jewelery
-
ఎగసి‘పడిన’ పసిడి.. వెండి
Gold Price Today: దేశంలో బంగారం ధరలు దిగివచ్చాయి. మూడు రోజులుగా వరుసగా ఎగిసిన పసిడి రేట్లకు క్రితం రోజున బ్రేక్ పడగా నేడు (డిసెంబర్ 13) భారీగా తగ్గాయి. వారం రోజులుగా తగ్గుదల కోసం ఎదురుచూస్తున్న పసిడి కొనుగోలుదారులకు శుక్రవారం భారీ ఊరట కలిగింది.దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.72,300, 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,870 లుగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.550, రూ.600 చొప్పున క్షీణించాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.72,450 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.79,020 వద్ద ఉన్నాయి. వీటి ధరలు క్రితం రోజుతో పోల్చితే రూ.550, రూ.600 మేర దిగివచ్చాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.550 తగ్గి రూ.72,300 వద్దకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.600 తగ్గి రూ.78,870 వద్దకు వచ్చాయి.ఇదీ చదవండి: అకౌంట్లో క్యాష్.. ఎన్ని లక్షలు ఉండొచ్చు?వెండి పతనందేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) నేడు భారీగా పతనమయ్యాయి. నిన్నటితో పోల్చితే కేజీకి రూ.3000 చొప్పున తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్లో వెండి కేజీ ధర రూ.1,01,000 వద్దకు రాగా ఢిల్లీలో రూ.93,500 వద్దకు క్షీణించింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
టాలీవుడ్ మూవీ జ్యువెల్ థీఫ్ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: జ్యూవెల్ థీఫ్ - మూవీ రివ్యూనటీనటులు: కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్, అజయ్ తదితరులుడైరెక్టర్: పీఎస్ నారాయణనిర్మాత: మల్లెల ప్రభాకర్నిర్మాణ సంస్థ: శ్రీ విష్ణు గ్లోబల్ మీడియాసంగీతం: ఎం. ఎం. శ్రీలేఖవిడుదల తేదీ: 08 నవంబర్ 2024సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడైనా ఆదరణ ఉంటుంది. అందుకే సరికొత్త కంటెంట్తో దిగితే ప్రేక్షకులే సూపర్ హిట్ చేస్తారు. అలాంటి తరహాలో వచ్చిన తాజా చిత్రం జ్యూవెల్ థీఫ్(Beware of Burglar). ఇవాళ ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. పీఎస్ నారాయణ దర్శకత్వం వహించగా.. మల్లెల ప్రభాకర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.అసలు కథేంటంటే..సిన్సియర్ ట్రావెల్స్ ఓనర్ కృష్ణ (కృష్ణసాయి) వజ్రాలు, బంగారం నగలు దొంగిలిస్తుంటాడు. శివారెడ్డితో కలిసి దొంతనాలు చేస్తూ వచ్చిన డబ్బులతో అనాథ పిల్లలకు పంచిపెడతాడు. నేహ (నేహా) నెక్లెస్ కూడా దొంగిలిస్తాడు. పట్టుబడి జైలుకు వెళ్లి వస్తాడు. కృష్ణ గురించి అసలు విషయం తెలుసుకుని అతన్ని ప్రేమిస్తుంది. ఇదే క్రమంలో ఒక కండీషన్ పెడుతుంది. మోసం చేయకుండా, జూదం ఆడకుండా 6 నెలల్లో 15 లక్షలు సంపాదించాలని చాలెంజ్ విసురుతుంది. ఈ క్రమంలో ధనిక కుటుంబానికి చెందిన అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి పనులు చేస్తూ, అతడిని బాగు చేస్తాడు. కానీ అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని చంపినట్టు హత్య కేసులో ఇరుక్కుంటాడు. నమ్మించి భారీ దెబ్బ కొడతారు. ఇంతకీ కృష్ణను మోసం చేసింది ఎవరు? ఊహించని చిక్కుల్లో ఎలా ఇరుక్కుంటాడు? హత్య కేసు నుంచి బయటపడతాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..జ్యూవెల్ థీఫ్ అనే టైటిల్ వినగానే ఇదేదో దొంగల ముఠా కథ అయి ఉంటుందనుకుంటారు. అలాంటిదే అయినప్పటికీ ఇందులో ప్రేమకథను కూడా చూపించారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్లో పాత్రల పరిచయం, హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమాయణం చూపించారు. పూర్తి స్థాయి సస్పెన్స్ థ్రిల్లర్గానే వచ్చినప్పటికీ ఆడియన్స్కు అంతగా కనెక్ట్ కాలేదు.అయితే సెకండాఫ్లో కథలో వేగం పుంజుకుంటుంది. ఆ హత్య కేసు చుట్టే కథ మొత్తం తిరుగుగుతుంది. కథను తాను అనుకున్నట్లుగా ప్రేక్షకులకు చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. తను రాసుకున్న కథను ఆకట్టుకునే రీతిలో తెరపై ఆవిష్కరించారు. కానీ స్క్రీన్ ప్లే మరింత ఆకట్టుకునేలా ఉంటే బాగుండేది. బ్యాంకాక్లో చిత్రీకరించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాను ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..హీరో కృష్ణసాయి తన పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో డాన్స్, మేనరిజం, హెయిర్ స్టైల్తో ఆకట్టుకున్నారు. కొన్ని సన్నివేశాలలో సూపర్ స్టార్ కృష్ణ పోలికలతో కనబడతారు. హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ తన గ్లామర్, ఫర్మార్మెన్స్తో ఆకట్టుకుంది. సీనియర్ నటీనటులైన ప్రేమ, అజయ్ కథకు తమదైన నటనతో అలరించారు. ఇక పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతా రెడ్డి తమ పాత్రల్లో చక్కగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే ఎం.ఎం. శ్రీలేఖ అందించిన సంగీతం సినిమా స్థాయిని పెంచింది. బ్యాక్ గ్రాండ్ స్కోర్ ఫర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్ విజువల్స్ అందంగా చూపించారు. ఎడిటర్ జేపీ తన కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. ఫైటర్ మాస్టర్ మార్షల్ రమణ స్టంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
హత్రాస్ ఘటన: మృతదేహాల నుంచి నగలు మాయం
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో చోటుచేసుకున్న తొక్కిసలాటకు సంబంధించి మరికొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సత్సంగానికి హాజరైన పలువురు మహిళలు మంగళసూత్రాలు, నగలు వేసుకుని వచ్చారు. అయితే తొక్కిసలాటలో మృతిచెందిన మహిళల మెడలో ఉండాల్సిన నగలు మాయమయ్యాయి. దీంతో ఇక్కడ మనుషులే కాదు మానవత్వం కూడా చచ్పిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఘటనా స్థలంలో ఇప్పటికీ భయానక దృశ్యానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చెప్పులు, దుస్తులు, వంట పాత్రలు, బ్యాగులు.. ఇప్పటికీ అక్కడ కనిపిస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు ఇక్కడకు చేరుకుని తమవారి వస్తువుల కోసం వెతికారు. వారికి అక్కడ తమ వారి విలువైన వస్తువులేవీ లభించలేదు. తమ ఇంటి మహిళలు మంగళసూత్రాలు, చెవిపోగులు, బంగారు గాజులు ధరించి ఇంటి నుంచి వచ్చారని అయితే వారి మృతదేహాలపై ఉండాల్సిన నగలు మాయమయ్యాయని బాధిత కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.ఆస్పత్రిలో తన తల్లి ఆశాదేవి మృతదేహం ఉందని, అయితే ఆమె సత్సంగానికి వెళ్లిన సమయంలో వేసుకున్న నగలు మాయమయ్యాయని ఆమె కుమారుడు తెలిపాడు. కస్గంజ్లోని పాటియాలీ నివాసి బ్రజేష్ తల్లి కూడా ఈ తొక్కిసలాటలో కన్నుమూసింది. ఆమె మెడలో ఉండాల్సిన నగలు కూడా మాయమయ్యాయి. ఇదేవిధంగా పాటియాలీకి చెందిన జైవీర్ తల్లికి చెందిన బంగారు గొలుసు, ముక్కుపుడక, చెవిపోగులు మాయమయ్యాయి. ఘటన అనంతరం మృతదేహాలను, క్షతగాత్రులను ఒకే అంబులెన్స్లో ఎక్కించారని బాధితులు తెలిపారు. సంఘటనా స్థలంలో తగినన్ని అంబులెన్స్లు, ఇతర వైద్య సౌకర్యాలు ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవి కావని బాధితులు పేర్కొన్నారు. -
కళ్ళు చెదిరే అద్భుత జ్యుయలరీ కలెక్షన్ (ఫోటోలు)
-
నీతా అంబానీ లగ్జరీ కార్లు, డైమండ్ నగలు (ఫోటోలు)
-
ఉగాది వేళ బంగారం కొందామనుకుంటే.. ప్చ్!
Gold Rate today: ఉగాది వేళ బంగారం కొందామనుకున్న పసిడి ప్రియులకు బంగారం ధరలు నిరుత్సాహాన్ని కలిగించాయి. ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ ఈరోజు (ఏప్రిల్ 8) పెరిగాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న పసిడి ధరలు 10 గ్రాములకు ఈరోజు రూ.490 మేర పెరిగాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.65,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున పెరిగి రూ.71,620 వద్దకు ఎగిసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలా.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది. ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యధికంగా రూ.450 పెరిగి రూ.66,600లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.490 చొప్పున పెరిగి రూ.72,650 ఉంది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 ఎగిసి రూ.65,800 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 పెరిగి రూ.71,770 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది. cost of silver today: ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా మళ్లీ పెరిగాయి. క్రితం రోజు స్థిరంగా ఉన్న రజతం ఈరోజు కేజీకి రూ.1000 చొప్పున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.88,000 ఉంది. ఇది క్రితం రోజున రూ. 87,000 లుగా ఉండేది. -
కాలికి ధరిస్తే కళ్లు పట్టేస్తున్నాయి..
అందమైన పాదాలను అంటిపెట్టుకునే అందియలు అమ్మాయిలకు అత్యంత ఇష్టం అందుకే, పట్టీలు వారి అలంకరణలో ఎప్పుడూ ప్రత్యేకతను నింపుకుంటాయి. ఈ ఆధునిక యుగంలో అమ్మాయిలు పట్టీలు పెట్టుకోవడం లేదు అనే నిన్నటి తరం నిరాశను దూరం చేస్తూ... ఆంకిల్స్ పేరుతో వచ్చి కొత్తగా చేరిపోయాయి. వాటితో పాటు బంగారు, వెండి, డైమండ్ ఆభరణాలలోనూ, ఇమిటేషన్ జ్యువెలరీలోనూ సగం పాదాన్ని కప్పేస్తున్నట్టుగా ఉండే పట్టీల డిజైన్లు ఎన్నో వచ్చాయి. సందర్భానికి తగినట్టు అలంకరించుకోవడానికి వేటికవి ప్రత్యేకతను కలిగి ఉంటున్నాయి. కాలికి ధరించేవే అయినా కళ్లనూ పట్టేస్తున్నాయి. మొఘలాయ్ రాణివాసపు హంగు కాలి అందియలలోనూ కనిపిస్తుంది. పెళ్లి పల్లకీ, రాజు రాణీ, నెమళ్లు, పువ్వుల డిజైన్లతో ఆకట్టుకుంటున్న పట్టీలు నేటితరం అమ్మాయిలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పూసలు, రత్నాలు వరసలుగా అల్లుకుపోయిన పూసలు కాలి పట్టీలుగా అమరి ఆధునికతనూ, సంప్రదాయతకు మేళవింపుగా ఉన్నాయి. పెద్ద పెద్ద రత్నాలు వీటిలో విశేషంగా అమరిపోయాయి. ఆధునికత... స్నేక్, రౌండ్ స్టైల్లో ఉండే బంగారు, వెండి ఆంక్లెట్ మోడ్రన్ స్టైల్కి అదనపు హంగుగా అమరుతున్నాయి. ఇవి చదవండి: ఇదేందయ్యా ఇది..! డెస్టినేషన్ వెడ్డింగ్.. వేరే లెవల్! -
జోయాలుక్కాస్ చైర్మన్కు ప్రత్యేక పురస్కారం
హైదరాబాద్: జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ అలుక్కాస్ ప్రపంచ జ్యువెలరీ సమాఖ్య నుంచి ప్రత్యేక పురస్కారం అందుకున్నారు. వర్డల్ జ్యువెలరీ కానె్ఫడరేషన్(సీఐబీజేఓ) జైపూర్లో నిర్వహించిన కాంగ్రెస్ 2023 కార్యక్రమంలో సంస్థ ఎండీ జాన్ పాల్ అలుక్కాస్.. చైర్మన్, ఎండీ జాయ్ అలుక్కాస్ తరఫున ఈ గౌరవాన్ని స్వీకరించారు. సప్లై చైన్లో నైతిక పద్ధతులు, సుస్థిరతలకు సాటిలేని కృషిని వరల్డ్ జ్యువెలరీ కాన్ఫెడరేషన్ గుర్తించింది. ‘‘ఈ గుర్తింపును మా సంస్థలో ప్రతి ఒక్క సభ్యునితో భాగస్వామ్యం చేస్తున్నాను’’ అని జాయ్అలుక్కాస్ తెలిపారు. -
కారట్లేన్లో టైటన్ వాటా అప్
న్యూఢిల్లీ: ఆధునిక జ్యువెలరీ బ్రాండ్ కారట్లేన్లో 27.18 శాతం అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు జ్యువెలరీ దిగ్గజం టైటన్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 4,621 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. దీంతో అనుబంధ సంస్థ కారట్లేన్లో తమ వాటా 98.28 శాతానికి జంప్చేయనున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ తెలియజేసింది. కారట్లేన్ వ్యవస్థాపకులు మిథున్ సాచేటి, శ్రీనివాసన్ గోపాలన్సహా వారి కుటుంబీకుల నుంచి పూర్తి వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. 2023 అక్టోబర్కల్లా కొనుగోలు పూర్తికాగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి సంస్థలో తమ వాటా ప్రస్తుత 71.09 శాతం నుంచి 98.28 శాతానికి బలపడనున్నట్లు తెలియజేసింది. కంపెనీల ఆవిర్భావమిలా.. అన్లిస్టెడ్ సంస్థ కారట్లేన్ ట్రేడింగ్ గతేడాది(2022–23) రూ. 2,177 కోట్ల టర్నోవర్ అందుకుంది. జ్యువెలరీ తయారీ, విక్రయాలనూ నిర్వహిస్తోంది. 2008లో పూర్తి ఆన్లైన్ బ్రాండ్గా ప్రారంభమైన కంపెనీలో టైటన్ తొలిసారి 2016లో ఇన్వెస్ట్ చేసింది. గత 8ఏళ్లలో తనిష్క్ బ్రాండుతో భాగస్వామ్యం ద్వారా కారట్లేన్ భారీ వృద్ధిని సాధించింది. టాటా గ్రూప్, తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(టిడ్కో) భాగస్వామ్య కంపెనీగా టైటన్ ఏర్పాటైంది. 1987లో టైటన్ వాచెస్గా కార్యకలాపాలు ప్రారంభించి 1994కల్లా తన‹Ù్క బ్రాండుతో జ్యువెలరీలోకి ప్రవేశించింది. తదుపరి టైటన్ ఐప్లస్ బ్రాండుతో కళ్లజోళ్ల బిజినెస్నూ ప్రారంభించింది. ఈ బాటలో పరిమళాలు, దుస్తులు, మహిళల బ్యాగులు, తదితర విభిన్న అనుబంధ ఉత్పత్తుల విక్రయాలకూ తెరతీసింది. అయితే గతేడాది కంపెనీ టర్నోవర్లో 88 శాతం వాటాకు సమానమైన రూ. 31,897 కో ట్లను జ్యువెలరీ విభాగం నుంచే పొందడం విశేషం! -
చందానగర్ నగల దుకాణంలో భారీ చోరీ..
హైదరాబాద్: చందానగర్లోని నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. గాంధీ విగ్రహం వద్ద ఉన్న పుఖ్రజ్ లాల్ చంద్ జ్యువలరీ షాప్ లో ఈ ఘటన జరిగింది. నిన్న అర్ధ రాత్రి సమయంలో నగల దుకాణం గోడకు కన్నం వేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు. నగల దుకాణానికి ఆనుకోని ఓ వస్త్ర దుకాణం ఉంది. దీన్నే తమ ఆయుధంగా చేసుకున్న దుండగులు వస్త్ర దుకాణం గోడ నుంచి నగలు దుకాణానికి కన్నం వేశారు. అనంతరం దుకాణంలో చొరబడి విలువైన నగలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకుని.. సీసీటీవీ ఆధారంగా నేరస్తులను పట్టుకునే పనిలో పడ్డారు. ఇదీ చదవండి: నిండా 40 లేవు, గుండెపోటుతో ఐటీడీఏ ఛైర్మన్ మృతి -
ట్వింకిల్ ట్వింకిల్ సూపర్స్టార్
మహేష్ బాబు–నమ్రతా శిరోద్కర్ల ముద్దుల కూతురు సితార న్యూయార్క్లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డ్పై మెరిసి నెటిజనులను కనువిందు చేసింది. ఒక జ్యుయెలరీ యాడ్లో సితార నటించింది. ఆ యాడ్కు సంబంధించిన చిత్రాలను బిల్బోర్డ్పై ప్రదర్శించారు. ‘సో సో ప్రౌడ్ ఆఫ్ యూ మై ఫైర్ క్రాకర్’ అంటూ మహేష్బాబు సితార చిత్రాలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ‘పదాలలో చెప్పలేని సంతోషం ఇది. కీప్ షైనింగ్ మై సూపర్ స్టార్’ అంటూ స్పందించింది నమ్రతా శిరోద్కర్. చిన్న వయసులోనే యూ ట్యూబ్ చానల్ మొదలు పెట్టి ‘ఆహా!’ అనిపించిన సితార చక్కని డ్యాన్సర్ కూడా. ‘ఫ్రోజెన్–2’ సినిమా తెలుగు వెర్షన్లో బేబీ ఎల్సా పాత్రకు వాయిస్–వోవర్ ఇచ్చింది. జ్యుయలరీ బ్రాండ్ ‘పీఎంజే’కు సితార బ్రాండ్ అంబాసిడర్. ఈ నేపథ్యంలో యంగెస్ట్ స్టార్ కిడ్గా టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డ్పై మెరిసింది. -
ఈ విషయంలో మొదటి భారతీయ స్టార్ కిడ్గా 'సితారా పాప'కు గుర్తింపు
ప్రముఖ నటుడు మహేశ్బాబు తనయ సితార సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఫొటోషూట్, విహార యాత్రలు, వేడుకలు.. ఇలా తాను ఎంజాయ్ చేసిన వాటన్నింటి వివరాలను ఫాలోవర్స్తో పంచుకుంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికే మిలియన్కు పైగా ఫాలోవర్లను సంపాదించింది. ఇక తరచూ తండ్రి మహేశ్ నటించిన లేదా ఇతర సినిమాల్లోని పాటలకు తను డాన్స్ చేసిన వీడియోలను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తుంటోంది. కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ వద్ద సీతార కొద్ది రోజులుగా డ్యాన్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. (ఇదీ చదవండి: Adipurush: అక్కడ టికెట్లు కొనేవారే లేరు.. షాక్లో ఫ్యాన్స్) తాజాగా సాయిపల్లవి నటించిన లవ్స్టోరీలోని సారంగదరియా సాంగ్కు అద్భుతంగా డాన్స్ చేసింది సితార. ఈ వీడియోను తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. తన పెర్ఫార్మెన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సితార డాన్స్ వీడియోకు కేవలం గంట సమయంలోనే దాదాపు లక్షకు పైగా లైక్స్ రావడం విశేషం. టాలీవుడ్ స్టార్ కిడ్స్లో సితార చాలా డిఫరెంట్.. ఇప్పటికే తను జ్యూయెలరీ సంస్థకు కూడా బ్రాండ్ అంబాసిడర్గా సైన్ చేసింది. దీంతో యాడ్ కోసం అతి పెద్ద సంస్థకు సైన్ చేసిన మొదటి భారతీయ స్టార్ కిడ్గా నిలిచింది. అందుకు గాను సితార భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తి అయినట్లు సమాచారం. దీంతో మా సితార పాప మల్టీ టాలెంటేడ్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. Sitara Papa New Dance Video She is really a Rock Star💫 pic.twitter.com/xQlay0b07B — Srinadh (@Srinadhdhfm) June 15, 2023 (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో ఇద్దరు స్టార్ హీరోయిన్లు, డైరెక్టర్?) -
మేలో తగ్గిన రత్నాభరణాల ఎగుమతులు
ముంబై: రత్నాభరణాల ఎగుమతులు మే నెలలో 11 శాతం తగ్గాయి. రూ.22,693 కోట్ల విలువైన ఎగమతులు నమోదయ్యాయి. 2022 మే నెలలో రత్నాభరణాల ఎగుమతుల విలువ రూ.25,413 కోట్లుగా ఉంది. రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీఏఈపీసీ) ఈ వివరాలు వెల్లడించింది. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు 12 శాతానికి పైగా తగ్గాయి. వీటి విలువ రూ.14,190 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతుల విలువ రూ.16,154 కోట్లుగా ఉండడం గమనార్హం. ల్యాబ్లో తయారైన వజ్రాల ఎగుమతుల విలువ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 20 శాతం తగ్గి రూ.1,986 కోట్లుగా ఉంది. 2022 ఏప్రిల్, మే నెలల్లో వీటి ఎగుమతుల విలువ రూ.2,500 కోట్లుగా ఉంది. మే నెలకు సంబంధించి బంగారం ఆభరణాల ఎగుమతుల విలువ 7 శాతానికి పైగా పెరిగి రూ.5,705 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతులు రూ.5,318 కోట్లుగానే ఉన్నాయి. ఇక ఏప్రిల్, మే నెలల్లో రూ.1,173 కోట్లు విలువ చేసే వెండి ఆభరణాల ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు రూ.3,729 కోట్లతో పోలిస్తే 68 శాతం క్షీణించాయి. -
వెబ్ సిరీస్ చూసి ముగ్గురు మిత్రుల దోపిడీ యత్నం
కోరికలనేవి అందరికీ ఉంటాయి. అయితే అవి తీరనివిగా మారినప్పుడు కొందరు పెడదారి పడుతుంటారు. కోరికలు తీర్చుకునేందుకు అవసరమైన డబ్బుల కోసం కొందరు ఎంతకైనా దిగజారుతుంటారు. ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే లక్నోకు చెందిన ముగ్గురు స్నేహితులకు బర్త్డే పార్టీ చేసుకునేందుకు రూ. 25 వేలు అవసరం అయ్యాయి. వారు చూసిన ఒక వెబ్ సిరీస్లోని కథనాన్ని అధారంగా చేసుకుని దోపిడీకి పథకం వేసుకున్నారు. తరువాత వీరు ముఖానికి ముసుగులు ధరించి స్థానికంగా ఉన్న ఒక జ్యూయలరీ దుకాణానికి వెళ్లారు. తరువాత వారు ఒక తుపాకీ తీసి, దుకాణం యజమానిని బెదించారు. అయితే వారి ప్రయత్నం విఫలమయ్యింది. వెంటనే వారు అక్కడి నుంచి పరారయ్యారు. దుకాణం యజమాని ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. దీని ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ నిందితులలో ఇద్దరు ఖదరా, ఒకరు మండియావ్ ప్రాంతానికి చెందినవారన్నారు. వీరిలో ఇద్దరు మాస్క్ ధరించారని, ఒకరు రుమాలు ముఖానికి చుట్టుకున్నాడన్నారు. మే 30 వీరు స్థానికంగా ఉన్న మహేశ్వరి జ్యూయలర్స్లో దోపిడీకి ప్రయత్నించారని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీరిని పట్టుకున్నామన్నారు. నిందితులను కోర్టుకు అప్పగించామని, వారి దగ్గర నుంచి నంబరు ప్లేటులేని స్కూటీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చదవండి: ఉంగరం కావాలని మొండికేసిన వరుడు.. అలా అతని తిక్క కుదిర్చిన వధువు -
‘‘సెలెస్ట్ ఎక్స్ సచిన్ టెండూల్కర్’’ పేరుతో ఆభరణాల శ్రేణి
ముంబై: టాటా గ్రూప్నకు చెందిన తనిష్క్ ‘‘సెలెస్ట్ ఎక్స్ సచిన్ టెండూల్కర్’’ పేరుతో ప్రత్యేక కలెక్షన్ ఆవిష్కరించింది. భిన్న సమ్మే ళనం, ఖచ్చితత్వం, పరిపూర్ణతతో రూపొందించిన ఈ ఆభరణ శ్రేణిలో ఉంగరాలు, చెవి రింగులు, బ్రాస్లైట్లు ఉన్నాయి. అరుదైన ఈ కలెక్షన్ను లెజెండరీ క్రికెటర్ సచిన్ 50వ సంవత్సరంలో, వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డుకు గుర్తుగా తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. తనిష్క్ రూపొందించిన ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్ కోసం వారితో భాగస్వామ్యం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సచిన్ టెండూల్కర్ అన్నారు. -
బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి!
బంగారు నగలు కొనేవారికి ముఖ్యమైన వార్త ఇది. బంగారు ఆభరణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై హాల్మార్క్ లేని ఆభరణాలు విక్రయించేందుకు వీలు ఉండదు. బంగారు ఆభరణాలకు హాల్మార్కింగ్ను తప్పనిసరి చేయాలనే ఆలోచనను ప్రభుత్వం 18 నెలల క్రితమే బయటపెట్టింది. తాజాగా మార్చి 31 తర్వాత హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్యూఐడీ) లేని బంగారు ఆభరణాలను విక్రయించేందుకు అనుమతించబోమని వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. నాలుగు అంకెలు, ఆరు అంకెలు ఇలా హాల్మార్కింగ్ విషయంలో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి ఆరు అంకెల ఆల్ఫా న్యూమరిక్ హాల్మార్కింగ్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇది లేకుండా బంగారం లేదా బంగారు నగలు విక్రయించేందుకు వీలుందడదు. చదవండి: మైక్రోసాఫ్ట్ కిచిడీ రెడీ! బిల్ గేట్స్కు స్మృతి ఇరానీ వంట పాఠాలు హెచ్యూఐడీ అంటే ఏమిటంటే.. హెచ్యూఐడీ అంటే హాల్మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్. ఇది ఆరు అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్. ఈ అంకెల్లో ఇంగ్లష్ అక్షరాలతో పాటు సంఖ్యలు కూడా ఉంటాయి. దీంతో మనం కొలుగోలు చేసిన బంగారం ప్రామాణికత, స్వచ్ఛత తెలుస్తుంది. హెచ్యూఐడీ కోడ్ ఉంటే నగల వ్యాపారులు వినియోగదారులను మోసం చేయలేరు. ప్రస్తుతం దేశంలో 1338 హాల్మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి. -
ఆభరణాల మరమ్మతుల మార్కెట్గా భారత్
ముంబై: ఆభరణాల మరమ్మతుల (బాగు చేయడం/రీపేర్) సేవలకు ఔట్సోర్స్ మార్కెట్గా భారత్ అవతరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాలని జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) డిమాండ్ చేసింది. విధానపరమైన ప్రోత్సాహంతో అంతర్జాతీయ జ్యులయరీ రిపేర్ మార్కెట్లో భారత్ వాటాను 10–20 శాతానికి తీసుకెళ్లొచ్చని సూచించింది. 2026 నాటికి భారత మార్కెట్ వాటా 5.75 బిలియన్ డాలర్లకు (రూ.47,150 కోట్లు) చేరుకోవచ్చని అంచనా వేసింది. ‘‘ప్రస్తుతం ఈ మార్కెట్లో అంతర్జాతీయంగా భారత్ కేవలం 3 శాతం వాటా కలిగి ఉంది. కేవలం 196.8 మిలియన్ డాలర్ల మేర విక్రయాలు ఉన్నాయి. కానీ, ఇదే మార్కెట్లో అమెరికాకు 30 శాతం వాటా ఉంటే, చైనా 9.2 శాతం వాటా కలిగి ఉంది. చేతితో తయారు చేసే ఆభరణాల్లో భారత్కు సహజ సిద్ధంగా ఉన్న నైపుణ్యాల దృష్ట్యా జ్యుయలరీ రిపేర్ రంగంలోనూ భారత్ తన సత్తా చూపించగలదు. ఇందుకు సంబంధించి తగిన విధానాన్ని తీసుకొస్తే ప్రపంచ మార్కెట్లో మన వాటాను 10–20 శాతానికి తీసుకెళ్లొచ్చు. బిలియన్ డాలర్ల పెట్టుబడులతోపాటు ఎన్నో ఉపాధి అవకాశాలను ఇది తీసుకొస్తుంది’’అని జీజేఈపీసీ చైర్మన్ విపుల్షా తెలిపారు. మరమ్మతుల విధానాన్ని ప్రకటించినట్టయితే ప్రముఖ బ్రాండ్లు భారత్లో తమ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తాయన్నారు. ప్రస్తుతం ఇవి ఎక్కువగా దుబాయి, టర్కీ, హాంగ్కాంగ్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టు చెప్పారు. అన్ని రకాల జ్యుయలరీని దిగుమతి చేసుకుని, మరమ్మతులు చేయాలంటే అందుకు దేశీయంగా ఆభరణాల తయారీ పరిశ్రమలో టెక్నాలజీ ఉన్నతీకరణ అవసరపడుతుందని జీజేఈపీసీ తెలిపింది. పెద్ద ఎగుమతిదారులు తమ కస్టమర్లకు సంబంధించిన మరమ్మతుల అవసరాలను తీర్చే అవకాశం లభిస్తుందని పేర్కొంది. -
కొరియర్ చేసేందుకు వెళ్తుండగా.. కళ్లల్లో కారం కొట్టి.. కత్తితో గాయపరిచి..
సాక్షి, రాంగోపాల్పేట్: కొరియర్లో పంపించేందుకు రూ. 27.12 లక్షల విలువ చేసే గోల్డ్, డైమండ్ నగలను తీసుకెళుతున్న యవకుడి కళ్లల్లో కారంకొట్టి, కత్తితో దాడి చేసి నగలను దోచుకెళ్లిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెస్ట్ మారేడుపల్లి రైల్వే కాలనీకి చెందిన సతీష్ కుమార్ సైనీ పాట్ మార్కెట్లో జై మాతా లాజిస్టిక్ పేరుతో కొరియర్ నిర్వహిస్తూ బంగారు నగలను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నాడు. అతడి వద్ద పవన్కుమార్ కొరియర్ బాయ్గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం సతీష్కుమార్ ఆదేశాల మేరకు పవన్కుమార్ జీరాలోని శ్రీ జై అంబే కొరియర్స్ నుంచి రూ.8.65 లక్షల విలువైన 80 గ్రాముల బంగారు బిస్కెట్లను తీసుకున్నాడు. అనంతరం హయత్నగర్లోని శ్రీ రాధే డైమండ్స్కు వెళ్లి రూ.18,47,472 విలువైన 148.492 గ్రాముల డైమండ్ నెక్లెస్ను తీసుకుని బైక్పై పాట్మార్కెట్కు బయలుదేరాడు. ఈ ఆభరణాలను ముంబైకి పంపాల్సి ఉంది. రాత్రి 9.45 ప్రాంతంలో పవన్కుమార్ ఆర్పీరోడ్లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడి కళ్లలో కారంపొడిని చల్లారు. అయితే అతను హెల్మెట్ పెట్టుకోవడంతో కారంపొడి కళ్లలో పడలేదు. దీంతో అప్రమత్తమైన పవన్కుమార్ వేగంగా బైక్ను ముందుకు నడిపించాడు. అదే సమయంలో సిటీలైట్ చౌరస్తాలో సిగ్నల్ పడటంతో ట్రాఫిక్ ఆగిపోయింది. హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో ఆటోను ఢీకొట్టడంతో అతను వాహనంతో సహా కిందపడిపోయాడు. దీంతో వెనక నుంచి వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకరు వాహనం దిగి పవన్కుమార్ దగ్గర ఉన్న బ్యాగును లాక్కునేందుకు యత్నించగా అతను తీవ్రంగా ప్రతిఘటించాడు. దీంతో అతను కత్తితో పవన్కుమార్ ఎడమవైపు చేతిపై పొడిచి బైక్పై పరారయ్యాడు. ట్రాఫిక్, వాహనాల మధ్య క్షణాల్లో జరిగిపోయింది. గాయపడిన పవన్కుమార్ యజమానికి సమాచారం అందించడంతో అతను మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ అపోలోకు తరలించారు. ప్రస్తుతం పవన్కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలాన్ని ఉత్తర మండలం డీసీపీ చందనా దీప్తి, ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ పరిశీలించారు. బాధితుడితో మాట్లాడి వివరాలు సేకరించారు. సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇటీవల నాగోల్లో బంగారం షాపు యజమానిపై కాల్పులకు తెగబడి దోపిడీకి యతి్నంచిన గ్యాంగుకు దీనికి సంబంధం లేదని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..) -
Fashion: బ్రాండ్ వాల్యూ.. ప్రియాంక మోహన్ కట్టిన చీర ధర 98 వేలు!
ఫొటోలో ఉన్న నటి తెలుసు కదా.. నాని ‘గ్యాంగ్ లీడర్’ హీరోయిన్ ప్రియాంక మోహన్. ఇటీవల జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో ఇలా సంప్రదాయ కట్టు.. ఫ్యాషన్ లుక్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచింది. అలా ఆమెను నిలబెట్టిన అవుట్ ఫిట్, జ్యూయెలరీ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. జేడ్ బై మోనికా అండ్ కరిష్మా పెళ్లి కూతురి కలెక్షన్స్కు పెట్టింది పేరు ఈ బ్రాండ్. తమలోని ఫ్యాషన్ స్పృహ, భారతీయ హస్తకళల పట్ల తమకున్న మక్కువ, గౌరవాలకు ప్రతీకగా దీన్ని స్థాపించారు మోనికా షా, కరిష్మా స్వాలి. భారతీయ సంప్రదాయ నేత కళకు ఆధునిక ఆకృతులు, రంగులు, హంగులు అద్దుతున్నారు. జేడ్ బై మోనికా అండ్ కరిష్మా బ్రాండ్ పేరుకు దేశీయమైనా ఫ్యాషన్ రంగంలో అంతర్జాతీయ కీర్తిని సొంతం చేసుకుంటోంది. ధరలనూ అంతే స్థాయిలో అంచనా వేసుకోవచ్చు. ఆన్లైన్లో లభ్యం. ఏవీఆర్ స్వర్ణ మహల్ దక్షిణ భారతదేశానికి చెందిన జ్యూయెలరీ బ్రాండ్ ఇది. దీని ఎంబ్లమ్లో రెండు హంసలు ఉంటాయి. నగల స్వచ్ఛత, నాణ్యతకు గుర్తుగా. సరికొత్త డిజైన్సే కాదు కొనుగోలుదారుల నమ్మకం కూడా ఈ బ్రాండ్కు యాడెడ్ వాల్యూ. చెన్నై, సేలం, బెంగళూరు మొదలు దక్షిణ భారతదేశంలోని పదహారు ప్రాంతాల్లో పద్దెనిమిది షోరూమ్స్ ఉన్నాయి ఈ బ్రాండ్కు. నాణ్యత, డిజైన్లను బట్టి ధరలు. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: జేడ్ బై మోనికా అండ్ కరిష్మా ధర: రూ. 98,800 జ్యూయెలరీ బ్రాండ్: ఏవీఆర్ స్వర్ణ మహల్ ధర: నగల డిజైన్, నాణ్యతను బట్టి నేను వెరీ సింపుల్.. నార్మల్.. హ్యాపీ హ్యూమన్ బీయింగ్ని. ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచిస్తాను. ఇవే నన్ను గ్రేస్ఫుల్గా ఉంచుతున్నాయనుకుంటా! – ప్రియాంక మోహన్ -దీపిక కొండి -
నీరు కావాలని ఇంట్లోకి ప్రవేశించి.. టీవీ సౌండ్ పెంచి.. కత్తితో
అనంతపురం క్రైం: నగర శివారులోని ఒక ఇంటి వద్దకు అపరిచిత వ్యక్తి వెళ్లాడు. దాహం వేస్తోంది.. నీరివ్వండని ఇంట్లోకి ప్రవేశించాడు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడపై కత్తి పెట్టి బంగారు గొలుసు లాక్కుని ఉడాయించాడు. అనంతపురం రూరల్ సీఐ మురళీధర్రెడ్డి తెలిపిన మేరకు... కక్కలపల్లి కాలనీ సమీపంలోని రజాక్ ఫంక్షన్ హాలు వెనుకవైపున ఎల్.రామసుబ్బారెడ్డి, జి.విజయ దంపతులు నివాసం ఉంటున్నారు. రామసుబ్బారెడ్డి కనగానపల్లి మండలం కొండంపల్లిలో ఉపాధ్యాయుడిగాను, విజయ ఆత్మకూరు మండలం గొరిదిండ్ల పాఠశాలలో హెచ్ఎంగాను విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు వీరిద్దరూ విధులకు వెళ్లిపోయారు. కుమార్తె దీక్షితను స్కూలుకు పంపించారు. ఇంట్లో రామసుబ్బారెడ్డి తల్లి ఎల్.నారాయణమ్మ (88 సంవత్సరాలు) ఉంది. ఉదయం 11 గంటలకు ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు. ఎవరంటూ నారాయణమ్మ లోపలినుంచే ప్రశ్నించగా.. మీ అబ్బాయికి డబ్బు ఇవ్వాల్సి ఉందని అతడు సమాధానమిచ్చాడు. అయితే అబ్బాయికే ఫోన్ చేయి అంటూ చెప్పింది. అందుకు ఆ వ్యక్తి ఫోన్ తగల్లేదని చెప్పాడు. అయితే పై అంతస్తులో మా బంధువు ప్రశాంత్ ఉంటాడు అతడిని కలువు అని తెలిపింది. సరే అని బయటకు వచ్చి మొదటి ఫ్లోర్ వరకు మెట్లు ఎక్కి.. అక్కడ ఎవరూ లేరని కిందకు వచ్చాడు. మంచి నీరు కావాలని.. పై అంతస్తు నుంచి కిందికి వచ్చిన అపరిచిత వ్యక్తి మంచి నీరు కావాలని కోరగా.. నారాయణమ్మ వాకర్ సాయంతో మెల్లగా తలుపు తీసింది. అలా లోనికి వెళ్లిన తర్వాత టీవీ ఆన్ చేయాలని కోరాడు. ఆ తర్వాత రిమోట్ తీసుకుని తనే సౌండ్ పెంచాడు. అలా ఆమాటా.. ఈమాటా మాట్లాడుతూ ఎవరైనా వస్తున్నారా? అని అప్పుడప్పుడు బయటకు వచ్చి తొంగి చూశాడు. అలా బయటకు వెళ్లి బైక్ బ్యాగ్లో ఉంచుకున్న కత్తిని తీసుకొచ్చి ఇంట్లోని వృద్ధురాలి నారాయణమ్మ మెడపై పెట్టి అరిస్తే చంపుతానని బెదిరించాడు. ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కుని అక్కడి నుంచి ఉడాయించాడు. అనంతరం బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో పై పోర్షన్లో ఉన్న వివాహిత నాగలక్ష్మి కిందకు వచ్చింది. జరిగిన విషయం తెలుసుకుని రామసుబ్బారెడ్డి దంపతులకు సమాచారం అందించింది. రామసుబ్బారెడ్డి డయల్ 100కు కాల్ చేశాడు. పోలీసుల అప్రమత్తం బంగారు గొలుసు దోపిడీ విషయం తెలియగానే డీఎస్పీ వీరరాఘవరెడ్డి జిల్లాలోని వివిధ సబ్ డివిజన్ల వారిని సెట్లో అప్రమత్తం చేశారు. జిల్లా కేంద్రం ప్రవేశమార్గాలు, ప్రధాన కూడళ్లలో వాహనాల తనీఖీ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజ్, తదితర తనిఖీలు చేసేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. -
రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్లో 6 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి పది నెలల కాలంలో (ఏప్రిల్–జనవరి) 32.37 బిలియన్ డాలర్ల విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు జరిగాయి. 2020–21 ఇదే కాలంతో పోలి్చతే (30.40 బిలియన్ డాలర్లు) ఈ విలువ 6.5 శాతం అధికం. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) విడుదల చేసిన ప్రకటన ఒకటి ఈ అంశాలను తెలిపింది. ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► భారత రత్నాలు, ఆభరణాల ఎగుమతుల రంగం కరోనా మహమ్మారి సవాళ్ల నుంచి వేగంగా కోలుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో రూపాయిల్లో ఎగుమతుల విలువ 12.28 శాతం పెరిగి రూ.2.4 లక్షల కోట్లకు చేరితే, డాలర్ల రూపంలో 6.5 శాతం ఎగసి 32.37 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి మధ్య ఈ విలువలు వరుసగా రూ.2.14 లక్షల కోట్లు, 30.40 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► భారత్ ఎగుమతులకు తొలి మూడు ప్రధాన దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (41.50 శాతం), బెల్జియం (15.81 శాతం), జపాన్ (12.20 శాతం) ఉన్నాయి. ► యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)తో ఆ దేశానికి భారత్ నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మరింత పెరుగుతాయి. ► మ్తొతం మధ్యప్రాచ్యం మార్కెట్లోకి ప్రవేశించడానికి యూఏఈ ప్రధాన కేంద్రంగా (గేట్వే) ఉంది. ఈ నేపథ్యంలో భారత్–యూఏఈ మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం బహుళ ప్రయోజనాలను చేకూర్చుతుంది. సుంకాలు రద్దు చేయాలి భారతదేశం నుండి బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల ఎగుమతులపై యూఏఈలో 5 శాతం దిగుమతి సుంకాన్ని రద్దయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి ప్రకటన కోరింది. ప్రకటన ప్రకారం, సుంకాలు లేని పరిస్థితుల్లో భారత్ నుంచి యూఏఈకి ప్లెయిన్ గోల్డ్ జ్యూయలరీ, గోల్డ్ స్టడెడ్ జ్యూయలరీ ఎగుమతుల విలువ 2023 నాటికి 10 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.74,000 కోట్లు) చేరుతుంది. భారత్ ప్లెయిన్ గోల్డ్ ఆభరణాల ఎగుమతుల్లో యూఏఈ వాటా 80 శాతం. స్టడెడ్ జ్యూయలరీకి సంబంధించి ఈ వాటా 20 శాతంగా ఉంది. కాగా, బంగారం ఆభరణాల ఎగుమతుల విలువ 2021 ఏప్రిల్–2022 జనవరి మధ్య 24.24 శాతం క్షీణించి, 7.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్లెయిన్ గోల్డ్ జ్యూయలరీ ఎగుమతుల విలువ కూడా భారీగా 56 శాతం పడిపోయి 3.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. -
తల్లిపాలతో తయారు చేసిన ఆభరణాలు!... వాటి ధర ఎంతంటే!!
Jewellery Made From Breast Milk: ఇంతవరకు తల్లిపాల ప్రాధాన్యత గురించి మాత్రమే తెలుసు. అంతేకాదు పుట్టిన నవజాత శిశువులకు తొలి ఆరునెలల తల్లిపాలు తాగితే వారికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతుంటారు. అంతేందుకు తల్లిపాల వారోత్సవాలు లేదా మథర్ బ్రెస్ట్ మిల్క్ డే అని ఒక రోజు కూడా ఏర్పాటు చేశారు. పైగా తల్లిపాలకు నోచుకోని చిన్నారులకు తల్లిపాలు అందించాలన్న ఉద్దేశంతో మిల్క్ బ్యాంక్స్ ఏర్పాటు చేద్దాం అంటూ విన్నూతన పద్ధతులు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నారు నిపుణులు. కొన్ని దేశాల ఇప్పటికే ఆ పద్ధతులను అవలంభించాయి కూడా. అయితే ఇప్పుడు ఈ తల్లిపాలతో విలువైన ఆభరణాలను కూడా తయారుచేస్తున్నారట. అంతేకాదు ఇది తల్లులు తమ పిల్లతో గల విశిష్ట అనుబంధానికి గుర్తుగా రూపొందిస్తున్నారట!. (చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!) అసలు విషయంలోకెళ్లితే...యూఎస్కి చెందిన అల్మా పార్టిడా తన కుమార్తె అలెస్సాకు సుమారు 18 నెలల పాటు పాలిచ్చింది. అయితే అప్పుడే ఆమెకు తాను తన పిల్లలకు ఇస్తున్న పాలను మాృతృత్వపు మాధుర్యానికి గుర్తుగా ఉంచుకునే మార్గం కోసం అన్వేషించింది. అంతేకాదు ఇందుకోసం ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో సర్చ్ చేసింది. అప్పుడే ఆమెకు తల్లిపాలతో తయారు చేసే నగల కంపెనీ కీప్సేక్స్ బై గ్రేస్ గురించి తెలుసుకుంది. ఇక ఆమె వెంటనే తల్లిపాలలో దాదాపు 10 మిల్లీలీటర్లను కీప్సేక్స్ బై గ్రేస్ అనే కంపెనీకి పంపింది. ఈ మేరకు ఒక నెల తర్వాత ఆ కంపెనీ ఆమె చేతికి మిల్కీ-వైట్ గుండె ఆకారంలో లాకెట్టును పంపించింది. దీంతో అల్మా పార్టిడా తన కోరిక ఫలించినందకు సంతోషించడమే కాక తాను తల్లిగా మారిన తర్వాత చివరి మిల్క్ డ్రాప్గా తన బిడ్డకు పాలు ఇస్తు సాగిన జీవితపు తీపి గుర్తుగా పదిలంగా ఉంటుందని పేర్కొంది . ఈ మేరకు కీప్సేక్స్ బై గ్రేస్ కంపెనీ యజమాని సారా కాస్టిల్లో మాట్లాడుతూ...తల్లిపాలతో ఆభరణాలా అంటూ ఆశ్యర్యంతోపాటు నన్ను ఒక వెర్రిదాని వలే చూశారు. నేను తయారు చేసిన ఆభరణాలను చూసిన తర్వాతే నాకు చాలా ఆర్డర్లు రావడం జరిగింది. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడూ విపరీతమైన నరకయాతనను అనుభవించిన తల్లుల నుంచే తనకు ఎక్కు ఆర్డర్లు వచ్చాయి" అని న్యూయార్క్ టైమ్స్కి తెలిపింది. అంతేకాదు సారా తల్లిపాలతో తయారు చేసే స్టోన్లు దాదాపు రూ.4 వేల నుంచి 11 వేలు వరకు ధర పలుకుతాయి. అంతేకాదు సదరు మహిళ అల్మా చేతికి జ్యువెలరీని ధరించిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆవీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు ఓ లుక్కేయండి. (చదవండి: మమ్మీలను తాకకుండానే పుట్టు పూర్వోత్తరాలు..!) View this post on Instagram A post shared by Sarah | Breastmilk Jewelry (@keepsakesbygrace) -
Nita Ambani Expensive Things: రూ.100 కోట్ల కారు, డ్రైవర్ జీతం ఎంతంటే?
-
మంగళసూత్ర యాడ్పై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
వ్యాపారంలో ఏ వస్తువుకయినా ప్రచారం ఎంతో ముఖ్యం. అందుకే కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయలను క్యాంపెయిన్ కోసం వెచ్చిస్తుంటాయి. అడ్వర్టైజింగ్ సంస్థలు సైతం ఎంతో జాగ్రత్తగా యాడ్స్ని రూపొందిస్తుంటాయి. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి క్రియేటివిటీ అదుపు తప్పుతుంది. దీని వల్ల అసలుకే ఎసరు వస్తుంది. దానికి తాజా ఉదాహరణ ఇంటిమేట్ జ్యూయల్లరీ యాడ్. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి చిక్కుల్లో పడ్డారు. స్టైల్ఐకాన్గా పేరున్న ఆయన ఇటీవల ఆయన రూపొందించిన యాడ్ క్యాంపెయిన్ బెడిసి కొడుతోంది. మంగళసూత్ర పేరుతో సబ్యసాచి చేసిన పనేం బాగాలేదంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రాయల్ బెంగాల్ ఇంటిమేట్ ఫైన్ జ్యూయల్లరీ థీమ్తో యాడ్ క్యాంపెయిన్ని సబ్యసాచి ముఖర్జి ఇటీవల ఫోట్ షూట్ నిర్వహించారు. హెటిరో సెక్సువల్, సేమ్ సెక్సువల్ మోడల్స్ని ఉపయోగిస్తూ ఈ షూట్ని పూర్తి చేశారు. అనంతరం క్యాంపెయిన్లో భాగంగా కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో సబ్యసాచి ముఖర్జీ పోస్ట్ చేశారు. ఇందులో రాయల్ బెంగాల్ మంగళసూత్ర పేరుతో పోస్టు చేసిన ఫోటోలు వివాదానికి కారణమయ్యాయి. No! This is no lingerie or C0nd0m Ad. This is Sabyasachi Mangalsutra Ad. Ultra Woke #Sabyasachi are so creatively bankrupt that they have to use semi naked models for a Mangalsutra ad.#BoycottSabyasachi #Femina pic.twitter.com/dim9YpJhgF — श्रद्धा | Shraddha 🇮🇳 (@immortalsoulin) October 27, 2021 How nonsense #Sabyasachi think of for such a vulgur ads of #Mangalsutra ? Leftists minded peoples are continuously targeting Hindu rituals & tradition by their toxic thoughts in making Ads, Pictures etc. ऐसे "सुवरों" के लिए गाली भी छोटी पड़ेगी. Has @ascionline notice this. pic.twitter.com/KyfEx0PKpX — Hiren Pawar. (@HirenPawar1) October 29, 2021 Friend : How does a plump woman standing with an ill fitting bra, with a Jaguar on a sling convey "WHAT WOMAN WANTS"???? Me : IT'S HER CHOICE!! You've no right to make fun of her .What if she doesn't wear any????#Sabyasachi pic.twitter.com/ne74DKuDwC — Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) October 29, 2021 ఇదేమైనా లింగరీనా ? బుధవారం ఈ ఫోటోలు ఇన్స్టాలో పోస్టు అయిన మరుక్షణం నుంచే నెటిజన్లు సబ్యసాచిపై దుమ్మెత్తి పోస్తున్నారు. లింగరీ, కండోమ్ యాడ్ కాదు కదా .. మంగళ సూత్ర యాడ్కి ఇలాంటి ఫోటో షూట్ అవసరమా అంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు న్యూడిటీ చాటున ప్రమోషన్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్ల ఆగ్రహం వెల్లువలా పోటెత్తుతోంది. అందులో కొందరి అభిప్రాయం ఇలా ఉంది - ఇది మంచి పద్దతి కాదు. ఇందులో జ్యూయల్లరీ ఎక్కడుంది - మీరు అసలు ఏం ప్రచారం చేయాలనుకున్నారు ? ఇలాంటి జ్యూయల్లరీని ఎవరైనా ధరిస్తారా ? ప్రచారం నిర్వహించేప్పుడు జాగ్రత్తగా ఉండండి - జ్యూయల్లరీకి ఇలాంటి యాడ్ చేసినందుకు సిగ్గుపడాలి. ఈ జ్యూయల్లరీని నేను ఎప్పుడు కొనను - జ్యూయల్లరీ రూపొందించడం ఎంతో నేర్పుతో కూడిన కళ. దాన్ని ఇలా చేయడం మంచి పద్దతి కాదు - ఫోటో కింద జ్యూయల్లరీ క్యాంపెయిన్ అనే క్యాప్షన్ చూడకుంటే ఈ ఫోటోలు బీగ్రేడ్ మూవీ పోస్టర్లలా ఉన్నాయి. - సబ్యసాచి అసలు నీకేమయ్యింది. ఇలా ఎవరైనా మంగళసూత్రం అమ్మకాల ప్రకటన చేస్తారా ? మంగళసూత్ర అంటే ఇది మరికొందరు నెటిజన్లు మంగళ సూత్రం ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. చాలా మంది మంగళసూతం ఎలా ధరిస్తారో, ఎలా ధరించాలో, ఎలాంటి ఫోటోలు తీయాలో చెబుతూ ట్విట్టర్ , ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో సబ్యసాచిని ట్యాగ్ చేస్తూ ఫోటోలు పెడుతున్నారు. Mangalsutra looks like this #Sabyasachi It's not a random piece of fashion jewellery, it indicates the love and commitment the husband and wife have towards each other. pic.twitter.com/HB3r4Aa4A4 — Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) October 27, 2021 #Mangalasutra is NOT a "tiny intimate Jewelry" to be hidden. It's Long for whole world to see. It's PIOUS It's PRIDE It's Worn with Attitide (Ghamand) of being a Sanatani Hindu Woman ! pic.twitter.com/InN90Uiddp — 🍁 Sanatani Yoddha (@VidyaSanatani) October 27, 2021 -
రిలయన్స్ చీరలు కూడా వచ్చేస్తున్నాయ్...
సంప్రదాయ దుస్తులు, చీరల విభాగంలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్), టాటా గ్రూప్నకు చెందిన తనిష్క్ తదితర సంస్థలకు పోటీగా రిలయన్స్ రిటైల్ కూడా రంగంలోకి దిగుతోంది. కొత్తగా అవంత్రా పేరిట స్టోర్స్ చెయిన్ను ప్రారంభించనుంది. ప్రైవేట్ లేబుల్స్ను విక్రయించడంతో పాటు ప్రాంతీయంగా వీవర్ క్లస్టర్లతో పాటు నల్లి సిల్క్స్ .. పోతీస్ వంటి థర్డ్ పార్టీ బ్రాండ్లతో కూడా అవంత్రా జట్టుకట్టనుంది. ఆభరణాలు, యాక్సెసరీలు, టైలరింగ్ సరీ్వసులు కూడా అందించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలి స్టోరు బెంగళూరులో ఏర్పాటవుతుందని, ఆ తర్వాత కర్ణాటకలోని మిగతా ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించవచ్చని వివరించాయి. ఆభరణాల బ్రాండ్ అయిన తనిష్క్ సంప్రదాయ దుస్తుల్లోకి అడుగుపెట్టడం, ఏబీఎఫ్ఆర్ఎల్ కూడా సవ్యసాచి, తరుణ్ తహిలియాని వంటి దేశీ డిజైనర్ వేర్ బ్రాండ్స్లో వాటాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో రిలయన్స్ అవంత్రా స్టోర్స్ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. -
మరికొద్ది గంటల్లో పెళ్లి, 5 తులాల నగలతో ఉడాయించిన కోతులు
సాక్షి, నర్సాపూర్(మెదక్): పెళ్లికి వెళ్లాలన్న హడావిడిలో ఐదు తులాల నగలను కోల్పోయిన ఉదంతమిది. శనివారం నర్సాపూర్ పట్టణానికి చెందిన బాధితుడు వడ్ల నర్సింలు స్థానిక విలేకరులతో మాట్లాడి తన బాధను వివరించారు. ఈ నెల 23న తన మేనకోడలు వివాహం మండలంలోని ఆద్మాపూర్ గ్రామంలో ఉండగా అదే రోజు ఉదయం తాను వెళ్లేందుకు పెళ్లికూతురుకు చెందిన రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే ఐదు తులాల బంగారు నగలు ఒక కవరులో పెట్టి దానిని దుస్తుల సంచిలో పెట్టుకుని బైక్పై బయలు దేరానని చెప్పారు. కొంత దూరం వెళ్లాక మరికొన్ని వస్తువులు గుర్తుకురావడంతో వెనుదిరిగి వచ్చినట్లు చెప్పారు. బైక్ను ఇంటికి కొద్దిదూరంలో నిలిపి ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికి కోతులు బైక్పై ఉన్న కవర్ను చిందర వందర చేశాయన్నారు. హడావిడిలో దుస్తుల కవర్ను సర్దుకొని ఆద్మాపూర్కు వెళ్లిన తర్వాత బంగారు నగల కోసం సంచిలో పరిశీలించగా అందులో లేవని తెలిపారు. దీంతో రెడిమేడ్ నగలతో పెళ్లి జరిపించామని నర్సింలు చెప్పారు. కోతులు బంగారు నగల కవరును ఎత్తుకుపోయి కవరును చించితే ఆ ముక్కలు దొరికేవని, చుట్టుపక్కల వెతికినా జాడా దొరకలేదని ఆయన చెప్పారు. 24న తమ ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా తాను బైక్పై వెళ్లగానే ఓ ప్రభుత్వ శాఖకు చెందిన కొంతమంది సిబ్బంది అక్కడికి వచ్చి తచ్చాడారని, వారిపైన అనుమానంగా ఉందని నర్సింలు అన్నారు. 25న స్థానిక ఎస్ఐ గంగరాజుకు జరిగిన ఘటనను వివరించగా నీ అజాగ్రత్తగా నగలు పోగొట్టుకున్నందున కేసు నమోదు చేయలేనని చెప్పారని ఆయన తెలిపారు. సీసీ కెమెరాలలో రికార్డు అయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోగా సంబధితశాఖ అధికారిని పిలిపించి మాట్లాడగా ఆ అధికారి తమ సిబ్బంది నగలు ఎత్తుకుపోలేదని చెబుతూ నన్నే అనుమానిస్తూ మాట్లాడారని నర్సింలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ వివరణ.. వడ్ల నర్సింలు బంగారు నగలు పోగొట్టుకున్న విషయాన్ని స్థానిక ఎస్ఐ గంగరాజుతో ప్రస్తావించగా అతను అజాగ్రత్తగా నగలు పోగొట్టుకున్నందున కేసు నమోదు చేయలేనని చెప్పానన్నారు. నగలు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందని ఆయన చెప్పారు. చదవండి: గదిలో మూత్రం పోశాడని తిట్టింది.. పగ పెంచుకుని -
పక్కింటికే కన్నం వేసిన జల్సారాయుడు!
పెద్దపల్లిరూరల్: జల్సాలకు అలవాటు పడి డబ్బును సులువుగా సంపాదించేందుకు దొంగతనాన్ని ఎంచుకున్న సందిరి రాజు పక్కింటికే కన్నం వేసి బంగారు, వెండి ఆభరణాలను అపహరించాడు. డీసీపీ రవీందర్ కథనం ప్రకారం.. సిద్దిపేట ప్రాంతానికి చెందిన సందిరి రాజు కంప్యూటర్ హార్డ్వేర్ పనులు చేస్తూ కొంతకాలంగా పెద్దపల్లిలోని సాయినగర్లో నివాసముంటున్నాడు. అతడి ఇంటి పక్కనే పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గాండ్ల సురేశ్ కుటుంబం ఉంటోంది. ఈ నెల 8న సురేశ్ కుటుంబం ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన రాజు సుత్తెతో తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 9 తులాల బంగారు, 16 తులాల వెండి ఆభరణాలను చోరీ చేశాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్న సురేశ్ దొంగలుపడ్డారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ జరిగిన తీరును పరిశీలించిన పోలీసు అధికారులకు రాజు కదలికలపై అనుమానం వచ్చి విచారించగా నేరం ఒప్పుకున్నాడని డీసీపీ వివరించారు. నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకొని దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చోరీ జరిగిన 12 గంటల్లోపే దొంగను పట్టుకుని సొత్తును స్వాధీనం పర్చుకున్న సీఐ ప్రదీప్కుమార్, ఎస్సై రాజేశ్, సిబ్బంది దుబాసి రమేశ్, మాడిశెట్టి రమేశ్లను డీసీపీ, ఐపీఎస్ అధికారి నితికపంత్ అభినందించారు. చదవండి: మేనకోడలిని దారుణంగా చంపేశాడు! -
ఈ మాస్క్ ధర, యజమాని గురించి తెలిస్తే...
కరోనా మహమ్మారి కాలంలో సాధారణ కాటన్ మాస్క్ నుంచి కొంచెం ఖరీదైన ఎన్99 మాస్క్ లు ధరించడం సర్వసాధారణంగా మారిపోయింది. అలాగే బంగారు, డైమండ్ మాస్క్ లు ఇలా.. వారి వారి స్థాయిలను బట్టి ధరించడం కూడా చూశాం. మాస్క్ ధరించడం కేవలం ఆరోగ్య సంరక్షణ మాత్రమే కాదు. ఇపుడొక స్టేటస్ సింబల్ కూడా. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతి ఖరీదైన జిగేల్.. జిగేల్.. మాస్క్ రూపుదిద్దుకుంటోంది. ఇజ్రాయెల్ ఆభరణాల సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ కరోనావైరస్ మాస్క్ ను తయారు చేస్తోంది. టాప్-రేటెడ్ ఎన్99 ఫిల్టర్లు, బంగారం, అతి ఖరీదైన వజ్రాలు పొదిగిన ఈ మాస్క్ ధర 1.5 మిలియన్ డాలర్లు (సుమారు 11.2 కోట్లు రూపాయలు) గా ఉండనుంది. అమెరికాలో ఉంటున్న చైనా వ్యాపారవేత్త దీనిని ఆర్డర్ చేశారు. ఇంతకుమించి ఈ మాస్క్ కొనుగోలుదారుని వివరాలను అందించేందుకు జ్యుయల్లరీ సంస్థ వైవెల్ యజమాని, డిజైనర్ ఐజాక్ లెవీ నిరాకరించారు. జెరూసలేం సమీపంలోని తన కర్మాగారంలో ఒక ఇంటర్వ్యూలో ఈ ఖరీదైన మాస్క్ వివరాలను అందించారు డిజైనర్ ఐజాక్ లెవీ. 18 క్యారెట్ల వైట్ గోల్డ్ తో రూపొందిస్తున్న మాస్క్ చుట్టూ, 3,600 తెలుపు, నలుపు వజ్రాలతో అలంకరించనున్నామని తెలిపారు. అలాగే కొనుగోలుదారుడి అభ్యర్థన మేరకు ఈ స్పెషల్ మాస్క్ తయారుచేస్తున్నట్టు చెప్పారు. ఇది ఈ సంవత్సరం చివరినాటికి పూర్తవుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా తమ మాస్క్ నిలుస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు కరోనా సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఉపాధి కోల్పోతూ, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నసమయంలో తమకు మంచి అవకాశం లభించిందన్నారు. తమ సిబ్బందికి ఉపాధి కల్పించడం సంతోషంగా ఉందంటూ కొనుగోలు దారుడికి కృతజ్ఞతలు తెలిపారు లెవీ. World's most expensive mask? An Israeli jewelry company is making a $1.5-million gold #coronavirus mask for a Chinese businessman living in the US. The 18-karat white gold mask will be decorated with 3,600 diamonds and fitted with top-rated N99 filters. pic.twitter.com/D9r91HsU3B — Global Times (@globaltimesnews) August 10, 2020 -
బంగారం కొట్టేశాడు.. కట్టుకథ అల్లి పట్టుబడ్డాడు
సాక్షి, అమరావతి బ్యూరో/వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): కిలోల కొద్దీ బంగారం, వెండి వస్తువులు.. రూ.లక్షల్లో నగదు జ్యూవెలరీ షాపులో ఉందని గుర్తించిన గుమస్తా వాటిని చోరీ చేయడానికి సినిమా తరహాలో సీన్ క్రియేట్ చేసి.. చివరకు పోలీసులకు చిక్కిన ఘటన విజయవాడ నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. మూడు గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు ఇంటి దొంగను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 7 కిలోల బంగారం, 19 కిలోల వెండి, రూ.42 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసి.. కట్టుకథ అల్లాడు ► వన్టౌన్లోని కాటూరి వారి వీధిలో రాజుసింగ్ చరణ్ అనే వ్యాపారి సాయిచరణ్ జ్యూవెలరీ పేరిట షాపు నిర్వహిస్తున్నాడు. ► సుమారు 2 నెలల క్రితం రాజస్తాన్కు చెందిన విక్రమ్ కుమార్ లోహార్ అలియాస్ విక్రమ్ (23) అనే యువకుణ్ణి గుమస్తాగా చేర్చుకున్నాడు. ► లాక్డౌన్ కారణంగా కొన్ని నెలలుగా వ్యాపారం సరిగా జరగకపోవడంతో రాజుసింగ్ 19 కిలోల వెండి వస్తువులను, రూ.20 లక్షల నగదును షాపులోనే ఉంచాడు. ► దాంతోపాటు తన స్నేహితుడైన గురుచరణ్ జ్యూవెలరీ యజమాని మనోహర్ సింగ్కు చెందిన 7 కిలోల బంగారు ఆభరణాలు, రూ.22 లక్షల నగదు కూడా రాజుసింగ్ తన షాపులోనే భద్రపరిచాడు. ► బంగారం, వెండి ఆభరణాలు, నగదు భారీగా ఉండటంతో రాజుసింగ్ గురువారం రాత్రంతా షాపులోనే ఉండి వేకువజామున గుమస్తా విక్రమ్ను కాపలాగా ఉంచి ఇంటికి వెళ్లాడు. ► అప్పటికే వాటిని కాజేసేందుకు పథకం పన్నిన గుమస్తా విక్రమ్ బంగారు ఆభరణాలు, వెండి, నగదును ఓ బ్యాగ్లో సర్ది షాపు వెనుక దాచాడు. అనంతరం సీసీ కెమెరా, ఫుటేజీ రికార్డర్ డీవీఆర్ను తొలగించి కాలువలో పడేశాడు. ► కత్తితో తన వంటిపై గాయాలు చేసుకుని.. తాడుతో కాళ్లు, చేతులు కట్టేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టుగా షాపులోనే మూలుగుతూ పడి ఉన్నాడు. ఏం జరిగింది: బంగారు ఆభరణాల దుకాణంలో పనిచేసే గుమస్తా అదే దుకాణంలో 7 కిలోల బంగారు ఆభరణాలు, 19 కిలోల వెండి, రూ.42 లక్షల నగదు చోరీ చేశాడు. ఎక్కడ.. ఎప్పుడు : విజయవాడ వన్టౌన్ కాటూరి వారి వీధిలోని సాయిచరణ్ జ్యూవెలరీ షాపులో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కట్టుకథ ఎలా అల్లాడంటే.. : షాపులోని బంగారం, వెండి, నగదును బ్యాగ్లో సర్దేసి షాపు వెనుక దాచాడు. ఆ తరువాత వచ్చి సీసీ కెమెరాను, రికార్డర్ను తొలగించి కాలువలో పడేశాడు. వంటిపై కత్తితో గాయం చేసుకుని.. కాళ్లు, చేతులను తనకు తానే తాడుతో కట్టేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు నటించాడు. ఎలా పట్టుబడ్డాడంటే..: షాపులోకి వేరే వ్యక్తులు వచ్చినట్టు ఆనవాళ్లు లేకపోవడం.. వేలిముద్రలు అతడివి మాత్రమే ఉండటం.. ఇతర క్లూస్ ఆధారంగా షాపు గుమస్తాయే దొంగ అని పసిగట్టిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇలా దొరికేశాడు ► రాజుసింగ్ చరణ్ షాపులో దాచిన బంగారు ఆభరణాల్ని తీసుకు రావాలని అతని స్నేహితుడు మనోహర్సింగ్ తన గుమస్తా గోపాల్సింగ్ను ఉదయం 9.30 గంటల సమయంలో ఆ షాపునకు పంపించాడు. ► గోపాల్సింగ్ అక్కడకు వెళ్లేసరికి విక్రమ్ రక్తపు గాయాలతో కాళ్లు, చేతులు కట్టిపడేసి ఉండటాన్ని చూసి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ► దీంతో మనోహర్సింగ్, అతని స్నేహితుడు రాజుసింగ్ హుటాహుటిన అక్కడకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ► రంగంలోకి దిగిన పోలీసులు విక్రమ్ను ఆస్పత్రికి తరలించి కంప్యూటర్లో నిక్షిప్తమైన సీసీ ఫుటేజీని పరిశీలించి షాపులోకి ఇతర వ్యక్తులెవరూ రాలేదని గుర్తించారు. ► చోరీ స్థలంలో లభ్యమైన వేలిముద్రలు గుమస్తా విక్రమ్ వేలిముద్రలతో సరిపోలడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజం బయటపడింది. ► కేసును పక్కదోవ పట్టించేందుకే తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు కట్టుకథ సృష్టించినట్టు విక్రమ్ అంగీకరించాడు. ► చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని, విక్రమ్కు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని నగర సీపీ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. -
పద్మావతి హత్యకేసులో పురోగతి
భవానీపురం (విజయవాడ పశ్చిమ): భవానీపురంలో జరిగిన మహిళ దారుణ హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన పాత నేరస్తుడే హంతకుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆరేళ్లుగా నిందితుడు పోలీసులకు చిక్కకుండా నేరాలకు పాల్పడుతున్నాడు. అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ సంఘటనతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన పని లేదని పోలీసులు భరోసా ఇస్తున్నారు. కాగా ఒంటరిగా ఉన్న మహిళను గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం విజయవాడ భవానీపురంలో జరిగిన విషయం తెలిసిందే. భవానీపురం క్రాంబ్వే రోడ్కు అనుసంధానంగా ఉన్న కెనరా బ్యాంక్ రోడ్లో యేదుపాటి వెంకటేశ్వర్లు, పద్మావతి(55) దంపతులు నివసిస్తున్నారు. వెంకటేశ్వర్లు ఇసుక, ఇటుక, కంకర వ్యాపారం చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం దంపతులు ఇద్దరూ స్థానికంగా ఉన్న అమ్మపాద అపార్ట్మెంట్లో ఫంక్షన్కు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. భార్య పద్మావతిని ఇంటి దగ్గర దింపేసిన వెంకటేశ్వర్లు పనులపై బయటకు వెళ్లిపోయారు. ఇంటికి వచ్చిన తరువాత పద్మావతి తమ సమీప బంధువుకు ఫోన్ చేశారు. అయితే, ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో ఫోన్లో మిస్డ్ కాల్ చూసుకున్న బంధువు తిరిగి పద్మావతికి ఫోన్ చేయగా ఆమె ఫోన్ ఎత్తలేదు. దీంతో ఆమె మిన్నకుండిపోయింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్య జరిగిన తీరు చూస్తుంటే పాత నేరస్తుల పని అయి ఉంటుందని భావిస్తున్నామని డీసీపీ విక్రాంత్ పాటిల్ చెప్పారు. దుండగులు పద్మావతిని దారుణంగా గొంతు కోసి హత్య చేశారని చెప్పారు. బాధితురాలి ఒంటిపై ఉన్న 10 కాసుల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారని తెలిపారు. కప్ బోర్డ్లో ఉన్న నగలు, నగదు ముట్టుకోలేదని తెలుస్తోందన్నారు. వేలి ముద్రలు కనిపించకుండా కారం చల్లారని చెప్పారు. గతంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో జరిగిన హత్య కేసులో దొరికిన వేలి ముద్రలు ఉత్తరప్రదేశ్కు చెందిన పాత నేరస్తుడి వేలి ముద్రలతో సరిపోయాయని, అయితే సదరు నేరగాడు ఇంకా దొరకలేదని అన్నారు. పద్మావతి హత్య కూడా ఆ తరహాలోనే జరిగింది కాబట్టి ఉత్తరప్రదేశ్ నేరస్తుల పనేనా అన్నది విచారణలో తేలుతుందన్నారు. కాగా, డాగ్ స్క్వాడ్ టీమ్ తీసుకొచ్చిన జాగిలం పీఆర్కే బిల్డింగ్ వద్ద కాసేపు ఆగి, తిరిగి స్వాతి సెంటర్ వరకు వెళ్లింది. -
ఒక్క భారీ చోరీతో సెటిలవుదామని..
సాక్షి, భీమవరం టౌన్: చిల్లర దొంగతనాలు మాని ఒకే ఒక్క భారీచోరీతో స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నాడు ఆ దొంగ. తాను దొంగిలించిన వస్తువులను తాకట్టుపెట్టే జ్యూయలరీ షాపునే అందుకు ఎంచుకున్నాడు. ఒక మోటార్ సైకిల్ను అపహరించి రెండుసార్లు రెక్కీ చేశాడు. ప్లాన్ ప్రకారం ఒక్కడే రూ.1.50 కోట్లు విలువ చేసే నాలుగు కిలోల బంగారు ఆభరణాలు, 1.3 కిలోల వెండి ఆభరణాలను చోరీ చేశాడు. చోరీ సమయంలో ముఖానికి వస్త్రం కట్టుకుని ఉన్న తనను జ్యూయలరీ షాప్ సీసీ కెమెరాలో కనిపించినా ఏ మాత్రం గుర్తు పట్టకూడదని పోలీసులను ఏమార్చేందుకు దేవుని గుడికి వెళ్లి గుండుకొట్టించుకున్నాడు. ఇక జీవితం బంగారుమయం అనుకున్నంతలోనే పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎం.రవిప్రకాష్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండి నియోజకవర్గం ఉండి గ్రామం కొత్తపేట సాయిబాబా గుడి ప్రాంతానికి చెందిన ఇర్రింకి చంద్రరావు వయసు 35 ఏళ్లు. కూలి పని చేసుకుంటూ దొంగతాలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ఇతనిపై గతంలో ఉండి పోలీస్స్టేషన్లో రెండు కేసులు, భీమవరం టూటౌన్ పోలీస్స్టేషన్లో రెండు కేసులు, పెంటపాడు పోలీస్స్టేషన్లో ఒక కేసు నమోదై ఉన్నాయి. ఉండి కేసులో పట్టుబడి గతేడాది అక్టోబర్లో జైలుకు వెళ్లి డిసెంబర్లో విడుదల అయ్యాడు. ఆ తర్వాత జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకుని అందుకు చీకటి మార్గా్గన్నే ఎంచుకున్నాడు. చోరీకి పక్కా ప్లాన్ ఈ ఏడాది మార్చి 25న పెంటపాడు గ్రామంలోని ఒక మద్యం దుకాణం వద్ద ఇర్రింకి చంద్రరావు మోటార్ సైకిల్ను అపహరించాడు. దానిపై భీమవరం వచ్చి భీమవరం ప్రకాశంచౌక్లోని మద్దుల వెంకటకృష్ణారావు జ్యూయలరీ షాపు వద్ద రెండు సార్లు రెక్కీ నిర్వహించారు. ఆ షాపు ప్రధాన గుమ్మం మెయిన్ రోడ్డులో ఉండడం, పోలీసు సీసీ కెమెరాతో పోటు గస్తీ కూడా ఉండడంతో వెనుక వైపు నుంచి చోరీకి నిర్ణయించాడు. మార్చి 31వ తేదీ రాత్రి 8 గంటలకు రూపాంతర దేవాలయంపై నుంచి జ్యూయలరీ షాపుపై అంతస్తు వెనుక భాగం వద్దకు చేరుకున్నాడు. రూపాంతర దేవాలయానికి చర్చి ఉన్న జ్యూయలరీ షాపు పై భాగంలో గోడకు బదులుగా ఉన్న ఐరన్ గ్రిల్స్ మెస్, ఇనుప గేటు, రెండు షెట్టర్ల తాళాలు తన వద్ద ఉన్న గునపం, స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్తో తొలగించాడు. లోపలికి ప్రవేశించి లాకర్లో పెట్టిన ఆభరణాలను కొట్టేశాడు. వాటిని బ్యాగ్లో వేసుకుని ఇంటికి చేరుకున్నాడు. సింహాచలం వెళ్లి గుండు కొట్టించుకుని.. చోరీసొత్తు నుంచి ఒక బ్రాస్లెట్, మూడు లాకెట్లు, రెండు జతల చెవిదిద్దులు మినహా మిగిలినవి ఇంట్లో మరో బ్యాగ్లో పెట్టి రహస్యంగా దాచేశాడు. బయటకు తీసిన కొన్ని ఆభరణాలను భీమవరంలోని ముత్తూట్ ఫిన్కార్ప్లో తాకట్టుపెట్టి సింహాచలం వెళ్లి అక్కడ గుండు కొట్టించుకుని ఈనెల 5న ఇంటికి చేరుకున్నాడు. వేగవంతంగా పోలీసుల దర్యాప్తు భారీచోరీతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దుకాణ యజమాని మద్దుల వీరనాగరాజు ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఆదేశాల మేరకు నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించింది. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. పాత నేరస్తులే ఈ పనిచేసి ఉంటారని భావించారు. ఇటీవల కాలంలో జైలు నుంచి విడుదలై బయట ఉన్న నేరస్తులపై దృష్టి పెట్టారు. మూడు నెలల క్రితం బయటకు వచ్చిన చంద్రరావును గతేడాది భీమవరం పోలీసులు అరెస్ట్ చేయగా అతను ఇచ్చిన సమాచారం మేరకు చంద్రరావు దొంగతనం చేసినట్టు భావించారు. సీసీ కెమెరా ఫుటేజిలో వ్యక్తి పోలికలు కూడా పోలీసులకు దర్యాప్తులో సహకరించాయి. సింహాచలం నుంచి ఇంటికి చేరుకున్న చంద్రరావు పెంటపాడులో అపహరించిన మోటార్ సైకిల్పై శనివారం చోరీ సొత్తుతో బయల్దేరాడు. టూటౌన్ సీఐ ఎస్ఎస్వీ నాగరాజు, కానిస్టేబుల్ ఎం.ప్రకాష్బాబుకు అందిన సమాచారంతో అప్రమత్తమయ్యారు. వన్టౌన్, టూటౌన్ సీఐలు పి.చంద్రశేఖరరావు, ఎస్ఎస్వీ నాగరాజు సిబ్బందితో కలిసి నర్సయ్య అగ్రహారం బైపాస్ రోడ్డు శివారులో నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. విచారణలో చంద్రరావు దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. అతడిపై రౌడీషీట్ తెరుస్తామన్నారు. చాకచక్యంగా కొద్ది రోజుల్లోనే కేసును ఛేదించి మొత్తం సొత్తును రికవరీ చేసిన సిబ్బందిని అభినందించారు. ఇద్దరు సీఐలు, సిబ్బందికి రివార్డులు అందచేశారు. -
ఆభరణాల్లో రెట్టింపు వాటా
బెంగళూరు: వచ్చే మూడు, నాలుగేళ్లలో ఆభరణాల మార్కెట్లో వాటాను రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని టైటాన్ సంస్థ నిర్దేశించుకుంది. ఈ విభాగంలో కంపెనీ మార్కెట్ వాటా ప్రస్తుతం 5 శాతంగా ఉంది. తాజా లక్ష్యాన్ని చేరుకునేందుకు వెడ్డింగ్ విభాగం, అధిక విలువ వజ్రాభరణాలు, గోల్డెన్ హార్వెస్ట్ కొనుగోలు స్కీమ్, కస్టమర్లకు ఎక్సే్చంజ్ ప్రోగ్రాం తోడ్పడగలవని కొత్త ఎండీగా నియమితులైన సీకే వెంకటరామన్ తెలిపారు. ప్రధానంగా వెడ్డింగ్ జ్యుయలరీపై మరింతగా దృష్టి సారిస్తున్నామని ఆయన చెప్పారు. టాటా గ్రూప్లో భాగమైన టైటాన్.. ’తనిష్క్’ బ్రాండ్ కింద ఆభరణాల వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పనితీరు గణనీయంగా మెరుగుపడుతోందని, మధ్య–టాప్ స్థాయి విభాగాల్లో కూడా మిగతా జ్యుయలర్స్ నుంచి తమ స్టోర్స్కు మళ్లే కొత్త కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని వెంకటరామన్ చెప్పారు. మార్కెట్ వాటాను పెంచుకునే దిశగా 2018–19లో ఇప్పటిదాకా కొత్తగా 40 స్టోర్స్ను ప్రారంభించినట్లు వెంకటరామన్ వివరించారు. ఒక ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో స్టోర్స్ను ప్రారంభించడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే దూకుడు కొనసాగగలదని వెంకటరామన్ తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణింపు.. దాదాపు రూ.14,000 కోట్ల మేర కుంభకోణంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ను వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ దెబ్బతీసిన నేపథ్యంలో గతేడాది జ్యుయలరీ పరిశ్రమ పెను సవాళ్లను ఎదుర్కొనాల్సి వచ్చింది. ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ మెరుగ్గా రాణించిన సంస్థల్లో టైటాన్ కూడా ఒకటిగా నిల్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టైటాన్ ఆదాయం 35 శాతం, నికర లాభం 46 శాతం పెరిగింది. ఆభరణాల వ్యాపార విభాగం ఆదాయం 36.95 శాతం పెరిగింది. టైటాన్ మొత్తం ఆదాయంలో దాదాపు 80 శాతం వాటా ఆభరణాల వ్యాపార విభాగానిదే ఉంటుంది. పెరుగుతున్న స్టోర్స్ నెట్వర్క్, బ్రాండ్ పేరు, అధిక విలువ ఆభరణాలపై ప్రధానంగా దృష్టి పెడుతుండటం తదితర అంశాల ఊతంతో 2018–21 మధ్యలో తనిష్క్ అమ్మకాలు సుమారు 22 శాతం, స్థూల లాభం 26.5% పెరగొచ్చని బ్రోకరేజీ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ అంచనా వేస్తోంది. గతేడాది కన్నా ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్లో వెడ్డింగ్ ఆభరణాల అమ్మకాలు మరింత భారీగా ఉండగలవని భావిస్తున్నట్లు టైటాన్ ప్రస్తుత ఎండీ భాస్కర్ భట్ ఇటీవలే పేర్కొన్నారు. ప్రస్తుతం వెడ్డింగ్ జ్యుయలరీ విభాగంలో తనిష్క్కు 2–3% మార్కెట్ వాటా ఉంటోందని, వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. -
క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో సోదరి
ప్రముఖ డిజైనర్.. రణ్బీర్ కపూర్ సోదరి రిద్ధిమా కపూర్ సాహ్ని, ‘కోకిచి మికిమోటో’ అనే ఆభరణాల సంస్థకు క్షమపణలు తెలిపారు. విషయం ఏంటంటే.. కొన్నాళ్ల క్రితం రిద్ధిమా కపూర్ ‘ఆర్ జ్యూవెలరి’ పేరుతో సొంత బ్రాండ్ను ప్రారంభించి.. ప్రత్యేకంగా ఆభరణాలు తయారు చేయించి అమ్ముతున్నారు. ఈ క్రమంలో పండుగల సీజన్ సందర్భంగా రిద్ధిమా ఒక చెవి దుద్దుల డిజైన్ను విడుదల చేశారు. అయితే ఈ చెవి దుద్దుల డిజైన్, ప్రముఖ ముత్యాల నగల తయారీదారులు ‘కోకిచి మికిమోటో’ కంపెనీ తయారు చేసిన చెవి దుద్దుల డిజైన్ రెండు ఒకే మాదిరిగా ఉన్నాయి. దాంతో రిద్ధిమా, కోకిచి వారి డిజైన్ను కాపీ కొట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. View this post on Instagram The legendary Kokichi Mikimoto is known in the pearl world as the ‘King of Pearls’. His ‘cultured pearls’ —patented in 1916 — is a benchmark for the industry at large. So, naturally ‘Jewellery designer of the year’, @riddhimakapoorsahniofficial couldn’t help herself from selling the iconic Mikimoto pearl and diamond earrings under her namesake label. If this is not #gutsontoast, we don’t know what is! 🤯 . . #gandi #dietsabya #copy #🤢 #riddhimakapoorsahni #mikimoto #mikimotopearls A post shared by Diet Sabya (@dietsabya) on Nov 25, 2018 at 1:57am PST తొలుత ఈ విషయం గురించి ఒక అపరిచిత వ్యక్తి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఈ విషయం కాస్తా వైరల్ కావడంతో రిద్ధిమా క్షమాపణలు చెప్పారు. ‘ఒరిజినల్ డిజైన్ని ట్యాగ్ చేయకపోవడం మా తప్పే. డిజైనర్ల సృజనాత్మకతను మేము గౌరవిస్తాము. మేము ఎవరిని కాపీ చేయము.. ఒకవేళ అలాంటి పనులు చేస్తే మాకు స్ఫూర్తినిచ్చిన వారిని మేము ఎప్పటికి గౌరవిస్తాము’ అంటూ రిద్ధిమా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Riddhima Kapoor Sahni (@riddhimakapoorsahniofficial) on Nov 25, 2018 at 8:41am PST -
మెరుపులు తగ్గిన జ్యుయలరీ
న్యూఢిల్లీ: ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మెహుల్చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,000 కోట్లకు పైగా చేసిన మోసం బయటపడటంతో ఆ ప్రభావం పరిశ్రమలోని ఇతర కంపెనీల ప్రణాళికలకు బ్రేకులు వేసింది. కొన్ని కంపెనీలు ఐపీవోకు వచ్చేందుకు సన్నద్ధం అవుతుండగా మోదీ స్కామ్ నేపథ్యంలో అవి పునరాలోచనలో పడ్డాయి. పునరాలోచనలో జోయ్ అలుకాస్... జోయ్ అలుకాస్ గ్రూపు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్కు రావాలనుకోగా ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టింది. వచ్చే ఏడాది ఎన్నికల అనంతరమే దీనిపై నిర్ణయిస్తామని ఈ సంస్థ సీఈవో బేబీ జార్జ్ తెలిపారు. ముఖ్యంగా నీరవ్ మోదీ స్కామ్ తరవాత జ్యుయలరీ రంగానికి నిధుల జారీపై బ్యాంకులు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని ఆయన చెప్పారు. కంపెనీ విస్తరణ ప్రణాళికల కోసం తమ దగ్గరున్న నగదు నిల్వలతో పాటు అవసరమైతే బ్యాంకు రుణాలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే బాండ్ మార్కెట్ను ఆశ్రయిస్తామని తెలిపారు. రుణ సాయం... 60 బిలియన్ డాలర్ల (రూ.3.9 లక్షల కోట్లు) దేశీయ జ్యయలరీ రంగానికి ప్రస్తుతం రుణాలు లభించడం కష్టతరంగా మారింది. మోదీ, చోక్సీల మోసాలు, కఠిన ఆడిటింగ్ నేపథ్యంలో రుణాలపై ప్రభావం పడింది. ఏ రంగంలో అయినా భారీ పరిణామం చోటు చేసుకుంటే మందగమనం, గందరగోళం ఏర్పడటం సహజమేనని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ భారత కార్య కలాపాల ఎండీ ఆషర్ పేర్కొన్నారు. ఈ సంస్థ కూడా ఐపీవోకు రావాలనుకుంటోంది. పరిశ్రమను ఇన్వెస్టర్లు భిన్నమైన కోణంలో చూస్తున్నందున ఐపీవోలకు మార్కెట్ సెంటిమెంట్ ఆశాజనకంగా లేదని ఆషర్ పేర్కొన్నారు. 2022 నాటికి 500 స్టోర్లకు కార్యకలాపాలను విస్తరించనున్నట్టు, ఈ ఏడాదే అమెరికా మార్కెట్లోకి ప్రవేశించనున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ఐపీవో ద్వారా విస్తరణకు అవసరమైన నిధులను సమీకరిస్తామన్నారు. ఈ రంగంలోని పీసీ జ్యుయలర్, త్రిభువన్దాస్ భీమ్జీ జవేరి షేర్లు మోదీ స్కామ్ తర్వాత తగ్గిన విషయం తెలిసిందే. -
కల్లు తాగించి నగలు దోచుకుంటున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ : ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ వారికి పీకల దాకా కల్లు తాగించి నగలను దోసుకెళుతున్న ముగ్గురు మోసగాళ్లను సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 తులాల బంగారం, 40 తులాల వెండి, ఒక ఆటో , సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ శశిధర్ రాజు విలేఖరులకు వివరాలు వెల్లడించారు. హయత్ నగర్లో నివాసం ఉంటున్న తిరుపతి అనే వ్యక్తి పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. తీరు మార్చుకోకుండా మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఇతను ఒంటరిగా ఉన్న మహిళలను ఆటోలో ఎక్కించుకొని కల్లు కాంపౌండుకు తీసుకెళ్లి మత్తు ఎక్కేలా మందు తాగించేవాడు. స్పృహ కోల్పోయాక వచ్చిన ఆటోలోనే ఎక్కించుకొని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్లి వారి వద్ద ఉన్న బంగారు నగలను దోచుకొని పారిపోయేవాడు. సీసీఫుటేజీ సహాయంతో ఇతనికి సహకరిస్తున్న ఇద్దరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ దోపిడీలు తాము చేశామని ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. -
చేజారినది.. చేజిక్కింది
ప్రకాశం, చీరాల అర్బన్: కొద్ది సేపట్లో గమ్యం చేరుకోబోతున్న ప్రయాణికుడి బ్యాగు ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడిపోయింది. అందులో సుమారు 70 సవర్ల బంగారు ఆభరణాలు ఉన్నాయి. రైల్వే పోలీసులు రంగంలోకి దిగి గంటల వ్యవధిలోనే బ్యాగును గుర్తించి బాధితుడికి అప్పగించారు. ఈ సంఘటన చీరాలలో బుధవారం జరిగింది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. కారంచేడుకు చెందిన యార్లగడ్డ సురేష్కుమార్ నెల్లూరులోని తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళాడు. బుధవారం మధ్యాహ్నం తిరుపతి–హౌరా ఎక్స్ప్రెస్లో తిరిగి వస్తున్నాడు. చీరాల సమీపిస్తుండటంతో వేటపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో తన సామగ్రిని సర్దుకుంటున్నాడు. వాటిలో ఓ బ్యాగుకు చక్రాలు ఉండటంతో అది దొర్లుకుంటూ డోరు వద్దకు వెళ్లి కింద పడిపోయింది. ఆయన గమనించలేదు. కొద్దిసేపటికి బ్యాగు కనిపించకపోవడంతో చీరాల స్టేషన్లో దిగిన వెంటనే జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో 70 సవర్ల బంగారం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. వెంటనే అప్రమత్తమైన జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ అవ్వారు శ్రీనివాసరావు, మరో ఆరుగురు సిబ్బంది టార్చిలైట్ల సాయంతో రైల్వే ట్రాక్ వెంబడి వెళ్లారు. వేటపాలెం రైల్వేస్టేషన్ దాటిన తర్వాత ట్రాక్ పక్కన పడి ఉన్న బ్యాగ్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి సమక్షంలో బ్యాగును తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకుని బాధితుడికి బ్యాగ్ అప్పగించారు. -
ఆ నలుగురు.. మహా ముదుర్లు
► మూడేళ్లుగా వరుస చోరీలు ► మొదటిసారి పోలీసు వలకు చిక్కి కటకటాలకు ► కేజిన్నర బంగారు, 30 కిలోల వెండి ఆభరణాలు రికవరీ నలుగురు స్నేహితులు.. ఒక్కొక్కరిదీ ఒక్కో వృత్తి. పెయింటర్, కార్పెంటర్, ప్లంబర్, కూలీ పనులు చేసుకునే వారు. వచ్చే సంపాదనతో ఇల్లు గడవడం కష్టమైంది. జల్సాకు డబ్బు సరిపోయేది కాదు. అడ్డ మార్గంలో డబ్బు సంపాదించాలని దొంగలుగా మారారు. తమ చేతి వాటాన్ని చూపుతూ రూ. అర కోటికి పైగా ఆభరణాలను అపహరించారు. వారికి అవసరమైనప్పుడల్లా దొంగలించిన ఆభరణాలను అమ్ముకుంటూ జల్సాలు చేసేవారు. ఎట్టకేలకు వారి ఆటకు సీసీఎస్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కర్నూలు: జిల్లాలో పలు చోరీల కేసులను దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసులకు పత్తికొండ చెందిన నలుగురిపై అనుమానం వచ్చింది. ఈ మేరకు పత్తికొండ పట్టణంలోని ఎస్వీ సుబ్బారెడ్డినగర్లో నివాసముంటున్న పింజరి అబ్దుల్లా, రెడ్డిబావి వీధిలో నివాసముంటున్న షేక్ షఫి అహమ్మద్, ముస్లిం వీధిలో నివాసముంటున్న పింజరి షేక్షావలి, అంబేద్కర్ సర్కిల్ దగ్గర నివాసముంటున్న సయ్యద్ చాంద్ బాషాలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా బయటపడింది. వారి వద్ద నుంచి రూ.54 లక్షల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితులను ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. అడిషనల్ ఎస్పీ షేక్షావలి, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీసీఎస్ డీఎస్పీ హుసేన్పీరాలతో కలసి గురువారం డీపీఓలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. పింజరి అబ్దుల్లా మునాఫ్ పత్తికొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్లంబర్గా, షేక్ షఫీ అహ్మద్ పెయింటర్గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన పింజరి షేక్షావలి పత్తికొండలో వివాహం చేసుకున్నాడు. అలాగే సయ్యద్ చాంద్ బాషా కార్పెంటర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. వచ్చే సంపాదన ఇల్లు గడవడానికే సరిపోయేది కాదు. వీరు నలుగురు స్నేహితులు. తరచూ మద్యం సేవించి జూదం ఆడేవారు. సంపాదన కోసం ముఠాగా ఏర్పడి నేరాల బాట పట్టారు. మూడేళ్లుగా వరుస చోరీలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మూడేళ్లుగా వరుస చోరీలకు పాల్పడుతూ సొత్తును ఇళ్లల్లో భద్రపరచుకుని ఖర్చులకు అవసరమైనప్పుడల్లా విక్రయించేవారు. మొదట ఆత్మకూరు ప్రాంతంలోను, తర్వాత కర్నూలు, బళ్లారి ప్రాంతంలో కూడా చోరీలకు పాల్పడ్డారు. ఈనెల 31వ తేదీ నలుగురు కలసి కొన్ని ఆభరణాలను తెలిసిన వ్యక్తి ద్వారా బంగారు షాపులో అమ్మి సొమ్ము చేసుకునేందుకు వెళ్తుండగా పక్కా సమాచారం మేరకు సీసీఎస్ సీఐ లక్ష్మయ్య నేతృత్వంలో సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు. విచారించగా ఇళ్లల్లో దాచి ఉంచిన సొమ్ముల వివరాలను వెల్లడించారు. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1,502 గ్రాముల బంగారు ఆభరణాలు, 30 కిలోల వెండి కలిపి రూ.54 లక్షలు విలువ చేసే సొత్తును రికవరీ చేశారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సీసీఎస్ సీఐ లక్ష్మయ్య, ఎస్ఐలు శ్రీనివాసులు, రమేష్ బాబు, అశోక్కుమార్, నయాబ్ రసూల్, హెడ్ కానిస్టేబుళ్లు మస్తాన్ సాహెబ్, రుద్రగౌడు, వెంకటస్వామి, పీసీలు నాగరాజు, సుదర్శన్, నాగరాజు, రవికుమార్, కిషోర్, సమీర్ అహ్మద్లను ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు. నేరాల చిట్టా ఇది ► 2014లో ఆత్మకూరుకు చెందిన రంగసాయి ఇంట్లో 207.627 గ్రాములు బంగారు ఆభరణాలను అహపరించారు. ► 2015లో కర్నూలు బి.క్యాంప్కు చెందిన వెంకటరాజు ఇంటికి కన్నం వేసి 26.100 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలించారు. ► 2015లో బాలాజీనగర్లోని షేక్ అబ్దుల్ రజాక్ ఇంట్లో 69.400 గ్రాముల బంగారు చోరీ చేశారు. ► 2015లో కర్నూలు ఇంజనీర్స్ కాలనీలోని రాంభూపాల్రెడ్డి ఇంట్లో 68.110 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ. ► 2017లో కర్నూలులోని మద్దూర్నగర్కు చెందిన రామాంజనేయులు ఇంట్లో 42.250 గ్రాముల బంగారు నగలు చోరీ. ► 2017లో కర్నూలులోని అబ్బాస్నగర్లో నివాసముంటున్న వెంకట్రామిరెడ్డి ఇంట్లో 35.100 గ్రాముల బంగారు నగలు చోరీ ► 2017లో కర్నూలులోని గాయత్రి ఎస్టేట్స్లో నివాసముంటున్న మురళీకృష్ణ ఇంట్లో 48.300 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ. ► 2017లో కర్నూలులోని దేవనగర్లో నివాసముంటున్న మీనా కుమారి ఇంట్లో 47 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ. ► 2017లో బళ్లారిలో వస్తువులు కొదువ పెట్టుకునే వ్యాపారి ఇంట్లో 1855.600 గ్రాముల బంగారు, 30.180 కిలోల వెండి చోరీ. -
ఇద్దరు చైన్స్నాచర్లు అరెస్టు
కడప అర్బన్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో 2014 నుంచి ఈ ఏడాది జనవరి నెల వరకు కడప నగరంతోపాటు వివిధ ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లిన ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ ఈజీ అశోక్కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం కడప డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన డి.శ్రీనివాసులురెడ్డి, కుంటుమల్ల మంజునాథరావులు 2014 నుంచి ఈ ఏడాది జనవరి చివరి వరకు తొమ్మిది కేసుల్లో బంగారు చైన్ల దోపిడీలకు పాల్పడ్డారన్నారు. వీరి వద్ద నుంచి 227 గ్రాముల బంగారు ఆభరణాలను, రెండు సెల్ఫోన్లు, రెండు కత్తులు, మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. – 2014లో పెండ్లిమర్రి మండలం మియన్నగారిపల్లె బస్టాప్ వద్ద.. – 2015లో ఎర్రగుంట్ల టౌన్ వేంపల్లెరోడ్డులో భార్యాభర్తలు వెళుతున్న టీవీఎస్ను అడ్డగించి.. – అదే ఏడాది నవంబరులో ముద్దనూరు ఎంపీడీఓ ఆఫీసు సమీపంలో ఓ మహిళ నడుచుకుంటూ వెళుతుండగా.. – 2016 మార్చిలో పెండ్లిమర్రి మండలం పొలతల శివరాత్రి తిరునాల సందర్భంగా ఆర్టీసీ బస్టాప్ వద్ద .. – అదే ఏడాది జూన్లో కమలాపురం పట్టణంలోని ప్రగతి స్కూలు సమీపంలో.. – అదే నెలలో కడప శాస్త్రినగర్లో.. – అదే ఏడాది ఆగస్టులో ఎర్రగుంట్ల మండలం ఇల్లూరు రైల్వేగేటు వద్ద ఓ మహిళ పొలం పనులకు వెళుతుండగా.. – ఈ ఏడాది జనవరి 7న వల్లూరు మండలం అంబవరం, తాడిగొట్ల రోడ్డులో ఓ యువతి, యువకుడు మోటారు సైకిల్లో వెళుతుండగా.. – అదే ప్రాంతంలో ఈ ఏడాది జనవరి 7న మోటారు సైకిల్పై వెళుతున్న యువతీయువకులను బెదిరించి వీరు బంగారు గొలుసులను లాక్కెళ్లారని వివరించారు. నిందితులు వైవీయూ సమీపంలో ఎగువ పల్లె క్రాస్ వద్ద మోటారు సైకిల్తోపాటు ఉండగా వారిని అరెస్టు చేశామన్నారు. వారి వద్దనుంచి దాదాపు రూ. 6 లక్షల విలువైన 227 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు సెల్ఫోన్లను, రెండు కత్తులను, మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని అరెస్టు చేయడంలో కృషి చేసిన కడప రూరల్ సీఐ బి.వెంకట శివారెడ్డి, వల్లూరు ఎస్ఐ ఎం.భాస్కర్రెడ్డి, కడప తాలూకా హెడ్ కానిస్టేబుల్ పి.మురళీ కృష్ణ, వల్లూరు కానిస్టేబుల్ ఎస్ఎండీ హుసేన్, పెండ్లిమర్రి కానిస్టేబుల్ రాంబాబు, చింతకొమ్మదిన్నె కానిస్టేబుల్ చంద్రమోహన్రెడ్డి, హోం గార్డులు లక్ష్మిరెడ్డి, జనార్దన్లను డీఎస్పీ అభినందించారు. -
పథకం ప్రకారమే దీనజ్యోతి హత్య!
కడప అర్బన్ : కడప రాజారెడ్డివీధికి చెందిన రిటైర్డ్ ఏఎస్డబ్లు్యఓ దీనజ్యోతి (62)ను దారుణంగా పథకం ప్రకారమే హత్య చేశారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే ప్రాంతంలో బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు, తన దగ్గర పనిచేస్తున్న పనిమనిషి భర్త, అతని స్నేహితునితో కలిసి పక్కా ప్రణాళికతో దీనజ్యోతిని అంతమొందించారని తెలిసింది. బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలికి, దీనజ్యోతికి మధ్య ఆర్థిక లావాదేవీలు కొనసాగాయి. మరికొంత మొత్తంలో డబ్బును తన అవసరాలకు ఇవ్వాలని బ్యూటీ పార్లర్ నిర్వాహకులు దీనజ్యోతిని కోరింది. ససేమిరా అనడంతో ఆమె బంగారు ఆభరణాలపై నిందితురాలు కన్నేసింది. ఈ క్రమంలోనే బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు తన దగ్గర పనిచేస్తున్న పని మనిషి భర్తకు డబ్బు ఆశ చూపి దీనజ్యోతిని హత్య చేసే విషయంలో సహాయం కోరింది. ఈ విషయాలన్నీ పనిమనిషి భర్తతో ప్రధాన నిందితురాలైన బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు గంటల తరబడి రాత్రి వేళల్లో ముఖ్యంగా దీనజ్యోతి అదృశ్యం కావడానికి ముందుగా రెండు రోజులు చర్చించింది. తర్వాత అనుకున్న సమయానికి దీనజ్యోతి ఇంటి నుంచి ఫేషియల్ చేయించుకునేందుకు బ్యూటీ పార్లర్కు వచ్చింది. చివరి ఫోన్కాల్ దీనజ్యోతి బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలితోనే మాట్లాడినట్లు సమాచారం. తర్వాత సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ చేయబడింది. దీనజ్యోతి ఫేషియల్ చేయించుకునేందుకు రాగానే ఆమెను కుర్చీలో కూర్చొబెట్టారు. ఫేషియల్ చేసిన అనంతరం పథకం ప్రకారం పనిమనిషి భర్త , ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు, ఇందుకు బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు సహకరించినట్లు తెలుస్తోంది. తర్వాత సాయంత్రం వరకు ఎదురుచూసి మృతదేహాన్ని పని మనిషి భర్త స్నేహితుడు, ఆటో డ్రైవర్ సహాయంతో నగర శివార్లలోకి తీసుకెళ్లి పెట్రోలు పోసి కాల్చి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అప్పటికే ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలను కాజేసినట్లుగా తెలుస్తోంది. సదరు బంగారు ఆభరణాలలో కొన్నింటిని బీకేఎం వీధిలోని ఓ సేఠ్ వద్ద కుదవకు పెట్టిన పనిమనిషి భర్త, ఆటో డ్రైవర్లు ఆ డబ్బుతో తమ అవసరాలను తీర్చుకున్నారు. దీన జ్యోతికి, బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు మధ్య లావాదేవీలతో మనస్పర్థలు ఏర్పడడంతో దారుణ హత్యకు దారి తీసిందని అనుకుంటున్నారు. ఇప్పటికే నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే దీనజ్యోతి మృతదేహానికి నగర శివార్లలో తగులబెట్టబడిన మృతదేహం ఒకటేనా? కాదా? అనే విషయంపై స్పష్టత వస్తే మిస్టరీ వీడిపోతుంది. ఈ సంఘటనపై మహిళా అప్గ్రేడ్ పోలీసుస్టేషన్ డీఎస్పీ వాసుదేవన్ మాట్లాడుతూదీన జ్యోతి వ్యవహారంపై స్పష్టత రావాల్సి ఉందని, నిందితుల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టామని తెలిపారు. -
సెప్టెంబర్లో ఎగుమతుల పరుగు
• 4.62 శాతం వృద్ధి రెండు నెలల వరుస క్షీణతకు బ్రేక్ • 2.4 శాతం తగ్గిన దిగుమతులు • 9 నెలల గరిష్టానికి వాణిజ్య లోటు న్యూఢిల్లీ: ఎగుమతుల పరంగా రెండు నెలల క్షీణతకు సెప్టెంబర్లో బ్రేక్ పడింది. ఇంజనీరింగ్, జెమ్స్, జ్యుయలరీ, చేతి ఉత్పత్తులు, వస్త్రోత్పత్తి రంగాలు అందించిన తోడ్పాటుతో సెప్టెంబర్లో దేశీయ ఎగుమతులు 4.62 శాతం వృద్ధి చెందాయి. మొత్తం 22.9 బిలియన్ డాలర్ల విలువైన వస్తు, సేవల ఎగుమతులు జరిగాయి. ఇంజనీరింగ్ 6.51 శాతం, జెమ్స్ అండ్ జ్యుయలరీ 22.42 శాతం, హ్యాండిక్రాఫ్ట్స్ 23 శాతం, టెక్స్టైల్స్ 12.62 శాతం, కెమికల్స్ ఎగుమతులు 6 శాతం చొప్పున వృద్ధి చెందడం కలసివచ్చింది. అదే సమయంలో దిగుమతులు 2.54 శాతం క్షీణించి 31.22 బిలియన్ డాలర్ల స్థాయికి దిగివచ్చాయి. దీంతో సెప్టెంబర్లో వాణిజ్య లోటు 8.33 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది సెప్టెంబర్లో వాణిజ్య లోటు 10.16 బిలియన్ డాలర్లతో పోలిస్తే ప్రస్తుతం కొంత తగ్గింది. అయినప్పటికీ ఇది గత తొమ్మిది నెలల కాలంలోనే గరిష్ట స్థాయి కావడం గమనార్హం. గతేడాది డిసెంబర్లో వాణిజ్య లోటు గరిష్టంగా 11.66 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ⇒ విడిగా రంగాల వారీగా చూస్తే సెప్టెంబర్లో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 1.43 శాతం క్షీణించగా, ఆయిల్ దిగుమతులు మాత్రం 3.13 శాతం వృద్ధితో 6.88 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ⇒ ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య ఆరు నెలల కాలంలో ఎగుమతులు మొత్తం మీద చూస్తే 1.74 శాతం క్షీణించాయి. ఈ కాలంలో ఎగుమతుల విలువ 131.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇదే కాలంలో దిగుమతులు 13.77 శాతం క్షీణించి 174.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ⇒ తొలి ఆరు నెలల కాలంలో వాణిజ్య లోటు 43 బిలియన్ డాలర్లు. రానున్న నెలల్లో మంచి ఫలితాలు: ఈ ధోరణి ఇలానే కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశీయ ఎగుమతులు 280 బిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ స్థాయికే చేరతాయని ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన సహకారం తాలూకు సానుకూల ఫలితాలు రాబోయే నెలల్లో ఎగుమతుల గణాంకాల్లో మరింతగా ప్రతిఫలిస్తాయని వ్యాఖ్యానించింది. ⇒ ఎగుమతుల వృద్ధికి చర్యలు: నిర్మలా సీతారామన్ దేశం నుంచి ఎగుమతులను పెంచేందుకు ఉన్న అడ్డంకులను తొలగించే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సరుకుల రవాణా (లాజిస్టిక్స్) వ్యయం, పన్నుపరంగా ఉన్న సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఎగుమతుల పథకాల్లో అవసరమైతే మధ్య కాలిక సవరణలు చేసే లక్ష్యంతో విదేశీ వాణిజ్య విధానంపై తమ శాఖ ఇప్పటికే సమీక్ష ప్రారంభించినట్టు మంత్రి వెల్లడించారు. ‘ఎగుమతుల్లో రెండంకెల వృద్ధికి వ్యూహాలు’ అనే అంశంపై శుక్రవారం ఢిల్లీలో అసోచామ్ నిర్వహించిన సమావేశంలో మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. లాజిస్టిక్స్ వ్యయం అనేది అతి పెద్ద అంశాల్లో ఒకటని, ఇది ధరల పరంగా ఎగుమతిదారుడు పోటీపడేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. స్వల్ప కాలంలో ఈ అంశాల నుంచి బయటపడడం ఎలా అన్న దానిపై ఇప్పటికే కొన్ని సంప్రదింపులు జరిపినట్టు చెప్పారు. -
ఒకే ఆభరణం అనేక రకాలుగా..
ఒకే ఆభరణాన్ని స్వల్ప మార్పు చేర్పులతో విభిన్న రకాల వేడుకలకు నప్పే విధంగా ధరించే కన్వర్టబుల్ జ్యువెలరీని కీర్తిలాల్స్ రూపొందించింది. సోమాజిగూడలోని సంస్థ షోరూమ్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఆభరణాల శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేశారు. -
జోయలుక్కాస్లో కిరాక్ షో
-
ఆభరణాలపై ఎక్సైజ్ సుంకం..తొలగించేది లేదు
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టీకరణ న్యూఢిల్లీ: వెండి యేతర ఆభరణాలపై ఒకశాతం ఎక్సైజ్ సుంకం తొలగించే ప్రశ్నేలేదని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. విలాసవంతమైన వస్తువులను పన్ను పరిధి నుంచి తొలగించడం సరికాదన్నది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఆర్థికమంత్రి ఇచ్చిన సమాధానంతో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు ప్రతిపక్ష సభ్యులు ఈ అంశంపై మాట్లాడుతూ, ఆభరణాలపై సుంకం విధింపు ఈ రంగంలో వ్యాపారాన్ని నిర్వీర్యం చేయడమేనని విమర్శించారు. 40 రోజుల నుంచీ వర్తకులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అయితే ఈ విమర్శలను ఆర్థికమంత్రి తోసిపుచ్చారు. సామాన్య వ్యక్తి వినియోగించే సబ్బులు, టూత్ పేస్ట్లు, రేజర్,పెన్సిల్, ఇంక్, ఫ్రూట్ జ్యూస్, బేబీ ఫుడ్ వంటి నిత్యావసర వస్తువులమీదే పన్ను విధిస్తున్నప్పుడు... లగ్జరీ వస్తువులను పన్ను పరిధి నుంచి తప్పించాలని భావించడం సరికాదని పేర్కొన్నారు. ఇమిటేషన్ ఆభరణాలమీదే 6 శాతం పన్ను విధిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. వేధింపులుగా భావించకూడదు... పన్ను విధింపు స్వర్ణకారులు, వర్తకులను వేధించడంగా భావించడం తగదని జైట్లీ అన్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ.12 కోట్ల పైన టర్నోవర్ను పన్ను పరిధిలోకి తీసుకోవడం జరిగిందని, ఈ యేడాది దీనిని రూ. 6 కోట్లకు ప్రభుత్వం తగ్గిస్తోందని పేర్కొన్న జైట్లీ... చిన్న, మధ్య వర్తకులు, స్వర్ణకారులపై పన్ను ప్రభావం ఏమాత్రం ఉండదన్న విషయాన్ని ఇక్కడ గమనించాలని కోరారు. -
పదో రోజుకు జ్యువెలరీ సమ్మె
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం విధింపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ ఆభరణాలు, బులియన్ వర్తకులు చేస్తున్న సమ్మె పదవ రోజుకు చేరింది. ఆభరణాలపై 1 శాతం ఎక్సైజ్ సుంకం విధించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనకు నిరసనగా ఈ నెల 2 నుంచి జరుగుతోంది. కాగా 12 కోట్ల టర్నోవర్ మించిన వ్యాపారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. 1981, 2012ల్లో కూడా రత్నాలు, ఆభరణాలపై ఎక్సైజ్ సుంకాన్ని విధించారు. కానీ ఆ తర్వాత ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. సురక్షిత సాధనంగా పుత్తడి: కాగా, ధరల్లో ఒడిదుడుకులున్నప్పటికీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో బంగారు ఆభరణాలకు డిమాండ్ 670-685 టన్నులకు పెరుగుతుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది. ఆభరణాల కంటే నాణాలు, కడ్డీలకే డిమాండ్ బాగా ఉంటుందని పేర్కొంది. ఆర్థిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులుండడం, స్టాక్ మార్కెట్లు బలహీనతలు, కరెన్సీ విలువలు తగ్గడం వల్ల సురక్షిత సాధనంగా పుత్తడి ఉంటుందని వివరించింది. -
కొత్త డిజైన్లతో తనిష్క్ ఆభరణాలు
హైదరాబాద్: ప్రముఖ బంగారు, వజ్రాభరణాల తయారీ సంస్థ తనిష్క్.. కొత్త సంవత్సరంలో వినియోగదారులకు మరింత చేరువకావాలనే లక్ష్యంతో కొత్తగా పలు రకాల డిజైన్లలో ఆభరణాలను మార్కెట్లో ప్రవేశపెట్టింది. అలాగే దోష రహితంగా రూపొందించిన చెవి రింగులు, పెండెంట్లు, చేతి ఉంగరాలపై 20 శాతం వరకు డిస్కౌంట్ను అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఆభర ణాలను తనిష్క్ స్టోర్లలోనే కాకుండా, ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తనిష్క్.కో.ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. -
ఇది.. A టు Z జ్యుయలరీ!
సరికొత్త ఆలోచనతో.. ఉపయోగపడే సేవలందించే ఏ సంస్థనైనా ప్రజలు ఆదరిస్తారు. దాన్ని నిరూపిస్తున్నాయి కొన్ని స్టార్టప్లు. విద్య, వైద్యం, షాపింగ్, మొబైల్, టెక్నాలజీ.. ఇలా ప్రతి విభాగం నుంచి అలాంటి స్టార్టప్లను ఎంపిక చేసి... వాటిపై ప్రత్యేక కథనాలు అందిస్తోంది ‘సాక్షి స్టార్టప్ డైరీ’. దీన్ని చూసి దేశంలోని వివిధ నగరాల నుంచి పలు స్టార్టప్లు తమ విజయ గాధను, వివరాలను ‘సాక్షి’కి మెయిల్ చేస్తున్నాయి. ఇలా వస్తున్న మెయిల్స్ సంఖ్య ఎక్కువగా ఉంటోంది... వారానికోసారి ప్రచురిస్తుండటం వల్ల కొన్నిటినే ఇవ్వగలుగుతున్నాం. కొంత ఆలస్యమైనా వినూత్న స్టార్టప్ల గురించి ప్రచురిస్తామని చెబుతూ... ఈ వారం మీకోసం అలాంటి స్టార్టప్ వివరాలివి... బంగారం, వజ్రాలు, ప్లాటినం వంటి విలువైన ఆభరణాలు కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. అవి తయారుచేసే సంస్థలు, అమ్మకందార్ల గురించి తెలుసుకోవాలంటే ? అదీ ఆన్లైన్ వేదికగా!! ఎవరికి వారే తాము గొప్పంటే తామంటూ చెప్పుకొంటారు. మరెలా.. దేశంలోని జ్యుయలరీ పరిశ్రమనంతటినీ ఒకే గొడుకు కిందకి తీసుకొచ్చింది మైహీరా.కామ్. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మైహీరా.కామ్ను ఈ ఏడాది సెప్టెంబరు 17న ఆరంభించారు పూజా బన్సాల్. జెమ్స్, జ్యుయలరీ తయారీదారులు, ట్రేడర్స్, సప్లయర్స్, హోల్సేలర్స్ మాత్రమే కాదు... జ్యుయలరీ ల్యాబొరేటరీ, ఇనిస్టిట్యూట్స్, ఫొటోగ్రఫీ, డిజైన్స్ వంటివి కూడా ఇందులో రిజిస్టరై ఉన్నాయి. 195 రకాల కేటగిరీలను మై హీరా.కామ్లో చూడొచ్చు. దీని గురించి పూజ ఏమన్నారంటే... ‘‘దేశంలో 8 వేల ఆభరణాల సంస్థలు రిజిస్టరై ఉన్నాయి. హైదరాబాద్ నుంచి పి.మంగత్రామ్, ఎస్ఏపీ, శ్రీబాలాజీ, కైలాశ్నాథ్ వంటి 290 జ్యుయలరీ సంస్థలున్నాయి. ఇక గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో సంస్థలు నమోదై ఉన్నాయి. ఈ ఏడాది ముగిసే నాటికి 25 వేల సంస్థలను నమోదు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. అందుకే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నాం. ఇక రోజుకు 40-50 వేల మంది కస్టమర్లు మా సైట్ను సందర్శిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దీన్ని 60 లక్షలకు చేర్చాలని లక్ష్యించాం. ఒక్కో రిజిస్ట్రేషన్కు సిల్వర్ అయితే ఏటా రూ.50 వేలు, గోల్డ్ అయితే రూ.లక్ష చార్జీ ఉంటుంది. సిల్వర్ విభాగం కింద 200 ఉత్పత్తులను, 50 లీడ్లను తీసుకోవచ్చు. గోల్డ్కైతే రెండితల లాభం ఉంటుంది’’ అని వివరించారు పూజ. రూ.కోటితో ఆరంభించిన మై హీరా.కామ్ తరఫున 6 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
క్యారెట్లేన్ వర్చువల్ జ్యువెల్లరీ యాప్ విడుదల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో ఆభరణాల విక్రయించే క్యారెట్లేన్.. వినూత్న యాప్ను విడుదల చేసింది. క్యారెట్లేన్ వర్చువల్ జ్యువెల్లరీ యాప్తో త్రీడీ ఇమేజింగ్ టెక్నాలజీ ఆధారంగా ఫొటో తీసుకోవచ్చని, శరీరానికి నప్పే విధంగా ఉండే నగలను కొనుగోలు చేయవచ్చని సంస్థ సీఈఓ మిథున్ సాచేటి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలి దశలో చెవి రింగులు, నగలను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చామని... త్వరలోనే ఇతర ఆభరణాలనూ తీసుకొస్తామని తెలియజేశారు. ప్రస్తుతం క్యారెట్లేన్ లక్షకు పైగా కస్టమర్లతో 150 నగరాల్లో విస్తరించి ఉంది. ఆఫ్లైన్లో క్యారెట్లైన్కు 7 నగరాల్లో 10 స్టోర్లున్నాయి. -
అందరినీ ఆకట్టుకునేలా ఆభరణాలు
తిరుపతి మంగళం: అందరినీ ఆకట్టుకునేలా ఆభరణాలను వినియోగదారులకు అందించడం మలబార్గోల్డ్ షోరూం వారి ప్రత్యేకత అని ప్రముఖ సినీనటి నిత్యామీనన్ తెలిపారు. తిరుపతి టౌన్క్లబ్ సర్కిల్లో ఉన్న మలబార్గోల్డ్ షోరూంలో ఏర్పాటు చేసిన ‘ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యూవెలరీ’ ప్రదర్శనను సినీనటి నిత్యామీనన్, తిరుపతి ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో అనేక జ్యూవెలరీ షోరూంలు ఉన్నప్పటికీ మలబార్ గోల్డ్ షోరూం ఒక ప్రత్యేకత కలిగి ఉందన్నారు. మహిళల కోరికలకు తగ్గట్టుగా అన్ని రకాల మోడళ్లలో ఆభరణాలు ఆకట్టుకుంటున్నాయన్నా రు. ఆకర్షించే ఆభరణాలతో పాటు వినియోగదారులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారని తెలిపారు. అనంతరం మలబార్ గోల్డ్ మార్కెటింగ్ హెడ్ కళ్యాణ్రామ్ మాట్లాడుతూ నాణ్యతకు మారుపేరు తమ మలబార్గోల్డ్ షోరూం అన్నారు. తమ షోరూం లో వజ్రాభరణాలపై వినియోగదారులకు15 శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు. తమకు వచ్చే ఆదాయంలో 10 శాతం పేదల సంక్షేమానికి వినియోగిస్తున్నామని తెలి పారు. అలాగే పేదల విద్యార్థుల ఉన్నత విద్యకు కూడ తాము సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాయకులు మునిశేఖర్, మలబార్ గోల్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమికుల రోజు ఆన్లైన్ కొనుగోళ్లు రూ.22 వేల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రేమికుల రోజు కార్డులు, ఫ్లవర్స్, డైమండ్ జ్యువెలరీ, చాక్లెట్లు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు తదితర వాటిని కొనుగోలు చేయటానికి ఆన్లైన్ కొనుగోలుదారులు వెచ్చించే మొత్తం రూ. 22 వేల కోట్లు ఉంటుందని అసోచాం తెలిపింది. గతేడాది ఈ మొత్తం రూ.16 వేల కోట్లుగా ఉందని పేర్కొంది. దీనికోసం అసోచాం ఓ సర్వేను జరిపింది. సర్వేలో దాదాపు 52 శాతం మంది ఆన్లైన్ షాపింగ్ చేసే వారు రిటైల్ షాపులతో పోలిస్తే ఆన్లైన్లోనే ఆఫర్లు బాగుంటాయనే అభిప్రాయపడ్డారు. అలాగే 50 శాతం మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులు, 18 శాతం మంది ట్యాబ్లెట్ వినియోగదారులు గిఫ్ట్లను కొనుగోలు చేయటానికి వారి ఉపకరణాలనే వినియోగిస్తారు. -
ఫామ్హౌస్లో దొంగల బీభత్సం..
రాజేంద్రనగర్: ఫామ్హౌస్లో చొరబడ్డ దొంగలు మూడు గంటలపాటు స్వైరవిహారం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గండిపేట్ శ్రీనగర్లో అనంతసేనారెడ్డికి చెందిన ఫామ్హౌస్ ఉంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావు(60) వాచ్మన్గా పని చేస్తున్నాడు. భార్య ధనలక్ష్మి(55)తోపాటు మనువరాలు దీప(7) ఇతనితోపాటు ఉంటున్నారు. గురువారం రాత్రి 10.30కి ఆరుగురు దుండగులు ప్రధాన గేటు దూకి ఫామ్హౌస్ లోనికి ప్రవేశించారు. వాచ్మన్ గది వద్దకు వచ్చిన వారు హిందీలో వెంకటేశ్వరరావును పిలిచి తలుపు తెరిపించారు. బయటకు రాగానే చితకబాదారు. అలికిడికి మేల్కొన్న ధనలక్ష్మిపైనా దాడిచేశారు. వెంకటేశ్వరరావు తల పగలగా, ధనలక్ష్మి చేతికి గాయమైంది. తర్వాత ఇద్దరినీ చెట్టుకు కట్టేసి డబ్బు, ఆభరణాలు ఎక్కడ ఉన్నాయని హిందీలో బెదిరించారు. తమకు హిందీ రాదని చెప్పగా తెలుగులో మాట్లాడి ఇద్దరినీ చితకబాదసాగారు. దీంతో చిన్నారి దీప తన తాత,నానమ్మలను కొట్టవద్దని డబ్బులున్న బీరువాను చూపించింది. అందులో ఉన్న రూ.40 వేల నగదు తీసుకున్న దొంగల చిన్నారి చెవికమ్మలనూ లాక్కున్నారు. ధనలక్ష్మి మెడలో ఉన్న రోల్డ్గోల్డ్ మంగళసూత్రాన్ని తెంచుకున్నా రు. రాత్రి ఒంటి గంట తర్వాత దొంగలు గేట్దూకి పారిపోయారు. వీరు వెళ్లిన వెంటనే దీప ఇరువురి కట్లను విప్పింది. ఇద్దరూ పక్కనే ఉన్న ఫామ్హౌస్ వాచ్మన్ ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గాయపడ్డ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఘటనా స్థలాన్ని క్రైం డీసీపీ జానకీ షర్మిళ, శంషాబాద్ డీసీపీ రమేష్నాయుడు, రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి పరిశీలించారు. బీరువాను తెరిచేందుకు... ఫామ్హౌస్లోని ఓ గదిలో సేఫ్లాకర్ ఉంది. దాన్ని తెరిచేందుకు దుండగులు ఇనుపరాడ్లు, గొడ్డలితో విఫలయత్నం చేశారు. ఇందులో భారీ మొత్తంలో నగదు ఉంటుందన్న ఆశతో వారు ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. ఇది తెలిసిన వారి పనే కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. బాధితులు దొంగల్లో ఒక్కరిని కూడా గుర్తు పట్టకపోవడంతో బట్టి ఫామ్హౌస్ గురించి పూర్తిగా తెలిసిన వారెవరో వీరిని పంపి ఉంటారని భావిస్తున్నారు. -
ఇప్పుడంతా వారసత్వ నటనే..
సినీ నటుడు కోట శంకర్రావు నటనలో అన్నయ్యకు సాటి.. నాటకంలో మేటి.. ఏ క్యారెక్టర్కైనా సరిపోయే రూపం.. క్లిష్టమైన డైలాగులను సునాయూసంగా చెప్పగలిగే వ్యాఖ్యానం నటుడు కోట శంకర్రావుకు పెట్టని ఆభరణాలు. సోదరుడు కోట శ్రీనివాసరావుకు ఏమాత్రం తీసిపోని ఆయన నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. విలక్షణమైన అభినయంతో అటు వెండితెర వీక్షకులను, ఇటు బుల్లితెర ప్రేక్షకులను, నాటకరంగ అభిమానులను మెప్పిస్తున్న ఘనాపాఠి ఆయన. ఈ నేల-ఈ గాలి సీరియల్ షూటింగ్లో పాల్గొనేందుకు గుడ్లవల్లేరు మండలం కౌతవరం వచ్చిన ఆయన సోమవారం ‘సాక్షి’తో ముచ్చటించారు. తన స్వస్థలం జిల్లాలోని కంకిపాడు అని చెప్పారు. - కౌతవరం (గుడ్లవల్లేరు) సాక్షి : నటనకు ముందు మీరేం చేసేవారు? శంకర్రావు : స్టేట్బ్యాంక్ మేనేజర్గా 30ఏళ్లు పనిచేశా. సాక్షి : నాటకాల్లో ప్రవేశం ఉందా? శంకర్రావు : 1965 నుంచి నాటకరంగంలో ఉన్నాను. ఆ అనుభవం వల్లే సినిమాల్లో అవకాశం వచ్చింది. సాక్షి : సినీరంగ ప్రవేశం ఎప్పుడు జరిగింది? శంకర్రావు : 1986లో ‘నాకూ పెళ్లాం కావాలి’ నా మొదటి సినిమా. సాక్షి : ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు? శంకర్రావు : 80 సినిమాలు చేశాను. సాక్షి : మీకు పేరు తెచ్చిన సినిమాలు? శంకర్రావు : అంకురం, సూత్రధారులు, హలోబ్రదర్, చీమలదండు మంచి పేరు తెచ్చాయి. సాక్షి :: సీరియల్స్లోకి ఎప్పుడు అడుగుపెట్టారు? శంకర్రావు : సినిమాల కంటే ముందే సీరియల్స్లోకి వచ్చాను. 1983లోనే సీరియల్స్లో నటించా. ఇప్పటివరకు 53 సీరియల్స్లో నటించే అవకాశం వచ్చింది. సాక్షి : ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? శంకర్రావు : సినిమాలేమీ చేయట్లేదు. ఐదు సీరియల్స్ చేస్తున్నాను. సాక్షి : ఏ సీరియల్స్లో మీకు పేరొచ్చింది? శంకర్రావు : కలిసుందాం రా, జయం, శ్రీమతి, గాయత్రి, యోగి వేమన, విశిష్ట విశ్వామిత్ర సీరియల్స్లో మంచి పేరొచ్చింది. సాక్షి : నటనా రంగానికి కొత్తగా వచ్చే వారికి మీరిచ్చేసలహా? శంకర్రావు : సినిమాలు, సీరియల్స్లో నటించేందుకు కొండంత టాలెంట్ ఉంటే చాలదు. ఆవగింజంత అదృష్టం ఉండాలి. అదే ముఖ్యం. నటనలో ఏకే47లా పనిచేయాలి. అవకాశం ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు. కానీ, ఆ అవకాశం వస్తుంది. నిత్య సాధన చేస్తూ నటన అనే విద్యకు పదును పెట్టుకుంటూ ఉండాలి. సినీ సత్సంబంధాల్ని మెరుగు పరుచుకుంటూ వాటిని కొనసాగిస్తే, తప్పక లక్ష్యం సాధించవచ్చు. సాక్షి : సినీ పరిశ్రమలో ప్రస్తుతం అవకాశాలు ఎలా ఉన్నాయి? శంకర్రావు : అవకాశాలు ఇచ్చే విషయంలో కొందరు వారసత్వానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. -
బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
మునగపాక ఎస్బీఐలో ఘటన లాకర్లలో ఆభరణాలు, నగదు సురక్షితం క్లూస్ టీమ్ వివరాల సేకరణ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మునగపాక : స్థానిక స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఇద్దరు యువకులు చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంక్లో చోరీ జరిగిందన్న ప్రచారంతో ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. బ్యాంక్ అధికారులు, పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆభరణాలు గాని నగదుకాని చోరీ జరగలేదని ప్రకటించారు. వివరాలివి... మునగపాక మెయిన్ రోడ్డు పక్కనే ఎస్బీఐ బ్రాంచి ఉంది. ఈ నెల 28న రాత్రి 7 గంటల సమయంలో బ్రాంచ్ మేనేజర్ సుబ్రహ్మణ్యంతోపాటు సిబ్బంది బ్యాంక్కు తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. 29న వినాయక చవితి సెలవు కావడంతో తెరవలేదు. 30న ఉదయం 9.15 గంటలకు బీఎంతో పాటు అకౌంటెంట్ ఉమామణి మెయిన్గేటు తెరిచి లోపలికి వెళ్లారు. లోపల ఉన్న సర్వర్ను ఆన్చేసి వస్తుండగా లాకర్లు ఉన్న గది తెరిచి ఉండడాన్ని గమనించి ఒక్కసారిగా బీఎం ఆందోళనకు గురయ్యారు. అకౌంటెంట్ను పిలిచి ముందురోజు లాకర్ గదికి తాళాలు వేయడం మరిచారా అని వాకబు చేశారు. ఆమె తాళాలు వేశామని చెప్పడంతో చోరీ జరిగిందని భావించి హుటాహుటీన స్థానిక పోలీసు స్టేషన్కు చేరుకొని ఎస్ఐ రవికుమార్కు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ తన సిబ్బందితో బ్యాంక్కు చేరుకున్నారు. లాకర్ గది తాళాలు తీసి కింద పడేసిన విషయాన్ని గమనించి దొంగలు ప్రవేశించారని నిర్ధారించారు. పోలీసుల సమక్షంలో బ్యాంక్ సిబ్బంది అన్ని లాకర్లు తెరిచి చూడగా నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురికాలేదని నిర్ధారించుకున్నారు. సీసీ పుటేజ్ ఆధారంగా వివరాలు... ఎస్బీఐలో చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు బ్యాంకుకు దక్షిణ దిశలో ఉన్న కిటికీని గునపాంతో పెకిలించి లోపలికుప్రవేశించారు. క్యాషియర్ రూమ్లో ఉన్న ఆలారం కనెక్షన్ తొలగించారు. అనంతరం లాకర్లు ఉన్న గది గేటుకున్న తాళం కప్పలను గునపంతో పెకిలించివేశారు. అదే సమయంలో ఓ దుండగుడు సీపీ కెమెరాను విరగ్గొట్టాడు. దీంతో ఆ తరువాతం ఏం జరిగిందన్న విషయం సీసీ పుటేజీలో కానరాలేదు. అనుభవం ఉన్న దొంగలపనే... ఇది చోరీల్లో అనుభవం ఉన్న వ్యక్తుల పనేనని క్లూస్టీమ్ ఇన్స్పెక్టర్ శ్రీనగేష్ తెలిపారు. ఎటువంటి అనవాళ్లు తెలియకుండా ఇద్దరు వ్యక్తులు ముఖాలకు గుడ్డలు కప్పుకొని, కాళ్ల కు సాక్సులు ధరించి బ్యాంకులోకి ప్రవేశిం చినట్టు గుర్తులు ఉన్నాయని చెప్పారు. ఆ ఇద్దరి వయస్సు 32 నుంచి 35 ఏళ్లు ఉండవచ్చన్నారు. 27న అర్ధరాత్రి దాటిన తరువాత 1.40 గంటలకు దొంగలు బ్యాంకులో చోరీకి యత్నించారని సీసీ పుటేజీలో గుర్తించామన్నారు. ఖాతాదారులు ఆందోళన వద్దు.. బ్యాంక్లో చోరీ జరిగిందన్న విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ఖాతాదారులు శనివారం బ్యాంక్కు చేరుకున్నారు. తమ ఆభరణాలు జాగ్రత్తగా ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ ఖాతాదారులెవరూ ఆందోళన చెందవద్దని, నగదు, ఆభరణాలు లాకర్లలో భద్రంగా ఉన్నాయని చెప్పారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చోరీ విషయం తెలుసుకున్న అనకాపల్లి రూరల్ సీఐ భూషణం నాయుడు మునగపాక ఎస్బీఐకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. చోరీకి యత్నించిన వ్యక్తులను వదిలేదిలేదన్నారు. పోలీస్ సైరన్ వల్లే దొంగల పరారీ... దొంగలు బ్యాంకులో చోరీకి ప్రయత్నిస్తున్న సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది వాహనం సైరన్ మోగించుకుంటూ వెళ్లడం వల్లే దొంగలు భయపడి పరారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
పట్టపగలే ఆభరణాల అపహరణ
షాపు తెరుస్తుండగా ఎత్తుకెళ్లిన దుండగులు చోరీ సొత్తు రూ.8 లక్షలు ఎస్.రాయవరం : మండల కేంద్రం ఎస్.రాయవరం బజారులో బుధవారం పట్టపగలే దుండగులు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ సంఘటనపై స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలివి. గ్రామంలోని బజారు షాపింగ్ కాంప్లెక్స్లో పర్సవేది వెంకటరమణ సాయి జ్యుయలరీ పేరిట బంగారు దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం వెంకటరమణ షాపు తెరచేందకు వచ్చారు. తన చేతిలోని ఆభరణాల బ్యాగును పక్కనపెట్టి షట్టరు తెరచేందుకు ప్రయత్నించారు. ఇంతలో దొంగలు గుట్టుచప్పుడు కాకుండా బ్యాగును అపహరించుకు పోయారు. షాపు తెరచి వెంకటరమణ బ్యాగుని గమనించే సరికి బ్యాగు కనిపించలేదు. ఆ బ్యాగులో సుమారు రూ 8 లక్షలు విలువచేసే బంగార వస్తువులు, రూ 10 నగదు ఉన్నాయంటూ యజమాని లబోదిబోమన్నాడు. రోజూ షాపు మూసే ముందు విలువైన బంగారం నగలు బ్యాగులో సర్దుకుని ఇంటికి తీసుకెళ్లి, మర్నాడు ఉదయం షాపు తెరచేముందు షాపుకి తీసుకువస్తామని పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న యలమంచిలి సీఐ మళ్లేశ్వరరావు, నర్సీపట్నం ఏఎస్పీ సత్యేసుబాబు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ చోరీ మిస్టరీని ఛేదించి బాధితునికి న్యాయం చేస్తామని ఏఎస్పీ విలేకరులకు తెలిపారు. కాగా ఆభరణాల బ్యాగును ఎత్తుకెళ్లిన దుండగులు మోటారు సైకిల్పై పరారయినట్టు స్థానికులు చెబుతున్నారు. -
పెట్టుబడుల్లో నిలువెత్తు శిల్పాశెట్టి
సెలబ్రిటీ స్టైల్.. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి.. సాహసవీరుడు-సాగర కన్య లాంటి కొన్ని తెలుగు సినిమాల్లోనూ అలరించింది. సినిమాల్లో అవకాశాలు కాస్త తగ్గినప్పుడు బిగ్ బ్రదర్ రియాలిటీ షోలో విజేతగా నిల్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మధ్యమధ్యలో వివాదాలు ఉన్నా .. ఐపీఎల్ క్రికెట్, ఆభరణాలు, రియల్టీ వంటి వ్యాపార రంగాల్లోనూ మెరుస్తోంది. కొత్త వెంచర్లతో ముందుకు సాగిపోతున్న శిల్పా శెట్టి ఇన్వెస్ట్మెంట్లు, మనీ మేనేజ్మెంట్పై ఆమె అభిప్రాయాలు సెలబ్రిటీ స్టయిల్లో.. బిజినెస్ వెంచర్లు, టీవీ షోలు, ఎండార్స్మెంట్లు మొదలైన వాటి ద్వారా శిల్పా శెట్టి సంపద విలువ దాదాపు రూ. 1,200 కోట్ల మేర ఉంటుందని అంచనా. కేవలం గ్లామర్ ఫీల్డ్కి మాత్రమే పరిమితం కాకుండా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తోంది శిల్పా శెట్టి. బిగ్ బ్రదర్ షోతో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పాపులారిటీని వృథాగా పోనివ్వకుండా అప్పటికప్పుడు తన పేరుతో ఎస్2 పర్ఫ్యూమ్ని లాంచ్ చేసింది. అలాగే, యోగాపై డీవీడీ వీడియోలు ప్రవేశపెట్టింది. మరోవైపు, బిజినెస్మ్యాన్ భర్త రాజ్ కుంద్రా సహకారంతో పలు బిజినెస్ వెంచర్లు కూడా చేపట్టింది ఐపీఎల్ క్రికెట్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్లో ఇన్వెస్ట్ చేసింది. ఆన్లైన్ ప్రాపర్టీ బ్రోకరేజి బిజినెస్తో పాటు గ్రూప్కో డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేసింది. అటు లండన్, దుబాయ్ సహా పలు ప్రాంతాల్లో రియల్టీ రంగంలో ఇన్వెస్ట్ చేశారు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా. ఇటీవలే సత్యుగ్ గోల్డ్ పేరిట ఆభరణాల వ్యాపారంలోకి కూడా అరంగేట్రం చేశారు. సినీ నిర్మాతగా కూడా మారారు. శిల్పా శెట్టి ఇలా విభిన్న పాత్రలు పోషిస్తున్నప్పటికీ మనీకి సంబంధించి ఆమె ఫిలాసఫీ చాలా సింపుల్గా ఉంటుంది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం కావడంతో డబ్బు విలువ తనకు బాగా తెలుసంటుంది. మనీకి అనవసర ప్రాధాన్యం ఇవ్వనని, నచ్చినది చేస్తే డబ్బు దానంతటదే వస్తుందని చెబుతుంది. ఇక పెట్టుబడుల విషయానికొస్తే.. భవిష్యత్ సురక్షితంగా ఉండటం కోసం చేసేవే కాబట్టి వీటి ని పెన్షన్ ప్రణాళికలుగా కూడా పరిగణి ంచవచ్చని చెబుతుంది శిల్పా శెట్టి. -
ఆభరణానికే అందం...
చాలా వెరైటీ వంటకాలు ఉన్నాయి కదా అని అన్నీ ఒకేసారి తినలేం. అలాగే ఏడు వారాల నగలు ఉన్నాయి కదా అని అన్నీ ఒకేసారి ధరించకూడదు. కట్టుకునే దుస్తులకే కాదు, పెట్టుకునే ఆభరణాలకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. సమయం, సందర్భాలను బట్టి ఆభరణాలు ధరించాలి. ఆ ఆభరణాలలో మీరు మరింత ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలంటే ఏది రాంగో, ఏది రైటో తెలిసుండాలి. అందుకు ఈ మెలకువలు పాటించి, ఆభరణాలకే అందాన్ని తీసుకురండి. నగలు ఆడవారికి ఎంత ఇష్టమో తెలిసిందే! పెళ్ళిళ్లకు, ఇతర ఫంక్షన్లకు వెళ్లినప్పుడు చీరల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.కాని నగలు ఒకే తరహావి పెట్టుకెళతారు. ఇక చాలా మంది చేసే పొరపాటు.. ఒకటికి రెండు, మూడు నగలు వేసుకోవడం. ధరించిన చీరకు, వేసుకున్న నగకు ఏ మాత్రం పొంతన లేకపోవడం... రోల్డ్గోల్డ్ కంటే బంగారు ఆభరణా లలో ఈ పొరపాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. మెడ పొడవుగా/ కురచగా ఉంటే!: ఆభరణాలు ధరించేటప్పుడు మెడను బట్టి ఎంచుకోవాలి. మెడ సన్నగా పొడవుగా ఉన్నదా, లేక కురచగా లావుగా ఉన్నదా అనేది చూసుకోవాలి. అలాగే వయసును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక వయసు వచ్చేసరికి మెడ మీద ముడతలు వచ్చేస్తాయి. మెడ పొడవుగా సన్నగా ఉంటే చౌకర్స్, నెక్లెస్ పెట్టుకోవచ్చు. అదే మెడ కురచగా.. లావుగా ఉన్నా, ముడతలుగా ఉన్నా నెక్లెస్లు పెట్టుకునే ధైర్యం చేయకూడదు. పొడవాటి హారాలు వేసుకోవాలి. ఫ్యాబ్రిక్కు తగిన ఆభరణం: వెళ్లబోయే వేడుక ఏంటి? ఏ చీర కట్టుకుంటున్నాం.. అనే దాన్ని బట్టి ఆభరణాలను ఎంపిక చేసుకోవాలి. షిఫాన్ చీర ధరించినప్పుడు పట్టుచీరపైకి వేసుకునే నగలు ధరించకూడదు. పోచంపల్లి, గద్వాల వంటి కాటన్ చీరలు కట్టుకున్నప్పుడు డల్ మెటల్స్, ఉడెన్ జ్యుయలరీ బాగా సూటవుతుంది. బంగారు ఆభరణాలైతే యాంటిక్ ఫినిషింగ్ చేసినవి నప్పుతాయి. షిఫాన్, జార్జెట్.. వంటి చీరలు కట్టుకున్నప్పుడు సంప్రదాయ ఆభరణాలు ఎంత మాత్రం నప్పవు. వీటికి ఫంకీ జువెల్లరీ... అదీ ఒక నగ మాత్రమే ధరించాలి. లేదా స్టైలిష్ ముత్యాలు వేసుకోవాలి. సన్నటి సింగిల్ లైన్ నెక్లెస్లు కూడా బాగుంటాయి. పట్టుచీర ధరించినప్పుడు బంగారు ఆభరణాలు, కెంపులు, పచ్చలు బాగుంటాయి. పట్టుచీరలో గోల్డ్, సిల్వర్ థ్రెడ్ డిజైన్స్ ఉంటాయి. ఆ గోల్డ్ డిజైన్కి ఈ గోల్డ్ జువెల్రీ బాగా సూటవుతుంది. అందుకే ముందు ఏ తరహా చీర కట్టుకుంటున్నామో దృష్టిలో పెట్టుకొని, దానికి తగిన ఆభరణాన్ని ఎంపిక చేసుకోవాలి. రంగులకు తగిన ఆభరణం: ఎంపిక లేదు, ఆభరణాలు తక్కువ ఉన్నాయి అనుకుంటే ఒకే ఒక్క నగ ధరించవచ్చు. అది కూడా సరైనది లేదు అనుకుంటే చీరకు సరిగ్గా మ్యాచ్ అయ్యే పెద్ద పెద్ద జూకాలు, హ్యాంగింగ్స్ పెట్టుకుంటే చాలు. అంతే కాని రాంగ్ జువెల్లరీ వేసుకోకూడదు. బ్లౌజ్కు తగినవిధంగా...!: హైనెక్ బ్లౌజ్ వేసుకుంటే మెడను పట్టి ఉంచే నెక్లెస్ అసలు పెట్టుకోకూడదు. హారం మాత్రమే వేసుకోవాలి. డీప్ నెక్ బ్లౌజ్ ధరిస్తే నెక్లెస్ బాగుంటుంది. ఒక్క నగే సరైన ఎంపిక: ఎప్పుడైనా రెండు మూడు నగలు వేసుకుంటే అవి ఎంత అందంగా ఉన్నా ఆకర్షణీయంగా కనిపించరు. పెళ్లిళ్లకు రెండు మూడు హారాలు వేసుకోవచ్చు. అయితే అవి కూడా మ్యాచింగ్ ఆభరణాలై ఉండాలి. ఒక హారాన్ని పోలిన డిజైన్, స్టోన్స్ వంటివి రెండు, మూడవ హారాలలోనూ కనిపించాలి. అప్పుడే బాగుంటాయి. పెళ్ళిళ్లకు తయారయ్యేవారు కొంతమంది అతిగా నగలు పెట్టుకుంటారు. చెవులకు, చేతులకు. నడుముకు, మెడలోనూ, శిరోజాలకు.. ఇలా అన్ని భాగాలనూ ఆభరణాలతో అలంకరిస్తే బాగానే ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక పార్ట్ని మాత్రమే ఎక్కువగా నగలతో అలంకరిస్తే కళ తప్పుతుంది. ఎక్కువ ఆభరణాలను అలంకరించుకోలేని వారు ఒక్క నగతో సరిపెట్టుకుంటే మంచిది. మిగతా ఏ సందర్భంలోనైనా ఒక్క నగే బాగుంటుంది. ఉన్నాయి కదా అని రెండు, మూడు హారాలు వేసుకోవడం వల్ల కట్టుకున్న చీర, మేకప్, శిరోజాల అలంకరణ మీద కన్నా ఎదుటివారి దృష్టి ముందుగా నగలమీదకు వెళుతుంది. దీంతో అందంగా కనిపించరు. మ్యాచింగ్ క్యాచింగ్...: ఎంపిక చేసుకున్న చీర, కేశాలంకరణ, శారీరక సౌష్టవం, ఆభరణం,... మొత్తం అందంగా కనిపించాలంటే కట్టుకున్న చీరకు ఆభరణం మ్యాచ్ అయి ఉండాలి. కొంతమంది మంగళసూత్రాలు, నల్లపూసలు, నెక్లెస్ అన్నీ ఓపిగ్గా ధరిస్తారు కానీ. సరైన పాదరక్షలు తొడుక్కోరు. అంతెందుకు... రోజూ వేసుకునే కేశాలంకరణే వేడుకలోనూ ఉంటుంది. ఒక్క నగలు మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందుకే ఎదుటివారి దృష్టి నగలమీదకే వెళుతుంది. మనకు ఉన్న నగలు మాత్రమే అందంగా కనిపించాలంటే ఆభరణాలు ఎన్ని రకాలైనా ధరించవచ్చు. మనం అందంగా కనిపించాలంటే ఆభరణాల ఎంపిక, ధరించడంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. 1- షిఫాన్, జార్జెట్.. చీరలు ధరించినప్పుడు సంప్రదాయ ఆభరణాలు నప్పవు. ఫంకీ, స్టైలిష్ ముత్యాల ఆభరణాలు ధరిస్తే బాగా కనిపిస్తారు. 2- రెండు, మూడు హారాలు ధరించడం,చీరకు సూటవని ఆభరణాల వల్ల అందం దెబ్బతింటుంది. 3- అంచు ఉన్న షిఫాన్ చీరలు కట్టినప్పుడు ఒక నగను మాత్రమే, ధరించాలి. కేశాలంకరణ పైన దృష్టిపెట్టాలి. 4- ఒకేసారి పూసలు, నల్లపూసలు, ఫంకీ జువెల్రీ ధరించడం అంటే అలంకరణను మనమే పాడుచేసుకున్నట్టు. చీర రంగులోని ఏదో ఒక రంగును ప్రతిబింబించే నగను ఒకటే ధరిస్తే లుక్ అధునాతనంగా కనిపిస్తోంది. 5- వంగపండు రంగు జార్జెట్ చీరకు గోల్డ్ బార్డర్ ఉంది. ఆభరణాలను కూడా అదేవిధంగా జత చేయాలి. గోల్డ్ కలర్లో ఉన్న స్టైలిష్ ఆభరణాన్ని ధరిస్తే మోడ్రన్ లుక్లో కనిపిస్తారు. ఇలాగే ప్రతి చీరకు ఎంపికలో ప్రత్యేకత ఉండాలి. మోడల్స్: కావ్య, ప్రియాంజలి ఫొటోలు: శివ మల్లాల కర్టెసీ: మంగారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ www.mangareddy@gmail.com -
లాకర్ తీసుకుందామా...
రమేష్ చాలా జాగ్రత్తపరుడు. ఆర్థిక విషయాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తాడు. ఇలా ఉండగా.. ఒకసారి దగ్గరి బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో రమేష్ కుటుంబం మొత్తం వెళ్లాల్సి వచ్చింది. ఇంటికీ, బీరువాలకు తాళాలు గట్రా అన్ని పకడ్బందీగానే వేసుకుని వెళ్ళారు. ఫంక్షన్ చూసుకుని ఇంటికి తిరిగొచ్చేసరికి తలుపులు బార్లా తెరిచి ఉండటంతో గాభరాపడుతూ లోపలికెళ్లారంతా. తీరా చూస్తే బీరువాలో దాచుకున్న బంగారు నగలు, కొంత డబ్బు అంతా కూడా దొంగలు దోచుకెళ్లారని అర్థమవడంతో గొల్లుమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. చోరీ అయినవి చేతికి ఎప్పుడొస్తాయో తెలియదు. ఇలాంటి ఉదంతాలు.. నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఇలా దోపిడీ దొంగల భయం పెరిగిపోతున్న నేపథ్యంలో కాస్త మెరుగైన భద్రతను అందించే బ్యాంకు లాకర్లకు డిమాండ్ పెరుగుతోంది. కొండొకచో బ్యాంకులకు కూడా దొంగతనాల బెడద ఎదుర్కొంటున్నప్పటికీ.. విలువైన వాటిని భద్రంగా దాచుకునేందుకు ఇంటితో పోలిస్తే బ్యాంకు లాకర్లే కొంత సురక్షితమైనవిగా ఉంటున్నాయి. అందుకే వీటిని ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వీటి ప్రాధాన్యత గుర్తించే ఆంధ్రా బ్యాంకు లాంటివి ప్రత్యేకంగా లాకర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. బ్యాంకు ఖాతాల్లో డబ్బు దాచుకున్నట్లే.. విలువైన ఆభరణాలు, వస్తువులు, కీలకమైన పత్రాలు మొదలైన వాటిని దాచుకునేందుకు బ్యాంకులు లాకర్లను అద్దెకి ఇస్తుంటాయి. వీటిని వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా లేదా సంస్థల పేరు మీద కూడా తీసుకోవచ్చు. డిమాండ్ గణనీయంగా పెరిగిపోవడంతో ప్రస్తుతం బ్యాంకు లాకర్లు పొందడమన్నది కష్టసాధ్యంగా మారింది. చాలా బ్యాంకుల్లో వెయిటింగ్ లిస్టు ఉంటోంది. ఇందులోనూ మళ్లీ ప్రొఫైల్ని బట్టి కీలకమైన ఖాతాదారులకే బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి. లాకరు ఎక్కడ కావాలనుకుంటున్నారో ఆ బ్యాంకు శాఖలో ఖాతా కలిగి ఉండాల్సి వస్తుంది. అలాగే నిర్దిష్ట మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కూడా బ్యాంకులు అడుగుతున్నాయి. లాకరు తీసుకునేటప్పుడు జాయింట్గా గానీ లేదా నామినేషన్ పద్ధతిలో గానీ తీసుకోవడం మంచిది. ఒకవేళ ఏదైనా అనుకోనిది జరిగినా.. లాకర్లలో ఉన్నవి వారసులకు చేరడంలో సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. సాధారణంగా ప్రతి లాకరుకు తాళం చెవులు రెండు ఉంటాయి. ఒకటి బ్యాంకు దగ్గర, రెండోది లాకరు అద్దెకు తీసుకున్న వారి దగ్గర ఉంటుంది. ఈ రెండింటినీ ఉపయోగిస్తేనే లాకరు తెరుచుకుంటుంది. తాళం చెవిని పోగొట్టుకున్నారంటే .. మొత్తం తాళాన్నే మార్చాల్సి వస్తుంది. అందుకయ్యే ఖర్చునంతా కూడా భరించాల్సి వస్తుంది. కొన్ని బ్యాంకులు ఏడాదికి 12 సార్ల దాకా లాకరును తెరిచి చూసుకునేందుకు ఉచితంగా అనుమతిస్తున్నాయి. ఎస్బీఐలో అయితే.. 12 సార్లకు మించితే వెళ్లిన ప్రతిసారీ రూ. 51 కట్టాల్సి ఉంటుంది. ఒక్కసారైనా.. లాకర్ తీసుకున్న తర్వాత కనీసం ఏడాదికోసారైనా బ్యాంకుకు వెళ్లి, లాకరును తెరిచి చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడాది గడిచినా అలా చేయకపోతే ఆ లాకర్ను రద్దు చేసే అధికారం బ్యాంకులకు ఉంది. అయితే, నేరుగా రద్దు చేసే అధికారం లేదు. ముందుగా ఒక సంవత్సరం నుంచి మీ లాకర్లో లావాదేవీలు జరగటం లేదు కాబట్టి రద్దు చేయాలనుకుంటున్నామంటూ ఖాతాదారుకు సమాచారం అందించాలి. ఒకవేళ ఖాతాదారు మరణిస్తే వారసులకు తెలపాలి. వీరెవ్వరూ అందుబాటులో లేకపోతే ఆ అకౌంట్ను పరిచయం చేసిన వ్యక్తి ద్వారా సమాచారం అందించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ విఫలమైతే వాడకంలో లేని అకౌంట్గా పరిగణించి ప్రత్యేక లెడ్జర్ను తయారు చేయడం ద్వారా ఆ లాకర్ను రద్దు చేసి వేరే వారికి ఇవ్వొచ్చు. ఇలా చేయకుండా సకాలంలో అద్దె చెల్లించలేదనో, లేక మొక్కుబడిగా సమాచారం అందించో, లాకర్ను రద్దు చేసిన అనేక సందర్భాల్లో వినియోగదారుల ఫోరంలో ఖాతాదారులదే పై చేయి అయ్యింది. వివిధ పరిమాణాలు.. చిన్నవి, మధ్యస్థాయి, పెద్దవి, అతి పెద్దవంటూ లాకర్లు రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. సాధారణంగా 864 ఘనపు అంగుళాల నుంచి 3,456 ఘనపు అంగుళాల దాకా వివిధ సైజుల్లో ఇవి లభిస్తాయి. లాకర్ల పరిమాణం, బ్యాంకు శాఖలు ఉన్న ప్రాంతాలను బట్టి అద్దెలు మారుతుంటాయి. పెద్ద నగరాల్లో ఎక్కువగాను.. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కిరాయిలు కాస్త తక్కువగాను ఉంటాయి. అద్దెలు..వ్యయాలు.. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) చిన్న సైజు లాకరుకు గ్రామీణ ప్రాంతాల్లో అద్దె ఏడాదికి రూ. 764 కాగా పట్టణ ప్రాంతాల్లో రూ. 1,019గా ఉంది. లాకరు సైజు, ప్రాంతాన్ని బట్టి కిరాయి గరిష్టంగా రూ. 5,093 దాకా ఉంది. అదే ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంకు విషయానికొస్తే.. వార్షికంగా రెంట్ రూ. 1,250 నుంచి రూ. 10,000 దాకా (లాకర్ సైజు, ప్రాంతాన్ని బట్టి) ఉంది. సిటీ బ్యాంకు లాంటి వాటిల్లో గరిష్టంగా రూ. 40,000 దాకా కూడా అద్దె ఉంది. ఇవే కాకుండా.. తాళం చెవి గానీ పోగొట్టుకుంటే .. కొత్త తాళం చెవిని ఇచ్చేందుకు కూడా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తాయి బ్యాంకులు. కొన్నింటిలో ఇది రూ. 500పైచిలుకు ఉంది. ఇక అద్దె గానీ బకాయి పడితే.. వార్షిక కిరాయిలో పది శాతం నుంచి 50 శాతం దాకా చార్జీలు విధిస్తోంది (బకాయి పడిన కాలానికి) ఎస్బీఐ. మరోవైపు, లక్షల రూపాయల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తేనో లేదా బీమా పథకాల్లాంటివి కొంటేనో మాత్రమే లాకర్లు ఇస్తామంటూ షరతులు పెడుతుంటాయి బ్యాంకులు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఖాతాదారు లాకరుని ఉపయోగించకుండా, అద్దె కట్టకుండా వదిలేస్తే.. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో నుంచి బకాయిలను జమ చేసుకోవడం దీని వెనుక ముఖ్యోద్దేశం. అయితే, లక్షల రూపాయల్లో ఎఫ్డీలో లేదా బీమా పథకాలో తీసుకోవాలన్నది కచ్చితం కాదంటోంది రిజర్వ్ బ్యాంక్. ఆర్బీఐ నిబంధనల ప్రకారం కొత్తగా లాకర్ తీసుకునేవారి నుంచి మూడేళ్ల అద్దె, బ్రేకింగ్ చార్జీలు మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్ కింద ముందస్తుగా తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఏడాదికి రూ. 1,200 అద్దె అనుకుంటే.. బ్రేకింగ్ చార్జీలు రూ. 100 అనుకుంటే.. మూడేళ్లకు సంబంధించి బ్యాంకులు రూ. 3,700 దాకా బ్యాంకులు సెక్యూరిటీ డిపాజిట్గా తీసుకోవచ్చు. భద్రత .. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు సాధారణంగానే పటిష్టమైన లాకర్లు, అలారం సిస్టమ్, సీసీటీవీలు, గార్డులు వంటి గట్టి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తాయి. అయితే, కొన్ని సార్లు ఇంతటి భద్రత వ్యవస్థ కూడా విఫలమయ్యే అవకాశం ఉంది. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనాల బారిన కూడా పడొచ్చు. ఇలాంటి సందర్భాల్లో పరిహారాల్లాంటివి చెల్లించడం తమ బాధ్యత కాదంటున్నాయి బ్యాంకులు. మనం లాకర్లలో ఏం దాచుకున్నదీ, వాటి విలువ ఎంత ఉంటుందనేది కూడా తమకు తెలియదు కాబట్టి వాటిలోవి పోతే అందుకు తమది పూచీ ఉండదన్నది వాటి వాదన. ఇలాంటప్పుడు బ్యాంకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని నిరూపిస్తే తప్ప పరిహారాల కోసం పోరాడటం కుదరదు. అయితే, ఇలాంటి కొన్ని కేసుల్లో ఖాతాదారులు విజయం సాధించిన సందర్భాలు, నష్టపరిహారం దక్కించుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే, ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి కనుక.. ఆ మేరకు లాకర్లను సురక్షితమైనవిగానే పరిగణించవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లాకరు తీసుకునేటప్పుడు షరతులు, నిబంధనలన్నింటినీ క్షుణ్నంగా తెలుసుకోవాలి. లాకరులో ఏమేమి ఉంచుతున్నారో రాసి పెట్టుకోవాలి. వీలైతే ఫొటో కాపీలు తీసి ఉంచుకుంటే మరీ మంచిది. ఒకవేళ అనూహ్యమైన ఘటన ఏదైనా జరిగినా.. డిమాండ్ చేయాల్సిన పరిహారం గురించి ఒక అవగాహన ఉంటుంది. లాకరు తెరిచి, మూసిన ప్రతిసారి తాళం సరిగ్గా పడిందో లేదో ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవాలి. -
చెవికింపులు
సంపెంగ వంటి ముక్కుకేనా మేకప్పు..? సంగతులెన్నో వినే చెవుల మాటేమిటి?! అనుకున్నారేమో డిజైనర్లు చారడేసి ఆభరణాలను చెవుల అందాన్ని పెంచడానికి సృష్టిస్తున్నారు. అతివలు మాత్రం ఊరకుంటారా.. వాటిని అలంకరించి మురిసిపోతుంటారు. అయితే వాటి బరువుకు ఇబ్బంది పడుతుంటారు. ఆభరణాలంటే ఎంత మోజు ఉన్నా చెవిని కుట్టించుకోవాలంటే జంకుతుంటారు. ఇక నుంచి అలాంటి ఇబ్బందేమీ లేకుండా... అంటే, చెవిని కుట్టకుండానే తొడుక్కునే అందమైన ఆభరణాలను మీరూ ధరించవచ్చు. ఈ ఫొటోలలో కనిపిస్తున్న ఆభరణాలు అవే! హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా పరిచయమైన ఈ ఇయర్ కఫ్స్ ఇప్పుడు సరికొత్త ట్రెండ్. బంగారపువి మాత్రమే కాదు సిల్వర్ కఫ్స్ అందుబాటులోకి రావడంతో ఆధునిక దుస్తులు ధరించినప్పుడూ వీటిని అలంకరించుకోవచ్చు. చెంపకు చారడేసి కళ్లు ఎంత అందమో! చెవులకు చాటలంత ఆభరణాలూ అంతే అందం అని వాదించేవారికి చక్కని అవకాశం ఈ ఆధునిక కర్ణాభరణాలు. మీ దగ్గరలోని మార్కెట్లో ఇవి లభించకపోతే ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు -
సెక్యూరిటీ ఇవ్వండి ఆభరణాలు కాదు...
ఇప్పటికీ మన దేశంలో... ఆడపిల్ల అనగానే దిగులు పడిపోయే తల్లిదండ్రులకు తక్కువేమీ లేదు. కొందరు గర్భంలోనే తుంచేద్దామని ఆలోచిస్తే, కొందరు పుట్టిన తరువాత ఎలా వదిలించుకుందామా అని చూస్తుంటారు. ఇంకా పాపకి ఊహ కూడా రాకముందే... ఆమెకి పెళ్లి ఎలా చేయాలి, ఎంత కట్నం ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని ఎక్కడి నుంచి తేవాలి అని టెన్షన్ పడిపోతుంటారు. ఆడపిల్లని చూడగానే పెళ్లి అన్నమాటే ఎందుకు గుర్తొస్తుందో ఇప్పటికీ అర్థం కాదు. సమాజం ఇంతకుముందులా లేదు. ప్రపంచం వాయువేగంతో పరిగెడుతోంది. ఆ వేగాన్ని అందుకోవాల్సిన అవసరం పురుషులకే కాదు, మహిళలకూ ఉంది. జీవన ప్రమాణం పెరిగేకొద్దీ బాధ్యతలను స్త్రీ, పురుషులిద్దరూ పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళలు బయటకు వస్తున్నారు. అన్ని రంగాల్లో పాదం మోపుతున్నారు. అందలాలు ఎక్కుతున్నారు. కానీ ఇప్పటికీ మహిళలు అని గుచ్చి గుచ్చి అనడం మానలేదు కొందరు. దానికి కారణం ఉంది. శక్తి అవతలివాళ్లకు ఎలా తెలుస్తుంది? బహిర్గతపరిచినప్పుడే కదా? అందుకే ముందు మహిళల్లో చైతన్యం రావాలి. మేము ఈ పని చేయలేము, ఈ ఉద్యోగానికి సూటవము అన్న దృక్పథాన్ని వీడాలి. ఏదైనా సాధించగలిగే సత్తా ఉందని నిరూపించాలి. అయితే మహిళలు ఇలా కావడానికి తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహం కూడా అవసరం. నేను మంచి టెన్నిస్ ప్లేయర్ని. మ్యాచ్ ఆడి ఇంటికొచ్చేసరికి నా ఒళ్లు, జుట్టు చెమటతో తడిసిపోయేవి. పెద్ద జుట్టు కావడంతో దాన్ని ఆరబెట్టుకోవడం పెద్ద సమస్యగా ఉండేది. అప్పుడు మా పేరెంట్స్ నన్ను జుట్టు కట్ చేసేసుకోమన్నారు. అప్పట్లో ఆడపిల్లలకు జుట్టు కట్ చేసేవాళ్లు మా ఊళ్లో లేకపోవడంతో, మగాళ్లకు చేసే బార్బర్తోనే బాయ్ కట్ చేయించేశారు. ఇది చిన్న విషయమే. కానీ వాళ్ల దృక్పథం చాలా గొప్పది. నేను చేసేదానికి ఆ చిన్న అడ్డు కూడా రాకూడదన్నది వాళ్ల ఉద్దేశం. అందరు తల్లిదండ్రులూ పిల్లల లక్ష్యాల గురించి అంతగా ఆలోచించాలి అని చెప్పేందుకే దీన్ని ఉదహరించాను. మరో విషయం ఏమిటంటే... ఎంత ఎదిగినా స్త్రీలకు సెక్యూరిటీ సమస్య ఉంటుంది. అందుకు కూడా నా తల్లిదండ్రులు ఓ మార్గం ఆలోచించారు. వాళ్లు ప్రతిసారీ నాతో రాలేరు కాబట్టి, నాలోనే చిన్న చిన్న మార్పులు చేశారు. నాకెప్పుడూ వదులుగా ఉండే చొక్కాలు, ప్యాంట్లు వేసి అబ్బాయిలా తయారు చేసి పంపేవారు. దొంగలుంటారని ఆభరణాలు కూడా పెట్టేవారు కాదు. నేను అదే చెబుతున్నాను అందరికీ. పిల్లలకు సెక్యూరిటీ ఇవ్వండి, ఆభరణాలు కాదు. కాస్త ఆలోచిస్తే ఆడపిల్లలను పెంచడం, వృద్ధిలోకి తేవడం, సెక్యూరిటీ ఇవ్వడం... ఏదీ అంత సమస్య కాదు అని చెప్పేందుకే నేనివన్నీ చెప్పాను. ఎందుకంటే, ఈ కారణాలతోనే చాలామంది ఆడపిల్లలు వెనకబడిపోతున్నారు. ఆ అవసరం లేదు. మీలోని శక్తిని వెలికి తీయాల్సిందే. అందుకు తగిన దారుల్ని వెతికి పట్టుకోవాల్సిందే. దేనికైనా సిద్ధపడి అడుగు ముందుకు వేయాల్సిందే. ఆ తెగువ, ఆత్మవిశ్వాసం, పట్టుదల మీలో ఉండాలే కానీ... మిమ్మల్నెవరు ఆపగలరు చెప్పండి! - కిరణ్బేడీ, తొలి మహిళా ఐపీఎస్