-
స్టార్ హీరో విడాకుల రూమర్స్.. హింట్ ఇచ్చిన భార్య?
మరో స్టార్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఈ మధ్య ఇండస్ట్రీలో పెళ్లి కంటే విడాకులు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. మిగతా వాళ్ల గురించి పక్కనబెడితే తమిళ స్టార్ హీరో జయం రవి విడాకుల న్యూస్ గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు దానికి తగ్గట్లు ఇతడి భార్య చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)ప్రముఖ ఎడిటర్ మోహన్ కొడుకే జయం రవి. చాలా ఏళ్ల నుంచి తమిళంలో హీరోగా చేస్తున్నాడు. ఈ మధ్య 'పొన్నియిన్ సెల్వన్' లాంటి పాన్ ఇండియా మూవీలోనూ కీలక పాత్ర చేశాడు. ఇతడు ఆరతి అనే అమ్మాయిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇన్నేళ్లుగా బాగానే ఉన్నారు గానీ ఈ మధ్య ఎందుకో కలతలు వచ్చినట్లు ఉన్నాయి.మనస్పర్థల్ని తొలగించుకోవాలనుకున్నారు గానీ వర్కౌట్ కాలేదని, దీంతో గత కొన్నాళ్ల నుంచి జయం రవి, ఆరతి విడివిడిగా ఉంటున్నారని కోలీవుడ్ మీడియాలో టాక్. ఇప్పుడు దీన్ని నిజం చేసేలా భర్తతో ఉన్న ఫొటోల్ని ఆరతి ఇన్ స్టా నుంచి తీసేసింది. దీంతో విడాకుల వార్త నిజమేనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లయింది. దీనిపై ఇద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే తప్పితే అసలు విషయం బయటపడదు.(ఇదీ చదవండి: పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్ నివేతా థామస్) View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
ట్రైలర్ రెడీ
హీరో కమల్ హాసన్ , దర్శకుడు శంకర్ కాంబోలో రూపొందిన సినిమా ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’). 1996లో విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. పాతిక సంవత్సరాల తర్వాత ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను తెరకెక్కించారు కమల్హాసన్ అండ్ శంకర్. లైకాప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘భారతీయుడు 2’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల కానుంది.‘భారతీయుడు 2’ మూవీ తెలుగు హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ, సీడెడ్ హక్కులను శ్రీ లక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. తాజాగా ‘ఇండియన్ 2’ ట్రైలర్ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముంబైలో జరగనున్న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఇండియన్ 2’ ట్రైలర్ విడుదలవుతుందని ఫిల్మ్నగర్ సమాచారం.సిద్ధార్థ్, ఎస్జే సూర్య, సముద్ర ఖని, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, రకుల్ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, జయరాం, గుల్షన్ గ్రోవర్, బ్రహ్మానందం ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వరకర్త. కాగా ‘ఇండియన్ 3’ సినిమా వచ్చే ఏడాది ్రపారంభంలో విడుదల కానుందని కోలీవుడ్ టాక్. -
ఈ పాట నా చెల్లెలు కోసం అంటూ యువన్ శంకర్ రాజా ఎమోషనల్
సౌత్ ఇండియా స్టార్ హీరో విజయ్ నటించిన గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రం నుంచి రెండో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో దివంగత సింగర్ భవతారిణి వాయిస్ కోసం ఏఐ టెక్నాలజీ ఉపయోగించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో భారీ బడ్జెట్తో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, స్నేహా, లైలా, మీనాక్షీ చౌదరి వంటి పలువురు ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషించారు. షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా దీనికి యువన్శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.తాజాగా విడుదలైన రెండో సాంగ్ గురించి యువన్శంకర్ రాజా ఎమోషనల్ అయ్యారు. ఈ పాట తనకెంతో ప్రత్యేకమంటూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. 'మొదటి పాటలాగే ఈ పాటను కూడా విజయ్ పాడారు. కానీ ఇందులో నా సోదరి దివంగత భవతారిణి వాయిస్ కూడా ఉంది. ఈ పాట నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ అనుభూతిని వర్ణించడానికి నా వద్ద మాటలు కూడా లేవు. బెంగళూరులో ఈ పాటను నేను మొదట కంపోజ్ చేస్తున్నప్పుడు.. దీనికి నా సోదరి వాయిస్ అయితే బాగుంటుందని భావించాను. ఆమెతోనే ఈ పాటను పాడించాలని బలంగా కోరుకున్నాను. ఆమె ఆరోగ్యం బాగుపడి ఆసుపత్రి నుంచి రాగానే రికార్డ్ చేయవచ్చు అనుకున్నాను. కానీ, అదే సమయంలో ఒక గంట తర్వాత ఆమె ఇక లేదనే వార్త వచ్చింది. అప్పుడు నా గుండె ముక్కలైంది. నేను ఆమె వాయిస్ని ఇలా ఏఐ టెక్నాలజీ ద్వారా ఉపయోగిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఆమె వాయిస్ను మరోసారి వినిపించేలా కష్టపడిన నా సంగీత బృందానికి, ఇందులో భాగమైన వ్యక్తులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇది నాకు చాలా చేదు తీపి క్షణం.' అని యువన్శంకర్ రాజా ఎమోషనల్ అయ్యారు.ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారుసురాలు, గాయనీ, సంగీతదర్శకురాలు భవతారిణి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు సోదరులు యువన్ శంకర్రాజా, కార్తిక్ రాజాలాగే భవతారణి కూడా తండ్రి ఇళయరాజా వారసత్వాన్ని కొనసాగించారు. మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా సింగర్గా కూడా తనదైన ముద్ర ఆమె వేశారు. తాజాగా విజయ్ సినిమాలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆమె వాయిస్ను మరోసారి అభిమానులకు అందించారు యువన్శంకర్ రాజా. సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. -
దళపతి బర్త్ డే స్పెషల్.. 'ద గోట్' వీడియో అదిరింది!
దళపతి విజయ్ పుట్టినరోజు. దీంతో ఫ్యాన్స్ ఆల్రెడీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని డబుల్ చేయడం కోసమా అన్నట్లు ఈ తమిళ హీరో కొత్త మూవీ నుంచి క్రేజీ వీడియో వచ్చింది. ఇదైతే అభిమానులకు మాములు కిక్ ఇవ్వట్లేదు. ఎందుకంటే కేవలం 50 సెకన్ల వీడియోలోనే ఫుల్ హై ఇచ్చారు.(ఇదీ చదవండి: కల్కి 2898 ఏడీ.. రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది)విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ద గోట్' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో తీస్తున్న ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకుడు. ఇదివరకే షూటింగ్ చివరకొచ్చేసింది. సెప్టెంబరు 5న థియేటర్లలో మూవీని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.తాజాగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోల ఇద్దరు విజయ్లు బైక్పై వెళ్తుండగా.. వీళ్లని విలన్స్ ఛేజ్ చేస్తూ ఉంటారు. దీనికి యువన్ శంకర్ రాజా క్రేజీ మ్యూజిక్ ఇచ్చాడు. స్పెషల్ వీడియోతో ఇంతలా ఆకట్టుకున్నారు. మరి ఫుల్ ఎలా ఉంటుందో చూడాలి? ఇకపోతే ఈ మూవీలో ప్రభుదేవా, ప్రశాంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. (ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?) -
నటుడితో కూతురి పెళ్లి.. అర్జున్ కట్నంగా ఏమిచ్చాడో తెలుసా?
కూతురి ప్రేమను అర్థం చేసుకుని నచ్చినవాడితో పెళ్లి జరిపించాడు యాక్షన్ కింగ్ అర్జున్. తన పెద్ద కూతురు ఐశ్వర్య.. లెజెండరీ నటుడు తంబిరామయ్య కుమారుడు ఉమాపతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని తండ్రితో చెప్పింది. ఆమె ప్రేమను అర్థం చేసుకున్న అర్జున్.. తంబిరామయ్యతో మాట్లాడాడు. ఆయన కూడా పచ్చజెండా ఊపడంతో ఈ మధ్యే ఘనంగా పెళ్లి జరిపించారు. అనంతరం చెన్నైలో ఎంతో వేడుకగా రిసెప్షన్ సెలబ్రేట్ చేశారు.కోట్లాది కట్నంతన గారాల కూతుర్ని అత్తారింటికి సాగనంపిన అర్జున్.. అల్లుడికి భారీగానే కట్నం ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారింది. వందలాది కోట్లు కట్నం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. అలాగే కోట్లు విలువ చేసే విలాసవంతమైన బంగ్లాను కానుకగా ఇచ్చాడట! అర్జున్కు మగ పిల్లలు లేరు. ఉన్న ఇద్దరూ కూతుర్లే! అందుకే తను సంపాదించిన ఆస్తులను భారీ మొత్తంలో కట్నంగా ఇచ్చేందుకు అస్సలు వెనకడుగు వేయలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.యాక్టరే కాదు సింగర్ కూడా!అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. విరున్ను అనే ద్విభాషా(మలయాళ, తమిళ) చిత్రం చేస్తున్నాడు. అలాగే తీయవర్ కులైగళ్ నాదుంగ, విడాముయుర్చి సినిమాల్లో నటిస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు, రచయిత, దర్శకనిర్మాత కూడా! అలాగే చిట్టుకురువి (పరశురామ్), కట్టున అవలా కట్టువేండ (జైసూర్య) వంటి పలు సాంగ్స్ సైతం పాడాడు. సర్వైవర్ తమిళ్ షోతో హోస్ట్గానూ మారాడు.చదవండి: సినిమాను మించిన స్టోరీ.. విడాకుల తర్వాత ఆరేళ్లకు..! -
తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి కారణం ఇదే: విజయ్ సేతుపతి
సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఇంత వరకు తెలుగులో డైరెక్ట్గా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఇక్కడ కూడా ఆయనకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి ఉన్న కారణాలను వెళ్లడించారు.విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మహారాజ'. క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్గా విడుదలైన ఈ చిత్రం తెలుగులో కూడా విజయవంతంగా కొనసాగుతుంది. తెలుగు సినిమాల్లో విజయ్ నటించకపోవడానికి ఉన్న కారణాన్ని ఇలా చెప్పాడు. 'నేను తెలుగు సినిమాల్లో భాగం అవ్వాలని రెడీగా ఉన్నాను. అందుకోసం ఇప్పటికే చాలా కథలు కూడా విన్నాను. అయితే, వాటిలో కొన్ని నాకు చాలా నచ్చాయి కూడా. కానీ. ఆ ప్రాజెక్ట్లో వారు నాకు ఇచ్చిన పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక్కడి వారు అందిస్తున్న కథలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వారు ఆఫర్ చేసిన పాత్రకు నేను సెట్ కానని భావించడం వంటి కారణాలతో తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నాను. భవిష్యత్లో నాకు సెట్ అయ్యే పాత్ర ఇక్కడ దొరుకుతుందని ఆశిస్తున్నాను.' అని విజయ్ సేతుపతి అన్నారు.నిథిలన్- విజయ్ సేతుపతి కాంబినేషన్లో వచ్చిన మహారాజ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆధరిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, అభిరామి,భారతీరాజా, మమతా మోహన్దాస్ వంటి వారు కీలక ఇందులో పాత్రలు పోషించారు. విజయ్ సేతుపతి కెరియర్లో 50వ చిత్రంగా జూన్ 14న మహారాజ విడుదలైంది. ఇప్పటికే సుమారు రూ.40 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. -
'మహారాజ' కలెక్షన్స్.. దుమ్మురేపిన విజయ్సేతుపతి
సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మహారాజ'. క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్గా నిథిలన్ ఈ మూవీని తెరకెక్కించారు. అనురాగ్ కశ్యప్, అభిరామి,భారతీరాజా, మమతా మోహన్దాస్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. విజయ్ సేతుపతి కెరియర్లో 50వ చిత్రంగా జూన్ 14న మహారాజ విడుదలైంది.మహారాజ చిత్రం విడుదల సమయంలో ఎలాంటి అంచనాలు లేవు. కానీ, మొదటిరోజు తర్వాత సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమా చాలా బాగుందంటూ కితాబు ఇవ్వడంతో బాక్సాఫీస్ వద్ద మహారాజ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ ప్రముఖ దర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. రోజురోజుకి కలెక్షన్స్ పెరుగుతుండటంతో పంపిణీదారులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.మహారాజ కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 40కోట్లకు పైగానే గ్రాస్ రాబట్టినట్లు సినీ వర్గాలు తెలుపుతున్నాయి. తెలుగులోనే రూ. 10 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ బార్బర్గా నటించి మరోసారి తన సత్తా ఏంటో చూపించారు. నేటి సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రంగా మహారాజ ఉందని ఎక్కువ మంది చెప్పుకొస్తున్నారు. మహారాజ ఓటీటీ డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమాకు మంచి ఆదరణ వస్తుండటంతో ఓటీటీ డీల్ కూడా భారీగానే సెట్ అయినట్లు తెలుస్తోంది.జులై రెండో వారంలో ఓటీటీలోకి మహారాజ విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?
హీరోయిన్ త్రిష వయసు 41 ఏళ్లు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్గా తన హవా చూపిస్తోంది. రీసెంట్ టైంలో పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. 40 దాటిపోయినా సరే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. త్రిషపై వదంతులు చాలానే ఉన్నాయి. అలానే గతంలో ఓసారి నిశ్చితార్థం వరకు వెళ్లి పెళ్లి ఆగిపోయింది. ఇదంతా పక్కనబెడితే ఓ హీరో పెళ్లికి.. త్రిష అడ్డుపడిందని మీకు తెలుసా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)'ఒకరికి ఒకరు' సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అలియా శ్రీరామ్.. త్రిషతో 'మనసెల్లామ్' అనే మూవీ చేశాడు. అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. 2007లో శ్రీకాంత్, వందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వందనకు త్రిష అంతకు ముందే తెలుసు. దీంతో పెళ్లికి ముందు వందనతో నువ్వు శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవద్దని, అతడు మంచివాడు కాదని, ఇంగ్లీష్ మాట్లాడటం రాదని త్రిష చెప్పింది. ఇదే విషయాన్ని వందన, శ్రీకాంత్ దగ్గర చెప్పింది.ఎందుకలా చెప్పావ్ అని త్రిషని శ్రీకాంత్ అడగ్గా.. నువ్వు నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోబోతున్నావ్ కదా, అందుకే ప్రాంక్ చేశానని త్రిష చెప్పుకొచ్చింది. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇదిలా ఉండగా 1999లో 'జోడీ' మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన త్రిష.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీస్ చేసింది. మధ్యలో కొన్నాళ్లు గ్యాప్ వచ్చింది. కానీ '96'తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. 'పొన్నియన్ సెల్వన్' లాంటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి 'విశ్వంభర'లో నటిస్తోంది.(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమలాపాల్.. వీడియో వైరల్!) -
ప్రియురాలితో సింపుల్గా నటుడి ఎంగేజ్మెంట్
తమిళ బిగ్బాస్ కంటెస్టెంట్, నటుడు ప్రదీప్ ఆంటోని పెళ్లికి రెడీ అయ్యాడు. ప్రియురాలితో ఏడడుగులు వేయనున్నాడు. ఈ మేరకు ఆదివారం (జూన్ 16న) అతడి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇరు కుటుంబాలు సహా అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రదీప్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కాగా ప్రదీప్ ఆంటోని తమిళ బిగ్బాస్ ఏడో సీజన్తో పాపులర్ అయ్యాడు. ముక్కుసూటిగా మాట్లాడేవాడు. అయితే ఆ ధోరణి చాలామందికి నచ్చేది కాదు. తన కుళ్లు జోకులు కూడా బిగ్బాస్ హౌస్లో కొందరు ఇష్టపడలేదు. అసభ్య జోకులు వేస్తున్నాడని, బూతులు మాట్లాడుతున్నాడని, తన ప్రవర్తన బాగోలేదని మాయ, పూర్ణిమ, జోవిక, నిక్సెన్, కూల్ సురేశ్, శరవణ విక్రమ్, అక్షయ వంటి పలువురు కంటెస్టెంట్లు బిగ్బాస్కు ఫిర్యాదు చేశారు. దీంతో కమల్ హాసన్ రెడ్ కార్డు చూపించి తనను బయటకు పంపించేశారు. సినిమాల విషయానికి వస్తే దాదా, అరువి, వాళ్ వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. Got engaged, yesterday 🙏 #FamilyMan#EnakulaamNadakathuNuNinaichen #ParavaillaPonnuKudukurangaEnnaNambi#90sKidsSaadhanaigal pic.twitter.com/vyg0DuCnaQ— Pradeep Antony (@TheDhaadiBoy) June 17, 2024 చదవండి: మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ప్రియుడి ఇంట్లో ప్రత్యక్షమైన హీరోయిన్ -
వామ్మో.. శ్రద్ధా ఇంత అందంగా ఉందేంటి? ఇలా అయితే కష్టమే! (ఫొటోలు)
-
బాహుబలి పోస్టర్ను రీక్రియేట్ చేసిన స్టార్..
ఫాదర్స్ డే (జూన్ 16) రోజు అందరూ తమ తండ్రి గొప్పదనాన్ని, మంచితనాన్ని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే పై ఫోటోలో కుమారుడిని పైకెత్తి పట్టుకున్న వ్యక్తి మాత్రం.. పిల్లలు వచ్చాకే తన జీవితం సంతృప్తికరంగా మారిందంటున్నాడు. ఇంతకీ ఇలా చిన్నారులను బాహుబలిలా ఎత్తుకుంది ఎవరో కాదు. దర్శకుడు విఘ్నేశ్ శివన్. ఫాదర్స్ డేను నయనతార, విఘ్నేష్శివన్ తమ కవల పిల్లలతో చాలా జాలీగా గడిపారు. ఈ సందర్భంగా నయనతార తన భర్త విఘ్నేష్శివన్, పిల్లలు ఉయిర్, ఉలగంలతో సరదాగా గడిపిన సన్నివేశాలకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. విఘ్నేష్ శివన్ నీటిలో మునిగి తన పిల్లలను చేతిలో పైకెత్తి పట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన జీవితంలో సంతోషానికి కారణం ఉయిర్, ఉలగం అని, వారిని ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara)చదవండి: కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో హీరోగా చేశాడు. ప్రస్తుతం మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నాడు. రీసెంట్గా ఇతడి కూతురు ఐశ్వర్య పెళ్లి జరిగింది. తమిళ నటుడు తంబిరామయ్య కొడుకు, నటుడు ఉమాపతి రామయ్యతో వివాహం జరిగింది. అయితే వీళ్లిద్దరూ ప్రేమించుకుని పెళ్లి పీటలు ఎక్కారు. సంగీత్, పెళ్లి, రిసెప్షన్ పూర్తయిన తర్వాత వీళ్లంతా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ మూవీ 'లవ్ మీ')'తంబిరామయ్యది మంచి సంప్రదాయ కుటుంబం. ఆ మధ్య ఓ టీవీ షోకి హోస్టింగ్ చేశారు. అందులో ఉమాపతి రామయ్య ఓ కంటెస్టెంట్గా పోటీ చేశాడు. అప్పుడే తన నాకు నచ్చేశాడు. ఓ రోజు నా కూతురు ఐశ్వర్య నాతో విడిగా మాట్లాడాలని అడిగింది. దీంతో అది ప్రేమ వ్యవహారం అని ఊహించా. ఉమాపతి రామయ్య పేరు చెప్పడంతో నేను షాకయ్యా. ఆ తర్వాత ఉమాపతి రామయ్య ఫ్యామిలీతో నేను కట్టించిన ఆంజనేయ స్వామి ఆలయంలో మాట్లాడుకున్నాం. అలా ఐశ్వర్య, ఉమాపతి పెళ్లి జరిగిపోయింది' అని అర్జున్ చెప్పుకొచ్చారు.పెళ్లయిన తర్వాత ఐశ్వర్య సినిమాల్లో నటిస్తారా అని అడుగుతున్నారనే ప్రశ్నకు బదులిచ్చిన అర్జున్.. తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్న ఆమెకు.. పెళ్లి తర్వాత నటించాలా వద్దా అనే విషయం కూడా తెలుసని అర్జున్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: దానికి నేను సరైన వ్యక్తి కాదు.. వాళ్లయితేనే: శ్రుతి హాసన్) -
దానికి నేను సరైన వ్యక్తి కాదు.. వాళ్లయితేనే: శ్రుతి హాసన్
కమల్ హాసన్ పేరు చెప్పగానే విలక్షణ నటుడు అనే పదం మాత్రమే గుర్తొస్తుంది. నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, గీత రచయిత.. ఇలా కమల్కి చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఇతడి కూడా కూతురు శ్రుతి హాసన్ కూడా తక్కువేం కాదు. నటి, సంగీత దర్శకురాలు, గాయని, గీత రచయితగా గుర్తింపు సంపాదించింది. ఈమె ఇటీవల ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం రాసిన ఇంగ్లీష్ పాటని తండ్రి కమలహాసన్ తమిళంలో అనువదించాడు. 'ఇనిమేల్' పేరుతో రూపొందిన ఈ ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ ఇటీవల విడుదలై విశేష ఆదరణ పొందింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు హీరోయిన్)ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే శ్రుతిహాసన్.. రీసెంట్గా ఫ్యాన్స్తో ముచ్చటించింది. మీ తండ్రి కమలహాసన్ బయోపిక్ని మీరు తీస్తారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. దానికి అవకాశమే లేదని బదిలిచ్చింది. తన తండ్రి జీవిత చరిత్రని సినిమాగా తీయడానికి తాను సరైన వ్యక్తి కాదని పేర్కొంది.ఇక్కడ ఎందరో మంచి దర్శకులు ఉన్నారని, తన తండ్రి కమలహాసన్ బయోపిక్ వాళ్లయితే అద్భుతంగా తీయగలరని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇక శ్రుతి సినిమాల విషయానికొస్తే.. గతేడాది చివర్లో 'సలార్'లో నటించి హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: గుండు గీయించుకున్న హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?) -
తంగలాన్ రెడీ
విక్రమ్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్ ’. ఈ మూవీ థియేటర్స్కు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా పా. రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రోడక్షన్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రం నిర్మించారు. కాగా ‘తంగలాన్ ’ సినిమాను తొలుత ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు.ఆ తర్వాత ఏప్రిల్కు వాయిదా వేశారు. ఏప్రిల్లోనూ ‘తంగలాన్ ’ థియేటర్స్కు రాలేదు. అయితే తాజాగా ఈ మూవీని ఆగస్టులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పార్వతీ తిరువోరు, పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. -
కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురి పెళ్లి.. గ్రాండ్గా రిసెప్షన్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్, లెజెండరీ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి జూన్ 10న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇరుకుటుంబాలు సహా దగ్గరి బంధుమిత్రులు సమక్షంలో ఈ వివాహం ఘనంగా జరిగింది. శుక్రవారం (జూన్ 14న) చెన్నై లీలా ప్యాలెస్లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఐశ్వర్య దంపతుల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే హీరో రజనీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా, డైరెక్టర్ లోకేష్ కనక రాజ్, సత్యరాజ్ ,కుష్బూ, విజయ్ సేతుపతి, హీరో శివ కార్తికేయన్, తమిళనాడు బీజేపీి అధ్యక్షులు అన్నామలై, స్నేహ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.చదవండి: చివరిసారిగా అడుగుతున్నా.. ఒక్కసారి వచ్చిపో షారూఖ్.. -
'మహారాజ'.. విజయ్ సేతుపతి నన్ను తీసుకోవద్దన్నారు: నటి
'మహారాజ' సినిమాతో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హాఫ్ సెంచరీ కొట్టాడు. తన కెరీర్లోని 50వ సినిమా అయిన మహారాజకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించాడు. మమతా మోహన్దాస్, అనురాగ్ కశ్యప్, అభిరామి ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 14న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి కూతురు జ్యోతిగా సాచన నమిదాస్ అనే అమ్మాయి నటించింది. చివర్లో నేను..అయితే ఈ సినిమా కోసం సెలక్ట్ చేసినప్పుడు తనను తీసుకోవద్దని సేతుపతి సూచించాడట. తాజాగా ఈ విషయాన్ని సాచన బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. చాలామంది ఆడిషన్కు వచ్చారు. స్క్రీన్ టెస్ట్ సహా అంతా అయిపోయేసరికి చివర్లో నేను, మరో అమ్మాయి మిగిలాం. విజయ్ సేతుపతిగారు నన్ను వద్దని సూచించారు. మరో అమ్మాయిని తీసుకోమని సలహా ఇచ్చారు.నన్ను వద్దన్నారుకానీ దర్శకుడు నితిలన్ సర్ మాత్రం నేను చేస్తేనే బాగుంటుందని చెప్పి సినిమాలో తీసుకున్నారు. షూటింగ్ మొదలైన వారం రోజులకే నన్ను తీసుకుని మంచి పని చేశారని విజయ్ సేతుపతి తండ్రి డైరెక్టర్ను మెచ్చుకున్నారు. చాలామంది నేను ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నారు. కానీ ఈ మూవీ షూటింగ్ చేసేటప్పుడు నా వయసు 18 ఏళ్లు అని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సేతుపతి సైతం సాచన నటనను మెచ్చుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈయన తమిళంలో మూడు సినిమాలు, హిందీలో ఒక చిత్రం చేస్తున్నాడు.చదవండి: ‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి.. -
హిట్ సినిమాకు సీక్వెల్.. ఈసారి ఏకంగా ఫాంటసీ కథతో!
విష్ణు విశాల్, దర్శకుడు రామ్ కుమార్ కాంబోలో వచ్చిన హిట్ సినిమా 'రాక్షసన్'. 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలన విజయాన్ని సాధించింది. తెలుగులోనూ 'రాక్షసుడు' పేరుతో రీమేక్ అయి, హిట్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ రెడీ చేస్తున్నారట.(ఇదీ చదవండి: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)'రాక్షసన్' సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీతో తీయగా.. ఇప్పుడు దీని సీక్వెల్ని ఫాంటసీ జానర్లో తీస్తారట. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. విష్ణు విశాల్ రీసెంట్గా ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్'తో వచ్చాడు. కానీ ఇది ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. దీంతో ఇతడికి 'రాక్షసన్ 2' హిట్ కావడం చాలా కీలకం. మరి ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: నా భర్తతో హోటల్ రూమ్లో ఆ హీరోయిన్.. అందుకే విడాకులు: శ్రీదేవి) -
శంకర్ రూట్ ను ఎంచుకున్న సుకుమార్
-
అర్జున్ కూతురి పెళ్లి వీడియో నెట్టింట వైరల్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి కొద్దిరోజుల క్రితమే ఘనంగా జరిగింది. అయితే, తాజాగా తన ముద్దుల కూతురి పెళ్లి వేడుక వీడియోను అభిమానుల కోసం ఆయన షేర్ చేశాడు. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతితో జూన్ 10న వీరి ప్రేమ వివాహం జరిగింది. చెన్నైలోని హనుమాన్ ఆలయంలో జరిగిన ఈ వేడుకలో చాలామంది ప్రముఖులు పాల్గొని కొత్త దంపతులను ఆశీర్వదించారు.అర్జున్ షేర్ చేసిన వీడియోలో ఐశ్వర్య- ఉమాపతిల పెళ్లి వేడుకను చూడొచ్చు. వీణా శ్రీవాణి అందించిన చక్కని సంగీతంతో వీడియో ప్రారంభమౌతుంది. పెళ్లి పీటలపై ఐశ్వర్యను చూసుకున్న అర్జున్ చాలా మురిసిపోతాడు. అందుకు సంబంధించిన సన్నివేశాలు వీడియోలో చాలానే ఉన్నాయి.మా ముద్దుల కూతురు ఐశ్వర్య తనకు నచ్చిన, మా ప్రియమైన ఉమాపతిని వివాహం చేసుకున్నప్పుడు మేము అనుభవించిన ఆనందం మాటల్లో చెప్పలేము. తన పెళ్లి ఎన్నో మరపురాని జ్ఞాపకాలను ఇచ్చింది. వారిద్దరూ కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టడం చూస్తుంటే మా హృదయాలు గర్వంతో నిండిపోయాయి. 'జీవితకాలం పాటు మీ ప్రేమకు తోడు ఆనందం కూడా జతకూడాలని వేల కోట్ల ఆశీర్వాదాలు అందిస్తున్నాము. మీరు పంచుకునే ప్రేమలాగే మీ ప్రయాణం కూడా అందంగా ఉండాలి. ఎప్పటికీ మేము మీ ఇద్దరినీ ప్రేమిస్తున్నాము.' అని అర్జున్ ఎమోషనల్గా ఒక పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Arjun Sarja (@arjunsarjaa) -
విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ
విజయ్ సేతుపతి సూపర్ యాక్టర్. హీరో అని మాత్రమే కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ అదరగొట్టేస్తుంటాడు. ఇతడు 50వ సినిమా 'మహారాజ'. గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్ చేస్తూ ఈ చిత్రంతో కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటానని సేతుపతి ధీమాగా చెబుతూ వచ్చాడు. తాజాగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. మరి సేతుపతి చెప్పినట్లు హిట్ కొట్టాడా? 'మహారాజ' ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మహారాజ (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. భార్య, కూతురు ఉంటారు. ఓ రోజు యాక్సిడెంట్లో భార్య చనిపోతుంది. కూతురిపై ఇనుప చెత్త డబ్బా పడటంతో ఆమె ప్రాణాలతో బయటపడుతుంది. తన కూతుర్ని కాపాడిన చెత్త డబ్బాకు లక్ష్మీ అని పేరు పెట్టి సొంత మనిషిలా చూసుకుంటారు. అయితే ఓ రోజు చెవిపై కట్టుతో పోలీస్ స్టేషన్కి వెళ్లిన మహారాజ.. తన లక్ష్మీ కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు లక్ష్మీని పట్టుకుని మహారాజకు అప్పగించారా లేదా అనేదే స్టోరీ. (Maharaja Movie Review)ఎలా ఉందంటే?కొన్ని సినిమాల గురించి ఏ మాత్రం ఎక్కువ మాట్లాడుకున్నా ట్విస్టులు రివీల్ అయిపోతాయి. చూసేటప్పుడు ఫీల్ మిస్ అవుతుంది. 'మహారాజ' సరిగ్గా అలాంటి సినిమానే. రెండున్నర గంటల సినిమానే గానీ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. ఎందుకంటే సరదాగా మొదలైన మూవీ కాస్త మెల్లమెల్లగా సీరియస్ టోన్లోకి మారుతుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి అసలు ట్విస్ట్ వస్తుంది. ఇక అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు ఊహకందని మలుపులు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.హీరో భార్య, కూతురు ఓ ఇంట్లో కూర్చుని ఉండగా.. సడన్గా ఓ లారీ వచ్చి వాళ్లపైకి దూసుకెళ్తుంది. ఈ ప్రమాదంలో హీరో భార్య చనిపోతుంది. ఓ చెత్త డబ్బా వల్ల కూతురు బతుకుంది. దీని తర్వాత వర్తమానంలోకి వచ్చేస్తారు. అక్కడి నుంచి ఫస్టాప్ అంతా సరద సరదాగా వెళ్లిపోతూ ఉంటుంది. హీరో అసలు పోలీస్ స్టేషన్లో ఎందుకు అలా ఉండిపోయాడా? ఎందుకు అందరితో తన్నులు తింటున్నాడా అని డౌట్ వస్తుంది. కానీ ఎక్కడో ఓ మూల ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అని డౌట్ వస్తుంది. కానీ మెల్లమెల్లగా స్టోరీలోకి వెళ్లేసరికి చూస్తున్న ఆడియెన్స్కి కిక్ వస్తుంది.ఏదో సినిమా తీస్తున్నాం కదా అని అనవసరంగా పాటలు, కమర్షియల్ అంశాల పేరిట ఫైట్స్ పెట్టలేదు. ఏదో ఎంత కావాలో ఏ సీన్ ఎక్కడుండాలో ఫెర్ఫెక్ట్ కొలతలతో తీసిన మూవీ 'మహారాజ' అని చెప్పొచ్చు. అలానే చూస్తున్నప్పుడు ఎక్కడా సినిమా చూస్తున్నామని అనిపించదు. మన పక్కింట్లో వాళ్ల జీవితం చూస్తున్నం అనిపించేంతలా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం.ఎవరెలా చేశారు?విజయ్ సేతుపతి పాత్రే డిఫరెంట్. దేనికి కూడా త్వరగా రియాక్ట్ అవడు. చాలా నెమ్మదిగా ఎమోషనల్గా బరస్ట్ అవుతాడు. చూడటానికి మామూలుగా కనిపిస్తాడు గానీ ఒక్కోసారి ప్రేక్షకుల మైండ్ పోయాలా ప్రవర్తిస్తాడు. దీన్ని సేతుపతి పిక్టర్ ఫెర్ఫెక్ట్గా చేశాడు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్గా చేశాడు. కృూరంగా కనిపిస్తూనే చివర్లో ఎమోషన్తో మనసు పిండేస్తాడు. మమతా మోహన్ దాస్, అభిరామి తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఒకటి రెండు సీన్స్లో కనిపించే భారతీ రాజా, ఎస్సైగా నటరాజన్ సుబ్రమణియం ఆకట్టుకున్నారు.టెక్నికల్ విషయాలకొస్తే.. స్క్రీన్ ప్లే రాసుకున్న డైరెక్టర్ అండ్ రామ్ మురళి అనే అతన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఫెర్ఫెక్ట్ మూవీ అందించారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన అజనీష్ లోక్నాథ్ సీట్లలో కూర్చోబెట్టేశాడు. స్క్రీన్ ప్లేకి తగ్గట్లు ఎడిటింగ్ సరిగ్గా సరిపోయింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. అయితే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే హింస, క్రైమ్ ఇందులో గట్టిగానే ఉంది. పాటలు, రొమాంటిక్ సాంగ్స్ కూడా ఇందులో ఉండవు. సో డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వారికి మాత్రం 'మహారాజ' నచ్చేస్తుంది. సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ మాత్రం అస్సలు రివీల్ చేయొద్దు. (Maharaja Movie Review In Telugu)-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
అనుమానాస్పద స్థితిలో నటుడు మృతి
చెన్నై: తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తమిళనాడు పాలవక్కంలోని తన గదిలో బుధవారం (జూన్ 12న) విగత జీవిగా కనిపించారు. గత రెండు రోజులుగా ప్రదీప్కు అతడి స్నేహితుడు ఫోన్ చేస్తుండగా అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు ప్రదీప్ ఇంటికి వెళ్లి చూడగా అతడు శవమై కనిపించాడు. గుండెపోటు వల్లే నటుడు మరణించాడని భావిస్తున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కాగా ప్రదీప్.. తెగిడి అనే సినిమాతో పాపులర్ అయ్యారు. విలన్గా, కమెడియన్గా పలు సినిమాలు చేశారు. టెడ్డీ, ఇరుంబు తిరై, తమిళుకు ఎన్ ఒండ్రై అళతువం, లిఫ్ట్, మనం, కెన్నడీ క్లబ్, ఆడై.. ఇలా అనేక తమిళ చిత్రాల్లో నటించారు. చివరగా రాఘవ లారెన్స్ 'రుద్రన్' సినిమాలో కనిపించారు.చదవండి: అది చూసే ప్రేమలో పడ్డా.. పెళ్లనగానే రిజెక్ట్.. ఎందుకంటే?: నటుడు -
ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ధనుష్ సినిమా నామినేట్
తమిళ చిత్రసీమలో అగ్రనటుడిగా సత్తా చాటుతున్నాడు ధనుష్. ఆయన నటుడిగానే కాకుండా గాయకుడు, దర్శకుడు, నిర్మాత, గీత రచయిత ఇలా మల్టీటాలెంటెడ్ కావడంతో ఆయనకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్’ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో కెప్టెన్ మిల్లర్ ఎంట్రీ ఇచ్చింది.అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, శివరాజ్ కుమార్, నివేద సతీష్ సహా పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సినిమా విడుదలై సమయంలో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ధనుష్కు ఉన్న క్రేజ్ వల్ల రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.అయితే, తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. లండన్లో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయిందని తెలిపింది. ఉత్తమ విదేశీ సినిమా విభాగంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం నామినేట్ అయినట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.ధనుష్ ప్రస్తుతం తన 50వ చిత్రం రాయన్కి దర్శకత్వం వహించి, నటించారు. ఈ చిత్రాన్ని జూలై 26న విడుదల చేయనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కథానాయకులుగా కుబేర చిత్రంలో కనిపించనున్నారు. పాన్ ఇండియా రేంజ్లో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. -
పెళ్లయ్యాక ఫస్ట్ ప్రెగ్నెన్సీ.. సంతోషం ఎంతోకాలం నిలవలేదు: నమిత
సొంతం సినిమాతో హీరోయిన్గా కెరీర్ ఆరంభించింది నమిత. జెమిని, నాయకుడు, బిల్లా.. ఇలా పలుగు తెలుగు చిత్రాలతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. 2020లో మాయ అనే తమిళ సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైవాహిక జీవితంలోని విషయాలను పంచుకుంది.ప్రెగ్నెన్సీ..2021లో తొలిసారి ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు నేను సూరత్లో ఉన్నాను. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది. నాతో పాటు అమ్మానాన్న ఉన్నారు. వెంటనే నాన్న దగ్గరకు వెళ్లి నువ్వు తాత కాబోతున్నావని చెప్పాను. తర్వాత నా భర్తతో సంతోషాన్ని పంచుకున్నాను. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. నాలుగునెలలకే గర్భస్రావం అయింది. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను. ఏడు నెలలదాకా టెన్షన్మూడు నెలలకే ట్విన్స్ అని తెలిసింది. ఎప్పుడూ బెడ్ మీదే ఉండేదాన్ని. ఎక్కువగా నడవకూడదని, మెట్లు ఎక్కకూడదని మా ఆయన ఆంక్షలు పెట్టేవారు. ఏడు నెలల వరకు పొట్ట కనిపించలేదు. అప్పుడు చాలా భయమేసింది. కానీ ఏడో నెల తర్వాత పొట్ట పెరగడంతో ఊపిరి పీల్చుకున్నాను అని చెప్పుకొచ్చింది. కాగా నమిత.. బిజినెస్మెన్ వీరేంద్ర చౌదరిని 2017లో పెళ్లాడింది. వీరికి 2022లో ట్విన్స్ జన్మించారు.చదవండి: సిగరెట్, మందు.. అమ్మో.. మా నాన్న చాలా స్ట్రిక్టు! -
Shruti Haasan: ఫేవరెట్ కలర్ డ్రెస్లో పటాకాలా మెరుస్తున్న హీరోయిన్ (ఫోటోలు)
-
దీపావళికి ఐదు సినిమాలు.. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కూడా!
దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగ సందర్భాల్లో భారీ చిత్రాలు తెరపైకి వస్తుంటాయి. అదే విధంగా ఈ దీపావళికి తమిళంలో పాంచ్ పటాక్గా ఐదు చిత్రాలు బరిలోకి దిగడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. వాటిలో విడుదలై– 2 చిత్రం ఒకటని తెలుస్తోంది. వెట్రిమారన్ దర్శకత్వంలో హాస్యనటుడు సూరి కథానాయకుడిగా, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన చిత్రం విడుదలై. గతేడాది మార్చి 21న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా దీనికి సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో విజయ్ సేతుపతి పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీని ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై ఎల్రెడ్.కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇకపోతే ఇదే దీపావళికి మరో నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అందులో అజిత్ కథానాయకుడిగా నటించిన విడాముయర్చి, సూర్య హీరోగా నటిస్తున్న కంగువ చిత్రాలతో పాటు, ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ఎల్ఐసీ, కవిన్ హీరోగా నటిస్తున్న కిస్ చిత్రాలు దీపావళి రేసుకు సిద్ధం అవుతున్నాయని సమాచారం. మరి అప్పటివరకు వీటిలో ఏది బరిలో ఉంటుందో, ఏది తప్పుకుంటుందో చూడాలి.