Justice nv ramana
-
కొలీజియంపై ఫిర్యాదులను విస్మరించలేం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ పనితీరుపై ప్రభుత్వం సహా పలు వర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని విస్మరించలేమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. కొలీజియం విషయంలో పౌర సమాజం, న్యాయవాద సంఘాల ఆందోళనలను కొట్టిపారేయలేమని అన్నారు. న్యాయ వ్యవస్థలో వైవిధ్యం కోసం ఒక సంస్థాగత యంత్రాంగం లేకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. ఆసియన్ ఆస్ట్రేలియన్ లాయర్స్ అసోసియేషన్ నిర్వహించిన ‘కల్చరల్ డైవర్సిటీ, లీగల్ ప్రొఫెషన్’ అంశంపై సదస్సులో జస్టిస్ రమణ ప్రసంగించారు. కోర్టు ధర్మాసనాల్లో వైవిధ్యం ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు. విభిన్న అనుభవాలు కలిగిన న్యాయమూర్తులు ధర్మాసనంలో సభ్యులుగా ఉండాలని చెప్పారు. న్యాయ వ్యవస్థలో తాము కూడా భాగస్వాములమేనన్న నమ్మకం ప్రజలకు కలిగేలా జడ్జీలు వ్యవహరించాలన్నారు. భిన్నమైన నేపథ్యాలు కలిగినవారిని నియమించేందుకు తాను ప్రయత్నించానని చెప్పారు. దాదాపు తాను చేసిన అన్ని సిఫార్సులను కేంద్రం ఆమోదించిందని పేర్కొన్నారు. -
యు.యు.లలిత్ అనే నేను..
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. రిజిస్టర్లో సంతకం చేసిన అనంతరం జస్టిస్ లలిత్కు రాష్ట్రపతి ముర్ము అభినందనలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రమాణం చేసిన తర్వాత జస్టిస్ లలిత్ తన తండ్రి, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉమేశ్ రంగనాథ్ లలిత్(90)తోపాటు కుటుంబ పెద్దల పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం పొందారు. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన రెండో వ్యక్తి జస్టిస్ లలిత్. 1964లో జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ బార్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ లలిత్ పదవీ విరమణ అనంతరం నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యే అవకాశముంది. 100 రోజుల్లోపే పదవిలో ఉండే ఆరో సీజేఐ దేశంలో ఇప్పటిదాకా 100 రోజుల్లోపే పదవిలో ఉన్న ఆరో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్ రికార్డుకెక్కనున్నారు. ఆయన ఈ ఏడాది నవంబర్ 8న పదవీ విరమణ చేస్తారు. అంటే కేవలం 74 రోజులపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తారు. ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్ 18 రోజులు, జస్టిస్ రాజేంద్రబాబు 30 రోజులు, జస్టిస్ జె.సి.షా 36 రోజులు, జస్టిస్ జి.బి.పట్నాయక్ 41 రోజులు, జస్టిస్ ఎల్.ఎం.శర్మ 86 రోజులపాటు పదవిలో కొనసాగారు. -
న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి అందరూ కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. సమ వాటాదారులైన కేంద్ర ప్రభుత్వం, బార్, బెంచ్లు ఈ మేరకు చొరవ తీసుకోవాలని సూచించారు. జీవితంలో ఎన్నో పోరాటాల తర్వాతే ఈ స్థాయికి చేరుకున్నానని, ఆ క్రమంలో అనేక కుట్రపూరిత పరిశీలనలకు గురయ్యాయని చెప్పారు. తన పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. బాల్యం నుంచి సీజేఐ వరకూ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. తల్లిదండ్రులను, విద్యనేర్పిన గురువులను స్మరించుకున్నారు. తన అనుభవాల్లో తీపి కంటే చేదు ఎక్కువగా ఉందన్నారు. అనేక ఆందోళనలు, పోరాటాల్లో భాగస్వామి అయిన తాను ఎమర్జెన్సీ సమయంలో బాధలు పడ్డానని తెలిపారు. ఆయా అనుభవాలే ప్రజలకు సేవ చేయాలన్న అభిరుచిని తనలో పెంపొందించాయని వ్యాఖ్యానించారు. మొదటి తరం న్యాయవాదిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని, విజయాలకు షార్ట్కట్ ఉండదని తెలుసుకున్నానని వెల్లడించారు. ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థ ఉద్దేశం అదే.. గొప్ప న్యాయమూర్తినని తాను ఎప్పుడూ చెప్పుకోలేదని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సామాన్యులకు న్యాయం చేయడమే న్యాయ వ్యవస్థ అంతిమ ఉద్దేశమని నమ్ముతానన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి బార్ కృషి చేయాలని కోరారు. న్యాయ వ్యవస్థపై సాధారణ ప్రజల్లో అవగాహన, విశ్వాసం పెంపొందించాలని అన్నారు. న్యాయవ్యవస్థను భారతీయీకరణ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 16 నెలల తన పదవీ కాలంలో 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 15 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, 224 మంది హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరిగిందని గుర్తుచేశారు. న్యాయ వ్యవస్థ సమస్యలు ఎదుర్కొంటున్న విషయం వాస్తమేనని వివరించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను భీష్మ పితామహుడిగా జస్టిస్ ఎన్వీ రమణ అభివర్ణించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఛైర్మన్ వికాస్ సింగ్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీజేఐ (నియమిత ) జస్టిస్ యు.యు.లలిత్ మాట్లాడారు. హైకోర్టుల్లో నియామకాలు, మౌలిక సదుపాయాల కోసం జస్టిస్ ఎన్వీ రమణ సాగించిన కృషిని అభినందించారు. నూతన సీజేఐగా తన పదవీ కాలంలో కేసుల జాబితా, అత్యవసర విషయాల ప్రస్తావన, రాజ్యాంగ ధర్మాసనాలపై దృష్టి సారిస్తానన్నారు. పెండింగ్ కేసులే అతిపెద్ద సవాల్ విచారించాల్సిన కేసుల జాబితా సమస్యలను పరిష్కరించడంపై తగిన శ్రద్ధ చూపలేకపోయినందుకు జస్టిస్ ఎన్వీ రమణ క్షమాపణలు కోరారు. దేశంలోని కోర్టులు పెండింగ్ కేసుల రూపంలో అతిపెద్ద సవాలును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. న్యాయ వ్యవస్థను ఒక ఉత్తర్వు, ఒక తీర్పుతో నిర్వచించలేమని, అదేవిధంగా ఒక తీర్పుతో మార్చలేమని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి కోర్టుల పనితీరును సంస్కరించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. శాశ్వత పరిష్కారాలకు ఆధునిక సాంకేతికతను, కృత్రిమ మే«ధను వాడుకోవాలన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ వీడ్కోలు సందర్భంగా సీనియర్ లాయర్ దుష్యంత్ దవే భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణను ప్రజాన్యాయమూర్తి అంటూ కొనియాడారు.. జస్టిస్ రమణ సేవలను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రశంసించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలతో సాయంతో పూర్తిస్థాయిలో పనిచేశారని జస్టిస్ రమణను అభినందించారు. కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం సుప్రీంకోర్టు శుక్రవారం చరిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టిన విచారణలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. సుప్రీంకోర్టును ప్రజలకు చేరువ చేసే దిశగా జస్టిస్ ఎన్వీ రమణ తీసుకున్న చొరవను పలువురు అభినందించారు. అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు జరగాలని సీజేఐ ఆకాంక్షించారు. సుప్రీంకోర్టులో విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే మొదటిసారి. నేడు జస్టిస్ యు.యు.లలిత్ ప్రమాణం సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్లో జస్టిస్ లలిత్తో ప్రమాణం చేయించనున్నారు. వీడ్కోలు సమావేశంలో అభివాదం చేస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు. లలిత్ -
విజయానికి షార్ట్ కట్లు ఉండవు: జస్టిస్ ఎన్వీ రమణ
-
గొప్ప జడ్జిని కాకపోవచ్చు.. సామాన్యుడికీ న్యాయం అందించా: జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: జీవితంలో తనకు విద్య నేర్పిన గురవులకు, స్ఫూర్తినిచ్చిన వారికి రుణపడి ఉంటానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సీజేఐ ఎన్వీరమణకు శుక్రవారం సుప్రీం కోర్టులో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ ప్రసంగిస్తూ.. తన జీవితంలో ఎదురైన అనేక విషయాలను గుర్తు చేసుకున్నారు. 12 ఏళ్ల వయసులో తొలిసారి కరెంటు చూసినట్లు పేర్కొన్నారు. 17 ఏళ్లకు ట్రేడ్ యూనియన్కు నేతృత్వం వహించానని తెలిపారు. ఈ వృత్తిలో అనేక ఒడిదొడుకులు వస్తాయని న్యాయవాదులు గ్రహించాలని సూచించారు కనీస వసతులు లేని గ్రామం నుంచి తన ప్రస్థానం మొదలైందని, వృత్తి పరంగా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు.. తాను గొప్ప జడ్జీని కాకపోవచ్చు కానీ, సామాన్యూడికి న్యాయం అందించడానికి కృషి చేశానని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. చదవండి: (బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఆజాద్) ఇదిలా ఉండగా.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. 2021 ఏప్రిల్ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు. కాగా, రేపు 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ యూయూ లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక, యూయూ లలిత్ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. చదవండి: (జార్ఖండ్ సీఎంకు షాక్.. శాసనసభ సభ్యత్వం రద్దు) -
దేశ చర్రితలోనే ఫస్ట్.. సీజేఐ ఎన్వీ రమణ వీడ్కోలుకు స్పెషల్ గిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. నేడు(శుక్రవారం) పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక, దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ప్రత్యక్ష ప్రసారంలో విచారణలు జరిపింది. కాగా, విచారణలో భాగంగా ఉచిత పథకాలపై దాఖలైన పిటిషిన్లపై సీజేఐ ఎన్వీ రమణ తీర్పు వెల్లడించారు. ఉచిత హామీలపై పిటిషన్లను ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేస్తూ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. 2021 ఏప్రిల్ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు. కాగా, రేపు 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ యూయూ లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక, యూయూ లలిత్ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. -
‘ఉచితాల’తో ఆర్థిక వ్యవస్థకు చేటు..అఖిలపక్షాన్ని పిలవలేదేం?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో నెగ్గడానికి రాజకీయ పార్టీలు ప్రజలకు ‘ఉచిత’ హామీలు ఇస్తుండడం తీవ్రమైన అంశమేనని, దీనిపై కచ్చితంగా చర్చ జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. చర్చించడానికి అఖిలపక్ష సమావేశానికి ఎందుకు పిలుపునివ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థకు చేటు కలిగించే ఉచితాల వ్యవహారాన్ని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. ఉచితాలపై పార్టీలు ఏకాభిప్రాయానికి రాకపోతే ఇవి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్æ రవికుమార్ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున‡ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ఉచితాలపై అధ్యయనం చేయడానికి నియమించే కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లోధాను చైర్మన్గా నియమించాలని కోరారు. ‘‘పదవీ విరమణ చేసిన, చేయబోతున్న వ్యక్తికి ఈ దేశంలో విలువ లేదు’’ అంటూ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిస్పందించారు. కమిటీకి ఒక రాజ్యాంగ సంస్థ నేతృత్వం వహించాలని భావిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ఈ సమస్యను అధ్యయనం చేయడానికి కేంద్రమే కమిటీని ఎందుకు నియమించకూడదని సీజేఐ ప్రశ్నించారు. ఎఫ్ఆర్బీఎం చట్టంతో మేలు ఎన్నికలకు ఆరు నెలల ముందు ఉచితాలు ప్రకటించడమే ప్రధానమైన సమస్య అని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు. ఆయన ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్’ తరఫున వాదనలు వినిపించారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం, పబ్లిక్ పాలసీని అపహాస్యం చేస్తూ ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారులైన కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వడం, ఎన్నికలకు ముందు ఉచిత వాగ్దానాలు చేయడం.. ఈ మూడూ అక్రమమేనని చెప్పారు. పార్టీలు తమ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకు నిధుల మూలాలను సైతం వెల్లడించాలనే ప్రతిపాదనను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వ్యతిరేకించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన రికార్డులు ఎన్నికల ముందు రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండవని గుర్తుచేశారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్(ఎఫ్ఆర్బీఎం) చట్టాన్ని అమలు చేస్తే పరిష్కారం లభిస్తుందని, ఆర్థిక లోటు మూడు శాతానికి మించితే తదుపరి సంవత్సరం నుంచి కేటాయింపులు తగ్గించే అధికారం ఆర్థిక కమిషన్కు ఉందని తెలిపారు. పార్టీలు ప్రాథమిక హక్కుగా భావిస్తున్నాయి ఓటర్లను ప్రభావితం చేసేలా అధికారంలో లేని పార్టీలు హామీలు ఇస్తున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యానించారు. ‘‘అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు ఉండవని ఒకరు ప్రజల్ని మభ్యపెట్టొచ్చు. కానీ, అధికారంలోకి వస్తే చంద్రుడిని తీసుకొస్తానని హామీ ఇవ్వగలమా?’’ అని ప్రశ్నించారు. దీనికి సీజేఐ స్పందిస్తూ.. ఉచితాల అంశంపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకని అఖిలపక్ష సమావేశానికి పిలుపునివ్వలేదని అన్నారు. ఉచితాలపై నియంత్రణను వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంతో ఫలితం ఉండదని మెహతా బదులిచ్చారు. ఉచితాలు అందించడం తమ ప్రాథమిక హక్కుగా కొన్ని పార్టీలు భావిస్తున్నాయని, కేవలం ఉచితాల హామీలతో అధికారంలోకి వచ్చిన పార్టీలూ ఉన్నాయని ఉద్ఘాటించారు. నేను పోటీ చేస్తే.. ‘‘కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారనేది పెద్ద సమస్య. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తాయి. వ్యక్తులు కాదు. ఒకవేళ నేను పోటీ చేస్తే 10 ఓట్లు కూడా రావు. ఎందుకంటే వ్యక్తులకు అంత ప్రాధాన్యం ఉండదు. ఇదే మన ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారు తర్వాత అధికారంలోకి రావచ్చు’ అని జస్టిస్ రమణ అన్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... తుషార్ మెహతా వ్యాఖ్యలను వ్యతిరేకించారు. కేవలం ఉచితాల ద్వారా ఓటర్లను ఆకర్శిస్తారనడం సరైంది కాదన్నారు. బంగారు చైన్లు ఇస్తామంటూ హామీలు ఇవ్వడాన్ని సంక్షేమంగా ఎలా పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్ ప్రశ్నించారు. ఉచితాల వల్ల తలెత్తే ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయడానికి తగిన సమాచారం అందుబాటులో ఉందని వివరించారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ఉచిత హామీల విషయంలో దాఖలైన వ్యాజ్యాలపై ఇకపై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తుందని తెలిపారు. సుబ్రహ్మణ్యం వర్సెస్ తమిళనాడు కేసును పునఃపరిశీలించడానికి ధర్మాసనం ఏర్పాటు చేయొచ్చని పేర్కొన్నారు. -
రాజకీయ పార్టీలన్నీ ఉచితాలవైపే
న్యూఢిల్లీ: బీజేపీతో సహా రాజకీయ పార్టీలన్నీ ఉచిత హామీల పక్షమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అందుకే ఏవి ఉచితాలో, ఏవి సంక్షేమ పథకాలో తేల్చేందుకు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల వేళ ఉచిత హామీలిచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సీటీ రవికుమార్ల ధర్మాసనం మంగళవారం విచారించింది. ‘ఉచితాలు అందరికీ కావాల్సిందే. పార్టీలు ఈ విషయంలో ఒక్కతాటిపై ఉన్నాయి. అందుకే దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే మేం జోక్యం చేసుకున్నాం’’ అని జస్టిస్ రమణ ఈ సందర్భంగా అన్నారు. ఉచితాలపై డీఎంకే చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘వాళ్ల తీరు నిజంగా దురదృష్టకరం. ఇంకా చాలా అనాలనుకున్నా నేను సీజేఐగా ఉన్న కారణంగా ఇక్కడితో సరిపెడుతున్నా. అయితే తెలివితేటలు కేవలం ఒక్క వ్యక్తికో, పార్టీకో పరిమితం కాదని గుర్తుంచుకోండి’’ అంటూ డీఎంకే తరఫు న్యాయవాది పి.విల్సన్ను ఉద్దేశించి ఆగ్రహం వెలిబుచ్చారు. ప్యానల్ కావాలి: సిబల్ ఉచితాల అంశాన్ని ఒక నిర్దిష్ట వ్యవస్థ ద్వారా పరిష్కరించాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ‘వీటి కట్టడికి కేంద్ర ఆర్థిక సంఘం పర్యవేక్షణలో చట్టబద్ధ అధికారాలతో ఓ ప్యానల్ను ఏర్పాటు చేయాలి. ఉచితాలు బడ్జెట్లో 3 శాతం మించకుండా చూడాలి. ఒకవేళ మించితే ఆ తర్వాత ఏడాదిలో సదరు రాష్ట్రానికి ఆర్థిక సంఘం ఆ మేరకు కేటాయింపులను తగ్గించాలి’’ అని సూచించారు. దీనిపై ఇంకా చర్చ జరిగి ఇలాంటి సూచనలు చాలా రావాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పేదలకు సైకిళ్లు ఇస్తున్నాయి. వాటివల్ల వారి జీవన విధానం మెరుగైందని పలు నివేదికలు చెబుతున్నాయి. మారుమూల గ్రామానికి చెందిన ఓ నిరుపేద జీవనోపాధికి సైకిళ్లు, చిన్న పడవలపై ఆధారపడవచ్చు. దీనిపై మనమిక్కడ కూర్చుని వాదించి నిర్ణయించలేం’’ అన్నారు. సంక్షేమ పథకాలను ఎవరూ వద్దనరని, టీవీల వంటివాటిని ఉచితంగా పంచడంపైనే అభ్యంతరమని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ఉచిత పథకాలను నిధులెలా సమీకరిస్తారన్నది ఎన్నికల మేనిఫెస్టోలోనే పార్టీలు స్పష్టంగా చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు అన్నారు. -
కేంద్రం–ఢిల్లీ రగడపై సుప్రీం ధర్మాసనం
న్యూఢిల్లీ: దేశ రాజధానికి సంబంధించిన పలు శాఖలపై శాసన, పాలనాపరమైన పెత్తనం విషయమై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ఇందుకోసం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సోమవారం లేవనెత్తారు. ఈ అంశంపై 2019 ఫిబ్రవరి 14న ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పు వెలువరించారు. విచారణకు స్వీకరిస్తాం మనీ లాండరింగ్ చట్టంపై తీర్పును పునఃపరిశీలించాలంటూ దాఖలైన పిల్ విచారణ స్వీకరణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దాన్ని విచారణ కేసుల జాబితాలో చేరుస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం తెలిపింది. -
పార్లమెంటులో లాయర్లు తగ్గుతున్నారు
న్యూఢిల్లీ: ‘‘పార్లమెంటులో గతంలో న్యాయ కోవిదులు ఎక్కువగా ఉండేవారు. రాజ్యాంగ పరిషత్తులోనూ, స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కొలువుదీరిన పలు పార్లమెంటుల్లోనూ చాలామంది వాళ్లే. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యంగాన్ని, తిరుగులేని చట్టాలను మనకందించారు. కానీ కొంతకాలంగా పార్లమెంటులో న్యాయ కోవిదుల సంఖ్య బాగా తగ్గుతోంది. ఆ స్థానాన్ని ఇతరులు భర్తీ చేస్తున్నారు. ఇంతకు మించి మాట్లాడబోను’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఉపరాష్ట్రపతిగా ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన జగ్దీప్ ధన్ఖడ్ గౌరవార్థం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదిగా అపార అనుభవం ధన్ఖడ్ సొంతమన్నారు. ‘‘గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన ఎలాంటి రాజకీయ గాడ్ఫాదర్లూ లేకుండానే దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో కొలువుదీరే స్థాయికి ఎదిగారు. ఇది మన ప్రజాస్వామ్య గొప్పదనానికి, ఉన్నత రాజ్యాంగ విలువలకు తార్కాణం’’ అన్నారు. ‘‘ప్రతి సభ్యుడినీ సంతృప్తి పరచడం తేలిక కాదు. కానీ ధన్ఖడ్ తన అపార అనుభవం సాయంతో రాజ్యసభ చైర్మన్గా రాణిస్తారని, అందరినీ కలుపుకునిపోతారని నాకు నమ్మకముంది. న్యాయవాదిగా అపార అనుభవం, గతంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖను నిర్వహించి ఉండటం ఆయనకెంతో ఉపయోగపడతాయి. అతి త్వరలో రిటైరవుతున్న నేను ధన్ఖడ్ పర్యవేక్షణలో రాజ్యసభలో జరిగే నాణ్యమైన చర్చలను టీవీలో చూస్తానని ఆశిస్తున్నా’’ అన్నారు. ధన్ఖడ్ను ఆయన సన్మానించారు. న్యాయ మంత్రి కిరెన్ రిజిజు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంబార్ అసోసియేసన్ అధ్యక్షుడు వికాస్సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతకాలంగా పార్లమెంటులో చర్చల కంటే అంతరాయాలే ఎక్కువయ్యాయని రిజిజు ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చర్చల నాణ్యత బాగా పడిపోయింది. ఇటీవలి దాకా లోక్సభతో పోలిస్తే రాజ్యసభ కాస్త ప్రశాంతంగా ఉండేది. ఈ మధ్య అక్కడా గలాభా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సభను అదుపు చేసేందుకు ధన్ఖడ్ అనుభవం పనికొస్తుంది’’ అని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన ఓ లాయర్ ఉపరాష్ట్రపతి కావడం ఇదే తొలిసారని తుషార్ మెహతా అన్నారు. ధన్ఖడ్కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ -
బయటి ప్రపంచాన్ని చూడండి
సాక్షి, అమరావతి: విద్యార్థులు కేవలం తరగతులకే పరిమితం కాకుండా, బయటి ప్రపంచాన్ని చూడాలని.. సామాజిక ఉద్యమాల్లో సైతం పాలుపంచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పిలుపునిచ్చారు. తామంతా కూడా సామాజిక ఉద్యమాల్లో పాల్గొనే ఈ స్థాయికి వచ్చామని, ఇప్పుడు అలాంటి ఉద్యమాల్లో పాల్గొనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. గతంలో విశ్వ విద్యాలయాల్లో సమావేశాలు నిర్వహించి, సమాజ సమస్యలపై చర్చలు జరిపే వారని, ఇప్పుడు అలాంటి సమావేశాలేవీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఎదురయ్యే అసలైన సవాళ్లను ఎదుర్కొనేలా విద్యా బోధన ఉండాలని ఆకాంక్షించారు. శనివారం ఆయన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 37, 38వ స్నాతకోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్, విశ్వవిద్యాలయం చాన్సలర్ విశ్వభూషణ్ హరిచందన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఉన్నత విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పి.రాజశేఖర్ తదితరుల సమక్షంలో జస్టిస్ ఎన్వీ రమణకు గవర్నర్ చేతుల మీద గౌరవ డాక్టరేట్ ప్రదానం జరిగింది. అనంతరం సీజేఐ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలు భిన్నత్వానికి చిరునామాలని, తాను చదివిన విశ్వవిద్యాలయం నుంచే ఇప్పుడు తాను గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఎంతో సంతోషంగా, గర్వకారణంగా ఉందని అన్నారు. ప్రస్తుతం విద్యా సంస్థలు తమ సామాజిక ప్రాముఖ్యతను కోల్పోతుండటం భయం కలిగిస్తోందని చెప్పారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న విద్యా సంస్థలు పాఠాలు నేర్పే ఫ్యాక్టరీలు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఎవరిని, ఎందుకు నిందించాలో అర్థం కావడం లేదని, విద్యార్థులు సామాజిక సంబంధాలపై దృష్టి సారించేలా చూడాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందని సూచించారు. దేశంలో వేళ్లూనుకుపోయిన అనేక సమస్యలకు విద్య ద్వారానే పరిష్కారం చూపగలమని తెలిపారు. విద్య ద్వారానే పేదరికాన్ని దూరం చేయవచ్చని స్పష్టం చేశారు. సీజేఐ ఇంకా ఏమన్నారంటే.. పాఠాలొక్కటే ప్రధానం కాదు ► విద్యాలయాలు కేవలం విద్యను బోధించడమే కాకుండా విద్యార్థుల ఆలోచనలకు, ఆశయాలకు పరిచయ వేదికలుగా ఉంటాయి. ఘన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయానికి గత నాలుగు దశాబ్దాల్లో వివిధ కోర్సులు అందించే 450 అనుబంధ కాలేజీలు ఏర్పడ్డాయి. ► మన దేశంలో వృత్తి విద్య విషయానికొస్తే.. ఎక్కువ జీతాలు, లాభదాయకమైన ఆదాయం వచ్చే ఉద్యోగావకాశాలు వచ్చే కోర్సులనే బోధిస్తున్నారు. హ్యుమానిటీస్, నేచురల్ సైన్సెస్, చరిత్ర, అర్థశాస్త్రం, భాషలు తదితర కోర్సులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రొఫెషనల్ యూనివర్సిటీల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా విద్యార్థులు తరగతి గదిలో పాఠాలపైనే దృష్టి సారిస్తున్నారు తప్ప, బయట ప్రపంచాన్ని చూడటం లేదు. ► అసలు విద్య ప్రాథమిక ఉద్దేశం ఏంటి? వ్యక్తి కోసమా? సమాజం కోసమా? వాస్తవానికి ఈ రెండూ ముఖ్యమైనవే. విద్య ద్వారా వ్యక్తులు దార్శనికులుగా, నాయకులుగా మారుతారు. ఇదే సమయంలో విద్య మనల్ని సమాజ అవసరాల పట్ల బాధ్యతాయుతంగా ఉండేలా చేస్తుంది. నా మూలాలు మర్చిపోలేదు.. ► నాలుగు దశాబ్దాల క్రితం ఈ విశ్వవిద్యాలయంలో చెట్ల కింద, క్యాంటీన్, డైనింగ్ హాల్లో మా ఆలోచనలు, సిద్ధాంతాలు, రాజకీయాలు, సమాజ సమస్యలపై చర్చించే వాళ్లం. ఆ చర్చలు, మా క్రియాశీలత ప్రపంచం పట్ల మా అభిప్రాయాలను మార్చాయి. ► అప్పట్లో ఈ యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉండేవి. వాటిపై వర్సిటీ ఉద్యోగ సంఘం పోరాడేది. వారి వల్లే నేను అప్పట్లో ఈ వర్సిటీలో చేరాను. ఓ వ్యక్తి గొంతుక, అభిప్రాయాల తాలుక విలువ అప్పుడు మాకు తెలిసింది. ఈ రోజుకీ నేను నా మూలాలను మర్చిపోలేదు. ► మన విద్యా వ్యవస్థ రూపాంతరీకరణ జరగాల్సిన సమయం ఆసన్నమైంది. సామాజిక సంబంధాలు, పౌర హక్కుల విలువలను నేర్పించేలా విద్యా వ్యవస్థ ఉండాలి. ఆర్థిక పురోగతి లక్ష్య సాధనలో మన సాంస్కృతిక, పర్యావరణ బాధ్యతలను విస్మరించకూడదు. మమ్మల్ని దాటి ఆలోచించండి. సామాజిక అవసరాల పట్ల స్పృహ కలిగి ఉండండి. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, విద్యా శాఖ అధికారులు, న్యాయవాదులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలలను సాకారం చేసుకోండి విద్యార్థులు తమ కలలు సాకారం చేసుకునేంత వరకు వాటిని వెంటాడాలి. ప్రయత్నించడాన్ని ఎన్నడూ ఆపొద్దు. విశ్వవిద్యాలయాలు ఇప్పుడు జ్ఞాన కేంద్రాలుగా భాసిలుతున్నాయి. మన జీవితంలో చూస్తున్న చాలా ఆవిష్కరణలు యూనివర్సిటీల్లోనే పుట్టాయి. పరిశోధన, బోధన సమాంతరంగా సాగినప్పుడే విశ్వవిద్యాలయాలు విజయం సాధించగలుగుతాయి. – విశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్ పోటీని తట్టుకునేలా విద్యా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చదువుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి, కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందు స్థానంలో ఉంది. ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలబడేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఇందుకోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆ దిశగా కార్యాచరణ మొదలు పెట్టాం. జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం ఈ రాష్ట్రానికి గర్వకారణం. కార్యదీక్షతో ఉన్నత శిఖరాలు అధిరోహించ వచ్చునని ఆయన నిరూపించారు. – బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి -
20న ఏఎన్యూ స్నాతకోత్సవాలు
ఏఎన్యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 37, 38వ స్నాతకోత్సవాలు కలిపి ఈనెల 20న నిర్వహించనున్నామని వీసీ ఆచార్య పి.రాజశేఖర్ తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని, ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నామని పేర్కొన్నారు. చాన్సలర్ హోదాలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొంటారని తెలిపారు. స్నాతకోత్సవంలో పలువురికి డిగ్రీలు, బంగారు పతకాలు అందజేయనున్నామని వివరించారు. స్నాతకోత్సవ ఏర్పాట్లపై మంగళవారం వీసీ పలు కమిటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కమిటీ సభ్యులకు సూచించారు. (క్లిక్: ‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం) -
మీ వారసున్ని సిఫార్సు చేయండి.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐని సిఫార్సు చేయాల్సిందిగా కేంద్రం ఆయన్ను కోరింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం జస్టిస్ రమణకు లేఖ రాసింది. ఆయన పదవీకాలం ఆగస్టు 26తో ముగియనుంది. పదవీ విరమణ చేసే సీజేఐ తన వారసునిగా సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి పేరును సూచించడం సంప్రదాయంగా వస్తోంది. సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్ రమణ తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఉన్నారు. అయితే ఆయన పదవీకాలం నవంబర్ 8 వరకే ఉంది. సీజేఐగా ఎంపికైతే రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు. -
ఉచితాలకు అడ్డుకట్ట వేద్దాం.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు చేసే ఉచిత వాగ్దానాలు తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘వీటిని వ్యతిరేకించడానికి, పార్లమెంటులో చర్చించడానికి ఏ పార్టీ కూడా ఇష్టపడదు. ఇవి కొనసాగాలనే కోరుకుంటుంది. కాబట్టి ఈ పోకడకు అడ్డుకట్ట వేయడానికి ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, ఆర్బీఐ వంటి సంస్థలు మేధోమథనం చేసి నిర్మాణాత్మక సూచనలివ్వాలి. విపక్షాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి’’ అని సూచించింది. ఉచిత పథకాలను ప్రకటించే పార్టీల గుర్తింపును, వాటి ఎన్నికల గుర్తును రద్దు చేసేందుకు ఎన్నికల సంఘానికి అధికారాలు కల్పించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మానసం బుధవారం విచారణ జరిపింది. ఈ విషయంలో ఏమీ చేయలేమని మాత్రం కేంద్రం, ఎన్నికల సంఘం చెప్పొద్దని, కూలంకషంగా పరిశీలించి సలహాలివ్వాలని స్పష్టం చేసింది. పిల్లో లేవనెత్తిన అంశాలకు కేంద్రం కూడా మద్దతిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ‘‘ప్రజాకర్షక పథకాలతో ఇష్టారీతిన ఉచితాల పంపకం మున్ముందు ఆర్థిక వినాశనానికి దారి తీస్తుంది. ఉచితాల ద్వారా తన కుడి జేబులోకి కొంత వస్తున్నా తర్వాత్తర్వాత ఎడమ జేబుకు ఎంత కోత పడుతుందో సగటు పౌరుడు ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. కనుక ఓటర్లు తమ ఓటు హక్కును తెలివిడితో ఉపయోగించుకునే వీల్లేకుండా పోతుంది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. ఈ అంశం ఈసీ పరిధిలోనిదని ఇప్పటిదాకా కేంద్రం చెబుతూ వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ అంశమై కేంద్రానికి సలహాలిచ్చేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలిస్తామని ధర్మాసనం సంకేతాలిచ్చింది. దీనిపై గురువారం కూడా విచారణ కొనసాగనుంది. -
రాజ్యాంగ అవగాహన తప్పనిసరి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
రాయ్పూర్: రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులు, బాధ్యతలు తదితరాలపై పౌరులందరికీ అవగాహన ఉన్నప్పుడే దేశం నిజమైన ప్రగతి సాధిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘‘తేలిక భాషలో వాటిపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ విషయంలో న్యాయ శాస్త్ర పట్టభద్రులు చురుకైన పాత్ర పోషించాలి. వారిని సోషల్ ఇంజనీర్లుగా రూపొందించే బాధ్యతను లా స్కూల్స్ తలకెత్తుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. ఆదివారం రాయ్పూర్లోని హిదాయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ (హెచ్ఎన్ఎల్యూ) ఐదో స్నాతకోత్సవంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు. ‘‘ఆధునిక భారత ఆకాంక్షలకు అక్షర రూపమైన మన రాజ్యాంగం ప్రతి పౌరునికీ చెందినది. కానీ వాస్తవంలో అది కేవలం లా స్టూడెంట్లు, లాయర్ల వంటి అతి కొద్దిమందికి మాత్రమే పరిమితమైన ఓ పుస్తకంగా మారిపోవడం బాధాకరం’’ అన్నారు. న్యాయ రంగంలో కెరీర్ ఎంతటి సవాళ్లతో కూడినదో అంతటి సంతృప్తినీ ఇస్తుందని సీజేఐ అన్నారు. ‘‘లాయరంటే కేవలం కోర్టులో వాదించే వ్యక్తి కాదు. అన్ని రంగాలపైనా ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ సాగాలి. మార్పుకు శ్రీకారం చుట్టే నాయకునిగా ఎదగాలి. విమర్శలెదురైనా పట్టుదలతో ముందుకు సాగితే విజయం మీదే’’ అని లా గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనకు బలయ్యే అణగారిన వర్గాలకు చట్టపరంగా చేయూతనివ్వాలని సూచించారు. మెరుగైన సామాజిక మార్పుకు చట్టాలు కూడా తోడ్పడతాయని సీజేఐ అన్నారు. ‘‘యువతరం ప్రపంచంలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారంచుడుతోంది. వాతావరణ సంక్షోభం మొదలుకుని మావన హక్కుల ఉల్లంఘన దాకా పెను సమస్యలెన్నింటినో ఎదుర్కోవడంలో సంఘటిత శక్తిగా తెరపైకి వస్తోంది. ఇక సాంకేతిక విప్లవం మనందరినీ ప్రపంచ పౌరులుగా మార్చేసింది. కనుక సామాజిక బాధ్యతలను నెరవేర్చేందుకు మనమంతా ముందుకు రావాలి’’ అన్నారు. ఛత్తీస్గఢ్లో న్యాయ వ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పన, బడ్జెట్ కేటాయింపులు తదితరాల్లో సీఎం భూపేశ్ భగెల్ పనితీరును ఈ సందర్భంగా ప్రశంసించారు. -
జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత
న్యూఢిల్లీ: పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయం అందిస్తామని రాజ్యాంగ ప్రవేశిక హామీ ఇస్తుంటే వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం బాధాకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘‘చాలా తక్కువ శాతం మంది మాత్రమే న్యాయం కోసం కోర్టుల దాకా వెళ్లగలుగుతున్నారు. అవగాహన లోపం, అవకాశాల లేమి వల్ల అత్యధికులు ఆ అవకాశానికి దూరమై మౌనంగా వ్యథను అనుభవిస్తున్నారు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘దేశ నిర్మాణంలో పౌరులందరి భాగస్వామ్యానికి అవకాశం కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్య సమాజ లక్షణం. అందుకు సామాజిక అసమానతలను రూపుమాపడం అత్యవసరం. అందుకు న్యాయ ప్రక్రియ అందరికీ అందుబాటులో చాలా అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ మొదలైన ఆలిండియా జిల్లా న్యాయ సేవల సంస్థల తొలి సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. నల్సా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రెజిజు, పలు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో పాటు దేశమంతటి నుంచీ 1,200 మందికి పైగా డెలిగేట్లు పాల్గొన్నారు. సీజేఐ మాట్లాడుతూ జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థను దేశ న్యాయ వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణించారు. కక్షిదారుల్లో అత్యధికులకు అందుబాటులో ఉండే తొలి న్యాయ గవాక్షం అదేనన్నారు. దాన్ని బలోపేతం చేయడం తక్షణావసరమని అభిప్రాయపడ్డారు. అక్కడ ఎదురయ్యే అనుభవాన్ని బట్టే మొత్తం న్యాయ వ్యవస్థపై ప్రజలు అభిప్రాయానికి వస్తారు కాబట్టి జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత ఉందన్నారు. నల్సా సేవలు అమోఘం విచారణ ఖైదీల స్థితిగతులపై న్యాయ సేవల విభాగం తక్షణం దృష్టి సారించాలని జస్టిస్ రమణ అన్నారు. ఈ దిశగా జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) 27 ఏళ్లుగా గొప్పగా సేవలందిస్తోందని ప్రశంసించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేస్తేనే సత్వర న్యాయం, పెండింగ్ కేసుల భారం కూడా తగ్గుతుందన్నారు. న్యాయం పొందేందుకు సామాజిక, ఆర్థిక అశక్తతలు అడ్డంకిగా మారని సమ సమాజం కోసం జిల్లా, రాష్ట్ర స్థాయి న్యాయ వ్యవస్థలు కృషి చేయాలని జస్టిస్ చంద్రచూడ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం టెక్నాలజీని మరింతగా వాడుకోవాల్సిన అవసరముందన్నారు. పేద, అణగారిన వర్గాలకు మరింత సమర్థంగా న్యాయ సేవలు అందించడం, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై సదస్సు చర్చించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా న్యాయ సేవల కేంద్రాల మధ్య ఏకరూపత సాధించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు తదితరాలు కూడా చర్చకు రానున్నాయి. సులువుగా న్యాయం: మోదీ సులభతర వాణిజ్యం మాదిరిగానే న్యాయప్రక్రియను కూడా సులభతరం చేయాల్సిన అవసరముందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర అమృతోత్సవ సంబరాలు ఇందుకు సరైన తరుణమన్నారు. చిరకాలంగా జైళ్లలో మగ్గుతున్న విచారణ ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా న్యాయ వ్యవస్థకు మరోసారి సూచించారు. జిల్లా జడ్జిలే ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు. ‘‘న్యాయ వ్యవస్థను ఆశ్రయించగల అవకాశం అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. సరైన న్యాయం సత్వరమే అందడమూ అంతే ముఖ్యం. న్యాయ వ్యవస్థకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా గత ఎనిమిదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. న్యాయ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వాడుకోవాలి. పురాతన భారతీయ విలువలకు కట్టుబడుతూనే 21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా ముందుకెళ్లాలి’’ అని సూచించారు. ఆగస్టు 15కల్లా అత్యధికులకు విముక్తి: రిజిజు విచారణ ఖైదీల్లో అత్యధికులను పంద్రాగస్టు నాటికి విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు రిజిజు వివరించారు. ‘‘వారిని గుర్తించేందుకు నల్సా జూలై 16 నుంచి రంగంలోకి దిగింది. ఇందుకోసం ఆగస్టు 13 దాకా నిర్విరామంగా పని చేయనుంది’’ అని చెప్పారు. -
ఉచిత పథకాలు తీవ్రమైన అంశమే
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టేలా ఉచిత పథకాలపై హామీలు ఇవ్వడం చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ అంశంపై ఒక దృఢ వైఖరిని అవలంబించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సంకోచిస్తోందో చెప్పాలని ప్రశ్నించారు. హేతుబద్ధత లేని ఉచితాలను కఠినంగా నియంత్రించాలని కోరుతూ బీజేపీ నాయకుడు, న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పార్టీలు ప్రకటించే ఉచితాలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఆ తర్వాత ఇలాంటి వాటిని కొనసాగించాలో లేదో తాము నిర్ణయిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఉచిత పథకాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేశారు. ఉచితాలను రాష్ట్రాల స్థాయిలోనే నియంత్రించాలని సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. ఉచిత పథకాల అమలు వల్ల రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయని పిటిషనర్ అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.70 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు. ఉచితాలను ప్రకటించే పార్టీల ఎన్నికల గుర్తులను రద్దు చేయాలని, పార్టీల రిజిస్ట్రేషన్ను సైతం క్యాన్సల్ చేయాలని కోరారు. మీడియా నిజాయితీ పాటించాలి మీడియా సంస్థలు వ్యాపార ధోరణి వదులుకోవాలని, నిజాయితీగా వ్యవహరించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ హితవు పలికారు. వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి, పలుకుబడి పెంచుకోవడానికి మీడియాను ఒక సాధనంగా వాడుకోవద్దని సూచించారు. మంగళవారం ఢిల్లీలో గులాబ్చంద్ కొఠారీ రచించిన ‘ద గీతా విజ్ఞాన ఉపనిషత్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. మన దేశంలో మీడియా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు గుర్తింపు పొందలేకపోతున్నాయో ఆలోచించుకోవాలన్నారు. -
Maharashtra political crisis: రాజ్యాంగపరమైన ప్రశ్నలెన్నో!
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేన, రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లు పార్టీల్లో చీలిక, విలీనం, ఫిరాయింపులు, అనర్హత తదితరాలకు సంబంధించి పలు రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వీటన్నింటినీ విస్తృత ధర్మాసనం లోతుగా మదింపు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలేందుకు దారితీసిన పరిస్థితులకు సంబంధించి ఉద్ధవ్, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై జస్టిస్ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వాదనలు సాగాయి. సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ ఉద్ధవ్ వర్గం తరఫున, హరీశ్ సాల్వే తదితరులు షిండే వర్గం తరఫున వాదనలు వినిపించారు. ప్రజా తీర్పుకు విలువేముంది: సిబల్ మహారాష్ట్రలో జరిగినట్టు అధికార పార్టీని ఇష్టానుసారం చీలుస్తూ పోతే ప్రజా తీర్పుకు విలువేముందని సిబల్ ప్రశ్నించారు. ‘‘ఫిరాయింపులను నిరోధించే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్కు కూడా విలువ లేకుండా పోతుంది. వేరే పార్టీలో విలీనానికే తప్ప ఇలాంటి చీలికలకు ఫిరాయింపుల నుంచి రక్షణ వర్తించబోదు. అలా కాదని మెజారిటీ సూత్రాన్నే అంగీకరించాల్సి వస్తే దేశంలో ఎన్నికైన ప్రతి ప్రభుత్వాన్నీ సులువుగా కూలదోయవచ్చు. పార్టీల్లో చీలికలను నిషేధిస్తున్న రాజ్యాంగ రక్షణకు అర్థమే ఉండదు. ఇదో ప్రమాదకరమైన పోకడకు దారితీస్తుంది’’ అన్నారు. బీజేపీ నిలబెట్టిన స్పీకర్ అభ్యర్థికి ఓటేసినందుకు షిండే వర్గానికి చెందిన 40 మంది సేన ఎమ్మెల్యేలపై పదో షెడ్యూల్లోని రెండో పేరా ప్రకారం అనర్హత వేటు పడ్డట్టేనని వాదించారు. అంతేగాక వివాదం సుప్రీంకోర్టులో ఉండగా గవర్నర్ కొత్త ప్రభుత్వంతో ప్రమాణస్వీకారం చేయించడమూ సరికాదన్నారు. సీఎంను మారిస్తే కొంపలేమీ మునగవు: సాల్వే సిబల్ వాదనలను సాల్వే తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన కొంపలు మునగవన్నారు. నాయకున్ని మార్చాలని పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుకుంటే అందులో తప్పేముందని ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఒక్కటై ప్రధానిని కూడా వద్దు పొమ్మని చెప్పవచ్చు. కాబట్టి మహారాష్ట్ర ఉదంతానికి సంబంధించినంత వరకు ప్రజాస్వామ్య సంక్షోభం తదితరాల్లోకి పోకుండా స్పీకర్ ఎన్నిక చట్టబద్ధంగా జరిగిందా లేదా అన్నదానికే వాదనలు పరిమితం కావాలి’’ అని సూచించారు. ఈ దశలో సీజేఐ జస్టిస్ రమణ స్పందిస్తూ మహారాష్ట్ర ఉదంతం పలు రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తిందన్నారు. ‘‘10వ షెడ్యూల్లో మూడో పేరా తొలగింపు తర్వాత పార్టీలో చీలికకు గుర్తింపు లేకుండా పోయింది. దీని తాలూకు పరిణామాలెలా ఉంటాయో ఆలోచించాల్సి ఉంది. పార్టీ చీలికను గుర్తించే విధానం లేకపోవడం, పార్టీలో మైనారిటీలో పడ్డ నాయకునికి చట్టసభల్లోని తమ పార్టీ నేతను తొలగించే అధికారముందా వంటివన్నీ లోతుగా చర్చించాల్సన అంశాలు. ఇరుపక్షాల వాదనలూ విన్నాక, వీటిలో పలు అంశాలను అవసరమైతే విస్తృత ధర్మాసనానికి నివేదిస్తాం. అందుకే ఏయే అంశాలపై విచారణ జరపాలో ఇరు వర్గాలూ ఆలోచించుకుని జూలై 27కల్లా మా ముందుంచాలి’’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. బలపరీక్ష, స్పీకర్ ఎన్నిక సందర్భంగా పార్టీ విప్ను ఉల్లంఘించినందుకు ఉద్ధవ్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న షిండే వర్గం విజ్ఞప్తిపై అప్పటిదాకా ఏ చర్యలూ చేపట్టొద్దని స్పీకర్ను ఆదేశించారు. -
జైళ్లలోని 80% మంది విచారణ ఖైదీలే
జైపూర్: దేశంలోని జైళ్లలో పెద్ద సంఖ్యలో విచారణ ఖైదీలు ఉండటం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్న ఈ అంశాన్ని పరిష్కరించేందుకు చర్యలు అవసరమని పిలుపునిచ్చారు. ఎలాంటి విచారణ లేకుండా దీర్ఘకాలంపాటు వ్యక్తుల నిర్బంధానికి దారితీస్తున్న విధానాలను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని 6.10 లక్షల మంది ఖైదీల్లో సుమారు 80% మంది అండర్ ట్రయల్ ఖైదీలేనన్నారు. శనివారం సీజేఐ జైపూర్లో ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ 18వ వార్షిక సదస్సులో పసంగించారు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ పాల్గొన్నారు. కారాగారాలను బ్లాక్ బాక్సులుగా పేర్కొన్న సీజేఐ.. ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన ఖైదీల్లో జైలు జీవితం ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. విచారణ ఖైదీలను ముందుగా విడుదల చేయడమనే లక్ష్యానికి పరిమితం కారాదని పేర్కొన్నారు. ‘‘నేర న్యాయ వ్యవస్థలో, ప్రక్రియే ఒక శిక్షగా మారింది. అడ్డుగోలు అరెస్టులు మొదలు బెయిల్ పొందడం వరకు ఎదురయ్యే అవరోధాలు, విచారణ ఖైదీలను దీర్ఘకాలం పాటు నిర్బంధించే ప్రక్రియపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం’’అని ఆయన అన్నారు. దీంతోపాటు పోలీసు వ్యవస్థ ఆధునీకరణ, పోలీసులకు శిక్షణ, సున్నితత్వం పెంచడం వంటి వాటి ద్వారా క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను మెరుగుపరచవచ్చని అన్నారు. రాజకీయ వైరుధ్యం శత్రుత్వంగా మారడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వివరణాత్మక చర్చలు, పరిశీలనలు లేకుండా చట్టాలు ఆమోదం పొందుతున్నాయి’’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ లాయర్లకే ఎక్కువ గౌరవం: రిజిజు హైకోర్టులు, దిగువ కోర్టుల్లో కార్యకలాపాలు ప్రాంతీయ భాషల్లోనే జరిపేలా ప్రోత్సహించాలని కిరణ్ రిజిజు చెప్పారు. ఏ ప్రాంతీయ భాష కంటే ఇంగ్లిష్ ఎక్కువ కాదన్నారు. ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలిగినంత మాత్రాన లాయర్లు ఎక్కువ గౌరవం, ఎక్కువ ఫీజు పొందాలన్న విధానం సరికాదని చెప్పారు. కొందరు లాయర్లు ఒక్కో కేసుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, ఇంత ఫీజును సామాన్యులు భరించలేరని చెప్పారు. సామాన్యుడిని కోర్టుల నుంచి దూరం చేసే కారణం ఎలాంటిదైనా ఆందోళన కలిగించే అంశమేనన్నారు. -
తెలుగుదనాన్ని మర్చిపోకండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పుట్టిన ఊరు, మట్టి వాసనలు, వంటలు వాటి గుభాళింపులు, పలకరింపులు, చదువు నేర్పిన గురువులను, పరిసరాలను మరిచిపోవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. సతీ సమేతంగా అమెరికా పర్యటనలో ఉన్న సీజేఐకి అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్లో నార్త్ అమెరికా తెలుగు ప్రతినిధులు శుక్రవారం ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడారు. అమెరికా వంటి దేశాల్లో మన సంస్కృతీ సంప్రదాయాలను మరవకుండా, ఆచార వ్యవహారాలను పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడపటం అందరూ గర్వించాల్సిన విషయమని ఆయన కొనియాడారు. “అమెరికాలో 2010–17 మధ్య కాలంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 85% పెరిగింది. మిగతా ఆసియా భాషలతో పోలిస్తే తెలుగు భాష ప్రథమ స్థానంలో ఉంది’అని ఆయన తెలిపారు. తెలుగు భాషను ఎంతగా గౌరవిస్తామో, ఇతర భాషలను సైతం అదే విధంగా గౌరవించుకోవాలన్నారు. ఉద్యోగరీత్యా అవసరమైన విషయాలకు మాత్రమే భాష, సంస్కృతులను త్యాగం చేయాల్సి ఉంటుందే తప్ప, దైనందిన జీవితంలో, కుటుంబంలో రోజువారీ కార్యకలాపాల్లో మాతృభాషను వాడటం మరవొద్దని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. తెలుగులో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనడానికి తానే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. మాతృభాషలో చదువుకొని న్యాయశాస్త్రంలో ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. దేశంలో న్యాయం ఆకాంక్షించే ప్రతీ ఒక్కరికీ సత్వర న్యాయం అందేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజల అర్జీలను పరిష్కరించేందుకు తగిన సంఖ్యలో కోర్టులు, జడ్జీలనూ నియమించాల్సిన అవసరం ఉందన్నారు. -
దేశద్రోహ చట్టం అమలును తాత్కాలికంగా నిలిపేస్తారా?
న్యూఢిల్లీ: ‘‘బ్రిటిష్ వలస కాలం నుంచి అమల్లో ఉన్న దేశద్రోహ (సెక్షన్ 124ఏ) చట్టాన్ని పునఃసమీక్షిస్తారా? ఆ చట్టం కింద కేసులు నమోదైన పౌరుల ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా అప్పటిదాకా పెండింగ్ కేసులన్నింటినీ పక్కన పెడతారా? పునఃసమీక్ష పూర్తయ్యేదాకా దేశద్రోహం కింద కొత్త కేసులు పెట్టకుండా ఉంటారా?’’ అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఈ అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిందిగా సూచించింది. వీటిపై కేంద్రం వైఖరేమిటో బుధవారంలోగా తమకు చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. దాన్నిబట్టి అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ చట్టం తరచూ దుర్వినియోగానికి గురవుతోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. ఇందుకు తక్షణం అడ్డుకట్ట పడాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. అందుకోసం అవసరమైతే పునఃసమీక్ష పూర్తయేదాకా చట్టం అమలును తాత్కాలికంగా నిలిపేయాలని సూచించింది. చట్టాన్ని సమీక్షించేలోగా పెండింగ్లో ఉన్న, ఇకపై నమోదయ్యే కేసుల విచారణను నిలిపివేయాలంటూ వస్తున్న సూచనలపై స్పందించాలని కేంద్రానికి సూచించింది. కేంద్రంతో చర్చించి బుధవారం కోర్టుకు తెలియజేస్తానని తుషార్ మెహతా చెప్పారు. ‘‘దేశద్రోహ చట్టం దుర్వినియోగమవుతోందని కేంద్రమే ఆందోళన చెందుతుంటే ఇక పౌరుల హక్కులను ఎలా కాపాడతారు? ఈ చట్టం కింద ఇప్పటికే పలువురు జైళ్లలో ఉన్నారు. ఇంకా ఎందరి మీదనో ఈ చట్టం కింద అభియోగాలు మోపనున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పునఃసమీక్షకు ఎంతకాలం తీసుకుంటారని ప్రశ్నించింది. ఇంతకాలమని ఇదమిత్థంగా చెప్పలేమని తుషార్ మెహతా బదులిచ్చారు. అలాంటప్పుడు సమీక్ష పూర్తయ్యేదాకా దేశద్రోహ చట్టం అమలును పక్కన పెట్టాల్సిందిగా రాష్ట్రాలకు సూచించలేరా అని ధర్మాసనం ప్రశ్నించింది. బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న దేశద్రోహం చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో లెక్కకు మించి పిటిషన్లు దాఖలయ్యాయి. దీన్ని పునఃసమీక్షిస్తామని, అంతవరకు పిటిషన్లను విచారణకు స్వీకరించవద్దని కేంద్రం సోమవారం సుప్రీంను కోరింది. దేశద్రోహ చట్టం కింద 2015–20 మధ్య దేశవ్యాప్తంగా 356 కేసులు నమోదయ్యాయి. మైనార్టీలను గుర్తించే అధికారం ఎవరిది? మైనార్టీలను గుర్తించడంలో పలు రాష్ట్రాల్లో కేంద్రం అనుసరిస్తున్న భిన్న వైఖరులపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హిందువులు సహా మైనార్టీలుగా ఉన్నవారిని గుర్తించడంపై రాష్ట్ర ప్రభుత్వాలతో మూడు నెలల్లోగా సంప్రదింపులు జరపాలని జస్టిస్ కౌల్, జస్టిస్ సుందరేశ్లతో కూడిన∙బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది. అల్ప సంఖ్యాకులైన హిందువులు, ఇతర వర్గాలకు మైనార్టీ హోదాను రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని కేంద్రం మార్చిలో పేర్కొంది. కానీ మైనార్టీ హోదా ఇవ్వడంపై కేంద్రానికే సర్వాధికారాలు న్నాయని సోమవారం కోర్టుకు నివేదించింది. -
దేశంలో వైద్య ‘అవ్యవస్థ’
న్యూఢిల్లీ: దేశ జనాభాలో 70 శాతానికి నేటికీ మౌలిక వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చాలా ఊళ్లలో డాక్టర్లుండరు. వాళ్లుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రముండదు. రెండూ ఉంటే సరైన సదుపాయాలుండవు. ఇదీ మన దేశంలో ఆరోగ్య సేవల పరిస్థితి!’’ అన్నారు. సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించారు. ‘‘వైద్య సదుపాయాలను పెంపొందించాలి. పరిశోధనలకు ఊతమివ్వాలి. అవసరమైతే స్వచ్ఛంద సంస్థలతో పాటు కార్పొరేట్లను కూడా భాగస్వాములను చేయాలి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద గ్రామీణ ప్రాంతాల్లో అవి వైద్య సదుపాయాలు అందించేలా చూడాలి. వైద్య వ్యవస్థ మెరుగుకు ఓ రోడ్ మ్యాప్ తప్పనిసరి’’ అన్నారు. దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతోందంటూ పలు గణాంకాలు వివరించారు. కుటుంబ, సమాజ, దేశ సంక్షేమంలో కీలక పాత్ర పోషించే మహిళలు రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమన్నారు. ‘‘భార్య విలువైనా, తల్లి విలువైనా వారు లేకుండా పోయాకే అనుభవానికి వస్తుంది. మా అమ్మ 80 ఏట కన్నుమూసింది. అయినా ఈనాటికీ అమ్మను మర్చిపోలేకపోతున్నా’’ అన్నారు. ఇల్లాలి ప్రాధాన్యతను ప్రతి కుటుంబమూ గుర్తించాలని సూచించారు. శనివారం ఇక్కడ డాక్టర్ కల్నల్ సీఎస్పంత్; డాక్టర్ వనితా కపూర్ రాసిన పుస్తక విడుదల కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడారు. నిజాయితీగా కష్టపడి పని చేసే డాక్టర్లపై హింస, దాడులు పెరుగుతున్నాయన్నారు. వారిపై తప్పుడు కేసులు పెట్టే ధోరణి ప్రబలుతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. తన కూతురూ డాక్టరే కావడంతో వైద్యుల సమస్యలపై తనకు అవగాహన ఉందని చెప్పారు. ‘‘రోగుల క్షేమం కోసం నిరంతరాయంగా చెమటోడ్చే వైద్యుల స్ఫూర్తిని అభినందిస్తున్నా. వైద్యులంటే మన మిత్రులు, కౌన్సెలర్లు, దిశానిర్దేశకులు. సమాజంలో, ప్రజల సమస్యల పరిష్కారంలో వారిది చురుకైన పాత్ర కావాలి. వారు పని చేసేందుకు మరింత మెరుగైన, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరముంది’’ అని ఆయన అన్నారు. -
న్యాయమూర్తులుగా 15 మంది
న్యూఢిల్లీ: ఏపీ, ఢిల్లీ, పాట్నా హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించాలంటూ 15 మంది జ్యుడీషియల్ అధికారులు, న్యాయవాదుల పేర్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అడ్వొకేట్ మహబూబ్ సుభానీ షేక్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ్జడ్జిగా నియమించాలని సూచించింది. ఢిల్లీ, పట్నా హైకోర్టులకు ఏడుగురు చొప్పున న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించింది. ఈ నెల 4న కొలీజియం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. -
రాష్ట్రపతి, సీజేఐతో ఏపీ గవర్నర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను ఆయన రాష్ట్రపతికి వివరించారని సమాచారం. అంతకుముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, హోంమంత్రి అమిత్షాలను గవర్నర్ విడివిడిగా కలిశారు. సీజేఐను కలిసిన గవర్నర్.. అలాగే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కూడా గవర్నర్ హరిచందన్ కలిశారు. కాగా, ఈ నెల 22న ఢిల్లీ వచ్చిన గవర్నర్ 23వ తేదీన ప్రధాని మోదీని కలవగా, 24న నేషనల్ వార్ మెమోరియల్ను తన సతీమణితో కలిసి సందర్శించిన విషయం తెలిసిందే. గవర్నర్ దంపతులు మంగళవారం ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్తారని సమాచారం. -
న్యాయమూర్తులపై దుష్ప్రచారం.. కొత్త ట్రెండ్
న్యూఢిల్లీ: న్యాయమూర్తులపై ప్రభుత్వాలే దుష్ప్రచారం సాగిస్తుండడం దురదృష్టకరం, ఇదొక కొత్త ట్రెండ్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇష్టంలేని తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆక్షేపించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మాజీ ఐఏఎస్ అధికారి అమన్కుమార్ సింగ్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ చత్తీస్గఢ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలు సవాలు చేస్తూ చత్తీస్గఢ్ ప్రభుత్వం, ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘మీ పోరాటం మీరు చేసుకోండి. కానీ కోర్టులను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించొద్దు. సుప్రీంకోర్టులో కూడా ఇలాంటివి చూస్తున్నా. జడ్జీలపై ప్రభుత్వాలే దుష్ప్రచారం ప్రారంభిస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇదొక కొత్త ట్రెంట్గా మారింది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
విజేత సీజేఐ ఎలెవెన్
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం టీ–20 క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించారు. మోడర్న్ స్కూల్ గ్రౌండ్లో సీజేఐ ఎలెవెన్, ఎస్బీఏ ఎలెవెన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన సీజేఐ–ఎలెవన్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా సుప్రీం బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ప్రెసిడెంట్ వికాస్ సింగ్ వేసిన కొన్ని బంతులను సీజేఐ ఆడారు. సీజేఐ ఎలెవన్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎస్సీబీఏ ఎలెవెన్ జట్టు 12.4 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌటైంది. -
సీజేఐ నివాసంలో ఉగాది వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నివాసంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. శనివారం సాయంత్రం జరిగిన వేడుకలకు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హిమా కోహ్లీ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి, తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, వేద ఆశీర్వచనం, సినీ గాయకులు కారుణ్య, సాహితీల సంగీత విభావరి జరిగింది. తెలుగు వంటకాలతో ఘనంగా విందు ఏర్పాటు చేశారు. -
కోర్టు ఆదేశాలు ‘ఫాస్టర్’గా..
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ ఆదేశాలు జాప్యం కాకుండా వేగంగా కక్షిదారులకు చేరడానికి రూపొందించిన ఫాస్ట్, సెక్యూర్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్(ఫాస్టర్) సాఫ్ట్వేర్ను గురువారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. కోర్టు ఉత్తర్వులు ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా వేగంగా, సురక్షితంగా చేరేలా రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ప్రారంభోత్సవ ఆన్లైన్ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్గుప్తా, పలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. వేగంగా సాఫ్ట్వేర్ రూపొందించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులు, కోర్టు రిజిస్ట్రీని అభినందించారు. ఈ వ్యవస్థ నిమిత్తం దేశవ్యాప్తంగా 1887 ఈ–మెయిల్ ఐడీలు సృష్టించారని, సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ఫాస్టర్ సెల్ ప్రారంభించారని తెలిపారు. కోర్టు ఆమోదించిన బెయిల్, విడుదలకు సంబంధించిన ప్రోసీడింగ్స్, ఆదేశాలను ఈ–మెయిళ్ల ద్వారా వెంటనే సంబంధిత నోడల్ అధికారులకు చేరేలా ఈ సాఫ్ట్వేర్ చేస్తుందన్నారు. ధ్రువీకరణ నిమిత్తం డిజిటల్ సంతకాలు, సంస్థాగత డిజిటల్ సంతకాలు ఉంటాయన్నారు. సమీప భవిష్యత్తులో హార్డ్కాపీలు అవసరం ఉన్న అన్ని రికార్డులు పూర్తిగా ఫాస్టర్ ద్వారా చేరవేయొచ్చని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. 16.7.2021న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆగ్రా సెంట్రల్ జైలులో నిందితుల్ని మూడు రోజుల తర్వాత కూడా విడుదల చేయలేదంటూ పత్రికల్లో వచ్చిన కథనాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. న్యాయ ఆదేశాలు త్వరగా చేరకపోవడం వల్ల దోషుల విడుదలలో జాప్యాన్ని గ్రహించిన సీజేఐ జస్టిస్ రమణ ఈ సాఫ్ట్వేర్ రూపకల్పనకు సూచనలు చేశారు. -
దుబాయ్లో న్యాయ సహాయ కేంద్రం: జస్టిస్ రమణ
న్యూఢిల్లీ: దుబాయ్లో ఉంటున్న భారతీయులంతా కలిసి లీగల్ అసిస్టెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న భారతీయులకు అది ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. దుబాయ్ పర్యటనలో ఉన్న జస్టిస్ రమణ శుక్రవారం అక్కడి గురుద్వారాను సందర్శించి ప్రార్థనలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమ కోహ్లి ఆయనతో పాటు ఉన్నారు. దుబాయ్ అత్యున్నత న్యాయస్థానం యూనియన్ సుప్రీంకోర్టు ఆఫ్ ది యూఏఈ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహమ్మద్ హమద్ అల్ బదీ ఆహ్వానం మేరకు జస్టిస్ రమణ అక్కడ పర్యటిస్తున్నారు. అబుదాబిలోని భారత సంతతి వారి సన్మాన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. -
‘హిజాబ్’పై హోలీ తర్వాత విచారణ: సీజే ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై హోలీ పండుగ సెలవుల తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. కొందరు విద్యార్థుల తరపున సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం పరిశీలించింది. రాబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని హిజాబ్ అంశంపై వెంటనే విచారణ ప్రారంభించాలని సంజయ్ హెగ్డే కోరారు. జస్టిస్ ఎన్.వి.రమణ స్పందిస్తూ.. విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణ వ్యవహారాన్ని మరికొందరు సైతం లేవనెత్తారని, హోలీ సెలవుల తర్వాత దీన్ని విచారించాల్సిన పిటిషన్ల జాబితాలో చేరుస్తామని పేర్కొన్నారు. -
‘పిల్’లతో కాలహరణం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా ప్రయోజన వ్యాజ్యా (పిల్)ల వల్ల వాస్తవ కేసుల నుంచి కోర్టు దృష్టి మళ్లుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. సోమవారం కర్ణాటకలోని కర్వార్ పోర్టు విస్తరణకు పర్యావరణ అనుమతులపై పెండింగ్లో ఉన్న కేసులో జస్టిస్ ఎన్వీ రమణ ఈ మేరకు వ్యాఖ్యానించారు. పిల్స్ కోర్టు సమయం తీసుకోకుంటే వాస్తవ కేసులకు సమయం కేటాయించొచ్చని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల బోర్డులు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎన్ఐఓఎస్లు ఈ ఏడాది నిర్వహించే 10, 12 తరగతుల పరీక్షలను భౌతికంగా నిర్వహించరాదంటూ హక్కుల కార్యకర్త శ్రీవాస్తవ దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. జస్టిస్ ఏఎం ఖని్వల్కర్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారిస్తుందని సీజేఐ పేర్కొన్నారు. -
హిజాబ్ అంశాన్ని జాతీయ వివాదంగా మార్చొద్దు
న్యూఢిల్లీ/ సాక్షి, బెంగళూరు: దేశంలో ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును సవాలు చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సరైన సమయంలో విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు దేశ పౌరుల ప్రాథమిక హక్కును భంగపరిచేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద ప్రజలు తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చని గుర్తుచేశారు. వారి తరపున సీనియర్ అడ్వొకేట్ దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. తమ పిటిషన్పై ఈ నెల 14న విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో ఇప్పటికే విచారణ కొనసాగుతోందని గుర్తుచేసింది. హైకోర్టు ఇచ్చే తుది తీర్పు కోసం వేచి చూడాలని సూచించింది. స్పెషల్ లీవ్ పిటిషన్పై తాము సరైన సమయంలో విచారణ ప్రారంభిస్తామని తేల్చిచెప్పింది. హిజాబ్ అంశాన్ని జాతీయ స్థాయి వివాదంగా మార్చొద్దని హితవు పలికింది. కర్ణాటక ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు ఇంకా తమకు అందలేదని పేర్కొన్నారు. హిజాబ్ కేసులో విచారణ ముగిసే వరకూ విద్యాసంస్థల్లో మతపరమైన చిహ్నాలు ధరించరాదని ఆదేశిస్తూ కర్ణాటక హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. శాంతిని విచ్ఛిన్నం చేయొద్దు భారత్ లౌకిక దేశమని, ఏదో ఒక మతం ఆధారంగా ఈ దేశం గుర్తింపును నిర్ధారించలేమని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. హిజాబ్ వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితురాజ్ అవస్తీ నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. ఈ ఉత్తర్వులో న్యాయస్థానం పలు అంశాలను ప్రస్తావించింది. హిజాబ్పై వివాదం, విద్యాసంస్థల మూసివేత బాధాకరమని ధర్మాసనం వెల్లడించింది. భారత్లో బహుళ సంస్కృతులు, మతాలు, భాషలు మనుగడలో ఉన్నాయని తెలిపింది. ఇష్టమైన మతాన్ని అవలంబించే హక్కు దేశ పౌరులకు ఉందని గుర్తుచేసింది. మనది నాగరిక సమాజమని.. మతం, సంస్కృతి పేరిట శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసే అధికారం ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. అందుకు చట్టం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వదని పేర్కొంది. మద్రాసు హైకోర్టు సైతం గురువారం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాజస్తాన్కు పాకిన హిజాబ్ గొడవ కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇప్పుడు రాజస్తాన్కు సైతం పాకింది. హిజాబ్ ధరించిన వారిని తరగతులకు హాజరు కానివ్వడం లేదని ఆరోపిస్తూ జైపూర్ జిల్లాలోని చాక్సు పట్టణంలో ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రదర్శన చేపట్టారు. అయితే, విద్యార్థినులు గత నాలుగైదు రోజుల నుంచే హిజాబ్ ధరించి వస్తున్నారని కళాశాల సిబ్బంది చెప్పారు. కానీ, విద్యార్థినుల వాదన మాత్రం మరోలా ఉంది. తాము గత మూడేళ్ల నుంచి హిజాబ్ ధరించే కాలేజీ వస్తున్నామని, ఎప్పుడూ ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, అకస్మాత్తుగా ఇప్పుడే తమను తరగతులకు అనుమతించడం లేదని పేర్కొన్నారు. 16 దాకా వర్సిటీలకు సెలవులు హిజాబ్ వివాదం నేపథ్యంలో డిపార్టుమెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ కాలేజెస్కు చెందిన విశ్వవిద్యాలయాలకు ఈ నెల 16వ తేదీ వరకూ సెలవులు పొడిగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని ఉన్నత విద్యా మంత్రి అశ్వత్థ నారాయణ్ చెప్పారు. ప్రి–యూనివర్సిటీ(పీయూసీ), డిగ్రీ కాలేజీల పునఃప్రారంభంపై ఈ నెల 14న నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు విద్యా మంత్రి నగేష్ శుక్రవారం తెలిపారు. పీయూసీ, డిగ్రీ కాలేజీల తరగతులు సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పా రు. పాఠశాలలను మళ్లీ తెరుస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుం డా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి చెప్పారు. -
చట్టాలలో అస్పష్టత ఎవరి పుణ్యం?!
న్యాయస్థానాలు జారీ చేసే ఉత్తర్వులు ఆచరణకు నోచుకున్నప్పుడే వాటికి విలువా, గౌరవమూ ఉంటాయి. పాలకవర్గం ఆ ఉత్తర్వులను సైతం ఖాతరు చేయకపోతే దేశంలో గందరగోళం నెలకొని ఉన్నట్టే! ఆ గందరగోళమే చట్టాలు చేయడంలోనూ ప్రతిఫలిస్తోంది. ఎన్నో చట్టాలు సరైన చర్చలు లేకుండానే ఆమోదం పొందుతున్నాయి. ఫలితంగా చట్టాల లక్ష్యమేమిటో జనానికి తెలియకుండా పోతోంది. స్వాతంత్య్రోద్యమ కాలం నాటి స్ఫూర్తి, పారదర్శకత అడుగంటడమే ఈ విలువల పతనానికి కారణం. వలస పాలనావశేషాలు తొలగిపోనంతవరకూ వ్యవస్థలో మార్పు రాదు. అందుకే భారత న్యాయవ్యవస్థను పేద ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, వలస పాలనావశేషాలకు దూరంగా పునర్నిర్మించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ‘‘కోర్టులు జారీచేసే ఉత్తర్వులు ఆచర ణలో అమలు జరిగినప్పుడే వాటికి విలువా, గౌరవమూ... క్రమంగా కార్యనిర్వాహక వర్గమైన దేశ పాలకవర్గం కోర్టు ఉత్తర్వులను ‘బేఖాతరు’ చేసే ధోరణిలో ఉంది. అంతేగాదు, చట్టాలు చేయడంలోనూ, దేశంలో పార్లమెంటరీ చర్చల నిర్వహణలోనూ అనుసరిస్తున్న తీరుతెన్నులు సక్రమంగా లేవు. ఇందువల్ల దేశంలో తగాదాలు (లిటిగేషన్) పెరిగి, దేశ పౌరులకు, కోర్టులకు, తదితర సంబంధిత వర్గాలకు అసౌకర్యం కలుగుతోంది. చట్టాలు ఎందుకు చేస్తున్నామో స్పష్టత లేనందునే ఈ గందరగోళమంతా. దేశ చట్టాలను చట్ట సభలలో క్షుణ్ణంగా చర్చించిన, ఆమోదించిన రోజులున్నాయి. కానీ దురదృష్టవశాత్తూ కొంతకాలంగా చట్ట సభల్లో జరుగుతున్నదేమిటో మీకు తెలుసు, గుణాత్మకమైన చర్చలు జరగడం లేదు. ఫలితంగా రూపొందుతున్న కొత్త చట్టాల ఉద్దేశంగానీ, లక్ష్యంగానీ బొత్తిగా బోధపడటం లేదు.’’ – 16 ఆగస్టు 2021 – 27 డిసెంబర్ 2021 తేదీలలో గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవి. ఆ మాటకొస్తే, చట్టాలు రూపొందిస్తున్న తీరు, పార్లమెంటులో చర్చ లేకుండానే ‘తూతూ మంత్రం’గా ఆమోద ముద్ర వేస్తున్న తీరు గురించి ఒక్క ప్రధాన న్యాయమూర్తి రమణే కాదు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా నిరసన తెలపక తప్పలేదు. చట్టసభలలో చర్చలన్నవి ఎంతో పేలవంగా తయారయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చట్ట సభలలో నేడు పేరుకు జరుగుతున్న చర్చలు ఇంతగా పతనమవడాన్ని నేడు కళ్లారా చూడవలసి వస్తోంది. సమగ్రమైన చర్చలు జరక్కుండానే చట్టాలు రూపొందిస్తున్నారు. ప్రజాస్వామ్యా నికి ఆధారమే చర్చలూ, సరైన వాదనలూ. అయినా సభలో చర్చలు నిరాటంకంగా జరక్కుండా అడ్డుకోవడం తీవ్ర అభ్యంతరకరం. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థల హుందాతనాన్ని, గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీయడమే’’ అని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించడం గమనార్హం! వీటన్నింటికంటే ప్రధానమైనది, ఒకనాటి పత్రికలు సమాజంలో నెలకొల్పిన పాత్రికేయ ప్రమాణాలుగానీ, వాస్తవాలపై ఆధారపడిన పరిశోధనాత్మక జర్నలిజంగానీ ఈ రోజున మనకు మృగ్యమని పేర్కొంటూ గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ నేడు సమాజంలో వాస్తవిక సంచలనం కలిగించగల ఒక్క వ్యాసమన్నా మీడియాలో చోటు చేసుకుందా అని ప్రశ్నించారు. ఒకనాడు భారీ కుంభకోణాలకు సంబంధించిన కథనాలు చదవడానికి పాఠకులు ఉవ్విళ్లూరేవారనీ, కానీ ప్రస్తుత కాలంలో ఏది నిజమో, ఏది కట్టుకథో తెలుసుకోవడం గగనమై పోతోందనీ కూడా జస్టిస్ రమణ ఎత్తి పొడిచారు. అంతేగాదు, ఇటీవలనే ‘మాధవన్ కుట్టి అవార్డుల’ ప్రదానోత్సవం సందర్భంగా గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ (18 డిసెంబర్ 2021), నేడు దేశంలో వాస్తవాల కోసం ఒక పత్రికపైనో, ఒక చానల్పైనో పాఠకుడు ఆధారపడే పరిస్థితి లేదనీ, పాత్రికేయ విలువలు, ప్రమాణాలూ పడిపోతున్నాయనీ, కనీసం ఒక ఘటనపై వాస్తవాలు తెలుసుకోవాలంటే కనీసం నాలు గైదు పత్రికలు చదవాల్సి వస్తోందనీ వ్యాఖ్యానించారు. కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలోనే జాతీయోద్యమ కాలంనాటి సామాజిక విలువలు, స్ఫూర్తి మనం ఎందుకు, ఎవరి వలన కోల్పోవలసి వచ్చిందన్న ప్రశ్నకు నేటి తరం స్వార్థపరులైన రాజకీయ పాలకులు ఎవరూ సూటిగా సమాధానం చెప్పగల పరిస్థితుల్లో లేరు. చివరికి అనేకమంది ప్రజాస్వామిక, సామాజిక కార్యకర్తల చొరవ ఫలితంగా, పౌర హక్కుల ఉద్యమకారుల నిరంతర పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిన ‘సమాచార హక్కు చట్టాన్ని’ సహితం నీరుగార్చి పాలకులు జీవచ్ఛవంగా మార్చిన విషయం మరిచిపోరాదు. చివరికి ఒక విదేశీ గూఢచారి వ్యవస్థ సలహా సంప్రదింపులపై ఆధారపడి దేశీయ పౌరహక్కుల ఉద్యమాలనూ, పౌరహక్కులనూ అణగదొక్కేందుకు, అరబ్ ప్రజలను అణచడంలో అమెరికాకు ‘తైనాతీ’గా పనిచేస్తున్న ఇజ్రాయెల్ను మన పాలకులు ఆశ్రయించడం... మన దేశంలోనే కాదు, ప్రపంచ సభ్యదేశాలలో ‘పెగసస్’ కుంభకోణం ద్వారా వెల్లడయిందని మరచిపోరాదు. చివరికి మన సుప్రీంకోర్టు చేతిలో దేశ పాలకులు చిక్కుపడిపోయి ‘పెగసస్’ కుంభకోణం నుంచి బయటపడగల పరిస్థితులు దాదాపు శూన్యంగా కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ మూర్తులైన ఎన్.వి. రమణ, జస్టిస్ అబ్దుల్ నజీర్ భారత న్యాయ వ్యవస్థను బడుగు వర్గాలయిన పేద ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, వలస పాలనావశేషాలకు దూరంగా పునర్నిర్మించు కోవలసిన అవసరం ఉందనీ, మన సమాజ వాస్తవాలకు సన్ని హితంగా మలచుకోవలసిన సమయం వచ్చిందనీ హెచ్చరించడం విశేషం. కనీసం 75 సంవత్సరాల స్వాతంత్య్ర ముహూర్తం కూడా గడిచిపోతున్న సందర్భంలోనైనా మనం కళ్లు తెరవవలసి ఉంది. ప్రజాబాహుళ్య విశాల ప్రయోజనాలకు అనుగుణంగా విదేశీ న్యాయ శాస్త్ర అనుభవాల నుంచి మంచిని గ్రహిస్తూనే, ఒక స్వతంత్ర దేశంగా భారతదేశ న్యాయ వ్యవస్థను వలస పాలనావశేషాలకు కడు దూరంగా పునర్నిర్మించుకోవలసిన అవసరం గురించి 1986 నాటి ఎం.సి. మెహతా కేసులో ఆనాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పి.ఎన్. భార్గవ గుర్తు చేసిన వాస్తవాన్ని మనం మరవకూడదు. ఈ అనుభవాల నుంచి భారత న్యాయ వ్యవస్థకు రాజ్యాంగంలోని 141వ అధికరణ కింద ఒనగూడిన ప్రత్యేక సదుపాయమే ‘ప్రజా ప్రయో జనాల వ్యాజ్యం’ పౌర హక్కు అని మరచిపోరాదు. ఇలా ఎన్ని రకాల హక్కులు దేశ పౌరులకు సమకూడినా– ఈ పెట్టుబడిదారీ భూస్వామ్య జమిలి వ్యవస్థ... ఆచరణలో రద్దు కానంత వరకూ... రాజకీయ పార్టీలు ఎన్ని ముసుగుల్లో అధికార పెరపెరతో ఎన్నికల్లో పాల్గొన్నా, వలస పాలనా చట్ట అవశేషాలు– దేశాధికారం ఎవరి చేతుల్లో ఉన్నా... ప్రజా బాహుళ్యానికి ఒరిగేది ఏమీ ఉండదు. ఎందుకంటారా? ప్రసిద్ధ ఆంగ్ల కవయిత్రి మౌమిత ఆలం ‘లైవ్ వైర్’కు రాసిన ‘పొరపాటు’ కవితకు ‘ఉదయమిత్ర’ అనువాదంలోని ఆవేదనను పరిశీలించండి: ‘‘ఔను, వాళ్లెవరినైనా చంపగలరు రాజ్యం వాళ్లకు హామీపడింది! ఎవరినైనా, ఎప్పుడైనా, ఎందుకైనా చంపగలరు చావడానికి మనకు కారణాలుంటాయేమోగానీ చంపడానికి వాళ్లకు ఏ కారణమూ ఉండనక్కర్లేదు ఇంట్లో పనిచేసుకుంటున్న అఖ్లాన్నీ రైల్లో ప్రయాణిస్తున్న పెహ్లూన్ని చంపగలరు లక్షలాదిమంది పేర్లూ, చరిత్రనూ తుడిచేసి నిలువెత్తు జీవితాల్ని నంబర్ల కిందకు కుదించేసి అనేకానేకుల్ని అనాధ శవాలుగా మార్చేయగలరు... ఇంతకూ ఎవరువాళ్లు? వాళ్లు దేశ ప్రేమికులండోయ్! ఏ శిక్షా పడకుండా సొంత ప్రజలనే చంపగలరు! గుర్తించడానికి నిరాకరించో ‘పొరపాటు’ గుర్తింపు పేరుమీదనో ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చంపగలరు! సర్వకాల సర్వావస్థలకు అతీతులు వాళ్లు సుమా! అవును, వాళ్లెవరినైనా చంపగలరు రాజ్యం వాళ్లకు హామీపడింది!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
న్యాయవాదులు సమాజానికి మార్గ దర్శకులు
-
శాంతి సౌభ్రాతృత్వాలకు ప్రతీక క్రిస్మస్
గుణదల (విజయవాడ తూర్పు): క్రిస్మస్ పండుగ శాంతి సౌభ్రాతృత్వాలకు ప్రతీక అని, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు బోధించిన శాంతి మార్గంలో నడుచుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. విజయవాడలోని నోవోటెల్ హోటల్లో శనివారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ దంపతులు క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా పౌరులందరూ సోదర భావంతో మెలగాలని కోరారు. ఒకరికొకరు శాంతి సమాధానాలతో నడుచుకున్నపుడే సమాజం పురోగమిస్తుందన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రకారం అన్ని మతాలు ఒక్కటేనన్న మార్గాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. అనంతరం కేక్ కట్చేసి, ప్రజలందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్, పలు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ సేవలో సీజేఐ దంపతులు
-
టీవీ చర్చలతోనే ఎక్కువ కాలుష్యం
న్యూఢిల్లీ: అసలు కాలుష్యం కంటే టీవీలో చర్చలే ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల చిన్న చిన్న పరిశీలనలు కూడా వివాదాస్పద అంశాలుగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధానికి పెనుముప్పుగా మారిన వాయు కాలుష్యంపై ఓ విద్యార్థి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా జస్టిస్ రమణ ఈవిధంగా వ్యాఖ్యానించారు. ‘మీరు ఏదో ఒక సమస్యను లేవనెత్తి.. మమ్మల్ని గమనించేలా చేసి, ఆపై దానిని వివాదాస్పదం చేస్తారు. తర్వాత బ్లేమ్ గేమ్ మాత్రమే మిగిలి ఉంటుంది. టీవీల్లో చర్చలు అందరికంటే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి’ అని జస్టిస్ రమణ అన్నారు. పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లే ఢిల్లీ వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతోందని సుప్రీంకోర్టును తాను తప్పుదారి పట్టించినట్టు టీవీ చర్చల్లో ఆరోపించారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. తమను తప్పుదోవ పట్టించడం లేదన్నారు. (చదవండి: అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?) ఢిల్లీ కాలుష్యానికి రైతులను నిందిస్తూ, దీపావళి సందర్భంగా పటాకులు పేల్చేందుకు మద్దతు పలుకుతూ కొంతమంది ప్రముఖులు గళం వినిపించిన నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. కాలుష్యానికి కారణమంటూ రైతులను నిందించడం సరికాదని అన్నారు. ‘ఫైవ్ స్టార్, 7 స్టార్ హోటళ్లలో కూర్చుని రైతులను ఆడిపోసుకుంటున్నారు. అసలు రైతుల దగ్గర ఎన్ని భూములు ఉన్నాయి. ప్రత్యామ్నాయ విధానాల ద్వారా పంట వ్యర్థాలను తొలగించగల స్తోమత వారికి ఉందా? మీకు ఏదైనా శాస్త్రీయ విధానం తెలిస్తే.. వెళ్లి రైతులకు చెప్పండి’ అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి వ్యాఖ్యలతో ఢిల్లీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఏకీభవించారు. (చదవండి: ఆకలిచావులు ఉండొద్దు: సుప్రీంకోర్టు) -
మానవత్వానికి ప్రతీక డాక్టర్ నోరి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ చికిత్సలో ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు చేస్తోన్న కృషి అమోఘమని, మూర్తీభవించిన మానవత్వానికి ఆయన ప్రతీకని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కితాబునిచ్చారు. శనివారం కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో జరిగిన నోరి దత్తాత్రేయుడు స్వీయ ఆత్మకథ ‘ఒదిగిన కాలం’పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న వివిధ రం గాల ప్రముఖులు ఆయన సేవల్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. అమెరికాలో అత్యున్నత వైద్యపరిశోధనను అందుబాటులోకి తెచ్చారని, దేశీయంగానూ ఈ పరిశోధనను అభి వృద్ధి చేసేలా నోరి సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. తెలుగు సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారని, తన ఆత్మకథలో అనేక అం శాలు, జీవితపార్శా్వలు, అనుభవాలను పొందుపరిచారని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు విశ్వ యోగి విశ్వంజీ మాట్లాడుతూ.. భారత్లో కేన్సర్ పరిశోధనా కేంద్రంతోపాటు ప్రతీ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరిగేలా చూడాలన్నారు. తెలుగుబిడ్డగా ఎంతో గర్వపడుతున్నాను: దత్తాత్రేయుడు హైదరాబాద్లో తెలుగు ప్రజల, మిత్రుల సమక్షం లో తన ఆత్మకథ పుస్తకావిష్కరణ జరగడం ఆనందంగా ఉందని దత్తాత్రేయుడు అన్నారు. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు జరిపిన కృషిని గుర్తుచేసుకున్నారు. తెలుగుబిడ్డగా తానెంతో గర్వపడుతున్నానని చెప్పారు. కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్ డా.నోరి సతీమణి డా.సుభద్ర, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సీఈవో డాక్టర్ ప్రభాకరరావు, డా.పి.జగన్నాథ్, వోలేటి పార్వతీశం, డా.సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
Pegasus: బహిరంగ పర్చలేం
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ అంశంపై కోర్టులో సమగ్ర అఫిడవిట్ సమర్పించలేమని, ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. తాము మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. పెగాసస్ హ్యాకింగ్ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన కోర్టు సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించడం తెల్సిందే. పిటిషన్లపై సుప్రీం బెంచ్ సోమవారం విచారణ జరిపింది. ఈ కేసులో సమగ్ర ఆఫిడవిట్ దాఖలుపై ప్రభుత్వానికి పునరాలోచన ఏదైనా ఉంటే తమకు తెలియజేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. మరో 2–3రోజుల్లో మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని, అప్పటిలోగా స్పందించాలని పేర్కొంది. ‘ఈ అంశంపై నిజానిజాలను నిర్ధారించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, కమిటీ కోర్టుకు నివేదిక ఇస్తుందని మీరు(సొలిసిటర్ జనరల్) చెబుతున్నారు. అందుకే ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్నంగా పరిశీలించి, మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తాం’ అని కోర్టు స్పష్టం చేసింది. దాచడానికి ఏమీ లేదు: కేంద్రం విచారణ సందర్భంగా తుషార్ మెహతా స్పందిస్తూ.. ఒక నిర్ధిష్టమైన సాఫ్ట్వేర్ను ప్రభుత్వం ఉపయోగిస్తోందా? లేదా? అనేది ప్రజల్లో చర్చ జరగాల్పినన అంశం కాదని అన్నారు. పెగాసస్ను కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన అంశంగా పరిగణిస్తోందని, ఇందులో దాచడానికి ఏమీ లేదని తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. జాతి భద్రతకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని తాము ఆశించడం లేదని ధర్మాసనం పేర్కొంది. దేశ పౌరులపై నిఘా పెట్టడానికి పెగాసస్ స్పైవేర్ను కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఉపయోగించిందా? లేదా? అనేది మాత్రమే తాము తెలుసుకోవాలని కోరుకుంటున్నామని సొలిసిటర్ జనరల్కు తెలిపింది. అసలు విషయం ఏమిటో సూటిగా చెప్పకుండా డొంకతిరుగుడు వైఖరి అవలంబించడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. చట్టం నిర్దేశించిన ప్రక్రియ మేరకే స్నూపింగ్ సమగ్ర అఫిటవిట్ దాఖలు చేస్తే పెగాసస్పై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తమకు తెలుస్తుందని కోర్టు వివరించింది. తమ గోప్యతకు(ప్రైవసీ) భంగం కలిగేలా కేంద్రం పెగాసస్ స్పైవేర్ను ఉపయోగిస్తోందని, ఫోన్లపై నిఘా పెట్టిందని జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు ఇతరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఉద్ఘాటించింది. ‘‘చట్ట ప్రకారం ఒక ప్రక్రియ ఉంటుంది. దేశ భద్రత దృష్ట్యా అనుమానితులపై నిఘా పెట్టడానికి చట్టం కూడా అనుమతిస్తుంది’ అని పేర్కొంది. ఒకవేళ స్పైవేర్ను ప్రభుత్వం ఉపయోగిస్తున్నట్లయితే చట్టం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారమే అది జరగాల్సి ఉంటుందని సూచించింది. చట్టం అనుమతించిన ప్రక్రియ కాకుండా ఇంకేదైనా ప్రక్రియను ప్రభుత్వం ఉపయోగిస్తోందా? అనేది తెలుసుకోవాలని పిటిషనర్లు ఆశిస్తున్నారని ధర్మాసనం గుర్తుచేసింది. వాస్తవాలు చెప్పడం ప్రభుత్వం విధి: సిబల్ పిటిషనర్లు ఎన్.రామ్, శశి కుమార్ తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అఫిడవిట్ దాఖలు చేయబోమని కేంద్రం తేల్చిచెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దేశ ప్రజలకు వాస్తవాలను వెల్లడించడం ప్రభుత్వం విధి అని అన్నారు. స్పైవేర్ను ఉపయోగించే విషయంలో చట్టబద్ధమైన ప్రక్రియను ప్రభుత్వం పాటించలేదని మరో సారి తేలిపోయిందని చెప్పారు. మరో పిటిషనర్ తరపున సీనియర్ అడ్వొకేట్ శ్యామ్ దివాన్ వాదిస్తూ... స్పైవేర్తో పౌరుల ఫోన్లపై నిఘా పెట్టడం ప్రజాస్వామ్యంపై ముమ్మాటికీ దాడేనని అన్నారు. విశ్వసనీయమైన దర్యాప్తు జరిపించాలని కోరారు. చట్టం అనుమతించదు ఫలానా సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నాం, ఫలానా సాఫ్ట్వేర్ను ఉపయోగించడం లేదు అని బయటకు చెబితే ఉగ్రవాద శక్తులు దాన్నొక అవకాశంగా మార్చుకొనే ప్రమాదం ఉందని సొలిసిటర్ జనరల్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సాఫ్ట్వేర్కు కౌంటర్–సాఫ్ట్వేర్ ఉంటుందన్నారు. కొన్ని కేసుల్లో ఇలాంటి వాటిని బహిర్గతం చేయడానికి టెలిగ్రాఫ్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం అనుమతించవని వివరించారు. పెగాసస్పై ఏర్పాటు చేయబోయే కమిటీలో ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఉండబోరని, ఐటీ రంగానికి చెందిన నిపుణులే ఉంటారని తెలిపారు. నివేదిక తమకు అందిన తర్వాత బహిర్గతం చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని తుషార్ మెహతా బదులిచ్చారు. దేశ భద్రత నేపథ్యంలో ఇలాంటివి ప్రజల్లోకి రాకపోవడమే మంచిదని అన్నారు. -
యువత నడతపైనే దేశ భవిష్యత్తు
సాక్షి, హైదరాబాద్: యువత నడతపైనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ‘భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ అభివృద్ధికి ప్రధాన కారణం యువశక్తి. దేశంలోని జనాభాలో 45 శాతం మంది యువజనులే ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇంత యువశక్తి లేదు. స్వామి వివేకానంద చెప్పినట్లు మన దేశ గతాన్ని, భవిష్యత్తును అనుసంధానం చేయగల శక్తి యువతదే’అని ఆయన అన్నారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ (వీఐహెచ్ఈ) 22వ వార్షిక వేడుకల్లో ప్రధాన న్యాయమూర్తి జూమ్ యాప్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. స్వామి వివేకానంద ఆలోచనలను యువత అనుసరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యువత తమ లక్ష్యసాధనకోసం తలపెట్టిన ఆలోచనలను సరైన విధంగా ఆచరణలో పెట్టాలన్నారు. లక్ష్యసాధనలో పట్టుదల, నిరంతర సాధన ఉంటేనే విజయం సాధ్యమవుతుందన్నారు. ‘ప్రస్తుతం మన దేశంలోని యువజనుల ఆలోచనలు నిస్వార్థంగా, సమాజహితం కోసం ప్రయత్నించే విధంగా ఉన్నాయి. వీటికి మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ సమాజంలో జరిగే సంఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తప్పు, ఒప్పుల మధ్య తేడాలను గుర్తించగలిగినప్పుడే ఎదుగుదల సరైన విధంగా ఉంటుంది. హక్కులు, చట్టాలపట్ల యువత సరైన అవగాహన అలవర్చుకోవాలి, వీటిపై సరైన పట్టు సాధించినప్పుడే సమాజానికి మరింత సేవ చేయడానికి వీలుంటుంది. దేశంలో మార్పులు తీసుకురావాలన్నా.. శాంతిని స్థాపించాలన్నా.. దేశ పురోగతి వేగాన్ని పెంచాలన్నా యువశక్తి ఆచరణే కీలకం. నా సర్వీసులో ఎంతోమంది విజయం సాధించిన యువ అడ్వొకేట్లను చూశా. వృత్తిలోకి వచ్చినప్పుడే సరైన లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. విజయం సాధిస్తున్నారు. ప్రస్తుతం యువత ముందు ఎన్నో రకాల సవాళ్లున్నాయి. తమకున్న నైపుణ్యాన్ని సరైన విధంగా ఆచరణలో పెట్టాలి. సమస్యలు లేని మార్గంలో వెళ్లడమంటే సరైన దారి కాదనే అంశాన్ని కూడా గుర్తించాలి’అని జస్టిస్ రమణ యువతకు దిశానిర్దేశం చేశారు. -
ఇది చరిత్రాత్మక ఘట్టం: చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
ఈ కేంద్రం ఏర్పాటు నా చిరకాల స్వప్నం.. ఇంత త్వరగా సాకారమవుతుందనుకోలేదు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో ఈ కేంద్రం ఏర్పాటు శుభపరిణామం ఇకపై వాణిజ్య వివాదాలు సత్వరం పరిష్కారం అవుతాయి హైదరాబాద్కు భారీగా పెట్టుబడులు వస్తాయి సాక్షి, హైదరాబాద్: ‘‘అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ ఓ చరిత్రాత్మక ఘట్టం. ఈ కేంద్రం దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం శుభపరిణామం’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి నివాసంలో శుక్రవారం జరిగిన అంత ర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్ట్డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘‘అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం నా చిరకాల స్వప్నం. ఆ స్వప్నం ఇంత త్వరగా సాకారమవుతుందని అనుకోలేదు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జూన్లో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు నా ప్రతిపాదన తెలియజేశా. ఆయన వెంటనే స్పందించారు. మూడు నెలల్లోపే నా స్వప్నం సాకారం చేసేందుకు అడుగులు పడ్డాయి. ఇందుకు సీఎం కేసీఆర్, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ట్రస్ట్డీడ్పై జస్టిస్ రమణ, ట్రస్ట్ లైఫ్ మెంబర్లు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు సీజే జస్టిస్ హిమాకోహ్లి, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, హైకోరు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సంతకాలు చేశారు. వివాదం లేని వాతావరణం... ‘‘పెట్టుబడిదారులు వివాదాలకు ఆస్కారం లేని వాతావరణాన్ని కోరుకుంటారు. ఏదైనా వివాదం వచ్చినా సత్వరం పరిష్కరించుకోవాలని అనుకుంటారు. ప్రస్తుతం దేశంలో అలాంటి వాతావరణం లేదు. వివాదాల పరిష్కారానికి ఎన్నేళ్ల సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. 2015లో కేంద్ర ప్రభుత్వం ఓ ప్రతినిధి బృందాన్ని పెట్టుబడులు ఆహ్వానించేందుకు జపాన్, కొరియాకు పంపింది. ఆ బృందంలో నేనూ ఒకర్ని. ఆయా దేశాల్లో విస్తృతంగా పర్యటించి 8 ప్రదేశాల్లో పెట్టుబడిదారులతో చర్చలు జరిపాం. మీ దేశంలో వివాదాల పరిష్కారానికి ఎంత సమయం పడుతుందని వారు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇబ్బందిపడ్డాం. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుతో వాణిజ్య వివాదాలు సత్వరం పరిష్కారమవుతాయి. దీంతో అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు ఇందులో భాగస్వాములుగా ఉంటారు. ఈ కేంద్రాన్ని ప్రోత్సహించండి. తద్వారా హైదరాబాద్కు భారీగా పెట్టుబడులు వస్తాయి’’ అని జస్టిస్ రమణ పేర్కొన్నారు. సంస్కరణలకు పీవీ బీజం వేశారు... ‘‘దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బీజం వేశారు. అంతర్జాతీయ పెట్టుబడులకు ఆయన ప్రయత్నించగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వివాదాల పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి ఉందని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ చట్టానికి రూపకల్పన జరిగింది. 1996లో ఆర్టిట్రేషన్ కన్సీలియేషన్ చట్టం అమల్లోకి వచ్చింది. 1926లో పారిస్లో మొదటి ఆర్బిట్రేషన్ కేంద్రం ప్రారంభమైంది. ఇటీవల దుబాయ్లో కూడా ఓ కేంద్రం ప్రారంభమైంది. షామీర్పేటలోని నేషనల్ లా యూనివర్శిటీ (నల్సార్) సమీపంలో 2003లో 10 ఎకరాల భూమి, రూ. 25 కోట్లను ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు కోసం కేటాయించారు. అనివార్య కారణాల వల్ల ఆ ప్రతివాదన ముందుకు వెళ్లలేదు. ఆ భూమి ఇప్పటికీ హైకోర్టు అధీనంలో ఉంది. దాన్ని వెనక్కు తీసుకొని ఫైనాన్స్ డిస్ట్రిక్ సమీపంలో ఇవ్వాలని కోరుతున్నాం. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి భూమి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్కు సూచిస్తున్నా. త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే భవనంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు వస్తాయి... ఈ కేంద్రం ఏర్పాటుతో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, జస్టిస్ ఆర్. సుభాష్రెడ్డి పేర్కొన్నారు. ఈ కేంద్రంలో న్యాయవ్యవస్థ నుంచే కాకుండా వివిధ రంగాల్లోని నిపుణులైన ఆర్బిట్రేటర్స్ ఉంటారని, ఈ కేంద్రం రాష్ట్రానికే కాకుండా దేశానికే మంచిపేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ సంయుక్తంగా ప్రయత్నించి ఈ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో తెలుగువారైన ముగ్గురు న్యాయమూర్తులు కొలుగుదీరిన వేళ దేశంలోనే ఈ కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటు చేయడం అదృష్టమని, రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా త్వరలోనే ఈ కేంద్రాన్ని ప్రారంభించుకుంటామని, ఈ సెంటర్ ఫలవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తులు జస్టిస్ జగన్నాథరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తులు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం తొమ్మిది మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, బార్ నుంచి ఒకరు ఉన్నారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీటీ రవికుమార్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేశ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బేలా త్రివేది, బార్ నుంచి సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిలో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బీవీ నాగరత్న, సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన కొలీజియం మంగళవారం సమావేశమైంది. కొలీజియం చేసిన సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ సిఫార్సులను బుధవారం రాత్రి అధికారికంగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపర్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి 21 నెలల తర్వాత కొలీజియం సమావేశమైంది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 25 మంది ఉన్నారు. బుధవారం జస్టిస్ నవీన్ సిన్హా పదవీ విరమణ చేయడంతో ఖాళీల సంఖ్య 10కి చేరింది. కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదిస్తే న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుతుంది. మొదటిసారి ముగ్గురు మహిళలు ఒకేసారి ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందుతుండడం ఇదే తొలిసారి. వీరి నియామకం తర్వాత సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య నాలుగుకు చేరనుంది. ప్రస్తుతం జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒక్కరే ఉన్నారు. 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా కేవలం ఎనిమిది మంది మాత్రమే మహిళా న్యాయమూర్తులు నియమితులయ్యారు. 1989లో ఫాతిమా బీవీ సుప్రీంకోర్టులో నియమితురాలైన తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కారు. కాబోయే తొలి మహిళా సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) తొలిసారిగా ఒక మహిళా న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న 2027లో సీజేఐ కానున్నారు. ఆమె 1987లో బెంగళూరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కాన్స్టిట్యూషనల్ లా, కమర్షియల్ లా, బీమా, సేవలు, కుటుంబ చట్టాలు, ఆర్బిట్రేషన్లకు సంబంధించి కేసుల్లో మంచి పేరు సంపాదించారు. కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2008 ఫిబ్రవరి 18న నియమితులైన జస్టిస్ బీవీ నాగరత్న 2010 ఫిబ్రవరి 17న న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1989లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎనగలగుప్పే వెంకటరామయ్య కుమార్తె జస్టిస్ బీవీ నాగరత్న. ‘‘ఏదైనా బ్రాడ్కాస్టింగ్ చానల్ నిజాయితీగా వార్తలు ప్రసారం చేయాలని భావించినప్పుడు ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్లతో సంచలనాలను నిలిపివేయాలి’’ అని 2012లో ఓ కేసు విషయంలో జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. బార్ నుంచి తొమ్మిదో న్యాయవాది కొలీజియం సిఫార్సు చేసిన సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ బార్ నుంచి న్యాయమూర్తి అవుతున్న తొమ్మిదో వారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన జస్టిస్ లావు నాగేశ్వరరావు కూడా బార్ నుంచి నియమితులైన వారే. కృష్ణా జిల్లా గణపవరానికి చెందిన ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కోదండరామయ్య కుమారుడు పీఎస్ నరసింహ. ఆయన హైదరాబాద్లో పుట్టి పెరిగారు. విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేశారు. యూపీఏ–2 ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులైన ఆయన పదవీ కాలం పూర్తికాక ముందే రాజీనామా చేశారు. అయోధ్య కేసులో రాంలల్లా విరాజ్మాన్కు ప్రాతినిధ్యం వహిస్తూ మహంత్ రామచంద్రదాస్ తరఫున పీఎస్ నరసింహ వాదనలు వినిపించారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడిగా సేవలందిస్తున్నారు. బీసీసీఐ కార్యకలాపాల్లో భారీ మార్పులకు అమికస్ క్యూరీగా సేవలందించారు. బార్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి న్యాయవాది జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ కూడా 13వ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్ కూడా 2014లో బార్ నుంచి సుప్రీం కోర్టు న్యాయయూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ లావు నాగేశ్వరరావు కూడా బార్ నుంచి నియమితులైన వారే. నాలుగో తరం న్యాయవాది తమ పూర్వీకుల పరంపరను కొనసాగిస్తూ నాలుగో తరంలో న్యాయవాది వృత్తి చేపట్టారు జస్టిస్ విక్రమ్నాథ్. గుజరాత్లోని కౌశంబి జిల్లాకు చెందిన ఆయన అలహాబాద్ హైకోర్టులో 17 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2004లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 సెప్టెంబరు 10న గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గతంలో ఒకసారి సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఆన్లైన్ ద్వారా కోర్టు కార్యకలాపాలు చేపట్టి లైవ్ స్ట్రీమ్కు జస్టిస్ విక్రమ్ నాథ్ నాంది పలికారు. జస్టిస్ హిమా కోహ్లి ప్రస్థానం జస్టిస్ హిమా కోహ్లి 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. 1984లో ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యురాలయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 1999 నుంచి 2004 వరకూ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ న్యాయవాదిగా పనిచేశారు. ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి సహా పలు విభాగాలకు న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయ సేవల కమిటీలో పనిచేశారు. 2006 మే 29న ఢిల్లీ అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ హిమా కోహ్లి 2007 ఆగస్టు 29న న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2021 జనవరి 7న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పోందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైతే 2024 సెప్టెంబర్ వరకు సేవలు అందించనున్నారు. -
Pegasus: ఆగస్టు మొదటివారంలో విచారిస్తాం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ వ్యవహారంపై దాఖలు చేసిన పిల్ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పెగాసస్ కుంభకోణంపై కోర్టు పర్యవేక్షణలోని సిట్ దర్యాప్తు కోరుతూ ప్రముఖ జర్నలిస్టులు ఎన్ రామ్, శశి కుమార్ ఇతరులు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపైన ఆగస్టు మొదటి వారంలో విచారణ చేపడతామని ప్రకటించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ దీనిపై విచారణ జరుపుతుంది. జాతీయ భద్రతపై పెగాసెస్ పర్యవసానాల కారణంగా దీనిపై విచారణ అత్యవసరం అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్ తెలిపారు. పౌర స్వేచ్ఛపై పెగాసస్ తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెగాసస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం విపక్ష నాయకులు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థలోని ప్రముఖుల ఫోన్ ట్యాప్ చేశారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఇది భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రకంపనలు సృష్టించిందని సిబాల్ తెలిపారు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై "వచ్చే వారం వింటాం" అని సీజేఐ రమణ స్పందించారు. ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ను ఉపయోగించి దేశంలోని ప్రముఖ పౌరులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ చేశారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జి ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని రామ్, ఇతరులు డిమాండ్ చేశారు. ఇక పార్లమెంట్లో పెగాసస్పై రచ్చ జరుగుతుంది. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ.. దీనిపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు అధికారపక్షంపై ఒత్తిడి తెస్తున్నాయి. కీలక నేతల ఫోన్ సంభాషణలను పెగాసస్ ద్వారా హ్యాక్ చేశారని, వ్యక్తగత భద్రతకు స్వేచ్ఛ లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. పెగాసస్, వ్యవసాయ చట్టాల వ్యవహారంతో ఇప్పటికే సభ అనేకసార్లు వాయిదా పడింది. -
దంపతులను కలిపిన సుప్రీంకోర్టు సీజే
సాక్షి, న్యూఢిల్లీ : రెండు దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్న దంపతులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనలతో తిరిగి కలిసి కాపురం చేయనున్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ఈ సందర్భంగా దంపతులిద్దరితో ధర్మాసనం మాట్లాడే సమయంలో ఆంగ్లంలో మాట్లాడడానికి మహిళ ఇబ్బంది పడటం గమనించిన జస్టిస్ ఎన్వీ రమణ.. ఆమెను తెలుగులో మాట్లాడాలని సూచించారు. ‘మీ భర్త జైలుకు వెళ్లడం వల్ల ఉద్యోగం, వేతనం కోల్పోతారు. అదే సమయంలో నెలానెలా వచ్చే భరణం మీరు కోల్పోతారు’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. సీజేఐ సూచన అనంతరం భర్తతో కలిసి ఉండడానికి ఆ మహిళ అంగీకరించారు. అనంతరం, భార్యభర్తలు ఇద్దరూ వేర్వేరుగా తామిద్దరూ కలిసి ఉంటామంటూ రెండు వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఈ దంపతులకు 1998లో వివాహం అయింది. 2001లో వేధింపులకు సంబంధించి భర్తపై క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు 2002లో మహిళ భర్తకు 498 (ఏ) వరకట్న వేధింపులు ప్రకారం జైలు, జరిమానా విధించింది. మహిళ అత్త, మరదలకు కూడా అదే శిక్ష విధించింది. భర్త రివిజన్కు వెళ్లగా కోర్టు ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించింది. అనంతరం హైకోర్టుకు వెళ్లగా జైలు శిక్షను మినహాయిస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ ఆమె తన భర్తకు జైలు శిక్ష వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
సెక్షన్ 124ఏ అవసరమా..?
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహం చట్టాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తుండటాన్ని, చాలా సందర్భాల్లో దీనిని దుర్వినియోగపర్చడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మహాత్మాగాంధీ, గోఖలే వంటి స్వాతంత్య్ర సమరయోధుల గొంతు నొక్కేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశద్రోహం చట్టాన్ని ఉపయోగించిందని గుర్తు చేసింది. దీనికి సంబంధించిన ఐపీసీలోని 124ఏ సెక్షన్ను ఇంకా ఎందుకు రద్దు చేయలేదని, ఈ సెక్షన్ ప్రస్తుత కాలంలో అవసరమా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ సెక్షన్ రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ చేస్తామని స్పష్టం చేసింది. సెక్షన్ 124ఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, విశ్రాంత సైనికాధికారి మేజర్ జనరల్ ఎన్జీ వోంబట్కెరే దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్రాయ్ల ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. విచారణ సమయంలో ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ఈ దేశద్రోహం చట్టం బ్రిటిష్ వారి నుంచి వలస తెచ్చుకున్న చట్టంగా అభివర్ణించింది. ప్రభుత్వాలపై విద్వేషం పెరిగేలా చేసే ప్రసంగాలు లేదా భావ ప్రకటనలను బెయిల్కు వీల్లేని నేరంగా పరిగణిస్తూ, ఈ సెక్షన్ కింద జీవితకాల జైలుశిక్ష విధించే అవకాశముంది. ‘ఈ చట్టం వలసరాజ్యం నాటి చట్టం. స్వేచ్ఛను అణచివేయడానికి, గాంధీ, తిలక్ వంటి వారి గొంతు నొక్కేందుకు ఈ చట్టాన్ని బ్రిటిష్వారు ప్రయోగించే వారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఈ చట్టం అవసరమా?’ అని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ తరహా కేసులు సుప్రీంకోర్టులో వేర్వేరు ధర్మాసనాల వద్ద పెండింగ్లో ఉన్న విషయాన్ని కేకే వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎడిటర్స్ గిల్డ్ తరఫు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ.. 124ఏ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో పిటిషన్లో వివరించామన్నారు. ఈ సెక్షన్ను దుర్వినియోగం చేసిన కేసులే ఎక్కువని, కొయ్య మలచడానికి వడ్రంగికి రంపం ఇస్తే మొత్తం అడవినే నరికినట్లుగా ఉందంటూ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ రద్దు చేసినప్పటికీ ఇప్పటికీ కేసులు నమోదు చేస్తున్న అంశాన్ని సీజేఐ ఉదహరించారు. చట్టం దుర్వినియోగం అవడంతో పాటు కార్యనిర్వాహక వ్యవస్థకు జవాబుదారీతనం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఈ తరహా ఇతర కేసులు కూడా పరిశీలిస్తామన్న సీజేఐ.. అన్ని కేసులను ఒకే చోట విచారిస్తామన్నారు. కాలం చెల్లిన చట్టాలను చాలా వరకూ రద్దు చేస్తున్న కేంద్రం ఈ విషయాన్ని ఎందుకు పరిశీలించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సెక్షన్ను కొట్టివేయాల్సిన అవసరం లేదని, చట్టపరమైన ప్రయోజనాల నిమిత్తం మార్గదర్శకాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. పిటిషనర్ ఆర్మీ మేజర్ జనరల్గా పనిచేశారని, ఆయన దేశం కోసం త్యాగం చేశారని, ఈ పిటిషన్ను ప్రేరేపిత పిటిషన్గా భావించలేమని ధర్మాసనం పేర్కొంది. ‘సెక్షన్ 124ఏ ను పేకాట ఆడేవారిపైనా ప్రయోగిస్తున్నారు. ప్రత్యర్థుల అణచివేతకు రాజకీయ నేతలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రత్యర్థులపై సెక్షన్ 124ఏ ప్రయోగించేలా ఫ్యాక్షనిస్టులు ప్రవర్తిస్తున్నారు. బెయిల్ రానివ్వకుండా ఈ సెక్షన్తో బెదిరిస్తున్నారు’ అని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. సెక్షన్ 124ఏ రద్దుపై వైఖరి తెలపాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. విపక్ష నేతల హర్షం దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను పలువురు విపక్ష నేతలు, పౌర సమాజ కార్యకర్తలు స్వాగతించారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఒకవైపు, ఈ చట్టం దుర్వినియోగమవుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు బుధవారం హరియాణాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న 100 మంది రైతులపై దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. -
పూరీలో మాత్రమే జగన్నాథ రథయాత్ర
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్రను ఒడిశాలోని పూరీలో మినహా రాష్ట్రాంలోని మిగిలిన ప్రాంతాల్లో చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. కరోనా విజృంభణతో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఈ సందర్భంలో అనుమతులివ్వలేమని తెలిపింది. పూరీ మినహా ఇతరప్రాంతాల్లో రథయాత్రలను అనుమతించేది లేదని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని హైకోర్టు సమర్ధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ‘నాకూ జగన్నాథ రథయాత్రను చూసేందుకు పూరీ వెళ్లాలనే ఉంది. కానీ మనమేమీ నిపుణులం కాము. ఈ విషయంలో ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఛాన్సు తీసుకోలేము. కావాలంటే యాత్రను టీవీలో చూడొచ్చు. వచ్చే దఫా భగవంతుడు అనుగ్రహిస్తాడని నమ్ముతున్నాం’అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఈనెల 12న పూరీ సహా పలు ప్రాంతాల్లో వార్షిక రథయాత్ర జరగాల్సి ఉంది. -
Photo Feature: సోనూ సూద్ ఇంటికి జనం తాకిడి
హైదరాబాద్లో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. లాక్డౌన్ హీరో సోనూ సూద్ ఇంటికి రోజురోజుకు జనం తాకిడి పెరుగుతోంది. తనకు తోచిన సాయం చేస్తూ సోనూ సూద్ సేవలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లో లాక్డౌన్ కష్టాలు కొనసాగుతున్నాయి. -
శ్రీవారి సేవలో సీజేఐ ఎన్వీ రమణ
తిరుమల/చంద్రగిరి/రేణిగుంట: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని, అనంతరం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం సతీసమేతంగా తిరుమల ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సీజేకు పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం సీజే ఎన్వీ రమణ వేంకటేశ్వర భక్తి చానల్తో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నట్టు చెప్పారు. న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తానన్నారు. అనంతరం బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం సీజే దంపతులు తిరుమల నుంచి తిరుచానూరుకు చేరుకుని శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్వాగతం పలికారు. ‘ఏం భాస్కర్.. బాగున్నావా? బాగా పనిచేస్తున్నావ్.. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టిన ఆనందయ్య ఆయుర్వేద ఔషధం తయారీ అభినందనీయం. నువ్వు పంపిణీ చేసిన ఔషధం నాకూ అందిందయ్యా.. నువ్వు ఇలాగే ప్రజా క్షేమం కోసం మంచి కార్యక్రమాలు తలపెట్టాలి’ అంటూ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డిని సీజే అభినందించారు. మరోసారి తిరుపతికి వచ్చినప్పుడు తుమ్మలగుంట శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడంతో పాటు వేద పాఠశాల, పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శిస్తానని చెవిరెడ్డితో చెప్పారు. ఈ మేరకు మరోసారి పర్యటనలో తుమ్మలగుంట కార్యక్రమాన్ని పొందుపరచాలని జిల్లా జడ్జిని ఆదేశించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సీజే ఎన్వీ రమణను కలిసిన పలువురు శ్రీవారి దర్శనానికి వచ్చిన సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణను పలువురు కలిశారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ వినతిపత్రం ఇచ్చారు. అలాగే శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు రమణదీక్షితులు కలిసి సుప్రీంకోర్టు సీజేగా నియమితులైనందుకు శుభాకాంక్షలు చెప్పారు. ఇదిలా ఉండగా సీజే ఎన్వీ రమణ తన స్నేహితుడు, శ్రీవారి ఆలయ ప్రత్యేకాధికారి డాలర్ శేషాద్రిని కలిశారు. ఆ తర్వాత ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలితకుమారి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తదితరులు ఆయనకు వీడ్కోలు పలికారు. హైదరాబాద్కు సుప్రీం చీఫ్ జస్టిస్ సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక శుక్రవారం హైదరాబాద్కు వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కె.చంద్రశేఖర్రావులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి శుక్రవారం వచ్చిన ఆయన నేరుగా రాజ్భవన్కు చేరుకున్నారు. శని, ఆదివారాలు సెలవులు రావడంతో రాజ్భవన్ అతిథి గృహంలో సీజేఐ బస చేయనున్నారు. -
తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు సీజే
సాక్షి, తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ తొలిసారి తిరుమలకు వచ్చారు. గురువారం సాయంత్రం తిరుమలలో జస్టిస్ ఎన్వీ రమణకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన, ఈవో జవహర్రెడ్డి, ధర్మారెడ్డి స్వాగతం పలికారు. కాసేపట్లో శ్రీవారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు. ఆయన రాక సందర్భంగా తిరుమలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. -
హైకోర్టు జడ్జిలకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం హైకోర్టు జడ్జిలకు లేఖ రాశారు. హైకోర్టు జడ్జి పోస్టుల భర్తీలో సుప్రీంకోర్టు ప్రాక్టీసింగ్ లాయర్లను.. పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరారు. సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న లాయర్ల అనుభవాన్ని, నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చీఫ్ జస్టిస్ రమణ.. హైకోర్టు జడ్జిలకు రాసిన లేఖలో కోరారు. హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సీజేఐకి ఇటీవల రాసిన లేఖను అనుసరించి ఈ చర్య తీసుకున్నట్లు ఎస్సీబీఏ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. ‘‘ఎస్సీబీఏ చేసిన అభ్యర్థనను సీజేఐ అంగీకరించారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులను తమ హైకోర్టులకు ఎలివేషన్ కోసం పరిగణించాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను అభ్యర్థించింది" అని సింగ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. చదవండి: సుప్రీం తీర్పుల్లో వెలుగు నీడలు! -
హైకోర్టు సీజేలతో సీజేఐ జస్టిస్ రమణ సమీక్ష సమావేశం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా కోర్టుల పనితీరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సమీక్షించారు. హైకోర్టుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఆయన ఆరా తీశారు. హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సమీక్షా సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారికావడం గమనార్హం. కోర్టుల్లో పోస్టుల భర్తీని వేగవంతం చేయాల్సి ఉందని జూన్ 1, 2 తేదీల్లో జరిగిన ఈ వర్చువల్ సమావేశాల్లో ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో న్యాయం అందించడంలో జరుగుతున్న జా ప్యానికి మౌలిక వసతుల లేమి, డిజిటల్ డివైడ్లు ప్రధాన కారణమన్నారు. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయంతో ఆధునిక కోర్టు కాంప్లెక్స్ల నిర్మాణానికి ‘నేషనల్ జ్యూడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్’ను ఏర్పాటు చేయాలని జస్టిస్ రమణ సూచించారు. ప్రస్తుతం 25 హైకోర్టుల్లో 1,080 మందికి గానూ 660 మంది జడ్జీలే ఉన్నారని న్యాయ శాఖ తెలిపింది. -
సుప్రీం విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని పరిశీలిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో జరిగే విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ముందుగా, సుప్రీంకోర్టులోని ఇతర జడ్జీల అభిప్రాయాన్ని తెలుసుకుంటానన్నారు. సుప్రీంకోర్టు వర్చువల్ హియరింగ్స్కు హాజరు కావడానికి జర్నలిస్టులకు మొబైల్ యాప్లో లింకులు అందించడం ద్వారా సేవలు అందించే ప్రక్రియను జస్టిస్ ఎన్వీ రమణ గురువారమిక్కడ ప్రారంభించారు. కోర్టు వార్తలు కవర్ చేయడానికి న్యాయవాదులపై మీడియా ఆధారపడి ఉందని తెలిసిందని, ఈ నేపథ్యంలో మీడియా విచారణలకు హాజరు కావడానికి ఓ యంత్రాంగం రూపొందించాలని అభ్యర్థన వచ్చిందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. రిపోర్టింగ్ సమయంలో మీడియా అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, జర్నలిస్టుగా తాను కూడా కొంతకాలం పనిచేశానని, ఆ సమయంలో కార్లు, బైకులు లేవని ఆయన గుర్తు చేసుకున్నారు. వార్తలు సేకరించే క్రమంలో బస్సుల్లో ప్రయాణిస్తూ జర్నలిస్టుగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. సుప్రీంకోర్టు, మీడియాకు మధ్య ఓ సీనియర్ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా రూపొందించిన మొబైల్ యాప్తో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వవచ్చన్నారు. సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్తోపాటు మొబైల్ అప్లికేషన్లో ‘ఇండికేటివ్ నోట్స్’అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు. దీని ద్వారా చారిత్రక తీర్పుల సారాంశాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. 106 మంది హైకోర్టు జడ్జీలకు కరోనా దేశవ్యాప్తంగా 106 మంది హైకోర్టు జడ్జీలు కరోనా బారిన పడ్డారని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. రెండు ప్రధాన హైకోర్టులు మినహా సమాచారం మేరకు 2,768 మంది జ్యుడిషియల్ అధికారులకు కరోనా సోకిందన్నారు. ముగ్గురు హైకోర్టు జడ్జీలు, 34 మంది జ్యుడిషియల్ అధికారులు ఈమహమ్మారికి బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 800 మంది రిజిస్ట్రీ సిబ్బంది కరోనా బారినపడగా వీరిలో సుప్రీంకోర్టులో ఆరుగురు రిజిస్ట్రార్లు, 10మంది అదనపు రిజిస్ట్రార్లు ఉన్నారన్నారు. కార్యక్రమంలో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ హేమంత్ గుప్తా పాల్గొన్నారు. -
48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నియమితులయ్యారు. ఈ నెల 24న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈమేరకు ఆయన నియామకాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించడంతో న్యాయ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ రమణ ఈ పదవిని చేపట్టనున్న తెలుగువారిలో రెండో వ్యక్తి. అంతకుముందు రాజమహేంద్ర వరానికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు సుప్రీం కోర్టు 9వ ప్రధాన న్యాయమూర్తిగా (1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు) సేవలందించారు. పదవిలో కొనసాగుతుండగానే రాజీనామా చేసిన ఆయన ప్రతిపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి జాకీర్ హుస్సేన్ చేతిలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగువారైన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డిలు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న విషయం విదితమే. రైతు కుటుంబం నుంచి..: వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన జస్టిస్ ఎన్వీ రమణ స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరం. ఆయన 1983 ఫిబ్రవరి 10న బార్ కౌన్సిల్లో చేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్లు, సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేశారు. అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునళ్లలోనూ ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ కౌన్సిల్గా, రైల్వేలకు అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 17 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. 2019 మార్చి 7 నుంచి అదే ఏడాది నవంబర్ 26 వరకు సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా ఉన్నారు. 2019 నవంబర్ 27 నుంచి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000 జూన్ 27న నియమితులయ్యారు. 10.3.2013 నుంచి 20.5.2013 వరకు ఉమ్మడి హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా కూడా పనిచేశారు. జస్టిస్ రమణ వెలువరించిన తీర్పుల్లో కొన్ని... ►అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జమ్మూ కశ్మీర్లో ఏడాదిపాటు ఇంటర్నెట్ నిషేధానికి ముగింపు. ►సుప్రీంకోర్టు వర్సెస్ సుభాష్ చంద్ర అగర్వాల్ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవడం. ►శివసేన వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో బలపరీక్ష అంశంలో నైతికతను పునరుజ్జీవింపచేయడం. సత్వర న్యాయం లక్ష్యం: నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) కార్యనిర్వాహక చైర్మన్గా ఉన్న జస్టిస్ రమణ సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు ప్రారంభించినట్లు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. జస్టిస్ రమణ సారథ్యంలో న్యాయసేవల అథారిటీ సేవలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించినట్లు తెలిపింది. కరోనా సమయంలో 2,878 గృహ హింస కేసులకు సంబంధించి న్యాయ సాయం, 60 లక్షల మంది వలస కార్మికులు, 36,435 మంది ఒంటరి వ్యక్తులు, 1,04,084 మంది సీనియర్ సిటిజన్లకు సేవలు అందించినట్లు తెలిపింది. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఈ–లోక్ అదాలత్లో 4.11 లక్షల కేసులను పరిష్కరించినట్లు తెలిపింది. 2,06,190 మంది ఖైదీలు లీగల్ సర్వీస్ క్లినిక్ల ద్వారా సేవలు పొందారు. జాతీయ, రాష్ట్రస్థాయి అదాలత్లు నిర్వహించి 48 లక్షల కేసులు పరిష్కరించినట్లు తెలిపింది. జాతీయ మహిళా కమిషన్తో కలసి నల్సా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపింది. -
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వీ రమణ
-
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వీ రమణ
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్గా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తన తర్వాత ఆ స్థానంలో జస్టిస్ ఎన్వీ రమణను నియమించాల్సిందిగా కోరుతూ... ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే... ప్రతిపాదన పంపగా, రాష్ట్రపతి ఆమోదించారు. ఏప్రిల్ 24, 2021న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 26, 2022 వరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వీ రమణ బాధ్యతలు నిర్వహిస్తారు. కృష్ణా జిల్లా పొన్నవరంలో ఆగస్టు 27, 1957న జస్టిస్ ఎన్వీ రమణ జన్మించారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ట్రైబ్యునళ్లు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, ఎన్నికల అంశాల్లో కేసులు వాదించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార కేసులు, క్రిమినల్ కేసుల్లో నిపుణుడిగా పేరు పొందారు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ కౌన్సిల్గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్, క్యాట్, హైదరాబాద్లో రైల్వే స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదనపు అడ్వొకేట్ జనరల్గా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా జూన్ 27, 2000 నుంచి సెప్టెంబరు 1, 2013 వరకు కొనసాగిన జస్టిస్ రమణ కొంతకాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సెప్టెంబరు 2, 2013 నుంచి ఫిబ్రవరి 16, 2014 వరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఫిబ్రవరి 17, 2014న పదోన్నతితో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బాబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) కార్యనిర్వాహక ఛైర్మన్గా ఉన్నారు. చదవండి: అద్భుతం సృష్టించిన భారతీయ రైల్వే దేశ్ముఖ్ వ్యవహారం: సీఎం నోరు విప్పడం లేదేంటి? -
సుప్రీం కొలీజియం భేటీ
న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన సుప్రీంకోర్టు కొలీజియం భేటీ అయ్యింది. సుప్రీంకోర్టులో త్వరలో ఖాళీ అయ్యే న్యాయమూర్తుల స్థానంలో ఎంపిక చేయాల్సిన హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను పరిశీలించింది. ఇందులో మూడు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతోపాటు ఇద్దరు హైకోర్టు జడ్జీల పేర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ పేర్లను కేంద్రం పరిశీలన నిమిత్తం పంపాల్సి ఉంది. అయితే, ఈ భేటీలో పేర్ల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏప్రిల్లో జరిగే తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 2019 నవంబర్ 18వ తేదీన సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే వచ్చే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు తన స్థానంలోకి ఎవరినీ ప్రతిపాదించలేదు. కొలీజియంలో సీజేఐతోపాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఉన్నారు. -
బ్యాంకు ఉద్యోగులకు బదిలీ శిక్ష!
త్వరలో రిటైరయ్యే వారిపై నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ సమయంలో బదిలీ వేటు! మహిళలని కూడా చూడకుండా ఉన్నఫళాన పొరుగు రాష్ట్రాలకు ‘పని ష్మెంట్ బదిలీ’..! ఇంతకీ వారు చేసిన నేరం.. దర్యాప్తు సంస్థ చట్టబద్ధంగా కోరిన వివరాలను అందచేయడమే! సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తె బ్యాంకు లావాదేవీల వివరాలను దర్యాప్తు సంస్థ ఏసీబీకి అందచేసినందుకు యూనియన్ బ్యాంక్ తమ ఉద్యోగులను ‘పనిష్మెంట్ ట్రాన్స్ఫర్స్’ చేయడం సిబ్బందిలో చర్చనీయాంశంగా మారింది. అమరావతి భూ కుంభకోణంలో జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తెలు భువన, తనూజలపై దర్యాప్తు సంస్థ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. వారి లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ ఆ వివరాలు ఇవ్వాలని కోరుతూ ఖాతాలున్న బ్యాంకులకు లేఖలు రాసింది. జస్టిస్ ఎన్వీ రమణ ఇద్దరి కుమార్తెల్లో ఒకరి ఖాతా ఆంధ్రాబ్యాంకు (ఇప్పుడు యూనియన్ బ్యాంకులో విలీనమైంది)లో ఉంది. ఆమె ఖాతా తాలూకు లావాదేవీలు, కేవైసీ వివరాలు ఇవ్వాలని ఏసీబీ ఆ బ్యాంకును కోరింది. ఏసీబీ విజ్ఞప్తిపై స్పందించిన బ్యాంకు సిబ్బంది లీగల్ విభాగం అభిప్రాయాన్ని తీసుకున్నారు. పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వడం చట్టబద్ధమేనని లీగల్ విభాగం తెలిపింది. పోలీసులు అడిగిన ఖాతాలు హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ శాఖలో ఉన్నాయని గుర్తించారు. దీంతో ఆన్లైన్లో లెడ్జర్ తెరిచి లావాదేవీల వివరాలు పోలీసులకు అందచేశారు. అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెల బ్యాంకు లావాదేవీలను ఏసీబీ అధికారులకు ఇచ్చిన తర్వాత బ్యాంకు ఉన్నతాధికారులపై ఉన్నత స్థాయి నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ వివరాలను వెల్లడించడం చట్ట విరుద్ధం కాదని అభిప్రాయాన్ని చెప్పిన బ్యాంక్ లీగల్ విభాగం అధికారుల మీద ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘అమరావతి భూ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వారి బ్యాంకు లావాదేవీల వివరాలు ఇవ్వడం చట్ట విరుద్ధం కాదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెలకు దేశంలో చట్టం వేరుగా ఉండదు. వివరాలు పోలీసులకు ఇవ్వడం తప్పేమీ కాదు’ అని లీగల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు బదులిచ్చిన్నట్లు తెలిసింది. ఒక్క బ్యాంకుతో ఆగదని.. అనుమానాస్పద లావాదేవీల వివరాలను వెల్లడించడం ప్రారంభమైతే అది ఒక్క బ్యాంకుతో ఆగదని, మిగతా బ్యాంకుల్లోని ఖాతాల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తారని నిందితులు అనుమానించారు. తమ ఖాతా లావాదేవీల వివరాలను వెల్లడించిన యూనియన్ బ్యాంకు అధికారుల మీద చర్యలు తీసుకుంటే మిగతా బ్యాంకులు వివరాలు ఇచ్చేందుకు జంకుతాయని భావించారు. ఈ నేపథ్యంలో సమాచారం ఇచ్చిన అధికారులకు ‘పనిష్మెంట్’ ఇవ్వాలని యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారుల మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీనికి తలొగ్గిన అధికారులు విజయవాడ రీజనల్ కార్యాలయంలో పని చేస్తున్న ఐదుగురు అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. అయితే తామేమీ చట్టవిరుద్ధమైన పని చేయలేదని వారు గట్టిగా తేల్చి చెప్పడంతో ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ఆ ఐదుగురిని హఠాత్తుగా బదిలీ చేసినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి పేర్కొన్నారు. ఇద్దరు మహిళా అధికారులే.. బదిలీ వేటు విధించిన ఐదుగురిలో ఒకరు లీగల్ విభాగం మహిళా అధికారి కాగా మరొకరు ‘పీ అండ్ డీ’ విభాగానికి చెందిన మహిళా అధికారి. లెడ్జర్ తెరిచి చూసిన మరో ముగ్గురు అధికారుల మీద కూడా బదిలీ వేటు వేశారు. మొత్తం ఐదుగురిలో ముగ్గురిని చెన్నైకి మరో ఇద్దరిని ముంబైకి బదిలీ చేశారు. ముంబైకి బదిలీ అయిన ఓ అధికారి మరో ఏడాదిలో పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న అధికారిని బదిలీ చేయకూడదనే నిబంధనను కూడా బ్యాంకు పాటించకపోవడం గమనార్హం. ఏం తప్పు చేశారని...? ‘కోవిడ్ నేపథ్యంలో 2021 మార్చి వరకు బదిలీలు లేవని నెల క్రితం సర్క్యులర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా బదిలీ ఉత్తర్వులు వెలువరించారు. కోవిడ్ భయం వెంటాడుతున్న సమయంలో 59 ఏళ్ల వయసున్న అధికారిని ముంబైకి బదిలీ చేశారు. ఇలా చేస్తే ఉద్యోగుల ఆత్మవిశ్వాసం దెబ్బతినదా? వాళ్లు ఏం తప్పు చేశారు? చట్టబద్ధంగానే నడుచుకున్నారు’ అని అధికారులు పేర్కొంటున్నారు. బదిలీ షెడ్యూల్ పాటించకుండా.. బ్యాంకు ఉద్యోగులను ఎప్పుడుపడితే అప్పుడు బదిలీలు చేయరు. నిర్దిష్ట షెడ్యూల్లో మాత్రమే బదిలీలు జరుగుతాయి. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తె ఖాతా లావాదేవీల వివరాలు ఇచ్చినందుకు వారికి పనిష్మెంట్ శిక్ష విధించడం గమనార్హం. ఉద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు యూనియన్లు గట్టిగా ప్రశ్నించడం సాధారణం. ఈ వ్యవహారంలో సుప్రీంను బూచిగా చూపిస్తూ యూనియన్ నేతల నోరు మూయించినట్లు బ్యాంకు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. -
న్యాయమూర్తులు చట్టానికి అతీతులు కారు
సాక్షి, అమరావతి : రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, ఎవరైనా సరే చట్టానికి లోబడే పని చేయాల్సి ఉంటుందని, న్యాయమూర్తులు చట్టానికి అతీతులు కారని సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ చింతల విష్ణు మోహన్రెడ్డి అన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై ఫిర్యాదు చేయడంలో ఎంత మాత్రం తప్పులేదన్నారు. న్యాయమూర్తులు రాజ్యాంగానికి, చట్టాలకు అతీతులు కారని, వారిపై ఆరోపణలకు ఆధారాలు ఉన్నప్పుడు ఆ విషయాన్ని వారిపై చర్యలు తీసుకునే నిర్ణాయక స్థానాల్లో ఉన్న వారికి ఫిర్యాదు చేయడం ప్రజాస్వామ్యంలో భాగమేనన్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫిర్యాదు చేయడంలో ఏ మాత్రం తప్పులేదని ఆయన స్పష్టం చేశారు. ఇలా ఫిర్యాదు చేయడాన్ని తప్పుపడితే, అది పెద్ద తప్పు అవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ తప్పక జరిపించాలన్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి అని విచారణ చేయకుండా వదిలేస్తే, న్యాయవ్యవస్థ ప్రతిష్ట ఏం కావాలి? వ్యవస్థపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఏం కావాలి? అని ఆయన ప్రశ్నించారు. జస్టిస్ రమణపై ముఖ్యమంత్రి జగన్ ఫిర్యాదు చేయడాన్ని న్యాయవ్యవస్థ-శాసనవ్యవస్థ మధ్య యుద్ధంగా ఎంత మాత్రం భావించరాదన్నారు. కొద్ది రోజులుగా న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఇదేమీ మొదటిసారి కాదు.. న్యాయమూర్తులపై ముఖ్యమంత్రి ఫిర్యాదు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రారెడ్డి, జస్టిస్ సత్యనారాయణరాజు తదితరులపై చాలా తీవ్రమైన ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. కోర్టులో కులతత్వాన్ని పెంచి పోషిస్తున్నారని, ఆశ్రిత పక్షపాతం చూపుతున్నారని, వారికి కావాల్సిన న్యాయవాదులను ప్రోత్సహిస్తున్నారని.. ఇలా సంజీవయ్య పలు ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదు మీద అప్పటి సుప్రీంకోర్టు పెద్దలు స్పందించారు. దీంతో జస్టిస్ చంద్రారెడ్డిని మద్రాసుకు బదిలీ చేశారు. వాస్తవానికి జస్టిస్ చంద్రారెడ్డి సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వెళ్లాల్సి ఉండింది. ఈ ఫిర్యాదులతో ఆయన బదిలీ అయ్యారు. ముఖ్యమంత్రి కూడా భయపడాలా? వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అడ్వొకేట్ జనరల్గా ఉన్నాను. అప్పుడు జస్టిస్ ఎ.గోపాల్రెడ్డి మీద ఫిర్యాదులు చేశాం. ఆయనపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకోలేదు. ఫలానా జడ్జీలు చేస్తున్నది తప్పు అనిపించినప్పుడు, ఆ తప్పులకు ఆధారాలున్నప్పుడు ఫిర్యాదు చేయడం ఎలా తప్పు అవుతుంది? ఫిర్యాదు చేయడం తప్పని అంటే, ఎంత పెద్ద హోదాలో ఉంటే అంత పెద్ద తప్పు చేయవచ్చునని, అలాంటి వ్యక్తుల తప్పులను ప్రశ్నించవద్దని చెప్పినట్లే అవుతుంది. ఇదేం న్యాయం? ఇదెక్కడి న్యాయం? ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఫిర్యాదు చేయకుండా భయపడితే ఇక వ్యవస్థలు ఎలా బాగుపడతాయి? ఫిర్యాదు చేసినంత మాత్రాన, వ్యవస్థను నాశనం చేసినట్లా? ఫిర్యాదు చేయడం వల్ల కాదు.. తప్పు జరుగుతున్నా చూస్తూ మౌనంగా ఉండటం వల్ల వ్యవస్థలు నాశనం అవుతాయి. ముఖ్యమంత్రి ఫిర్యాదు మీద నానా యాగీ చేస్తున్న వారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పది మంది కలిసి ఓ ఒప్పును తప్పంటే అది ఎప్పటికీ తప్పైపోదు. పక్కన పడేస్తారని నేను అనుకోవడం లేదు ఇలాంటి ఫిర్యాదులు సుప్రీంకోర్టుకు కొత్త కాదు. ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిపై విచారణ జరిపేందుకు అంతర్గత విచారణ ప్రక్రియ ఉంది. ఈ విషయంలో కొన్ని సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు నిర్ధిష్టమైన విధానాన్ని రూపొందించుకుంది. దీని ప్రకారం ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరపాల్సి ఉంటుంది. విచారణ జరపాలా? వద్దా? అన్నది పూర్తిగా ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. విచారణ జరపాలని అనుకుంటే ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఫిర్యాదుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని కమిటీ తేలుస్తుంది. ఉన్నాయనుకుంటే తదనుగుణంగా ముందుకు వెళుతుంది. ఆధారాలు లేవనుకుంటే అప్పుడు సీఎంపై చర్యలు ప్రారంభించవచ్చు. కాని తీవ్రమైన ఆరోపణలున్న ఫిర్యాదులను ప్రధాన న్యాయమూర్తి పక్కన పడేస్తారని నేను అనుకోవడం లేదు. ఇంతటి తీవ్రమైన ఆరోపణలపై కూడా విచారణ చేయకుంటే, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. ఆధారాలు సమర్పించినప్పుడు కూడా విచారణ ఎందుకు చేయడం లేదన్న సందేహాలు ప్రజల్లో వస్తాయి. ఈ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత వ్యవస్థ పెద్దలపై ఉంది. లేకపోతే వ్యవస్థపై నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ప్రస్తుత ఫిర్యాదు విషయంలో ప్రజల విశ్వాసాన్ని సుప్రీంకోర్టు వమ్ముకానివ్వదనే భావిస్తున్నా. న్యాయమూర్తి కూడా పబ్లిక్ సర్వెంటే న్యాయమూర్తి కూడా పబ్లిక్ సర్వెంటేనని సుప్రీంకోర్టే గతంలో తీర్పునిచ్చింది. అయితే న్యాయమూర్తికి రాజ్యాంగ పరమైన రక్షణలు ఉన్న మాట వాస్తవమే. దాని అర్థం న్యాయమూర్తి తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా చూస్తూ ఉండాలని, వారిపై ఎలాంటి ఫిర్యాదులు చేయడానికి వీల్లేదని కాదు. న్యాయమూర్తులకున్న రక్షణలకు వారిపై తగిన ఆధారాలతో ఫిర్యాదులు చేయడానికి ఎలాంటి సంబంధం లేదు. తమిళనాడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీరాస్వామి కేసే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. జస్టిస్ వీరాస్వామి ఇంటిపై సీబీఐ దాడి చేసి పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకుంది. ఈ డబ్బంతా కూడా ఆదాయానికి మించి ఆస్తులగానే పరిగణిస్తూ ఆయనపై కేసు పెట్టింది. ఆయన దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మొదట్లో స్టే ఇచ్చింది. ఆయన పదవీ విరమణ చెందిన తర్వాత తీర్పునిస్తూ, జడ్జి కూడా పబ్లిక్ సర్వెంటేనని చెప్పింది. కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టలేదు. న్యాయమూర్తులేమీ చట్టానికి అతీతులు కాదు. రాష్ట్రపతి మొదలు ఎవరైనా కూడా చట్టానికి లోబడే పని చేయాల్సి ఉంటుంది. జడ్జీలు అలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం చాలా తప్పు.. న్యాయమూర్తులు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు. రాజకీయ నాయకత్వం ప్రతి ఐదేళ్లకొకసారి ప్రజల వద్దకు వెళ్లి వారి తీర్పును కోరుతుంది. ప్రజల తీర్పు మేరకు ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వ తీరుపై, చర్యలపై అభ్యంతరం ఉంటే, అందుకు సంబంధించిన కారణాలను న్యాయమూర్తులు తమ ఉత్తర్వుల్లో రాయాలి. అంతే కాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి వీల్లేదు. ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన మాటలకు రాజకీయ కరపత్రాలుగా పనిచేసే కొన్ని పత్రికలు మరికొన్ని పదాలను జత చేసి కథనాలు రాస్తాయి. ఇవన్నీ చూస్తే పత్రికల కోసం ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఇలా కోర్టులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో ఓ దురభిప్రాయం ఏర్పరచినట్లవుతుంది. రాష్ట్రంలో రాజ్యాంగం అమలులో వైఫల్యం ఉందని న్యాయమూర్తులకు అనిపిస్తే, దాని గురించి వ్యాఖ్యలు చేయడం ఎందుకు? మీ తీర్పుల్లో రాయండి. రాజ్యాంగం వైఫల్యం జరిగిందనే దానిని మీరు ఎలా సమర్థిస్తారో చెబుతూ తీర్పుల్లో ప్రస్తావించండి. అలాంటి అభిప్రాయానికి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటో రాయండి. ఆ తీర్పుపై అభ్యంతరం ఉంటే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుంది. అంతిమంగా సుప్రీంకోర్టు తేలుస్తుంది. అంతేకాక రాజకీయ నాయకత్వంపై ప్రజల్లో దురాభిప్రాయం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. ఒక వ్యవస్థ మీద మరో వ్యవస్థ ఇలా దురాభిప్రాయం కలిగించేలా వ్యవహరించరాదు. ఏ వ్యవస్థ ఎక్కువ కాదు.. ఏ వ్యవస్థ తక్కువ కాదు. అలా వ్యాఖ్యలు చేశారనే మేం 2008లో జస్టిస్ గోపాల్రెడ్డిపై ఫిర్యాదు చేశాం. జస్టిస్ నజ్కీ మీద సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ కూడా వేశాం. వారి మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చేశారు దర్యాప్తులను ఆపేయడం కూడా తప్పే. దర్యాప్తులను ఆపడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు ఎన్నో తీర్పుల్లో చాలా స్పష్టంగా చెప్పింది. అమరావతి భూ కుంభకోణం కేసులో నేను ఏసీబీ తరఫున హాజరయ్యాను. ఆ పిటిషన్లో పిటిషనర్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఒక్కరే. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబ సభ్యులెవ్వరూ పిటిషన్ దాఖలు చేయలేదు. దమ్మాలపాటి తన పిటిషన్లో హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని అడిగారు. ఆయన చేసిన అభ్యర్థనలకూ, న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులకు ఏ మాత్రం పొంతన లేదు. అడగనవి కూడా ఇచ్చేశారు. గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. వారి మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చేశారు. వ్యవస్థల మధ్య యుద్ధం కాదు శాసన-న్యాయ వ్యవస్థల మధ్య చిన్నపాటి ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. దానిని యుద్ధంగా ఎలా భావిస్తాం. తప్పులు చేస్తున్న జడ్జీల మీద ఫిర్యాదు చేయకుంటే, రాజకీయ నాయకత్వానికి ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి? వాళ్లు ఇష్టమొచ్చినట్లు చేస్తుంటే ఎన్నిరోజులు పడాలి? ఫిర్యాదు చేయడానికి ఓ వేదిక ఉండాలి కదా.. న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసేందుకు ఉన్న వేదిక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే. ఇక్కడ జగన్మోహన్రెడ్డి చేసింది అదే. -
సీఎం జగన్ లేఖను ఖండిస్తూ మీ తీర్మానం సరికాదు
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిర్యాదు చేయడాన్ని ఖండిస్తూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) చేసిన తీర్మానాన్ని ఆ సంఘం అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీవ్రంగా తప్పుపట్టారు. సైద్ధాంతికపరంగా ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బార్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి రోహిత్ పాండేకు స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా ఓ వర్తమానాన్ని ఆయనకు పంపారు. ఈ తీర్మానంలో భాగస్వామిని కావడానికి తాను తిరస్కరిస్తూ వచ్చానని, తీర్మానం విషయంలో జరిగిన సంప్రదింపుల్లోనూ పాల్గొనలేదని తేల్చిచెప్పారు. ‘వైఎస్ జగన్ ఆరోపణల్లో యధార్థత గురించి మనకు ఏమీ తెలియదు. ఓసారి విచారణ జరిగితే వాస్తవం అదే బయటకు వస్తుంది. ఈ దశలో మనం విచారణను ముందుకెళ్లకుండా అడ్డుకోజాలం. ప్రస్తుతం సీఎం ఫిర్యాదును ఖండిస్తూ తీర్మానం చేయడం అపరిపక్వమే అవుతుంది. సుప్రీంకోర్టు ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకుని, వాటి నుంచి అది నిష్కళంకంగా బయటపడలేదు. పూర్తి పారదర్శకత లేని వ్యవస్థ న్యాయవ్యవస్థేనన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. తప్పు చేసిన జడ్జీలపై ఎన్నడూ చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టు ఎప్పుడూ పారదర్శకంగా వ్యవహరించలేదు’ అని దుష్యంత్ దవే కుండబద్దలు కొట్టారు. ఇంకా ఆయన పాండేకు పంపిన తన వర్తమానంలో ఏమన్నారంటే.. అరుణాచల్ సీఎం ఇద్దరు జడ్జీల పేర్లను ఆత్మహత్య లేఖలో పేర్కొన్నా.. అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి కలికోపాల్ తన ఆత్మహత్య లేఖలో ఇద్దరు జడ్జీల పేర్లను ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ తర్వాత వారిద్దరూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులయ్యారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగాయ్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నా.. వాటిపై సుప్రీంకోర్టు తన ఇష్టమొచ్చినట్లు విచారణ జరిపి, ఆ ఆరోపణల నుంచి ఆయనకు క్లీన్చిట్ ఇచ్చింది. ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగిని డిస్మిస్ చేసి తప్పుడు క్రిమినల్ కేసులో అరెస్ట్ చేయించారు. అయినా న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రేక్షకపాత్ర పోషించారు. రోజూ కోర్టులో అసంతృప్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నా ఎవరూ గొంతెత్తడం లేదు. న్యాయవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై మనం ఆత్మశోధన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సీఎం వైఎస్ జగన్ ఆరోపణలను తప్పకుండా పరిశీలించాల్సిందే.. సీఎం జగన్ ఫిర్యాదు విషయంలోనే దుష్యంత్ దవే ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. సీఎం రాసిన లేఖ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందులోని ఆరోపణలను పరిశీలించే అవకాశమిచ్చింది. అంతేకాకుండా న్యాయమూర్తుల ప్రవర్తనపై వచ్చే ప్రశ్నలకు సమాధానమిచ్చే ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని న్యాయవ్యవస్థకు ఇచ్చిందన్న విషయాన్ని గమనించాలి. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి.. మరో రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు వాటిని తప్పకుండా పరిశీలించాల్సిందే. ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసే స్వతంత్ర వ్యక్తి ఆ ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందన్న విషయాన్ని సులువుగా తేల్చగలరు. ఇదంతా చాలా పారదర్శకంగా జరగాలి. ప్రధాన న్యాయమూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తారనే అనుకుంటున్నా.. ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా. జాతి, న్యాయవ్యవస్థ ప్రయోజనాలను, స్వతంత్రతను దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నా. మిగిలిన విషయాల్లా దీన్నీ పక్కన పడేస్తారని అనుకోను. నేను కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకం. తన నియామకాలను తానే చేపట్టడం ప్రారంభించిన నాటి నుంచి న్యాయవ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. అత్యుత్తములు, ప్రతిభావంతులు, స్వతంత్రులైన వారిని నియమించకుండా కేవలం సీనియారిటీ ఆధారంగా న్యాయమూర్తుల నియామకాలు జరిగాయి. సరైన కారణాలతోనే జగన్ లేఖ రాసి ఉంటారు.. న్యాయవ్యవస్థ తన స్వీయ హస్తాల్లో మరింత బలంగా, స్వతంత్రంగా ఉండాలి. అందులో న్యాయవ్యవస్థ విఫలమైతే ప్రజాస్వామ్యం విఫలమైనట్లే. వైఎస్ జగన్ వివేకం కలిగిన రాజకీయ నేతగా, ఒక రాష్ట్ర సీఎంగా సరైన కారణాలతోనే లేఖ రాసి ఉంటారు. చాలా ఆలోచించాకే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు. -
సీఎం లేఖపై చర్చ జరగాల్సిందే
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై చీఫ్ జస్టిస్కు సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖపై చర్చ జరగాల్సిందేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. న్యాయవ్యవస్థలో జరుగుతున్న లోపాలపై లేఖలు రాయడం కొత్తేమీ కాదని.. 1961లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి చంద్రారెడ్డిపై అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారని ఆయన గుర్తుచేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. బాబు హయాంలో జస్టిస్ రమణ ఏజీ జస్టిస్ ఎన్వీ రమణపై అవినీతి ఆరోపణలు కొత్తేమీ కాదని.. 2005లో రిటైర్డ్ జడ్జి బీఎస్ఏ స్వామి న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేస్తూ రాసిన పుస్తకంలో జస్టిస్ రమణ గురించి ఒక పేరాలో ప్రస్తావించారని వివరించారు. చంద్రబాబు హయాంలో రమణ అడ్వకేట్ జనరల్గా కూడా పనిచేశారన్నారని గుర్తుచేశారు. గ్యాగ్ ఆర్డర్ సరికాదు.. అలాగే, రాజధాని భూబాగోతంలో జరుగుతున్న దర్యాప్తుపై రాష్ట్ర హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం సరికాదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. గ్యాగ్ ఆర్డర్లు ఇవ్వడం ద్వారా వారిపై ఏమన్నా మాట్లాడితే కోర్టులు ఒప్పుకోవనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందన్నారు. జడ్జీలు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలన్నారు. హైకోర్టులో రాష్ట్ర డీజీపీతో ఐపీసీ సెక్షన్–151 చదివించారని, అంత అవసరమా? మేం రాష్ట్ర ప్రభుత్వం కన్నా బలవంతులమని చెప్పాలనుకుంటుందా అని ఉండవల్లి ప్రశ్నించారు. లెజిస్లేచర్కు, జ్యుడీషియరీకి ఉన్న సంబంధం చెడిపోతే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని ఉండవల్లి తెలిపారు. పార్లమెంట్ ద్వారానే రమణ నియంత్రణ జస్టిస్ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుకోవాలంటే పార్లమెంట్లో అభిశంసన జరగాలన్నారు. ఇది ఆమోదం పొందాలంటే లోక్సభలో వంద మంది, రాజ్యసభలో 50 మంది ఎంపీల మద్దతు అవసరమన్నారు. సీఎం వైఎస్ జగన్ కేసులపై ఆయన స్పందిస్తూ.. వీటిల్లో ఆయనకు శిక్షపడే అవకాశం లేదన్నారు. ‘సుప్రీం’ సీజేకు నేనూ లేఖ రాశా రాష్ట్రంలో రాజకీయ నాయకులకు సంబంధించిన కేసుల ట్రయల్స్ లైవ్ టెలీకాస్ట్ ఇవ్వాలంటూ ఈ నెల 13న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు తాను లేఖ రాసినట్లు మాజీ ఎంపీ వెల్లడించారు. చంద్రబాబు కేసులను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జడ్జీల నియామకానికి పరీక్షలు లేవని ఉండవల్లి చెబుతూ.. గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉండగా పాదాలు పట్టుకున్న వారిని జడ్జీలుగా నియమించారని ఆరోపించారు. చట్టం ముందు అందరూ సమానమే అనడం తప్పని.. అలా అయితే చంద్రబాబుపై ఉన్న కేసుల పురోగతి మాటేమిటని ప్రశ్నించారు. అలాగే, మార్గదర్శిపై తాను వేసిన కేసు తనకు తెలియకుండానే ఉమ్మడి హైకోర్టు 2018లో కొట్టివేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని ఉండవల్లి స్పష్టంచేశారు. -
ఆ ఆరోపణలపై విచారణ జరపాల్సిందే..
సాక్షి, అమరావతి : వ్యక్తుల కంటే వ్యవస్థలే గొప్పవని, ఆ వ్యవస్థల్లో పనిచేసే వ్యక్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై విచారణ జరిపి నిజానిజాలను తేల్చాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గురిజాల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. చిరుద్యోగి అయినా, ఉన్నతోద్యోగి అయినా విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని.. వారికి అనుమానాలు, సందేహాలు కలిగేలా వ్యవస్థలోని పెద్దలు వ్యవహరించకూడదన్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, నలుగురు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారసహితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి ఇటీవల ఫిర్యాదు చేయడం తదితర అంశాలపై జస్టిస్ కృష్ణమోహన్రెడ్డి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. విచారణ జరిపితేనే కదా అవి ఆరోపణలో.. వాస్తవాలో తెలిసేది సీఎం జగన్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిపై ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు ఆధారాలను సమర్పించారు. వాటిపై సీజేఐ స్పందించి విచారణ జరిపించాలి. ప్రాథమిక ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలి. సీఎంవి ఆరోపణలు అంటున్నాం. కాబట్టి విచారణ జరిపితే అవి ఆరోపణలా? లేక వాస్తవాలా అన్నది తేలిపోతుంది. చట్టం ముందు అందరూ సమానులే కదా. ప్రజాస్వామ్య పరిరక్షణలో కోర్టులది చాలా ముఖ్య భూమిక. న్యాయస్థానాలు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే.. సమాజంలో చెడును నియంత్రించడంలో వాటిది కీలకపాత్ర. మనస్సులో ఏదో పెట్టుకుని చేస్తున్నాయన్న భావన, అనుమానాలు ప్రజల్లో కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉంది. దీనివల్ల వ్యవస్థ ప్రతిష్ట పెరుగుతుంది. న్యాయస్థానాలు సరిగ్గా ఉన్నప్పుడు తప్పులు జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కోర్టులు సరిగ్గాలేవని నేను చెప్పడంలేదు. అలాగే, కేసులున్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడటానికి వైఎస్ జగన్ ఈ ఫిర్యాదు చేశారని కొందరు అంటున్నారు. అవి అర్థంలేని మాటలు. తన దృష్టికి వచ్చిన వాటిపై సీజేఐకి ఫిర్యాదు చేసే హక్కు సీఎంకి ఉంది. దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. సీజేకు ఫిర్యాదు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. కోర్టులూ చట్ట ప్రకారం విధులు నిర్వర్తించాలి కాగ్నిజబుల్ నేరం ఉంటే దర్యాప్తు అధికారి కానీ, ఎస్హెచ్వో కానీ దర్యాప్తు చేయాలి. ఈ అధికారాన్ని చట్టాలు, శాసనాలు సదరు అధికారికి కట్టబెట్టాయి. దర్యాప్తు చేయకుండా దర్యాప్తు అధికారిని అడ్డుకోవడానికి వీల్లేదు. దర్యాప్తును ఆపడానికి కూడా వీల్లేదు. న్యాయస్థానాలు కూడా రాజ్యాంగం, పార్లమెంట్, అసెంబ్లీ చేసిన చట్టాల ప్రకారం విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరూ నడుచుకోరాదు. వాటిని ఉల్లంఘించరాదు. దర్యాప్తు చేసే అధికారాన్ని ఓ చట్టం ఇచ్చినప్పుడు, ఆ అధికారాన్ని కోర్టులు ఎలా అడ్డుకుంటాయి? ఈ విషయంలో న్యాయస్థానాలు చాలా జాగరూకతతో, స్వీయ నియంత్రణతో పనిచేయాల్సి ఉంటుంది. సుదీర్ఘకాలం స్టేలపై ప్రజల్లో అనుమానాలు స్టే అన్నది తాత్కాలిక ఉపశమనం కింద న్యాయస్థానాలిచ్చే ఓ ఊరట మాత్రమే. వీటిని ఏళ్ల తరబడి అలా కొనసాగించడానికి వీల్లేదు. ఈ విషయాన్ని ఇటీవల, తాజాగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయితే.. స్టేలు 15–16 ఏళ్లపాటు కొనసాగుతుండటంతో ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వీటిని దూరం చేయడానికి కోర్టులు తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి 16 నెలలవుతోంది. ఈ స్వల్ప కాలంలో హైకోర్టు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ జీఓలపై స్టేలు ఇచ్చింది. చాలా కేసుల్లో హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలనే తీర్పులిస్తోందా? అన్న సందేహాలు, అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఇలాంటి అనుమానాలకు తావిచ్చేలా న్యాయస్థానాలు వ్యవహారశైలి ఉండకూడదు. కేసులు కూడా కొందరు న్యాయమూర్తుల వద్దకే వస్తున్నాయని, వారే కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఇక ఇళ్ల స్థలాలపై స్టే గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇన్ని అనుమానాలు ప్రజల్లో ఎందుకు కలిగించాలి? అనుమానాలకు ఆస్కారం ఇవ్వనేకూడదు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ గోపాల్రావు, జస్టిస్ లక్ష్మణ్రెడ్డి, సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ మరికొందరు రాజధానిపై పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను పూర్తిస్థాయిలో విచారించలేదు. కానీ, ఆ తరువాత దాఖలైన వ్యాజ్యాలు మాత్రం పరిష్కారం అవుతున్నాయి. రాజధానిపై అనేక కేసులను విచారిస్తున్నారు. ఇలాంటి అపోహలకు ఆస్కారం ఇవ్వకూడదన్నదే నా అభిప్రాయం. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఓ చిన్న ఉద్యోగి లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తే వాటిపై విచారణ జరపాల్సిందే కదా. అవి రుజువైనప్పుడు, దాని ప్రభావం వ్యవస్థపై తక్కువగా ఉంటుంది. అదే ఓ ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు రుజువైనప్పుడు దాని ప్రభావం వ్యవస్థపై చాలా తీవ్రంగా ఉంటుంది. వాటిని విచారించకుండా అలా వదిలేస్తే వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముంది. ఇది అన్నింటికన్నా ప్రమాదం. కాబట్టి ఫిర్యాదు అందినప్పుడు విచారణ జరిపి నిజానిజాలు తేల్చడం వ్యవస్థకే మంచిది. అసలు తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం ఏముంది? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విచారణకు సహకరించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. -
ఆ ఆరోపణలను న్యాయమూర్తులు ఖండించలేదు
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణపై సీఎం వైఎస్ జగన్ ఫిర్యాదు చేయడంలో గానీ, ఆ ఫిర్యాదును బహిర్గతం చేయడంలో గానీ ఎంత మాత్రం తప్పులేదని అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్ప రెడ్డి అన్నారు. ‘న్యాయపరంగా మాట్లాడాలంటే ఆ ఆరోపణలు వాస్తవమని భావించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిపై, కొందరు హైకోర్టు న్యాయమూర్తులపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను వారు ఇప్పటి వరకు ఖండించలేదు. ఖండనతో వస్తే, అప్పుడు ముఖ్యమంత్రి తగిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి న్యాయపరంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి రాలేదు’ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆయన “సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఏ రకంగా తప్పవుతుంది? సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ఫిర్యాదు ఇచ్చింది సాధారణ వ్యక్తేమీ కాదు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఏ వ్యక్తి ఉన్నరాన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఫిర్యాదు ఏంటి? ఆ ఫిర్యాదును బలపరిచేలా ఆధారాలున్నాయా? అన్నదే ముఖ్యం. న్యాయమూర్తులపై ఓ ముఖ్యమంత్రి కేంద్రానికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం అన్నది ఇదే మొదటిసారి కాదు. నేను 1961లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యాను. అప్పుడు జస్టిస్ చంద్రారెడ్డి ప్రధాన న్యాయమూర్తి. ఆయనపై దామోదరం సంజీవయ్య 9 పేజీల ఫిర్యాదు పంపారు. ఆ ఫిర్యాదులో చాలా ఆరోపణలు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అంతిమంగా అది జస్టిస్ చంద్రారెడ్డి బదిలీకి దారి తీసింది. జస్టిస్ చంద్రారెడ్డి మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు. కాబట్టి సీజేఐకు లేఖ రాయడంలో తప్పేమీ లేదు. బహిర్గతం చేయడం తప్పేమీ కాదు లేఖ రాసినప్పుడు దానిని బహిర్గతం చేయడం కూడా తప్పు కాదు. ముఖ్యమంత్రి లేఖ రాశారు.. దానిని ప్రభుత్వ ప్రతినిధిగా అజయ్ కల్లం ప్రెస్కు రిలీజ్ చేశారు. ఇందులో తప్పు ఎంత మాత్రం లేదు. సుప్రీంకోర్టుకు గానీ, సుప్రీంకోర్టులో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తి గానీ, హైకోర్టు చీఫ్ జస్టిస్ గానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు గానీ సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించవచ్చు. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదు. ప్రధాన మంత్రి సుమోటోగా స్పందించవచ్చు ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులెవ్వరూ కూడా సీజేకు సబార్డినేట్స్ కారు. ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు లేదా నలుగురు లేదా ఐదుగురితో కమిటీ వేయొచ్చు. వారి నుంచి ఓ నివేదిక కోరవచ్చు. ముఖ్యమంత్రి ఇక్కడ ప్రధాన మంత్రికి లేఖ రాయలేదు. రాష్ట్రపతికి కూడా రాయలేదు. న్యాయమూర్తులను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉన్నప్పటికీ, ఆయన ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేరు. అయితే ప్రధాన మంత్రి మాత్రం సుమోటోగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవచ్చు. విచారణ జరిపించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వివరణ కూడా కోరవచ్చు. -
విచారణతోనే న్యాయం
సాక్షి, అమరావతి: ఏపీలో న్యాయ వ్యవస్థ పనితీరు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో ఉన్న సంబంధ బాంధవ్యాలు, హైకోర్టు వ్యవహారాల్లో ఆయన జోక్యం వల్ల చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్ష్యాధారాలతో అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపింది. జస్టిస్ రమణ, ఇతర హైకోర్టు జడ్జిలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన లేఖలో పేర్కొన్న అంశాలపై నిష్పక్షపాతంగా న్యాయ విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని న్యాయ కోవిదులు స్పష్టం చేస్తున్నారు. (అచ్చు గుద్దినట్లు ఇద్దరిదీ ఒకే మాట) ఏపీలో జరుగుతున్న పరిణామాలను సాక్ష్యాధారాలతో నివేదిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖలోని అంశాలను ఆదివారం పలు జాతీయ పత్రికలు పతాక శీర్షికన ప్రచురించగా టీవీ చానళ్లు ప్రముఖంగా చర్చలు నిర్వహించాయి. హిందుస్థాన్ టైమ్స్, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద సండే ఎక్స్ప్రెస్ తదితర జాతీయ పత్రికలు దీన్ని ప్రముఖంగా ప్రచురించాయి. పలువురు ట్వీట్లు కూడా చేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇక రాష్ట్రంలోని ఒక వర్గం మీడియా మాత్రం యథావిధిగా ఆ వార్తను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా తొక్కిపట్టడంతోపాటు ప్రభుత్వ అధికారిక ప్రకటనను కూడా విస్మరించడం ద్వారా నిస్సిగ్గుగా తన నైజాన్ని మరోసారి చాటుకుంది. తద్వారా వాటి ముసుగు తొలగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఆంధ్రప్రదేశ్లో పెద్ద కథ నడుస్తోంది..) ధర్మ పోరాటాన్ని స్వాగతించిన న్యాయ కోవిదులు న్యాయవ్యవస్థపై.. హైకోర్టుపై.. సుప్రీం కోర్టుపై అత్యంత గౌరవ ప్రపత్తులను చాటుకున్న సీఎం వైఎస్ జగన్ కొద్దిమంది గౌరవ న్యాయమూర్తుల వ్యవహారశైలిని సుప్రీంకోర్టుకు వివరించే ప్రయత్నం చేయటాన్ని స్వాగతిస్తూ రాజ్యాంగ నిపుణులు, సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఇండియా టుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్, అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ జర్నలిస్టు నిధి రజ్దాన్ తదితరులు ట్వీట్లు చేశారు. (ఏపీ హైకోర్టుకు ‘సుప్రీం’ కమాండ్) ప్రజలు, సుప్రీం దృష్టికి అంశాలు.. – రాజ్దీప్ సర్దేశాయ్, కన్సల్టింగ్ ఎడిటర్, ఇండియా టుడే గ్రూప్. “ఆంధ్రప్రదేశ్లో పెద్ద కథ నడుస్తోంది. సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ కుటుంబం అవినీతిపై ఒక సీఎం నేరుగా ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ఎలాంటి కథనాలను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా హైకోర్టు ఒక వింత గాగ్ ఆర్డర్ ఇచ్చింది. సీఎం వైఎస్ జగన్ ఈ అంశాన్ని ప్రజలు, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది’ ఏ చర్యలు తీసుకుంటారు? – అశోక్ కేమ్కా, సీనియర్ ఐఏఎస్ “జస్టిస్ ఎన్వీ రమణపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఏ చర్యలు తీసుకుంటారు? అవాస్తవమని తేలితే ఏ చర్యలు తీసుకుంటారు? విచారణే చేయకపోతే అప్పుడేంటి?’ సీఎం జగన్ చర్య అపూర్వం.. – నిధి రజ్దాన్, అసోసియేట్ ప్రొఫెసర్, హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికా. “ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జిలను ప్రభావితం చేస్తున్నారంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్న ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాయడం అపూర్వం’ (ఎన్వీ రమణపై వచ్చిన ఆరోపణలతో ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనాన్ని ట్వీట్కు ట్యాగ్ చేశారు) ప్రధానికి కార్యాచరణ వివరించాకే.. – సిద్ధార్థ వరదరాజన్, ఎడిటర్–ఇన్–చీఫ్, ద వైర్ “ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భవిష్యత్ కార్యాచరణను వివరించారు. ఢిల్లీలో ప్రధానిని కలిసిన మరునాడే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకు భారీ లేఖ రాశారు’ “రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు వెలువరించిన పలు ఆదేశాల గురించి తీర్పులో సీఎం జగన్ ప్రస్తావించారు’ – దక్కన్ క్రానికల్ (జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) -
జడ్జీలూ సోషల్ మీడియా బాధితులే
న్యూఢిల్లీ: అవాకులు చెవాకులు అర్థం పర్థం లేని నిందలు మోపుతూ చేసే సోషల్ మీడియా పోస్టింగులతో జడ్జీలూ బాధితులుగా మారుతున్నారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా పోస్టులకు జడ్జీలెవరూ స్పందించకుండా దూరంగా ఉంటే మంచిదన్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి రచించిన ‘జ్యుడీషియరీ, జడ్జి అండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడారు. జడ్జీలందరూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని భావించడం సరైంది కాదన్నారు. ఇతర వ్యక్తుల కంటే జడ్జీల జీవితాలు ఏమంత మెరుగ్గా ఉండవని, ఒక్కోసారి కుటుంబ సభ్యులూ త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎస్ఏ బాబ్డే మాట్లాడుతూ న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జడ్జీల వ్యక్తిగత లబ్ధి కోసమని కాకుండా, మొత్తం న్యాయవ్యవస్థ సమర్థంగా పని చేయడం కోసమైనా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పారు. లాయర్ ప్రశాంత్ భూషణ్ న్యాయవ్యవస్థను కించపరిచేలా పోస్టింగులు చేసి రూ.1 జరిమానా కట్టిన నేపథ్యంలో జడ్జీలు ఈ వ్యాఖ్యలు చేశారు. రచయిత్రి జస్టిస్‡ భానుమతి మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో విభిన్న కోణాలను పుస్తకంలో తన అభిప్రాయాలు చెప్పానన్నారు. -
అన్ని చీకటి రాత్రుల్లాగే ఇదీ గడిచిపోతుంది..!
సాక్షి, న్యూఢిల్లీ: సవాళ్లతో కూడిన ఈ క్లిష్టకాలం మనల్ని అచేతనులుగా మార్చేలా చేయనివ్వొద్దని, అన్ని చీకటి రాత్రుల వలె ఇదీ గడిచిపోతుందని జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ప్రభావవంతమైన న్యాయ సేవలు అందించే లక్ష్యంతో కామన్వెల్త్ హ్యూమన్రైట్స్ ఇన్షియేటివ్ (సీహెచ్ఆర్ఐ) సహకారంతో నల్సా రూపొందించిన హాండ్ బుక్ను జస్టిస్ ఎన్వీ రమణ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రాల న్యాయ సేవల ప్రాధికార సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్లు, మెంబర్ సెక్రటరీలు, హైకోర్టు న్యాయసేవల కమిటీల చైర్మన్లు, జిల్లా న్యాయ సేవల సంస్థల చైర్మన్లు, సెక్రటరీలతో నిర్వహించిన వెబ్నార్లో ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘3 నెలలు గడిచినా ఇంకా పరిస్థితి నియంత్రణలో లేదు. లాక్డౌన్ కారణంగా వేలాది మంది జీవనోపాధి కోల్పోయారు. మానసిక సమస్యలు తలెత్తాయి. పిల్లలు బడికి వెళ్లలేని పరిస్థితి. మనం కొన్ని అవరోధాల మధ్య పనిచేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టులు వీడి యో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేసులు విచారిస్తున్నాయి. కుటుంబాల్లో హిం సాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మా దృష్టికి వచ్చింది. చిన్న పిల్లలపై దాడులు పెరిగిపోయాయి. లాక్డౌన్ సమయంలో బాధితులు మనల్ని చేరలేరు. ఈ పరిస్థితిని గుర్తించి వన్ స్టాప్ సెంటర్లు (ఓఎస్సీ) ఏర్పాటుచేశాం. ప్రతి జిల్లాలో మహిళా న్యాయవాదుల ద్వారా టెలిఫోన్లో న్యాయసేవలు అందించేందుకు చర్య లు తీసుకున్నాం’అని వివరించారు. -
‘న్యాయం కోసం వచ్చేవారికి బాసటగా నిలవాలి’
సాక్షి, హైదరాబాద్: భారత న్యాయవ్యవస్థలో పెండింగ్లో ఉన్న కేసులు సమస్యగా మారాయని.. న్యాయం కోసం కోర్టుకు వస్తున్న వారి పట్ల శ్రద్ధ వహించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్లో నిర్మించిన సిటీ సివిల్ కోర్టు ఫేస్ వన్ భవనాన్ని జస్టిస్ ఠాకూర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ.. ఈ కోర్టు భవనంలోని న్యాయముర్తుల ఛాంబర్లు సుప్రీం కోర్టు, హైకోర్టు ఛాంబర్ల కంటే బాగున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా సమాజంలో ఏ వృత్తికి లేని గౌరవం న్యాయముర్తుల వృత్తికి ఉందని.. కావున న్యాయం కోసం వచ్చేవారికి, ప్రజల హక్కులకు బాసటగా నిలవాలని తెలిపారు. దీంతోపాటు న్యాయ వ్యవస్థను గౌరవించి.. కోర్టుకు వచ్చే వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ఈ సమాజం న్యాయమూర్తులకు చాలా గౌరవం ఇస్తుంది.. అందుకే సమాజం కోసం సేవ చేయాలన్నారు. అయితే చాలా కేసుల్లో సాక్షి కోర్టుకు రావటం గగనం అవుతోందని.. సాక్షులను గౌరవించి కాపాడుకోవాలని అయన పేర్కొన్నారు. కాగా న్యాయ వ్యవస్థలో సీనియర్లు తల్లిదండ్రుల వంటి వారని.. అందరిని గౌరవించి, న్యాయ వ్యవస్థపై మరింత గౌరవాన్ని పెంపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయముర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. సుమారు రూ. 12 కోట్ల వ్యయంతో కోర్టు కోసం మంచి భవనం నిర్మించినందుకు సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా న్యాయవ్యవస్థకు లోబడే మనమంతా పని చేయాలని పేర్కొన్నారు. గతం కంటే ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. అనంతరం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ కోసం మౌలిక సదుపాయాలు అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని కోరారు. -
న్యాయవ్యవస్థకు ఆటుపోట్లు సహజమే!
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థకు ఆటుపోట్లు, సంక్షోభాలు కొత్త కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని, న్యాయవ్యవస్థ మరింత బలోపేతమైందని ఆయన తెలిపారు. మరింతగా ప్రజల విశ్వాసాన్ని చూరగొందన్నారు. పెత్తనం చెలాయించేందుకు కొందరు వ్యక్తులు న్యాయవ్యవస్థపై దాడులు చేస్తున్నారని, ఇటువంటి వాటిని కలిసికట్టుగా తిప్పికొట్టాలని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. తెలంగాణ హైకోర్టు భవనం నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా హైకోర్టులో శనివారం శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ ఎవరికీ భయపడ దని, విమర్శలను చూసి వెనుకడుగు వేయదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో న్యాయ మూర్తుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, ఈ ఖాళీల భర్తీకి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పోస్టుల భర్తీకి పేర్లను సిఫారసు చేయాలని హైకోర్టు కొలీజియంను కోరారు. హైకోర్టు కొలీజియం నుంచి సిఫారసులు వస్తే, వీలైనంత త్వరగా ఆ పేర్లకు ఆమోదముద్ర వేస్తామన్నారు. తాను హైకోర్టు నియామకాలను చూసే సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యుడిగా ఉన్నందున.. ఈ రెండు హైకోర్టుల్లో వీలైనంత త్వరగా పోస్టులను భర్తీ చేసేందుకు చేయాల్సిందంతా చేస్తానని తెలిపారు. ఈ విషయంలో సీజేఐతో ప్రత్యేకంగా మాట్లాడ తానని భరోసా ఇచ్చారు. ఈ హైకోర్టు ఎంతోమంది దిగ్గజాలను న్యాయవ్యవస్థకు అందించిందన్నారు. తన వంటి న్యాయమూర్తులు ఎంతో మంది ఈ హైకోర్టు భవనం నీడలో ఎదిగారన్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణతోపాటు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రామయ్యగారి సుభాష్రెడ్డి ముఖ్య అతిథు లుగా హాజరయ్యారు. ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్తోపాటుగా పలువురు సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన విశ్రాంత న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హైకోర్టు గొప్ప అనుభూతినిచ్చింది ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ, 1983 నుంచి 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు ఈ హైకోర్టు భనవంలో తన ప్రస్థానం కొనసాగిందన్నారు. ఎన్నో కొత్త విష యాలను ఈ హైకోర్టు తనకు నేర్పిందన్నారు. తన సీనియర్ అయ్యపురెడ్డి తనకు అవకాశం ఇవ్వడం వల్లే తాను ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్నానని జస్టిస్ రమణ తెలిపారు. ఆయనకు సదా రుణపడి ఉంటానన్నారు. ఈ హైకోర్టుతో తనకు భావోద్వేగ జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని.. ఎన్నో గొప్ప అనుభూతులను ఈ హైకోర్టు మిగిల్చిందన్నారు. న్యాయవ్యవస్థకు ఎంతో మంది దిగ్గజాలను, ఉద్దం డులను, మేధావులను, నిపుణులను ఈ హైకోర్టు అందించిందని తెలిపారు. వారు న్యాయవ్యవస్థకు అందించిన సేవలను ఎప్పటికీ మర్చిపోకూ డదన్నారు. 14 మంది సుప్రీంకోర్టు జడ్జీలను, 16 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఈ హైకోర్టు అందించిందని ఆయన తెలిపారు. పెండింగ్ కేసులే సవాల్ న్యాయవ్యవస్థకు పెండింగ్ కేసుల సంఖ్య ఓ సవాలుగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా కింది కోర్టుల్లో 2.84 కోట్ల పెండింగ్ కేసులున్నాయని, మిగిలిన కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కేసులు సత్వర విచారణకు నోచుకోక పోవడం వల్ల అండర్ట్రయిల్ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారన్నారు. తగినంత మంది న్యాయ మూర్తులు లేకపోవడం, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు లేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోవడం వంటి అనేక కారణాల వల్ల పెండింగ్ కేసుల సంఖ్య పెరి గిపోతోందన్నారు. జిల్లా కోర్టులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియో గించుకోలే కపోతున్నాయని, అనేక కోర్టులు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. చెప్పలేని ఆనందమిది: జస్టిస్ లావు నాగేశ్వరరావు జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూశతాబ్ది ఉత్స వాల సందర్భంగా తాను హైకోర్టు ప్రాం గణంలోకి అడుగుపెడుతుంటే చెప్పలేని ఆనందం కలుగు తోందన్నారు. అసలు ఈ వృత్తిలో కొన సాగాలా? వద్దా? అన్న అనిశ్చితిలో ఉన్నప్పుడు ఈ హైకోర్టులోని ఎంతోమంది మిత్రులు తనను ప్రోత్సహిం చా రని, సుప్రీంకోర్టుకు ప్రాక్టీస్ను మారుస్తు న్నప్పుడు కూడా అదే రకమైన ప్రోత్సాహం ఇచ్చారని తెలి పారు. సీనియర్ వై.సూర్యనారాయణ వల్లే తాను ఈ స్థానంలో ఉన్నానన్నారు. సహచర న్యాయవాదుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పారు. ఈ హైకోర్టు భవనం ఎంతో మంది గొప్ప న్యా యమూర్తులను, న్యాయ వాదులను అందించింద న్నారు. ఇటువంటి ఈ భవనం వందేళ్ల కార్యక్ర మం లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. చిన్న సైన్యంతో పెద్ద యుద్ధం: ఏసీజే చౌహాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ స్వాగతోపన్యాసం చేస్తూ, అతి తక్కువ మంది సైన్యం (జడ్జీలు)తో గొప్ప యుద్ధం(కేసులతో) పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 1.93 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. 11 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని ఆయన తెలి పారు. ప్రతి న్యాయమూర్తి 17,545 కేసుల అదనపు భారాన్ని మోస్తున్నారని వివరించారు. కింది కోర్టులో 5.22 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, కేవలం 350 మంది న్యాయాధికారులే పనిచేస్తున్నారని తెలిపారు. కుటుంబ కోర్టుల్లో 12,951 కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టుల్లో 3,322 కేసులు పెండింగ్లో ఉన్నాయని, సగటున ఒక్కో న్యాయాధికారి 1,500 కేసుల భారాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం 416 కోర్టుల్లో 80 కోర్టులు అద్దె భవనాల్లో ఉన్నాయన్నారు. ఓ జట్టుగా అందరం కలిసి సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైకోర్టుల ముందున్న సవాళ్లును ఎదుర్కొనేం దుకు ప్రతీ హైకోర్టు కూడా 2030 విజన్ స్టేట్మెంట్ను సిద్ధం చేసుకో వాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ వం దన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సి.దామోదర్రెడ్డి మాట్లాడారు. అనం తరం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాల కాంతులతో వెలుగులీనుతున్న హైకోర్టు భవనం ధనార్జన యంత్రాల్లా మారొద్దు న్యాయం ఉన్న చోట ప్రశాంతత ఉంటుందని భీష్మ పితామహుడు చెప్పారని, అందువల్ల న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జస్టిస్ రమణ అన్నారు. న్యాయపాలన ద్వారా ప్రజాస్వామ్య, రాజ్యాంగ లక్ష్యాలను సాధించాలని, ఇందులో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలన్నారు. న్యాయవ్యవస్థ ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని, వీటి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతే వ్యవస్థ మనుగడ ప్రమాదంలో పడిన ట్టేనన్నారు. కేవలం ఆదాయాన్ని ఆర్జించే యంత్రాల్లా కాకుండా సమాజంలో అవసరమైన వారికి న్యాయ సాయం చేస్తూ, సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని న్యాయవాదులకు సూచించారు. జడ్జీల సంఖ్యను 42కు పెంచాలి: జస్టిస్ సుభాష్రెడ్డి జస్టిస్ సుభాష్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 42కు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత తక్కువ మంది జడ్జీలతో లక్షల్లో ఉన్న కేసులను విచారిం చడం చాలా కష్టమేనన్నారు. ఇరు హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఏం చేయాలో అన్ని ప్రయత్నాలూ చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుం టామన్నారు. న్యాయమూర్తులు ఎన్ని కేసులను పరిష్కరించామని కాకుండా, ఎంత నాణ్యతతో తీర్పులిచ్చామన్నదే చూడాలన్నారు. అప్పుడే ప్రజలకు న్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు. న్యాయవాదులుగా తాము వాదనలు వినిపించిన సమయంలోని న్యాయమూర్తులం దరినీ (ఇప్పుడు రిటైర్డ్) ఈ కార్యక్రమంలో చూడటం ఆనందంగా ఉందన్నారు. -
హైకోర్టులో ఘనంగా శతాబ్ది ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి, ఎల్ నాగేశ్వరరావులు హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్, ఇతర న్యాయ మూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. చారిత్రాత్మకమైన హైకోర్టు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ అన్నారు. హైకోర్టులాంటి అద్భుతమైన నిర్మాణంలో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైకోర్టు క్యాంపస్ వాతావరణం న్యాయవాదులకు చాలా అనుకూలంగా ఉంది. వీలైనంత తొందరలో హైకోర్టు పెండింగ్ ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. సామాన్యులకు న్యాయం అందేలా చూస్తామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలలో త్వరలో న్యాయమూర్తుల నియామకం పూర్తి చేస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కోర్టులలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 1 లక్ష 93 వేల కేసులు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 1 లక్ష 73 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్లో ఉన్న కేసులను న్యాయ పరంగా త్వరగా పరిష్కరించాలని సూచించారు. యువ న్యాయవాదులకు కేసుల్లో వాదనలు వినిపించేందుకు ఇది మంచి అవకాశం అన్నారు. హైదరాబాద్ హైకోర్టుతో 31 సంవత్సరాల అనుభవం ఉందని జస్టీస్ ఎన్ వి రమణ అన్నారు. ఇది చాలా ఎమోషనల్ డే అని, తన సగం జీవితం ఈ కోర్టులోనే గడిచిందన్నారు. తన పుట్టినింటికి ఈరోజు వచ్చినందకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం కృషిచేస్తానని, హైకోర్టు ఇతర సమస్యలు సైతం త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. -
జస్టిస్ రమణ కూడా తప్పుకున్నారు!
న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక చీఫ్గా ఎం.నాగే శ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి మరో న్యాయమూర్తి తప్పుకున్నారు. సీబీఐ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరరావు తమ రాష్ట్రం వాడేననీ, ఆయన కుమార్తె వివాహానికి కూడా వెళ్లానని అందుకే ఈ ధర్మాసనం నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ తర్వాత ఈ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న మూడో జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ. ఆయన వైదొలగడంతో సీనియర్ జడ్జి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని మరో ధర్మాసనం ఈ కేసును శుక్రవారం నుంచి విచారిస్తుందని సీజేఐ ప్రకటించారు. జనవరి 10న ప్రధాని నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఐపీఎస్ అధికారి ఆలోక్వర్మను సీబీఐ చీఫ్ హోదా నుంచి తొలగించిన అనంతరం ఎం.నాగేశ్వరరావును తాత్కాలిక చీఫ్గా నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నియామకం సరిగా జరగలేదంటూ కామన్కాజ్ అనే స్వచ్ఛంద సంస్ధ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. గురువారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ శంతన గౌడర్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ.. ‘సీబీఐ తాత్కాలిక చీఫ్ ఎం.నాగేశ్వర రావు, నేనూ ఒకే రాష్ట్రం వాళ్లం. ఆయనతో నాకు పరిచయం ఉంది. న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన అల్లుడు కూడా నాకు తెలుసు. అందుకే ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నా’ అని ప్రకటించారు. కాగా, సీబీఐ చీఫ్ ఎంపిక విషయమై చర్చించేందుకు శుక్రవారం మరోసారి సమావేశం కానున్నట్లు ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత ఎంపిక కమిటీ సభ్యుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. -
విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎన్వీ రమణ
-
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ కేసు: మరో ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ కేసు వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ కేసు విచారణ నుంచి ఇద్దరు జడ్జీలు తప్పుకోగా.. తాజాగా రమణ కూడా వీరి జాబితాలో చేరారు. ఈ విషయం గురించి రమణ మాట్లాడుతూ.. ‘నాగేశ్వర రావుది, నాది ఒకే రాష్ట్రం. అంతేకాక నేను, అతని కుమార్తె వివాహానికి కూడా హాజరయ్యాను. ఈ నేపథ్యంలో నేను ఈ విచారణ బెంచ్లో ఉండటం సబబు కాదు. అందుకే తప్పుకుంటున్నాను’ అని తెలిపారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి తొలుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. నూతన సీబీఐ డైరెక్టర్ను ఎంపిక చేసే కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందున.. ఈ కేసు తదుపరి విచారణకు తాను దూరంగా ఉంటానని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకే జస్టిస్ సిక్రీ కూడా ఈ కేసు విచారణ బెంచ్ నుంచి తప్పుకుటున్నట్లు ప్రకటించారు. సీబీఐ డైరెక్టర్గా అలోక్వర్మను తొలిగించిన ఉన్నతాధికార కమిటీలో జస్టిస్ సిక్రీ కూడా ఉన్నారు. దాంతో తాను ఈ బెంచ్ నుంచి తప్పుకుంటున్నట్లు సిక్రీ తెలిపారు. తాజాగా ముడో వ్యక్తి ఎన్వీ రమణ కూడా ఈ బెంచ్ నుంచి తప్పుకున్నారు. పిటిషన్ను విచారించే ధర్మాసనం నుంచి ఒక్కొక్కరు తప్పుకోవడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
సుప్రీం జడ్జీలకు జస్టిస్ రమణ విందు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. సుప్రీం కోర్టు జడ్జీల కోసం ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు. కోర్టు ప్రాంగణంలోని ఆయన చాంబర్లో భోజన విరామ సమయంలో జరిగిన విందులో నోరూరించే ఆంధ్రా వంటకాలను వడ్డించారు. తాజాగా నెలకొన్న సుప్రీం సంక్షోభంతో కోర్టు వాతావరణం గంభీరంగా ఉన్న సమయంలో ఏర్పాటుచేసిన ఈ విందు ఉపశమనం లాంటిదని ఓ సీనియర్ జడ్జి పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ గోయల్ మినహా సీజేఐ దీపక్ మిశ్రా, మిగిలిన 23 మంది న్యాయమూర్తులు ఈ విందులో పాల్గొన్నారు. ప్రతి బుధవారం ఒక్కో జడ్జి తమ ప్రాంత వంటకాలతో జడ్జీల కోసం విందు ఇస్తున్నారు. కాగా, బుధవారం కోర్టు కార్యకలాపాల ప్రారంభానికి ముందే జస్టిస్ చలమేశ్వర్ మినహా మిగిలిన ముగ్గురు తిరుగుబాటు జడ్జీలతో సీజేఐ సమావేశమయ్యారు. గురువారం చలమేశ్వర్ కోర్టుకు హాజరయ్యే అవకాశముంది. దీంతో ఈ నలుగురితో సీజేఐ సమావేశం అవుతారని సమాచారం. -
నగరంలో ఎన్సీఎల్ఏటీ బెంచ్
సాక్షి, హైదరాబాద్: ‘‘దక్షిణ రాష్ట్రాలతో హైదరాబాద్కు మంచి అనుసంధానముంది. కాబట్టి ఇక్కడ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) బెంచ్ అవసరం ఎంతైనా ఉంది’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేంద్రానికి వినతిపత్రం సమర్పించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) న్యాయవా దుల సంఘానికి ఆయన సూచించారు. ఎన్సీఎల్టీ సీనియర్ న్యాయవాది ఎస్.రవి అధ్యక్షుడిగా ఇటీవల న్యాయవాదుల సంఘం ఆవిర్భవించింది. ఈ సంద ర్భంగా ఎన్సీఎల్టీలో గురు వారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ రమణ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కార్యక్రమం లో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, ఎస్సీ ఎల్టీ జ్యుడీషియల్ సభ్యులు వి.రాజేశ్వర రావు, సాంకేతిక సభ్యులు రవికుమార్ దురై స్వామి, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ధనంజయ, కార్యదర్శి బాచిన హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్సీఎల్ఏటీ ఏర్పాటుతో హైకోర్టు, ఇతర కోర్టులపై కేసుల భారం కాస్త తగ్గిందని ఈ సందర్భంగా జస్టిస్ రమణ అన్నారు. ‘‘ఎన్సీ ఎల్టీ, ఎన్సీఎల్ఏటీ సభ్యుల నియామకాల్లో సుప్రీంకోర్టు ఆషామాషీగా వ్యవహరిం చలేదు. పలు అంశాల్లో వారి నైపుణ్యాలను నిశి తంగా పరిశీలించాకే నియమించాం’’ అని వివరించారు. అధ్యయనమే శ్రీరామరక్ష ఉభయ రాష్ట్రాల్లో దాదాపు లక్ష కంపెనీలు న్నాయని, న్యాయవాది లేకుండా ఏ కంపెనీ ప్రారంభమయ్యే అవకాశమే లేదని జస్టిస్ రమణ అన్నారు. ఈ అవకాశాన్ని యువ న్యాయవాదులు అందిపుచ్చుకోవాలని సూచిం చారు. కొత్త చట్టాలను నిరంతరం అధ్యయనం చేస్తేనే న్యాయవాదికి మనుగడ ఉంటుందని హితవు పలికారు. ‘‘కొత్త తరహా వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నప్పుడే లాయర్లకు పేరు, డబ్బు వస్తాయి. దేశంలో 14 చోట్ల ఎన్సీఎల్టీ లున్నాయి గానీ హైదరాబాద్ ఎన్సీఎల్టీలోని మౌలిక సదుపాయాలు మరెక్కడా లేవు. ఇందు కు సంబంధిత అధికారులకు అభినందనలు. ఇటీవల నేను, మరికొందరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులం జపాన్, కొరియా సందర్శిం చాం. మన రాజ్యాంగం ఎంత గొప్పదో, మన న్యాయవ్యవస్థ ఎంత స్వతంత్రంగా పని చేస్తుందో వారికి వివరిం చాం. విని అక్కడి అధికారు లు ఆశ్చర్యపోయారు. అయితే మన దేశంలో కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై వారు అసంతృప్తే వెలి బుచ్చారు’’ అని వివరిం చారు. ‘‘యువ న్యాయవా దులు, కొత్తగా వృత్తిలోకి వస్తున్న వారు సీనియర్ లాయర్ల కు గౌరవమివ్వడం లేదని నా దృష్టికి వచ్చింది. ఇది ఎంతమాత్రమూ మంచి పద్ధతి కాదు’’ అని జస్టిస్ రమణ అన్నారు. పెద్దలను గౌరవించడం మన సంస్కారమని మరవొద్దని హితవు పలికారు. న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి నూనేపల్లి హరినాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం కొత్త కార్యవ ర్గాన్ని సీనియర్ న్యా యవాది ఎస్.రవి సభకు పరిచయం చేశారు. చివర్లో సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వందన సమర్పణ చేశారు. కాసేపు తెలుగులో ప్రసంగం కార్యక్రమంలో కాసేపు తెలుగులో ప్రసంగించడం ద్వారా తన భాషాభిమానాన్ని జస్టిస్ రమణ మరో సారి చాటుకున్నారు. న్యాయవాదులకు సంబం ధించి రావిశాస్త్రి చెప్పిన కథను వినిపించి నవ్వులు పూయిం చారు. -
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ, శివమాల దంపతుల కుమార్తె తనూజ, త్రిలోక్ వివాహం గురువారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా కుమార్తె, అల్లుడు సహా జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, కుటుంబ సభ్యులు శుక్రవారం తిరుమలేశుడిని దర్శించుకున్నారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వీరికి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో కొత్త దంపతులతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం చేయగా, జేఈవో పట్టువస్త్రాలతో సత్కరించారు. -
జస్టిస్ ఎన్వీ రమణకు మాతృవియోగం
-
జస్టిస్ ఎన్వీ రమణకు మాతృవియోగం
► నివాళులు అర్పించిన న్యాయమూర్తులు, హైకోర్టు సిబ్బంది ► నేడు హైదరాబాద్లో అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణకు మాతృవియోగం కలిగింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిస్ రమణ తల్లి నూతలపాటి సరోజినీదేవి (85) బుధవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సాయంత్రం ఆమె పార్థివ దేహాన్ని ఎస్ఆర్ నగర్లోని స్వగృహానికి తీసుకువచ్చారు. సరోజినీదేవి మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, హైకోర్టు సిబ్బంది జస్టిస్ రమణ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఈఎస్ఐ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామ పొన్నవరానికి చెందిన గణపతి, సరోజినీదేవి దంపతులు. వారికి సుప్రీం న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణతో పాటు కుమార్తెలు రాణి, వాణి ఉన్నారు. పెద్ద కుమార్తె రాణి హైదరాబాద్లో, చిన్న కుమార్తె వాణి అమెరికాలో ఉంటున్నారు. అయితే ఇటీవలే తన కుమార్తెకు పాప జన్మించడంతో జస్టిస్ రమణ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చారు. సీఎం కేసీఆర్ సంతాపం జస్టిస్ ఎన్వీ రమణ మాతృమూర్తి సరోజినీదేవి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తం చేశారు. నివాళులు అర్పించిన వైఎస్ జగన్ జస్టిస్ ఎన్వీ రమణ మాతృ వియోగం విషయం తెలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయమూర్తి ఇంటికి చేరుకుని పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్ టీవీ ఎండీ నరేంద్ర చౌదరి, టీడీపీ నేతలు కంభంపాటి రాంమోహన్రావులు కూడా నివాళులర్పించారు. -
కూచిపూడిని ఆదరించడం సంతోషం: జస్టిస్ ఎన్వీ రమణ
-
కూచిపూడిని ఆదరించడం సంతోషం: జస్టిస్ ఎన్వీ రమణ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి నాట్యాన్ని ఆదరించడం చాలా సంతోషకరమని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ అంతర్జాతీయ నృత్యోత్సవాలు విజయవాడలోని ఇందిరాగాంధీ స్డేడియంలో శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో అంతర్జాతీయ తెలుగు కేంద్రాన్ని నిర్మించాలని కోరుతున్నామన్నారు. తెలుగు భాషను కూడా పరిరక్షించుకోవాలని జస్టిస్ రమణ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. దేశ విదేశాల నుంచి వేలాదిమంది కళాకారులు ఈ ఉత్సవాలలో పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నారు. -
కోర్టుల్లో రాజకీయాలకు తావు లేదు
సుప్రీంకోర్టు స్పష్టీకరణ న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో రాజకీయాలకు తావు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక రాజకీయ పార్టీ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయవచ్చా అనే అంశంపై వాదనల సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘వారి ఆందోళన రాజకీయాలను కోర్టు ముందుకు తెచ్చేలా కనిపిస్తోంది. దీనిని మేము అంగీకరించబోము. రాజకీయాలు న్యాయస్థానాలకు బదిలీ కావాలని మేము కోరుకోవడం లేదు’’ అని న్యాయమూర్తులు జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాల్లో కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్వరాజ్ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిల్ దాఖలు చేశారు. ఒక రాజకీయ పార్టీ ప్రజాప్రయోజనాల దృష్ట్యా పిటిషన్ దాఖలు చేసినట్లయితే.. కోర్టులు దానిని విచారించవచ్చని ప్రశాంత్ భూషణ్ వాదించారు. అయితే కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న ఎన్జీవో ఈ పిల్ దాఖలు చేసిందని, ఇందులో రాజకీయ ఉద్దేశాలున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం కలుగజేసుకుని ప్రజాప్రయోజనమా? పార్టీల ప్రయోజన మా? అనేది ఎలా వేరు చేస్తారని ప్రశాంత్ భూషణ్ను ప్రశ్నించింది. పార్టీల ప్రతిచర్య వెనుక ప్రజాప్రయోజనం ఉంటుందని, ఒకవేళ అందులో ప్రజాప్రయోజనం లేదని భావిస్తే కోర్టు కొట్టేయొచ్చన్నారు. రాజకీయ పార్టీలు తమ వాదనను వినిపించేందుకు పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. స్వరాజ్ ఇండి యాను రాజకీయ పార్టీగా గుర్తించే విష యంలో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే వరకూ వేచి చూస్తామంటూ తదుపరి విచారణను జనవరి 18కి వారుుదా వేసింది. -
14వ లీగల్ సెల్ అథారిటీ సదస్సు ప్రారంభం
హైదరాబాద్ : సామాన్య ప్రజలకు న్యాయవ్యవస్థను దగ్గర చేయాలని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 14వ లీగల్ సెల్ అథారిటీ సదస్సును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ సొంత రాష్ట్రంలో ఈ సదస్సు జరగటం సంతోషంగా ఉందన్నారు. బంజారాహిల్స్ పార్క్ హయాత్ హోటల్ లో జరుగుతున్న ఈ సదస్సుకు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొసాలే, కేంద్ర న్యాయశాఖమంత్రి సదానందగౌడ, తెలంగాణ సీఎం కేసీఆర్ తదితరులు పాల్గొన్నారు.