Jathi Ratnalu Movie
-
వైల్డ్ ఫైర్లా 'జాతిరత్నాలు' చిట్టి అందాల జాతర (ఫొటోలు)
-
'జాతిరత్నాలు' హీరో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడా?
'జాతిరత్నాలు' అనగానే నవీన్ పొలిశెట్టి గుర్తొస్తాడు. ఎందుకంటే ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు. దీని తర్వాత 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అని మరో మూవీ చేశాడు. దీంతో కూడా హిట్ కొట్టాడు. ఇదొచ్చి దాదాపు ఏడాది కావొస్తున్నా కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం చేతికి గాయం కావడంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. అలాంటిది ఇప్పుడు ఇతడికి పెళ్లయిపోయిందనే రూమర్ తెగ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'దేవర' పాటపై కాపీ ట్రోల్స్.. నిర్మాత ట్వీట్ వైరల్)'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' రిలీజ్ టైంలో అమెరికా వెళ్లిన నవీన్.. చాలారోజుల నుంచి అక్కడే ఉన్నాడు. మొన్నీమధ్య ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ జరగడంతో చేతికి కట్టుతో కనిపించాడు. తన గాయం గురించి కొన్ని రోజుల క్రితం ఓ వీడియో పోస్ట్ చేసి, తనకేం పర్లేదని త్వరలో కోలుకుంటానని కూడా చెప్పాడు.అయితే అమెరికాలో నవీన్ ఓ అమ్మాయిని సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడని, అందుకే చాలారోజుల నుంచి అక్కడే ఉండిపోయాడనే రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన నవీన్.. అలాంటిదే లేదని, తనకు పెళ్లి జరిగితే కచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటానని చెప్పాడు. సో అదన్నమాట విషయం.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
జాతిరత్నాలు డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా
-
జాతిరత్నాలు డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా
-
'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా పెళ్లి.. వరుడు ఎవరంటే..?
తొలి సినిమా 'జాతిరత్నాలు'తో 'చిట్టి' పేరుతో యూత్ గుండెల్ని తాకింది ఫరియా అబ్దుల్లా. మొదట్లో ఆమెను చూసిన వారందరూ కూడా ఉత్తరాది అమ్మాయి అనుకున్నారు కానీ ఆమె అచ్చమైన హైదరాబాదీ. పుట్టింది, పెరిగింది, చదివింది... భాగ్యనగరంలోనే. జాతిరత్నాలు తర్వాత పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కనిపించిన ఈ బ్యూటీ త్వరలో పెళ్లికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడితో ఫిరియా పెళ్లి జరగనున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. అతను కూడా సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే వ్యక్తితో ఆమె వివాహం జరగనుందట. ఇప్పటికే ఆయన పలు షార్ట్ ఫిలిమ్స్లలో నటించాడని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది. నిజం ఎంటో తెలియాలంటే మన చిట్టి చెప్పే వరకు వేచి ఉండాల్సిందే. ప్రపంచమంతా స్వేచ్ఛగా తిరగాలనుకుంటున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన ఫరియా.. తనకు కొంతమంది బాయ్ఫ్రెండ్స్ ఉన్నారని కూడా తెలిపింది. కానీ వాళ్లు కేవలం బాయ్ఫ్రెండ్స్ మాత్రమేనని. రిలేషన్, పెళ్లి లాంటి విషయాలపై పెద్దగా నమ్మకం లేదని ఆ సమయంలో చెప్పింది. తాజాగా ఆమె పెళ్లి వార్తలు బయటకు రావడంతో తను ప్రేమించిన వాడితో పెళ్లికి రెడీ అయినట్లు చెబుతున్నారు. పెళ్లి కాన్సెప్ట్తో అల్లరి నరేశ్తో కలిసి 'ఆ ఒక్కటీ అడక్కు' అనే చిత్రంలో నటించింది ఫరియా అబ్దుల్లా.. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) -
ఆ వీడియోతో ఎమోషనల్ అవుతుంటా: నవీన్ పోలిశెట్టి
మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాల్లో జాతిరత్నాలు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అంతలా సినీ ప్రియులను అలరించింది ఈ టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం. ఫర్ఫెక్ట్ యూత్పుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులను కామెడీతో కట్టిపడేసిన తీరు అద్భుతం. కరోనా పాండమిక్ టైంలో వచ్చినప్పటికీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ మూడేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. ఈ సినిమాను థియేటర్లలో చూసిన వీడియోను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. నవీన్ తన ట్వీట్లో రాస్తూ..' బ్లాక్బస్టర్ చిత్రం జాతిరత్నాలు రిలీజై నేటికి మూడేళ్లు. ఆ సమయంలో ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. అయితే అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. ఆ రోజు థియేటర్లలో చూసిన ఈ త్రోబాక్ వీడియో చూస్తే ఆ ఆనందం మళ్లీ గుర్తుకు వస్తోంది. మీ ఆదరణను చూసి కొన్నిసార్లు నేను ఎమోషనల్ అవుతుంటా. ఇందులోని ప్రతి డైలాగ్ మన తెలుగు సినిమాలో ఉంది. ఈ సందర్భంగా మన తెలుగు సినిమా కుటుంబానికి నా ధన్యవాదాలు. నా రాబోయే చిత్రం ద్వారా థియేటర్లలో ఇలాంటి ఆనందం, వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నా. అందుకోసమే పని చేస్తున్నాం. ఈ విషయంలో నేను హామీ ఇస్తున్నా. ఇది నా వాగ్దానం. లవ్ యు గాయ్స్' అంటూ లవ్ సింబల్ జత చేశారు. కాగా.. ఈ చిత్రంలో నవీన్తో పాటు ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనుదీప్ కేవీ దర్శకత్వం వహించడంతో పాటు నటించారు కూడా. Today marks 3 years to this joyful blockbuster film #JathiRatnalu. World was in the middle of a pandemic. But despite all challenges this throwback video is a small reminder of the euphoria that we saw in theatres that day. Sometimes I feel emotional to see how you guys have made… pic.twitter.com/Eph3DwnUwq — Naveen Polishetty (@NaveenPolishety) March 11, 2024 -
ఇదే నా చివరి సినిమా: జాతిరత్నాలు డైరెక్టర్
నవ్వుల ఆటంబాంబు, కామెడీ ఖజానా, పొట్టచెక్కలయ్యేలా నవ్వించే సినిమా జాతిరత్నాలు. ఈ ఫుల్ కామెడీ ప్యాక్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు అనుదీప్ కేవీ. పిట్టగోడ సినిమాతో 2016లో దర్శకరచయితగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడీ డైరెక్టర్. ఐదేళ్లు గ్యాప్ తీసుకుని జాతిరత్నాలు సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు. ఈయన సినిమాలే కాదూ, ఇంటర్వ్యూలు కూడా భలే గమ్మత్తుగా ఉంటాయి. తన నోటి వెంట నుంచి వరుసగా పంచులు పేలుతూనే ఉంటాయి. గతేడాది ప్రిన్స్ మూవీతో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చిన ఇతడు తాజాగా మ్యాడ్ సినిమాలో నటించాడు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం(అక్టోబర్ 5) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అనుదీప్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. మ్యాడ్ మూవీ డైరెక్టర్ కల్యాణ్ శంకర్ నటించమని కోరితేనే తాను ఈ చిత్రంలో యాక్ట్ చేసినట్లు తెలిపాడు. ఇంతలో యాంకర్ సుమ వచ్చి.. జాతిరత్నాలు సినిమాలో నటించారు. ఈ చిత్రంలోనూ యాక్ట్ చేశారు. మున్ముందు మిమ్మల్ని హీరోగా చూడాలని కోరుకుంటున్నాం అంది. దీంతో అనుదీప్.. అదేం లేదండీ.. ఇదే నా చివరి సినిమా.. కేవలం కళ్యాణ్ కోసమే ఈ మూవీలో నటించాను అని చెప్పుకొచ్చాడు. ఇకపై నటనకు దూరం కానున్నట్లు వెల్లడించాడు. చదవండి: ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పిన బిగ్బాస్.. కంటెస్టెంట్లకు విషమ పరీక్ష! -
‘జాతిరత్నాలు’ సమయంలో డైరెక్టర్ నిన్ను కొట్టారా? క్లారిటీ ఇచ్చిన ఫరియా
‘జాతిరత్నాలు’ మూవీతో హీరోయిన్గా పరిచమైన హైదరబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా కుర్రకారు మనసులను కొల్లగొట్టింది. తొలి సినిమాతోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత కాస్తా గ్యాప్ తీసుకున్న ఫరియా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అందులో ‘లైక్ షేర్ సబ్స్క్రైబ్’ ఒకటి. ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా రీసెంట్గా హీరో సంతోష్ శోభన్తో కలిసి ఓ టాక్లో షోలో పాల్గొంది. చదవండి: ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషమాలను పంచుకుంది. అలాగే జాతిరత్నాలు సినిమా సమయంలో డైరెక్టర్ హీరోయిన్ కొట్టారంటూ వచ్చిన వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. కాగా సినిమాలో ఆఫర్ ఎలా వచ్చిందని అడగ్గా హీరో నాగార్జున గారి వల్ల వచ్చిందంటూ ఆసక్తికర విషయం చెప్పింది. తన కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్కి నాగార్జున గెస్ట్గా వచ్చారని, అప్పుడు ఆయన తనని చూసి మీరు యాక్టరా? అని అడిగాని చెప్పింది. అప్పుడే ఆయన నెంబర్ తీసుకుని ఫాలోఅప్ చేశానని, ఈ క్రమంలో ఆడిషన్స్ ఇవ్వగా జాతిరత్నాలు సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపింది. చదవండి: ఓటీటీకి వచ్చేసిన ది ఘోస్ట్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. అనంతరం ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ అనుదీప్ కేవీ నిన్ను కొట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి అందులో నిజమేంత అడగ్గా ఫరియా దీనిపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘అది సరదాగా జరిగింది. సెట్లో అనుదీప్ గారు చాలా సరదగా ఉంటారు. ఆయన జోక్స్ వేసినప్పుడు నవ్వుతూ పక్కనున్న వాళ్లని కొడతారు. అది ఆయన అలవాటు. అలా ఒకసారి నన్ను చేతితో అలా అన్నారు. అంతే’ అంటూ వివరణ ఇచ్చింది. అలాగే తనకు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందంటూ మనసులోని మాటలను బయటపెట్టింది. -
స్టార్ హీరోతో 'జాతి రత్నాలు' డైరెక్టర్ సినిమా..
Sivakarthikeyan Anudeep KV Movie SK20 In Telugu And Tamil: శివ కార్తికేయన్ హీరోగా ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ‘ఎస్కె 20’ వర్కింగ్ టైటిల్తో తెలుగు–తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం విడుదల తేదీ ఫిక్స్ అయింది. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘ ‘ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది’’ అని సురేష్ బాబు తెలిపారు. మరియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్రధారి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా సహనిర్మాతగా అరుణ్ విశ్వ వ్యవహరిస్తున్నారు. చదవండి: రూ. 44 లక్షల మోసం.. యూట్యూబర్ అరెస్ట్.. నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి ❤️❤️❤️👍#SK20FromAugust31 https://t.co/aa13VqnZct — Sivakarthikeyan (@Siva_Kartikeyan) May 30, 2022 -
జాతిరత్నాలు డైరెక్టర్తో స్టార్ హీరో సినిమా అనౌన్స్మెంట్
Sivakarthikeyan Announces Next With Jathi Ratnalu Director KV Anudeep: జాతిరత్నాలు సినిమాతో కడుపుబ్బా నవ్వించిన డైరెక్టర్ అనుదీప్. డైరెక్టర్గా తొలి సినిమాతోనే సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తన తర్వాతి ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా తన నెక్ట్స్ సినిమాను ప్రకటించాడు. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్తో ఆయన సినిమాను తెరకెక్కించనున్నారు. తెలుగులో ఈయనకు ఇదే మొదటి చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీనికి ఎస్కే 20 అనే వర్కింగ్ టైటిల్ను పెట్టారు. ఇక ఎస్ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇప్పటికే రెమో చిత్రంతో శివ కార్తికేయన్ తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు. ఇటీవలె ఈయన నటించిన డాక్టర్ సైతం విడుదలైంది. Very happy to join with @AsianSuniel sir @SBDaggubati sir & my frnd @iamarunviswa for #SK20 ,directed by my fav @anudeepfilm & music by @MusicThaman bro😊 A fun-filled entertainer on the way👍❤️#NarayanDasNarang @SVCLLP @SureshProdns #PuskurRamMohanRao @ShanthiTalkies pic.twitter.com/3g5sjGCePH — Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 1, 2022 -
చిట్టి సాంగ్.. లక్ష్మీ పటాస్లా పేలిందిగా..
Chitti Song Hits 100 Million Views: చిన్న సినిమాగా విడుదలైన జాతిరత్నాలు భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి 11లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇందులోని పాటలు కూడా బాగానే హిట్టయ్యాయి. ముఖ్యంగా 'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందో నా గుండె ఖల్లాసే..' అనే పాట యువతకు బాగా కనెక్ట్ అయింది. మార్చి 29న రిలీజైన ఈ పాట తాజాగా 100 మిలియన్ల వ్యూస్ అందుకుంది. దీంతో చిట్టి సాంగ్ సోషల్ మీడియాలో మరోసారి మార్మోగుతోంది. -
డిఫరెంట్ గెటప్స్ ట్రై చేసేది అందుకే: జాతిరత్నాలు భామ
చిట్టి.. నా బుల్బుల్ చిట్టి.. అంటూ కుర్రకారు మనసు దోచుకున్న నటి, సొగసైన పొడగరి ఫరియా అబ్దుల్లా.. మొదటి సినిమాతో ఇటు గ్లామర్ పరంగా అటు నటనాపరంగా వందశాతం మార్కులు కొట్టేసింది. ఆరేళ్ల వయసులోనే యాక్టర్ కావాలనుకుందట ఈ అమ్మడు. అందుకే డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్, డ్రెస్లు ట్రై చేస్తుంటానని చెప్పింది చిట్టి. ఆ నటికి నచ్చిన.. ఆమె మెచ్చిన బ్రాండ్స్ ఇవీ.. గీతిక కానుమిల్లి.. హైదరాబాద్కు చెందిన గీతిక కానుమిల్లి.. చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కంది. ఆ ఆసక్తితోనే ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. అనంతరం 2018లో హైదరాబాద్లో ‘గీతిక కానుమిల్లి’ అని తన పేరుమీదే ఓ బొటిక్ ప్రారంభించింది. అనతి కాలంలోనే ఆమె డిజైన్స్ పాపులర్ అయి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. పి.వి.సింధు, సమంత, కీర్తి సురేష్, సైనా నెహ్వాల్ వంటి చాలా మంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసింది. ధర కూడా డిజైన్ను బట్టే ఉంటుంది. ఇక్కడ ఏది కొనాలన్నా వేల నుంచి లక్షల్లో ఖర్చు చేయాలి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నిటిలోనూ ఈ డిజైన్స్ లభిస్తాయి. ద ట్రింక్ హాలిక్.. ఇదొక ఇన్స్టాగ్రామ్ షాపింగ్ సైట్. ఈ మధ్యనే మొదలైన ఈ బ్రాండ్ .. అతి తక్కువ ధరలకే అందమైన జ్యూయెలరీని అందిస్తోంది. క్వాలిటీకి పెట్టింది పేరు. అదే వీరి బ్రాండ్ వాల్యూ. అందుకే, సామాన్య ప్రజల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఇది ఫేవరెట్. ఇతర బ్రాండ్స్తో పోలిస్తే కాస్త సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఇన్స్టాగ్రామ్ మెయిన్ ప్లాట్ఫామ్గా వీటిని కొనుగోలు చేయొచ్చు. వాట్సాప్ చేసి కూడా ఆర్డర్ చేయొచ్చు. చదవండి: క్లాస్ అయినా.. మాస్ అయినా ఆయనే ‘బాస్’ -
హైదరాబాదీలు అత్యధికంగా వింటున్న పాట ఇదే!
హైదరాబాదీలు ముఖ్యంగా యువత అత్యధికంగా వింటున్న గాయకుల్లో సిద్ శ్రీరామ్ అగ్రగామిగా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ మ్యూజిక్ యాప్ స్పోటిఫై తాజా అధ్యయనంలో తేల్చింది. హైదరాబాద్ వాసుల సంగీతాసక్తులపై తమ డేటా విశ్లేషణ ఫలితాలను సంస్థ తాజాగా వెల్లడించింది. దీని ప్రకారం హైదరాబాదీలు అత్యధికంగా వినే గాత్రాల్లో తొలి స్థానం సిద్ శ్రీరామ్కు దక్కగా, ఆ తర్వాత స్థానాల్లో బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్, అనిరుథ్ రవిచందర్, శ్రేయా ఘోషల్ తదితరులతో పాటు కె.ఎస్.చిత్ర, అనురాగ్ కులకర్ణి, ప్రీతమ్, దేవిశ్రీ ప్రసాద్, ఎఆర్రెహ్మాన్ తదితర టాలీవుడ్ సంగీత ప్రముఖులూ ఉన్నారు. దివంగత మధుర గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మాణ్యం కూడా ప్రముఖ స్థానాన్ని దక్కించుకున్నారు. చిట్టి నీ నవ్వంటే...కి టాప్ ప్లేస్.. అదే విధంగా హైదరాబాదీలు అత్యధికంగా విన్న/వింటున్న పాటల్లో చిట్టి నీ నవ్వంటే (జాతిరత్నాలు)ప్రధమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో జలజల పాతం నువ్వు (ఉప్పెన), ఒకేఒక లోకం నువ్వే(శశి), లాహె లాహె(ఆచార్య) తరగతి గది (కలర్ ఫొటో), హే ఇది నేనేనా (సోలో బతుకే సో బెటర్), మగువా మగువా (వకీల్ సాబ్), హోయ్నా హోయ్నా (నానిస్ గ్యాంగ్ లీడర్), కాటుక కనులె (ఆకాశం నీ హద్దురా), భలేగుంది బాలా (శ్రీకారం) పాటలున్నాయి. -
‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్, హీరో ఎవరో తెలుసా!
ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీసుకు బాగానే కలిసోచ్చిందని చెప్పుకొవచ్చు. లాక్డౌన్ తర్వాత విడుదలైన మొదటి సినిమా ‘క్రాక్’ సూపర్ హిట్గా నిలిచి శుభారంభాన్ని ఇచ్చింది. ఇక ఆ తర్వాత విడుదలైన ‘ఉప్పెన’ చిత్రం ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇక మార్చిలో విడుదలైన ‘జాతి రత్నాలు’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫుల్లెన్త్ కామెడీతో ఈ మూవీ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పటికే ‘క్రాక్’, ‘ఉప్పెన’ సినిమాలను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘జాతి రత్నాలు’ మూవీ కూడా ఈ జాబితాలో చేరింది. తాజా బజ్ ప్రకారం ఈ మూవీని హిందీలో రీమేక్ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరోను కూడా కన్ఫామ్ చేసినట్లు సమాచారం. అయితే ‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్కు కూడా అనుదీప్యే డైరెక్టర్గా వ్యవహరించన్నాడట. ఇందులో హీరోను కూడా నవీల్ పొలీశెట్టిని అనుకుంటున్నట్లు టాలీవుడ్లో టాక్. కాగా గతంలో నవీల్ పోలీశెట్టి సుశాంత్ సింగ్ రాజ్పుత్ ‘చిచోరే’ మూవీలో సహానటుడిగా కనిపించిన విషయం తెలిసిందే. అందుకే ‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్ను కూడా నవీన్నే హీరోగా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉందట. అయితే దర్శకుడు అనుదీప్ ఇప్పటికే జాతి రత్నాలు మూవీకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్ను అనుదీప్ పూర్తి చేసినట్లు సమాచారం. చదవండి: ‘జాతిరత్నం’ రేటు పెరిగింది.. మూడో సినిమాకే అన్ని కోట్లా? జాతిరత్నాలు.. అసలు ఏంటా కామెడీ: టీమిండియా క్రికెటర్ -
ఆ కారణంతో క్రేజీ ఆఫర్లు వదులుకున్న ‘చిట్టి’
పెద్ద హీరోలు కాదు, అగ్ర దర్శకుడు లేడు అయినా ఆ సినిమాకు ప్రేక్షకులు జైకొట్టారు. థియేటర్లలో పడిపడి నవ్వి.. నిర్మాతలపై కాసుల వర్షం కురిపించారు. ఇప్పటికే అది ‘జాతిరత్నాలు’సినిమా అని అర్థమైపోయిందనుకుంట. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ‘జాతిరత్నాలు’నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల అమాకత్వపు పనులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇక ఈ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా ప్రేక్షకుల మనసును దోచుకుంది. ‘చిట్టి’ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టికి ఎంత క్రేజ్ వచ్చిందో.. ఫరియాకు అంతే వచ్చింది. ‘జాతిరత్నాలు’తర్వాత ఈ పొడగరి బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. మాస్ మహారాజా రవితేజ సినిమాలో కూడా ఫరియాకు చాన్స్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇంతవరకు అధికార ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి రెండు భారీ నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్ వచ్చిందట. కానీ ఈ ఆఫర్లను ఫరియా సున్నితంగా తిరస్కరించిందట. అందుకు కారణం ఆమె ఎత్తు అనే తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో అత్యంత పొడగరి ఫరియానే. ప్రభాస్, రానా, గోపిచంద్, వరుణ్తేజ్ మినహా మరే హీరోలు ఆమె హైట్కు సెట్ కాలేరు. తాజాగా ఆమెకు వచ్చిన ఆఫర్లలో హీరోల హైట్ ఆమెకంటే చాలా తక్కువట. అందుకే ఆ సినిమాలను ఫరియా సున్నితంగా తిరస్కరించిందట. తనకంటే తక్కువ హైట్ ఉన్నహీరోలతో నటించేందుకు ఫరియా మొగ్గు చూపడంలేదని తెలుస్తోంది. మరోవైపు ఫరియా బాలీవుడ్ చాన్స్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు మూడు కథలు కూడా విన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: మహేశ్తో జతకట్టనున్న ‘ఇస్మార్ట్’ బ్యూటీ! మహేశ్ బాబు వీడియోని వాడేసిన తెలంగాణ పోలీసులు.. వైరల్ -
జాతిరత్నాలు.. అసలు ఏంటా కామెడీ: టీమిండియా క్రికెటర్
ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ మూవీ ఏది? అనగానే జనాలు జాతిరత్నాలు అని టక్కున చెప్పేస్తుంటారు. థియేటర్కు వెళ్లి చూసిన ప్రేక్షకులు సినిమాలో భలే కామెడీ ఉందే అని నవ్వుకుంటుంటే ఓటీటీ ప్రేక్షకులు మాత్రం అబ్బే.. కంటెంట్ తక్కువ... కామెడీ మాత్రమే ఎక్కువ అని పెదవి విరిచారు. కానీ సెలబ్రిటీలు ఈ సినిమాకు మంచి మార్కులే వేశారు. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. తాజాగా ఈ సినిమా చూసిన భారత క్రికెటర్ దినేశ్ కార్తిక్ జాతిరత్నాలు గురించి ట్వీట్ చేశాడు. JATHI RATHNALU My goodness, what a laugh riot.I kept laughing in every scene.Amazing dialogues, outstanding direction and incredible performances by each n every one.More power to you guys. This is one genre that's probably the toughest and you guys aced it.Outstanding ❤️❤️❤️ — DK (@DineshKarthik) April 16, 2021 'జాతిరత్నాలు.. అసలు ఏంటా కామెడీ.. ప్రతి సన్నివేశానికి పడీపడీ నవ్వుతూనే ఉన్నాను. డైలాగులు, డైరెక్షన్, నటన.. ఇలా ప్రతీది అద్భుతం, అమోఘం. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించడం అంటే మామూలు విషయం కాదు. కానీ మీరు దాన్ని సుసాధ్యం చేశారు..' అంటూ చిత్రయూనిట్ను ప్రశంసలతో ముంచెత్తాడు. ఇది చూసిన నెటిజన్లు 'ఏంటి? నీకు తెలుగొచ్చా?' అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా తెలుగు సినిమాను ఆదరించడం బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషించారు. అనుదీప్ కేవీ రూపొందించిన ఈ సినిమాను మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. చదవండి: జాతిరత్నాలు కలెక్షన్లు: నిర్మాతలకు అంత లాభమా! ‘జాతిరత్నం’ రేటు పెరిగింది.. మూడో సినిమాకే అన్ని కోట్లా? -
జాతిరత్నాలకు షాక్.. వారికి అస్సలు నచ్చడం లేదట!
చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జాతిరత్నాలు’ చిత్రం పెద్ద విజయాన్నే సాధించింది. నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో జాతిరత్నాలు సినిమా ముందు వరుసలో ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. కరోనా భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు కామెడీ టీకా ఇచ్చిందీ చిత్రం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ దుమ్ము లేపిన ఈ సినిమా.. ఓటీటీలోలో మాత్రం బోల్తా కొట్టింది. మాకు నచ్చలేదు: నెటిజన్లు ఓటీటీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘జాతిరత్నాలు’ చిత్రం ఏప్రిల్ 11న అమెజాన్ ప్రైమ్లో రిలీజైంది. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసిన ప్రతీ ప్రేక్షకుడు తెగ నవ్వుకున్నారు. కానీ అదే జనానికి ఓటీటికు వచ్చేసరికి నచ్చటం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా చూశాక ఇందులో ఏముందని ఇంతగా ఆడిందని ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. చిత్రంలో 'కంటేంటే లేదు, ఓవర్ రేటెడ్ కామెడీ తప్పా' అని పెదవి విరుస్తున్నారు ఓటీటీ ప్రేక్షకులు. అసలు ఈ స్థాయి హిట్ మూవీకి ఓటిటిలోనూ బ్రహ్మరథం దక్కుతుందని అనుకున్నారు అంతా. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యి సినిమాలో విషయమే లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీని బట్టి ఓ విషయం స్పష్టమైంది. థియేటర్ కు ఓటిటి కు ప్రేక్షకుల టేస్ట్ల్లో చాలా తేడాలుంటాయి. జనం మధ్య చూసిన సినిమాకు ..ఒంటరిగా లేదా ఇద్దరో ముగ్గురో కూర్చుని సెల్ ఫోన్, ట్యాబ్లలో చూసే సినిమాకు.. ప్రేక్షకుల ఎక్స్పీరియన్స్లో చాలా తేడా ఉంటుందని ‘జాతిరత్నాలు’ విషయంలో తెలిసొచ్చింది. అయితే, నటన పరంగా నవీన్ పొలిశెట్టి మరో విజయ్ దేవరకొండ కానున్నాడని ఓటీటీ ప్రేక్షకులు ప్రశంసలు కురిపించడం జాతి రత్నాలకు ఓ సానుకూల అంశం. ( చదవండి: ఆ ఆలోచన వచ్చినా పీక కోస్తా అని నా భార్య వార్నింగ్ ఇచ్చింది : నాగబాబు ) #JathiRatnalu is overrated movie. Audience blindly following the majority opinion without having any own taste. #colorphoto #Jathirathnalu #uppena are examples of overrated ones. #naveenpolishetty is just brilliant to watch. He can be the next #vijaydevarakonda pic.twitter.com/N62eq6jAKj — srini - శ్రీని (@srinidurvasula) April 12, 2021 -
‘జాతిరత్నాలు’పై మంత్రి కేటీఆర్ రివ్యూ
చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ అయిన సినిమా ‘జాతిరత్నాలు’. కేవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా .. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఈ మూవీలోని కామెడీ సరికొత్త వినోదాన్ని పంచింది. థియేటర్కు వెళ్లిన ప్రతి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకుని బయటకు వచ్చాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాపై సీనీ ప్రముఖులు సైతం పొగడ్తల వర్షం కురిపించారు. ఫలితంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.39.04 కోట్ల షేర్, రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి కేటీఆర్ ‘జాతిరత్నాలు’పై ప్రశంసల జల్లుకురిపించారు. ఆదివారం ‘జాతిరత్నాలు’ వీక్షించిన మంత్రి.. సినిమా చాలా నచ్చిందని, కామెడీ హిలేరియస్గా ఉందని ట్వీట్ చేశారు. ఇక కేటీఆర్ చేసిన ట్వీట్ కు హీరో నవీన్ పోలిశెట్టి కూడా స్పందించారు. థాంక్యూ సార్…మీకు నచ్చడం చాలా హ్యాపీగా ఉంది అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా, ఈ సూపర్ హిట్ అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం ఏప్రిల్ 11నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. Thank you so much sir @KTRTRS 🙏 so happy you loved it #JathiRatnalu https://t.co/czkkj99Ynd — Naveen Polishetty (@NaveenPolishety) April 11, 2021 -
‘జాతిరత్నం’ రేటు పెరిగింది.. మూడో సినిమాకే అన్ని కోట్లా?
‘జాతిరత్నలు’ సినిమాతో హీరో నవీన్ పొలిశెట్టి జాతకమే మారిపోయింది. తొలి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తోనే ఆకట్టుకున్న ఈ ‘జాతిరత్నం’, రెండో సినిమాతో స్టార్ హీరోల లిస్ట్లో చేరిపోయాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడమే కాకా, నవీన్కు ఎనలేని క్రేజీని తెచ్చిపెట్టింది. ఇండస్ట్రీ అంతా తన వైపు తిరిగేలా చేసింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరోతో సినిమాలు చేయడానికి చాలామంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అంతేకాదు భారీ రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ కూడా ఇస్తున్నారట. నవీన్ యాక్టింగ్లో కొత్తదనం చూసి ముచ్చటపడిన ఓ బడా నిర్మాత.. అతనికి భారీ పారితోషికం ఇచ్చేందుకు రెడీ అయ్యాడట. నవీన్ మూడో చిత్రం తమ బ్యానర్లో తీస్తే.. రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తానని ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అయితే నవీన్ పొలిశెట్టి మాత్రం ఇంతవరకు ఏ సినిమాను అధికారికంగా ఒప్పుకోలేదు. నచ్చిన కథ దొరికితేనే సినిమా చేద్దామని వేచిచూస్తున్నాడట. త్వరలో తన మూడో సినిమా ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. చదవండి: జాతిరత్నాలు కలెక్షన్లు: నిర్మాతలకు అంత లాభమా! ‘బిగ్బాస్’ బ్యూటీపై నెమలి దాడి.. వీడియో వైరల్ -
జాతిరత్నాలు కలెక్షన్లు: నిర్మాతలకు అంత లాభమా!
ఈ మధ్యకాలంలో యూత్ను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో జాతిరత్నాలు సినిమా ముందు వరుసలో ఉంటుంది. కరోనా భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు కామెడీ టీకా ఇచ్చిందీ చిత్రం. దీంతో థియేటర్కు వెళ్లిన ప్రేక్షకుడు మనసారా నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. మొత్తానికి ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిన్న సినిమా భారీ హిట్ కొట్టి నిర్మాతలకు డబ్బులు తెచ్చిపెట్టింది. మరి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు ఎంత? నిర్మాతలకు ఏమేరకు లాభాలు వచ్చాయో చదివేయండి.. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్తో అప్పటికే ప్రేక్షకులకు దగ్గరైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలుపుకుని రూ.10 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. ఇక రిలీజైన తొలి రోజు నుంచే మంచి టాక్ రావడంతో కొద్ది రోజులపాటు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ఫలితంగా నైజాంలో రూ.16.18 కోట్లు, సీడెడ్లో రూ.4.10 కోట్లు, ఈస్ట్లో రూ.1.92 కోట్లు, వెస్ట్లో రూ.1.58 కోట్లు, కృష్ణాలో 1.81కోట్లు, గుంటూరులో రూ.2.08 కోట్లు, నెల్లూరులో 92 లక్షలు వసూలు చేసింది. రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ. 32.59 కోట్లు షేర్, రూ.52 కోట్ల పైచిలుకు గ్రాస్ రాబట్టింది. ఈ క్రమంలో ఎన్నో సినిమాల బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచవ్యాప్తంగా రూ.39.04 కోట్ల షేర్, రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. థియేట్రికల్ బిజినెస్ రూ.10 కోట్ల పైమాటే ఉండటంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పదకొండున్నర కోట్లుగా నమోదైంది. కానీ జాతిరత్నాలు ఏకంగా రూ.39 కోట్లకు పైమాటే వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ఇరవై ఏడున్నర కోట్ల లాభాలను అందుకుంది. దీంతో జాతిరత్నాలు రూ.27 కోట్లకు పైగా లాభాల మార్కును చేరుకున్న చిన్నచిత్రంగా ఘనత సాధించింది. ఇదిలా వుంటే ఈ సినిమా నేటి(ఆదివారం) నుంచి అమెజాన్ ప్రైమ్లో ప్రసారం కానుంది. #JathiRatnaluOnPrime, watch now: https://t.co/yJRGqrNZLh@NaveenPolishety @fariaabdullah2 @priyadarshi_i @eyrahul @anudeepfilm @vennelakishore @actorbrahmaji @ItsActorNaresh @murlisharma72 @radhanmusic #PriyankaDutt @nagashwin7 @SwapnaCinema pic.twitter.com/rP2SnWTsQj — BARaju (@baraju_SuperHit) April 11, 2021 చదవండి: 'ఆస్కార్' బరిలో జాతిరత్నాలు! -
అమెజాన్లో జాతిరత్నాలు: నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత!
ఈ మధ్య కాలంలో ప్రేక్షకుడిని బాగా నవ్వించిన సినిమా జాతిరత్నాలు. కథ కన్నా కామెడీ మీద దృష్టిపెట్టిన డైరెక్టర్ అనుదీప్ ప్రజలను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంలో సక్సెస్ సాధించాడు. మార్చి 11న రిలీజైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ మంచి విజయం సాధించింది. ప్రధాన తారాగణం నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లాకు మంచి అవకాశాలను సైతం తెచ్చిపెట్టింది. ఇక కరోనా భయంతో థియేటర్కు వెళ్లలేని ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం తహతహలాడిపోతున్నారు. తాజాగా వారికి అమెజాన్ ప్రైమ్ వీడియో శుభవార్త చెప్పింది. జాతిరత్నాలు సినిమా ఏప్రిల్ 11 నుంచి ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఈ సినిమా హిందీ, కన్నడ డబ్బింగ్ కావాలంటూ కామెంట్లు చేస్తున్నారు. we got you @NaveenPolishety‘s movie, now we can hear this image and you giggle!#JathiRatnaluOnPrime premiers April 11.@priyadarshi_i @eyrahul @anudeepfilm pic.twitter.com/xSNRUPjVKR — amazon prime video IN (@PrimeVideoIN) April 7, 2021 చదవండి: 'ఆస్కార్' బరిలో జాతిరత్నాలు! మళ్లీ అనారోగ్యానికి గురైన సీనియర్ నటుడు కార్తీక్ -
జాతిరత్నాలు డైరెక్టర్కు కాస్ట్లీ లంబోర్గిని కారు!
నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో అనుదీప్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘జాతి రత్నాలు’.థియేటర్లోకి అడుగు పెట్టిన ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. దీంతో డైరెక్టర్ అనుదీప్కు స్వప్నా సినిమా బ్యానర్ అదిరిపోయే గిప్ట్ ఇచ్చింది. ప్రొడ్యూసర్స్ స్వప్న దత్, ప్రియాంక దత్లు కాస్ట్లీ లంబోర్గిని కారును బహుమతిగా ఇచ్చారు. అయితే ఇది నిజమైన కారు కాదు..లంబోర్గిని మోడల్లోని ఓ బొమ్మకారును అనుదీప్కు గిఫ్ట్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నా పంచులతో అందరినీ అందరినీ ఫూల్స్ చేస్తుంటే..వీళ్లు బొమ్మ కారిచ్చి నన్నే ఫూల్ని చేస్తున్నారు అంటూ అనుదీప్ చెబుతున్నట్లు కొన్ని మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే అనుదీప్ తన పంచులు, కౌంటర్లతో హీరోకు సమానంగా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Arey Entra Edi 😂 (@na_page_ni_rechagotaku) చదవండి: బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన జాతిరత్నాలు! 'ఆస్కార్' బరిలో జాతిరత్నాలు! -
'ఆస్కార్' బరిలో జాతిరత్నాలు!
ఇటీవల వచ్చిన చిన్న సినిమా జాతిరత్నాలు పెద్ద హిట్టు సాధించింది. థియేటర్లోకి అడుగు పెట్టిన ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత కామెడీని పంచిన చిత్రం మరొకటి లేదనడంలో ఆశ్చర్యమేమీ లేదు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తాజాగా ఆస్కార్కు ఎంపికైందట. ఈ మేరకు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన సర్టిఫికెట్ను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బెస్ట్ జానే జిగర్ మూవీ కేటగిరీ కింద ఈ సినిమాకు నామినేషన్ అయ్యిందని సంస్థ తెలియజేసింది. అయితే ఈ మధ్యే ఆస్కార్ అవార్డుల ప్రదానం అయిపోతే కొత్తగా జాతిరత్నాలు సినిమా నామినేట్ అవడమేంటి అని బుర్రలు బద్ధలు చేసుకున్నారు. కానీ కాసేపటికే వారికి అసలు విషయం అర్థమైంది. ఈ రోజు ఏప్రిల్ 1 కావడంతో అందరినీ ఏప్రిల్ ఫూల్ చేశారని తెలిసొచ్చింది. అలా ఈ రోజు మన జాతిరత్నాలు అందరినీ వెర్రివెంగళప్పలను చేశారన్నమాట! Eeeeyyy... Congratulations 🥳#JathiRatnalu @NaveenPolishety @fariaabdullah2 @priyadarshi_i @eyrahul @anudeepfilm @vennelakishore @actorbrahmaji @ItsActorNaresh @murlisharma72 @radhanmusic #PriyankaDutt @nagashwin7 @SwapnaCinema @VyjayanthiFilms @LahariMusic pic.twitter.com/4PWLEJefti — Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 1, 2021 చదవండి: చిట్టీ అని పిలుస్తుంటే భలేగా ఉంది: ఫరియా ఏప్రిల్: రిలీజయ్యే కొత్త సినిమాలివే గురూ.. -
బాక్సాఫీస్ని షేక్ చేసిన 8 హిట్ సినిమాలు ఇవే
కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ మహమ్మారి ఎఫెక్ట్కు 9 నెలల పాటు థియేటర్స్ మూసేశారు. ఇలాంటి తరుణంలో ప్రేక్షకులు మళ్లీ థియేర్లకు వస్తారా? సినిమా థియేటర్లు మళ్లీ హౌస్ఫుల్ అవుతాయా?అని చిత్ర పరిశ్రమ పెద్దలు ఒకింత భయాందోళనకు గురవుతుండగా.. మేము అండగా ఉంటామని ధైర్యాన్ని నూరిపోశారు తెలుగు ప్రేక్షకులు. సినిమాలు విడుదల చేయండి, థియేటర్స్కి తప్పకుండా వస్తామని భరోసా ఇచ్చారు. అన్నట్లుగానే గత మూడు నెలలుగా విడుదలైన సినిమాలన్నింటిని ఆదరించి చిత్ర పరిశ్రమే షాకయ్యేలా చేశారు. సినిమా సందడి మళ్లీ మొదలైంది. చూస్తుండగానే ఈ ఏడాదిలో మూడు నెలలు గడిచిపోయాయి. ఈ మూడు నెలల్లో టాలీవుడ్లో దాదాపు 66 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో మంచి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నేటితో మొదటి మూడు నెలలు ఫినిష్ అయ్యాయి.మరి ఫస్ట్ క్వార్టర్లో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాయో చూద్దాం. కిర్రాక్ అనిపించిన ‘క్రాక్’ థియేటర్లు రీఓపెన్ అయ్యాక వచ్చిన తొలి బిగ్ మూవీ ‘క్రాక్’. కరోనా భయానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి భరోసా ఇచ్చిన చిత్రమిది. జనవరి 9నదసంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించి నిర్మాతలలో నమ్మకం పెంచేసింది. రవితేజ, శ్రుతీహాసన్ హీరోహీరోయిన్లగా నటించిన ఈ సినిమా దాదాపు 38 కోట్లు వసూలు చేసింది. పోలీసు అధికారి పోత రాజు వీర శంకర్గా మాస్ మహారాజా రవితేజ చించేశాడు. చాలా రోజుల తర్వాత మాస్ మహారాజాలోని ఫైర్ తెరపై కనిపించింది. గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విజయ్ ‘మాస్టర్’ పాఠాలు బాగున్నాయి విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ‘ఇళయదళపతి’ విజయ్ ఈ ఏడాది ‘మాస్టర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు సినిమా కాకపోయినా కూడా టాలీవుడ్లో మంచి విజయం సాధించింది మాస్టర్. జనవరి 13న విడుదలైన ఈ సినిమా సినిమా దాదాపు 12 కోట్ల షేర్ వసూలు చేసి, తెలుగులో కూడా విజయ్కు భారీ మార్కెట్ ఉందని నిరూపించింది. ఈ సినిమాలో విలన్గా నటించిన విజయ్ సేతుపతికి మంచి మార్కులు పడ్డాయి. పర్వాలేదనిపించిన ‘రెడ్’ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ‘రెడ్’ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' తర్వాత కిశోర్ తిరుమల,రామ్ కాంబోలో హ్యాట్రిక్గా వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. సేఫ్జోన్లోకి వెళ్లింది. యాంకర్ ప్రదీప్ తొలి ప్రయత్నం ఫలించింది యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘30’రోజుల్లో ప్రేమించడం ఎలా. తొలి సినిమాతోనే మంచి హిట్ కట్టాడు. ఈ సినిమా కూడా హిట్ అయిందా అనే అనుమానాలు చాలా మందికి రావచ్చు. కానీ పెట్టిన బడ్జెట్.. అమ్మిన రేట్లతో పోలిస్తే మాత్రం యాంకర్ ప్రదీప్ తొలి సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి.కొందరు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు కూడా తీసుకొచ్చింది. రికార్డులు షేక్ చేసిన జాంబి రెడ్డి కరోనా క్రైసిస్ లో కూడా జాంబీలంటూ.. వచ్చి టాలీవుడ్ రికార్డులు షేక్ చేసింది జాంబి రెడ్డి. హాలీవుడ్ కాన్సెప్ట్ తో డిఫరెంట్గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లని రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. మెగా మేనల్లుడి రికార్డు.. ‘ఉప్పెన’లా వచ్చిన కలెక్షన్లు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఉప్పెన. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతోమంది నిర్మాతలకు ధైర్యం నూరిపోసిన సినిమా ఇది. బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఉప్పెన ఏకంగా 51 కోట్లు షేర్ వసూలు చేసింది. అల్లరి నరేశ్ నట విశ్వరూపానికి ‘నాంది’ 8 ఏళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న అల్లరి నరేశ్కు ‘నాంది’తో మంచి విజయం దక్కింది. ‘నా ప్రాణం పోయిన పర్వాలేదు.. న్యాయం గెలవాలి.. న్యాయమే గెలవాలి’ అంటూ అల్లరి నరేశ్ చేసిన నటనకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నరేశ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా 6.5 కోట్ల షేర్ వచ్చింది. చేసిన బిజినెస్తో పోలిస్తే సినిమా లాభాల్లోకి వచ్చేసింది. బాక్సాఫీస్ని షేక్ చేసిన ‘జాతి రత్నాలు’ నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ జాతిరత్నాలు. అనుదీప్ దర్శకత్వంలో వచ్చినఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 11న విడుదలైన జాతి రత్నాలు బాక్సాఫీస్ని షేక్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్లో కూడా పెద్ద సినిమాలకు రానీ కలెక్షన్స్తో రాబట్టింది.నిర్మాతలకు దాదాపు 40 కోట్ల లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. -
జాతిరత్నాలు ఆ రికార్డును కూడా బ్రేక్ చేసిందా?
చిన్న సినిమాగా విడుదలైన ‘జాతి రత్నాలు’ భారీ కలెక్షన్లతో పాటు రికార్డులను కూడా క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. అందులో కొన్ని పెద్ద సినిమాలకు సైతం సాధ్యం కానీ రేర్ ఫీట్లను కూడా సునాయాసంగా సాధిస్తోంది. కోవిడ్ అనంతరం ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ల మార్క్ను దాటడంతో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా మరో రికార్డును సృష్టించింది. చిన్న సినిమా పెద్ద రికార్డులు ‘క్రాక్, ఉప్పెన’ లాంటి సినిమాలు హిట్ టాక్తో టాలీవుడ్లో భారీ కలెక్షన్లను రాబట్టాయి, కానీ ఓవర్సీస్లో మాత్రం ఎందుకో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ ‘జాతిరత్నాలు’ చిత్రం మాత్రం ఆ పరిస్థితిని మార్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైతే వసూళ్లను రాబడుతోందో ఓవర్సీస్లోనూ అదే స్థాయిలో దూసుకుపోతోంది. గురువారం నాటికి ఈ సినిమా మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్నట్లు నవీన్ పొలిశెట్టి తన ఇన్స్టా లో పోస్ట్ చేశాడు. మొత్తం 1,001,825 డాలర్ల కలెక్షన్లతో చిన్న సినిమాల జాబితాలో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం యూఎస్లో ‘జాతిరత్నాలు’ తన వసూళ్ల వేటను ఇంకా కొనసాగిస్తోంది. గతంలో టాలీవుడ్లో తెలుగు రాష్ట్రాల మార్కెట్ తో పాటు యూఎస్ మార్కెట్ మీద కూడ అంతే శ్రద్ద ఉండేది. అక్కడ చిన్న సినిమా మిలియన్ డాలర్ వసూలు చేసింది అంటే హిట్ అనే ప్రామాణికం ఉండేది. కానీ లాక్డౌన్ మూలంగా ఓవర్సీస్ లో కలెక్షన్లు అనే మాట వినడమే కరువైంది, అక్కడి మన సినిమాల మార్కెట్ క్రాష్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు పూర్తిగా తెరుచుకుని వరుసగా సినిమాలు విడదలై వసూళ్లను రాబడుతున్న యూఎస్లో మాత్రం తెలుగు సినిమాల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఆ పరిస్థితిని ఇప్పుడు జాతిరత్నాలు మార్చేసిందని చెప్పాలి. ( చదవండి: బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన జాతిరత్నాలు! ) -
‘జాతిరత్నాలు సినిమాను నిషేధించాలి’
సాక్షి, కాచిగూడ: జాతిరత్నాలు సినిమాలో స్వాతంత్ర సమరయోధులను కించపరిచారని, సినిమా దర్శకుడు, నిర్మాత, నటులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ శివసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమా గంగాధర్ ఆధ్వర్యంలోని ప్రతినిధులు కాచిగూడ పోలీస్స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భూమా గంగాధర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధులు రాంప్రసాద్ బిస్మిల్ ఉరికంబం ఎక్కే ముందు పాడిన సర్ ఫరోషికీ తమన్నా హబ్ హమారే దిల్ మీ హై.. కవితను జాతిరత్నాలు సినిమాలో సర్ ఫరోషికీ తమన్నా, సమంతా, రష్మిక, తీనోసాథ్ హాయ్.. అంటూ వెటకారంగా పాడి అవమానించారని తెలిపారు. నేటి తరానికి తప్పుడు సందేశాన్ని అందించిన సినీ రచయిత, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, కవితను ఆలపించి అవమానపరిచిన గాయకులపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివసేన నేతలు కంజర్ల శ్రీధరాచారి, రితేష్, శ్రీనివాసాచారి, సురేష్, వేణు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఓటీటీలో జాతిరత్నాలు: మీరనుకునే డేట్ కాదు! సీఎం జగన్ ప్రకటన.. చిరంజీవి హర్షం -
ఓటీటీలో జాతిరత్నాలు: మీరనుకునే డేట్ కాదు!
చాలా రోజులకు థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులు వెలిశాయంటే అది కేవలం జాతిరత్నాలు సినిమా వల్లే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించి మెప్పించింది. రాహుల్, ప్రియదర్శి, నవీన్ల కామెడీకి నవ్వుకోని ప్రేక్షకుడే లేడంటే అతిశయోక్తి కాదు. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న రిలీజైనప్పటి నుంచి థియేటర్లో ఆడుతూనే ఉంది. మధ్యలో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ వాటికి గట్టి పోటీనిస్తూ నిలదొక్కుకుంది. కలెక్షన్ల పరంగా ఓవర్సీస్లోనూ దుమ్ము రేపుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. జాతిరత్నాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 10 నుంచి ప్రసారం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. గతంలోనూ ఈ సినిమా ఓటీటీ బాట పడుతోందని, ఇదే నెలలో ప్రసారం కానుందని వార్తలు రాగా వీటిని చిత్రయూనిట్ ఖండించింది. మరి వచ్చే నెలలో జాతిరత్నాలు ఓటీటీలోకి వస్తుందన్న ఊహాగానాల్లో ఎంతవరకు నిజముందనేది తేలాల్సి ఉంది! చదవండి: గోదావరి తీరంలొ నాని సినిమా షూటింగ్ చిట్టీ అని పిలుస్తుంటే భలేగా ఉంది -
విజయోత్సవ సంబురాల్లో ‘జాతిరత్నాలు’ చిత్ర యూనిట్ సందడి
-
‘జాతిరత్నాల’మధ్య చిచ్చు... నవీన్, దర్శిలకు రాహుల్ వార్నింగ్
కేవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం జాతిరత్నాలు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ జాతిరత్నాలు 20 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చారు. భారీ లాభాలు రావడంతో సక్సెన్ టూర్ని కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సక్సెస్ టూర్లో భాగంగా నవీన్, ప్రియదర్శి అమెరికాకు వెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు అన్ని చోట్ల తిరుగుతున్నారు. వారి ప్రయాణంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం నవీన్, ప్రియదర్శి అమెరికా టూర్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు చూసిన రాహుల్ రామకృష్ణ.. తనను అమెరికా తీసుకెళ్లకుండా మోసం చేశారంటూ.. ప్రియదర్శి, నవీన్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అరేయ్ దర్శి, నవీన్.. పీపుల్స్ ప్లాజాలో సక్సెస్మీట్ అయ్యాక.. మిమ్మల్ని కలిసేలోపే పాస్పోర్ట్తో ఎయిర్పోర్ట్కు వెళ్లి.. విమానమెక్కి యూఎస్ వెళ్లిపోతారేరా.! నేను చెప్పా కదరా.. నా దగ్గర కూడా పాన్ కార్డ్ ఉందని. పాన్కార్డు చూపిస్తే అక్కడ ఎంట్రీ ఇస్తార్రా..! జోగిపేట రవిరా నేను. నా వల్లే ప్రాబ్లమ్ అవుతుందని నన్ను వదిలేసి వెళ్లిపోయారు కదరా! మీరు రండ్రా మీ సంగతి చెబుతా..!’అంటూ ఓ సరదా వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాహుల్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. Scandalous video response to #JathiRatnalu team’s USA success tour by @eyrahul @NaveenPolishety @priyadarshi_i https://t.co/vZpJocELTI pic.twitter.com/67Upo8Gl1m — Rahul Ramakrishna (@eyrahul) March 20, 2021 -
సోషల్ హల్చల్: యూఎస్లో ‘జాతిరత్నాల’ రచ్చ
పిజ్జా తినకుండా ఉండలేకపోయిన కీర్తి సురేష్.. ఆటపట్టించిన నితిన్ ప్రితిజింటాకు ముద్దు ఇచ్చిన దితేశ్ దేశ్ముఖ్.. ఇంటికెళ్లక ఏం జరిగిందో తెలుసా అంటూ ఫన్నీ వీడియోని షేర్ చేసింది జెనిలియా అమెరికాలో రచ్చ రచ్చ చేస్తున్న ‘జాతిరత్నాలు’ కూతురి కోసం చికెన్ వండిన యాంకర్ రవి View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Swapna Cinema (@swapnacinema) -
హల్ చల్ చేస్తున్న ‘జాతిరత్నాలు’ స్పెషల్ సాంగ్
చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా ‘జాతిరత్నాలు’. కేవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా .. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తుంది.ముఖ్యంగా ఈ మూవీలోని కామెడీ సరికొత్త వినోదాన్ని పంచింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ‘అర్రెరెరె జాతిరత్నాలు..ఎన్నడు చూడని నవ్వుల వర్షాలు..’అనే స్పెషల్ సాంగ్ని వైజయంతి నెట్వర్క్ సంస్థ తన యూట్యూబ్లో షేర్ చేసింది. రామ్ మిర్యాల పాడిన ఈ పాట సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. ఈ పాటకు సంబంధించిన వీడియోలో సినిమా ప్రమోషన్స్కు సంబంధించిన విజువల్స్ని పంచుకున్నారు. స్వప్న సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రంలో హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా, ఇతర కీలక పాత్రల్లో బ్రహ్మానందం, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, బ్రహ్మజీ, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. చదవండి: చిట్టీ అని పిలుస్తుంటే భలేగా ఉంది ‘జాతి రత్నాలు’ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ -
చిట్టీ అని పిలుస్తుంటే భలేగా ఉంది
చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద ‘హౌస్ఫుల్ బోర్డులు’ వెలిశాయంటే అది ‘జాతిరత్నాలు’ సినిమా వల్లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీలో హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతోపాటు తెలుగు ప్రేక్షకుల మది దోచుకున్న ఫరియా తన సంతోషాన్ని.. సక్సెస్ను సాక్షితో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... ‘మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకోవడం ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి దొరికే అదృష్టం. ప్రస్తుతం ఈ సక్సెస్ని ఆస్వాదిస్తున్నా. సినిమా చేస్తున్నప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. తెలుగు సినిమాల్లో ఎప్పటికి గుర్తుండిపోయేలా తీసిన ‘మహానటి’ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ‘జాతిరత్నాలు’ సినిమాకి నిర్మాత కావడంతో మరో ఆలోచన లేకుండా వెంటనే ఈ సినిమాను ఒప్పుకున్నా. హైదరాబాద్ నగరంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఎన్నో మరచిపోలేని అనుభూతులు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నా చదువంతా ఇక్కడే పూర్తిచేశా. ప్రస్తుతం బయట కూడా అందరూ నన్ను చిట్టీ (సినిమాలోని పాత్రపేరు) అని పిలుస్తుంటే కొత్తగా ఉంది. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందించిన ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చా. మంచి ఆర్టిస్ట్గా నిలవాలనే ఆశయంతో నా ప్రయత్నాలను ఎప్పుడూ ఆపలేదు. ఇంతకు మందు థియేటర్ ఆర్టిస్ట్గా కూడా చేశాను. మొదటి నుంచి నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. చాలా వాటిలో ప్రావీణ్యం ఉంది. ముఖ్యంగా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ‘హైదరాబాద్ డ్యాన్స్ ఫెస్టివల్’లో భాగంగా నిర్వహించే ఎన్నో ఈవెంట్లలో పాల్గొన్నాను. అల్లు అర్జున్ డ్యాన్స్లంటే ఎంతో ఇష్టం. జాతిరత్నాలు సక్సెస్తో నా బాధ్యత మరింత పెరిగింది. -
త్వరలోనే సీక్వెల్ ఉంటుంది
‘‘జాతి రత్నాలు’ సినిమా చూడమని నా స్నేహితులు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఉండటం వల్ల చూడలేకపోయాను. నవీన్, ప్రియదర్శి, రాహుల్ దగ్గర ఎంతో కళ ఉంది.. ఇప్పుడు వారికి సమయం వచ్చింది’’ అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘‘థియేటర్లలో నవ్వులు పూయించేందుకు చేసిన మా ప్రయత్నం ఫలించింది’’ అన్నారు అనుదీప్. ‘‘చిత్రం భళారే విచిత్రం’ విడుదలైనప్పుడు వచ్చిన క్రేజ్ని మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను’’ అని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. ‘‘త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది’’ అన్నారు నవీన్ పొలిశెట్టి. -
‘జాతి రత్నాలు’ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో అనుదీప్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘జాతి రత్నాలు’. ఉప్పెన తర్వాత ఆ స్థాయిలో బాక్స్ఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సినిమాగా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలై ఊహించని స్థాయాలో వసూళ్లను రాబడుతోంది. వినోదమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ల్రాలతో పాటు ఓవర్సీస్లోనూ సత్తా చాటుతోంది. మొదటి వారం పూర్తి కాక ముందే అర మిలియన్ డాలర్ల మార్క్ను సాధించి, మిలియన్ రేసులోకి అడుగుపెట్టి నిర్మాతలకు కాసుల పంట కురిపిస్తోంది. మార్చి 11న శివరాత్రి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనుదీప్..జాతిరత్నాలు సీక్వెల్పై వస్తోన్న వార్తలపై స్పందించారు. తప్పకుండా జాతిరత్నాలు సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సినిమాతో అనుదీప్ దర్శకుడిగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందే అనుదీప్కు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో హీరోకు సమానంగా డైరెక్టర్కు సైతం ఇంత పాపులారీటి రావడం అనుదీప్కే సొంతమైందని సినీ ప్రేక్షకులు అంటున్నారు. తనదైన కామెడీ పంచులతో విపరీతమైన క్రేజ్ను సంపాదించుకున్నాడు. స్వప్న సినిమాస్ బ్యానర్పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకు రథన్ సంగీతం అందించారు. నవీన్కు జోడీగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి : ఈ చిన్నసినిమా ఏకంగా బాహుబలి రికార్డునే బీట్ చేసింది (అలా హిట్టు పడగానే ఇలా రేటు పెంచిన 'జాతిరత్నం'!) -
బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన జాతిరత్నాలు!
హైదరాబాద్ : టాలీవుడ్లో బాహుబలి విడుదల తర్వాత నాన్ బాహుబలి రికార్డులు గురించే మాట్లాడుకుంటున్నాం. అలాంటిది బాహుబలి రికార్డునే బీట్ చేస్తే…అది కూడా ఒక చిన్న సినిమా అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం అండీ బాబు. ఇటీవల విడుదలైన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ టాక్తో భారీ కలెక్షన్ల వైపు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లో థియేటర్లకు అడ్డాగా పేరున్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘జాతిరత్నాలు’ మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. ఈ క్రమంలో అది ‘బాహుబలి: ది కంక్లూజన్’ వసూళ్లను కూడా అధిగమించింది. 2017 ఏప్రిల్లో విడుదలైన ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ థియేటర్లో తొలి వారం రూ.36 లక్షల గ్రాస్ వరకు కలెక్ట్ చేసి అప్పటి వరకు ఉన్నపాత రికార్డులను చెరిపేసి తన పేరుని నమోదు చేసుకుంది. ఈ రికార్డును గత ఏడాది సంక్రాంతి సినిమాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు అధిగమించాయి. అల వైకుంఠపురములో 40.83 లక్షల గ్రాస్తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సరిలేరు నీకెవ్వరు దానికి చేరువగా వచ్చి తృటిలో మొదటి స్థానాన్ని చేజార్చుకొని రెండో స్థానంలో ఉంది. ఆ చిత్రం 40.76 లక్షల రూపాయిలు కొల్లగొట్టింది. ప్రస్తుతం దేవి థియేటర్లో ఆడుతున్న ‘జాతిరత్నాలు’ తొలి వారం రోజుల్లో రూ.38.63 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి బాహుబలిని నాలుగో స్ధానాని వెనక్కి నెట్టింది. ఫలితంగా మూడో స్థానానికి చేరుకుంది. కానీ ‘జాతిరత్నాలు’ లాంటి చిన్న సినిమా పెద్ద సినిమాలతో ధీటుగా వసూళ్లు రాబట్టి టాప్-5లో నిలవడం అంటే మామూలు విషయం కాదని సీని పండితులు అంటున్నారు. ( చదవండి : జాతి రత్నాలు ...కురిపిస్తున్నారు కాసులు ) -
జాతి రత్నాలు మూవీ సక్సెస్ మీట్ ఫోటోలు
-
అలా హిట్టు పడగానే ఇలా రేటు పెంచిన 'జాతిరత్నం'!
'ఏం సక్కగున్నావ్రో.. నా సొట్ట సెంపలోడా.. ఏం సిక్కగున్నవ్రో.. నా సిట్టి జుంపాలోడ..' అంటూ ఈ పాటను మరోసారి పాడుకుంటున్నారు అమ్మాయిలు. ఇంతకీ పడుచుల మనసు దోచిన ఆ సుందరాగుండు ఎవరనుకుంటున్నారు? యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. అతడు ప్రధాన పాత్రలో నటించిన జాతి రత్నాలు సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిలేరియస్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. చాలా థియేటర్లలో ఇప్పటికీ హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే రూ.25 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చాలా రోజుల తర్వాత కడుపుబ్బా నవ్వుకున్నాం అంటూ ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూ ఇస్తుండటంతో చిత్రయూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. మొత్తానికి ఈ సినిమా నవీన్ పొలిశెట్టి కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో నవీన్ తన రెమ్యునరేషన్ను పెంచేశాడట. ఎలాగో పలువురు దర్శక, నిర్మాతలు నవీన్తో సినిమా తీయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో తను అడిగినంత ఇవ్వాలని కండీషన్ పెడుతూ క్రేజ్ను క్యాష్ను చేసుకుంటున్నాడట. ఇప్పటికే 'రారా కృష్ణయ్య' దర్శకుడు మహేశ్తో సినిమా చేసేందుకు నవీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో నటించేందుకు నవీన్ రూ.2 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిర్మాతలు కూడా అంత మొత్తం ఇచ్చుకునేందుకు వెనుకాడలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టితో జోడీ కట్టనుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. చదవండి: యాక్సిడెంట్ అయ్యింది. లేకపోతే జాతిరత్నాలు పదిసార్లు చూసేవాడిని సితూ పాప నువ్వు అప్పుడే ఎదగకు ప్లీజ్.. -
శ్రీవారిని దర్శించుకున్న 'జాతి రత్నాలు' టీమ్
సాక్షి, తిరుపతి: జాతి రత్నాలు సినిమా సక్సెస్ కావడంతో ఫుల్ హ్యాపీగా ఉందీ టీమ్. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జాతి రత్నాలు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సొతం చేసుకుంది. హీరోల కామెడీకి థియేటర్లోకి వెళ్లిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుని బయటకు వస్తున్నారు. మొత్తానికి సినిమా సూపర్గా ఉందంటూ అంతటా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో జాతిరత్నాలు టీమ్ సంతోషంలో మునిగి తేలుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా హీరోహీరోయిన్లు నవీన్, ఫరియా అబ్దుల్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. కాగా పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిన్న సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించగా స్వప్నా సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించాడు. చదవండి: ఆంధ్రజ్యోతిపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి -
ఆయన లేకపోతే జాతిరత్నాలు లేదు
‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’ సినిమాల కన్నా ‘జాతిరత్నాలు’ సినిమాకు నాగీ అన్న (నాగ్ అశ్విన్) ఎక్కువ కష్టపడ్డారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు’’ అని సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహార్ అన్నారు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో కేవీ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా ‘జాతిరత్నాలు’ సినిమాటోగ్రాఫర్ మనోహార్ మాట్లాడుతూ– ‘‘నాది నెల్లూరు. నాగీ (నాగ్ అశ్విన్) అన్న కార్పొరేట్, వెడ్డింగ్ వీడియోస్ను డైరెక్ట్ చేసే ప్రాసెస్లో ఉన్న సమయంలో చాలా వర్క్ నేర్చుకున్నా. ‘ఎవడే సుబ్రమణ్యం’ సమయంలో నేను దర్శకత్వ ప్రయత్నాలు చేశాను. డైరెక్షన్లోకి వెళితే సినిమాటోగ్రఫీ చేయలేవని నాగీ, స్వప్న కౌన్సిలింగ్ ఇచ్చారు. ‘మహానటి’ సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్గా చేశాను. ‘అమ్మ దీవెన’ చిత్రంతో పాటు ఓ చిన్న సినిమాకు కెమెరామ్యాన్గా పని చేశాను. తర్వాత చేసిన ‘జాతిరత్నాలు’ సినిమా పెద్ద హిట్గా నిలిచింది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. ఈ సమావేశంలో ‘జాతిరత్నాలు’ ఎడిటర్ అభినవ్ మాట్లాడుతూ– ‘‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. వెడ్డింగ్ ఫిల్మ్స్, కమర్షియల్ యాడ్స్ని సరదాగా షూట్ చేసి ఎడిట్ చేసేవాణ్ణి. ఏడాదిన్నర క్రితం ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ అనే వెబ్ సిరీస్ ఎడిటర్గా నాకు పెద్ద ప్రాజెక్ట్. దాని తర్వాత ‘జాతిరత్నాలు’ చిత్రానికి ఎడిటర్గా చేశాను. డైరెక్టర్ కావాలన్నది నా లక్ష్యం. ఎడిటర్లలో డైరెక్టర్స్ అయినవారూ ఉన్నారు. ‘రాజూ హిరానీ, ఆంథోనీ, రాజమౌళి లాంటి వాళ్ళకు ఎడిటింగ్లో మంచి స్కిల్ ఉంది. కథను ఎలా చెప్పాలి?, క్యారెక్టర్స్ను ఎలా చూపించాలి? అనేవి ఎడిటింగ్ ద్వారానే మరింత తెలుస్తాయి’’ అన్నారు. చదవండి: దర్శకుడి హాస్పిటల్ బిల్ కట్టిన విజయ్ సేతుపతి నవ్వులు పూయించిన ‘జాతి రత్నాలు’ -
‘జాతిరత్నాలు’ డైరెక్టర్తో వైష్ణవ్ తేజ్ సినిమా
డైరెక్టర్గా అనుదీప్ కేవీ, హీరోగా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాలతోనే టాలీవుడ్కు బ్లక్బస్టర్ హిట్ అందించారు. ఫుల్ లెన్త్ కామెడీగా అనుదీప్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ మూవీ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుండగా, వైష్ణవ్ ‘ఉప్పెన’ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్ రాబట్టి 100 కోట్ల క్లబ్లో చేరింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ మూవీ సెక్సెస్లో మునిగి తెలుగుతూ ఫుల్ జోష్ మీద ఉన్నారు. అయితే అనుదీప్-వైష్ణవ్ కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ పడిందట. ఇప్పటికే నిర్మాత బీవీఎస్ఎస్ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్కు అడ్వాన్స్ కింద కొంత మొత్తం కూడా చెల్లించాడట. ప్రస్తుతం వైష్ణవ్ క్రిష్ జాగర్లమూడితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన వెంటనే అనుదీప్ వైష్ణవ్ మూడవ సినిమాను సట్స్పైకి తీసుకేళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా మార్చి 11న విడుదలై కలెక్షన్ వర్షం కురిపిస్తుండగా ఇక ఫిబ్రవరి 12న విడుదలైన ‘ఉప్పెన’ బ్లక్బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: అప్పుడే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ జాతి రత్నాలు ట్రైలర్ చూసి సరదాగా నవ్వుకోండి -
చిల్లర ట్రిక్స్ ప్లే చేయొద్దు: బన్నీ వాసు ఫైర్
'చావు కబురు చల్లగా' సినిమా ఓటీటీ బాట పడుతుందనే ఊహాగాలపై సీరియస్ అయ్యాడు నిర్మాత బన్నీ వాసు. సినిమా రిలీజ్ అవకముందే ఓటీటీలోకి వెళ్తుందని అసత్య ప్రచారాలు చేస్తున్నవారి మీద గరమయ్యాడు. "ఇది సందర్భమో కాదో, తెలీదు.. ఏ సినిమా బాగా ఆడినా ఇండస్ట్రీలో అందరం హ్యాపీగా ఫీలవుతాం. ఈమధ్య రెండు సినిమాలు(శ్రీకారం, జాతిరత్నాలు) కూడా చాలా బాగా ఆడుతున్నాయి. నాకు బుక్ అయిన థియేటర్లలో నేను పక్కకు జరిగి మరీ ఆ సినిమాలకు ఇస్తున్నాం. అలాంటి మంచి వాతావరణం ఇండస్ట్రీలో ఉంది. కానీ ఈ రెండ్రోజుల్లో నేను బాగా హర్టైన విషయం ఏంటంటే.. వాళ్లు కొత్తగా వచ్చారో తెలీదు. ఎన్ని సినిమాలు చేశారో తెలీదు.. కానీ, ఈ సినిమా రెండు వారాల్లో ఓటీటీలోకి వెళ్లిపోతుందంటూ పీఆర్వోల ద్వారా తప్పుడు వార్తను జనాల్లోకి పాస్ చేస్తున్నారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. వాళ్ల పేరు చెప్పడం నాకిష్టం లేదు. హెల్దీగా పోటీపడుదాం. మీరు మంచి సినిమాలు తీయండి, మేము మంచి సినిమాలు తీస్తాను. ఎవరి సినిమా బాగుంటే వారిది ఆడుతుంది. ఎలాగో సినిమా బాగుంటే మీడియా వాళ్లు మమ్మల్ని పొగుడుతారు, లేదంటే ఏకుతారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ రాజకీయాల్లో చూశాం. వారు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లుగా.. చావు కబురు చల్లగా సినిమా రెండు వారాల్లోనో, మూడు వారాల్లోనో ఓటీటీలో వచ్చేది కాదు. ఒకవేళ ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటే కోవిడ్ టైమ్లోనే ఆహాకు ఇచ్చేవాడిని. కానీ మాకు థియేటర్ అంటేనే ఇష్టం. మీరు చిల్లర ట్రిక్స్ ప్లే చేయొద్దు.. ఈ సినిమా థియేటర్స్లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఆలోచిస్తాం" అని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు. కాగా, చావు కబురు చల్లగా సినిమా మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. చదవండి: 'అక్టోబరు నుంచి డేట్స్ ఉంచమని ఫోన్ చేశాను' -
జాతి రత్నాలు ...కురిపిస్తున్నారు కాసులు
సాక్షి హైదరాబాద్ : చిన్న సినిమాగా విడుదలైన ‘జాతి రత్నాలు’ చిత్రం ప్రతీ చోట పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఊహించని స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. వినోదమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ల్రాలతో పాటు ఓవర్సీస్లోనూ సత్తా చాటుతోంది. ఇక యూఎస్లో అయితే ఈ మధ్య కాలంలో ఏ చిత్రం నమోదు చేయని రికార్డులను నమోదు చేస్తోంది. మొదటి వారం పూర్తి కాక ముందే అర మిలియన్ డాలర్ల మార్క్ను సాధించి, మిలియన్ రేసులోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం అక్కడి పంపిణీదారులకు కాసుల పంట కురిపిస్తోంది. చిన్న సినిమా ...పెద్ద విజయం డైరక్టర్ అనుదీప్ కేవి సినిమా అంతటా ఒకే వేగాన్ని కొనసాగిస్తూ, వినోద అంశంపై ఏ మాత్రం రాజీపడకుండా , కథకు సమాన ప్రాధాన్యతను ఇచ్చాడనే చెప్పాలి. ముఖ్యంగా, సెకండ్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు బాగా వచ్చాయి. స్వప్నా సినిమా బ్యానర్లో నాగ్ అశ్విన్ నిర్మించిన నిర్మాణ విలువలు ఎక్కడా కూడా ఇది చిన్న సినిమా అనే ఆలోచనను రానివ్వలేదు. రాధన్ సంగీతం ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచింది. కరోనా కారణంగా జనాలు లేని థియేటర్లకు హౌస్ పుల్బోర్డులు పెట్టించిన ఘనత ‘ జాతి రత్నాల’కే దక్కింది. -
‘జాతి రత్నాలు’ హీరోయిన్కు బంపర్ ఆఫర్.. ఏకంగా..!
మొదటి సినిమాతోనే భారీ హిట్ను ఖాతాలో వేసుకుంది ‘జాతి రత్నాలు’ మూవీ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా(చిట్టి). ఫుల్లెన్త్ కామెడీతో సాగిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఈ చిత్రంలో హీరో నవిన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, హీరోయిన్ ఫరియాల నటనపై ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఈ మూవీ విడుదలకు ముందే హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ప్రేక్షకుల్లో క్రేజ్ను సంపాదించుకుంది. ట్రైలర్ విడుదల సమయంలో డార్లింగ్ ప్రభాస్ ఆమెను చూసి ఏంటి హీరోయిన్ ఇంత హైట్ ఉందంటు కామెంట్ చేయడంలో ఒక్కసారిగా అందరి చూపు ఆమెపై పడింది. ఇక మూవీ విడుదల అయ్యాక ఆమెకు మరింత క్రేజ్ పెరిగిపోయింది. డెబ్యూ మూవీతోనే తన అందం, అభినయంతో పాటు యాక్టింగ్ స్కిల్స్తో అందరిని కట్టిపడేసింది ఫరియా. దీంతో ఆమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నట్లు టాక్. ఈ క్రమంలో మాస్ మహారాజా రవితేజ, ఫరియాకు బంపర్ ఆఫర్ ఇచ్చాడట. తన తదుపరి చిత్రంలో ఫరియాకు హీరోయిన్గా అవకాశం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఆయన ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో ఫరియా అబ్దుల్లాని హీరోయిన్గా తీసుకుంటే బాగుంటుందని దర్శక నిర్మాతలతో రవితేజ చెప్పినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన సూచన మేరకు దర్శక నిర్మాతలు కూడా ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఫరియా అబ్దుల్లా కెరీర్కి ఇది సూపర్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు. చదవండి: ఈ హీరోయిన్ నాకన్నా పొడవుగా ఉందేంటి!: ప్రభాస్ డ్యాన్స్ ప్లస్ యాక్షన్ కోసం ఇటలీలో ఖిలాడి -
వ్యాక్సిన్ వద్దు.. మీ సినిమా చాలన్నారు
‘‘కమెడియన్, హీరో, విలన్ అని కాదు... ఓ మంచి నటుడిగా నన్ను ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటే చాలు. అయినా కామెడీ చేయడం అంత సులువేం కాదు’’ అన్నారు ప్రియదర్శి. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో అనుదీప్ దర్శకత్వం వహించిన సినిమా ‘జాతిరత్నాలు’. స్వప్నా సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను చేసిన శేఖర్ పాత్రకు ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. సినిమాను, నా పాత్రను అభినందిస్తూ చాలామంది ఫోన్లు, మెసేజ్లు చేస్తున్నారు. ఒకరైతే వ్యాక్సిన్ వద్దు. మీ సినిమా చాలు అన్నారు. సరదాగా అనిపించింది. మొదట రాహుల్ రామకృష్ణకు కథ నచ్చి నన్ను కూడా వినమన్నాడు. అనుదీప్ ఈ కథ చెబుతున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను. రెండేళ్ళుగా నవీన్ నాకు తెలుసు. పదేళ్లుగా రాహుల్ తెలుసు. మా స్నేహం స్క్రీన్ పై ప్రతిబింబించిందని అనుకుంటున్నా. నాగ్ అశ్విన్ , స్వప్న అక్క బాగా సహాయం చేశారు. ‘మొదట్లో ఇండస్ట్రీలో ప్లేస్ కోసం ప్రయత్నించాను. ‘టెర్రర్’లో విలన్ గా చేశా. ఆ తర్వాత ‘పెళ్ళిచూపులు’తో కమెడియన్ గా మారాను. నాకు ఎస్వీఆర్, కోట శ్రీనివాసరావు, ప్రకాశ్రాజ్గార్ల యాక్టింగ్ అంటే ఇష్టం. నా భార్య రైటర్. తనతో నా సినిమాలు కొన్ని డిస్కస్స్ చేస్తుంటా. ప్రస్తుతం రెండు సినిమాలతో పాటు ఓ వెబ్సిరీస్ చేస్తున్నా. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. డైరెక్షన్ ఆలోచన ఉంది. కానీ డైరెక్షన్ చాలా టఫ్. భవిష్యత్తులో చూడాలి’’ అని అన్నారు. -
కన్నీళ్లు పెట్టుకున్న నవీన్ పొలిశెట్టి..
-
కన్నీళ్లు పెట్టుకున్న జాతిరత్నం నవీన్ పొలిశెట్టి
నవీన్ పొలిశెట్టి,రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోగా నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. మహా శివరాత్రి కానుకగా గురువారం (మార్చి 11)న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది. ముగ్గురు జాతిరత్నాలు చేసిన కామెడీకి ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో అందరిని ఆకర్షించిన నవీన్.. జాతి రత్నాలు సినిమాతో మరో సారి నవీన్ తన ప్రతిభను కనబర్చాడు. ఇక సినిమా విడుదల అయ్యి సక్సెస్ టాక్ సంపాదించడంతో చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీగా ఉంది. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి చాలా సంతోషంగా ఉన్నాడు. మార్నింగ్ షోకి పాజిటివ్ రెస్పాన్స్ రాగానే ఆనందంతో నాగ్ అశ్విన్ ను గట్టిగా హత్తుకుని చాలా సేపు అలాగే ఉండి పోయాడు. ఆనందంతో కన్నీరు కూడా పెట్టుకున్నాడు. ఇక నవీన్ ఎమోషనల్ కావడంతో నాగ్ అశ్విన్ అతన్ని మరింత గట్టిగా హత్తుకొని భుజం తట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ.. స్పాంటినియస్గా పంచ్లు వేసే నవీన్.. కన్నీరు పెట్టుకోవడంతో చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. నవీన్ చాలా సెన్సిటీవ్ అని కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ‘జాతి రత్నాలు’ టీమ్కి భారీ షాక్, తొలి రోజే ఇలా... ‘జాతి రత్నాలు’ మూవీ రివ్యూ -
‘జాతిరత్నాలు’ టీమ్కి భారీ షాక్, తొలి రోజే ఇలా...
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన చిత్రం‘జాతిరత్నాలు’. మహాశివరాత్రి సందర్భంగా గురువారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీకి ప్రేక్షకులు పడిపడి నవ్వారు. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘జాతి రత్నాలు’టీమ్కు భారీ షాక్ తగిలింది. పైరసీ భూతం జాతి రత్నాలను కూడా వదలలేదు. సినిమా విడుదలైన గంటల్లోనే పైరసీ వీడియో బయటకు వచ్చేసింది. దీంతో కలెక్షన్లపై ప్రభావం ఉండే ప్రమాదం ఏర్పడింది. కొన్ని వెబ్సైట్లు ‘జాతిరత్నాలు’ ఫుల్ మూవీని డౌన్లోడ్ లింక్ను గురువారమే పెట్టెశాయి. ఇది తమిళ్ రాకర్స్ చేసిన పనే అని కొంతమంది అంటున్నారు. అందుకే ఆ సైట్తో పాటు మరికొన్ని సైట్లల్లో కూడా ఈ మూవీ దర్శనమిచ్చింది. దీంతో చాలా మంది ఈ సైట్లను ఆశ్రయించే ప్రమాదం ఉంది. పైరసీ భూతం ఎఫెక్ట్ ‘జాతి రత్నాలు’కలెక్షన్స్ ఏ మేరకు ఉంటుందో చూడాలి. చదవండి: ‘జాతి రత్నాలు’ మూవీ రివ్యూ జాతిరత్నాలు.. మైండ్ స్విచ్చాఫ్ చేసుకొని చూడండి : బన్నీ -
జాతిరత్నాలు.. మైండ్ స్విచ్చాఫ్ చేసుకొని చూడండి : బన్నీ
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘జాతిరత్నాలు’. అనుదీప్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఈ సినిమాపై స్పందించారు. ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ ఎప్పుడూ నవ్వలేదంటూ చిత్ర యూనిట్పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా సినిమాకు పనిచేసిన వాళ్లలో ఒక్కొక్కరిని ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశాడు. 'నిన్న రాత్రి జాతిరత్నాలు చూశాను. నవీన్ పొలిశెట్టి అద్భుతంగా నటించాడు. అప్కమింగ్ హీరోగా నవీన్ నటన ఆకట్టుకుంది. రాహుల్ చాలా సునాయాసంగా నటించాడు. ప్రియదర్శి, ఫరియా నటన ఎంతో ప్రశంసనీయంగా ఉంది. ఈ సినిమాను నిర్మించిన నాగ్ అశ్విన్, స్వప్నా దత్, ప్రియాంక దత్లకు అభినందనలు, రథన్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లందరికి నా అభినందనలు. ఇక చివరగా డైరెక్టర్ అనుదీప్కి మా అందరిని ఇంత బాగా నవ్వించినందుకు స్పెషల్ థ్యాంక్స్. మైండ్ స్విచ్ఛాఫ్ చేసుకొని అందరూ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి' అంటూ ట్వీట్ చేశారు. నిన్న (మార్చి11)న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. చదవండి : (‘జాతి రత్నాలు’ మూవీ రివ్యూ) Watched #JathiRatnalu last night . Congratulations to the whole team. Hilarious movie. I haven’t laughed soo much in recent years that much. @NaveenPolishety rocked the show with stellar performance. Rise of a new age stunning performer. @eyrahul was brilliant and effortless. — Allu Arjun (@alluarjun) March 12, 2021 And last and the most important my respect to the director @anudeepfilm for entertaining everyone. Everybody “ switch off your brains , watch the movie and enjoy the funnnn “ — Allu Arjun (@alluarjun) March 12, 2021 -
జాతి రత్నాలు సక్సెస్ సెలబ్రేషన్ ఫోటోలు
-
‘జాతి రత్నాలు’ మూవీ రివ్యూ
టైటిల్ : జాతి రత్నాలు జానర్: కామెడీ ఎంటర్టైనర్ నటీనటులు : నవీన్ పోలిశెట్టి, ఫారియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ, బ్రహ్మానందం, నరేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు నిర్మాణ సంస్థ : స్వప్న సినిమాస్ నిర్మాతలు : నాగ్ అశ్విన్ దర్శకత్వం : అనుదీప్ సంగీతం : రథన్ సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహర్ కెమెరా ఎడిటింగ్ : అభినవ్ రెడ్డి దండ విడుదల తేది : మార్చి 11, 2021 కొన్ని సినిమాలపై విడుదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి సినిమానే ‘జాతి రత్నాలు’. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే దానిపై చర్చ మొదలయింది. టైటిల్ డిఫరెంట్గా ఉండడం, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించడంతో ‘జాతి రత్నాలు’మూవీపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సూపర్ హిట్ కావడంతో ఆ అంచనాలు తారాస్థాయికి పెరిగాయి. ఇక ప్రొమోషన్స్ కూడా చాలా వినూత్నంగా చేసారు. ఇన్ని అంచనాల మధ్య మహాశివరాత్రి కానుకగా గురువారం(మర్చి 11)న విడుదలైన ‘జాతిరత్నాలు’ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ శ్రీకాంత్ (నవీన్ పోలిశెట్టి) మెదక్ జిల్లా జోగిపేట గ్రామానికి చెందిన లేడీస్ ఎంపోరియం ఓనర్ (తనికెళ్ళ భరణి) కొడుకు. అతనికి ఇద్దరు స్నేహితులు రవి (రాహుల్ రామకృష్ణ), శేఖర్ (ప్రియదర్శి). ఈ ముగ్గురు అల్లరిచిల్లరగా తిరుగుతుంటారు. వీరంటే ఊళ్లో వాళ్లకి చిరాకు. తన తండ్రి నడిపే లేడీస్ ఎంపోరియంలో శ్రీకాంత్ పని చేయడంతో అతన్ని అందరూ‘లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్’అని పిలుస్తుంటారు. అలా పిలిపించుకోవడం తనకు ఇష్టం లేదని, హైదరాబాద్కి వెళ్లి ఉద్యోగం చేస్తానని బ్యాగు సర్దుకొని సిటీకి బయలుదేరుతాడు. అతనితో పాటు ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా హైదరాబాద్కు వస్తారు. అక్కడ శ్రీకాంత్ చిట్టి (ఫరియా)తో ప్రేమలో పడతాడు. కట్చేస్తే.. ఈ ముగ్గురు అనుకోకుండా ఓ హత్య కేసులో అరెస్ట్ అవుతారు. అసలు ఆ హత్య కేసుకి, ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ హత్య చేసిందెవరు? ఈ కేసు నుంచి ముగ్గురు ఎలా తప్పించుకున్నారు? అనేదే మిగతా కథ. నటీనటులు ఈ సినిమా మొత్తం నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రల చుట్టే తిరుగుతంది. అమాకత్వం గల శ్రీకాంత్ పాత్రలో నవీన్ ఒదిగిపోయాడు. తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు. అమాయకత్వంలోనే హీరోయిజం చూపించి మెప్పించాడు. ఇక ప్రియదర్శి, రామకృష్ణ ఎప్పటిలానే ఆకట్టుకున్నారు. హీరోయిన్ ఫారియా అబ్దుల్లా చిట్టి పాత్రలో క్యూట్గా కనిపించింది. నటన పరంగా కూడా పర్వాలేదు. మురళీశర్మ రొటీన్ గానే కనిపించాడు. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం పాత్రల నిడివి తక్కువే అయినప్పటికీ తమదైన కామెడీ పంచ్లతో నవ్వించారు. విశ్లేషణ అమాయకత్వంతో కూడిన కామెడీ ఎప్పుడూ ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. 'జాతిరత్నాలు' అలాంటి చిత్రమే. ముగ్గురు అమాయకులు.. ఒక సీరియస్ క్రైమ్లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథ. సినిమా మొత్తాన్ని వినోదభరితంగా మలిచాడు దర్శకుడు అనుదీప్. సింపుల్ కథను మెయిన్ లీడ్ పై అశ్లీలం లేని కామెడీతో బాగా డీల్ చేసాడు. అలాగే తాను రాసుకున్న కామెడీ ఎపిసోడ్స్ చివరి వరకూ ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే కొచ్చి సన్నివేశాల్లో కామెడీ మరీ ఓవర్ అయినట్లు అనిపిస్తుంది. అలాగే కేసు విచారణను డీల్ చేసిన విధానం కూడా అంత కన్విన్స్గా అనిపించదు. ఎక్కడో లాజిక్స్ మిస్సయ్యారనే భావన కలుగుతుంది. అలాగే సెకండాఫ్లో కథ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఫస్టాప్లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు, పంచ్ డైలాగ్స్మంచి ఫన్ ను జెనరేట్ చేస్తాయి. ముఖ్యంగా బ్రహ్మానందంతో వచ్చే కోర్టు సీన్ అయితే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు మరో జాతి రత్నం సంగీత దర్శకుడు రథన్. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. సిద్దం మనోహర్ కెమెరా పనితనం కూడా బాగుంది. ఎడిటర్ అభినవ్ రెడ్డి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ నవీన్, రాహుల్, ప్రియదర్శి నటన అశ్లీలం లేని కామెడీ రథన్ సంగీతం మైనస్ పాయింట్స్ కథలో కొత్తదనం లోపించడం సెకండాఫ్లో కొన్ని సాగదీత సీన్లు -
అంతకు మించిన పేమెంట్ లేదు!
‘‘నేను చేసే ప్రతి సినిమాలో కొత్త పాయింట్ ఉందో లేదో చూసుకుంటాను. అన్ని రకాల పాత్రలు, డిఫరెంట్ జానర్ సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అని నవీన్ పొలిశెట్టి అన్నారు. కేవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. నవీన్ మాట్లాడుతూ – ‘‘‘జాతిరత్నాలు’ కథ విన్నప్పుడు ఎంజాయ్ చేశాను. సాధారణంగా గొప్పవారిని జాతిరత్నాలు అంటారు. కానీ మా ‘జాతిరత్నాలు’ సెటైరికల్ మూవీ. మా సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుకుంటూ థియేటర్ల నుంచి వస్తే నాకు అంతకు మించిన పేమెంట్ లేదు. నేను ముంబైలో ఉన్నప్పుడు నా వీడియోలు నాగీకి పంపేవాడిని. మాలాంటి కొత్తవారికి ఇలాంటి నిర్మాతలు అవకాశాలు ఇస్తే ప్రతి ఇంట్లో ఓ నవీన్ ఉంటాడు. నాకు యాక్సిడెంట్ అయ్యింది. లేకపోతే ‘జాతిరత్నాలు’ను థియేటర్లో పదిసార్లు చూసేవాడిని’ అని ఓ ప్రేక్షకుడు ట్వీట్ చేశాడు. అతనికి సినిమా చూపిస్తే, హిలేరియస్గా ఉందని చెప్పాడు’’ అని అన్నారు. -
తెలుగు ప్రేక్షకుల ఆదరణ ప్రత్యేకమైంది
‘‘తెలుగు ప్రేక్షకుల ఆదరణ ప్రత్యేకమైంది.. వారి ప్రోత్సాహంతోనే మా చిత్రాలు విజయవంతమవుతున్నాయి.. అభిమానులు మా కోసం ఎదైనా చేయడానికి ముందుకు వస్తున్నారు’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఆదివారం ‘జాతిరత్నాలు’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఈ రోజు నేను ఈ స్థాయిలో ఇక్కడ నిలబడ్డానంటే కారణం నాగ్ఆశ్విన్. అవకాశాలు రావడానికి సమయం రావాలి.. ఆ టైమ్ ఈరోజు వచ్చింది. నాడు మేము కన్న కలలు నిజమయ్యాయి. ‘జాతిరత్నాలు’ సినిమా ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే విధంగా ఉంటుంది.. యూనిట్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ–‘‘విజయ్, నవీన్ ఎలాంటి పాత్రలైనా చేయగలరు. ఒకే నాణేనికి రెండు వైపులా ఉన్నట్లు ఉంటారు. రాహుల్, ప్రియదర్శి, ఫరియా కూడా బాగా నటించారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘విజయ్, నేను థియేటర్ వర్క్షాప్లో పదేళ్ల క్రితం కలుసుకున్నాం. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విజయ్ మా సినిమా ఫంక్షన్కు అతిథిగా రావడం ఆనందంగా ఉంది. ఎన్ని ఓటీటీ ఆఫర్లు వచ్చినా ఈ సినిమాను థియేటర్స్లోనే విడుదల చేస్తున్న నిర్మాతలకు థ్యాంక్స్. ‘జాతిరత్నాలు’ ట్రైలర్ని ప్రభాస్గారు విడుదల చేయడంతో మా సినిమా డార్లింగ్ రత్నాలు అయ్యింది. ఇప్పుడు విజయ్ రాకతో రౌడీ రత్నాల ఫ్యామిలీలా మారింది. నాగ్ అశ్విన్, ప్రియాంక, స్వప్న నిజమైన రత్నాలు’’ అన్నారు నవీన్. ‘‘జాతిరత్నాలు’ సినిమా ప్రేక్షకులను నవ్విస్తుంది’’ అన్నారు అనుదీప్. ‘‘మేం కూడా మీలో (ఆడియన్స్) నుంచి వచ్చిన వాళ్లమే. మీలో నుంచి కూడా ఇంకా వస్తారు’’ అన్నారు ప్రియదర్శి. ‘‘ఈ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు రాహుల్ రామకృష్ణ. ‘‘నా తొలి సినిమానే పెద్ద బ్యానర్లో చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు ఫరియా. ‘‘వరంగల్ నేల నన్ను తీర్చిదిద్దింది. హైదరాబాద్ వెళ్లి పాటల రచయితగా వరంగల్ పేరు నిలబెడుతున్నాను’’ అన్నారు రచయిత కాసర్లశ్యామ్. -
అందుకే ప్రభాస్ కూల్: నాగ్ అశ్విన్
‘‘అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమా వెళ్తుతుందనే నమ్మకం ఉంది. ‘బాహుబలి’ సినిమా వల్ల కొత్త దారులు ఏర్పడ్డాయి. స్పైడర్మ్యాన్, జేమ్స్బాండ్ వంటి చిత్రాలు మన దగ్గర విడుదలవుతున్నాయి. మన సినిమాలు కూడా ఆ స్థాయిలో అక్కడ రిలీజ్ అయ్యే తరుణం వస్తుంది’’ అని దర్శక -నిర్మాత నాగ్ అశ్విన్ అన్నారు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. కేవీ అనుదీప్ దర్శకుడు. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ చెప్పిన విశేషాలు... ► నాకు జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డిగార్ల సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే ఓ హిలేరియస్ మూవీ చేద్దామనుకున్నాను. అనుదీప్ చేసిన ఓ కామెడీ షార్ట్ఫిల్మ్ చూసి ఓ హిలేరియస్ సినిమా చేద్దామని నేనే అతణ్ణి వెతుక్కుంటూ వెళ్లా. అతను చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో దాన్ని డెవలప్ చేయమని చెప్పాను. అలా ‘జాతిరత్నాలు’ మొదలైంది. ఈ సినిమాలో కామెడీ, స్టోరీ ఐడియా అనుదీప్దే. ఎక్కువకాలం ట్రావెల్ అయ్యాను కాబట్టి నాకు అనిపించిన ఇన్ పుట్స్ కొన్ని ఇచ్చాను. ► విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి నాకు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా నుంచి పరిచయం. విజయ్, నవీన్ ల కాంబినేషన్లోనే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా తీద్దాం అనుకున్నాను. కానీ కుదర్లేదు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ షూటింగ్ సమయంలో నవీన్ కు ‘జాతిరత్నాలు’ కథ పంపా. అతనికి కథ నచ్చింది. నవీన్ ఎలాంటి పాత్ర అయినా చేయగలడు. రాహుల్, ప్రియదర్శి కూడా చాలా బాగా చేశారు. ఒక స్క్రిప్ట్ రాయాలన్నా.. సినిమా తీయాలన్నా బ్రెయిన్ కావాలి. కానీ మంచి కామెడీ తీయాలంటే మాత్రం హార్ట్ ఉండాలి. అనుదీప్కి మంచి హార్ట్ ఉంది. అందుకే సినిమా ఇంత హిలేరియస్గా వచ్చింది. ► ముగ్గురు సిల్లీ ఫెలోస్ ఒక సీరియస్ క్రైమ్లో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా కథ. ‘మనీ మనీ..’, ‘అనగనగా..’ తరహాలో ఔట్ అండ్ ఔట్ కామెడీ. రెండు మూడు టైటిల్స్ అనుకున్న తర్వాత ‘జాతిరత్నాలు’ ఫిక్స్ చేశాం. నవీన్ కు హిందీలో మార్కెట్ ఉంది. కాబట్టి దీన్ని హిందీలో డబ్ చేసే ఆలోచనలో ఉన్నాం. ► నాకు నిర్మాతగా కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశం లేదు. ఒకవేళ మంచి కంటెంట్ సినిమాలు వస్తే స్వప్న సినిమాస్ ద్వారా ప్రోత్సహిస్తాను. ► నా గత చిత్రాలు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’లో హ్యూమర్ ఉంది. అలాగే ప్రభాస్తో నేను చేయబోయే సినిమాలో కూడా కొంత హ్యూమర్ ఉంటుంది. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి. అందుకే సమయం పడుతోంది. జూలైలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. ► ప్రభాస్ దగ్గరకి ఒక పెద్ద స్టార్గా భావించి వెళతాం. కానీ ఆయన సరదాగా ఉంటారు. సినీ లెక్కలు, బాక్సాసీఫ్ ఓపెనింగ్స్ పట్టించుకోరు. సోషల్ మీడియాపై ఆసక్తి చూపించరు. ఎప్పుడైనా మాట్లాడితే మేం చేయాల్సిన సినిమాలు, ఆయన చేస్తున్న ఇతర సినిమాల గురించే మాట్లాడతారు. అందుకే ప్రభాస్ అంత కూల్గా ఉంటారేమో! - ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ -
'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియ అబ్దుల్లా ఫోటోలు
-
జాతి రత్నాలు ట్రైలర్ చూసి సరదాగా నవ్వుకోండి
పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్లో 40 శాతమే వచ్చిందిని ఎమ్టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో. గురువారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ను ప్రభాస్ రిలీజ్ చేశాడు. ఇందులో బీటెక్ విద్యార్థి నవీన్ పొలిశెట్టి ఓ లేడీస్ ఎంపోరియం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈ విషయాన్ని బయట చెప్పుకోవడానికి మాత్రం తెగ సిగ్గుపడుతున్నాడు. ఇక ఓ సన్నివేశంలో అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిపేషన్.. అంటూ రాని ఇంగ్లీష్ను మాట్లాడే ప్రయత్నం చేసి తప్పులో కాలేశాడు. దీంతో షాకైన నరేశ్ అది కాన్స్టిట్యూషన్రా అని తప్పును సవరించాడు. శత్రువుకు శత్రువు ఏమవుతారంటే అజాత శత్రువు అని చెప్పడం వంటి కొన్ని డైలాగులు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. మా కేసును మేమే వాదించుకుంటాం అని కేసులో ఇరుక్కున్న నవీన్, ప్రియదర్శి న్యాయవాది బ్రహ్మానందానికి తెగేసి చెప్పారు. అప్పుడు బ్రహ్మానందం అయితే తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి అని కోర్టు హాలును వదిలి వెళ్లడం నవ్వు తెప్పిస్తోంది. మొత్తానికి అన్లిమిటెడ్ ఫన్ ప్యాక్డ్గా కనిపిస్తోన్నఈ ట్రైలర్ జనాలను విశేషంగా ఆకర్షిస్తోంది. నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాతిరత్నాలు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. స్వప్న సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలవుతోంది. చదవండి: జాతిరత్నాలు ప్రేక్షకుల్ని నవ్విస్తారు ప్రభాస్ నా చిన్ననాటి ఫ్రెండంటూ హీరో పోజులు! -
ఈ హీరోయిన్ నాకన్నా పొడవుగా ఉందేంటి!: ప్రభాస్
సెక్యూరిటీ గార్డుతో లొల్లి పెట్టుకుంటూ, లిఫ్టులో అంత్యాక్షరి ఆడుతూ ఆగమాగం చేస్తోంది జాతి రత్నాలు టీమ్. ఈ రోజు ట్రైలర్ లాంచ్ కోసం ఈ మూవీ యూనిట్ ముంబై వెళ్లింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో చిత్రయూనిట్ ప్రభాస్ అన్నను కలవాలంటూ సెక్యూరిటీ గార్డుతో సరదాగా గొడవకు దిగింది. ఎలాగోలా బిల్డింగ్ లోపలకు చేరుకున్నాక ప్రభాస్ అన్న వస్తుండు, మడత మంచాలు కాదు, మంచి సోఫా సెట్టేయండి అంటూ నవీన్ పొలిశెట్టి అక్కడున్నవాళ్లకు ఆర్డర్లు వేస్తున్నాడు. అసలు డార్లింగ్ నాకెంత క్లోజ్ అనుకుంటున్నారు? అతడు నా చిన్ననాటి ఫ్రెండు అని పోజులు కొడుతూ ఏ నంబరూ డయల్ చేయకుండానే ఫోన్లో పిచ్చాపాటీగా కబుర్లు చెప్తున్నాడు. ఇంతలో ప్రభాస్ వెనక నుంచి చెయ్యి వేయగానే ఖంగు తిన్న నవీన్ ఒక్క సెల్ఫీ అంటూ హీరోను అర్థించాడు. ప్రియదర్శి కూడా ప్రభాస్ను చూడగానే ఇది కలా? నిజమా? అన్నట్లు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అయితే జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లాను చూసి ఈ హీరోయిన్ ఏంటి? నాకన్నా పొడవుగా ఉంది? అని ప్రభాస్ ఆశ్చర్యపోవడం గమనార్హం. మొత్తానికి ప్రభాస్ చేతుల మీదుగా నేడు సాయంత్రం 4.20 గంటలకు జాతి రత్నాలు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఆ ట్రైలర్ చూసిన ప్రభాస్ సూపర్గా ఉందని మెచ్చుకున్నారు. ఈ కొద్ది సేపటికే ఇంత నవ్వుకుంటే సినిమా ఇంకెంత బాగుంటుందోనని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. స్వప్న సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలవుతోంది. చదవండి: సైకోగా చేయాలని ఉంది!: జాతి రత్నాలు హీరోయిన్ -
సైకోగా చేయాలని ఉంది!
నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలు చేశారు. స్వప్న సినిమాస్పై ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫరియా మాట్లాడుతూ – ‘‘మాది హైదరాబాద్. మాస్ కమ్యూనికేషన్ చేశాను. నాకు ఆర్ట్స్ అంటే ప్రత్యేకమైన శ్రద్ధ. ఆ ఆసక్తితోనే డ్యాన్స్, పెయింటింగ్ వంటివి నేర్చుకున్నాను. థియేటర్ ఆర్టిస్టుగా అనుభవం ఉంది. ‘నక్షత్ర’ అనే వెబ్ సిరీస్ కూడా చేశాను. మా కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి దర్శక–నిర్మాత నాగ్ అశ్విన్ వచ్చారు. ఆ సమయంలో ఆయనతో పరిచయం కలిగింది. ఆ తర్వాత ‘జాతిరత్నాలు’ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా మన సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఒక వ్యంగ్యాస్త్రంలా ఉంటుంది. థియేటర్ ఆర్టిస్టుగా చేసిన అనుభవం కొంతమేరకు సినిమాకి ఉపయోగపడింది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడే కెమెరాతో లవ్లో పడిపోయాను. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. నాకు డార్క్ కామెడీ బ్యాక్డ్రాప్ సినిమాలంటే ఇష్టం. సైకో పాత్ర చేయాలని ఉంది. సౌత్లో నాకు ఫాహద్ ఫాజిల్ యాక్టింగ్ అంటే ఇష్టం. హీరో విజయ్ దేవరకొండతో నటించాలని ఉంది’’ అన్నారు. చదవండి: (ప్రతిరోజూ మొదటి రోజే: సమంత) -
అలాంటి సినిమానే జాతిరత్నాలు : నాగ్ అశ్విన్
‘‘జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, యస్వీ కృష్ణారెడ్డిగార్ల చిత్రాలంటే నాకు బాగా ఇష్టం. వారి సినిమాలు ఇప్పటికీ యూట్యూబ్లో చూసినా పెదవిపై ఒక చిరునవ్వు వస్తుంది. అలాంటి ఫన్ ఫిల్మ్ ఈ ‘జాతిరత్నాలు’ అని నాగ్ అశ్విన్ అన్నారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. స్వప్న సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రం టీజర్ను విడుదల చేశారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘మహానటి’ టైమ్లో అనుదీప్ కలిసి, పూర్తి కామెడీగా ఉన్న ‘జాతిరత్నాలు’ స్క్రిప్ట్ చెప్పాడు. వినేటప్పుడే విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఇది పూర్తిగా అనుదీప్ చిత్రం. నా ఇన్వాల్వ్మెంట్ లేదు. ప్రియాంక, స్వప్న సపోర్ట్తో చాలా జాగ్రత్తగా చేశాం’’ అన్నారు. నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ– ‘‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, చిచ్చోరే’ తర్వాత నేను నటించిన మూడో చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ కథ చెబుతున్నప్పుడే విపరీతంగా ఎంజాయ్ చేశాను. వైజయంతి, స్వప్న సినిమాస్ బ్యానర్లో ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘పూర్తి వినోదభరిత చిత్రమిది. ప్రేక్షకులు మా సినిమాని ఎంజాయ్ చేస్తారు. నాగ్ అశ్విన్, స్వప్న, ప్రియాంక ఎంతో సపోర్ట్ చేశారు’’ అన్నారు అనుదీప్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, నటుడు ప్రియదర్శి పాల్గొన్నారు.