Krishna Chaitanya
-
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ గ్యాంగ్ స్టర్ మూవీ కాదు: దర్శకుడు
‘గోదావరి అనగానే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా చూపిస్తారు. కానీ నిజానికి మా ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనుషులను బట్టి నేరాలు జరుగుతాయి. ఆ ఆలోచన నుంచి పుట్టిన కథే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అని దర్శకుడు కృష్ణ చైతన్య అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ కృష్ణ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కంటే ముందే నేను దర్శకత్వం వహించాల్సిన సినిమాలు ఉన్నా.. అనివార్య కారణాల వల్ల అవి అలస్యం అయ్యాయి. చాలా గ్యాప్ రావడంతో నాలో భయం మొదలైంది. ఇదే విషయాన్ని త్రివిక్రమ్తో పంచుకున్నాను. ఆయన సూచనతో విశ్వక్ సేన్కి కథ చెప్పగా.. అది ఆయనకు నచ్చడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదలైంది.⇒ ఇది కల్పిత కథనే. దీనిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే.. దీని ద్వారా ఒక మంచి కథను చూపించవచ్చు, ఒక మంచి ఎమోషన్ ను చూపించవచ్చు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ విజువల్ ని చూపించవచ్చు అని భావించాను. నా ఆలోచనకు తగ్గట్టుగా సితార లాంటి మంచి నిర్మాణ సంస్థ దొరికింది. కొందరు ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది గ్యాంగ్ స్టర్ మూవీ కాదు.⇒ విశ్వక్ సేన్ కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. మొదట ఏదైతే కథ రాసుకున్నామో.. అదే విశ్వక్ తో చేయడం జరిగింది. అయితే విశ్వక్ తెలంగాణలో పెరిగిన వ్యక్తి కాబట్టి.. గోదావరి మాండలికాన్ని సరిగ్గా చెప్పగలడా అని కొంచెం సందేహం కలిగింది. కనీసం రెండు మూడు నెలలు ట్రైనింగ్ అవసరమవుతుంది అనుకున్నాను. కానీ నెల రోజుల లోపులోనే నేర్చుకొని ఆశ్చర్యపరిచాడు.⇒ మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. సంభాషణల పరంగా రెండు చోట్ల మాత్రమే మ్యూట్ వేశారు. అవే మీరు ట్రైలర్ లో చూశారు. ట్రైలర్ కి సెన్సార్ అభ్యంతరాలు ఉండవు. అందుకే ఆ సన్నివేశాల్లోని భావోద్వేగాన్ని బాగా అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆ సంభాషణలను ట్రైలర్ లో అలాగే ఉంచడం జరిగింది. సినిమాలో మాత్రం ఆ రెండు అభ్యంతరకర పదాలు వినిపించవు.⇒ యువన్ శంకర్ రాజా లాంటి ప్రముఖ సంగీత దర్శకుడితో పని చేయాలంటే మొదట భయపడ్డాను. ఆయన స్థాయికి నా మాట వింటారా అనుకున్నా. కానీ ఆయన మాత్రం తన అనుభవంతో.. నేను కోరుకున్నట్టుగా, సినిమాకి కావాల్సిన అద్భుతమైన సంగీతాన్ని అందించారు.⇒ ఇది నాకు చాలా చాలా ఇష్టమైన కథ. ఆ ఇష్టంతోనే ఈ సినిమా చేశాను. నేను అనుకున్న భావోద్వేగాలు తెరమీద చక్కగా పలికాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మాత్రం హృదయాన్ని హత్తుకుంటాయి.⇒ మహా భారతంలోని "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాట నాకు చాలా ఇష్టం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాటే చెబుతాను. -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
మార్చిలో గోదావరి గ్యాంగ్
విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటించగా, నటి అంజలి ముఖ్యమైనపాత్రను పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, వెంకట్ ఉప్పుటూరి, ఇన్మమూరి గోపీచంద్ నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీ మారింది. తొలుత డిసెంబరు 8న సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే 2024 మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ‘‘చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుండి ధనవంతుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథతో ఈ చిత్రం రూపొందింది. అతని ప్రయాణంలో రాజకీయ చిక్కులు కూడా ఉంటాయి. ఈ సినిమాలో విశ్వక్ సేన్ గ్రే క్యారెక్టర్లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మధాడి. -
తేడాలొస్తే...
‘మేము గోదారోళ్ళం.. మాట ఒకటే సాగదీస్తాం.. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం’ అంటున్నారు విశ్వక్ సేన్.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ హీరోగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రంలోని డైలాగ్ ఇది. ఈ చిత్రానికి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టైటిల్ని ఖరారు చేసినట్లు ప్రకటించి, యూనిట్ రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్లో పైన పేర్కొన్న డైలాగ్స్ ఉన్నాయి. ‘‘క్రూరమైన ప్రపంచంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదిగిన వ్యక్తిగా విశ్వక్ సేన్ గ్రే క్యారెక్టర్ చేస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. నేహా శెట్టి కథానాయికగా, అంజలి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మధాది. -
డిసెంబరులో ఘంటసాల ది గ్రేట్
ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. గాయకుడు కృష్ణ చైతన్య టైటిల్ రోల్ చేయగా, ఘంటసాల భార్య సావిత్రి ఘంత్రను మృదుల చేశారు. ‘ఘంటసాల ఘంటశాల’ సంకలనకర్త సీహెచ్ రామారావు దర్శకత్వంలో గాయకుడు జీవీ భాస్కర్ నిర్మాణ సారథ్యంలో ఫణి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరులో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సీహెచ్ రామారావు మాట్లాడుతూ– ‘‘ఘంటసాలగారి గురించి తెలియని చాలా విషయాలను ఈ సినిమాలో చూపించనున్నాం. ఘంటసాలగా కృష్ణచైతన్య సరి΄ోయారని గతంలో ఎస్పీ బాలుగారు అన్నారు. అదే మా తొలి సక్సెస్గా భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఘంటసాలగారి ఘంత్ర చేయడం నా అదృష్టం’’ అన్నారు కృష్ణచైతన్య. ‘‘2018లోనే ఈ సినిమా టీజర్ను ఎస్పీ బాలుగారితో రిలీజ్ చేయించాం. అయితే ఘంటసాలగారి కుటుంబంతో కొన్ని లీగల్ సమస్యలొచ్చాయి. ఇప్పుడు వాళ్లే ఈ సినిమాకు స΄ోర్ట్ ఇస్తున్నారు’’ అన్నారు జీవీ భాస్కర్. చిత్ర సమర్పకులు లక్ష్మీ ప్రసాద్ ఘంల్గొన్నారు. -
వరస సినిమాలు తో దూసుకుపోతున్న విశ్వక్
-
విశ్వక్ సేన్ కొత్త సినిమా.. 30 ఏళ్లు వెనక్కి..
విశ్వక్సేన్ హీరోగా నటించనున్న కొత్త చిత్రం బుధవారం ఆరంభమైంది. తొలి సీన్కు నిర్మాత సుధాకర్ చెరుకూరి కెమెరా స్విచాన్ చేయగా నిర్మాత దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. నిర్మాత వెంకట్ బోయనపల్లి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు వెంకీ అట్లూరి, నిర్మాత రామ్ ఆచంట స్క్రిప్ట్ను చిత్రయూనిట్కు అందించారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రమిది. 1990వ దశకంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కథతో ఈ చిత్రం ఉంటుంది అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా అనిత్ మధాది సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించనున్నాడు. కాగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ ఇటీవలే దాస్ కా ధమ్కీ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ చిత్రానికి అతడే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. -
‘కథ వెనుక కథ’ వాయిదా
విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘కథ వెనుక కథ’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సంస్థ దండమూడి బాక్సాఫీస్ బ్యానర్పై అవనీంద్ర కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 24న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు కథ వెనుక కథ చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ సందర్బంగా ... సహ నిర్మాత సాయి గొట్టిపాటి మాట్లాడుతూ ‘‘మా కథ వెనుక కథ చిత్రాన్ని మార్చి 24న రిలీజ్ చేయాలనుకున్నాం. అయితే కొన్ని అనివార్య కారణాలతో సినిమా రిలీజ్ను వాయిదా వేశాం. త్వరలోనే మంచి రిలీజ్ డేట్ చూసుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం’ అన్నారు. -
కథ వెనుక కథ టీజర్ చూశారా?
విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కథ వెనుక కథ’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో అవనీంద్ర కుమార్ నిర్మించారు. ఈ మూవీ టీజర్ను డైరెక్టర్ గోపీచంద్ మలినేని రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ ఆసక్తిగా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. అవనీంద్ర కుమార్ మాట్లాడుతూ– ‘‘ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించి, కొత్త కాన్సెప్ట్ చిత్రాలను అందించాలనే ఆలోచనతో దండమూడి బాక్సాఫీస్ సంస్థని స్థాపించాను. తొలి చిత్రంగా సస్పెన్స్, థ్రిల్ నేపథ్యంలో ‘కథ వెనుక కథ’ తీశాం. సిటీలో జరుగుతున్న హత్యలకు ఓ వ్యక్తి కారణం కాదు, ఓ గ్యాంగ్ అని పోలీసాఫీసర్ సత్య ఎలా తెలుసుకుంటాడు? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు. -
కృష్ణ చైతన్య–మహేశ్ జోడీకి స్వర్ణం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిదో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన పురుషుల బీచ్ వాలీబాల్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కృష్ణ చైతన్య–మహేశ్ జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో కృష్ణ చైతన్య–మహేశ్ ద్వయం 22–24, 23–21, 15–11తో కృష్ణంరాజు–నరేశ్ (ఆంధ్రప్రదేశ్) జోడీపై విజయం సాధించింది. 2015 కేరళ జాతీయ క్రీడల బీచ్ వాలీబాల్ ఫైనల్లో కృష్ణంరాజు–నరేశ్ జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం నెగ్గిన కృష్ణ చైతన్య ఏడేళ్ల తర్వాత అదే జంటను ఓడించి ఈసారి స్వర్ణ పతకం సాధించడం విశేషం. 2015 కేరళ జాతీయ క్రీడల్లో రవీందర్ రెడ్డితో కలిసి కృష్ణ చైతన్య బరిలోకి దిగాడు. ఈసారి మహేశ్తో జతకట్టిన కృష్ణ చైతన్య పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. కనోయింగ్లో 1000 మీటర్ల స్ప్రింట్ విభాగంలో తెలంగాణకు చెందిన అమిత్ కుమార్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు. అమిత్ రేసును 4ని:31.533 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్లో సర్వీసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ 57 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5–0తో రోహిత్ మోర్ (ఢిల్లీ)పై గెలిచాడు. -
పొలిటికల్ డ్రామా షురూ
వెండితెరపై పొలిటికల్ టర్న్ తీసుకున్నారు శర్వానంద్. కృష్ణ చైతన్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్లో జరిగింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తుండగా, ప్రియమణి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పూజా కార్యక్రమంలో దర్శకులు చందూ మొండేటి, హను రాఘవపూడి, సుధీర్ వర్మ, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్లు స్క్రిప్ట్ను దర్శకుడికి అందించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇవ్వగా, కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబరులో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
జగన్ బొమ్మ చూపించు నాయనా.. బామ్మ ఆప్యాయత
శ్రీకాకుళం : పోలాకి మండలం ప్రియాగ్రహారంలో జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్యకు శుక్రవారం ఓ హృద్యమైన అనుభవం ఎదురైంది. పార్టీ నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్తూ కోరాడ అమ్మాయమ్మ(84) ఇంటికి వెళ్లారు. బామ్మా నీకు పింఛన్ వస్తుందా.. అని అడిగితే.. ‘ఆ వస్తుంది గానీ నాకు జగన్ బొమ్మ చూపించు నాయనా..!’ అని ఆప్యాయంగా అడి గింది ఆ బామ్మ. దీంతో కృష్ణచైతన్య సీఎం చిత్రాన్ని బామ్మకు చూపించగా ఆమె మురిసిపోయారు. వేలిముద్ర పడకపోయినా సచివాలయం నుంచి ఒక వ్యక్తి వచ్చి పింఛను ఇస్తున్నారని ఆమె చెప్పి దీవించారు. -
టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్’పై ..శాప్ నెట్ చైర్మన్ కృష్ణ చైతన్య ఫైర్ అయ్యారు
-
అద్దంకిలో టీడీపీ బరితెగింపు..
అద్దంకి: అద్దంకిలో టీడీపీ బరితెగించింది. ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిని తన కారులో ఎక్కించుకువచ్చి నామినేషన్ను విత్డ్రా చేయించారు. టీడీపీ ఎమ్మెల్యే దిగజారుడుతనాన్ని వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణచైతన్య విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. వివరాల్లోకి వెళ్తే.. అద్దంకి నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 8వ వార్డులో వైఎస్సార్సీపీ తరఫున ఇద్దరు, టీడీపీ తరపున ఇద్దరు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కాగా టీడీపీ తరపున 8వ వార్డుకు నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు అదే రోజున స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ తరఫున 8వ వార్డుకు పోటీ లేకపోవడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ తరపున బీఫారం తీసుకుని నామినేషన్ వేసిన అభ్యర్థి పరశురాంను ఉపసంహరణ సమయానికి ఒక నిమిషం మాత్రమే సమయం ఉండగా తన సొంత కారులో తీసుకుని వచ్చి నామినేషన్ను ఉపసంహరణ చేయించారు. ఆధారాలున్నాయి, సీరియస్గా తీసుకుంటాం.. టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇంతగా దిగజారుతాడని అనుకోలేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాచిన చెంచు గరటయ్య ఖండించారు. 8వ వార్డుకు మా పార్టీ తరఫున బీ ఫారం ఇచ్చిన ఎస్టీ అభ్యర్థిని ప్రలోభపెట్టి తన కారులో ఎక్కించుకుని వచ్చి నామినేషన్ ఉపసంహరణ చేయించడం దారుణమని మండిపడ్డారు. రెండేళ్లుగా ఇంట్లో కూర్చోని ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకొని ఎమ్మెల్యే రవికుమార్..ఇప్పుడు చంద్రబాబు వద్ద షో చేయడం కోసమే ఇదంతా చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 8వ వార్డుకు నామినేషన్లు వేసిన మీ అభ్యర్థులు వారే వచ్చి నామినేషన్లు ఉపసంహరించుకోవడం నీకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటామని, ఈ సంఘటనకు సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ మా దగ్గరున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని పేర్కొన్నారు. మిగిలిన 19 వార్డుల్లో వైఎస్సార్ సీపీ విజయబావుటా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చదవండి చంద్రబాబు మాట.. అబద్ధాల మూట కట్టుకథ అల్లేసింది.. సీసీ టీవీ పట్టేసింది.. -
‘కృష్ణ చైతన్య మృతదేహాన్ని భారత్కు తీసుకొస్తాం’
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడకు చెందిన కృష్ణ చైతన్య స్వీడన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తూ.. నాలుగు రోజుల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. కరోనా ప్రభావంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయడంతో కృష్ణ చైతన్య మృతదేహం స్వీడన్లోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ వంగా గీతా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి.. శ్రీరామ్ నగర్లో నివాసం ఉంటున్న కృష్ణ చైతన్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీ విజయసాయి రెడ్డి సహకారంలో విదేశాంగ మంత్రి, భారత ఎంబసీతో మాట్లాడి కృష్ణ చైతన్య మృతదేహాన్ని భారత్కు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తామని వంగా గీతా భరోసానిచ్చారు. (జనతా కర్ఫ్యూకు యంగ్ టైగర్ సైతం.. ) -
నితిన్ పవర్పేట
నితిన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు ‘పవర్పేట’ అనే టైటిల్ ఖరారైంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. గత ఏడాది నితిన్ – కృష్ణచైతన్య కాంబినేషన్లో ‘ఛల్ మోహన్ రంగ’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా నటించిన ఇష్క్ (2012), ‘గుండెజారి గల్లంతయ్యిందే’ (2013), ‘అ ఆ’ సినిమాలకు కృష్ణచైతన్య పాటలు రాశారు. మరోవైపు ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న ‘భీష్మ’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు నితిన్. అలాగే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్న ‘చదరంగం’, వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ‘రంగ్ దే’ చిత్రాలతో నితిన్ వచ్చే ఏడాది వేసవి వరకు ఫుల్ బిజీ. -
సైకలాజికల్ థ్రిల్లర్
అరుణ– కళ్యాణి టాకీస్ పతాకంపై కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘ఒకడు’. శనివారం హైదరాబాద్లో ఈ చిత్రం ప్రారంభమైంది. అఖిల్రెడ్డి హీరోగా పరిచయమవుతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి శేఖర్ మాస్టర్ క్లాప్నివ్వగా, సత్య మాస్టర్ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్ను దర్శకుడు బీవీయస్ రవి దర్శకునికి అందించారు. ఈ సందర్బంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ – ‘‘ఇది నా మొదటి చిత్రం. అందరూ అనుభవం ఉన్న టెక్నీషియన్లతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సంగీత దర్శకులు మణిశర్మ గారు స్వరాలందించడం హ్యాపీ. మొత్తం ఐదు ఫెడ్యూల్స్లో సినిమా పూర్తి చేస్తాం ఈనెల 16న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ సినిమా మంచి మెసేజ్తో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్ర నిర్మాత ముత్తయ్య అన్నారు.‘‘నేను చేస్తున్న మొదటి సినిమాకు మంచి స్క్రిప్ట్ కుదిరింది. మంచి సైకలాజికల్ థ్రిల్లర్ను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం’’ అన్నారు అఖిల్రెడ్డి. -
మూడు మూవీలాట!
చెప్పాల్సిన కథ ఒక్క సినిమాలోనే సరిపోనప్పుడు రెండు భాగాలుగా డివైడ్ చేసి, తెరకెక్కిస్తారు దర్శకులు. ‘బాహుబలి, ఎన్టీఆర్’.. ఇలా రెండు భాగాలుగా రూపొందిన సినిమాలున్నాయి. లేటెస్ట్గా మూడు భాగాల చిత్రాన్ని అందించడానికి రెడీ అయ్యారు దర్శకుడు కృష్ణ చైతన్య, హీరో నితిన్. ‘రౌడీ ఫెల్లో, ఛల్ మోహన్ రంగ’ సినిమాలతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు పొందారు పాటల రచయిత కృష్ణ చైతన్య. నితిన్ సొంతబ్యానర్ శ్రేష్ట్ మూవీస్పై తాజా చిత్రం రూపొందనుంది. ‘‘మొదటి భాగం పూర్తి కథను నితిన్కు నరేట్ చేశారు కృష్ణచైతన్య. మిగతా రెండు పార్ట్స్ అవుట్లైన్ వినిపించారు. చిత్రకథలో హీరో, హీరోయిన్, మిగతా పాత్రలన్నింటికీ కూడా ఒకేలాంటి ప్రాముఖ్యత ఉంటుంది. ఎమోషనల్గా సాగే ఈ డ్రామా డిసెంబర్లో సెట్స్ మీదకు వెళ్తుంది’’ అని చిత్ర సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదో మాస్ సబ్జెక్ట్ అని, ‘పవర్ పేట’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని ఫిల్మ్నగర్లో ఓ వార్త ప్రచారంలో ఉంది. ‘నా కెరీర్లో చాలెంజింగ్ సినిమా ఇది’ అని నితిన్ ఆల్రెడీ ట్వీటర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తెలుగులో మూడు భాగాలుగా తెరకెక్కబోతోన్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. -
నితిన్ కొత్త సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్
శ్రీనివాస కల్యాణం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్.. శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ను ప్రకటించాడు. ఇప్పటికే వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మాతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన నితిన్.. తాజాగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు పవర్ పేట అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. అంతేకాదు నితిన్ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా 2020 సమ్మర్లో ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించానున్నారు. -
నితిన్ బర్త్ డే గిఫ్ట్.. లైన్లోకి మరో ప్రాజెక్ట్
ఇప్పటికే రెండు సినిమాలను లైన్లో పెట్టిన యంగ్ హీరో నితిన్, తన పుట్టిన రోజు సందర్భంగా మరో ప్రాజెక్ట్ను ప్రకటించాడు. శ్రీనివాస కల్యాణం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మా సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమాను కూడా త్వరలో ప్రారంభించనున్నాడు. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్ మీదకు రాకముందే ఈ రోజు మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. తనతో ఛల్ మోహన్ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టుగా తెలిపాడు నితిన్. ఈ సినిమాను సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీ బ్యానర్ నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించనున్నాడు. 2020 సమ్మర్లో ప్రారభం కానున్న ఈ ప్రాజెక్ట్ తన కెరీర్లో ప్రతిష్టాత్మకమైన సినిమా అని ట్వీట్ చేశాడు నితిన్. Announcement 3 My most ambitious and challenging film of my career!!super duper kicked about it..✊ Dir krishna Chaitanya Prod sreshth movies Shoot starts frm year end and summer 2020 release!! pic.twitter.com/F5cf6yKDsb — nithiin (@actor_nithiin) 29 March 2019 -
ఘంటసాలగారిలా పాడటం ఎవరికీ సాధ్యం కాదు
‘‘ఘంటసాలగారికి సంబంధించిన నిజాలు చాలామందికి తెలియవు. ఆయన పాటలే కాదు.. ఆయన వ్యక్తిత్వం గురించి ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా సి.హెచ్.రామారావు దర్శకత్వంలో ‘ఘంటసాల’ సినిమా తెరకెక్కుతోంది. గాయకుడు కృష్ణ చైతన్య ఘంటసాల పాత్రలో, ఆయన సతీమణి మృదుల ఘంటసాల సతీమణి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సంగీతంలో పద్యాలు ఎలా పాడాలో నాకు నేర్పించింది ఘంటసాలగారే. వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిత్వంలో కూడా ఎంత వినయంగా ఉండాలి, ఎలా సంస్కారంగా ఉండాలనే విషయాలను ఆయన దగ్గరే నేర్చుకోవాలి. కృష్ణుడంటే భారతం.. రామాయణం అంటే రాముడు.. పాటలంటే అందరికీ ఘంటసాలగారు గుర్తొస్తారు. సినిమాల్లోకి రాక మునుపు ఆయన స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. ఆయనతో కలిసి ఆరేళ్ల పాటు జర్నీ చేసి, ఐదారు సినిమాలకు పనిచేశా. ఘంటసాలగారిని నా తండ్రి సమానుడిగా భావిస్తా. ఆయన విగ్రహావిష్కరణ సమయంలో నేను పడ్డ కష్టాలెన్నో నాకే తెలుసు. ఆయనలా పాడటం ఎవరికీ సాధ్యం కాదు. ఘంటసాల తర్వాతే.. ఎవరైనా గొప్పగా పాడుతున్నారని అంటారు. కానీ.. ఆయనంత గొప్పగా పాడుతున్నారని చెప్పరు. చెప్పలేరు.. చెప్పకూడదు కూడా. ఈ చిత్రం సెన్సార్ కావడానికి ముందే ఘంటసాలగారి భార్య సావిత్రమ్మకు సినిమా చూపించి ఏమైనా మార్పులుంటే చేస్తే మంచిది’’ అన్నారు. ‘‘ఘంటసాలగారి బయోపిక్ ఘన విజయం సాధించాలి’’ అని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ‘‘ఘంటసాలగారిపై సినిమా చేస్తే నేనే చేయాలనే స్వార్థంతోనే ఈ సినిమా చేశా. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు సి.హెచ్.రామారావు. ‘‘ఘంటసాలగారితో పోల్చదగ్గ వ్యక్తి బాలసుబ్రహ్మణ్యంగారు మాత్రమే’’ అని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు. -
గుండెను తడిమేలా ఘంటసాల ది గ్రేట్
‘‘ఘంటసాల అంటే పాట. పాట అంటే ఘంటసాల అని మనందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలియజేసేదే ఈ చిత్రం’’ అని ‘ఘంటసాల ది గ్రేట్’ చిత్రబృందం పేర్కొంది. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. ఘంటసాల పాత్రను గాయకుడు కృష్ణచైతన్య పోషించారు. సీహెచ్ రామారావు దర్శకత్వంలో ఆయన సతీమణి లక్ష్మీ నీరజ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పోస్టర్స్ను దర్శకుడు రాఘవేంద్రరావు రిలీజ్ చేశారు. డిసెంబర్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం గురించి తుమ్మల రామసత్యనారాయణ మాట్లాడుతూ – ‘‘రామారావు చేసిన ఈ సాహసాన్ని అభినందించాలి. పాత్రల గురించి బాగా స్టడీ చేసి సినిమా తీశారు’’ అన్నారు. ‘‘బయోపిక్లు తీయడం చాలా కష్టం. గట్స్ ఉండాలి. ఇందులో హీరోగా ఓ పాత్ర చేశాను. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా రామారావు వర్క్ చేశారు’’ అన్నారు సాయి వెంకట్. ‘‘గొప్ప విజయాలను నమోదు చేయడమే కాకుండా గుండె తడి చేసి, గుండెను తడిమేసే సన్నివేశాలు ఈ కథలో ఉన్నాయి’’ అన్నారు సుదర్శన్. ‘‘నేను చాలా చిన్నవాణ్ని. మొదట ఈ సినిమా చేయకూడదనుకున్నా. ఇప్పుడు అలా ఎందుకు అన్నానా అనిపిస్తోంది. ఘంటసాలగారి పాటలు విన్నాం. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసు. ఈ సినిమాలో ఆయన వ్యక్తిత్వం తెలియజేస్తున్నాం’’ అన్నారు కృష్ణ చైతన్య. ‘‘ఘంటసాలగారి మీద ఆరాధనతో ఈ సినిమా తీశాను. మా కష్టాన్ని అభినందిస్తారనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: సాలూరి వాసూరావు, కెమెరా: వేణు వాదనల. -
వనస్థలిపురంలో వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ : వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పనామా వద్ద ఉన్న రైతు చికెన్ బజార్లో పనిచేస్తోన్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గిరి అనే వ్యక్తి, చికెన్ షాపులో పనిచేస్తోన్న కృష్ణ చైతన్య(30) అనే వ్యక్తిని కత్తితో దారుణంగా హత్య చేసి నీళ్ల డ్రమ్లో వేసి పరారయ్యాడు. మద్యం మత్తులో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఛల్ మోహన్ రంగ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఛల్ మోహన్ రంగ జానర్ : రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : నితిన్, మేఘ ఆకాష్, లిజి, నరేష్, ప్రగతి, నర్రా శ్రీను, మదు నందన్ సంగీతం : తమన్ ఎస్ కథ : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం : కృష్ణ చైతన్య నిర్మాత : పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి హీరోగా మంచి ఫాలోయింగ్ సాధించినా.. వరుస విజయాలు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు యంగ్ హీరో నితిన్. అ..ఆ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత లై సినిమాతో నిరాశపరిచిన ఈ యంగ్ హీరో కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఛల్ మోహన్ రంగ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతేకాదు ఈ సినిమాను నితిన్ అభిమాన హీరో పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి నిర్మించటం విశేషం. త్రివిక్రమ్ స్వయంగా కథ అందించిన ఈ సినిమా నితిన్ కెరీర్ను తిరిగి గాడిలో పెట్టిందా..? పవన్, త్రివిక్రమ్లు నిర్మాతలుగా మారి తెరకెక్కించిన ఈ సినిమా విజయం సాధించిందా..? కథ : మోహన్ రంగ (నితిన్) ఓ మధ్య తరగతి కుర్రాడు. చిన్నతనంలో తనకు పరిచయం అయిన అమ్మాయి అమెరికా వెళ్లిందని తెలుసుకొని ఎలాగైన అమెరికా వెళ్లాలని ఆ వయసులోనే నిర్ణయించుకుంటాడు. తరువాత అమ్మాయి విషయం మర్చిపోయినా అమెరికా ఆశతోనే పెరిగి పెద్దవాడవుతాడు. మూడుసార్లు వీసా రిజెక్ట్ కావటంతో ఇండియాలో చనిపోయిన ఓ పెద్దావిడ శవాన్ని అమెరికా తీసుకెళ్లే కారణం చూపించి వీసా సంపాదిస్తాడు. అమెరికా వెళ్లిన మోహన్ రంగ ముందు కాస్త ఇబ్బంది పడినా ఫైనల్ గా ఓ మంచి జాబ్ సాధిస్తాడు. ఈ ప్రయత్నాల్లోనే మేఘ సుబ్రమణ్యం (మేఘ ఆకాష్) అనే అమ్మాయితో రంగకు పరిచయం అవుతుంది. (సాక్షి రివ్యూస్) తల్లి చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని మేఘ.. రంగ వ్యక్తిత్వం నచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. రంగ కూడా మేఘను ఇష్టపడతాడు. కానీ ఇద్దరి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు వేరు కావటంతో ప్రేమ గురించి ఒకరితో ఒకరు చెప్పుకోకుండానే దూరమవుతారు. మేఘ తల్లితో పాటు ఇండియా వచ్చేస్తోంది. రంగ కూడా మేఘను మర్చిపోవాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ కొంత కాలం తరువాత మేఘను ఒక్కసారి కలవాలని ఇండియాకు వస్తాడు మోహన్ రంగ. రంగ వచ్చే సరికి మేఘ ఏ పరిస్థితుల్లో ఉంది..? రంగ తన ప్రేమను మేఘకు చెప్పాడా..? వాళ్లిద్దరు ఒక్కటయ్యారా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమా సినిమాకు నటుడిగా ఎదుగుతున్న నితిన్ ఈ సినిమాలో మరింత పరిణతి కనబరిచాడు. ఎమోషనల్ సీన్స్ తో పాటు అద్భుతమైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. ప్రేమకు దూరమైన యువకుడిగా బాధను చూపిస్తూనే కామెడీతో అలరించాడు. పవన్ వీరాభిమాని అయిన నితిన్ ఈ సినిమాలో కూడా పవన్ స్టైల్స్ను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు. అంతేకాదు ఈ సారి మెగా స్టార్ చిరంజీవి అభిమానులను కూడా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాడు. తొలి సినిమాలో బబ్లీగా కనిపించిన మేఘకు ఈ సినిమాలో కాస్త నటనకు అవకాశం ఉన్న పాత్ర దక్కింది. తొలి భాగం అల్లరి అమ్మాయిగా కనిపించిన మేఘ, సెకండ్ హాఫ్లో ప్రేమకు దూరమైన ప్రియురాలిగానూ మెప్పించింది. (సాక్షి రివ్యూస్) అదే సమయంలో కామెడీతోనూ ఆకట్టుకుంది. హీరో తండ్రిగా నరేష్, తల్లిగా ప్రగతి, హీరోయిన్ తండ్రిగా సంజయ్ స్వరూప్లు రొటీన్ పాత్రలో కనిపించారు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన సీనియర్ నటి లిజి హీరోయిన్ తల్లి పాత్రలో హుందాగా కనిపించింది. ఇతర పాత్రల్లో నర్రా శ్రీను, మదునందన్, శ్రీనివాస్, ప్రభాస్ శ్రీను, సత్యలు కామెడీ తో ఆకట్టుకున్నారు. విశ్లేషణ : రౌడీఫెలో సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ చైతన్య... ఛల్ మోహన్ రంగతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన రొటీన్ కథను తనదైన కథనంతో ఆసక్తికరంగా చూపించాడు. ముఖ్యంగా గేయ రచయిత అయిన కృష్ణచైతన్య డైలాగ్స్ తో సినిమా రేంజ్ ను పెంచాడు. కృష్ణ చైతన్య సంభాషణల్లో చాలా సార్లు త్రివిక్రమ్ కనిపిస్తాడు. ముఖ్యంగా ప్రాసలు, పంచ్ల విషయంలో త్రివిక్రమ్నే ఫాలో అయినట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల ప్రేమ, తరువాత మనస్పర్థలు, బ్రేకప్, తిరిగి కలవటం ఇది గతంలో తెలుగు తెర మీద చాలా సార్లు వచ్చిన కథే అయినా.. కథకు తీసుకున్న నేపథ్యం, సంభాషణలు ఆడియన్స్ను అలరిస్తాయి. (సాక్షి రివ్యూస్) అయితే అక్కడక్కడా కథనం నెమ్మదించటం ఇబ్బంది పెడుతుంది. తమన్ అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం బాగుంది. నటరాజన్ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. న్యూయార్క్ సిటీని కలర్ఫుల్ గా చూపించిన సినిమాటోగ్రాఫర్ ఊటి అందాలను అంతే అద్భుతంగా చూపించారు. ఎటిడింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కామెడీ డైలాగ్స్ నితిన్ నటన మైనస్ పాయింట్స్ : రొటీన్ కథ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
‘ఛల్ మోహన్ రంగ’ సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్
-
‘ఛల్ మోహన్ రంగ’ సెకండ్ సింగిల్
యంగ్ హీరో నితిన్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న రొమాటింక్ ఎంటర్టైనర్ ఛల్ మోహన్ రంగ. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సుధాకర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రాయూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్, తొలి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో తాజాగా రెండో పాటను రిలీజ్ చేశారు. తమన్ సంగీత సారధ్యం నకాష్ అజీజ్ ఆలపించిన ఈ పాటకు కేథార్ నాధ్ సాహిత్యం అంధించారు. నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్కు రెడీ అవుతోంది. -
‘మేగా.. కాదు మే..ఘ’
‘లై’ సినిమాతో నిరాశపరిచిన నితిన్.. త్వరలో ఛల్ మోహన్ రంగ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రౌడీఫెలో ఫేం కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్. ఇటీవల టీజర్ తో ఆకట్టుకున్న ‘ఛల్ మోహన్ రంగ’ యూనిట్ తాజాగా తొలిపాటను రిలీజ్ చేసింది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సరదా పాటగా రూపొందిన ‘గ..ఘ..మేఘ’ పాటను రిలీజ్ చేశారు. రాహుల్ నంబియార్ ఆలపించిన ఈ గీతానికి కృష్ణకాంత్ సాహిత్యమందించారు. తమన్ సంగీత మందిస్తున్న సినిమాలో లై ఫేం మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. -
‘ఛల్ మోహన్ రంగ’ ఫస్ట్ సాంగ్ రిలీజ్
యంగ్ హీరో నితిన్ సిల్వర్ జూబ్లీ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా ఛల్ మోహన్ రంగ. రౌడీఫెలో ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్ ను రిలీజ్ చేశారు. తాజాగా తొలి పాట రిలీజ్ డేట్ను ప్రకటించారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలోని తొలి పాటను ఫిబ్రవరి 24న రిలీజ్ చేయనున్నారు. ఇష్క్ ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చిన ఇష్క్ సినిమా రిలీజ్ డేట్ రోజునే ఛల్ మోహన్ రంగ తొలి పాట రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపాడు నితిన్. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నితిన్.. ఛల్ మోహన్ రంగ
సాక్షి, సినిమా : యంగ్ హీరో నితిన్ 25వ చిత్రం టైటిల్ను ఎట్టకేలకు రివీల్ చేసేశారు. ‘ఛల్ మోహన్ రంగ’ అనే టైటిల్ను ఫిక్స్ చేసేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ పీకే(పవన్ కళ్యాణ్) క్రియేటివ్ వర్క్స్ అధికారిక పోస్టర్ను విడుదల చేసింది. రౌడీఫెలో ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో లై బ్యూటీ మేఘా ఆకాశ్ నితిన్కు జోడీగా నటిస్తోంది. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనరగా ఈ చిత్రం తెరకెక్కినట్లు పోస్టర్ చూస్తే అర్థమైపోతోంది. ఈ చిత్రానికి థమన్ బాణీలు అందిస్తున్నాడు. ముందుగా ఈ చిత్రానికి ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ పరిశీలించినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ అందించగా, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ - శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగాఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి . ఏప్రిల్లో ఛల్ మోహన్ రంగ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. pic.twitter.com/YXcp4YadDH — PK Creative Works (@PKCreativeWorks) 11 February 2018 -
జనవరి 1న నితిన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్
‘లై’ సినిమాతో నిరాశపరిచిన యంగ్ హీరో నితిన్, ప్రస్తుతం యువ దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ను ఫైనల్ చేశారట. టైటిల్ లో త్రివిక్రమ్ మార్క్ కనిపించేలా ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నితిన్ సరసన ‘లై’ ఫేం మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల అమెరికా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మరో షెడ్యూల్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న రిలీజ్ చేయనున్నారట. అదే రోజు టైటిల్ విషయంలో కూడా క్లారిటీ రానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. -
నితిన్ కొత్త సినిమా అప్ డేట్
'లై' సినిమాతో నిరాశపరిచిన నితిన్ సైలెంట్ గా తన తదుపరి సినిమా పనులు పూర్తి చేసేస్తున్నారు. లై సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాను ప్రారంభించిన ఈ యంగ్ హీరో, ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. రౌడీఫెలో ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి మేఘా ఆకాష్ నితిన్ కు జోడిగా నటిస్తున్నారు. దాదాపు ఏడాది పాటు లై సినిమా కోసం సమయం కేటాయించిన నితిన్ ఆ తరువాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా మరో సినిమా పనుల్లో బిజీ అయ్యారు. తాజాగా ఈ సినిమా అమెరికాలో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. నెలరోజుల పాటు కొనసాగిన ఈ షెడ్యూల్ లో హీరో, హీరోయిన్లతో పాటు ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు. -
పవన్, నితిన్ల సినిమా మొదలైంది..!
హీరోగా, రాజకీయనాయకుడిగా ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. తన వీరాభిమాని నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి పవన్ ఒక సినిమా నిర్మిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా, నితిన్ లై షూటింగ్లో బిజీగా ఉండటంతో సెట్స్ మీదకు రాలేదు. లై సినిమా షూటింగ్ పూర్తి కావంటతో నితిన్ కొత్త సినిమా సోమవారం (24-07-2017) నాడు సెట్స్ మీదకు వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లై ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. అదే సమయంలో తన కొత్త సినిమా షూటింగ్లో బిజీ కానున్నాడు నితిన్. రౌడీ ఫెలో ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ 50 రోజుల పాటు జరగనుంది. ఆ తరువాత అమెరికాలో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. -
భర్త వికృత చేష్టలపై భార్య ఫిర్యాదు
హైదరాబాద్: తాళి కట్టిన భర్తే విచక్షణ మరిచాడు. భార్యతో కలిసి సన్నిహితంగా ఉన్న దృశ్యాలను అతగాడు స్నేహితుడికి పంపిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే... సైబరాబాద్ పరిధిలో నివాసముంటున్నఓ మహిళ తన భర్త వికృత చేష్టలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ పడకగదిలో సన్నివేశాలను తన భర్త ఆన్లైన్ ద్వారా చెన్నైలోని తన స్నేహితుడు శ్రీమన్కు పంపిస్తున్నట్లు అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి భర్త కృష్ణ చైతన్యను అరెస్ట్ చేశారు. లాప్ట్యాప్తో పాటు అతడి ఫోన్ను సీజ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా కృష్ణ చైతన్య, శ్రీమన్ పరస్పరం తమ భార్యల న్యూడ్ ఫోటోలను స్కైప్ ద్వారా పంపుకునేవారిని వెల్లడించారు. కాగా కృష్ణచైతన్య ప్రవర్తనపై అనుమానం వచ్చి అతడి ఫోన్లో వెతకగా, ఈ వీడియోలు బయటపడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమె తమకు ఫిర్యాదు చేసిందన్నారు. అలాగే శ్రీమన్ కోసం పోలీసులు చెన్నై బయల్దేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమ్మాయి వల్ల ఏం జరిగింది?
కృష్ణచైతన్య, రాజేశ్ రాథోడ్, మోనికా సింగ్, షాలు చౌరాసియా ముఖ్య తారలుగా కిశోర్ స్వీయ దర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘ఓ పిల్లా నీ వల్ల’. మధు పొన్నాస్ స్వరపరిచిన పాటల సీడీలను నిర్మాత బెల్లంకొండ సురేశ్, ట్రైలర్ను మరో నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తొలి సీడీ స్వీకరించారు. ‘‘ఓ అమ్మాయి వల్ల ఇద్దరు స్నేహితుల మధ్య ఏం జరిగిందనేది ఈ చిత్రకథ. యూత్ సహా ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా. అందరూ తమ సొంత సినిమాగా భావించి పనిచేశారు. మధు మంచి సంగీతాన్నిచ్చారు’’ అన్నారు దర్శక–నిర్మాత కిశోర్. ఈ వేడుకలో నిర్మాత లగడపాటి శ్రీధర్, నటి శ్రీముఖి తదితరులతో పాటు చిత్రబృందం పాల్గొన్నారు. -
నితిన్ హీరోగా భారీ చిత్రం
‘అఆ’ చిత్రం తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న చిత్రంతో పాటు కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్కల్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. ఆ రెండు చిత్రాలు సెట్స్పైన ఉండగానే నితిన్ మరో సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన కె.కె.రాధామోహన్ హీరో నితిన్తో భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై శ్రీమతి లక్ష్మీరాధామోహన్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘నితిన్తో ఓ సూపర్హిట్ సినిమా తీయాలని కథ తయారు చేస్తున్నాం. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న రెండు సినిమాల తర్వాత ఆగస్ట్లో మా చిత్రం ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతాం’’ అన్నారు. -
ప్రేమ.. వినోదం
కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, సూర్య శ్రీనివాస్, మోనికా సింగ్, షాలు చారసియా ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిల్లా నీ వల్లా’. బిగ్ విగ్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కిషోర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. కిషోర్ మాట్లాడుతూ– ‘‘లవ్, కామెడీ, యాక్షన్ కథాంశంగా తెరకెక్కిన చిత్రమిది. విభిన్నమైన ప్రేమకథ. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే వినోదం, వాణిజ్య అంశాలు మా సినిమాలో ఉన్నాయి. నటీనటులు, టెక్నీషియనన్స్ సపోర్ట్తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశాం. తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం నచ్చుతుందనే నమ్మకం ఉంది. మధు పొన్నాస్ సంగీతం, షోయబ్ అహ్మద్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో ఎత్తుకి తీసుకెళ్తాయి. అతి త్వరలోనే పాటలు, చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. -
అమ్మ చెప్పిందని పెళ్లి చేసుకున్నాడంట..
‘అమ్మ చెప్పిందని నన్ను పెళ్లి చేసుకున్నాడంట నా భర్త...’ అంటూ ఓ యువతి కన్నీటిపర్యంతమైంది. పెళ్లయి ఏడాదైనా ఒక్కసారి కూడా తనను భార్యగా స్వీకరించలేదని తెలిపింది. అత్త, మామలు కోడలిగా అంగీకరించ లేదని వెల్లడించింది. ఏడాదిగా మనోవేదనకు గురి చేస్తున్న భర్త, అత్తింటివారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన వి.గౌరి, భాస్కర్ దంపతుల పెద్ద కుమార్తె దీపిక స్థానిక మహిళా సంఘం నాయకులతో కలిసి విలేకరులకు తెలిపిన వివరాలివీ.. దీపికకు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ జడ్జి కుమారుడు కృష్ణ చైతన్యతో 2015 మేలో వివాహమైంది. ఆ సమయంలో కట్నం కింద 30 తులాల బంగారం కూడా ఇచ్చారు. పెళ్లయిన వెంటనే అత్తింటి వారు ఆమెను తీసుకెళ్లారు. అయితే, భర్త ఆమెతో మాట్లాడేవాడు కాదు. ప్రేమగా చూసుకునే వాడు కాదు. వారి మధ్య ఏ విధమైన శారీరక సంబంధం కూడా ఏర్పడలేదు. అయితే, అతని మానసిక పరిస్థితి బాగాలేదని, బీపీ, హై షుగర్, స్కిజోఫ్రెనియా ఉన్నట్లు తెలిసింది. దీపికను అత్తమామలు సరిగా చూసుకునేవారు. అత్త, ఆడపడుచు మాటలతో వేధిస్తుండేవారు. ఈ విషయాలు బయటకు చెబితే చంపేస్తామని వారు దీపికను బెదిరిస్తున్నారు. తనను మోసం చేసి, జీవితంతో ఆడుకుంటున్న అత్త, మామలు, ఆడపడుచు, పెళ్లి మధ్యవర్తిగా వ్యవహరించిన శ్రీనివాస్రెడ్డిలను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని దీపిక డిమాండ్ చేసింది. దీపిక అత్త, మామలు 24గంటల్లోపు స్పందించకుంటే వాళ్ల ఇంటిదగ్గరే మకాం వేసి మహిళలంతా కలసి ధర్నా చేస్తామని మహిళానాయకులు హెచ్చరించారు. -
కూకట్పల్లిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
-
కూకట్పల్లిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ : కూకట్పల్లి నిజాంపేటలో బీటెక్ విద్యార్థి కృష్ణ చైతన్య గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ర్యాగింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన సూసైడ్ నోట్ను గుర్తించిన అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణ చైతన్య మృతదేహంతోపాటు సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కృష్ణచైతన్య మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెన్నైలోని సత్యభామ వర్శిటీలో కృష్ణచైతన్య బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. దీపావళి పండగ సెలవుల నేపథ్యంలో కృష్ణ చైతన్య ఇంటి వచ్చాడని అతడి తల్లిదండ్రులు చెప్పారు. విజయవాడకు చెందిన శేఖర్ అనే తన హాస్టల్లోని సహ విద్యార్థి చేసే ర్యాగింగ్కి తట్టుకోలేకపోయినట్లు కృష్ణ చైతన్య ఆ లేఖలో వివరించాడు. -
బీటెక్ బాబు హంగామా!
రఘువరన్ చాలా మంచి కుర్రాడు. బుద్ధిగా చదువుకుంటాడు. బీటెక్ కూడా పూర్తి చేస్తాడు. మంచి ఉద్యోగం దొరికితే హ్యాపీగా సెటిలైపోవచ్చు. కానీ, అనుకున్నామని అన్నీ జరుగుతాయా? ఉద్యోగం రాదు. మరి.. ఈ నిరుద్యోగ యువకుడు ఏం చేస్తాడు? అతని జీవితంలో జరిగిన సంఘటనలేంటి? అనే కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘వేలై ఇల్లా పట్టదారి’. ధనుష్, అమలాపాల్ జంటగా ఆర్. వేల్రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం అనువాద హక్కులను శ్రీస్రవంతి మూవీస్ అధినేత రవికిశోర్ దక్కించుకున్నారు. కృష్ణచైతన్య సమర్పణలో ఈ చిత్రాన్ని ‘రఘువరన్ బీటెక్’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ సందర్భంగా రవికిశోర్ మాట్లాడుతూ -‘‘తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఉన్న కథ కావడంతో ఇక్కడ విడుదల చేస్తున్నాం. బలమైన కథ, కథనాలు ఉంటాయి. ‘కొలవెరి..’ ఫేం అనిరుధ్ స్వరపరచిన పాటలు ఓ హైలైట్. వచ్చే వారంలో పాటలను, అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం. మా స్రవంతి మూవీస్ నుంచి ఇప్పటివరకు వచ్చిన చిత్రాలు కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటాయి. ఈ చిత్రం కూడా అలానే ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: కిశోర్ తిరుమల, పాటలు: రామజోగయ్య శాస్త్రి -
సిక్స్ ప్యాక్ కోసం కసరత్తులు చేస్తున్నా!
నారా రోహిత్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో ప్రకాశ్రెడ్డి నిర్మించిన చిత్రం ‘రౌడీ ఫెలో’. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం నారా రోహిత్ విలేకరులతో ముచ్చటించారు. ‘‘కృష్ణచైతన్య నాకు ముందు కథ చెప్పలేదు. కేరక్టరైజేషన్ చెప్పాడు. అక్కడే కనెక్ట్ అయిపోయా. పోలీస్ పాత్ర ఫిట్నెస్ గురించి శ్రద్ధ చూపించలేదు. ఇగోయిస్ట్గా కనిపించడానికి శ్రద్ధ కనబరిచాను. ముఖ్యంగా ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ నా బరువు. కాస్త బొద్దుగా కనిపించడం మైనస్ అయ్యింది. అయితే... క్రమేణా సినిమాకు పాజిటీవ్ టాక్ రావడం మొదలైంది’’ అని చెప్పారు రోహిత్. ఇక నుంచి కమర్షియల్ దారిలోనే వెళ్లాలనుకుంటున్నాననీ, ఇందులో భాగంగా వెయిట్ తగ్గి సిక్స్ప్యాక్ కోసం కసరత్తులు చేస్తున్నాననీ రోహిత్ చెప్పారు. -
పాట వెనుక కథ - కృష్ణచైతన్య
-
పాట వెనుక కథ 1st Nov 2014
-
'రౌడీ ఫెలో' న్యూ మూవీ స్టిల్స్
-
రౌడీఫెలో మూవీ స్టిల్స్
-
భిన్నమైన పాత్రలో...
నారా రోహిత్ త్వరలోనే ‘రౌడీ ఫెలో’లా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో టి.ప్రకాశ్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ-‘‘రోహిత్ కెరీర్లో ఇది విభిన్నమైన చిత్రం. ఇప్పటివరకూ తాను చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో చేస్తున్నారు. యాక్షన్తో కూడిన ఈ ఫ్యామిలీ డ్రామాను దర్శకుడు చక్కగా తెరకెక్కిస్తున్నాడు. జూన్లో పాటలను, జూలైలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. విశాఖా సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో గొల్లపూడి మారుతీరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, ఆహుతి ప్రసాద్, పోసాని కృష్ణమురళి, తాళ్లూరి రామేశ్వరి, రావురమేశ్, సుప్రీత్ తదితరులు ఇతర పాత్రధారులు. సన్నీ స్వరాలందించిన ఈ చిత్రాన్ని మూవీమీల్స్, సినిమా 5 సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
ఏం జరిగింది..!
కడప అర్బన్, న్యూస్లైన్: రిమ్స్ దంతవైద్య కళాశాలలో బీడీఎస్ విద్యార్థి కృష్ణచైతన్య ఆత్మహత్య సంఘటనపై మంగళవారం త్రిసభ్య కమిటీ విచారణ నిర్వహించింది. దంత వైద్య కళాశాలలో తృతీయ సంవత్సరం పరీక్షలు రాసిన బీడీఎస్ విద్యార్థి కృష్ణ చైతన్య గతనెల 25వ తేదీన ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. విద్యార్థి ఆత్మహత్యకు ప్రొఫెసర్ లావణ్య వేధింపులే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరిపిస్తామని కలెక్టర్ కోన శశిధర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రతిరోజు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూ వచ్చారు. దీంతో దంత వైద్య కళాశాలలో చోటుచేసుకున్న పరిణామాలను కలెక్టర్ ఎప్పటికప్పుడు వైద్యవిద్య డెరైక్టర్ దృష్టికి తీసుకెళ్తూ వచ్చారు. హైదరాబాదులోని వైద్య విద్య డెరైక్టర్ డాక్టర్ వెంకటేశ్ త్రిసభ్య కమిటీని నియమించారు. ఆ కమిటీ మంగళవారం కడప దంత వైద్య కళాశాలకు చేరుకుంది. త్రిసభ్య కమిటీలో చైర్మన్గా హైదరాబాదు ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాలిరెడ్డి, సభ్యులుగా అక్కడి ప్రొఫెసర్ డాక్టర్ శాంతకుమారి, విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాల డాక్టర్ మురళీమోహన్ ఉన్నారు. కడప రిమ్స్ ఆవరణంలోని దంత వైద్య కళాశాలకు చేరుకున్న త్రిసభ్య కమిటీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కళాశాల విద్యార్థులతో కాన్ఫరెన్స్ హాలులో సమావేశమయ్యారు. విద్యార్థులతోపాటు హౌస్ సర్జన్లను కూడా విచారించారు. త్రిసభ్యకమిటీ సభ్యులు ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడి విషయాలను విద్యార్థుల ద్వారా తెలుసుకుని సమగ్ర నివేదికను డీఎంఈకి అందజేస్తామని చెప్పారు. కళాశాల అధ్యాపకులను కూడా విడిగా విచారిస్తామన్నారు. విద్యార్థులను విచారించే సమయంలో కళాశాల డెరైక్టర్నుగానీ, అధ్యాపకులనుగానీ అనుమతించకపోవడం గమనార్హం. -
కళంకం
కడప: వారంతా ఉన్నత విద్యావంతులు.. సమాజంలో ఆదర్శంగా నిలవాల్సిన మేధావులు. పవిత్రమైన వృత్తి చిన్నబుచ్చుకునేలా కొందరు వ్యవహరిస్తుంటే, మరికొందరు కళంకితులుగా మారుతోన్నారు. బాధ్యతలు నిర్వర్తించడంలో ఎవరికి వారు విఫలమవుతూ రిమ్స్ను నిత్యం వివాదాల సుడిగుండంలో నెడుతున్నారు. ఇటు విద్యార్థులు, అటు వైద్యుల కారణంగా రిమ్స్ అభాసుపాలవుతోంది. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందాలనే సంకల్పంతోబాటు, విద్యార్థులకు అత్యున్నత విద్య అందుబాటులో ఉండాలనే ఉద్ధేశంతో జిల్లా కేంద్రంలో రిమ్స్ మెడికల్, డెంటల్ కళాశాలలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నెలకొల్పారు. విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు, వైద్యపరికరాలను అందుబాటులో ఉంచారు. అలాగే బడుగులకు మెరుగైన వైద్య సదుపాయం దక్కాలని ఆకాంక్షించారు. ఎవరి పరిధిలో వారు వారి వారి బాధ్యతలను నిర్వర్తిస్తే అటు వృత్తికి, ఇటు అత్యున్నత విద్యకు, మరోవైపు వైఎస్ సంకల్పం నెరవేరుతుంది. అయితే మేధావి వర్గంగా సమాజం భావించే వీరి చర్యల కారణంగా ఏకంగా నవ్వులు పాలవుతోంది. అందుకు ఇటీవల చోటుచేసుకున్న వరస ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అర్ధాంతర మృతి పరిష్కారమా.... రిమ్స్ డెంటల్ కళాశాల విద్యార్థి కృష్ణచైతన్య అర్ధాంతర మృతి బాధాకరపరిణామమే. దంత వైద్యవిద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలనే తల్లిదండ్రులు కన్న కలలకు అర్ధాంతరంగా ముగింపు పలికాడు. చేతికొచ్చిన కొడుకు అర్ధాంతరంగా మృతి చెందితే వారి కడుపు కోతను ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. అయితే మంగళవారం చోటుచేసుకున్న ఆత్మహత్యకు దారితీసిన కారణాలను విశ్లేషిస్తే విద్యార్థులు వారి పరిమితి దాటి ప్రవర్తించడమేనని స్పష్టమవుతోంది. సహచర విద్యార్థినులను సోదరిగా భావించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవేవి పట్టించుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరించి కృష్ణచైతన్య ప్రాణాల మీదకు తెచ్చుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వల్ప ఘటనలకే కలత చెంది ఆత్మహత్య వైపు మొగ్గడం ఎంతమాత్రం సరైంది కాదని పలువురు పేర్కొంటున్నారు. వైద్యకళాశాల విద్యార్థిని ఫొటోలు తీసి మరో విద్యార్థి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న ఉదంతం కూడా చోటు చేసుకుంది. భావోద్వేగంలో ఆందోళనలు చేపట్టినా అత్యున్నత వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అర్థవంతంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. కళంకితులుగా మారుతున్న అధ్యాపకులు.... పవిత్రమైన వైద్యవిద్యను అభ్యసించి సేవాదృక్పధంతో వ్యవహరించాలని సూచించాల్సిన అధ్యాపకులు రిమ్స్లో కళంకితులుగా మారుతున్నారు. ఆదర్శంగా నిలవాల్సిన అధ్యాపకులైన వైద్యులు కొందరు మాయనిమచ్చను తెచ్చిపెడుతున్నారు. ఇందుకు అక్రమంగా డబ్బులు సంపాదించాలనే కారణమే కనిపిస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న ఫైనల్ ఇయర్ ప్రాక్టీకల్ పరీక్షలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. పరీక్షల్లో పాస్ కావాలంటే అచార్యదేవోభవ అని పిలుచుకుంటున్న గురువుకు డబ్బులు చెల్లించుకోవాల్సి రావడం విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేసింది. విద్యలో చురుగ్గా ఉండే విద్యార్థులను డబ్బులు ఇవ్వలేదనే కారణంగా ఫెయిల్ చేయడం ఎంతవరకు సమంజసమో ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఈతతంగం గైనిక్, మెడిసన్ విభాగాల్లో చోటుచేసుకుంది. కేవలం బ్బులు ముట్టజెప్పని కారణంగా 22మందిని ఫెయిల్ చేసినట్లు తెలుస్తోంది, ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు డెరైక్టర్కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవు. ఇకనైనా రిమ్స్ను ఆదర్శంగా నిలిపేందుకు ఎవరి ప్రయత్నం వారు చేయాలని పలువురు కోరుతున్నారు. -
యాంకర్ మృదులతో గాయకుడు కృష్ణ చైతన్య నిశ్చితార్థం
యాంకర్ మృదులతో గాయకుడు కృష్ణ చైతన్య నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హాజరయ్యారు. -
రౌడీ ఫెలోగా నారా రోహిత్
చేసింది తక్కువ సినిమాలైనా నారా రోహిత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా సినిమాకీ నటుడిగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆయన ప్రస్తుతం మూవీ మిల్స్ అండ్ సినిమా 5 సమర్పణలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. పాటల రచయిత కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రౌడీ ఫెలో’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇందులో నారా రోహిత్ పాత్ర చాలా బాగుంటుంది. ఈ సినిమాలో పలు విశేషాలున్నాయి. పీసీ శ్రీరామ్ శిష్యుడు అరవింద్ గాంధీ ఛాయాగ్రహణం ఓ ఎస్సెట్. అలాగే ధూమ్ 3, బర్ఫీ లాంటి చిత్రాలకు పాటలు స్వరపరచిన ప్రీతమ్ దగ్గర పని చేసిన సన్నీ ఇచ్చిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ‘ఆషికీ 2’ సినిమా పాటల ద్వారా గాయకునిగా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న ఆర్జిత్ సింగ్ పాడిన పాటలు మరో ఎస్సెట్. ఓ వినూత్న కథాంశంతో ఏ విషయంలోనూ రాజీపడకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. వచ్చే ఏడాది ఏప్రిల్లో వేసవి కానుకగా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. రోహిత్ సరసన విశాఖాసింగ్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, పోసాని, పరుచూరి వెంకటేశ్వరరావు, తాళ్లూరి రామేశ్వరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.