Jawahar Nagar
-
HYD: యాప్రాల్లో ‘హైడ్రా’ కూల్చివేతలు
సాక్షి,హైదరాబాద్: కొంత కాలం గ్యాప్ తర్వాత హైడ్రా మళ్లీ తన జేసీబీలకు పని చెప్పింది. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పరిధిలోని యాప్రాల్లో హైడ్రా శుక్రవారం (డిసెంబర్6) అక్రమ కట్టడాలపై కూల్చివేతలు చేపట్టింది. సర్వే నెంబర్ 32,14లో ఉన్న ఫంక్షన్హాల్ను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. ప్రభుత్వ భూమిలో నిర్మించినందుకు ఫంక్షన్హాల్లో కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు తెలిపారు.కూల్చివేతలు వివాదాస్పదమైనందున హైడ్రా తన దూకుడు కొద్దిగా తగ్గించింది. హైకోర్టు చివాట్లతో తన స్పీడుకు బ్రేకులు వేసింది. అక్రమ నిర్మాణాలని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే కూల్చివేతలకు రంగంలోకి దిగుతోంది. తాజాగా హైడ్రా కూల్చివేతలు చేపట్టిన జవహర్నగర్ ప్రాంతంలో చాలా వరకు భూ కబ్జాలతో పాటు అక్రమ నిర్మాణాలున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఫిర్యాదులున్నాయి. -
20 ఏళ్లుగా ఉంటున్నాం.. మీరెవరు పొమ్మనడానికి..
-
ఇళ్లు వదిలి పోండి..
-
చిన్న పిల్లోడు...20 కుక్కలు ఒకేసారి..!
-
విధి కుక్కల దాడిలో..
-
వీధికుక్కలు దాడిలో మరో చిన్నారి మృతి
-
మాజీ మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్!
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గంలోని 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరనున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం మేడ్చల్లోని జవహర్నగర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. కావ్య ఒంటెద్దు పోకడలకు సొంత పార్టీ అసమ్మతి కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చి వైజాగ్ టూర్కు వెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కొత్తగా ఎన్నుకున్న మేయర్తో అసమ్మతి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిల మధ్య విభేదాలన్న విషయం తెలిసిందే. ఇక.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టికి మలిపెద్ది సుధీర్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చదవండి: TS: ప్రభుత్వ సలహాదారుల నియామకం -
జవహార్ నగర్ బాధితురాలికి అండగా మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: జవహార్ నగర్లో జరిగిన దుశ్శాసన పర్వం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనలో బాధితురాలికి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అండగా నిలిచారు. ఆమెకు పెళ్లి చేయడంతో పాటు ఉద్యోగం ఇప్పించే బాధ్యతను ఆయనే తీసుకున్నారు. బాలాజీ నగర్లో మద్యం మత్తులో ఓ కీచకుడు ఆమె దుస్తులు చించేసి.. నగ్నంగా రోడ్డుపై నిలబెట్టిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చుట్టూ వంద మంది ఉన్నా ఎవరూ ఆమెను రక్షించే ప్రయత్నం చేయకపోగా.. ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ ఉదంతంపై బాధితురాలు మీడియా ముందు వాపోయింది కూడా. అయితే.. ఈ కేసులో పోలీసులు బాధితురాలికి అండగా నిలవడంతో పాటు నిందితుడ్ని వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అయితే ఆ బాధితురాలికి మంత్రి మల్లారెడ్డి అండగా నిలబడ్డారు. బాధితురాలికి(28) మున్సిపల్ కార్పోరేషన్లో ఉద్యోగం ఇప్పించడంతో పాటు ఆమె పెళ్లి చేసేందుకు కూడా ఆయన ముందుకొచ్చారు. అంతేకాదు.. ఆమెకు డబుల్ బెడ్రూం ఇవ్వాలంటూ అధికారులకు సైతం మంత్రి మల్లారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్లోనూ ఆమె యోగక్షేమాలన్నీ తానే చూసుకుంటానని ఆమె కుటుంబ సభ్యులకు అభయం ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి. గవర్నర్ ఆరా జవహార్ నగర్లో మహిళను వివస్త్ర చేసిన ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు. మహిళా కమిషన్ సీరియస్ జవహార్ నగర్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సైతం సీరియస్ అయ్యింది. హైదరాబాద్లో శాంతి భద్రతలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయంటూ.. డీజీపీ నుంచి వివరణ కోరింది. -
హైదరాబాద్ నడిరోడ్డుపై దుశ్శసన పర్వం..
హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న యువతిని వివస్త్రను చేసి, దాడికి పాల్పడిన ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుషాయిగూడ ఏసీపీ వెంకట్రెడ్డి, జవహర్నగర్ డీఐ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్ శివాజీనగర్కు చెందిన పెద్ద మారయ్య (30)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసగా మారి భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో భార్యతో గొడవ పడిన మారయ్య తన తల్లితో కలిసి బాలాజీనగర్ డివైడర్ మార్గంలో రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో షాపింగ్కు వెళ్లి వస్తున్న ఓ యువతి (28)పై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆమె మారయ్య చెంప చెళ్లుమనిపించింది. దీంతో అతను కోపంతో ఆమెపై దాడి చేసి దుస్తులు లాగి వివస్త్రను చేశాడు. పక్కనే ఉన్న మారయ్య తల్లి కుమారుడిని వారించలేదు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ మహిళ అడ్డుకోగా ఆమెపై కూడా దాడి చేశాడు. కొద్దిసేపటి తర్వాత పలువురు మహిళలు వచ్చి ఆమెపై కవర్లను కప్పారు. నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేస్తుంటే స్థానికులు సెల్ఫోన్లలో వీడియోలు తీశారు తప్ప అడ్డుకోలేదని పలువురు మండిపడుతున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్లో అమానుషం.. యువతి బట్టలిప్పి వివస్త్రను చేసిన కీచకుడు
సాక్షి, హైదారాబాద్: జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలాజీ నగర్ బస్టాండ్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని ఓ కీచకుడు వివస్త్రను చేశాడు. పెద్దమారయ్య (30) అనే కూలీ తాగిన మత్తులో యువతిపై దాడికి పాల్పడ్డాడు. ఆమె బట్టలు చింపేసి అందరి ముందు పరువు తీశాడు. అడ్డుచ్చిన వారిపై సైతం దాడికి తెగబడ్డాడు దుర్మార్గుడు. దీంతో 15 నిముషాల పాటు యువతి రోడ్డుమీద నగ్నంగా ఉన్నా ఎవరూ ఆమెను రక్షించే ప్రయత్నం చేయలేదు. మారయ్య అక్కడి నుంచి వెళ్లాక పలువురు కవర్లు కప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెకు రక్షణ కల్పించి, మారయ్యను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. -
Hyderabad: సమస్యకు చెక్.. చెత్త దూరం.. కరెంటు లాభం!
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకు మరింతగా జనాభా పెరిగిపోతున్న గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వెలువడుతున్న చెత్త కూడా అంతే స్థాయిలో పెరిగిపోతోంది. ఈ చెత్తను డంప్ చేస్తే కాలుష్యం, మురికి, అనారోగ్య సమస్యలు. ఈ క్రమంలోనే అటు చెత్త సమస్యకు చెక్ పెట్టడం, ఇటు విద్యుత్ను ఉత్పత్తి చేసి ప్రయోజనం పొందడం లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తోంది. జవహర్నగర్లో తొలుత 19.8 మెగావాట్ల ఉత్పత్తితో ప్రారంభమైన రాంకీ సంస్థ (రీసస్టెయినబిలిటీగా పేరు మారింది) ప్లాంట్ సామర్ధ్యం ప్రస్తుతం 24 మెగావాట్లకు పెరిగింది. మరో 24 మెగావాట్ల ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతించింది. ఈ సంస్థ మార్చి చివరినాటికి దుండిగల్లో 14.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ప్రారంభించనుంది. ఇదిగాక నగర శివార్లలో ఏర్పాటు కానున్న పలు ప్లాంట్లతో రెండేళ్లలో వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు చెత్త ప్రాసెస్ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చెత్తగుట్టలు పోగుపడవు. ఘన వ్యర్థాలు (చెత్త) ఎప్పటికప్పుడు ప్రాసెస్ అవుతాయి. శివార్లలోని పలు ప్రాంతాల్లో చెత్త ట్రీట్మెంట్తోపాటు ఆ సమీపంలోనే ఉండే ప్లాంట్లతో విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. మున్సిపల్ కార్మికులు సేకరించే చెత్తలో విద్యుత్కు పనికొచ్చేది దాదాపు 50 శాతం ఉంటుంది. మిగతా చెత్తను కంపోస్టు, రీసైక్లింగ్తో ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ వంటి వాటికి వినియోగిస్తారు. అంతిమంగా ఎందుకూ పనికిరానిదాన్ని పాతిపెడతారు. మరోవైపు చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అది అంత శ్రేయస్కరం కాదని, ఖర్చు కూడా ఎక్కువని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.. హైదరాబాద్ నగరంలో ఏటికేడు పెరుగుతున్న చెత్తను, తద్వారా ఉత్పత్తి చేయగల విద్యుత్ను జీహెచ్ఎంసీ అధికారులు 2018లో అంచనా వేశారు. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 70–100 టన్నుల చెత్త అవసరమవుతుంది. వంద మెగావాట్ల ఉత్పత్తికి దాదాపు పదివేల టన్నులు కావాలి. ప్రస్తుతం నగరంలో రోజూ 7000 టన్నుల చెత్త వెలువడుతోంది. పరిసర మున్సిపాలిటీలను కలిపితే ఇది పదివేల టన్నులకు చేరుకుంటుందని అంచనా. దీనికి తగినట్టుగా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. సిటీ శివార్లలోని విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఇదీ.. ►యాచారంలో శ్రీవెంకటేశ్వర గ్రీన్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్కు 12 మెగావాట్ల ఉత్పత్తికి ప్రభుత్వ అనుమతి ఉంది. మరో 2 మెగావాట్లు పెంచి 14 మెగావాట్లకు అనుమతించాల్సిందిగా ఆ సంస్థ కోరింది. అనుమతి వస్తే 14 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ►బీబీనగర్లో ఆర్డీఎఫ్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 11 మెగావాట్ల ప్లాంట్ పనులు ప్రారంభమై చాలాకాలమైనా వివిధ కారణాలతో జాప్యం జరుగుతోంది. ఇటీవల యాజమాన్య మార్పు జరగడంతో పనులు వేగంగా అవుతాయని అధికారులు చెప్తున్నారు. ►‘రీసస్టెయినబిలిటీ లిమిటెడ్’ ప్యారానగర్లో 15 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ►జవహర్నగర్లో ప్రస్తుతం 24 మెగావాట్లు, అదనంగా రానున్న 24 మెగావాట్లు, దుండిగల్లో 14.5 మెగావాట్లతోపాటు కొత్తగా రానున్న ప్లాంట్లన్నీ కలిపితే మొత్తం 102.5 మెగావాట్లకు ‘చెత్త విద్యుత్’ ఉత్పత్తి సామర్థ్యం పెరగనుంది. మున్సిపల్ వ్యర్థాల నుంచి తక్కువే.. గత సంవత్సరం కేంద్ర మంత్రి ఆర్కేసింగ్ రాజ్యసభలో ఇచ్చిన సమాచారం మేరకు దేశంలో చిన్నవి, పెద్దవి కలిపి 249 ప్లాంట్లు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో మున్సిపల్ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేవి 11 ప్లాంట్లే. వీటి సామర్ధ్యం 132.1 మెగావాట్లు. ఇటీవల మరికొన్ని ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు మరికొన్ని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. ఇక దేశంలోని అన్ని నగరాల్లో భారీగా చెత్త వెలువడుతున్నా.. దాన్ని విద్యుత్గా మార్చే ప్లాంట్లు కొన్ని నగరాల్లోనే ఉన్నాయి. జీరో వేస్ట్ లక్ష్యంగా.. హైదరాబాద్ నగరంలో చెత్తను వివిధ రకాలుగా వేరు చేయడంతో బయోగ్యాస్, కంపోస్టు ఎరువు వంటివాటితోపాటు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ‘జీరో వేస్ట్’ లక్ష్యంతో పనులు చేస్తున్నాం. తద్వారా చెత్త పేరుకు పోదు. చెత్త వస్తున్న చోటనే తడి–పొడిగా వేరుచేయడంలో ఇంకా కృషి జరగాల్సి ఉంది. మిగతా దశలకు సంబంధించి చాలా నగరాల కంటే మనం ముందంజలో ఉన్నాం. – బి.సంతోష్, అడిషనల్ కమిషనర్ (పారిశుధ్యం, ఆరోగ్యం), జీహెచ్ఎంసీ వ్యయమెక్కువ.. శ్రేయస్కరం కాదు.. చెత్త నుంచి విద్యుదుత్పత్తికి అధిక వ్యయం అవుతుంది. వాతావరణ కాలుష్యం సమస్య కూడా ఉంటుంది. విద్యుత్ కోసమే అయితే సోలార్ పవర్ ఖర్చు తక్కువ. చెత్త కుప్పలు కనిపించకుండా ఉండేందుకు విద్యుత్ ఉత్పత్తికి మొగ్గుచూపుతున్నారు. దీనికి ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది. ఏర్పాటు చేసే కంపెనీలకు రాయితీలిస్తారు. ఇది శ్రేయస్కరం కాదు. చెత్తను ప్రాథమికంగానే వేరు చేయడం ఉత్తమ మార్గం. రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ విధానమే మేలైనది. దానివల్ల ఎక్కువమందికి జీవనోపాధి లభిస్తుంది. – ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి, పర్యావరణవేత్త -
Hyderabad: స్వప్నతో పరిచయం.. భార్యను పట్టించుకోకుండా..
సాక్షి, హైదరాబాద్: భర్త వేధింపులు తాళలేక మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గురువారం చోటు చేసుకుంది. సీఐ చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా దర్పనపల్లి మండలం దమ్మన్నపేట్ తండాకు చెందిన మాలోత్ మంజుల(24)ను సిరిసిల్లా జిల్లాకు చెందిన మాలోత్ ప్రసాద్తో 2021 జనవరి 8న వివాహం జరిగింది. పెళ్లిలో రూ.10లక్షల నగదు, ప్లాట్, 8 తులాల బంగారాన్ని కట్నంగా అందజేశారు. ఉపాధి కోసం హకీంపేట్కు వలస వచ్చిన ప్రసాద్, అతడి భార్య, 15 నెలల కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. గత కొంత కాలంగా ప్రసాద్కు స్వప్ప అనే మహిళతో పరిచయం ఏర్పడింది. భార్య, కుమారున్ని పట్టించుకోకుండా ప్రసాద్ తిరుగుతున్నాడు. కుల పెద్దలకు ఫిర్యాదు చేసినా ప్రసాద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. అంతేకాకుండా మంజులను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన మంజుల ఇంట్లో ఫ్యాన్ రాడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీకి తరలించి మంజుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (పవన్ కల్యాణ్ ఇంటి ఎదుట మహిళ హంగామా) -
వీడిన చిన్నారి ఇందు మృతి మిస్టరీ
-
దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, హైదరాబాద్: జవహర్ నగర్ బాలిక ఇందు మృతి కేసులో మిస్టరీ వీడింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతిచెందినట్లు జవహర్నగర్ పోలీసులు గుర్తించారు. కాగా గురువారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమై.. తెల్లారి చెరువులో శవమై తేలిన విషయం తెలిసిందే. దీంతో జవహర్నగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఆదివారం సీఐ చంద్రశేఖర్ ప్రత్యేక బృందాలతో కలిసి పరిసర ప్రాంతాలను జల్లెడ పడ్డారు. చెరువులో ఉన్న నీరు ఊపిరితిత్తులలోకి చేరి ఇందు మృతిచెందినట్లు పోస్టుమార్టమ్ రిపోర్టు నివేదికలోనూ వెల్లడైంది. అసలు ఏం జరిగింది? మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో గజ ఈతగాళ్లతో గాలించగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. చదవండి: డబ్బు వసూలు చేసినట్లు నిరూపించు.. రోహిత్ రెడ్డికి రఘునందన్ సవాల్.. -
జవహర్ నగర్ బాలిక మృతి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
-
మేడ్చల్: జవహార్నగర్ బాలిక అదృశ్యం విషాదాంతం
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా జవహార్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక గురువారం ఉదయం కనిపించకుండా పోగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. దీంతో చెరువు వద్దకు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. అయితే, పాఠశాల నుంచి బాలిక చెరువు వద్దకు ఎందుకు వచ్చింది? ఎవరైనా తీసుకెళ్లారా? హత్య చేసి చెరువులో పడేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోస్ట్మార్టం నివేదిక వస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. ఏం జరిగింది? దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. ఇదీ చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్యకు హెచ్ఐవీ సోకే విధంగా వైద్యం -
భార్యపై అనుమానం.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మరీ భర్త దారుణం
సాక్షి, హైదరాబాద్: అనుమానమే పెనుభూతమై కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడో వ్యక్తి. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. జనగాం జిల్లా కొడవటూరు గ్రామానికి చెందిన బండ రాజు (38), బండ కవిత (34) దంపతులు జవహర్నగర్లో నివాసముంటున్నారు. రాజు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె జ్యోతి ఇంటర్ చదువుతుండగా కుమారుడు పదోతరగతి చదువుతున్నాడు. కాగా కొన్ని రోజులుగా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న రాజు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మా ఇద్దరి శవాలను తీసుకెళ్లండి అని సమాచారం అందించాడు. భయపడ్డ కుటుంబసభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి వచ్చారు. గడ్డపారతో డోర్ పగులగొట్టి చూసే సరికి రక్తపు మడుగులో కవిత, ఉరివేసుకుని రాజు విగతజీవులుగా కనిపించారు. భార్యను అతికిరాతకంగా కట్టర్తో గొంతు కోసి హత్యచేసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు బావిస్తున్నారు. ఘటనా స్థలానికి మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఇంచార్జ్ ఏసీపీ విజయ్ శ్రీనివాస్, సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు అనిల్రెడ్డి, అనిల్కుమార్ చేరుకుని ఆధారాలు సేకరించి, మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తల్లిదండ్రులిద్దరూ మృతిచెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. పిల్లలు ఇంటికి వచ్చేసరికి తల్లి రక్తపు మడుగులో, తండ్రి ఉరివేసుకుని విగతజీవులుగా పడి ఉండడంతో పిల్లల రోదనలు మిన్నంటాయి. చదవండి: Nizam College: విద్యార్థుల నిరసన.. తలనొప్పిగా సర్కార్ ఉత్తర్వులు -
హైదరాబాద్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో విషాదం
-
విషాదం.. చెరువులోకి మునిగి టీచర్తోపాటు ఐదుగురు విద్యార్థుల మృతి
సాక్షి, మేడ్చల్: ఈత సరదా ఐదుగురు విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. వారిని రక్షించడానికి వెళ్లిన మదరసా టీచర్ సైతం మృత్యువాత పడ్డారు. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ విషాదకర ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ కాచిగూడ ప్రాంతానికి చెందిన హనీఫా మదరసాలో చదువుకునే దాదాపు 40 మంది విద్యార్థులు శనివారం డీసీఎం వాహనంలో వారి టీచర్ యహియా (25)తో కలసి జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారంలో ఓ గృహప్రవేశానికి హజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో కొందరు ఫంక్షన్ జరుగుతున్న ఇంట్లోకి వెళ్లగా మరికొందరు బయట ఆడుకుంటున్నారు. వీరిలో ఆరుగురు విద్యార్థులు సమీపంలో ఉన్న ఎర్రగుంట చెరువులో సరదాగా ఈతకు వెళ్లారు. నీటిలోకి దిగిన విద్యార్థులు ఈతరాక ఒక్కొక్కరుగా మునిగిపోయారు. వీరిని గమనించిన ఉపాధ్యాయుడు యహియా వేగంగా వచ్చి నీళ్లలోకి దిగి పిల్లలను కాపాడేప్రయత్నం చేశారు. అయితే పిల్లలు ఆయనను గట్టిగా పట్టుకోవడంతో అందరూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. వీరిలో ఒక విద్యార్థిని అక్కడే ఉన్న స్థానికుడు రక్షించి ఒడ్డుకు చేర్చాడు. ఈ లోగా టీచర్ యహియాతో పాటు ఐదుగురు విద్యార్థులు.. ఇస్మాయిల్ (11), జాఫర్ (10), సోహెల్ (09), అయాన్ (09), రియాన్(12)లు మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న కుషాయిగూడ ఏసీపీ సాధన రశ్మీ పెరుమాల్, జవహర్నగర్ సీఐ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్లను రప్పించి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చదవండి: నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా?.. వీడియో బయటపెడతా భయాందోళనలో తోటి విద్యార్థులు మదరసా నుంచి గృహప్రవేశానికి వచి్చన విద్యార్థులు సరదాగా గడుపుతున్న సమయంలో టీచర్తోపాటు ఐదుగురు స్నేహితులు జలసమాధి అయిన విషయం తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు. తోటి విద్యార్థులు నీటిలో మునిగిపోయారని కన్నీరుమున్నీరయ్యారు. ఆగ్రహించిన స్థానికులు ఎర్రగుంట చెరువులో పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారుల్లో ఎలాంటి చలనం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆ ప్రాంతంలోని చెరువుల్లో మునిగి చనిపోయారని, వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంబర్పేటలో విషాదఛాయలు మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మల్కారం ఎర్రగుంట చెరువులో శనివారం ఈతకు వెళ్లి మృతి చెందిన ఐదుగురు విద్యార్థులు అంబర్పేట నియోజకవర్గం హడ్డికార్ఖానా, సుందర్నగర్, నెహ్రూనగర్ ప్రాంతాలతో పాటు అంబర్పేటకు చెందినవారు కావడంతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కాచిగూడ పోలీసులు హడ్డికార్ఖానా ప్రాంతంలోని మదరసా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్గౌడ్లు పరామర్శించారు. కాగా, గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్దకు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ పిల్లల మృతదేహాలను చూసి భోరున విలపించారు. ఈ సందర్భంగా మృతదేహాలకు పోస్టుమార్టం వద్దని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు మార్చురీ అద్దాలను ధ్వంసం చేశారు. అయితే ఎమ్మెల్యే, కార్పొరేటర్ నచ్చజెప్పడంతో వారు శాంతించారు. చదవడి: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయని.. యువకుడు మృతి -
యువతులు, ఒంటరి మహిళలే టార్గెట్.. జీవనోపాధి కల్పిస్తానని చెప్పి
సాక్షి, హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తూ అమాయక మహిళలను మోసం చేసిన ఓ మహిళపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గురువారం పీడీ యాక్టు నమోదు చేశారు. జవహర్నగర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిగాడి అరుణ దమ్మాయిగూడ వాయుశక్తినగర్లో ఓ ఇంట్లో నివాసం ఉంటూ కళాశాల యువతులు, ఒంటరి మహిళలకు జీవనోపాధి కల్పిస్తానని చెప్పి వ్యభిచారం నిర్వహిస్తుంది. వ్యభిచారం నిర్వహిస్తున్న అరుణను జూన్ 16న పోలీసులు అదుపులోకి తీసుకొని చంచల్గూడ జైలులో తరలించారు. ఈ మేరకు అరుణపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు తెలిపారు. మసాజ్ సెంటర్పై దాడి.. ముగ్గురు మహిళల అరెస్టు అనుమతి లేకుండా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న బ్యూటీ సెలూన్ వెల్నెస్ సెంటర్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్న ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పనామా చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఎస్బీ బ్యూటీ అండ్ సెలూన్ వెల్నెస్ సెంటర్లో అనుమతి లేకుండా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందంది. దీంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా బుధవారం దాడి చేశారు. అందులో పనిచేస్తున్న ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. మసాజ్ సెంటర్ నిర్వాహకుడు రాధామనోహర్రెడ్డి, మేనేజర్ ప్రశాంత్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారి నుంచి 4 సెల్ఫోన్లు, రూ. 500 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘మమ్మీ.. డాడీ నన్ను క్షమించండి.. నేను కరెక్ట్గా లేను’
సాక్షి, హైదరాబాద్: మమ్మి, డాడీ నన్ను క్షమించండి, మీరు కరెక్ట్గా ఉన్నారు. నేను కరెక్టుగా లేను, నేనేమీ చేయలేను... నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నా.. అమ్మా.. నన్ను క్షమించు మీరు నా ప్రాణం... మీకు అందనంత దూరం వెళ్లిపోతున్నా అంటూ లోన్ యాప్స్ ద్వారా రుణం తీసుకున్న ఓ యువకుడు సూసైడ్నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విధారక సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. జవహర్నగర్ పోలీసులు, స్ధానికులు తెలిపిన మేరకు.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఖాధర్ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నాపురంలోని సాయిగణేష్ కాలనీలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముర్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఖాజా మోహినుద్దీన్ (23) ఉన్నారు. ఇద్దరు కుమార్తెల వివాహం జరిగింది. మదర్సాలో చదువుతున్న ఖాజా ఇంట్లో ఆన్లైన్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఖాజా ఫోన్తో పాటు ఇంట్లో ఉన్న తండ్రికి ఫోన్ ద్వారా లోన్ యాప్ నుంచి రూ. లక్ష లోన్ తీసుకున్నాడు. అసలు వడ్డీ లోన్కు సంబంధించి రూ. 40 వేలు కట్టాలని లోన్యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. దీంతో తండ్రి కొంత డబ్బును కట్టాడు. ఈ నెల 8న ఖాజాను తండ్రి మందలించాడు. జీతం వస్తుంది కడతానని చెప్పాడు. అదేరోజు ఖాజా తల్లిదండ్రులు సోదరి ఒక గదిలో నిద్రిస్తుండగా వంటగదిలోకి వెళ్లిన ఖాజా మోహినూద్ధీన్ సూసైడ్నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ట్రాప్ చేసింది ప్రజాప్రతినిధుల కుమారులే! ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
125 గజాల వరకు ఉచితం... ఆపై పైకం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను 125 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనున్నారు. అందు కోసం గత నెల 21 నుంచి మీ–సేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. మార్చి 31తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఆయితే అధికారులు ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం.. పేదలకు క్రమబద్ధీకరణ జీఓ పై సరైన సమాచారం లేకపోవడంతో దరఖాస్తులు చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. జవహర్నగర్ కార్పొరేషన్లో ప్రత్యేక సమావేశం జీఓ.58, 59 దరఖాస్తు అవగాహన కోసం మేయర్ మేకల కావ్య అధ్యక్షతన కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం కీసర ఆర్డీవో రవి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జవహర్నగర్లో కార్పొరేషన్, రెవెన్యూ సంయుక్తంగా చేయాల్సిన పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాప్రా తహసీల్దార్ అనిత, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. కేవలం వీరికే వర్తిస్తుంది.. 2014 జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. 2014 డిసెంబర్ 30న ప్రభుత్వం జారీ చేసిన 58, 59 జీఓల్లోని నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణకు మరోమారు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గత నెల 14వ తేదీన కొత్త జీఓ జారీ చేసింది. 250 గజాలు దాటితే మార్కెట్ విలువ చెల్లించాల్సిందే.. ప్రభుత్వం తాజాగా తెచ్చిన జీఓ ప్రకారం 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. 250 గజాల వరకు ప్రభుత్వం నిర్ధారించిన మార్కెట్ విలువలో 50శాతం, 250 నుంచి 300 చదరపు గజాలు దాటితే 75శాతం, 500 నుంచి 1000 గజాల్లో నిర్మాణాలు చేసుకుంటే 100 శాతం మార్కెట్ విలువ చెల్లించాలి. ఈసారైనా ముందుకొచ్చేనా? జవహర్నగర్ కార్పొరేషన్లో దాదాపు 2 లక్షల మంది పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నారు. 2014 క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించినా చాలా మంది ముందుకు రాలేదు. ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా వివరాలు లేకపోవడంతో మౌలిక సదుపాయాలు కల్పించడం అధికారులకు ఇబ్బందిగా మారింది. (క్లిక్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తప్పని నిరాశ) అడ్డదారుల్లో వెళ్తే క్రిమినల్ కేసులు: ఆర్డీవో జీఓ.58, 59 దరఖాస్తుల కోసం అడ్డదారుల్లో వెళ్లి నకిలీ ధ్రువపత్రాలు అందజేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కీసర ఆర్డీవో రవి హెచ్చరించారు. గ్రామపంచాయితీ పేరున గతంలో తీసుకున్నట్లు బిల్లులు తీసుకువస్తే వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లక్రమబద్ధీకరణ కోసం కొన్ని చోట్ల 2014 సంవత్సారానికి ముందు తేదీలలో నకిలీ ధ్రువపత్రాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అలాంటి వాటిని గుర్తించి వాటిపై దర్యాప్తు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జవహర్గనర్లో గతంలో జీఓ.58 ప్రకారం 5,546, జీఓ 59 ప్రకారం 1,666 మంది దరఖాస్తులు చేసుకున్నారని వీటికి సంబంధించి మరో 10 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. ఈనెల 31 వరకు మీ–సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుకు కావాల్సినవి.. ► 2014 జూన్ 2వ తేదీకి ముందున్న నిర్మాణాలను మాత్రమే క్రమబద్ధీకరణ చేస్తారు. ► ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసిన వారు మీ సేవా కేంద్రాల ద్వారా తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలి. ► రూ. వెయ్యి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ►ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలి. ► ఆధార్కార్డు, రిజిస్టర్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను రసీదు, విద్యుత్, నీటి బిల్లులు దరఖాస్తులతో సమర్పించాలి. ► ఎంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారన్న వివరాలు తెలియజేయాలి. ► గతంలో అధికారులు ఏదైనా నోటీస్ జారీ చేస్తే అది కూడా జత చేయాలి. ► కోర్టు కేసులు ఉంటే వివరాలు తెలియజేయాలి. -
డెలివరీ బాయ్ నిర్వాకం.. ప్రేమించడం లేదని ఇంట్లో ఎవరూ లేని టైంలో
సాక్షి, జవహర్నగర్: ప్రేమ పేరుతో ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడి ఆ ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బీజేఆర్నగర్లో చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని బీజేఆర్నగర్కు చెందిన నవీన్(23) ఫుడ్ డెలివరీ బాయ్. రెండు సంవత్సరాలుగా స్థానికంగా ఉండే యువతిని పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు. చదవండి: Chanda Nagar: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఇటీవలే యువతికి వారి తల్లిదండ్రులు మరో యువకుడితో వివాహం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న నవీన్ యువతి బంధువులను బెదిరించి యువతి ఇంటిని తగలబెడతానని హెచ్చరించాడు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు వారి నానమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ నెల 10న ఇంటికి తాళం వేసి ఊరెళ్లారు. ఈ నెల 23న యువతి ఇల్లు కాలిపోయినట్లు స్థానికులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాధితులు నవీన్ ఈ ఘాతకానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు! -
వృద్ధురాలిపై దాడి చేసిన ఆవు
-
Hyderabad: ఎప్పటిలాగే విధులకు వెళ్లారు..కానీ తిరిగి రాలేదు
సాక్షి, జవహర్నగర్: యువతి అదృశ్యమైన సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మిగడ్డ జైజవాన్ కాలనీలో నివసించే లాజరు పెద్ద కుమార్తె బూలగ్రేస్ (20) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువతి అదృశ్యం బంజారాహిల్స్: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీనగర్లో నివసించే మహేశ్వరి (20), రెండు నెలలుగా రత్నదీప్ సూపర్ మార్కెట్లో పని చేస్తోంది. ఎప్పటిలాగే విధులకు వెళ్లిన మహేశ్వరి రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగి రావాల్సి ఉండగా ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్యూటీకి వెళ్లి.. బంజారాహిల్స్: విధులకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 10, శ్రీరాంనగర్లో నివసించే బి. లోకేష్ స్టార్ ఆస్పత్రిలో టెక్నీషియన్గా పని చేస్తున్నారు. ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి రెండ్రోజులైనా ఇంటికి రాకపోవడంతో సోదరుడు కుమార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
దమ్మాయిగూడ అత్యాచార కేసులో పురోగతి
సాక్షి, జవహర్నగర్: మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో చిన్నారి అత్యాచార ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు ఒరిస్సాకు చెందిన 40 సంవత్సరాల వ్యక్తిగా జవహర్ నగర్ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను బండ్లగూడలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. భార్యతో తరచూ గొడవల కారణం కొంతకాలం నుంచి భార్యతో దూరంగా ఉంటున్నాడని పేర్కొన్నారు. జవహర్నగర్ సీఏ బిక్షపతి రావు, కీసర సీఐ నరేందర్ గౌడ్ జాయింట్ ఆపరేషన్లో నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతను పోలీసు అదుపులో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఇటీవల దమ్మాయిగూడలో నాలుగేళ్ల చిన్నారిపై గుర్తుతెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్యాచారయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఘటన జరిగిన దమ్మాయిగూడ పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. మరోవైపు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నేతలు నిందితులను కఠినంగా శిక్షించాలని ధర్నాలు నిర్వహిస్తుండటం, ఎమ్మెల్యే సీతక్క నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారిని చూసేందుకు వెళ్లడం, వెంటనే నిందితులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. -
మేడ్చల్ జిల్లా: ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి
-
నేను పక్కా పల్లెటూరి వాడిని: ఐఏఎస్
జవహర్నగర్/మేడ్చల్: నేను పక్కా పల్లెటూరి వాడిని.. పల్లె జనాల్లో గెలవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఉన్న వారంతా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవారే.. యువత కలలు కనడమే కాదు.. వాటిని సాకారం చేసుకునేందుకు శ్రమపడాలి. అప్పుడే విజయం పరుగెత్తుతూ వస్తుంది. ఉన్నత ఉద్యోగాలు సంపాదించేందుకు కోచింగ్లు అక్కర్లేదు. పట్టుదల ఉంటే చాలు. అయితే కొన్నిసార్లు విజయం అందకపోవచ్చు. అంతమాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నిరాశలోంచి కసి పుట్టాలి. అప్పుడే విజయం చేతికి చిక్కుతుందటారు జవహర్నగర్ కమిషనర్ (ఐఏఎస్) డాక్టర్ బి.గోపి. వెటర్నరీ డాక్టర్గా ప్రస్థానం నేను పుట్టి పెరిగింది తమిళనాడులోని తిరువాలూర్ జిల్లా పొద్దాటూర్ పేటాయి గ్రామం. మాది ఓ చిన్న పల్లెటూరు. మా ఊర్లో పెద్దగా చదువుకున్న వారు ఎవరూలేరు. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. పశువులు, పాలతో వచ్చిన ఆదాయంతోనే కుటుంబం గడిచింది. అమ్మానాన్నలకు చదువు రాదు. మేము ఐదుగురము. ఒక అన్న, ముగ్గురు అక్కలు. 12వ తరగతి వరకు మా ఊర్లోని పంచాయతీ యూనియన్ పాఠశాలలో చదివా. తర్వాత ఉన్నత చదువుల కోసం మద్రాస్కు వెళ్లి పీజీ పూర్తి చేశాను. తమిళనాడులో 6 సంవత్సరాల పాటు వెటర్నరీ సర్జన్గా పనిచేశా. ఆ సమయంలోనే పెళ్లయ్యింది. మా శ్రీమతి డాక్టర్. నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఆదిలాబాద్లో తొలిపాఠాలు.. ఆదిలాబాద్లో జిల్లాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ జరిగింది. అక్కడే తొలిపాఠాలు నేర్చుకున్నాను. కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు నిర్వర్తించే విధులపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత సబ్కలెక్టర్గా ఏడాది పాటు పనిచేశాను. 2020లో నిజాంపేట్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నాను. తాజాగా జవహర్నగర్ కార్పొరేషన్కు సైతం అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. గ్రామీణుల్లో క్రియేటివిటీ ఎక్కువ.. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రియేటివిటీ ఎక్కువ. పట్టణవాసులతో పోలిస్తే గెలవాలన్న తపన పల్లె జనాల్లోనే అధికం. ప్రస్తుతం ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారిని పరిశీలిస్తే సగానికిపైగా గ్రామీణ నేపథ్యం ఉన్నవారే.. మొదట పల్లెటూరి వాళ్లమనే భావన దూరం చేసుకుంటే గమ్యం చేరుకోవడం సులభం. క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళిక ఈ మూడే విజయానికి సోపానాలు. జవహర్నగర్ సమస్య ప్రత్యేకం. నిజాంపేట్కు, జవహర్నగర్కు చాలా తేడా ఉంది. ఇక్కడ చాలా మంది నిరుపేదలున్నారు. వారందరికీ ప్రభుత్వం తరఫున సహకారం అందించాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్కు తగ్గట్టుగా ఇక్కడ పరిస్థితులు లేవు. జీవో 58, 59 అమలు పరిచి ఇక్కడి పరిస్థితులను మార్చాల్సి ఉంది. చాలామంది అయాయక ప్రజలను మోసం చేసి ప్రభుత్వ స్థలాలను విక్రయిస్తున్నారు. ఇకపై అలా జరగకుండా చూడాల్సి ఉంది. ఇప్పుడే ఇక్కడి ప్రజల స్థితిగతులను తెలుసుకుంటున్నాను. అసిస్మెంట్ ద్వారా క్రెడిట్ రేట్ను పెంచి జవహర్నగర్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలి. దీనికి ప్రజలు, పాలకమండలి సహకరించాలి. స్నేహితులే స్ఫూర్తి.. వెటర్నరీ సర్జన్గా పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తున్న తీరు చూసిన స్నేహితులు ఐఏఎస్ అయితే మరింత సేవ చేసే అవకాశం లభిస్తుందని స్నేహితులు ప్రోత్సహించారు. వారు యూపీఎస్సీ రాసి విజయం సాధించడంతో నన్ను తరచూ గైడ్ చేస్తుండేవారు. ఏనాడూ కోచింగ్ సెంటర్కు వెళ్లలేదు. అవసరమైన మెటీరియల్ను సేకరించి చదువుకునేవాడిని. రెండుసార్లు సివిల్స్ రాశా. ఇంటర్వూ్య వరకు వెళ్లినా ఉద్యోగం రాలేదు. 2016లో మూడోసారి ర్యాంకు ఆధారంగా అవకాశం వచ్చింది. చదవండి: ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న ‘మిలాప్’ -
సీఐపై కిరోసిన్ దాడి.. హత్యాయత్నం కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : జవహర్నగర్ ఘటనలో పలువురిపై కేసు నమోదైంది. సీఐ భిక్షపతి, కానిస్టేబుల్ అరుణ్పై కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న మేడ్చల్ జిల్లా జవహర్నగర్లోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపు సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడిన విషయం తెలిసిందే. (కూల్చివేతలో ఉద్రిక్తత) ఆక్రమణలను తొలగించడానికి వెళ్లిన మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులపై కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐ భిక్షపతి, కానిస్టేబుల్ అరుణ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆక్రమణదారులు పూనమ్ చంద్, నిహాల్ చంద్, శాంతిదేవి, నిర్మల్, బాల్సింగ్, చినరాం పటేల్, గీత, గోదావరి, యోగి కమల్, మదన్పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేశారు. వీరితోపాటు స్థానిక నాయకులు శంకర్, శోభారెడ్డిపై కూడా కేసు రిజిస్టర్ చేశారు. ఈ ఘటనపై ఉప్పల్ సీఐ రంగస్వామి ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తి దర్యాప్తును పర్యవేక్షించనున్నారు. భూ కబ్జాదారుల దాడిలో గాయపడిన సీఐ భిక్షపతిరావు, కానిస్టేబుల్ అరుణ్ సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఐసోలేషన్లో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. భిక్షపతిరావు కాళ్లు, చేతులకు 45 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటన నేపథ్యమిదీ.. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 432లో 1,500 గజాల స్థలాన్ని మహిళల కోసం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని 6 నెలల కింద అప్పటి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ భూమిపై కన్నేసిన కబ్జాదారులు రాత్రికి రాత్రే గదులు నిర్మించడంతో ఎమ్మార్వో గౌతమ్కుమార్ నేతృత్వంలోని బృందం నేలమట్టం చేసింది. అప్పటినుంచి ఆ భూమిని తాత్కాలిక డంపింగ్ కేంద్రంగా మున్సిపల్ అధికారులు వాడుతున్నారు. అయినా కూడా జవహర్నగర్ వాసి పూనమ్ చంద్ కుటుంబం మళ్లీ రెండు గదులు నిర్మించి ఆ భూమిని దక్కించుకోవాలని ప్లాన్ చేశారు. అయితే వాసం వెంకటేశ్వర్లు స్థానంలో కలెక్టర్గా వచ్చిన శ్వేతా మహంతి ఆ భూమిలో మహిళల కోసం షీ టాయిలెట్స్ పనులు చేపట్టాలంటూ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారం రోజుల కింద ఇక్కడకు వచ్చిన కార్పొరేషన్ అధికారులను పూనమ్ చంద్ కుటుంబసభ్యులు చనిపోతామంటూ బెదిరించడంతో వెనుదిరిగారు. మళ్లీ గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 20 నుంచి 30 మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ రెండు గదులను కూల్చేందుకు వచ్చారు. జేసీబీ యంత్రాలతో తొలగించేందుకు సిద్ధం అవుతుండగా పూనమ్ చంద్, శాంతి కుమారి ఆ గదిలోకి వెళ్లి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని గడియపెట్టుకున్నారు. ఇది గమనించిన ఎస్సై సైదులు, ఇతర సిబ్బంది అక్కడికి వెళ్లగా, గది కిటికీలోంచి కారం పొడి చల్లారు. కర్రలకు బట్టలుచుట్టి వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి బయటకు విసిరారు. -
కిటికీలోంచి కారం చల్లి, పెట్రోల్తో దాడి
సాక్షి, జవహర్నగర్: మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్నగర్ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల కూల్చివేతల్లో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు వెళ్లిన కమిషనర్ మంగమ్మ, కాప్రా తహసీల్దార్ గౌతమ్కుమార్, జవహర్నగర్ ఠాణా సీఐ పి.భిక్షపతిరావును లక్ష్యంగా చేసుకుని కబ్జాదారులు రెచ్చిపోయారు. పెట్రోల్, కారం పొడితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐ భిక్షపతి చేతులకు, కాళ్లకు మంటలు అంటుకున్నాయి. అలాగే కార్పొరేషన్ సిబ్బంది, జవహర్నగర్ ‘సాక్షి’ విలేకరి సురేందర్కు గాయాలయ్యాయి. చదవండి: భాగ్య పెళ్లి.. ప్రతి ఒక్కరినీ కదిలిచింది.. ఘటన నేపథ్యమిదీ.. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 432లో 1,500 గజాల స్థలాన్ని మహిళల కోసం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని 6 నెలల కింద అప్పటి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ భూమిపై కన్నేసిన కబ్జాదారులు రాత్రికి రాత్రే గదులు నిర్మించడంతో ఎమ్మార్వో గౌతమ్కుమార్ నేతృత్వంలోని బృందం నేలమట్టం చేసింది. అప్పటినుంచి ఆ భూమిని తాత్కాలిక డంపింగ్ కేంద్రంగా మున్సిపల్ అధికారులు వాడుతున్నారు. అయినా కూడా జవహర్నగర్ వాసి పూనమ్ చంద్ కుటుంబం మళ్లీ రెండు గదులు నిర్మించి ఆ భూమిని దక్కించుకోవాలని ప్లాన్ చేశారు. అయితే వాసం వెంకటేశ్వర్లు స్థానంలో కలెక్టర్గా వచ్చిన శ్వేతా మహంతి ఆ భూమిలో మహిళల కోసం షీ టాయిలెట్స్ పనులు చేపట్టాలంటూ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారం రోజుల కింద ఇక్కడకు వచ్చిన కార్పొరేషన్ అధికారులను పూనమ్ చంద్ కుటుంబసభ్యులు చనిపోతామంటూ బెదిరించడంతో వెనుదిరిగారు. తీవ్ర ఉద్రిక్తత.. మళ్లీ గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 20 నుంచి 30 మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ రెండు గదులను కూల్చేందుకు వచ్చారు. జేసీబీ యంత్రాలతో తొలగించేందుకు సిద్ధం అవుతుండగా పూనమ్ చంద్, శాంతి కుమారి ఆ గదిలోకి వెళ్లి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని గడియపెట్టుకున్నారు. ఇది గమనించిన ఎస్సై సైదులు, ఇతర సిబ్బంది అక్కడికి వెళ్లగా, గది కిటికీలోంచి కారం పొడి చల్లారు. కర్రలకు బట్టలుచుట్టి వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి బయటకు విసిరారు. ఆ వెంటనే అక్కడికి చేరుకున్న స్థానిక రాజకీయ పార్టీ నేతలు పూనమ్ చంద్ కుటుంబసభ్యులకు మద్దతు పలికారు. ‘వారు చస్తారు. లేదంటే చంపుతారు’ అంటూ రెచ్చొగొట్టేలా నినాదాలు చేశారు. అప్పటికే సాయంత్రం 6.30 గంటలైంది. సీఐ భిక్షపతి నేతృత్వంలోని పోలీసులు అక్కడి నుంచి అందరినీ చెదరగొట్టారు. అయితే గది లోపల కాగడాల మంటలు ఉండటంతో పూనమ్ చంద్ కుటుంబసభ్యులకు ఏమైనా అవుతుందని సీఐ తలుపులను కాళ్లతో తన్నారు. వెంటనే ఆ గదిలో ఉన్న శాంతి కుమారి నేరుగా పెట్రోల్ చల్లడంతో సీఐ భిక్షపతిపై పడింది. కుట్ర కోణంలో విచారణ: రాచకొండ సీపీ గదిలో నుంచి పొగలు వస్తున్నాయని సీఐ భిక్షపతి తలుపు తెరిచేందుకు యత్నించాడు. తలుపు తెరుచుకున్న వెంటనే లోపలి నుంచి మంటలు వచ్చాయి. ఎవరైనా అతడి మీద దాడి చేశారా.. అనేది పోలీసు విచారణలో తేలుతుంది. ఈ ఘటనలో కుట్ర కోణంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. గదిలో ఉన్న శాంతికుమారి, పూనమ్చంద్లకు ఏమీ జరగలేదు. కేసు విచారణ కోసం వారిని అదుపులోకి తీసుకున్నాం. సీఐ భిక్షపతికి చేతులు, కాళ్లు 14 నుంచి 15 శాతం వరకు కాలాయి. – రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ -
హైదరాబాద్కు మరో కలికితురాయి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర చరిత్రలో మరో కలికితురాయి చేరింది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ మంగళవారం ప్రారంభమయింది. దక్షిణ భారతదేశంలోనే చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తొలి ప్లాంట్ ఇదే. జవహర్నగర్లోని ఈ ప్లాంట్ మొదటి దశ పనులు ప్రయోగాత్మకంగా ఇప్పటికే ప్రారంభం కాగా, మునిసిపల్ మంత్రి కె.తారకరామారావు లాంఛనంగా నేడు ప్రారంభోత్సవం చేశారు. కార్మిక శాఖ మంత్రి చామకర మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాంట్లోని రెండు బాయిలర్లకు గాను ప్రస్తుతం ఒకదాని ద్వారా రోజుకు 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇంటిగ్రేటెడ్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఐఎంఎస్డబ్లు్యఎం) ప్రాజెక్ట్గా వ్యవహరిస్తున్న దీని ద్వారా రోజుకు 1000 నుంచి 1200 మెట్రిక్టన్నుల ఆర్డీఎఫ్ చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. మలిదశలో మరో 28.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కూడా చర్యలు ప్రారంభమయ్యాయి. రెండు దశలు పూర్తయితే జవహర్నగర్కు తరలిస్తున్న చెత్తనుంచి 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఈ ప్లాంట్లో పర్యావరణహిత థర్మల్ కంబషన్ టెక్నాలజీతో విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటివి ఢిల్లీ, జబల్పూర్లలో మాత్రమే ఉన్నాయి. ఈ ప్లాంట్ వల్ల చెత్త నుంచి విద్యుత్తో చెత్త సమస్యకు పరిష్కారంతోపాటు పరిసరాల్లోని ప్రజలకు కాలుష్యం తగ్గుతుంది. చెత్త నుంచి ఆదాయం లభిస్తుంది. ఇప్పటి వరకు 1.34 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. రోజుకు సగటున 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరుగుతోంది. చదవండి: ‘చెత్త’ నుంచి వెలుగులు.. -
చెత్త తొలగింపు కార్మికుల ‘చెత్త’ లొల్లి !
సాక్షి, హైదరాబాద్: కాప్రా మండలం, జవహర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ ‘చెత్త’ పంచాయితీ చోటుచేసుకుంది. చెత్త లారీ డ్రైవర్ తనపై దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి వివరాల మేరకు.. జేజే వన్కాలనీ సమీపంలోని మోర్ సూపర్ మార్కెట్లో పోగైన చెత్తను జీహెచ్ఎంసీ చెత్త డబ్బాలో వేసినందుకు నెలకు రూ.10 వేలు ఇవ్వాలని చెత్తను తొలగించే కార్మికులు ఇంతకు ముందు డిమాండ్ చేశారు. దాంతో మోర్ మార్కెట్ సిబ్బంది రూ.3 వేలు ఇస్తామన్నారు. అయినా గత పదిహేను రోజులుగా చెత్త నిండిపోయినా ఎవరూ తొలగించలేదు. చెత్త డబ్బా నుంచి దుర్వాసన రావడంతో మోర్ సిబ్బంది కాప్రా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దానితో అధికారులు వెంటనే చెత్తను తొలగించమని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. వారు లారీ డ్రైవర్గణేష్, మరో కార్మికుడిని అక్కడకు పంపించారు. ఈ విషయం తెలుసుకున్న జేజే వన్ కాలనీ ప్రాంతంలో చెత్త తొలగించే కార్మికులు తమకు చెప్పకుండా చెత్తను ఎలా తీసుకెళ్తారని డ్రైవర్ గణేష్ను దూషిస్తూ, దాడికి పాల్పడ్డారు. బాధితుడి గణేష్ నుంచి ఫిర్యాదు స్వీకరించిన జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెత్త కార్మికుల ఆగడాలు రోజు రోజుకి మితీమీరి పోతున్నాయని స్థానికులు, మోర్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. (హైదరాబాద్లో ఇక ఎక్కడంటే అక్కడ శవ దహనం) -
చెట్టుకు ఉరేసుకున్న ఇద్దరు యువతులు
-
కరోనా వేళ.. తీవ్ర విషాదం
సాక్షి, హైదరాబాద్: ఒకేచోట మూడు మృతదేహాలు వెలుగు చూసిన ఘటన మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో కలకలం రేపింది. డెంటల్ కాలేజ్ డంపింగ్ ర్డ్ సమీపంలో మర్రి చెట్టుకు ఇద్దరు యువతుల మృతదేహాలతో పాటు చెట్టు పక్కనే మరో చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మూడు మృతదేహాలు ఒకేచోట ఉండటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య లేక హత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్డౌన్తో జనమంతా ఇళ్లకు పరిమితమైన వేళ ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇది చదవండి: బోర్ కొడుతుందని ఫ్రెండ్ని సూట్కేసులో.. -
జవహర్ నగర్ పోలీస్స్టేషన్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్స్టేషన్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత సంవత్సరం ఆంధ్ర, ఒడిశా బోర్డర్ లో జరిగిన పోలీస్ ఎన్ కౌంటర్లో ప్రభాకర్ అనే మావోయిస్టు మృతి చెందాడు. ప్రభాకర్ను స్మరించుకుంటూ అతని కుటుంబం నివాసం ఉండే యాప్రాల్ లో అభిమానులు స్థూపాన్ని కట్టేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇది తెలిసి అక్కడికి చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఆ ఏడుగురూ ఠాణాలోనే ఆందోళనకి దిగటంతో, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
డంపింగ్ యార్డ్లో అగ్నిప్రమాదం
మేడ్చల్: జిల్లాలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డులో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. -
జవహర్నగర్లో భారీ చోరీ
హైదరాబాద్: జవహర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. నాగారం లక్ష్మీనగర్ కాలనీలోని రచ్చ సుభద్రారెడ్డి అనే మహిళ ఇంట్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళాలు పగులగొట్టి సుమారు రూ.10 లక్షల నగదు, 8 తులాల బంగారం అపహరించారు. దీనిపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాచకొండ కమిషనరేట్ క్రైమ్ డీసీపీ జానకి, కుషాయిగూడ ఏసీపీ రఫిక్లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
వరద ప్రభవంతో నాలుగు రోజులుగా బస్సులోనే...
-
అపార్ట్మెంట్ పై నుంచి పడి చిన్నారి మృతి
రంగారెడ్డి : అపార్ట్మెంట్ పై నుంచి పడి చిన్నారి మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగూడ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక కల్పన అపార్ట్మెంట్ నాలుగో అంతస్థు పై నుంచి పడి తులసి అనే ఎనిమిదేళ్ల చిన్నారి మృతిచెందింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తులసి ప్రమాదవశాత్తు జారిపడిందా.. లేక కావాలనే పై నుంచి దూకిందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు మహిళల దారుణ హత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. కౌకూర్ గ్రామంలోని వెంకూష ఎస్టేట్ పక్కనున్న ఖాళీ ప్రదేశంలో సగం కాలిన గుర్తు తెలియని మహిళల మృతదేహాలను స్థానికులు శుక్రవారం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని దుండగులు ఆ మహిళల గొంతుకోసి కాల్చివేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మృతులను సెక్స్వర్కర్లుగా పోలీసులు భావిస్తున్నారు. సీఐ అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పేదల గూడుపై ప్రభుత్వం దాదాగిరి : భట్టి
- దొరల పాలన మళ్లీ కొనసాగుతోంది - హక్కుల కోసం ఆమరణదీక్ష చేసినా పట్టించుకోరా అంటూ ఆగ్రహం జవహర్నగర్ (రంగారెడ్డి) : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలపై నిరంకుశంగా వ్యవహరిస్తుందని తెలంగాణ పీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శామీర్పేట మండల పరిధిలోని జవహర్నగర్ గ్రామంలో వార్డు సభ్యులు, ప్రజలు నివసించే కాలనీలన్నింటిని గ్రామకంఠంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ 3 రోజులుగా చేపట్టిన ఆమరణ దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. పేదల ఇళ్లు కూల్చి కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే పేదల బతుకులు మారుతాయని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రెండు సంవత్సరాల క్రితం ప్రత్యేక రాష్టాన్ని ప్రకటించారని.. కానీ అందుకు భిన్నంగా టీఆర్ఎస్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి కుటుంబపాలన కొనసాగిస్తూ పేదలపై జులుం చేస్తూ దొరలపాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పెద్దలను వదిలి పేదలపై ప్రతాపం చూపుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. నిరుపేదల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాల్సిందేనని.. ప్రస్తుతం తండ్రి, కుమరుడు,కుమార్తె, అల్లుడు రాష్ట్రాన్ని ఏలుతున్నారన్నారు. పల్లెల్లో పనులు లేక బతుకుదెరువు కోసం పట్నానికి వచ్చిన పేద ప్రజలు కాయాకష్టం చేసుకొని నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేస్తే కట్టుబట్టలతో వారు ఎక్కడికి పోవాలో ముఖ్యమంత్రి కేసీఆరే వివరించాలని మండిపడ్డారు.మాజీ ప్రధాని జవహర్లాల్ పేరుతో వెలసిన జవహర్నగర్ గ్రామంలో పేదలే నివసించాలన్నారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ మాట్లాడుతూ.. పేదలకు అన్యాయం జరిగితే సహించేదిలేదని, వారందరికీ ఇండ్ల పట్టాలు మంజూరు చేసి సకల సౌకర్యాలు కల్పించే వరకు తమ పోరాటాలను ఆపేది లేదని స్పష్టం చేశారు. జవహర్నగర్ భూములు ప్రభుత్వానివి కావని.. మాజీ సైనికుల భూములని అన్నారు. జవహర్నగర్ ప్రభుత్వ భూములే అయితే జీవో 58,59 ప్రకారం క్రమబద్ధీకరించపోవడంపై మండిపడ్డారు. జవహర్నగర్ ప్రజలకు అన్యాయం జరిగితే రెండు లక్షల మందితో కేసీఆర్ ఫాంహౌస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. జవహర్నగర్లోని అన్ని ఇళ్లను క్రమబద్ధీకరించి గ్రామకంఠంగా గుర్తించేవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందన్నారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, టీ పీసీసీ ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్ కుమార్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్, కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ కాలేషా, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, శామీర్పేట మండల అధ్యక్షుడు వి.సుదర్శన్, ప్రధాన కార్యదర్శి గోనె మహీందర్ రెడ్డి, జవహర్నగర్ అధ్యక్షుడు బల్లి శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు మంజుల, ఎంపీటీసీ సభ్యుడు జైపాల్రెడ్డిలతో పాటు స్ధానిక నాయకులు పాల్గొన్నారు. -
ప్రేమ పేరుతో వంచన
జవహర్ నగర్ (రంగారెడ్డి జిల్లా) : తనకు న్యాయం చేయాలంటూ ఓ యువతి జవహర్ నగర్ పోలీసులను శుక్రవారం ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా దమ్మాయిగూడ భవానీ నగర్కు చెందిన ఓ యువతిని అదే ఊరుకు చెందిన నరేష్(22) అనే యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడు. తీరా పెళ్లి విషయం అడిగితే.. నీకు నాకు సంబంధం లేదని చేతులెత్తేశాడు. దీంతో పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని యువతి అభ్యర్థించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జవహర్నగర్లో ఇళ్ల కూల్చివేత
ముగ్గురు ఆత్మహత్యాయత్నం, ఉద్రిక్తత.. రోడ్డున పడిన వందకుపైగా కుటుంబాలు జవహర్నగర్: గూడు కోల్పోయిన బాధితు లకు చివరికి గోడు మిగిలింది. కాళ్లావేళ్లా పడ్డా అధికారులు కనికరించలేదు. ఆశల సౌధా లను నేలకూల్చి నిరాశ్రయులను చేశారు. దీంతో చాలా కుటుంబాలు రోడ్డుపాలయ్యా యి. పిల్లలు, వృద్ధులకు తలదాచుకునే దిక్కు లేక ఇబ్బందిపడ్డారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించుకున్నారంటూ వందకుపైగా ఇళ్లను సోమవారం రెవెన్యూ అధికారులు జేసీబీలతో నేలమట్టం చేశారు. దీంతో బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ముగ్గురు మహిళలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా జవహర్నగర్ పరిధిలోని చెన్నాపురంలో చోటుచేసుకుంది. జవహర్నగర్లోని ప్రభుత్వ స్థలంలో సుమారు వంద కుటుంబాలు కొన్నేళ్లుగా నివాసముంటున్నాయి. ప్రభుత్వం ఇటీవల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వడంతో వీరంతా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. జాయింట్ కలెక్టర్ రజత్కుమార్సైనీ, మల్కాజిగిరి ఆర్డీఓ ప్రభాకర్రెడ్డి, అల్వాల్ ఏసీపీ రఫీక్, శామీర్పేట తహసీల్దార్ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఈ ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులతో బయటికి నెట్టేశారు. కళ్లెదుటే తమ ఇళ్లను కూల్చివేస్తే ఉన్నపళంగా తామెక్కడికి వెళ్లాలని బాధితులు విలపించారు. ఐదు గంటలపాటు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం వస్తే తమ బతుకులు మారుతాయనుకుంటే.. ఇప్పుడు ఇళ్లే లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గ్రామ కంఠం, ప్రజలు నివాసముంటున్న కాలనీల్లో ఏ ఇంటినీ కూల్చలేదని తహశీల్దార్ రవీందర్రెడ్డి చెప్పారు. ఇకపై ప్రభుత్వ స్థలంలో నూతనంగా ఏ ఇంటిని నిర్మించినా సహించబోమని ఆయన హెచ్చరించారు. -
ఆక్రమణల కూల్చివేత: మహిళల ఆత్మహత్యాయత్నం
జవహర్నగర్: రంగారెడ్డి జిల్లా షామీర్పేట మండలం జవహర్నగర్లో అధికారులు పేదల ఇళ్లను కూల్చివేయటం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జాయింట్ కలెక్టర్ రజత్కుమార్ సైనీ, ఆర్డీవో ప్రభాకర్రెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో పోలీసులు గ్రామానికి చేరుకుని పేదల ఇళ్ల కూల్చివేత ప్రారంభించారు. నాలుగు ప్రొక్లెయినర్లతో ఇళ్లలోని పిల్లలు, మహిళలను బయటకు పంపించి, వారి సామగ్రిని చెల్లాచెదురు చేసి ఇళ్లను కూల్చివేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితులు నలుగురు మహిళలు కిరోసిన్ పోసుకుని, ఆత్మహత్యకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు, హెచ్చరికలు లేకుండా తమను రోడ్డున పడేస్తున్నారని అధికారులపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్ లో కల్తీపాల కేంద్రాలు
- దాడులు నిర్వహించిన ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్: నగరంలోని జవహర్నగర్ పీఎస్ పరిధిలోని యాప్రాల్లో కల్తీ పాలకేంద్రంపై సోమవారం ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. కల్తీ పాలు తయారు చేస్తున్న ఒకరిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 80 లీటర్ల పాలు, 3 పాల ప్యాకెట్లు, ఖాళీ పాల ప్యాకెట్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
జవహర్నగర్ (రంగారెడ్డి జిల్లా) : ఓ బీటెక్ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండలం దమ్మాయిగూడలోని శివనందపురికాలనీలో నివాసముండే సాయికిరణ్(25) ఘట్కేసర్లోని సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సాయికిరణ్ తల్లిదండ్రులు అతడి చిన్నతనంలోనే చనిపోవడంతో తాతయ్య కేదారి వద్ద ఉంటున్నాడు. కాగా సాయికిరణ్ బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్ కొక్కేనికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున కేదారి చూడగా అప్పటికే మృతిచెందాడు. పోలీసులు మృతదేహానికి గురువారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అయితే యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
భార్యను చంపిన భర్తకు రిమాండ్
జవహర్నగర్ (హైదరాబాద్) : భార్యను చంపిన ఓ భర్తను జవహర్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ఎస్ఐ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని నేరేడ్మెట్కు చెందిన చింతల వెంకటేష్ (24), మల్కాజిగిరి మిర్జాలగూడకు చెందిన చింతల రేణుక(22)లు ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వెంకటేష్ కారు డ్రైవర్గా పనిచేస్తుండగా రేణుక ఇంట్లోనే ఉండేది. కొంతకాలం మల్కాజిగిరి ప్రాంతంలో ఉన్న వీరు సంవత్సర క్రితం కాప్రా సర్కిల్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడకు మారి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే కొన్ని రోజులుగా దంపతులు గొడవపడుతున్నారు. కాగా రేణుక ఇతరులతో సన్నిహితంగా మాట్లాడుతుందనే కారణంతో కొన్ని రోజులుగా వెంకటేష్ అనుమానిస్తూ ఆమెను వేధించసాగాడు. పలుమార్లు ఆమెపై దాడులు కూడా చేశాడు. ఈ క్రమంలో ఆగస్టు 27న అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రేణుకను చున్నీతో ఉరివేసి వెంకటేష్ హత్య చేశాడు. అనంతరం అతడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
భార్యపై భర్త హత్యాయత్నం
జవహర్ నగర్ (రంగారెడ్డి) : ఓ వ్యక్తి భార్యను హతమార్చేందుకు యత్నించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శామీర్పేట మండలంలోని జవహర్ నగర్లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జవహర్ నగర్కు చెందిన శ్రీనివాస్, లావణ్యలు భార్యాభర్తలు. కాగా శుక్రవారం వీరిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన శ్రీనివాస్, భార్యను కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'కచ్చా స్పిరిట్ వల్లే చిన్నారుల మృతి'
హైదరాబాద్: జూబ్లీహిల్స్ జవహర్నగర్లోని ఓ ఇంట్లో శుక్రవారం ఉదయం సంభవించిన పేలుడు ఘటనకు కచ్చా స్పిరిట్ కారణమని పోలీసులు తెలిపారు. కచ్చా స్పిరిట్ను పొయ్యిలో పోయడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో కీర్తివాణి, నర్సమ్మ అనే చిన్నారులు చనిపోగా, మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద కారణాలను పోలీసులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల తల్లి సరస్వతి ఓ స్టూడియోలో పనిచేస్తోంది. పొయ్యి వెలిగించుకునేందుకోసం స్టూడియో నుంచి కచ్చా స్పిరిట్ను ఇంటికి తీసుకువచ్చింది. పెట్రోల్, స్పిరిట్ను కలిపితే కచ్చా స్పిరిట్ అవుతుందని పోలీసులు తెలిపారు. సినిమాల్లో పేలుళ్ల కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఈ రోజు ఉదయం పొయ్యి వెలిగించేందుకు ఈ స్పిరిట్ను వేయగా, ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కీర్తివాణి, నర్సమ్మ చనిపోయారు. -
జవహర్నగర్ పేలుడు ఘటనలో ఇద్దరి మృతి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ జవహర్నగర్లోని ఓ ఇంట్లో శుక్రవారం ఉదయం పేలుడు సంభవించిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స కీర్తివాణి, నర్సమ్మ అనే చిన్నారులు చనిపోయారు. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పేలుడు జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు, 108కి సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు జరిగిన సమయంలో చిన్నారుల తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు వంట చేయబోయి ప్రమాదానికి గురైనట్టు పోలీసులు తెలిపారు. పేలుడుకు రసాయనాలు కారణమని, దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. బాధిత కుటుంబం శ్రీకాకుళం నుంచి నగరానికి వచ్చిందని పోలీసులు తెలిపారు. -
జవహర్ నగర్ పేలుడు ఘటనలో చిన్నారి మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ జవహర్ నగర్లో శుక్రవారం ఉదయం జరిగిన పేలుడు ఘటనలో గాయపడ్డ చిన్నారి తిరుత్తవేణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేరని వెస్ట్జోన్ డీసీపీ తెలిపారు. చిన్నారులు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో బండల కింద నుంచి పేలుడు వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి కారణమైన వస్తువు ఏంటో తెలియటం లేదని, విచారణ అనంతరమే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు మొదట భావించారు. కాగా ప్రమాదానికి గురైన కుటుంబం శ్రీకాకుళం జిల్లా నుంచి నగరానికి వలస వచ్చినట్లు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. -
సిలిండర్ పేలుడు: చిన్నారులకు గాయాలు
-
‘తెలంగాణ వీరస్వామి’ మృతి
జవహర్నగర్: తెలంగాణ ఉద్యమంలో అరగుండుతో తనదైన శైలిలో పోరాటం చేసిన శనిగరం వీరస్వామి (తెలంగాణ వీరస్వామి) (48) సోమవారం సాయంత్రం జవహర్నగర్లోని అంబేద్కర్నగర్లో మృతి చెందారు. స్థానికులు, బందువులు తెలిపిన వివరాల ప్రకారం.. శనిగరం ఆనంద్, సుగుణమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, నలుగురు కూతుళ్లు. వీరిలో చిన్న కుమారుడైన వీరస్వామిని ఆనంద్ తన అన్న శనిగరం మల్లయ్య, మల్లమ్మలకు దత్తత ఇచ్చారు. కాగా.. ఇటీవల వీరస్వామి సొంత తల్లి సుగుణమ్మ అంబేద్కర్నగర్లో అనారోగ్యంతో మరణించింది. సోమవారం తల్లి దశదిన కర్మ నిర్వహించారు. వీరస్వామి కొంతకాలంగా కాలేయ వ్యాధితో పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం సాయంత్రం వీరస్వామి అకస్మాత్తుగా కిందపడి మృతిచెందారు. ప్రత్యేక తెలంగాణ కోసం టీ ఆకారంలో అరగుండుతో నిరసనలు ప్రత్యేక తెలంగాణ కోసం ఎక్కడ ఉద్యమాలు చేసినా వీరస్వామి టీ ఆకారంలో అరగుండుతో నిరసనలు తెలిపేవారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పటి నుంచి ప్రత్యేక వేషధారణతో ఉద్యమ సభల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ సాధించాలనే తపనతో వివాహం కూడా చేసుకోకుండా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. వీరస్వామి అంత్యక్రియలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి: రాంనగర్ జేఏసీ చైర్మన్ నర్సింహ వీరస్వామి మృతి చెందిన సమాచారం తెలుసుకున్న రాంనగర్ జేఏసీ చైర్మన్ ఎం.నర్సింహ, తెలంగాణ ఫిలిం జేఏసీ చైర్మన్ రమేష్బాబులు అంబేద్కర్నగర్లోని వీరస్వామి మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన మృతి తెలంగాణ ప్రజలకు తీరనిలోటని అన్నారు. వీరస్వామి అంత్యక్రియలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున వీరస్వామి అంత్యక్రియలు రాంనగర్లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
జవహర్నగర్లో ఉద్రిక్తత
జవహర్నగర్: జవహర్నగర్లోని రాజీవ్గాంధీనగర్ కాలనీలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. కొన్నాళ్లుగా అరాచకాలు సృష్టిస్తూ మహిళలను వేధిస్తున్న చింత శేఖర్ను పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించాలని కాలనీవాసులు ఆదివారం సాయంత్రం సమావేశమై ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. చింత శేఖర్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆయన వర్గీయులు కాలనీవాసులపై రాళ్లు రువ్వడంతో కొందరు మహిళలు గాయపడ్డారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు దాదాపు 600 మంది ఒక్కసారిగా ఆయనపై ఇంటిపై దాడి చేశారు. కారు అద్దాలు, ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. పన్నెండేళ్లుగా చింత శేఖర్ కాలనీవాసులపై దౌర్జన్యాలు చేశాడని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. కాగా ఇటీవల చింత శేఖర్ అదృశ్యమయ్యాడని ఆయన కుటుంబీకులు ఠాణాలో ఫిర్యాదు చేశారని, అదంతా నాటకమని వారు మండిపడ్డారు. చింత శేఖర్ ఇటీవల దసరా పండుగ నేపథ్యంలో స్థానికుల నుంచి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేశారని, ఆయనను వెంటనే అధికారులు గ్రామ బహిష్కరణ చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఇరువర్గాల ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న జవహర్నగర్ ఇన్స్పెక్టర్ వెంకటగిరి, ఎస్ఐలు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. గాయపడిన వారిని ఠాణాకు తీసుకెళ్లారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు సీఐ వెంకటగిరి పేర్కొన్నారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
జవహర్నగర్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన దంపతులు ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకన్న, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా రాజంపేట గ్రామానికి చెందిన పబ్బోజు హరి(40), పద్మ(34) దంపతులు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం జవహర్నగర్కు వలస వచ్చారు. వీరి కుమార్తెలు శ్రావ్య(13) సోనీ(11) స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు.కార్పెంటర్ పనిచేసే హరి నిత్యం మద్యం తాగుతూ భార్యతో గొడవపడుతున్నాడు. కుటుంబ పోషణకు డబ్బు లు ఇచ్చేవాడు కాదు. దీంతో పద్మ స్థానికంగా ఓ లేడిస్ టైలర్స్లో పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. మద్యం మానేయాలని పలుమార్లు ఆమె భర్తను బతిమాలినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు ఇటీవల దంపతులకు ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి. ఈక్రమంలో గురువారం ఉదయం 8 గంటల సమయంలో భార్యాభర్తలు తిరిగి తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన పద్మ ఇంట్లోకి వెళ్లి కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. మంటల బాధ తాళలేక బయటకు పరుగులు తీసింది. భార్య ఆత్మహత్యాయత్నం చేయడంతో తాను బతికి ఫలితం లేదని భావించిన హరి కూడా అక్కడే ఉన్న కిరోసిన్ డబ్బాను తీసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చిన్న కూతురు సోనీ విషయం గమనించి గఓ బకెట్ సాయంతో తల్లిదండ్రులపై నీళ్లు పోసింది. స్థానికులు మంటలు ఆర్పి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలపాలైన దంపతులను చికి త్స నిమిత్తం 108 వాహనంలో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే హరి మృతిచెందాడు. తండ్రి మృతిచెం దడం, తల్లి చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడడంతో శ్రావ్య, సోనీ లు కన్నీటిపర్యంతమయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సంబురాలు షురూ!
జవహర్నగర్లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు జిల్లాలో షురూ అయ్యాయి. పాఠశాలల్లో సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలతో.. వివిధ రకాల పూలను తెచ్చి బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం స్కూలు ఆవరణలో మహిళా ఉపాధ్యాయులతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఉపాధ్యాయులు బతుకమ్మపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. -
భూముల కోసం వేట
- ఫిలింసిటీ కోసం స్థలాల అన్వేషణ - జిల్లా యంత్రాంగానికి సినిమా కష్టాలు - భూ లభ్యతపై సందేహాలు - జవహర్నగర్పై యంత్రాంగం మొగ్గు - దీంతోనైనా అక్రమాలకు కళ్లెం వేయవచ్చని అంచనా సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ఫిలింసిటీ’ ఏర్పాటుపై జిల్లా యంత్రాంగం తర్జనభర్జనలు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. తెలంగాణలో చలనచిత్ర రంగాన్ని ప్రోత్సహించేందుకు వేయి ఎకరాల విస్తీర్ణంలో ఫిలింసిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే అనువైన భూములను గుర్తించాలని జిల్లా యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో భూ లభ్యతపై దృష్టి సారించిన రెవెన్యూ యంత్రాం గం.. ఒకేచోట ఆ స్థాయిలో భూసమీకరణ అంత సులువుకాదని భావిస్తోంది. నల్గొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని రాచకొండ గుట్టల్లో ఫిలింసిటీని ఏర్పాటు చేయాలని యోచించినప్పటికీ, అట వీ ప్రాంతం కావడం.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే ఆలోచన ఉన్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాద నాయక్ ప్రకటించిన నేపథ్యం లో.. రాచకొండ విషయంలో సాధ్యాసాధ్యాలపై అంచనా వేస్తోంది. అటవీ ప్రాంతంలో బిట్లు బిట్లుగానేవేయి ఎకరాలు లభిస్తుంది తప్ప నిర్దేశిత స్థాయి లో భూమి అందుబాటులోలేదని రెవెన్యూ యం త్రాంగం అంటోంది. అంతేగాకుండా రిజర్వ్ ఫారెస్ట్ కు నిర్దేశించిన ప్రాంతంలో కట్టడాలు, రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఉన్నందున.. ఈ ప్రాంతంలో ఫిలింసిటీ నిర్మించాలనే ఆలోచన సరికాదని చెబుతోంది. దీంతో పలు ప్రత్యామ్నాయాలను అన్వేషిం చిన జిల్లా యంత్రాంగం ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టుకు చేరువలో ఫిలింసిటీ ఉండేలా ప్రతిపాదనలు రూపొందించింది. శంషాబాద్ పరిసరాల్లో ఫిలింసిటీని ఏర్పాటు అంశాన్ని పరిశీలించినప్పటికీ, ఈ ప్రాంతం 111జీవో పరిధిలో ఉండడంతో యోచనను విరమించుకుంది. షాబాద్ మండలం సీతారాంపూర్లోని దేవాదాయశాఖ భూముల్లో కూడా ఫిలింసిటీని ప్రతిపాదిస్తే ఎలా ఉంటుందనే అంశం పై కూడా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జాతీయ రహదారి, ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయానికి చేరువలో ఈ చోటు ఉండడం సానుకూలంగా మారుతుందని భావిస్తోంది. జవహర్నగర్ వైపు మొగ్గు! ఫిలింసిటీ ఏర్పాటుకు పలు భూములను పరిశీలి స్తున్న యంత్రాంగం జవహర్నగర్ భూములపై దృష్టిసారించింది. నగరానికి సమీపంలో ఉండడం తో ఈ ప్రాంతంపై ఆసక్తి కనబరుస్తోంది. సుమారు 3వేల ఎకరాల భూమి ఒకే చోట లభించే అవకాశం ఉండడం.. సమీప ప్రాంతంలో విమానాశ్రయాన్ని కూడా నిర్మించాలనే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉండడంతో జవహర్నగర్ భూముల ను ఫిలింసిటీకి కేటాయించేందుకు యంత్రాంగం మొగ్గు చూపుతోంది. దాదాపు 5వేల ఎకరాల విస్తీ ర్ణం కలిగిన ఈ ప్రాంతంలో దాదాపు 2వేల పైచిలు కు ఎకరాల్లో ఆక్రమణలు వెలిశాయి. ఈ కట్టడాలను తొలగించడం.. అక్రమార్కులు మళ్లీ నిర్మించుకోవడం షరా మామూలుగా మారిన తరుణంలో.. ఈ భూములను ఫిలింసిటీకి కేటాయించడమే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. -
పల్లెల ప్రగతితోనే దేశ పురోగతి
జవహర్నగర్ : పల్లెలు ప్రగతిపథంలో పయనిం చినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పేర్కొన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా శుక్రవారం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవహర్నగర్ పాఠశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. భానిస సంకెళ్ల విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన జాతీయ నేతల ఆశయ సాధనకు కృషిచేయాలని పిలుపుని చ్చారు. మహాత్ముడి కలల సాకారానికి ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాల న్నారు. విద్యాపరంగా పల్లెలు పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక వసతుల కల్పనతోనే గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయని, ఇందుకు అవసరమైన సహాయసహకారాలు ప్రభుత్వాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా, చైనా తది తర దేశాలకన్నా భారత్ వేగంగా అభివృద్ధి చెంది భవిష్యత్లో ప్రపంచ దేశా ల్లో అగ్రగామిగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు. రామకృష్ణమఠం అధ్యక్షుడు బోదోదయానంద మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి దేశానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల విద్యార్థులు నిర్వహించిన మార్చ్ఫాస్ట్, సాంస్కృతిక ప్రదర్శనలు, విన్యాసాలు ఆహూతులను అలరించాయి. -
‘చెత్త’కు కొత్త చోటు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహానగరంలోని వ్యర్థాలను నిల్వ చేసే డంపింగ్యార్డులను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ప్రస్తుతం శామీర్పేట మండలం జవహర్నగర్లో ఈ డంపింగ్యార్డు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ యార్డులో పరిమితికి మించి వ్యర్థాలు డంప్ చేయడంతో తీవ్ర సమస్యలు తలెత్తుతున్న తరుణంలో శివారు ప్రాంతాల్లో మినీ డంపింగ్యార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కలెక్టర్ల సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు.. స్థలాలను పరిశీలించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన రెవెన్యూ యంత్రాంగం స్థలాల అన్వేషణ చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో ఆరుచోట్ల స్థలాలను గుర్తించిన యంత్రాంగం.. ఈ మేరకు నివేదికను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సమర్పించింది. 682 ఎకరాల్లో.. జీహెచ్ఎంసీకి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో డంపింగ్యార్డు ఏర్పాటు చేస్తే మేలని భావిస్తున్న సర్కారు.. ఆ మేరకు సమీపంలోని స్థలాలను గుర్తించాలని యంత్రాంగానికి స్పష్టం చేసింది. దీంతో మహేశ్వరం సమీపంలో 120 ఎకరాలు గుర్తించారు. అదేవిధంగా కీసర మండలంలో 300 ఎకరాలు, కందుకూరు మండలం ముచ్చర్లలో 52 ఎకరాలు, ఘట్కేసర్ మండలం ఏదులాబాద్లో 38 ఎకరాలు, మొయినాబాద్ మండలం కనకమామిడి లో 120 ఎకరాలు, శివారు ప్రాంతంలో మరో 52 ఎకరాల చొప్పున 682 ఎకరాలు గుర్తించి నివేదికను జీహెచ్ఎంసీకి సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. చెత్త నిల్వలతో సమస్యలే..! డంపింగ్యార్డుల ఏర్పాటుతో మహానగరానికి కొంత ఊరట కలిగినప్పటికీ.. స్థానికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం జవహర్నగర్ డంపింగ్యార్డుతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బంది అంతాఇంతా కాదు. వాతావరణ కాలుష్యంతో అక్కడి ప్రజలు పలురకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు డంపింగ్యార్డు పరిధిలోని దాదాపు 15 కిలోమీటర్ల వరకు భూగర్భజలాలు కలుషితమయ్యాయి. పెద్ద ఎత్తున చెత్తనిల్వలు చేసిన నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారవర్గాలు సైతం చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త డంపింగ్యార్డుల ఏర్పాటుపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. -
కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు
జవహర్నగర్, న్యూస్లైన్: శామీర్పేట ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్కు 15 మంది ఎంపీటీసీలు ఉన్నప్పటికీ.. పదవి చేజారి పోతుందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. శామీర్పేటలో 29 ఎంపీటీసీ స్థానాలకు ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్ 15, టీడీపీ 6, టీఆర్ఎస్ 5, బీజేపీ 2, ఒకరు సీపీఐ అభ్యర్థి గెలిచారు. అయితే ఈసారి ఎంపీపీ పీఠం బీసీ జనరల్గా రిజర్వ్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ నుంచి మండలంలోని శామీర్పేట ఎంపీటీసీ 1 నుంచి వి.సుదర్శన్, 2 నుంచి ఎం.రేణుకమహేందర్ యాదవ్, సునీత (యాంజాల్), బొబ్బిలి మంజుల యాదగిరి (జవహర్నగర్- 8)లు, టీడీపీ నుంచి తూంకుంట ఎంపీటీసీ చంద్రశేఖర్యాదవ్, అనంతారం నుంచి మల్లేశ్గౌడ్లు ఎంపీపీ పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా మిగతా ఎంపీటీసీలతో బేరసారాలు చేస్తూ మంతనాలు కొనసాగిస్తున్నారు. శామీర్పేటకే ఎంపీపీ పదవి ఇవ్వాలని కొందరు నాయకులు పట్టుబడుతుండగా, జవహర్నగర్కు ఇవ్వాలని మరికొందరు నాయకులు పైరవీలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి జెడ్పీటీసీగా శామీర్పేటకు కేటాయించినందున ఎంపీపీ పదవిని జవహర్నగర్కే కేటాయించాలని ఎంపీటీసీ సభ్యురాలు మంజుల పట్టుపడుతున్నారు. ఇదే అదనుగా భావించిన టీఆర్ఎస్ జవహర్నగర్ ఎంపీటీసీ రంగుల సతీష్ ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా జవహర్నగర్ గ్రామ టీఆర్ఎస్ ముఖ్యనాయకులు ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ 5, టీడీపీ 6, బీజేపీ 2, సీపీఐ 1తో కలుపుకుని 14 మంది ఎంపీటీసీలు అవుతున్నారు. మెజార్టీ కోసం ఇంకొకరిని కాంగ్రెస్ పార్టీ నుంచి తమవైపు తిప్పుకొంటే ఎంపీపీ పీఠం తమకే దక్కుతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాల కారణంగా 15 మంది ఎంపీటీసీలు ఏకతాటిపై లేనిపక్షంలో ఎంపీపీ పదవి చేజారే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలతో సమావేశం ఏర్పాటు చేసి ఎవరు చేజారకుండా నేడో, రేపో ఆ పార్టీ ముఖ్యనాయకులు, ఎంపీటీసీ కుటుంబ సభ్యులతో సహా క్యాంపునకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
మమ్మీ.. చెల్లి జాగ్రత్త..!
* కుక్క మోనును జాగ్రత్తగా చూసుకోండి * నా చావుకు ఎవరూ బాధ్యులు కారు * సూసైడ్నోట్ రాసి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య జవహర్నగర్, న్యూస్లైన్: ‘మమ్మీ, డాడీ.. చెల్లి జాగ్రత్త.. నా కుక్క ‘మోను’ను బాగా చూసుకోండి, నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’ అంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా జవహర్నగర్లో గురువారం జరిగింది. అల్వాల్ ఎస్ఐ వెంకన్న, స్థానికులు, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన నేవీ విశ్రాంత ఉద్యోగి సూర్య క్రాంతం, విజయలక్ష్మి దంపతులు 20 ఏళ్లుగా జవహర్నగర్లోని ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలో ఉంటున్నారు. వీరికి కూతుళ్లు సునీత (26),హేమలత ఉన్నారు. సునీత ఏఎస్ రావు నగర్లోని ఇరిటెల్ సైబర్ టెక్ కంపెనీలో మూడేళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల సునీతకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. గురువారం తనకు ఆరోగ్యం బాగాలేదని సునీత ఇంట్లోనే ఉండిపోయారు. క్రాంతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండడంతో విధులకు వెళ్లిపోయారు. విజయలక్ష్మి చిన్నకూతురు హేమలతను తీసుకొని షాపింగ్కు వెళ్లారు. అనంతరం తల్లీకూతుళ్లు మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటికి రాగా సీలింగ్కు సునీత విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. సునీత ఆత్మహత్యకు పాల్పడిన గదిలో ఓ గ్లాస్లో నలుపురంగు ద్రవం ఉంది. ఓ సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లెటర్లో ‘మమ్మీ, డాడీ.. చెల్లి జాగ్రత్త. కుక్క మోనును సరిగా చూసుకోండి, నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’ అని ఇంగ్లిష్లో ఉంది. సునీత సెల్ఫోన్కు ‘వేర్ ఆర్ యూ’ అని ఉదయం 11 గంటలకు ఓ మెసేజ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈమేరకు ఆమె కాల్డేటాను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. ప్రేమ వ్యవహారం ఆత్మహత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. -
‘నార్నె ఎస్టేట్స్’కు పంచాయతీ నోటీసులు
జవహర్నగర్, న్యూస్లైన్: జవహర్నగర్ పరిధిలోని నార్నె రంగారావు ఎస్టేట్స్కు గ్రామపంచాయతీ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి జయరాం మాట్లాడుతూ.. ఫైరింగ్రేంజ్ పరిసర ప్రాంతాల్లో వర్షపునీరు దిగువప్రాంతాలకు వెళ్లకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టారని ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ, శ్రీసాయి వెల్ఫేర్ సొసైటీల ఫిర్యాదు మేరకు ఎన్నోసార్లు ఎస్టేట్ వారికి నోటీసులు జారీ చేశామని అన్నారు. అయినా స్పందించలేదని, తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. వారం రోజుల గడువు అనంతరం ప్రహరీ నిర్మాణాన్ని కూల్చివేసి నాలాను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. -
ఓ ప్రాజెక్టుకు.. మరో వంద కోట్లు!
బకాయి కింద స్వాహా చేసేందుకు ఓ ‘స్వగృహ’ కాంట్రాక్టర్ పన్నాగం జవహర్నగర్ వెంచర్కు ఎసరు రూ.380 కోట్ల ప్రాజెక్టు విలువ రూ.100 కోట్లుగా నిర్ధారణ తన బకాయి కింద దాంతోపాటు మరో రూ.100 కోట్లు చెల్లించాలని ప్రతిపాదన ఢిల్లీ స్థాయిలో పైరవీ సాక్షి, హైదరాబాద్: మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఉన్నత వసతులతో ఇళ్లు అందించాల్సిన స్వగృహ ప్రాజెక్టుల్లో లీలలెన్నో. గత నాలుగేళ్లుగా ఈ పథకం నీరుగారిపోవటానికి దారితీసిన పరిణామాలన్నీ విస్మయపరిచేవే. ఇప్పుడు ఓ బడా కాంట్రాక్టర్ వాటిని మించిన డ్రామాకు తెరతీశాడు. తాను చేసిన పనులకు చెల్లించాల్సిన బకాయిల కింద ఏకంగా 2,900 అపార్ట్మెంట్లతో ఉన్న జవహర్నగర్ స్వగృహ ప్రాజెక్టుతోపాటు.. మరో రూ.100 కోట్లు స్వాహా చేసేందుకు ఎత్తుగడ వేశాడు. ఈ అసంబద్ధ ప్రతిపాదనను అమలు చేసుకోవటానికి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నాడు. హైదరాబాద్ శివారులోని జవహర్నగర్లో 10 ఎకరాల విస్తీర్ణంలో 2,900 యూనిట్లతో స్వగృహ కార్పొరేషన్ బడా ప్రాజెక్టును మొదలుపెట్టి ప్రధాన నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇందుకు దాదాపు రూ.380 కోట్ల వరకు ఖర్చు చేసింది. కానీ స్వగృహ పథకాన్ని పర్యవేక్షించడంలో కిరణ్ ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో అది కాస్తా దారితప్పి అప్పుల కుప్పలో కూరుకుపోయింది. ఫలితంగా సరైన మార్కెటింగ్ కూడా లేకపోవటంతో జవహర్నగర్ ప్రాజెక్టు తెల్ల ఏనుగులా మారిపోయింది. దీంతో అది డిమాండ్ లేని ప్రాజెక్టుగా అధికారులు తేల్చి అక్కడ పనులు నిలిపివేశారు. ఎవరైనా ప్రైవేటు నిర్మాణ సంస్థలు ముందుకొస్తే దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమ్మాలని నిర్ణయించారు. ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. చాలాకాలంగా కార్పొరేషన్ స్వగృహ కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవటంతో అవి కొండలా పేరుకుపోయాయి. ఓ బడా కాంట్రాక్టు సంస్థకు ఏకంగా రూ.200 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో తన బకాయికింద జవహర్నగర్లోని అసంపూర్తి ప్రాజెక్టును దఖలు చేయాలని ఓ ప్రతిపాదన పెట్టింది. అంతేకాకుండా కార్పొరేషన్ రూ.380 కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టు విలువను రూ.100 కోట్లుగా ‘నిర్ధారించేసింది’. ఆ నిర్మాణాలు అసంబద్ధంగా ఉన్నందున ఎవరూ కొనరని, అందుకే దాని విలువ అంతకంటే ఎక్కువ ఉండదని ఖరారు చేసింది. ఆ ప్రాజెక్టు తనకు ఇస్తే రూ.100 కోట్ల బకాయి తీరిపోతుందని, మిగతా రూ.100 కోట్లను డబ్బు రూపంలో చెల్లిస్తే సరిపోతుందని అందులో పేర్కొంది. ఇది అసాధ్యమైన ప్రతిపాదన కావడంతో అంగీకరించటం సాధ్యం కాదని అధికారులు తిరస్కరించారు. కానీ, ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న ఆ సంస్థ అక్కడి నుంచి పైరవీ మొదలు పెట్టింది. ప్రభుత్వ పెద్దలతో దానికి పచ్చజెండా ఊపించి తన వ్యూహాన్ని అమలు చేసుకునే పనిలో పడింది. అయితే పదిరోజుల క్రితం కాంట్రాక్టర్ల బకాయిలు తీర్చేందుకు ప్రభుత్వం స్వగృహ కార్పొరేషన్కు గృహనిర్మాణ సంస్థకు చెందిన నిధుల్లోంచి బదలాయింపుగా రూ.246 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఇందులో కొంత మొత్తాన్ని ఆ సంస్థకు చెల్లిస్తారో లేదా ప్రాజెక్టునే కట్టబెడతారో చూడాలి.