్–2, మోడర్న్ లాంగ్వేజ్ పేపర్–2 పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, పాత పరీక్ష కేంద్రాల్లోనే పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు పాత హాల్ టికెట్లతోనే హాజరు కావచ్చని వెల్లడించారు. -
మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు!
సాక్షి,హైదరాబాద్: పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈమేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇంటర్మీడియేట్ పరీక్షలు ముగిసే రెండ్రోజుల ముందు టెన్త్ పరీక్షలు ప్రారంభిస్తుండగా...ఈ సారి కూడా అదే తరహాలో పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. వారంలోపు పరీక్షల షెడ్యూల్ను ప్రభు త్వ పరీక్షల విభాగంప్రకటించే అవకాశం ఉంది. మార్చి21 నుంచి పరీక్షలు ప్రారంభించే అంశంపై అధికారులు చర్చించినప్పటికీ.. షెడ్యూ ల్లో ఒకట్రెండు రోజులు అటుఇటు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ను బోర్డు విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలను, 5 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలను ప్రారంభించేలా షెడ్యూలును (టైంటేబుల్) బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులకు 2020 ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను జనవరి 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎని్వరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను అదే నెల 30న నిర్వహిస్తామని వెల్లడించారు. వొకేషనల్ పరీక్షలకు కూడా ఇవే తేదీలను వర్తింపజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 9.5 లక్షల మంది హాజరుకానున్నారు. -
రీ వెరిఫికేషన్ ప్రాసెసింగ్కు స్వతంత్ర సంస్థ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయి లైన విద్యార్థుల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ చేయా లని నిర్ణయించిన బోర్డు.. వాటి ప్రాసెసింగ్ కోసం మరో స్వతంత్ర సంస్థను నియమించనుంది. ప్రస్తు తం ఫలితాల ప్రాసెసింగ్ చేస్తున్న గ్లోబరీనా సంస్థకు సమాంతరంగా మరో సంస్థ చేత రీ వెరిఫికేషన్ ఫలితాల ప్రాసెసింగ్ చేయించేలా ఏర్పాట్లు చేస్తోంది. స్వతంత్ర సంస్థ ఎంపిక బాధ్యతను తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్కు (టీఎస్టీఎస్) అప్పగించింది. ఈ ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఇంటర్ ఫలితాల్లో తప్పులపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. భారీ కసరత్తు చేయాల్సిందే... ఇంటర్ పరీక్షల్లో 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఫలితాల్లో చాలా మంది విద్యార్థులకు మార్కులు వచ్చినా సున్నాలు పడటం, పరీక్షలకు హాజరైనా ‘ఆబ్సెంట్’ అని రావడం వంటి తప్పిదాలు చోటుచేసుకోవడం తెలిసిందే. దీంతో విద్యా ర్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొందరు విద్యార్థులు ఫెయిలయ్యామనే బాధతో ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించి నివేదిక తెప్పించుకుంది. పొరపాట్లు దొర్లడం వాస్తవమని గుర్తించిన కమిటీ... ఫెయిలైన విద్యార్థులందరి జవా బు పత్రాలనూ రీ వెరిఫికేషన్ చేయాలని సూచించింది. దీంతో 3.28 లక్షల మంది విద్యార్థులకు చెందిన దాదాపు 11 లక్షల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేసేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. మరోవైపు 48,960 మంది విద్యార్థులు తమకు తక్కువ మార్కు లు వచ్చాయంటూ రీ వెరిఫికేషన్ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మరో 10,576 మంది రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి సంబంధించిన 1,13,339 జవాబు పత్రాలను కూడా రీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. మొత్తంగా 3,76,960 మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు 12 లక్షల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. లెక్చరర్ల ఆధ్వర్యంలో పది రోజులకుపైగా జరిగే రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక గ్లోబరీనాతోపాటు కొత్త కంప్యూటర్ సంస్థ ఆధ్వర్యంలో సమాంతరంగా రీ వెరిఫికేషన్ ఫలితాల ప్రాసెసింగ్ను బోర్డు చేపట్టనుంది. -
టైమ్కి వెళ్లినా.. ఎగ్జామ్కు నో ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్/ అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రారంభం కాగా... కానీ కొన్ని పరీక్ష కేంద్రాల్లో రూమ్ వెతుక్కోవడంలో అలస్యమైనందుకు ఎగ్జామ్ రాసేందుకు విద్యార్థులను అనుమతించలేదు. సూర్యాపేట జిల్లా కోదాడలో వాగ్దేవి కాలేజీ ఇంటర్ విద్యార్థినిని ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో సిబ్బంది బయటకు గెంటేశారు. దీంతో విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టగా పోలీసులు నచ్చజెప్పే యత్నం చేశారు. బాధిత విద్యార్థిని రమాదేవి మాట్లాడుతూ.. నిర్ణీత సమయానికే ఎగ్జామ్ సెంటర్కు వెళ్లిన తాను రూమ్ వెతుక్కోవడంలో అలస్యమైనందుకు బయటకు పంపారని చెప్పింది. పరీక్ష రాసేందుకు అనుమతించాలని వేడుకున్నా సిబ్బంది తన మాట వినలేదని వాపోయింది. కాగా, ఏపీలో మొత్తం 1,423 కేంద్రాల్లో, తెలంగాణలో 1,294 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అయితే నిమిషం నిబంధన కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు చిక్కులు పెట్టి పరీక్ష రాయకుండా అడ్డుకుంది. ఉదయం 8.45 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతించారు. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్తో ఉదయం 9 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి చేరుకున్న విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించినట్లు సిబ్బంది చెబుతున్నారు. -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం (నేడు) నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 1,423 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 10,26,891 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీటిలో 48 కాలేజీల్లో సెల్ఫ్ సెంటర్లను ఏర్పాటుచేశారు. మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నపత్రాల సెట్ను బుధవారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి చెప్పారు. 28న ఫస్టియర్, 29న సెకండియర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫస్టియర్కు 5,09,898 మంది, సెకండియర్కు 5,16,993 మంది హాజరవుతారు. వీరిలో వొకేషనల్ విద్యార్థులు 63,419 మంది ఉన్నారు. కాగా, అధికారులు సమస్యాత్మక, సున్నితమైన కేంద్రాలను గుర్తించి ఆయాచోట్ల అదనపు భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. పరీక్షలు ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు జరుగుతాయి. పరీక్షల్లో కాపీ చేస్తూ పట్టుబడితే నాలుగేళ్ల వరకు అనుమతించకుండా డిబార్ చేసేలా కొత్త నిబంధన పెట్టారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను సులువుగా గుర్తించేందుకు ‘ఐపీఈ సెంటర్ లొకేటర్’ అనే ప్రత్యేక యాప్ను కూడా బోర్డు రూపొందించింది. హాల్టికెట్ నెంబర్ నమోదుచేస్తే సెంటర్ రూట్మ్యాప్ చూపిస్తుంది. ఇదిలాఉంటే.. ఈ ఏడాది నుంచి ర్యాంకుల స్థానంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్న సంగతి తెలసిందే. సందేహాలుంటే సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 0866–2974130, ఫ్యాక్స్ నెంబర్ 0866–2970056, టోల్ ఫ్రీ నెంబర్ 18002749868కు తెలియజేయాలని కార్యదర్శి పేర్కొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
► రాష్ట్ర ఇంటర్బోర్డు కార్యదర్శి అశోక్ ► 9వ తేదీ పరీక్షలు 19వ తేదీకి మార్పు ► జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఆదిలాబాద్ అర్బన్ : మార్చి ఒకటి నుంచి 19వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఇంటర్బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రంజీవ్ ఆచార్య అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్మ నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై చర్చించారు. మార్చి 9న నిర్వహించే గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షలను ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా 19వ తేదీకి మార్చిన విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని ఆదేశించారు. విద్యార్థులు bietelangana.cgg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ వారు పరీక్ష కేంద్రం లోకేషన్ యాప్ను విడుదల చేసిందని, దీని ప్రకారం విద్యార్థి హాల్టికెట్ నంబర్, కేంద్రం నంబర్ నమోదు చేస్తే యాప్ ద్వారా పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు రూట్మ్యాప్, చేరే సమయం తెలుసుకునే వీలుందని అన్నారు. కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మొత్తం 56,655 మంది విద్యార్థులకు గాను 90 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 8.15 నుంచి 9గంటల వరకు పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారని అన్నారు. నూతన ఆదిలాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి 30 వరకు, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షల్లో మొత్తం 10,410 విద్యార్థులకు 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామని, పరీక్ష సమయంలో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని జిరాక్స్ సెంటర్ల యజమానులను ఆదేశించామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, డీఆర్ఓ బానోత్ శంకర్, డీఐవో నాగేందర్, డీఈవో లింగయ్య, డీఎస్పీ లక్షీ్మనారాయణ, మున్సిపల్ కమిషనర్ మంగతాయరు తదితరులు పాల్గొన్నారు. -
నిమిషం ఆలస్యమైనా..
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలి.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఈ–హాల్టికెట్లు చెల్లుబాటు సందేహాలుంటే సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 08462–245333 నిజామాబాద్ అర్బన్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, 18వ తేదీ వరకు కొనసాగుతాయని, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి ఒడ్డెన్న తెలిపారు. గురువారం నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్ష కేంద్రానికి ఆరగంట ముందుగానే చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడదని అధికారులు పేర్కొంటున్నారు. సర్వం సిద్ధం జిల్లాలో 43 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 18,101 మంది జనరల్ విద్యార్థులు, 1,607 మంది వోకేషన్ విద్యార్థులు మొత్తం 19,708 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో రెగ్యులర్ విద్యార్థులు 15,649, ప్రైవేట్ విద్యార్థులు 2,440 మంది.. మొత్తం 18,089 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వొకేషనల్లో రెగ్యులర్ విద్యార్థులు 1,321, ప్రైవేట్ విద్యార్థులు 177 మంది మొత్తం 1,498 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం మొత్తం మంది విద్యార్థులు 39,295 మంది విద్యార్థులు ఉన్నారు.ప్రభుత్వ కళాశాలలు 17 సెంటర్లు, ఎయిడెడ్–2, రెసిడెన్షియల్–2, మోడల్ స్కూళ్లు–2, ప్రైవేట్లో–19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 1,007 ఇన్విజిలేటర్లను కేటాయించారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 43 మందిని కేటాయించారు. మాస్కాపీయింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్ఐవో తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని ఫ్లయింగ్స్కా ్వడ్ బృందాలు 2, ఆరు సిట్టింగ్ స్కా ్వడ్ బృందాల తనిఖీలు చేయనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన హైపవర్ కమిటీ అందుబాటులో ఉంటుంది. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నారు. విద్యార్థులు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్ఐవో తెలిపారు. అలాగే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు లోకేషన్ మ్యాప్ను అందుబాటులో తీసుకొచ్చినందుకు విద్యార్థుల హాల్టికెట్ నంబర్తో సెంటర్లు సులువుగా తెలుసుకోవచ్చును. మార్చి 9న పరీక్ష 19 తేదీకి మార్పు మార్చి 9వ తేదీన నిర్వహించవల్సిన సెకండరీయర్ గణితం–2, జువాలాజీ, హిస్టరీ పరీక్షలు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 19వ తేదీన నిర్వహించనున్నారు. విద్యార్థులకు పాత పరీక్ష కేంద్రాలలోనే పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఏమైన సందేహాలు ఉంటు 08462–245333 నెంబర్లకు సంప్రదించవచ్చును. -
మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు
ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు షెడ్యూల్ జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. వచ్చే ఏడాది (2017) మార్చి 1 నుంచి 18వ తేదీ వరకు.. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనుంది. ప్రథమ సంవత్సర పరీక్షలు మార్చి 1 నుంచి 17వ తేదీ వరకు... ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి 2 నుంచి 18వ తేదీ వరకు జరుగుతారుు. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్ను ఇంటర్ బోర్డు సోమవారం విడుదల చేసింది. ఇక ‘నైతికత-మానవ విలువల (ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్)’ అంశంపై పరీక్షను 2017 జనవరి 28న, పర్యావరణ విద్య పరీక్షను 31వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని తెలిపింది. ఇక ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జనరల్తో పాటు వొకేషనల్ విద్యార్థులకు కూడా ఇవే పరీక్ష తేదీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థారుు సమావేశంలో ఈ టైం టేబుల్ను ఖరారు చేశారు. ద్వితీయ భాషా సబ్జెక్టుతో పరీక్షలను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. -
ఒకటో తేదీ నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 1 నుంచి 14 వరకు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు గురువారం తెలిపారు. 57 కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యేందుకు 17,490 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. 67 కేంద్రాల్లో నిర్వహించే ఎస్సెస్సీ పరీక్షలకు 20,659 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. హాల్టికెట్లను telanganaopenschool.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. మొదటి రోజు పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని, ఉదయం 9.35 గంటల తర్వాత, మధ్యాహ్నం పరీక్షకు 2.05 గంటల తర్వాత పరీక్ష హాల్లోకి అనుమతించబోమని వెల్లడించారు. రెండో రోజు నుంచి 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష రాసేందుకు రైటింగ్ ప్యాడ్, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేల్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని చెప్పారు. -
ఇంటర్లో ఫెయిలయ్యారని..
ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యారనే కారణంతో ఈపూర్ మండలంలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కోతి చిరంజీవి(17) అనే విద్యారి ప్రాణాలు కోల్పోగా.. వనికుంట గ్రామానికి చెందిన సత్తి శౌరిరాజు(16) అనే విద్యార్థి చేతులు, కాళ్లు, మెడ కోసుకుని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిరంజీవి అనే విద్యార్థి తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఇంటర్ ఫలితాల రోజు ఈపూర్లో విషాదం నెలకొంది. -
అంతా ఓపెన్
► సార్వత్రిక పరీక్షల్లో చూచిరాతలు ► నిర్వహణ కమిటీలు పనిచేయడం లేదనే ఆరోపణలు ► మెటీరియల్ వెంట తెచ్చుకుని రాస్తున్న విద్యార్థులు సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు చూచి రాతలుగా తయారయ్యాయి. చదువు మధ్యలో మానేసిన వారికి, వివిధ వృత్తుల్లో ఉన్నవారు, గృహిణులు కనీస విద్యార్హతను పెంచుకునేందుకు వీలుగా పరీక్షలకు హాజరవుతున్నారు. పబ్లిక్ పరీక్షల్లో పొందే ఉత్తీర్ణత సర్టిఫికెట్తో సమానంగా దీనికి కూడా విలువ కల్పించారు. నాల్గవ తరగతి ఉద్యోగులుగా కొనసాగుతూ పదోన్నతులు పొందాలనుకునేవారు, అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు, ఇతరత్రా ఉద్యోగాల్లో చేరాలనుకునే వారికి ఈ ధ్రువీకరణ పత్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జిల్లాలో పరీక్షలకు 7,838 మంది అభ్యర్థులు జిల్లాలో ఈ నెల 7 నుంచి ప్రారంభమైన ఓపెన్స్కూల్ పరీక్షలు 19 వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇంటర్కు-11, పదవ తరగతికి- 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్కు 4,120 మంది, పదవ తరగతికి 3,715 మంది హాజరు కావాల్సి ఉంది. పరీక్షల నిర్వహణకు జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా హైపవర్, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సక్రమంగా పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పరీక్ష కేంద్రాల నిర్వాహకులను అభ్యర్థులు సానుకూలపరచుకొని వారు కోరిన విధంగా నగదు సమర్పించి ఏ మాత్రం భయపడకుండా మెటీరియల్ వెంట తెచ్చుకొని పరీక్షలకు హజరౌతున్నారు. పాస్ కావాలంటే తప్పదు ఓపెన్స్కూల్ నిబంధనల ప్రకారం ఇంటర్కు ప్రవేశ ఫీజు రూ. 3వేలు, పరీక్ష ఫీజు రూ. 750 చెల్లించాలి. పదవ తరగతికి ప్రవేశ ఫీజు రూ. 2 వేలు, పరీక్ష ఫీజు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక్కో అభ్యర్థి నుంచి ఇంటర్కు రూ. 12 వేలు, పదవ తరగతికి రూ.10 వేలు చొప్పున ఒక మొత్తంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆ విధంగా ఇస్తే అన్నీ తామే చూసుకుంటామని, ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావచ్చని ముందే చెప్పి వసూళ్ళకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అందినకాడికి వసూలు చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థులు కూడా ఏదో విధంగా ఉత్తీర్ణత అయితే చాలన్నట్లు వేలకు వేలు అందజేస్తున్నారు. ఉన్నతాధికారుల తనిఖీలు సత్తెనపల్లిలో ఇంటర్కు ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఇప్పటికి వరుసగా మూడు రోజుల పాటు 19 మందిపై మాల్ ప్రాక్టీస్ కింద కేసులు నమోదు చేశారు. మొదట ఓపెన్ స్కూల్ డెరైక్టర్, గుంటూరు ఆర్జేడీ పి.పార్వతి తనిఖీలు చేపట్టి 12 మందిని మాల్ ప్రాక్టీస్ కింద పట్టుకున్నారు. దీంతో విద్యాశాఖాధికారుల్లో భయాందోళన మొదలై మరుసటి రోజు ఆరుగురిని, మంగళవారం ఒకరిని పట్టుకున్నారు. మొదటి రోజు నలుగురు ఇన్విజిలేటర్లు, ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్టుమెంటల్ ఆఫీసర్పై చర్యలకు సిఫార్స్ చేశారు. మిగిలిన రెండు రోజలు పర్యవేక్షకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనేది సమాచారం. ఇంత జరిగినా మార్పు లేకపోగా ఇంకా చూచిరాతలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అంతా ‘ఓపెన్’
► ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో చూచిరాతలు ► ఒకరికి బదులుగా మరొకరు రాస్తున్న వైనం కదిరి టౌన్:- ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం) ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు తెరలేపారు. ఈ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, హిందూపురం రోడ్డులోని మునిసిపల్ ఉన్నతపాఠశాల, సరస్వతీ విద్యామందిరం కేంద్రాల్లో సుమారు 1,500 మంది పరీక్షలు రాస్తున్నారు. మొదటిరోజే చూచిరాతలను తలపించాయి. యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నా ఇన్విజిలేటర్లు, అధికారులు ఏమాత్రమూ పట్టించుకోలేదు. విద్యార్థులు పుస్తకాలను పక్కనే పెట్టుకుని పరీక్ష రాశారు. ఒక బెంచీపై ముగ్గురు కూర్చొని ఒకరికొకరు సమాధానాలు చెప్పుకుంటూ రాయడం కన్పించింది. ఒకరికి బదులు మరొకరు కూడా రాస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అధ్యయన కేంద్రాల నిర్వాహకులు విద్యార్థుల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేసి..‘పాస్ గ్యారంటీ’ పేరుతో మాస్ కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్నారు. వారే సమాధాన పత్రాలు తయారు చేసి పంచుతుండటం గమనార్హం. ఈ తంతును చిత్రీకరించేందుకు కెమెరాలతో వెళ్లిన పాత్రికేయులను కొందరు ఇన్విజిలేటర్లు, అధికారులు అడ్డుకున్నారు. కెమెరాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. మరి కొందరు పరీక్ష కేంద్రంలోకి మీడియాకు అనుమతి లేదని బుకాయించారు. ఇదే సమయంలో నిర్వాహకులు, ఇన్విజిలేటర్లు అలర్ట్ అయ్యి..విద్యార్థులను వరుస క్రమంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారు. పరారైన నకిలీ విద్యార్థులు గుత్తి: పట్టణంలోని మోడల్ స్కూల్, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో బుధవారం ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో పది మంది నకిలీ అభ్యర్థులు పరారయ్యారు. పుట్లూరు హైస్కూల్ హెడ్మాస్టర్ లక్ష్మినారాయణను ఇక్కడ స్క్వాడ్గా వేశారు. ఈయన విద్యార్థులను చెక్ చేస్తుండగా సుమారు పది మంది నకిలీలు పరీక్ష కేంద్రం నుంచి పరుగులు తీశారు. జి.సంధ్యరాణి (హాల్ టికెట్ నం:1512169558) డి.విశ్వనాథ్(1512169607), శ్యామ్లాల్(1512169626), కట్టుబడి సాబ్(1512169629),చక్రవర్తి(1512169642),సురేష్బాబు(1512169683)తో పాటు మరో నలుగురి స్థానాల్లో ఇతరులు పరీక్ష రాయడానికి వచ్చారు. స్క్వాడ్ రావడంతో భయపడి పరీక్ష హాల్లో నుంచి పరారయ్యారు. -
ఇదేం ‘పరీక్ష’?
♦ కుర్చీలు, బెంచీలు లేక ఇంటర్ విద్యార్థుల వెతలు ♦ ‘నిమిషం’ నిబంధనతో పలువురు పరీక్షకు దూరం ♦ తొలి రోజు 94.51 శాతం హాజరు నమోదు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణలో తొలి రోజు కొన్ని గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో కూర్చునేందుకు కుర్చీల్లేక, రాసుకునేందుకు బల్లల్లేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. గ్రామాల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు సకాలంలో బస్సులందక జిల్లాల్లో, ట్రాఫిక్ సమస్య వల్ల హైదరాబాద్లో పలువురు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్నారు. ‘నిమిషం లేటు’ నిబంధన వల్ల వందలాది మంది పరీక్షకు దూరమయ్యారు. పలు జిల్లాల నుంచి మాస్ కాపీయింగ్ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ ద్వితీయ భాష పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4,82,666 మందికి గాను 4,56,148 మంది (94.51శాతం) హాజరైనట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, మాల్ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని పేర్కొంది. నల్లగొండ, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేక పరిశీలకులను పంపారు. ► నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులకు సరిపడా బెంచీల్లేక నేల మీద కూర్చునే రాయాల్సి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కొన్ని కేంద్రాల్లో కుర్చీలు వేసినా రాసే బల్లల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ► యాజమాన్యం హాల్టికెట్లివ్వలేదంటూ రాజేంద్రనగర్లోని విజనరీ కాలేజీ ముందు విద్యార్థులు ఆందోళన చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఈ కాలేజీ రాజేంద్రనగర్లో అనధికారిక శాఖను నడుపుతున్నట్టు తెలిసింది. ► మహబూబ్నగర్ జిల్లా నారాయణ్పేట్లో ఇంటర్ విద్యార్థిని ప్రమాదానికి గురైంది. చికిత్స చేయించుకొని గంట ఆలస్యంగా రాగా పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. ► హైదరాబాద్లో మైత్రివనం వద్ద ట్రాఫిక్జామ్ కావడంతో యూసుఫ్గూడలోని చైతన్య జూనియర్ కాలేజీ పరీక్ష కేంద్రానికి ప్రశ్నపత్రాలు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాయి. విద్యార్థులకు ఆ మేర అదనపు సమయమి చ్చా రు. హయత్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కూడా ప్రశ్నపత్రాలు ఆలస్యమయ్యాయి. ► మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్, ఖమ్మం జిల్లా ఇల్లెందు, నల్గొండ జిల్లా ఆత్మకూరు, వరంగల్ జిల్లా సంగెం, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, వికారాబాద్ల్లోని పలు కేంద్రాల్లో భారీగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు కంట్రోల్రూమ్కు ఫిర్యాదులు రావడంతో అక్కడ నిఘా పెంచారు. ► వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని కేంద్రాల్లో విద్యార్థులకు తాము చదువుకున్న సిలబస్ నుంచి కాకుండా వేరే సిలబస్, వేరే గ్రూప్ తాలూకు ప్రశ్నపత్రాలు వచ్చాయి. అధికారులు వెంటనే వాటిని మార్చినట్లు సమాచారం. -
ప్రశాంతంగా ప్రారంభం
కంబాలచెరువు (రాజమండ్రి) : ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో సెకండ్ లాంగ్వేజ్లో పేపర్- 1 విభాగంలో తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 49,807 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 47,269 మంది హాజరయ్యూరు. 2,538 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని మొత్తం 128 కేంద్రాల్లో ఎక్కడా మాల్ప్రాక్టీస్, ఆలస్యంగా పరీక్షకు వచ్చిన ఉదంతాలు నమోదు కాలేదు. పరీక్షా కేంద్రాలవద్ద 144 సెక్షన్ విధించారు. ఉదయం 8 గంటలకే కేంద్రాలవద్ద సందడి నెలకొంది. విద్యార్థులు ముందుగానే వచ్చి వారికి కేటాయించిన రూమ్ నంబర్లను హాల్ టిక్కెట్లతో పోల్చిచూసుకున్నారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. పరీక్షా కేంద్రాలకు చేరువలోని జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. పరీక్ష రాసిన 22 మంది అంధ విద్యార్థులు జిల్లావ్యాప్తంగా 22 మంది అంధ విద్యార్థులు బ్రెయిలీ లిపిలోఇంటర్ పరీక్షలు రాసారు. వీరితో పాటు వికలాంగ విద్యార్థులు 79 మంది, చెవిటి, మూగ విద్యార్థులు 44 మంది, మతిస్థిమితం లేని విద్యార్థులు ముగ్గురు పరీక్షలను రాసారు. వీరందరికీ వ్యక్తిగత సహాయకులను అనుమతించారు. మూడు సిట్టింగ్ స్వ్కాడ్స్, నాలుగు ఫ్లైయింగ్ స్వ్కాడ్స్తో పాటు హైపవర్ టీం, ఆర్ఐవో టీం, డీవీఈవో టీంలు పరీక్షా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. 128 మంది చీఫ్ సూపరిండెండెంట్లు, 128 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు పరీక్షల నిర్వహణలో పాలు పంచుకున్నారు. రాజమహేంద్రవరం దానవాయిపేటలో ఒకే ప్రాంతంలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఉండడంతో ఉదయం సుమారు గంటసేపు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. టెన్షన్తో టెన్త్ హాల్ టిక్కెట్ సామర్లకోట : ఎంత కష్టపడి చదివినా, ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నా.. పిల్లలకు పబ్లిక్ పరీక్షలంటేనే ఏదో కలవరం. తప్పనిసరి తడబాటు. అదిగో.. అలాంటి మానసిక స్థితితో సతమతమయ్యే కాబోలు.. ఓ ఇంటర్ విద్యార్థి నిరుటి పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్తో సామర్లకోట ప్రగతి కళాశాలలోని పరీక్షా కేంద్రానికి వచ్చాడు. ప్రశ్నాపత్రం ఇచ్చే సమయంలో ఆ హాల్ టిక్కెట్ను పరిశీలించిన ఇన్విజిలేటర్ అది టెన్త్ హాల్ టిక్కెట్టని, ఇంటర్ హాల్టిక్కెట్ ఏదని ప్రశ్నించగా ఆ విద్యార్థి బిత్తరపోరుు, నిస్సహాయంగా ఉండిపోయూడు. అరుుతే పరీక్షా కేంద్రం అధికారులు విద్యార్థికి నష్టం కలుగకుండా ఆన్లైన్లో అప్పటికప్పుడు హాల్టిక్కెట్ ను డౌన్లోడ్ చేసి ఇచ్చి పరీక్ష రాసే అవకాశం కల్పించారు. -
సర్వం సిద్ధం
నేటినుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో రాయనున్న విద్యార్థుల సంఖ్య 47,773 66 కేంద్రాల్లో పరీక్షలు అర్ధగంట ముందే చేరుకోవాలని సూచన నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టీకరణ వెబ్సైట్ ద్వారా ‘హాల్టికెట్’ డౌన్లోడ్ విజయనగరం అర్బన్: జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలిరోజున ప్రథమ ఇంటర్ పరీక్షలు, రెండో రోజు సీనియర్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. జిల్లాలోని 170 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలలకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. ప్రథమ సంవత్సరం 24,062 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 23,711 మంది కలిపి మొత్తం 47,773 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 66కేంద్రాలను ఏర్పాటు చేశారు. 66 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 66 మంది డిపార్ట్మెంట్ అధికారులు, పదిమంది సిట్టింగ్ స్క్వాడ్లు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పనిచేస్తాయి. ప్రతి కేంద్రంలోనూ జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. అరగంట ముందే చేరుకోవాలి పరీక్షల సమయపాలనలో స్వల్ప మార్పులు చేశారు. గతేడాది ఉదయం 9 గంటల్లోగా పరీక్ష కేంద్రానికి తప్పనిసరిగా చేరుకోవాలనే నిబంధన విధించారు. ఈసారి అర్ధగంట ముందే అంటే ఉదయం 8.30 గంటలకు కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదని బోర్ఢు అధికారులు స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాలను సైతం 8.45 గంటలకు పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు. ఒకసారి విద్యార్థికి ప్రశ్నపత్రం ఇచ్చాక ఏకారణం చేతనైనా మాట్లాడించడం, ప్రశ్నలు వేయటం చేయకూడదు. కేంద్రాల్లో ఫర్నిచర్, తాగునీరు, వెలుగు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వెబ్సైట్ ద్వారా హాల్టికెట్ కళాశాల యాజమాన్యం ఏ కారణం చేతనైనా హాల్టిక్కెట్ ఇవ్వని నేపధ్యంలో విద్యార్థి పరీక్షకు హాజరుకాలేని పరిస్థితి రాకూడదని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోటీ పరీక్షల మాదిరిగానే అభ్యర్థి నేరుగా హాల్టికెట్ను ‘బిఐఇఏపీ.సీజీజీ.జిఓవిటి.ఐఎన్’ వెబ్సైట్ నుంచి తీసుకునే అవకాశం కల్పించారు. -
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
* జిల్లాలో 128 కేంద్రాల్లో నిర్వహణ * ప్రతిచోటా గట్టి బందోబస్తు * 144 సెక్షన్ విధింపు * 0883-2473430తో హెల్ప్డెస్క్ కంబాలచెరువు (రాజమండ్రి) : జిల్లాలో బుధవారం నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 128 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు సన్నాహాలు చేశారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభం కానుండగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం మొదలవుతాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలను 48,330 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం పరీక్షలను 49,178 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరిలో వృత్తి విద్యాకోర్సుల పరీక్షలకు ప్రథమ సంవత్సరంలో 5,892 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,237 మంది హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా 8.30 గంటలకే విద్యార్థులంతా పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని, 8.45 గంటలకు కచ్చితంగా పరీక్ష హాలులో ఉండాలని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎ.వెంకటేష్ చెప్పారు. ప్రతి కేంద్రం వద్దా 144 సెక్షన్ విధించి, గట్టిబందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 8 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి, మరింత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో అడ్డతీగల, కూనవరం కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సమస్యాత్మకంగా ఉన్న రంపచోడవరం, రాజోలు కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఇంటర్బోర్డు అధికారులు ఉన్నతాధికారులను కోరారు. పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఈ ఏడాదినుంచి జీపీఆర్ఎస్ విధానాన్ని పూర్తిగా అమలు చేయనున్నారు. దీనివల్ల పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికాలు తీసుకు వస్తే సులువుగా గుర్తించవచ్చు. పరీక్షల నిర్వహణకు మొత్తం 128 మంది డిపార్ట్మెంట్స్ ఆఫీసర్లు, 128 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. ఈసారి పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లోని అన్ని జిరాక్స్ సెంటర్ల విధిగా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సహాయం కోసం ఆర్ఐవో కార్యాలయం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. సహాయం కావాల్సిన వారు నేరుగా లేక 0883- 2473430 నంబర్కు ఫోన్ ద్వారా తెలియజేయవచ్చు. -
ఇంటర్ స్పాట్ పైకం పెంపు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ పరీక్షలు, మూల్యాంకనం (స్పాట్) నిర్వహణలో పాల్గొనే అధికారులకు, అధ్యాపకులకు ఇంటర్మీడియెట్ బోర్డు తీపికబురు అందించింది. ప్రస్తుతం అందజేస్తున్న రెమ్యూనిరేషన్కు మరో 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకొంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎంవీ సత్యనారాయణ జారీచేశారు. దీంతో ఇంటర్ పరీక్షలతోపాటు, మూల్యాంకనంలోను పాల్గొనే సుమారు రెండు వేల మంది మంది అధికారులు, అధ్యాపకులు, సిబ్బందికి లబ్ధిచేకూరనుంది. ఇంటర్ ప్రాక్టికల్స్కు సైతం పెంచిన రెమ్యూనిరేషన్ వర్తించనుంది. ప్రతి మూడేళ్లకొకసారి పెంపు ఇదిలా ఉండగా ఇకపై ప్రతి మూడేళ్లకు ఒకసారి ఇంటర్మీడియెట్ పరీక్షలు, మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బంది రెమ్యూనిరేషన్ పెంచాలని బోర్డు భావించింది. ప్రస్తుతం రోజుకు 30 పేపర్లు దిద్దే ఎగ్జామినర్లకు పేపర్కు రూ.12.10 చొప్పున రూ.363 చెల్లిస్తుండగా పెరిగిన రెమ్యూనిరేషన్తో రూ.15.125 చొప్పున రూ.453 చెల్లించనున్నారు. పెరుగుతున్న నిత్యవసర ధరలు, భోజన, బస్సు ఛార్జీల నేపథ్యంలో ప్రతి మూడేళ్లకొకసారి రెమ్యూనిరేషన్ను కనీసం 20 శాతం పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని బోర్డు కూడా స్పష్టం చేసింది. డీఏ కూడా పెరగనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన బోర్డుకు, జూనియర్ లెక్చరర్ల సంఘం మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ప్రస్తుతం పెరిగిన ధరలతో పోలిస్తే ఈ రెమ్యూనిరేషన్ ఏ మూలకు సరిపోదని అధ్యాపకులు భావిస్తున్నారు. మూడేళ్లకొకసారి కాకుండా ప్రతి ఏడాది కనీసం 10 శాతం మేర రెమ్యూనిరేషన్ పెంచేలా బోర్డు చొరవతీసుకోవాలని అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వెలువడిన షెడ్యూల్.. ఇదిలా ఉండగా మార్చి 2వ తేదీ నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానుండగా మార్చి 16తో జనరల్ కోర్సుల పరీక్షలు ముగియనున్నాయి. దాదాపు మార్చి 17 నుంచి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను మొదలుపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు జిల్లా అధికార యంత్రంగం ఇప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. -
మార్చి 2 నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 2 నుంచి మొదలయ్యే తెలంగాణ పరీక్షలతోపాటే ప్రారంభించేలా షెడ్యూల్ను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు సంతకం చేశారు. ఇంటర్ బోర్డు దీనిపై అధికారికంగా ప్రకటన వెలువరించాల్సి ఉంది. ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏపీ, తెలంగాణ ప్రశ్నపత్రాలు దాదాపు ఒకే మాదిరిగా ఉంటున్నందున.. వేర్వేరు తేదీల్లో ఈ పరీక్షలు జరిగే సమయంలో ముందుగా పరీక్ష జరిగే రాష్ట్రం పేపర్లను ప్రైవేటు కళాశాలల వారు మరో రాష్ట్రానికి పంపి కాపీలు చేయిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ తాను ముందుగా ప్రకటించిన(మార్చి 11 నుంచి 30వ తేదీవరకు) షెడ్యూల్కు బదులు తెలంగాణ ఇంటర్ బోర్డు షెడ్యూల్ను అనుసరించాలని నిర్ణయించింది. మార్చి 2 నుంచి 21 వరకు నిర్వహించేలా తెలంగాణ షెడ్యూల్ వెలువడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే షెడ్యూల్కు స్వల్ప మార్పులు చేసిన ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు ఫైలును మంత్రి ఆమోదానికి పంపింది. -
స్లిప్పు పట్టు... కాపీ కొట్టు
సెల్ఫ్ సెంటర్లలో మాస్ కాపీయింగ్ సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి సెల్ఫ్ సెంటర్లలో మాస్ కాపీయింగ్ ఎక్కువగా జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్ల నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంతో ఈ మాస్ కాపీయింగ్కు అవకాశం ఏర్పడింది. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన రెసిడెన్షియల్ కళాశాలలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఉద్యోగ భద్రత, ఇంక్రిమెంట్లు, ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు పొందే ఉద్దేశంతో ఈ రెసిడెన్షియల్ కళాశాలల అధ్యాకులు, ప్రిన్సిపాల్స్ మాస్ కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్నారు. తమ పిల్లలను విజయవాడ, గుంటూరు నగరాల్లోని కార్పొరేట్ కళాశాలల్లో చదివించినప్పటికీ, వారి పేర్లను ఈ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఎన్రోల్ చేయించి, పరీక్షలు రాయించి అధిక మార్కులు వచ్చే విధంగా చూసుకుంటున్నారు. నాలుగైదు సంవత్సరాల నుంచి సెల్ఫ్ సెంటర్లలో జరుగుతున్న మాస్ కాపీయింగ్పై ఉన్నతాధికారులకు కొంత సమాచారం ఉన్నప్పటికీ ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈ కారణంగా ఇతర సెంటర్లలోని మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 11 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 126 సెంటర్లలో 98 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీటిలో 18 సెల్ఫ్ సెంటర్లు (ఇంటర్మీడియెట్ చదివిన కళాశాలలోనే పరీక్ష రాయడం,ఆ కళాశాలఅధ్యాపకులు అక్కడే ఇన్విజిలేటరుగా బాధ్యతలు నిర్వహించడం)ఉన్నాయి. అక్కడి అధ్యాపకులు మాస్కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్నారు. లాటరీ విధానంలో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులను నియమించాల్సి ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా నియామకాలు జరుగుతున్నాయి. జూనియర్ ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నప్పుడు వారికి ఆ ఆవరణలోనే ఉన్న సీనియర్ ఇంటర్ విద్యార్థుల నుంచి సహకారం అందే విధంగా చూస్తున్నారు. సీనియర్ ఇంటర్ విద్యార్థులతో సమాధానాలు అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కోసారి అధ్యాపకులే సమాధానాలు చెబుతూ పరీక్షలు రాయిస్తున్నారు. సెంటరుకు కొంత దూరంలో సీనియర్ ఇంటర్ విద్యార్థులు, ఇతర సిబ్బందిని ఏర్పాటు చేసి స్పెషల్ స్క్వాడ్ రాక సమాచారాన్ని సెల్ ఫోన్ల ద్వారా తెలుసు కుని జాగ్రత్త పడుతున్నారు. సాంఘిక సంక్షేమశాఖకు చెందిన రెసిడెన్షియల్ కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది ఎక్కువగా ఈ అరాచకాలకు పాల్పడుతున్నారు. ఉత్తీర్ణతా శాతం రాకపోతే ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండటంతో అధ్యాపకులు ఇలా ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు ఈ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులు ఇతర విద్యార్థుల కంటే మెరిట్గా ఉండేవారు. నాలుగైదు ఏళ్ల నుంచి ఈ వ్యవహారం జరుగుతుండటంతో అక్కడి విద్యార్థులు చదువులో బాగా వెనుకబడిపోతు న్నారు. అచ్చంపేట, కారంపూడి సెంటర్లలో ఈ మాస్కాపీయింగ్ అధికంగా జరుగుతోందని అక్కడి నుంచే ఫిర్యాదులు వస్తున్నాయి.ఈ విషయమై ఇంటర్మీడియెట్ విద్య ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి కె.వెంకటేశ్వరరెడ్డిని వివరణ కోరగా, మాస్ కాపీయింగ్ సంఘటన తన దృష్టికి రాలేదన్నారు. జరిగినట్టు నిర్ధారణ అయితే చీఫ్ సూపరింటెండెంట్, శాఖాధికారి, ఇన్విజిలేటర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేకంగా ఆయా సెంటర్లకు ఫ్లయింగ్ స్క్వాడ్లను పంపుతామని చెప్పారు. -
జేఈఈ మెయిన్లో ‘తెలంగాణ బోర్డు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లుగా జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో మార్పు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చర్యలు చేపట్టిందని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం వచ్చే నెల 4న ఆఫ్లైన్లో, 10, 11 తేదీల్లో ఆన్లైన్లో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టిందని పేర్కొంది. ఇందులో భాగంగా తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డుకు చెందిన విద్యార్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు తాము తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి పరీక్షలు రాస్తున్న అభ్యర్థులుగా వివరాలను నమోదు చేయాలని, ఆ తరువాతే హాల్టికెట్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బోర్డు పేరు ఉన్న చోట తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ పేరు నమోదు చేయాలని స్పష్టం చేసింది. అలాగే దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఆప్షన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి మార్చుకోవచ్చని వివరించింది. విద్యార్థులు స్టేట్ ఆప్షన్ను మార్చుకునేందుకు తమ దరఖాస్తు నంబరును jeemain@nic.in మెయిల్కు పంపించాలని సూచించింది. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఏలూరు సిటీ : ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు బుధవారం సంస్కృతం, హిందీ, తెలుగు పేపరు-1 పరీక్షలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాల్లో 34,093 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 31,953 మందే పరీక్షలు రాశారు. వివిధ కారణాలతో 2,140 మంది పరీక్షలు రాయలేదు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఇంటర్మీడి యెట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి బి.వెంకటేశ్వరరావు తెలిపారు. కేంద్రాల వద్ద రద్దీ పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, బంధువులు రావడంతో ఆ ప్రాంతాలన్నీ రద్దీగా మారిపోయాయి. అర్ధగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు చెప్పడంతో 90 శాతానికి పైగా విద్యార్థులు ఆ విధంగానే చేరుకున్నారు. ఏలూరు ఆర్ఆర్పేటలోని సెయింట్ థెరిస్సా జూనియర్ కళాశాలలో ఇద్దరు అంధ విద్యార్థులు సహాయకులతో పరీక్షలు రాశారు. ఎండ తీవ్రంగా ఉండటంతో పరీక్షా కేంద్రాల వద్ద ఉన్న చెట్ల కింద విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు పరీక్ష పూర్తయ్యేంత వరకు నిరీక్షించారు. నగరంలోని కొన్ని పరీక్షా కేంద్రాల్లో సరైన సౌకర్యాలు ఏర్పాట్లు చేయలేదని ఆరోపణలు వచ్చాయి. -
రెండోరోజూ అదే తీరు
ఖమ్మం: ఇంటర్మీడియెట్ పరీక్షల రెండో రోజు కూడా విద్యార్థులకు ఇక్కట్లు తప్పలేదు. సెకండియర్ పరీక్షలకు వసతులను కల్పించడంలోనూ అధికారులు విఫలం అయ్యూరు. తొలిరోజు అవస్థలపై ‘సాక్షి'లో వచ్చిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా అడిషనల్ జాయింగ్ కలెక్టర్ బాబూరావు మంగళవారం పలు కేంద్రాలను పరిశీలించారు. సెకండియర్ పరీక్షలకు తొలిరోజు 22,931 మంది విద్యార్థులు హాజరుకాగా 1,769 మంది గైర్హాజరయ్యూరయ్యూరని జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. వెంటాడిన వసతుల లేమి ఎప్పటి మాదిరిగానే వసతుల లేమి వెంటాడింది. ఇల్లెందు సెంటర్లో ఇరుకు గదుల్లో విద్యార్థులను కూర్చోబెట్టడంతో ఎంచక్కా మాస్కాఫీరుుంగ్కు పాల్పడ్డారు. దీనిపై స్పందించిన అధికారులు ఇతర గదులకు మార్చాలని ఆదేశాలు జారీ చేసినా సెంటర్ అధికారులు బుధవారం మారుస్తామని మిన్నకున్నారు. గుండాల ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎర్రుపాలెం సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో ఫర్నిచర్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. నేలపై, స్టూల్స్పై కూర్చొని పరీక్షలు రాశారు. ఖమ్మంలోనూ పలు కళాశాలల్లో కుర్చీలపై కూర్చొని పరీక్ష రాయూల్సి వచ్చింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల టేకులపల్లి, అశ్వారావుపేట సెంటర్లలో అందుబాటులో ఉన్న ఫర్నిచర్ను తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించారు. అరుునా విద్యార్థులకు సరిపడా బల్లలు సమకూర్చలేకపోయూరు. ఏజేసీ విస్తృత తనిఖీ పరీక్షలు సక్రమంగా సాగడం లేదని మంగళవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై జిల్లా యంత్రాంగం స్పందించింది. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా అధికారులు ఆర్వోను ఆదేశించినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బాబూరావు నేతృత్వంలో పలు సెంటర్లను తనిఖీచేశారు. నయూబజార్, ఎక్స్లెంట్, గాయత్రి కళాశాలలను సందర్శించారు. గుర్తింపుకార్డుల్లేని ఇన్విజిలేటర్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగానే గైర్హాజరు ఇంటర్ సెకండియర్ పరీక్షలకు తొలిరోజు 1,769 మంది విద్యార్థులు గైర్హాజరయ్యూరు. జనరల్ విభాగంలో 21,747 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సిఉండగా 20,397 మంది హాజరయ్యూరు. 1,350 మంది గైర్హాజరయ్యూరు. ఒకేషనల్ విభాగంలో 2,953మందికి 419మంది గైర్హాజరయ్యూరు. -
30 నిమిషాల ముందే హాజరుకావాలి
విజయనగరం అర్బన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల్లో అక్రమాలకు తావివ్వకుండా పరీక్ష కేంద్రాల్లో వీడియో కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా జిల్లాలో సాలూరు మండలం పి.కోనవలస ఏపీటీడబ్ల్యూ గురుకుల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో వీడియో కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 11 నుంచి మొదటి సంవత్సరం, 12 నుంచి రెండో సంవత్సరం ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు విధిగా 30 నిమిషాల ముందు పరీక్ష కేంద్రానికి హాజరుకావాలి. కనీసం 15 నిమిషాల ముందు హాజరుకాకపోతే అనుమతించరు. 31వ తేదీ వరకు నిర్వహించే పరీక్షలకు జిల్లాలో 46,839 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 23,040 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 23,799 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 170 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అనుకూలంగా ఉన్న 68 కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారి చొప్పున ఇద్దరు అధికారులు పూర్తిస్థాయి నిర్వాహణ బాధ్యత తీసుకుంటారు. జిల్లాలోని ప్రైవేటు కళాశాల పరీక్ష కేంద్రాల్లో అదనంగా మరో సహాయ సీఎస్ను ఏర్పాటు చేస్తారు. రోజూ ఉదయం 09.00 నుంచి 12.00 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కేంద్రాల్లో ఫర్నీచరు, తాగునీరు, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పదిరోజుల కిందటే వచ్చిన ప్రశ్నపత్రాలను ఇంటర్మీడియెట్ తనిఖీ అధికారి కార్యాలయంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. హాల్ టిక్కెట్లను కూడా ఆయా కళాశాలల యాజమాన్యాలకు బుధవారం నుంచి అందజేస్తున్నారు. హాల్ టిక్కెట్లో ఏవైనా తప్పులుంటే కళాశాల ప్రిన్సిపాల్ ద్వారా ఆర్ఐఓ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే బోర్డుకు పంపి సవరణలు చేయిస్తామని ఆర్ఐఓ ఎల్ఆర్ బాబాజీ తెలిపారు. కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) సభ్యులతో చర్చిస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మాల్ప్రాక్టీస్ నిరోధానికి ముగ్గురేసి సభ్యులున్న మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఇద్దరేసి సభ్యులున్న ఐదు సిట్టింగ్ స్క్వాడ్ల బృందాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు కనీస (కనీసం) 11 మంది ఇన్విజిలేటర్లు విధులను నిర్వహిస్తారని తెలిపారు. ఈ ఏడాది కూడా ‘జీపీఎస్’ అమలు ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులకు ఇంటర్మీయెట్ మార్కులకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రతి ఏడాది మాల్ప్రాక్టీస్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు బోర్డు ప్రతిసారి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత ఏడాది ప్రయోగాత్మకంగా అమలు చేసిన వినూత్న పద్ధతులు ఫలితాలను ఇచ్చాయి. పరీక్ష కేంద్రాల పరిధిలోని సెల్ఫోన్ కాల్స్పై దృష్టిసారించేందుకు నూతన టెక్నాలజీ గ్లోబెల్ పొజిషన్ సిస్టం (జీపీఎస్) ను ఇంటర్ బోర్డు గత ఏడాది అమలు చేసింది. ఈ ఏడాది కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. జీపీఎస్ టెక్నాలజీ వినియోగం వల్ల సంబంధిత పరీక్ష కేంద్రంలో సెల్ఫోన్, బ్లూటూత్ వంటివి ఎవరు వినియోగించినా బోర్డు ఉన్నతాధికారులు గుర్తించ వచ్చు. పరీక్ష కేంద్రాలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టు మెంటల్ అధికారుల మినహా ఇతర సిబ్బంది ఎవ్వరూ సెల్ఫోన్లు వినియోగించడానికి వీలులేదు. కార్పొరేట్ కళాశాలల్లో అధికశాతం మాల్ప్రాక్టీస్ కేసులు ఎదురవడం వల్ల ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. అభ్యర్థులకు సూచనలు అభ్యర్థికిచ్చిన జవాబు బుక్లెట్ 24 పేజీలున్నాయో లేదోచూసుకోవాలి. పరీక్షకేంద్రానికి 30 నిముషాల ముందు హాజరవ్వాలి. కనీసం 15 నిముషాలు ముందు రావాలి. ఈ సమయం దాటితే పరీక్షకు అనుమతి ఇవ్వరు. అంధ విద్యార్థికి స్కైబ్ (సహాయకుడు) అర్హత డిగ్రీ చదువుతో సమానంగా ఉండాలి. సంబంధిత కోర్సులు చదివి ఉండకూడదు. ఓఎంఆర్ బార్కోడెడ్ షీటులోని పార్టు-3లో అభ్యర్థి ఏమైనా మార్పులు చేసినట్లయితే పబ్లిక్ పరీక్షలలో అనుచిత ప్రవర్తనగా పరిగణిస్తారు. సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు -
అరగంట ముందెళ్లాలి
రేపటి నుంచి 31 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు 103 కేంద్రాల్లో.. జీపీఎస్ నిఘాలో..ఏలూరు సిటీ :ఇంటర్మీడియెట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి ఈనెల 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో జరుగుతున్న తొలి పరీక్షలు కావటంతో కాలేజీ యాజ మాన్యాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లాలో 103 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్టియర్, సెకండియర్ కలిపి ఈ ఏడాది 68,109 మంది పరీక్షలు రాయనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య 8,640 పెరిగింది. గత ఏడాది 59,469 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ఈ ఏడాది 68,109 మందిపరీక్షలు రాయనున్నారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 33,394 మంది కాగా, జనరల్ కోర్సులకు సంబంధించి 30,297 మంది ఉన్నారు. వీరిలో బాలురు 13,687మంది, బాలికలు 16,610 మంది. 3,097 మంది ఒకేషనల్ కోర్సులకు విద్యార్థులుండగా, వారిలో ాలురు 1,735 మంది, బాలికలు 1,362 మంది ఉన్నారు. సెకండియర్కు సంబంధించి 34,715 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, వారిలో జనరల్ కోర్సుల విద్యార్థులు 30,907 మంది ఉన్నారు. వీరిలో బాలురు 14,296 మంది, బాలికలు 16,611 మంది. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 3,808 మంది విద్యార్థుల్లో బాలురు 2,018 మంది, బాలికలు 1,790 మంది ఉన్నారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. జీపీఎస్ నిఘా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సహాయంతో ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల నుంచి సెల్ఫోన్ల ద్వారా వెళ్లే ప్రతి కాల్ను రికార్డు చేసేలా చర్యలు చేపట్టారు. ఎక్కడైనా అనుమానం, ఆరోపణలు వస్తే వెంటనే ఆయా సెంటర్లకు సంబంధించిన కాల్స్ను పరిశీలిస్తారు. సెల్ఫోన్ల ద్వారా ప్రశ్నాపత్రాల లీకేజీలకు బ్రేక్లు వేయటంతోపాటు, ఇంటిదొంగల భరతం పట్టేందుకు ప్రణాళిక రచించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు సెల్ఫోన్ వాడే అవకాశం ఉంది. అదీకూడా పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ కోసం మాత్రమే. ఆలస్యంగా వచ్చే విద్యార్థులు సహేతుకమైన కారణాలు తెలియజేయాల్సి ఉందని ఆర్ఐఓ బి.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. జిల్లాలో నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, జిల్లా హైపవర్ కమిటీ ఏర్పాటు చేశారు. 103 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 103 మంది డిపార్టుమెంటల్ అధికారులు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటిండెంట్లను నియమించారు. 35 రూట్లలో ప్రశ్నాపత్రాలు పంపిణికీ ఏర్పాట్లు చేశారు. పటిష్ట చర్యలు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించటంతోపాటు ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. విద్యార్థులు అర్ధ గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. నియమిత సమయం అనంతరం ప్రవేశం ఉంది. ఇందుకు సహేతుకమైన కారణాలు చూపించాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులెవరూ సెల్ఫోన్లు తీసుకువెళ్లకూడదు. ఇన్విజిలేటర్లు కూడా సెల్ఫోన్లు వాడకుండా చర్యలు చేపట్టాం. పరీక్షా కేంద్రాల సమీపంలో నెట్ సెంటర్లు, జిరాక్స్ కేంద్రాలను మూసివేయిస్తాం. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుంది. - బి.వెంకటేశ్వరరావు, ఆర్ఐవో -
9 నుంచి ఇంటర్ పరీక్షలు
ఆదిలాబాద్ అర్బన్ : ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 25వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేటు యూజమాన్యాలు ఏవైనా ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పది సిట్టింగ్స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు నడిపించాలని ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేయూలని, నిరంతరం విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆయూ శాఖల అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యంతోపాటు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా విద్యాధికారికి సూచించారు. పరీక్ష ప్రశ్నపత్రాల రవాణా సమయంలో బందోబస్తు ఏర్పాటు చేయూలని ఎస్పీకి సూచించారు. రీజినల్ తనిఖీ అధికారి సీహెచ్.ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్లో 19,613 మంది, ఒకేషనల్లో 3,001 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్లో 22,250 మంది, ఓకేషనల్లో 2,756 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. ప్రైవేట్లో మొదటి సంవత్సరం జనరల్లో 5,071 మంది, ఒకేషనల్లో 832 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా 53,523 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరి కోసం 89 పరీక్ష కేంద్రాలు, నాలుగు ఫ్లరుుంగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో ప్రసాదరావు, డీఎంహెచ్వో రుక్మిణమ్మ, దిలావర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అలెగ్జాండర్, సీఐ పోతం శ్రీనివాస్, విద్యా శాఖ ఏడీ జలీల్ పాషా, పోస్టల్ శాఖ అధికారి విజయ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మార్చి 11 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 11 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 9,90,912 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్ కేటగిరిలో 9,33,308 మంది, ఒకేషనల్లో 57,604 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. దీని కోసం ఇంటర్మీడియెట్ విద్యా బోర్డు 1,411 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మార్చి 3 వరకు జరగుతాయి. ఈ పరీక్షలకు 2,90,380 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. దీని కోసం 1,723 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. మొదటి సంవత్సరానికి సంబంధించి ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నీతిశాస్త్రం, 31న పర్యావరణ విద్యపైన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
అక్రమాలకు ఆస్కారం లేకుండా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షలు విద్యార్థులు, తల్లిదండ్రులు, నిర్వాహకులకు సవాలే నిలిచాయి. గతేడాది ఇంటర్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాలు, ఇన్విజిలేటర్ల కేటాయింపు వివాదాస్పదంగా మారింది. ప్రైవేట్ కళాశాలల యా జమాన్యాల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారన్న ఆరోపణలు వచ్చాయి. మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న ఫిర్యాదుల మేరకు ఏకంగా అప్పటి ఎస్పీ డాక్టర్ తరుణ్ జోషి, జేసీ వెంకటేశ్వర్రావులు నిజామాబాద్ కాకతీయ జూనియర్ కాలేజీలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కళాశాల అధినేతను పోలీ సులు అదుపులోకి తీసుకుని విచారించడం చర్చనీయాశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా కూడ పలుచోట్ల ఇంటర్ పరీక్షల నిర్వహణ వివాదాస్పదమైంది. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్, మార్చి 9 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యం లో ముందస్తు ప్రణాళికపై ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాంతీయ తనిఖీ అధికారి ఎ.విజయ్కుమార్తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఆయన మాటల్లో.. మూత పడిన 20 కాలేజీలు.. జిల్లాలో మొత్తం 163 ఇంటర్ కాలేజీలు ఉంటే అందులో ఈ ఏడాది 143 కళాశాలల విద్యార్థులే పరీక్షలకు హాజరవుతున్నారు. గత రెండు మూడేళ్లుగా 20 కాలేజీలు మూతపడ్డాయి. ఈ ఏడాది నిజామాబాద్లో విశ్వభారతి, బాన్సువాడలో ప్రగతి కాలేజీలను మూసేశారు. 31 ప్రభుత్వ, 4 ఎయిడెడ్ కళాశాలు, 15 మోడల్ స్కూల్స్, 13 సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల కళాశాలతో పాటు 80ప్రైవేట్ కళాశాల విద్యార్థులు 60,592 ఈసారి పరీక్షలు రాయనున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మార్చి 9 నుంచి జరిగే ఇంటర్ ప్రథ మ, ద్వితీయ పరీక్షలకు ఇప్పటి నుంచే పకబ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాము. ప్ర భుత్వ మార్గదర్శకాల ప్రకారం పరీక్ష కేంద్రాలను ‘జంబ్లింగ్’ పద్ధతిన ఏర్పా టు చేయనున్నాము. ఉదాహరణకు నిజామాబాద్లో 18 కాలజీలుంటే వాటి ని మూడు జోన్లుగా విభజించి ఏ కాలేజీలో చదివే పిల్లలు ఆ కాలేజీలో పరీక్ష రాసే అవకాశం ఉండకుండా పరీక్షా కేంద్రాలను కేటాయిస్తాము. గతంలో ఆరోపణలు వచ్చిన కళాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాము. పరీక్షల నిర్వహణపై సమావేశం... ఇంటర్ పరీక్షల నిర్వహణపై త్వరలోనే కళాశాలల యాజమాన్యాలతో ఓ స మావేశం నిర్వహించనున్నాము. జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల నిర్వాహకు లు హాజరయ్యే విధంగా ముందస్తుగా సమాచారం ఇవ్వనున్నాము. 143 ప్ర భుత్వ, ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు ఏ సెంటర్లో పరీక్ష రాయాల్సి వచ్చి నా.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా సెంటర్లలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలనేది సూచిస్తాము. కళాశాలల నిర్వాహకులు ఖచ్చితంగా హాజరయ్యేలా ప్రణాళికబద్ధంగా నిర్వహించే సమావేశం పరీక్షలకు కీలకం కానుంది. ప్రాక్టికల్స్ ఎక్కడికక్కడే.. ఇంటర్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువు డిసెంబర్ 12న ముగిసింది. ఈ లె క్కన 29,250 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం కోసం పరీక్ష రాయనుండగా, 31,342 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. అ యితే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఏ కాలేజీలో చదివితే ఆ కాలేజీలోనే ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4 వరకు ఉంటాయి. కేవలం రాత పరీ క్షలు మాత్రమే ప్రథమ, ద్వితీయ విద్యార్థులకు జంబ్లింగ్ పద్ధతిలో ఉంటాయి. ’కాపీయింగ్’పై తల్లిదండ్రుల వ్యతిరేకత ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ‘విద్యార్థులకు జలుబు పడితే తల్లిదండ్రులకు తుమ్ములు వస్తున్నాయి’. తమ పిల్లల భవిష్యత్పై కలలుకంటున్న వారు కాపీయింగ్ను కోరుకునే పరిస్థితిలో అసలే లేరు. అయితే కొన్ని విద్యాసంస్థలు ర్యాంకుల కోసం గతంలో ఈ పద్ధతులు అవలంభించినట్లు ఆరోపణలున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా అందరి సహకారంతో అవకతవకలకు అస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తాము. అవకతవకలకు పాల్పడితే ఇంటికే.. ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. పిల్లలు ఉత్తములుగా ఎదిగేందుకు తల్లిదండ్రులు అనేక వ్యయప్రయాసాలకు సిద్ధపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల్లో అవకతవకలకు ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలకు సిఫారసు చేయడంతో పాటు అనుమతులు రద్దు చేస్తాము. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఆ సబ్జెక్టుకు సంబంధించిన బోధకులకు ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు ఇవ్వం. ఇన్విజిలేట ర్లు అక్రమాలకు అవకాశం కల్పిస్తే ఇంటికి పంపడం ఖాయం. ఈ పరీక్షల్లో 400 మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లను వినియోగించనున్నాము. -
సొంతంగానే ఎంసెట్!
-
ఇంటర్మీడియెట్ పరీక్షలు.. 70 ‘డే’స్ ప్లాన్
ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో మార్చి 9 నుంచి 27 వరకు; ఆంధ్రప్రదేశ్లో మార్చి 11 నుంచి 31వ తేదీ వరకు పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధమైంది. దీంతో విద్యార్థులు తమ ప్రిపరేషన్కు పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రూప్ ఏదైనా.. ప్రథమ సంవత్సరమైనా లేదా ద్వితీయ సంవత్సరమైనా సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు సాధించడం తప్పనిసరిగా మారింది. ఇంటర్మీడియెట్లో పొందిన మార్కులకు ఆయా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వెయిటేజీ ఇస్తుండటం; ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియెట్ మార్కులు కీలకంగా మారుతుండటమే ఇందుకు కారణం. ఇప్పటి నుంచి విద్యార్థులకు అందుబాటులో ఉన్న 70 రోజుల సమయంలో అనుసరించాల్సిన ప్రిపరేషన్ ప్రణాళికలపై గ్రూప్ల వారీగా నిపుణులు, ఇంటర్మీడియెట్- 2014 టాపర్స్ అందిస్తున్న సలహాలు, సూచనలు.. ఎంపీసీ ఎంపీసీ.. జేఈఈ మెయిన్లో ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ; అడ్వాన్స్డ్లోనూ టాప్-20 పర్సంటైల్ విధానం.. ఎంపీసీ విద్యార్థుల కోణంలో ఇంటర్మీడియెట్ మార్కులకు ప్రాధాన్యత లభిస్తోంది. మ్యాథమెటిక్స్.. డిస్క్రిప్టివ్ అప్రోచ్ ఎంపీసీ విద్యార్థులు ఇప్పటికే దాదాపు సిలబస్ పూర్తి చేసి ఉంటారు. ప్రస్తుతమున్న సమయంలో స్వల్ప సమాధాన ప్రశ్నలపై బాగా దృష్టిసారించాలి. వీటిని కూడా కేవలం ప్రశ్న- సమాధానంలా కాకుండా డిస్క్రిప్టివ్ అప్రోచ్తో అధ్యయనం చేయాలి. అదే విధంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడే జేఈఈ, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆయా సిలబస్లకు అనుగుణంగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలు-సమాధానాల రూపంలో ప్రిపరేషన్ కొనసాగించాలి. ‘ఇంటర్మీడియెట్ సిలబస్ పూర్తి చేసేశాం కదా.. పోటీ పరీక్షల ప్రిపరేషన్కు ప్రాధాన్యమిద్దాం’ అనే ధోరణి సరికాదు. ఎందుకంటే ప్రవేశ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉంది. కాబట్టి ఈ వెయిటేజీని దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు ఇంటర్ ప్రిపరేషన్కు ప్రాధాన్యమివ్వాలి. ఇప్పటి నుంచి దాదాపు 90 శాతం సమయాన్ని గ్రూప్ సబ్జెక్ట్ల ప్రిపరేషన్కు కేటాయించాలి. ఫిబ్రవరి మధ్య నుంచి పూర్తిగా ఇంటర్మీడియెట్ సబ్జెక్టులనే చదవాలి. తెలుగు అకాడమీ పుస్తకాల్లోని అన్ని ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తూ ప్రాక్టీస్కు ప్రాధాన్వమివ్వాలి. వీక్లీ, మంత్లీ టెస్ట్లు రాయడం తప్పనిసరి. అదేవిధంగా కనీసం రెండు ప్రీ-ఫైనల్ ఎగ్జామ్స్కు హాజరవ్వాలి. సిలబస్ ప్రిపరేషన్ క్రమంలో అంశాల వారీగా లభిస్తున్న వెయిటేజీ ఆధారంగా సమయ ప్రాధాన్యత ఇవ్వాలి. ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్కు సంబంధించి ద్విపద సిద్ధాంతం; ప్రస్తారాలు-సంయోగాలు, సంభావ్యత; వృత్తాలు; సమాకలనులు; నిశ్చిత సమాకలనులు; అవకలన సమీకరణాలు; డిమూవర్స్ సిద్ధాంతం, వర్గ సమీకరణాలు, పరావలయం వంటి అంశాలను బాగా పునశ్చరణ చేయాలి. మొదటి సంవత్సరం విద్యార్థులు వెక్టార్ అల్జీబ్రా; మాత్రికలు, సరళరేఖలు, సరళరేఖ యుగ్మాలు, అవకలనాలు, అప్లికేషన్స్ అండ్ డెరివేషన్స్కు ఎక్కువ సమయం కేటాయించాలి. ఫిజిక్స్.. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలపై దృష్టి విద్యార్థులు జనవరిలో స్వల్ప, అతి స్వల్ప సమాధాన ప్రశ్నల సాధనకు ఎక్కువ కృషి చేయాలి. ఇప్పటికే సిలబస్ మొత్తం పూర్తి చేసుకుని ఉంటారు కాబట్టి.. ఫిబ్రవరిని పూర్తిగా రివిజన్కు, ప్రాక్టికల్స్లో నైపుణ్యం సాధించడానికి కేటాయించాలి. ఫిజిక్స్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి.. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నటిజం; కరెంట్ ఎలక్ట్రిసిటీ; ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్; పరమాణువు, వేవ్స్; సెమీ కండక్టర్ ఎలిమెంట్స్ వంటి అంశాల్లో పట్టు సాధించేలా పునశ్చరణ చేయాలి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. రొటేటరీ మోషన్; యూనివర్సల్ గ్రావిటేషన్ లా; ఎస్కేప్ వెలాసిటీ; సింపుల్ హార్మోనిక్ మోషన్; సర్ఫేస్ టెన్షన్, థర్మో డైనమిక్స్ వంటి అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఫిజిక్స్లో దీర్ఘ సమాధాన ప్రశ్నలను సాధన చేసేటప్పుడు అంచెలవారీ పరిష్కార విధానాన్ని అనుసరించాలి. ఫలితంగా సదరు సమస్యకు సంబంధించి ప్రాథమిక భావనలపైనా పట్టు సాధించేందుకు ఆస్కారం లభిస్తుంది. కెమిస్ట్రీ.. ముఖ్యాంశాలు నోట్ చేసుకుంటూ కెమిస్ట్రీ ప్రిపరేషన్ విషయంలో ప్రస్తుత సమయంలో కలిసొచ్చే విధానం.. ముఖ్యాంశాలను నోట్ చేసుకోవడం. దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కుల ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. వీటికి సంబంధించి గతంలో అడిగిన ప్రశ్నలను రివైజ్ చేయడం; మోడల్ టెస్ట్లకు హాజరవడం ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులు జనవరి చివరి నాటికి సబ్జెక్ట్ ప్రిపరేషన్ను పూర్తిచేసుకుని, ఫిబ్రవరి మొత్తాన్ని రివిజన్కు కేటాయించే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. ఆయా చాప్టర్లకు లభిస్తున్న వెయిటేజీ ఆధారంగా విద్యుత్ రసాయన శాస్త్రం; పి-బ్లాక్ మూలకాలు, డి, ఎఫ్-బ్లాక్ మూలకాలు, లోహ శాస్త్రం; సాలిడ్ స్టేట్ వంటి అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని ముఖ్యాంశాలతో సొంత నోట్స్ రూపొందించుకోవడం మేలు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. కర్బన రసాయన శాస్త్రం; ఆవర్తన పట్టిక; పరమాణు నిర్మాణం; రసాయన బంధం అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు ఒక చాప్టర్ పూర్తి చేసుకునేలా అధ్యయనం చేయాలి. బైపీసీ బైపీసీలో ఎక్కువ మంది విద్యార్థుల టార్గెట్గా నిలుస్తున్న ఎంసెట్లో అడిగే ప్రశ్నలన్నీ ఇంటర్మీడియెట్ సిలబస్ ఆధారితమే. బోటనీ.. అనలిటికల్ అప్రోచ్ విద్యార్థులు బోటనీ సబ్జెక్ట్ను విశ్లేషణాత్మక దృక్పథంతో చదవాలి. ప్రశ్న-సమాధానం అనే కోణంలో కాకుండా.. ఒక ప్రశ్నకు సమాధానం సాధించే క్రమంలో ఇమిడి ఉన్న అనువర్తిత అంశాలను నిజ జీవితంలోని పరిస్థితులతో బేరీజు వేస్తూ సాగాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొక్కల శరీర ధర్మశాస్త్రం; బయోటెక్నాలజీ; మైక్రోబ్స్, అణు జీవశాస్త్రం యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. బోటనీకి సంబంధించి బాగా కలిసొచ్చే అంశం.. గ్రాఫికల్ ప్రజంటేషన్పై అవగాహన. కాబట్టి ఫ్లో చార్ట్లు, డయాగ్రమ్స్ వేయడం ప్రాక్టీస్ చేయాలి. మొదటి సంవత్సరం విద్యార్థులు.. మొక్కల నిర్మాణాత్మక సంవిధానం-స్వరూప శాస్త్రం; జీవ ప్రపంచంలో వైవిధ్యం; కణ నిర్మాణం, విధులు; మొక్కల అంతర్ నిర్మాణ సంవిధానం, మొక్కల్లో ప్రత్యుత్పత్తి యూనిట్లపై ఎక్కువ దృష్టిపెట్టాలి. దీనికి సంబంధించి డయాగ్రమ్స్ వేయడం బాగా సాధన చేయాలి. జువాలజీ.. ఇలా జువాలజీకి సంబంధించి సమయపాలన ఎంతో కీలకం. ఆయా యూనిట్లకు లభిస్తున్న వెయిటేజీకి అనుగుణంగా ప్రిపరేషన్కు సమయం కేటాయించుకోవాలి. జనవరి చివరి నాటికి సిలబస్ పూర్తి చేసుకోవాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రత్యుత్పత్తి - సంబంధిత ఆరోగ్యం; అంతస్రావక వ్యవస్థ, నాడీ నియంత్రణ-సమన్వయం; శరీర ద్రవాలు, ప్రసరణ, విసర్జక పదార్థాలు; జన్యు శాస్త్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. జంతుదేహ నిర్మాణం; గమనం, ప్రత్యుత్పత్తి; జీవావరణం; పర్యావరణం; బొద్దింక జీవ వ్యవస్థ వంటి అంశాలను క్షుణ్నంగా చదవాలి. జువాలజీలో మార్కుల సాధనకు గ్రాఫికల్ ప్రజంటేషన్ చాలా అవసరం. కాబట్టి డయాగ్రమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటివరకు ఏమాత్రం దృష్టిపెట్టని అంశాలకు ఇప్పుడు ఎక్కువ సమయం కేటాయించడం సరికాదు. దీనివల్ల ఒత్తిడికి గురవడం తప్పితే అదనపు ప్రయోజనం ఉండదు. కాబట్టి బాగా ముఖ్యమైనవి, ఇప్పటివరకు చదవనివి అని భావించిన అంశాల ప్రిపరేషన్ను జనవరి చివరి నాటికి పూర్తి చేసుకోవడం ఉపయుక్తం. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంటర్మీడియెట్లో ఎంపీసీ, బైపీసీ గ్రూప్లు రెండింటిలోనూ ఉండే సబ్జెక్ట్లు.. ఫిజిక్స్, కెమిస్ట్రీలు. బైపీసీ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఈ సబ్జెక్టుల ప్రిపరేషన్లో ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా ఫిజిక్స్కు సంబంధించి ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. దీనివల్ల తుది ఫలితాల్లో నిరాశకు గురవుతున్న వారెందరో! ఫిజిక్స్ను నిజ జీవిత పరిస్థితులతో అన్వయించుకుంటూ చదివితే సులభంగా అర్థమవుతుంది. ఉదాహరణకు సర్ఫేస్ టెన్షన్ అంశాన్ని నిత్య జీవితంలో పరిస్థితులతో అన్వయించుకోవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇలాంటి అప్లికేషన్ అప్రోచ్తో ఫిజిక్స్ను తేలిగ్గానే గట్టెక్కొచ్చు. ఫిజిక్స్కు సంబంధించి ప్రథమ సంవత్సరం విద్యార్థులు లిక్విడ్, గ్యాస్, కైనటిక్ గ్యాస్ థియరీ, రొటేటరీ మోషన్, యాంగులర్ మూమెంట్, యూనివర్సల్ గ్రావిటేషన్ లా, ఆర్బిటాల్ వెలాసిటీ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వేవ్ మోషన్; సెమీ కండక్టర్ ఎలిమెంట్స్; మూవింగ్ ఛార్జెస్-మ్యాగ్నటిజం; విద్యుదయస్కాంత ప్రేరణ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. కెమిస్ట్రీలో మొదటి సంవత్సరంలో ఆవర్తన పట్టిక; కర్బన రసాయన శాస్త్రం; రసాయన బంధం; పరమాణు నిర్మాణం అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలోని సమస్యలను సాధన చేస్తూనే వీలైతే సినాప్సిస్ రూపొందించుకుంటే రివిజన్కు ఉపయుక్తంగా ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలో పి-బ్లాక్ ఎలిమెంట్స్; ఆర్గానిక్ కెమిస్ట్రీ; విద్యుత్ రసాయన శాస్త్రం; కెమికల్ కైనటిక్స్లోని దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కుల ప్రశ్నల ప్రాక్టీస్కు ప్రాధాన్యం ఇవ్వాలి. సీఈసీ సీఈసీ.. సంప్రదాయ బీకాం డిగ్రీ మొదలు కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులుగా పేరొందిన సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యుఏ వంటి కోర్సుల సిలబస్లకు సంబంధించి ప్రాథమిక భావనలపై అవగాహన కల్పించే గ్రూప్. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్ట్ల సమ్మేళనంగా ఉండే సీఈసీ గ్రూప్నకు ప్రాధాన్యం పెరుగుతోంది. కారణం.. పలు ప్రొఫెషనల్ కోర్సులకు ఈ గ్రూప్ సబ్జెక్ట్లు బేసిక్స్గా ఉపయోగపడుతుండటమే. ఇదే సమయంలో మూడు సబ్జెక్ట్లు కూడా విస్తృతంగా, గణాంకాల పరిజ్ఞానం అవసరమైన రీతిలో ఉంటాయి. కాబట్టి విద్యార్థులు విశ్లేషణాత్మకంగా, తులనాత్మకంగా ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. సివిక్స్, ఎకనామిక్స్కు విశ్లేషణ ఎంతో అవసరం. కామర్స్ సబ్జెక్ట్ విషయంలో తులనాత్మక అధ్యయనం మేలు చేస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో విద్యార్థులు సబ్జెక్ట్ల ప్రిపరేషన్ను జనవరి చివరి వారానికల్లా పూర్తిచేసుకోవాలి. ఆ తర్వాత సమయాన్ని ప్రాక్టీస్కు, రివిజన్కు కేటాయించాలి. సైన్స్ విద్యార్థులతో పోల్చితే సీఈసీ విద్యార్థులకు సమయం పరంగా కలిసొచ్చే అంశం.. ప్రాక్టికల్స్ లేకపోవడం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయా సబ్జెక్ట్లకు లభిస్తున్న వెయిటేజీ ఆధారంగా సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి. సివిక్స్కు ఇలా భారత రాజ్యాంగం- శాఖలు- రాజ్యాంగ సంస్థలు తదితర అంశాలతో ఉండే సివిక్స్లో మంచి మార్కులు సాధించాలంటే.. రాజ్యాంగం, సమకాలీన రాజకీయ అంశాలపై అవగాహన ఎంతో అవసరం. సివిక్స్ మొదటి సంవత్సరానికి సంబంధించి.. రాజ్యాంగం స్వభావం, తీరుతెన్నులపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. ఆయా అంశాలకు సంబంధించి నిర్వచనాలు షార్ట్ నోట్స్ రూపంలో పొందుపర్చుకుంటే రివిజన్ సమయంలో లాభిస్తుంది. ముఖ్యంగా వ్యాసరూప సమాధాన ప్రశ్నలు చదివేటప్పుడే అందులో పేర్కొన్న నిర్వచనాలను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్కు కూడా ఉపయోగపడుతుంది. ద్వితీయ సంవత్సరం సివిక్స్లో భారత రాజ్యాంగం, ప్రభుత్వం, పరిపాలన అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు. విద్యార్థులు రాజ్యాంగ సంస్థల(పార్లమెంట్, సర్వీస్ కమిషన్లు తదితర) గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఇప్పటివరకు వీటిపై దృష్టి పెట్టని విద్యార్థులు కూడా కొద్ది రోజులు ఏకాగ్రతతో చదివితే సులభంగా అర్థమవుతుంది. కాబట్టి ఆందోళన చెందక్కర్లేదు. కామర్స్లో మంచి మార్కులకు ప్రాక్టీస్ కామర్స్లో మంచి మార్కుల సాధనకు ప్రాక్టీస్ ఒక్కటే ఏకైక మార్గం. పార్ట్-1 (వాణిజ్య శాస్త్రం), పార్ట్-2 (వ్యాపార గణాంక శాస్త్రం)గా 50 మార్కులు చొప్పున మొత్తం వంద మార్కులకు పరీక్ష జరుగుతుంది. మొదటి సంవత్సరం విద్యార్థులు పార్ట్-1కు సంబంధించి వ్యాపారం-భావనలు, స్వరూపాలు, వ్యవస్థాపన-వ్యవస్థాపకులు తదితర అంశాలపై దృష్టిపెట్టాలి. వ్యాపార పరమైన సమకాలీన అంశాలపై అవగాహన ఉన్న విద్యార్థులకు పార్ట్-1 సులభంగానే ఉంటుంది. ఇతర విద్యార్థులు కూడా కొద్దిపాటి శ్రమతో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. అకాడమీ పుస్తకాల్లో పేర్కొన్న అంశాలను సునిశితంగా అధ్యయనం చేయాలి. సిలబస్కు అనుగుణంగా ఆయా అంశాల ప్రాథమిక భావనలు-నిత్య జీవితంలో వాటి అనువర్తనాలను తెలుసుకుంటే 90 శాతం మార్కులు సాధించొచ్చు. పార్ట్-2గా పేర్కొన్న వ్యాపార గణాంక శాస్త్రంలో మెరుగైన మార్కుల కోసం సిలబస్లోని అంశాలపై పట్టు సాధించాలి. దాంతోపాటు కంప్యుటేషనల్ నైపుణ్యాలు, తులనాత్మక అధ్యయన నైపుణ్యం పెంచుకోవాలి. ఫైనల్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ షీట్, బ్యాంకింగ్ రీకన్సిలియేషన్ సిస్టమ్లపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటిపై పట్టు కోసం ప్రాక్టీస్కు ప్రాధాన్యమివ్వాలి. కామర్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. పార్ట్-1గా పేర్కొనే థియరీ ఆధారిత వాణిజ్య శాస్త్రం కోసం మార్కెటింగ్, వ్యాపారం, స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యకలాపాలు, కంప్యూటర్ అవగాహనలో ముందుండాలి. పార్ట్-2గా పేర్కొనే వ్యాపార గణాంక శాస్త్రానికి సంబంధించి ట్రేడింగ్, కన్సైన్మెంట్, నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. మొత్తంమీద కామర్స్ సబ్జెక్ట్లోని అంశాల్లో నైపుణ్యం దిశగా.. ప్రిపరేషన్ సమయంలోనే ప్రాక్టీస్కు ప్రాధాన్యం ఇవ్వాలి. కేవలం రీడింగ్కు పరిమితమవడం సరికాదు. ప్రాక్టీస్ చేస్తూనే ముఖ్యమైన భావనలను నిర్వచనాల రూపంలో గుర్తుంచుకోవాలి. ఎకనామిక్స్ ‘చాలా విస్తృతం.. సంక్లిష్టం’ అని భావించే ఎకనామిక్స్ (అర్థశాస్త్రం)లోనూ మెరుగైన మార్కులు పొందేందుకు ఎన్నో మార్గాలున్నాయి. సబ్జెక్ట్లోని అంశాల మూల భావనలను వాస్తవ పరిస్థితులకు అన్వయిస్తూ చదవడం ద్వారా ఆసక్తిని పెంపొందించుకోవచ్చు. ఇది సబ్జెక్ట్పై అవగాహన కల్పించడంతోపాటు మంచి మార్కుల సాధనకు దోహదం చేస్తుంది. మొదటి సంవత్సరం విద్యార్థులు.. ఆర్థిక భావనలు, ఆర్థిక సూత్రాలు- వాటి నిర్వచనాలు, పట్టికలు, రేఖా పటాలు, ప్రమేయాలు, ప్రాముఖ్యత తదితర అంశాలను అనునిత్యం చదవాలి. వీటితోపాటు బ్యాంకింగ్-ద్రవ్యోల్బణం, జాతీయాదాయం వంటివి కీలక అంశాలు. వీటి విషయంలో గ్రాఫికల్ అవేర్నెస్ కూడా మెరుగైన మార్కులకు దోహదం చేస్తుంది. కాబట్టి విద్యార్థులు రీడింగ్తోపాటు ప్రాక్టీస్ ఓరియెంటేషన్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు... ఆర్థిక సమస్యలు-కారణాలు-నివారణ చర్యలు, గణాంక వివరాలపై దృష్టిపెట్టాలి. మార్కుల పరంగా ఎక్కువ వెయిటేజీ ఉన్న జాతీయాదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, నూతన ఆర్థిక సంస్కరణలను ప్రధానంగా చదవాలి. ప్రతి అంశాన్ని చదివేటప్పుడు దాని మూల భావనలు, సదరు అంశంలో సమకాలీన సమస్యలు-నివారణ మార్గాలపై అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు సినాప్సిస్ రూపంలో షార్ట్నోట్స్ రూపొందించుకుంటే స్వల్ప సమాధాన ప్రశ్నలకు కూడా సంసిద్ధత లభిస్తుంది. కామన్ టిప్స్ ఫర్ త్రీ గ్రూప్స్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ.. మూడు ప్రధాన గ్రూప్ల విద్యార్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో పాటించాల్సిన వ్యూహాలు.. ⇒ జనవరి చివరి వారానికి సిలబస్ పూర్తి చేసుకోవాలి. ⇒ ఫిబ్రవరి నుంచి పూర్తిగా రివిజన్కు కేటాయించాలి. ⇒ ప్రాక్టికల్స్ ఉండే ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు జనవరి మూడో వారానికే సిలబస్ పూర్తి చేసుకుని తర్వాత ప్రాక్టికల్స్పై దృష్టి పెట్టడం మంచిది. ⇒ ప్రస్తుత సమయంలో కొత్త అంశాలను చదవడం సరికాదు. ఒకవేళ బాగా ముఖ్యమైన అంశాలు అనుకుంటే వాటిని జనవరి పదిహేనో తేదీలోపు పూర్తి చేయడం మంచిది. ⇒ ఏ సబ్జెక్ట్ అయినా షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్ అన్నింటికీ సమాధానం ఇచ్చేలా సంసిద్ధత పొందాలి. లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్ను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే వాటి నుంచి అడిగే అవకాశం ఉన్న షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్కు సంబంధించిన అంశాలు (ఉదా: నిర్వచనాలు, ఫార్ములాలు, భావనలు తదితర) గుర్తించి నోట్స్ రూపంలో రాసుకోవాలి. ⇒ జేఈఈ, ఎంసెట్ వంటి పరీక్షలకు కూడా పోటీ పడుతున్న విద్యార్థులు వాటి ప్రిపరేషన్ను డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేసి.. తర్వాత సమయం మొత్తం ఇంటర్మీడియెట్ ప్రిపరేషన్కు కేటాయించాలి. ⇒ విద్యార్థులు క్లాస్రూం లెక్చర్కు అదనంగా ప్రతి రోజు కనీసం ఆరు నుంచి ఏడు గంటల స్వీయ ప్రిపరేషన్కు కేటాయించాలి. ⇒ ఈ సమయంలో ప్రాక్టికల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్లకు 40 శాతం; థియరీ సబ్జెక్ట్లకు 30 శాతం చొప్పున కేటాయించడం వల్ల అన్ని అంశాలు పూర్తి చేసుకునే వీలు లభిస్తుంది. ఏ సబ్జెక్ట్కు ఎంత సమయం కేటాయించాలనేది ఆయా అభ్యర్థుల సామర్థ్యంపైన కూడా ఆధారపడి ఉంటుంది. ⇒ అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉండే మెమొరీ టిప్స్ (విజువల్ ఇమాజినేషన్; షార్ట్ నోట్స్)ను పాటించడం మేలు. ⇒ కేవలం రీడింగ్కే పరిమితం కాకుండా కచ్చితంగా పెన్/పేపర్ ప్రాక్టీస్ అవసరం. ⇒ కనీసం రెండు ప్రీ-ఫైనల్స్కు హాజరుకావాలి. ఈ ప్రక్రియ జనవరిలోపు పూర్తి చేసుకుంటే తమలోని లోపాలు, బలహీనతలపై స్పష్టత ఏర్పడుతుంది. ఫలితంగా తర్వాత అందుబాటులో ఉన్న నెల రోజుల వ్యవధిలో సదరు అంశాల్లో ఏ విధంగా రాణించాలనే అవగాహన పొందొచ్చు. అన్ని చాప్టర్లపై అవగాహన ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో బైపీసీ విద్యార్థులు అన్ని చాప్టర్లపై అవగాహన పెంపొందించుకునే విధంగా చదవాలి. ఇప్పటికే సిలబస్ పూర్తయి ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని అధిక శాతం రివిజన్కు కేటాయించాలి. బైపీసీలో చాలా మంది విద్యార్థులు ఫిజిక్స్ అంటే భయంతో చాయిస్ను దృష్టిలో పెట్టుకుని కొన్ని అంశాలను చదవరు. కానీ ఎంసెట్లో ఇంటర్మీడియెట్ సిలబస్లోని అన్ని అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయా అంశాల్లో కనీసం ప్రాథమిక భావనలపైనైనా పట్టు సాధించేందుకు కృషి చేయాలి. వ్యక్తిగతంగా నిర్దిష్ట టైం టేబుల్ను రూపొందించుకుని దాన్ని అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. మోడల్ టెస్ట్లు, ప్రీ-ఫైనల్ టెస్ట్లు, షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్పై అవగాహన అదనపు ప్రయోజకాలుగా నిలుస్తాయి. - ఎం. రిషిత, బైపీసీ టాపర్ (989 మార్కులు) ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. ఎంపీసీ విద్యార్థులు రెండు నెలల సమయంలో స్వీయ ప్రాక్టీస్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటి వరకు క్లాస్రూంలో విన్న అంశాలకు సంబంధించిన ప్రశ్నలు, సమస్యలను వీలైనన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. ఈ క్రమంలో కేవలం మ్యాథమెటిక్స్కే పరిమితం కాకుండా ఫిజిక్స్కు కూడా ప్రాధాన్యమివ్వాలి. రివిజన్ కోణంలో విద్యార్థులు తమకు అనుకూలమైన టెక్నిక్స్ను (షార్ట్ నోట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవడం, ముఖ్యమైన ఫార్ములాలను పట్టిక రూపంలో పొందుపర్చుకోవడం) పాటిస్తే రెండు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో ఎంట్రన్స్ టెస్ట్ల ఆలోచనను దరి చేరనీయకూడదు. - నిఖిల్, ఎంపీసీ టాపర్ (994 మార్కులు) -
‘డైట్’ఎటు?
ఖమ్మం: డీఎడ్ కౌన్సెలింగ్లో జాప్యం డైట్సెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు శాపంగా మారింది. డైట్సెట్లో మంచి ర్యాంక్ సాధించాం కదా..! అనే ధీమా కౌన్సెలింగ్లో జాప్యంతో సన్నగిల్లుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ సెట్ల కౌన్సెలింగ్ ఆలస్యం కావచ్చని విద్యార్థులు భావించారు. కానీ ఏ ఒక్కరూ డీఎడ్ కౌన్సెలింగ్ లేటవుతుందనుకోలేదు. అనూహ్యరీతిలో డీఎడ్ కౌన్సెలింగే ఆలస్యమవుతుండటంతో రెండేళ్ల కోర్సును మూడేళ్లు చదవాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు డిగ్రీ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ కూడా వెలవడటంతో ఒరిజనల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆయా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. అటు డిగ్రీకి వెళ్లలేక, ఇటు డీఎడ్ కౌన్సెలింగ్ కాక టీటీసీ అర్హులు సతమతమవుతున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు అయ్యాక కొందరు విద్యార్థు లు డైట్సెట్కు ప్రిపేరయ్యారు. ఇంటర్, డైట్సెట్ ఫలితాలు వచ్చాయి. జూన్ 16 జరిగిన డైట్సెట్కు రాష్ట్రవ్యాప్తంగా 3.46 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 2.19 లక్షల మం ది డీఎడ్కు అర్హత సాధించారు. జిల్లా నుంచి 18,040 మంది హాజరుకాగా పదివేల మందికి పైగా అర్హత సాధించినట్లు సమాచారం. డీఎడ్ కౌన్సెలింగ్ ఆలస్యమవుతుండటంతో ఇప్పుడీ పదివేల మంది పరిస్థితి సందిగ్ధంగా మారింది. ఓ వైపు డిగ్రీ పరీక్ష ఫీజు గడువుతేదీ ముగింపు దశకు వస్తోంది. మరోవైపు డైట్ కళాశాలల్లో చేరేందుకు కౌన్సెలింగ్ నిర్వహించడం లేదు. డిగ్రీ కళాశాలల్లో సర్టిఫికెట్లు ఇస్తేనే పరీక్ష ఫీజు చెల్లించుకుంటారు. తీరా డీఎడ్ కౌన్సెలింగ్ సమయాని కి చేతిలో సర్టిఫికెట్లు ఉండవు. ఇవ్వకుండా డీఎడ్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూద్దామంటే అది ఎప్పుడు నిర్వహిస్తారో తెలియడం లేదని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వం, కన్వీనర్ కో టా ఇలా ఏ లెక్కన చూసినా 20వేల ర్యాంకులోపు వారికి మా త్రం ఎటువంటి ఢోకా లేకుండా ఫ్రీ సీటు దొరకవచ్చని విద్యార్థులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రైవేట్ డైట్ కళాశాలలకు అఫిలియేషన్ గండం కూడా పొంచివుండటంతో ఏ కాలేజీకి అనుమతి వస్తుందో..దేనికి రాదో? తెలియని పరిస్థితి నెలకొంది. 19వ తేదీ డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపునకు తుది గడువు కావడంతో డైట్సెట్లో అర్హత సాధించి న విద్యార్థులు ఎటూ తే ల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. -
నో డౌట్ సర్... మేం చూసుకుంటాం
‘పేపరుకు ఐదువేల రూపాయలు ఇవ్వండి...ఇంటర్ పరీక్షల్లో మార్కులు సంపాదించుకోండి....’అంటూ కొందరు పక్కాగా ప్లాన్చేసి కాపీయింగ్కు తెరలేపారు. అక్ర‘మార్కులకు’ అడిగినంతా ముట్టచెబితే అంతా వారే చూసుకుంటారు. పరీక్ష హాలు నుంచి ప్రశ్నలు బయటకు రప్పించడం, జవాబులు రాయించడం, వాటిని విద్యార్థికి చేరేలా చూడడం...అంతా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకుని, అందరినీ మేనేజ్ చేస్తున్నారు. ఓప్రైవేట్ లెక్చరర్ సూత్రధారిగా నడుస్తున్న ఈతతంగానికి రోజుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ...జిల్లా కేంద్రం ఖమ్మంలో రెండుకళాశాలల్లో జరుగుతున్న ఈ కాపీయింగ్పై సమాచారం అందడంతో సాక్షి-సాక్షి టీవీ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా ఈనిజాలు వెల్లడయ్యాయి. -
పరీక్ష పెడుతున్న నిబంధనలు!
విజయనగరం అర్బన్, న్యూస్లైన్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మరింత పారదర్శకత, నాణ్యమైన నిర్వహణ కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నూతన నిబంధనలు విద్యార్థులకు శాపంగా మారాయి. పరీక్షా పత్రాల పంపిణీకి తక్కువ సమయం కేటాయించడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రశ్నపత్రాలు పంపిణీ చేయవలసిన సమయం తగ్గించడం వల్ల ఇటు విద్యార్థులు, అటు నిర్వాహకులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పరీక్ష ప్రారంభానికి కేవలం 30 నిమిషాల ముందు మాత్రమే ప్రశ్నపత్రాల బండిళ్లను పోలీసుస్టేషన్ నుంచి తీసుకు వెళ్లవలసి ఉంది. పశ్నపత్రాలను విద్యార్థికి ఇచ్చిన రెండు నిమిషాల ముందు మాత్రమే బండిళ్ల సీల్ను ఓపెన్ చేయాలి. అయితే ఈ నిబంధనలను అమలు చేసేం దుకు సమయం ఏమాత్రం సరిపోవడం లేద ని నిర్వాహక సిబ్బంది వాపోతున్నారు. సమీప పోలీసుస్టేషన్ నుంచి తీసుకురావడానికి కనీసం 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుందని చెబుతున్నారు. ముందుగా తీసుకొచ్చినా ఉదయం 9 గంటలకు రెండు నిమిషాల ముందు మాత్రమే విద్యార్థులకు ప్రశ్నపత్రాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే పత్రాల సీల్ ఓపెన్ చేసి పరీక్షా కేంద్రంలోని రెండు నిమిషాల్లో అన్ని గదుల విద్యార్థులకు పంపిణీ చేయడం సాధ్యమయ్యే పనికాదని అంటున్నారు. చివర ఉన్న గదుల్లో పంపిణీ చేసేసరికి 5 నుంచి 10 నిమిషాల సమయం దాటిపోతుంది. దీంతో విద్యార్థులకు చివర్లో సమయం చాలడం లేదు. పరీక్ష చివరిలో అదనంగా సమయాన్ని ఇచ్చే అధికా రం స్థానిక అధికారులు ఉన్నా... సమయాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ముగిసిన సంస్కృతం, హిందీ పరీక్షలకు గదిలో అందరూ ఒకేసబ్జెక్ట్కు చెందిన వారు పరీక్ష రాశారు. దీంతో సమస్య అంతజటిలం కాలేదు. అయితే రానున్న రోజుల్లో 4 గ్రూప్ సబ్జెక్టులకు చెందిన ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల పేపర్లు ప్రతి గదిలోనూ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కుదించిన సమ యం విద్యార్థులకు శాపంగా మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. రెండో రోజు 92 శాతం హాజరు జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు రెండో రోజు గురువా రం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 69 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సర సంస్కృతం, తెలుగు పరీక్షలు జరిగాయి. ద్వితీయ సం వత్సరానికి చెందిన 22,135 మంది విద్యార్థులలో 92 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో సాధార ణ కోర్సుల ఇంటర్ విద్యార్థులు 17,997 (95.3 శాతం) మంది హాజరయ్యారు. అదేవిధంగా వృత్తి విద్యాకోర్సు ఇంటర్ విద్యార్థులు 2,893 మంది విద్యార్థులు మాత్ర మే హాజరయ్యారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆర్ఐఓ ఎల్ఆర్ బాబాజీ ‘న్యూస్లైన్’కి తెలిపారు. -
ఇంటర్ పరీక్షలు.. రెండో రోజు ప్రశాంతం
సాక్షి, సిటీబ్యూరో: జంట జిల్లాల్లో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష పరీక్షకు హైదరాబాద్ జిల్లాలో 64,219మంది హాజరు కావాల్సి ఉండగా, 62,251మంది (97శాతం) పరీక్ష రాశారు. రంగారెడ్డి జిల్లాలో 92,063 మందికి 88,418మంది (96శాతం) పరీక్షకు హాజరైనట్టు జంట జిల్లాల ఆర్ఐవోలు తెలిపారు. మహబూబియా కళాశాల పరీక్షా కేంద్రాన్ని గురువారం ఇంటర్ విద్యా కమిషనర్ అధర్సిన్హా, బజార్ఘాట్ ప్రభుత్వ ఒకేషన్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని బోర్డు కార్యదర్శి రాంశంకర్ నాయక్ సందర్శించారు. ఆయా కేంద్రాల్లో సీటింగ్ అరేంజ్మెంట్ డిస్ప్లేలు సరిగా పెట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షా గదుల్లో వెలుతురు సరిగా లే దని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆయాకేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జంటనగరాల ఆర్ఐవో రవికుమార్ను ఆదేశించారు. బజార్ఘాట్లోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల కేంద్రంలో చీటీలు తెచ్చి రాస్తున్న మెడ్విన్ జూనియర్ కళాశాల పారామెడికల్ విద్యార్థిపై మాల్ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు. విశాఖపట్నం జిల్లాలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థి బ్లూటూత్ ద్వారా హైటెక్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన నేపథ్యంలో.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షాకేంద్రాల సీఎస్లు, డీవోలను అప్రమత్తం చేయాలని ఆర్ఐవోలను బోర్డు అధికారులు ఆదేశించారు. -
విషమ‘పరీక్ష’
ఖమ్మం, న్యూస్లైన్ : ఇంటర్ మీడియెట్ పరీక్షలు విద్యార్థులకు, తల్లిదండ్రులకు విషమ పరీక్షగా మారాయి. పరీక్ష కేంద్రాల వద్ద అరకొర వసతులు, విద్యుత్ కోతలతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. చీకటి గదులు, రేకుల షెడ్లలో పరీక్ష రాయాల్సి వచ్చింది. పలు సెంటర్లలో ఇరుకు గదుల్లో ఎక్కువ మంది విద్యార్థులను కూర్చోబెట్టడంతో వారు ఇబ్బం ది పడ్డారు. బల్లలు, టేబుళ్లు లేక ఒడిలో ప్యాడ్ పెట్టుకొని పరీక్ష రాయాల్సి వచ్చింది. దీనికి తోడు పలు ప్రశ్నల్లో తప్పులు దొర్లడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. మారిన నిబంధనలకు అనుగుణంగా ఉదయాన్నే పరీక్షా కేంద్రాలు తెరవకపోవడంతో విద్యార్థులు, వెంట వచ్చిన తల్లిదండ్రులు, అధ్యాపకులు రోడ్లపై వేచి ఉండాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షలకు 4,164 మంది గైర్హాజరయ్యారు. అరకొర వసతులతో ఇక్కట్లు.. పరీక్షల నిర్వహణపై అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పిన ఇంటర్ బోర్డు అధికారులు జిల్లాలో పలు సెంటర్లలో కనీస వసతులు కల్పించలేదు. ఎర్రుపాలెం గురుకుల పాఠశాల కేంద్రంలో బెంచీలు, కుర్చీలు వేయకపోవడంతో విద్యార్థులు నేలపై కూర్చొని పరీక్షలు రాస్తూ ఇబ్బంది పడ్డారు. ఇల్లెందు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలోని గదుల్లో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఉక్కపోతతోనే పరీక్ష రాశారు. మూత్రశాలలు అద్వానంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. సాధన జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలోనూ ఫ్యాన్లు లేకపోవడంతో ఉక్కపోత మధ్యే పరీక్షలు రాయాల్సి వచ్చింది. బయ్యారంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవటంతో వరండాలో కుర్చీల మీద కూర్చొని పరీక్ష రాశారు. కూసుమంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్ర ంలో డెస్క్ బల్లలు లేవు. ఉన్న కొన్ని కూడా పొడవు తక్కువగా ఉండటంతో బల్లకు ఇద్దరు చొప్పున కూర్చోబెట్టడంతో వారు ఇబ్బంది పడ్డారు. ఇదే కేంద్రంలో మరుగుదొడ్లు లేక అమ్మాయిలు అవస్థలు ఎదుర్కొన్నారు. వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో సరిపడా టేబుళ్లు లేక ప్యాడ్లు ఒడిలోనే పెట్టుకుని రాయాల్సి వచ్చింది. జూలూరుపాడులోని ఓ ప్రైవేట్ క ళాశాలలో రేకుల షెడ్డులోనే పరీక్ష నిర్వహించారు. కేంద్రాల వద్ద నిరీక్షణ... మారిన నిబంధనల ప్రకారం సకాలంలో పరీక్ష కేంద్రాలు తెరవకపోవడంతో విద్యార్థులు, వెంట వచ్చిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8:30 నిమిషాలకే పరీక్ష కేంద్రంలోకి రావాలని, 8:45 నిమిషాలు దాటితే అనుమతించేది లేదని నిబంధన పెట్టారు. అయితే దీనికి అనుగుణంగా కనీసం అర్ధగంట ముందు పరీక్షా కేంద్రాలను తెరవాలనే ఆదేశాలు జారీ చేయకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే వచ్చిన వారు కేంద్రాల ఎదుట పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి ప్రాంతాల్లో ప్రధాన రహదారుల వెంటే పరీక్ష కేంద్రాలు ఉండడం, వందలాది మంది విద్యార్థులు కేంద్రాల ఎదుట గుమిగూడడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఖమ్మంలోని శాంతినగర్ జూనియర్ కళాశాల వద్ద నిరీక్షిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు అటుగా వచ్చిన ఆర్ఐవో విశ్వేశ్వర్రావుతో వాగ్వాదానికి దిగారు. దీనిపై స్పందించిన ఆర్ఐవో గురువారం నుంచి ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలు తెరిచేలా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పడంతో శాంతించారు. ప్రశ్నపత్రాల్లో తప్పులతో విద్యార్థుల తికమక.. పలు ప్రశ్నలు తప్పుగా ప్రింట్ కావడం, తప్పుడు ప్రశ్నలు ఇవ్వడంతో విద్యార్థులు తికమక పడ్డారు. సంస్కృతం కొత్త సిలబస్లో నాలుగో ప్రశ్న, ఉర్దూ కొత్త సిలబస్లో 14వ ప్రశ్నలోని 5 బిట్, హిందీ పాత సిలబస్ 6వ ప్రశ్న(డి), తెలుగులో నాలుగో విభాగంలో రెండవ ప్రశ్నలలో తప్పులు దొర్లాయని, తాము చదివింది ఒక తీరుగా ఉంటే ప్రశ్నపత్రంలో మరోతీరుగా ఉందని విద్యార్థులు వాపోయా రు. దీంతో ప్రశ్నలకు సమాధానం రాయాలో..? వద్దో..? అర్థం కాక తికమకపడ్డారు. 4,163 మంది గైర్హాజరు... ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో మొదటి రోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా 4,163 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆర్ఐవో విశ్వేశ్వర్రావు తెలిపారు. జనరల్ విభాగంలో 26,343 మందికి గాను 23,981 మంది హాజరు కాగా, 2,362 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 3,214 మందికి 2,412 హాజరు కాగా, 802 మంది గైర్హాజరయ్యారు. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు అనుమంతించేది లేదనే నిబంధనలు ఉండటంతో పలువురు విద్యార్థులు సకాలంలో హాజరు కాలేక పోయారు. ఉదాహరణకు భద్రాచలంలోని ఏపీఆర్ఎస్ బాలికల కేంద్రంలో ఓ విద్యార్థి 4 నిమిషాలు ఆలస్యంగా రాగా, ఆ విద్యార్థిని అనుమతించలేదు. ఇలా పలువురు గైర్హాజరు కావాల్సి వచ్చింది. ఉదయం 8:45 - 8:59 నిమిషాల మధ్య వచ్చిన పలువురు విద్యార్థులతో ఆలస్యానికి కారణం తెలుపుతూ ధ్రువీకరణ పత్రం రాయించుకొని పరీక్షకు అనుమతించారు. -
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైనాయి. మొత్తం 2661 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వెల్లడించారు. పరీక్షలలో మాస్ కాపీయింగ్ను నిరోధానికి తొలిసారిగా జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్ష కేంద్రాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు సెట్ నెంబర్ 1 ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు అధికారులు చెప్పారు.