madhu yashki goud
-
‘ప్రాణానికి హాని ఉందన్నా.. పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు’
జగిత్యాల, సాక్షి: ప్రాణానికి హాని ఉందని గంగారెడ్డి ముందే చెప్పినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని నిజామాబాద్ మాజీ ఎంపీ, సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. ఆయన శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులే హత్యకు గురి కావడం విచారకరం. ఎవరి ప్రోద్భలంతో, ఎవరి అండతో పోలీసులు వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొడుతామని అభద్రతా భావంతో కేటీఆర్ మాట్లాడారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్న వారిని చేర్చుకున్నాం. 2014లో ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరే జీవన్ రెడ్డి గెలిచారు. బీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆ పార్టీలోకి వెళ్ళలేదు’’అని అన్నారు.‘‘ నాకు తెలియకుండానే జగిత్యాల ఎమ్మెల్యే ఫిరాయింపు జరిగింది. కనీసం నాకు చెప్పలేదనేది నా ఆవేదన. గంగారెడ్డి హత్యలో పోలీసుల నిర్లక్ష్యం ఉంది. గంగారెడ్డిని వాట్సాప్లో బెదిరించినా గానీ పోలీసులు పట్టించుకోలేదు. 100 డయల్ ఫోన్ చేసినా నో రెస్పాన్స్. దసరా పండుగ రోజు డీజేలు పగులగొట్టినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. కుట్రలను, వాస్తవాలని వెలికి తీయలేకనే పాత కక్షలు అని పోలీసులు చెబుతున్నారు. నా కుటుంబ సభ్యుణ్ని కోల్పోయా. ఒక నేరస్థుడు పోలిసు స్టేషన్లో రీల్స్ తీస్తే పోలీసుల ఏం చేశారు. ఫిరాయింపులతో మేము ఆత్మస్థైర్యం కోల్పోయాం. మా ప్రత్యర్థులు రెచ్చిపోయారు’’అని అన్నారు. -
ఈ ఇద్దరిలో ఎవరో?
మంత్రివర్గ విస్తరణపై అస్పష్టత రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా ఉత్సుకతతో ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజా భేటీలో మంత్రివర్గ కూర్పుపై అభిప్రాయ సేకరణకు పరిమితమైన అధిష్టానం.. దానిపై మరోమారు చర్చిద్దామంటూ వాయిదా వేసినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడి నియామకమయ్యాక దీనిపై చర్చిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ నుంచి పారీ్టలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధించి కొన్ని డిమాండ్లు ఉన్నాయంటూ.. వీరికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టాలనే ప్రతిపాదనను హైకమాండ్ ముందు రాష్ట్ర నేతలు ఉంచినట్లు తెలిసింది. దీనికి హైకమాండ్ అంగీకరించినట్లు సమాచారం. సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ పార్టీ పగ్గాలను బీసీ నేతకు అప్పగించాలనే అభిప్రాయానికి ఢిల్లీ పెద్దలు వచ్చి నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్.. బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలైన మహేశ్కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్లలో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ పార్టీ ముఖ్యులతో జరిగిన చర్చల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు ఓ కొలిక్కి వచ్చిందని, ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, జిల్లాల వారీ ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణలు, పారీ్టలో పనిచేసిన అనుభవం ఆధారంగా కొత్త మంత్రులపై నిర్ణయం ఉంటుందని సమాచారం. సుదీర్ఘ చర్చలు..: కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు ప్రభుత్వంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న కేబినెట్ పదవుల భర్తీపై గత నెల రోజులుగా తీవ్ర కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్గాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో చర్చలు జరిపారు. మరోవైపు అధిష్టానం కూడా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిల అభిప్రాయాన్ని తీసుకుంది.తాజాగా ఆయా అంశాలపై చర్చించేందుకు శుక్రవారం ఢిల్లీ వచ్చిన రేవంత్రెడ్డి, భట్టి, ఉత్తమ్లు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఖర్గే, రాహుల్గాం«దీ, కేసీలతో మరోమారు భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధిష్టానం ముఖ్య నేతలతో విడివిడిగా కూడా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంది. చర్చకు వచ్చిన ఆరు పేర్లు పీసీసీ పదవికి ప్రధానంగా ఆరుగురు నేతల పేర్లపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీసీ సామాజికవర్గం నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, ఎస్టీ సామాజికవర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, ఓసీ సామాజికవర్గం నుంచి మంత్రి శ్రీధర్బాబుల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష పారీ్టలను ధీటుగా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతతో పాటు సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని బీసీ సామాజికవర్గ నేతలకే పదవి కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చారు.ముఖ్యంగా బీసీ నేతలకు కేంద్ర ప్రభుత్వ, పార్టీ పదవుల్లో బీజేపీ మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారిని మచ్చిక చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు పరిగణనలోకి తీసుకుని బీసీ వర్గ నేతలవైపే హైకమాండ్ పెద్దలు మొగ్గు చూపినట్లు తెలిసింది. వారిలో పార్టీ కార్యకలాపాల్లో మొదటినుంచీ చురుగ్గా ఉన్న మహేశ్గౌడ్ వైపు మెజార్టీ నేతలు మొగ్గు చూపగా, ఆయన ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండటంతో పాటు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దృష్ట్యా, మధుయాష్కీ పేరును పరిశీలించాలని మరికొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.అయితే దీనిపై నిర్ణయాధికారం తమకు అప్పగించాలని, ఎవరి పేరును ప్రకటించినా పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని హైకమాండ్ పెద్దలు సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఓసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు సైతం ప్రాధాన్యం ఇచ్చేలా ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లను నియమించాలనే దానిపై భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. -
టీపీసీసీ అధ్యక్ష పదవి బీసీకీ దక్కే అవకాశం
-
నాకు పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పా
సాక్షి, హైదరాబాద్: భువనగిరి లోక్సభ స్థానం నుంచి తనను పోటీ చేయాల్సిందిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కోరారని, గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకుంటానని ఆయన చెప్పినా తనకు పోటీ చేయడం ఇష్టలేదని స్పష్టం చేశానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజకీయంగా వెనుకబడి పోతున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బీసీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్నుద్దేశించి సీఎం రేవంత్ ఒక్క మాట మాట్లాడితే ఎగిరెగిరి పడిన ఆ పార్టీ నేతలు, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్న మాటలకు, ఆయన భాషకు ఏం చెప్తారని ప్రశ్నించారు. కేటీఆర్కు ముసళ్ల పండుగ ముందుందని, బీఆర్ఎస్ ఆరిపోయే దీపమని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వెనక కేటీఆర్ ఉండి ఉంటారని అభిప్రాయపడ్డ మధుయాష్కీ.. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్లు ఎ1, ఎ2 అవుతారని జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేయడాన్ని మాత్రమే తప్పు పట్టామని, కేజ్రీవాల్పై విచారణను ఏఐసీసీ తప్పు పట్టలేదని మధుయాష్కీ స్పష్టం చేశారు. -
కేసీఆర్ ఫామ్హౌస్పై దాడి చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఫామ్హౌస్పై దాడి చేస్తామని కాంగ్రెస్ మాజీఎంపీ మధుయాíష్కీగౌడ్ అన్నారు. కేసీఆర్ ఫాంహౌస్పై దాడి చేస్తే వందల కోట్ల రూపాయలు బయటపడతాయని, అక్కడ ఆయన నోట్ల కట్టలపైనే పడుకుంటారని, అక్కడి ఏ గోడను తొలిచినా నోట్ల కట్టలు, వజ్ర వైఢూర్యాలు బయటకొస్తాయని ఆరోపించారు. దానిపై ఏ వి«ధంగా దాడి చేయాలనే విషయమై తమ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆదివారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు తీసుకున్న అనంతరం మధుయాష్కి మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికలకు ముందే వీరి అవినీతి బయటకు వస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క అవినీతి అధికారినీ, కల్వకుంట్ల కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం వదిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య తెరవెనుక ఉన్న వ్యాపారం, అవినీతి బంధాన్ని బయటకు తీయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, హైదరాబాద్ చుట్టూవున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మాజీమంత్రి కేటీఆర్ కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుని అమెరికా, దుబాయ్లో పెట్టారని ఆరోపించారు. కల్ల»ొల్లి మాటలు, అహంకారంతో మాట్లాడుతున్న కేటీఆర్కు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రాష్ట్రంలో కనీసం 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నదని తెలిపారు. -
TS Elections: బరిలో ఎన్నారైలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైలు తమ ప్రత్యేకతను చాటుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే గీతారెడ్డి, చెన్నమనేని రమేష్ లాంటి ఎన్నారై బ్యాక్డ్రాప్ ఉన్న సీనియర్లు పూర్తిగా పోటీకి దూరం కాగా.. ఇప్పుడు కొత్తగా బరిలోకి దిగుతూ చర్చనీయాంశంగా మారారు కొందరు. మామిడాల యశస్వినీరెడ్డి అమెరికాలో స్థిరపడిన ఝాన్సీరెడ్డి.. తెలంగాణ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాలకుర్తి(జనగామ) నుంచి పోటీ చేయాలనుకున్నారు. అందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సైతం చొరవ చూపి.. టికెట్ ఇప్పించే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె అమెరికా పౌరసత్వ కారణంతో అది వీలుపడలేదు. బదులుగా తన కోడలు యశస్వినిరెడ్డి(26)ని పోటీలో నిలిపాలనుకోగా.. కాంగ్రెస్ అధిష్టానం అందుకు ఒప్పుకుంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత యువ అభ్యర్థి యశస్వినే కావడం విశేషం. ఎర్రబెల్లి దయాకర్రావు లాంటి సీనియర్ మీద మామిడాల యశస్వినీరెడ్డి పాలకుర్తిలో పోటీకి దిగింది. యశస్వినీరెడ్డి హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది. ఆపై ఝాన్సీరెడ్డి కొడుకు రాజారామ్ మోహన్ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లింది. పాలకుర్తిలో సేవాకార్యక్రమాల ద్వారా ఝాన్సీరెడ్డికి మంచి గుర్తింపు ఉంది. ఆ కార్యక్రమాలనే తన కోడలి ప్రచారం కోసం ఝాన్సీరెడ్డి ఉపయోగించుకుంది. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కూడా ఈ యువ అభ్యర్థి కోసం ప్రచారం కూడా చేశారు. గెలుపుపై యశస్విని ధీమాతో ఉంది. చల్లా శ్రీలత బీజేపీ హుజూర్ నగర్ అభ్యర్థిని చల్లా శ్రీలతారెడ్డి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ఆమె స్వస్థలం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించి.. ఆపై వివాహ తదనంతరం యూఏఈ వెళ్లిపోయారు. ఆమె భర్త విజయ భాస్కర్రెడ్డి అక్కడి ప్రభుత్వంలో సలహాదారుగా పని చేశారు. లాయర్గానే కాకుండా.. 2009 సమయంలో అబుదాబిలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు కార్యక్రమాలు శ్రీలత నిర్వహించారు. ఉద్యమానికి మద్దతుగా యూఏఈలో ఎన్నారై కమ్యూనిటీని కూడగట్టి సంఘీభావ కార్యక్రమాలు రూపొందించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. స్వస్థలానికి వచ్చిన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్గానూ ఆమె పని చేశారు. ప్రస్తుతం ఆమె నేరేడుచర్ల వైస్ చైర్పర్సన్గా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో ఈ మధ్య చేరిన ఆమె.. ఈసారి హుజూర్నగర్ బరిలో ఉత్తమ్కుమార్రెడ్డి(కాంగ్రెస్), సైదిరెడ్డి(బీఆర్ఎస్)లతో పోటీ పడుతున్నారు. స్థానికతే తనను గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారామె. ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సైదిరెడ్డి గతంలో విదేశాల్లో పనిచేస్తూ స్వదేశానికి వచ్చి రాజకీయ రంగప్రవేశం చేశారు. భూక్యా జాన్సన్ నాయక్ ఖానాపూర్(నిర్మల్) బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్. ఈయన చదివింది నిజాం కాలేజీలో. ఆ సమయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈయన క్లాస్మేట్. అంతేకాదు.. గతంలో కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు.. అప్పటికే అక్కడ కంపెనీ నడుపుతున్న జాన్సన్ నాయక్ ఆతిథ్యం ఇచ్చారు. మొదటి నుంచి ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త.. జాన్సన్ను రాజకీయాల్లోకి రప్పించింది. అలా.. ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రేఖా నాయక్ను(సీటు రాలేని ఆమె కాంగ్రెస్లో చేరారు) కాదని బరిలోకి దించారు. ఈ సారి ఎన్నికల్లో తన ప్రియ మిత్రుడిని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో కేటీఆర్ ఖానాపూర్ లో ఎన్నికల ప్రచారం సైతం చేశారు. మధుయాష్కీ గౌడ్ ఎన్నారైల లిస్ట్లో సీనియర్ మోస్ట్ లీడర్. హైదరాబాద్లో పుట్టి, పెరిగిన మధు యాష్కీ తొలిసారిగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎల్బీ నగర్(రంగారెడ్డి) నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు. గతంలో రెండుసార్లు(2004, 2009) నిజామాబాద్ లోక్సభ సభ్యుడిగా ప్రజలు ఈయన్ని ఎన్నుకున్నారు. న్యాయ విద్యను అభ్యసించిన మధు యాష్కీ.. న్యూయార్క్లో లాయర్గా పని చేశారు. ఆయనకు న్యూయార్క్, అట్లాంటాలో లీగల్ కన్సల్టెన్సీలు ఉన్నాయి. దేశంలో రైతుల ఆత్మహత్యల పరిణామాలు తనను సొంత దేశానికి రప్పించాయని తరచూ చెప్తుంటారాయన. కాంగ్రెస్ సీనియర్ నేత అయినప్పటికీ.. ఎల్బీ నగర్ ఓటర్లను ఆయన ఏమేర ప్రభావితం చేస్తారనేది తెలియాలంటే కౌంటింగ్ దాకా ఆగాల్సిందే. ఈసారి తెలంగాణ ఎన్నికల కోసం 2,780 ఎన్నారైలు ఓటేయబోతున్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక.. 2014లో ఎన్నారై ఓటర్ల సంఖ్య కేవలం 05గా ఉంది. అదే 2018లో ఈ సంఖ్య 244కి పెరిగింది. ఇప్పుడు ఏకంగా 2,780కి చేరింది. వీరిలో 2,248 మంది పురుషులు, 531 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. -
తెలంగాణలో 12 సార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: మధు యాష్కీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత నేత మధు యాష్కీ స్పందించారు. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని అన్నారు. కాగా, మధు యాష్కీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ హైకోర్టు పరీక్షలు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. కేసీఆర్, కేటీఆర్ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. 12 సార్లు ప్రశ్నాపత్రాలు లీకు అయ్యియి. ఉద్యోగాల పేరుతో తెలంగాణ యువతను మోసం చేస్తున్నారు. తిరిగి పరీక్షలు పెట్టినప్పుడు.. ఏజ్ రియాక్సేషన్ ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అభ్యర్థులు తిరిగి పరీక్ష రాయాలంటే ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించాలి. కోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. ప్రిలిమ్స్ రద్దును సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ప్రిలిమ్స్ను మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. కాగా, జూన్లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ను టీఎస్పీఎస్సీ ఆశ్రయించింది. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఎస్పీఎస్సీ రూల్స్ పాటించలేదని, పరీక్షను సరిగా నిర్వహించలేకపోయిందని మండిపడింది. ఈ మేరకు ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేస్తూ.. ప్రిలిమ్స్ను మళ్లీ నిర్వహించాలని తీర్పు వెల్లడించింది. ఈ సారి అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలని తెలిపింది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్సీ కసిరెడ్డి? -
రెండుసార్లు ఎంపీ.. కానీ ఈసారి విముఖత..!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీగా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తన తదుపరి రాజకీయ రంగస్థలంగా రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ శాసనసభ స్థానాన్ని ఎంచుకున్నారు. ఎల్బీనగర్ టిక్కెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు భిన్నరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏడాదిన్నర కాలం నుంచే మధుయాష్కీ ఎల్బీనగర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ పార్టీ శ్రేణుల్లో చెప్పుకుంటున్నారు. ఈ మేరకు ఆయన సన్నిహితులు సైతం ఈ విషయాన్ని పలుసార్లు ప్రస్తావించారు. ఈ కారణంగానే యాష్కీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లా వైపు చూడడం లేదంటూ జిల్లా నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. పార్టీ నాయకత్వం నాలుగు సార్లు ఎంపీ టిక్కెట్టు ఇవ్వగా రెండుసార్లు గెలిచిన యాష్కీ, జిల్లా విషయమై ఏమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల ఇక్కడి నాయకులు, కార్యకర్తలు వివిధ సమావేశాల్లోనే విమర్శలు చేయడం గమనార్హం. మధుయాష్కీ ఎల్బీనగర్ అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ ‘సాక్షి’ పత్రికలో 2022 ఏప్రిల్ 3వ తేదీనే కథనం ప్రచురితమైంది. కష్టకాలంలో వదిలేసి వెళ్తే ఎలా.. బీసీలకు ప్రాధాన్యత కోరుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం సైతం తగిన సీట్లు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇలాంటి సమయంలో రెండుసార్లు ఎంపీగా, జాతీయ నాయకుడిగా రాహుల్గాంధీ వద్ద గుర్తింపు తెచ్చుకున్న మధుయాష్కీ ఈ విధంగా తరలివెళ్లడ మే మిటని నాయకు లు, కార్యకర్తలు అంటున్నారు. ఈ ఆలోచనతోనే ముందునుంచే నిజామాబాద్ జిల్లాకు పూర్తిగా దూరమయ్యారంటూ పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఐగా వచ్చిన యాష్కీని జిల్లా నుంచి వరుసగా రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిపించినప్పటికీ జిల్లా ప్రజలు, పార్టీ కార్యకర్తలతో అంతగా మమేకం కాకపోవడంతో తరువాత వరుసగా రెండు సార్లు గెలిచే అవకాశాలను దూరం చేసుకున్నారంటున్నారు. అధిష్టానం ఉన్నతమైన అవకాశాలు కల్పిస్తే, కష్టకాలంలో జిల్లా పార్టీ కార్యకలాపాల విషయంలో ఏ మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరించారని, తా జాగా ఆర్మూర్ నుంచి బీసీ నాయకుడిగా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎల్బీనగర్ వెళ్లడమేమిటని కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. జిల్లాలో సభ్యత్వ కార్యక్రమంతో పాటు మీ నాక్షీ నటరాజన్ పాదయాత్రకు సైతం యాష్కీ దూ రంగా ఉన్నారని పార్టీ నాయకులు అసహనంగా ఉ న్నారు. కీలకమైన నిజాం షుగర్స్, పసుపు బోర్డు అంశాలపై చేసిన పోరాటాల్లో యాష్కీ తనకేమీ ప ట్టనట్లు ఉండడంతోనే గత ఎన్నికల్లో టీఆర్ఎస్పై వ్యతిరేకతను కాంగ్రెస్కు అనుకూలంగా మలచుకో లేని దుస్థితి నెలకొందని కార్యకర్తలు చెబుతున్నా రు. గతంలో మాజీ విప్ ఈరవత్రి అనిల్కుమార్ యాష్కీపై బహిరంగ సభలో తీవ్ర విమర్శలు చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చే యగా జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు ముక్తకంఠంతో మద్దతు తెలపడం గమనార్హం. ఆర్మూర్లో పోటీ అవసరమైనప్పటికీ.. బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని పార్టీ అధినాయకత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు నుంచి మూడు ఎమ్మెల్యే సెగ్మెంట్లు బీసీలకు ఇవ్వాలని పార్టీలో డిమాండ్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్లు బీసీలకు కేటాయించే అవకాశాలున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటివరకు ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు సరైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు సక్రమంగా జరగకపోగా, అసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే చర్చ జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన, ఇప్పటివరకు నాలుగు సార్లు ఎంపీగా పోటీచేసి రెండుసార్లు గెలుపొందిన మధుయాష్కీ ఇటువైపు ఆలోచన చేయకపోవడమేమిటని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్లో ప్లాన్ మార్చిన మధు యాష్కీ.. వారిద్దరే కారణమా?
తెలంగాణ కాంగ్రెస్కు కొన్ని చోట్ల డిమాండ్ బాగా కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల అభ్యర్థులే కనిపించడంలేదట. ఎంపీ సీట్ల విషయంలో ఈ అయోమయం కొనసాగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఓ సెగ్మెంట్లో నాలుగు సార్లు పోటీ చేసిన నేత ఇప్పుడు సైలెంట్ అయ్యారట. రెండుసార్లు గెలిచి, రెండు సార్లు ఓడిన ఆ నేత వలస వెళ్ళాలని అనుకుంటున్నట్లు టాక్. ఇంతకీ ఆ నేత ఎవరు? ఎక్కడకు వెళ్లబోతున్నారు.. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు సార్లు పోటీ చేసి.. రెండు సార్లు లోక్సభలో అడుగుపెట్టిన మధుయాష్కీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా?. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారు ఎవరూ కనిపించడంలేదట నిజామాబాద్ కాంగ్రెస్లో. అయితే, యాష్కీ పోటీ చేయాలని అక్కడి కేడర్ భావిస్తున్నా.. ఆయన చాలాకాలం నుంచి నిజామాబాద్లో పర్యటించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మధుయాష్కీ ఈసారి పోటీ చేస్తారా? లేక వేరే మరెక్కడైనా పోటీ చేయాలనుకుంటున్నారా? కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఏదైనా హామీ లభించిందా? అనే ప్రశ్నలు పార్టీ కేడర్ నుంచి వినిపిస్తున్నాయి. కవిత, అర్వింద్ చేతిలో ఓటమి.. ఇక, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గాలిలో రెండుసార్లు వరుసగా నిజామాబాద్ నుంచి లోక్సభకు ఎన్నికైన మధుయాష్కీ 2014 ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత చేతిలో ఓటమి చెందారు. అలాగే 2019 ఎన్నికల్లో మరోసారి కాషాయ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఒకనాడు కాంగ్రెస్లో కీలకంగా ఉన్న సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడైన అరవింద్ విజయం కోసం కాంగ్రెస్ శ్రేణులు కూడా అంతర్గతంగా పనిచేశాయని అప్పుడు ప్రచారం జరిగింది. రెండుసార్లు ఓటమి చెందడంతో కొంతకాలంగా మధు యాష్కీ నిజామాబాద్ జిల్లా వైపు కన్నెత్తి చూడడం లేదు. ఆయనకు నిజామాబాద్ పార్లమెంటు సీటుపై ఆసక్తి తగ్గిందనే ప్రచారం కాంగ్రెస్లోనే జరుగుతోంది. రాహుల్ గాంధీకి సన్నిహితుడి పేరున్న మధు యాష్కీకి మరోచోట సీటు హామీ వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నల్గొండ లేదా రంగారెడ్డి జిల్లాల నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. తెరపైకి ఎన్ఆర్ఐ!.. నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం మహారాష్ట్ర బోర్డర్ బోధన్లో మొదలై.. జగిత్యాల నియోజక వర్గం వరకూ విస్తరించి ఉంది. మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గం అంతా అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ ఎంపీ అరవింద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ నుంచి ఎవరూ ఈ పార్లమెంట్ సీటు గురించి పట్టించుకున్నవారు కనిపించడంలేదు. మధుయాష్కీ పోటీ చేయకపోతే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి లేదా ఎవరైనా ఎన్ఆర్ఐతో పోటీ చేయిస్తారనే టాక్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. మొత్తానికి రెండుసార్లు ఓటమితో మధుయాష్కీ నిజామాబాద్ను వదిలేశారనే ప్రచారం అయితే జిల్లాలో జరుగుతోంది. ఇది కూడా చదవండి: ప్లాన్ మార్చిన కేసీఆర్.. కొత్త నేతకు లైన్ క్లియర్! -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రతి ఇంటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సందేశాన్ని తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్రంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలు నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే వెల్లడించారు. భారత్జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ నెల ఆరో తేదీన మేడారంలో జోడో యాత్రలను ప్రారంభిస్తామని, రెండు నెలలపాటు ఈ పాదయాత్రలు కొనసాగుతాయని చెప్పారు. శనివారం గాంధీభవన్లో పార్టీ సీనియర్లతో సమావేశమైన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్రెడ్డి, షబ్బీర్అలీ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. యాత్రల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ యాత్రలు ఒకేసారి ప్రారంభమవుతాయని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్తోపాటు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ తదితర ముఖ్యనేతల ఆధ్వర్యంలో ఈ యాత్రలు నిర్వహిస్తామని చె ప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాట్లాడుతూ ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలకు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతసహా ఇతర ముఖ్య నేతలు హాజరు కావాల్సి ఉన్నందున ఈ నెల 24, 25, 26 తేదీల్లో యాత్రకు విరామం ఉంటుందని చెప్పారు. 1999–2004 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవసాయం, విద్యుత్రంగాల్లో సంక్షోభం ఏర్పడిందని, ఇప్పుడు అవే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని రేవంత్ చెప్పారు. రైతుల రుణమాఫీ కాలేదని, 2014–17 మధ్య కాలంలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో, 2017 నుంచి మూడో స్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్ నుంచి దృష్టి మరల్చేందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్లు రెండూ ఒకే తానులోని ముక్కలని అభివర్ణించారు. ఎనిమిదేళ్లపాటు అన్ని అంశాల్లో కలిసి పనిచేసిన ఆ రెండు పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి కాంగ్రెస్ వైపు చూస్తున్న తరుణంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇరుపార్టీలు నాటకాలకు తెరలేపాయని విమర్శించారు. పచ్చిఅబద్ధాలు ఆడిన గవర్నర్ కేసీఆర్ను కాపాడేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బీజేపీ భ్రమల నుంచి తెలంగాణ సమాజం బయటపడాలని కోరారు. రాహుల్గాంధీని విమర్శించేస్థాయి కేటీఆర్కు లేదని, ఆయనకు క్యాట్ వాక్, డిస్కో డ్యాన్స్, పబ్ల గురించి మాత్రమే తెలుసని విమర్శించారు. -
‘ఆపరేషన్ బొగ్గు’.. సాక్ష్యాలివిగో.. వివరాలు వెల్లడించిన మధుయాష్కీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జార్ఖండ్లోని చంద్రగుప్త బొగ్గు గని ప్రాజెక్ట్ దక్కించుకునేందుకు తల్లిలాంటి కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి రాజగోపాల్రెడ్డి ఎంట్రీ ఇచ్చారని టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. రాహుల్గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం పెద్దాయపల్లి గేట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజగోపాల్రెడ్డి తన వ్యాపార విస్తరణ కోసం మునుగోడు ప్రజలను మోసం చేశాడనడానికి సాక్ష్యాలివిగో అంటూ ప్రతులు చూపిస్తూ వివరాలు వెల్లడించారు. ‘ఆపరేషన్ బొగ్గు’అంటూ మధుయాష్కీ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. చంద్రగుప్త బొగ్గుగని ప్రాజెక్ట్ను రూ.3,437 కోట్ల అతి తక్కువ బిడ్డింగ్తో దొడ్డిదారిన రాజగోపాల్రెడ్డికి చెందిన సుశి ఇన్ఫ్రాటెక్ సంస్థ దక్కించుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు ఐదురెట్లకిపైగా రూ.18 ,264 కోట్ల లాభం వస్తుంది. వాస్తవానికి 2019లో కోల్కతా హైకోర్టు సుశి ఇన్ఫ్రాటెక్ను బ్యాంక్ డిఫాల్టర్గా ప్రకటించింది. అలాంటి కంపె నీకి చంద్రగుప్త ప్రాజెక్ట్ను బీజేపీ కేటాయించడంలో మతలబేంటో అందరికీ తెలుసు. కోల్ కమిషన్ ఆఫ్ ఇండియా 2020 జూన్ 30న జార్ఖండ్లోని చంద్రగుప్త కోల్ ప్రాజెక్ట్కు మొదటి టెండర్ ప్రకటించింది. ఇందులో రాజగోపాల్రెడ్డికి చెందిన సుశి ఇన్ఫ్రాటెక్ పాల్గొనలేదు. మొదటి టెండరు అదానీ గ్రూప్నకు దక్కినా.. దాన్ని రద్దుచేస్తూ 2021 జనవరిలో రెండోసారి టెండర్ ప్రకటించింది. అదే సమయంలో రాజగోపాల్రెడ్డి బీజేపీకి అనుకూలంగా ప్రకటనలిస్తూ లాబీయింగ్ చేశాడు. రెండో టెండరులో పాల్గొ న్న సుశి ఇన్ఫ్రాటెక్కు 2021 ఫిబ్రవరి 3న చంద్రగు ప్త ప్రాజెక్ట్ కేటాయించారు. టెండర్ అలాటైనా ప్ర భుత్వం ఆ కంపెనీకి గని కేటాయించలేదు. దీంతో 2021 మార్చిలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా ఆయన బీజేపీ నేతలతో చర్చలు మొదలుపెట్టారు. ఫలితంగా 2021 డిసెంబర్లో లెటర్ ఆఫ్ ఇంటెంట్తో జారీ జరిగింది. సుశి ఇన్ఫ్రాటెక్కు కోల్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ఇచ్చినా.. ఒప్పందంలో జాప్యం జరుగుతుండగా ఈ ఏడాది మార్చి 17న బీజేపీలో చేరనంటూ రాజగోపాల్రెడ్డి ప్రకటించి పరోక్షంగా ఒత్తిడి తెచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నారు. పథకం ప్రకారం జరిగిన అగ్రిమెంట్.. ‘ఈ బొగ్గు కుంభకోణంలో చర్చల పర్వం జనవరి 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు జరిగింది. కాంట్రాక్ట్ వచ్చినంక ఒప్పందం ఆలస్యం అవుతుంటే జనవరి 2022 నుంచి జూలై 2022 వరకు మరో పర్వం కొనసాగింది. చివరకు జూలై 27న బీజేపీలోకి చేరుతున్నట్లు రాజగోపాల్రెడ్డి ప్రకటించారు. క్విడ్ప్రోకో కిందనే జార్ఖండ్లోని చంద్రగుప్త దక్కించుకున్నారు. గతంలో సుశి ఇన్ఫ్రాటెక్కు, తనకు సంబంధం లేదని రాజగోపాల్రెడ్డి ప్రకటించారు. అయితే ఆయన భార్య, కూతురుకు 99.09శాతం షేర్లు ఉన్నాయి. అటువంటోడు ఆత్మగౌరవ పోరాటమంటడు.. మునుగోడు, తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి’ అని మధుయాష్కీ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. -
ఆపరేషన్ బొగ్గు.. డాక్యుమెంట్ విడుదల చేసిన మధుయాష్కీ గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ బొగ్గు పేరుతో డాక్యుమెంట్ విడుదల చేశారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్. రాజగోపాల్ రెడ్డికి బీజేపీ చంద్రగుప్త బొగ్గు గనుల టెండర్ ఇచ్చిందని సెటైర్లు వేశారు. నష్టాల్లో ఉన్న కంపెనీకి రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తన కంపెనీ అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని ఆరోపించారు. ఆయన రాజకీయమంతా బ్యాక్డోర్ లాబీయింగ్ అని విమర్శలు గుప్పించారు. చదవండి: సీఎం కేసీఆర్.. ఇంటర్నేషనల్ కేడీ.. టీఆర్ఎస్ వీఆర్ఎస్ తప్పదు -
అసలు కేసీఆర్ను అక్కడ నమ్మేదెవరు?
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలుజేసిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ పెడతానని చెప్పడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ఎద్దేవా చేశారు. తన కుటుంబ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ జాతీయ రాగం ఆలపిస్తున్నారని, అయినా కేసీఆర్ను నమ్మే నేతలు జాతీయ స్థాయిలో ఎవరూ లేరని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ల లోపాయికారీ ఒప్పందాల్లో భాగమే కేసీఆర్ జాతీయ పార్టీ అని అన్నారు. చదవండి: బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం -
రామాంతపూర్ నారాయణ కాలేజీ ఘటనపై స్పందించిన మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: రామాంతపూర్ నారాయణ కాలేజీ ఘటనపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. నారాయణ యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఆ విద్యాసంస్థల అనుమతులు వెంటనే రద్దు చేయాలన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే విద్యార్థి విద్యా సంవత్సరం కోల్పోతాడు.. ఫీజులు కట్టకపోతే వేరే మార్గాల ద్వారా తీసుకోవాలి తప్ప.. సర్టిఫికెట్లు ఇవ్వవద్దని ఏ చట్టంలోనూ లేదు. నారాయణ యాజమాన్యం చేసింది.. రాజ్యాంగ వ్యతిరేక చర్య.. ఇది అత్యంత హేయమైన, దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు. చదవండి: ‘ఫీజు విషయంలోనే వివాదం.. ప్రిన్సిపాల్ వెనక్కి తగ్గకపోవడంతో’.. తెలంగాణ ఉద్యమ సమయంలో కార్పొరేట్ కాలేజీలు దోచుకుంటున్నాయని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మండల కేంద్రాల్లోకి సైతం నారాయణ, చైతన్య కాలేజీలు విస్తరించాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో సైతం ఇవి లేవు. మండల కేంద్రాలకు సైతం నారాయణ, చైతన్య విద్యాసంస్థలు వచ్చి.. ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు... తగిన చర్యలు తీసుకోలేదని మధుయాష్కీ మండిపడ్డారు. -
‘కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని భయపడుతున్నారు’
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని, తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందని టీఆర్ఎస్, బీజేపీలు భయపడుతున్నాయని ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. వరంగల్లో రాహుల్గాంధీ సభ తర్వాత యువత కాంగ్రెస్ పార్టీ వైపు పెద్ద ఎత్తున ఆకర్షితమవుతోందన్నారు మధుయాష్కీ. గురువారం గాంధీభవన్లో ప్రెస్మీట్ నిర్వహించిన మధుయాష్కీ గౌడ్.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బీజేపీ-టీఆర్ఎస్లు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. ‘మొన్నటి వరకు ముందస్తు ఎన్నికల హడావిడి మీరు చూశారు.. ఉన్నట్టుండి మునుగోడు ఉప ఎన్నికను తీసుకువచ్చారు. మునుగోడు ఎన్నికల మీద చర్చించాము. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని గమనించి బీజేపీ, టీఆర్ఎస్ అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఢిల్లీ రాగానే రాజగోపాల్రెడ్డి రాజీనామా చేయడం జరిగితే.. వెంటనే ఆమోదించడం జరిగింది. బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలో భాగంగానే ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ కుట్రలకు టీఆర్ఎస్ సహకరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్తారు. అక్కడ ఎవరిని కలవరు. ఆయన హైదరాబాద్ వచ్చిన వెంటనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారు. ఉప ఎన్నికల తేదీ కూడా వాళ్లే ప్రకటిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉందా లేదా అన్నదే నా ప్రశ్న. కేవలం ఐదు నిమిషాల్లోనే రాజీనామాను ఆమోదించడం జీవో విడుదల చేయడం జరిగింది.కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలపై కొట్లాడుతున్నట్టు నాటకాలాడారు. పార్లమెంట్ లో విద్యుత్ సంస్కరణల బిల్లు వచ్చిప్పుడు సభోల ఒక్క టీఆర్ఎస్ ఎంపీ లేడు.. ఇదే చెబుతుంది.. ఇద్దరూ ఒక్కటేనని. కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం వల్లే విద్యుత్ సంస్కరణ బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలనకు వెళ్ళింది. ఈ నెల 13న మునుగోడు లో పాద యాత్ర .. 16నుంచి మండలాల వారిగా సమావేశాలు ఉంటాయి. ఈ నెల 20న రాజీవ్ గాంధీ జయంతి.. మునుగోడు లోని 175 గ్రామాల్లో కాంగ్రెస్ నేతల పర్యటన ఉంటుంది. రాష్ట్ర నేతలంతా మునుగోడు లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొంటారు’ అని మధుయాష్కీ తెలిపారు. -
కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం: మధు యాష్కీ గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వరదాయినిలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకువస్తే.. దానిని నిట్టనిలువునా చంపేసి కాళేశ్వరం అనే ఒక వైట్ ఎలిఫెంట్ లాంటి ప్రాజెక్టును కల్వకుంట్ల కుటుంబం తీసుకువచ్చిందని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. కాళేశ్వరంతో పారిన ఎకరాలు లెక్కలు లేవుకానీ.. కాళేశ్వరం కల్వకుంట్ల అవినీతి ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా మారిందన్నారు. చదవండి: నవ్వుతూ త్వరగా కోలుకునేందుకు ఈ సినిమా చూడండి: ఆహా ఉమ్మడి రాష్ట్రంలోనే పబ్లిక్ అండ్ ప్రయివేట్ భాగస్వామ్యం కింద ప్రాణహిత ప్రాజెక్ట్ను 33 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులను నాటి యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై 13 వేల కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. మిగిలిన మరో 20 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసుంటే సుమారు 16 లక్షలా 40 వేల ఎకరాలకు నీళ్లు పారడంతో పాటు.. హైదరాబాద్ మహానగరానికి తాగు నీటి సమస్య, పరిశ్రమల అవసరాలకు నీళ్లు ఉండేవన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో రూ.20 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్షల కోట్ల రూపాయలకు పెంచి రాష్ట్ర సంపదను మేఘా కృష్ణారెడ్డికి దోచి పెట్టాడు.. మిషన్ భగీరథ పేరుతో మరో రూ.50 వేట కోట్లను కూడా మేఘాకే సమర్పించారని దుయ్యబట్టారు. కాళేశ్వరం - మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో అవినీతి అక్రమాలు సొమ్ముతో కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు అవకాశం ఉండేది. ప్రతి జిల్లాకో ప్రభుత్వ ఇంజనీరింగ్, వైద్య కళాశాల ఏర్పాటయ్యేదని మధు యాష్కీ అన్నారు. -
అవి అహంకారపూరిత వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ చేసిన సర్వేలో తెలంగాణలో తమ పార్టీ ఘనవిజయం సాధించబోతోందని, మంత్రి కేటీఆర్కి కళ్లు నెత్తికెక్కి అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ తన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. శ్రీలంకలో కుటుంబ పాలన వల్ల రాజపక్సేకు పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పడుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ గుజరాత్, హిమాచల్ప్రదేశ్, కర్ణాటకలో గెలవబోతోందని, 2024లో కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఉత్తమ్ ఆశాభావం వ్యక్తంచేశారు. గోదావరి వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి కాంగ్రెస్ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. 2014లో కేసీఆర్ సీఎం అయిన తర్వాత విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారని విమర్శించారు. 12 లక్షల మంది విద్యార్థులకు రూ.3,270 కోట్ల బకాయిలు చెల్లించడం లేదన్నారు. 2014 తర్వాత 850 జూనియర్, 350 డిగ్రీ, 150 పీజీ, వందల సంఖ్యలో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు మూతపడ్డాయని, ఫీజు కట్టలేక 30 శాతం విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారని ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడింది. మన ఊరు–మన బడి కోసం 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక చేశారు. ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. 30 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి’అని ఉత్తమ్ విమర్శించారు. సమావేశంలో ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, మాజీ మంత్రులు చిన్నారెడ్డి, గీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వంద తరాలు తిన్నా కేసీఆర్కు తరగని ఆస్తి
పంజగుట్ట: తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర నిజం లాంటి అబద్ధమని, ఉద్యమం ముసుగులో ఆయన తన పార్టీని విస్తరించుకుని ఆర్థికంగా వంద తరాలు తిన్నా తరగని ఆస్తిని సంపాదించుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు. 2001లో టీఆర్ఎస్ స్థాపించినప్పుడు కేసీఆర్ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత అనే విషయాలను ప్రజలకు వివరించాలని, అప్పుడే ఉద్యమకారులెవరో, ద్రోహులెవరో తెలిసిపోతుందన్నారు. నిజమైన ఉద్యమకారులెవరూ ఆస్తులను కూడబెట్టుకోరన్నారు. ఆదివారం ఇక్కడి సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజేఎసీ) ఆధ్వర్యంలో టీజేఎసీ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం రచించిన దాలి, చేదునిజం పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దాలి పుస్తకాన్ని రేవంత్ ఆవిష్కరించగా, చేదునిజం పుస్తకాన్ని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్ ఆవిష్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. నిజమైన ఉద్యమకారుల చరిత్ర బయటకు రాకుండా, చావు అంచులదాకా వెళ్లి తెలంగాణ తెచ్చానని వక్రీకరించిన చరిత్రను ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కవులు, కళాకారులు స్ఫూర్తిని ఇచ్చారని, ప్రస్తుతం కవులు, కళాకారులు గడీల్లో బందీగా ఉన్నారని, ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదని రేవంత్ అన్నారు. మేధావులతో సలహామండలి ఏర్పాటు చేస్తామని సలహామండలి అభిప్రాయాలతోనే నిర్ణయాలు తీసుకుంటామని ఎన్నికల హామీలో పెట్టారని, కానీ కుటుంబాల నిర్ణయాలే ఫైనల్ అవుతున్నాయని పేర్కొన్నారు. అమరుల కుటుంబాలకు ఎప్పుడైనా భోజనం పెట్టారా.. 1,200 మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో అధికారం చెలాయిస్తూ నాలుగు పదవులు అనుభవిస్తున్న కేసీఆర్ కుటుంబసభ్యులు ఎప్పుడైనా అమరవీరుల కుటుంబాలకు పదవులు కట్టబెట్టారా.. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున వారికి ఒకసారైనా భోజనం పెట్టారా అని రేవంత్ ప్రశ్నించారు. అమరవీరుల స్తూపం నిర్మాణంలోనూ అవినీతి జరగడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ 10 వేల కోట్లు ఉన్న ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని రూ.36 వేల కోట్లకు పెంచుకున్నారని, తెలంగాణను తాగుబోతుల అడ్డాగా మార్చారని, గ్యాంగ్ రేప్లకు, డ్రగ్స్కు అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఏమాత్రం కేసీఆర్ను భరించేస్థితిలో తెలంగాణ సమాజం లేదని, కేసీఆర్ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు కవులు, కళాకారులు, ఉద్యమకారులు తమ కలాలకు, గళాలకు పదును పెట్టాలని పిలుపునిచ్చారు. మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ శ్రీలంకలో రాజపక్స కుటుంబానికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ వచ్చాక కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ కాటేసే నక్క అని అప్పుడెవ్వరూ గ్రహించలేకపోయారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, పాత్రి కేయులు పాశం యాదగిరి, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ సి.కాశీం, కవి, గాయకుడు వరంగల్ రవి, రచయిత వేముల ఎల్లన్న పాల్గొన్నారు. -
‘కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార ఆర్భాటం కోసం కోట్ల రూపాయల ప్రజాధన వృధా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. తాజాగా హైదరాబాద్లోనూ కల్వకుంట్ల చేసుకుంటున్న సొంత ప్రచారానికి కోట్ల రూపాయల ప్రజల సొమ్మును వాడుకుంటున్నారని ఆరోపించారు మధుయాష్కీ గౌడ్. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ను విడుదల చేశారు. రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోక ప్రజల సొమ్మును తన సొంత ప్రచారాలకు ఖర్చు చేస్తున్నారు. మౌలిక వసతులు లేక మొన్న బాసర విద్యార్థులు చేసిన ధర్నాలు చూశాము.. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాల్లోనూ అదే పరిస్థితులు ఉన్నాయి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ప్రచార యావ కోసం పెడుతున్న ఖర్చును రైతుల ఆత్మహత్యలు నివారించడం కోసమో, లేక ట్రిపుల్ ఐటీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ కళాశాలల మౌలిక వసతుల కోసం ఖర్చు చేస్తే కొంతలో కొంతైనా ప్రజలకు మేలు జరిగేది. మీడియాకిస్తున్న ప్రకటనల ప్రజలసొమ్మును ప్రజా అవసరాల కోసం, పేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కొసం ఖర్చు చేస్తే పేదలకు ఆసరా దొరికేది. ప్రజలకట్టిన పన్నుల ద్వారా ఖజానాకు వచ్చిన సొమ్మును కేసీఆర్ తన ప్రచార సోకుల కోసం ఖర్చు పెట్టడాని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రభుత్వ కళశాలల్లోనూ, యూనివర్సిటీల్లోనూ మౌలిక వసతుల కల్పన కోసం వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా’ అని మధుయాష్కీ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. -
అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి
హైదరాబాద్: దేశ భద్రతకు వెన్నుముకలా నిలిచిన మిలటరీని ప్రైవేటీకరించే సన్నాహాల్లో భాగంగా తీసుకువస్తున్న అగ్నిఫథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ డిమాంఢ్ చేశారు. సికింద్రాబాద్ లో జరిగిన యువకుల ఆందోళనల్లో భాగంగా పోలీసులు కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మరణించడం అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందని, రాకేష్ మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాకేష్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని వెంటనే ప్రకటించాలన్నారు. మధు యాష్కీ గౌడ్ ఇంకా ఏమన్నారంటే.. ➖ఒన్ ర్యాంక్ ఒన్ ఫెన్షన్ పథకానికి మంగళం పాడేలా నో ర్యాంక్.. నో ఫెన్షన్ పథకం అమలు చేయడంలో భాగంగా అగ్నిపథ్ కేంద్రం తీసుకువస్తోంది. మిలట్రీని ప్రైవేటీకరించడంతో పాటు, సైనిక విభాగాల్లో జీతభత్యాలు, ఇతర ఖర్చలు తగ్గించుకోవాలన్న దుర్మార్గమైన ఆలోచనతోన కేంద్రం ఈ పథకం తీసుకువస్తోంది. దీనిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ➖కరోనా కాలంనుంచి ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం యువత ఎదురుచూస్తోంది. రెగ్యులర్ రిక్రూట్ మెంట్ చేయకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన అగ్నిపథ్ పేరుతో రిక్రూట్ మెంట్లు చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ➖సికింద్రాబాద్ లో శాంతియుతంగా నిరసన చేస్తున్న యువతపై పోలీసులు లాఠీఛార్జీ, కాల్పులు జరపడం అత్యంత అమానుషం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ➖కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా యువకుల సహనాన్ని ఇంకా పరీక్షించకుండా వెంటనే రిక్రూట్ మెంట్ మొదలు పెట్టాలి. -
రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం
సాక్షి, హైదరాబాద్: రేవంత్రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూలవిధానాలకు వ్యతిరేకమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, అవి పార్టీకి, రేవంత్రెడ్డికి నష్టం చేకూరుస్తాయని తెలిపారు. ఈ మేరకు గురువారం రేవంత్రెడ్డికి ఆయన బహిరంగలేఖ రాశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఆ వ్యాఖ్యలపట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయని, అన్ని అంశాలను నివృత్తి చేస్తూ వెంటనే వివరణ ఇవ్వాలని రేవంత్రెడ్డికి సూచించారు. దేశ నిర్మాణంలో చరిత్రాత్మక పాత్ర పోషిస్తూ అగ్రకులాలకు, బహుజనులకు, ఏఐసీసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గౌరవించిందని పేర్కొన్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 42 లోక్ సభ స్థానాలకుగాను 41 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2023లో అధికారం సాధిం చేందుకు దకొత్తగా వచ్చిన మీకు (రెడ్డి సామాజిక వర్గానికి) పీసీసీ పదవి, సీఎల్పీ పదవి దళితవర్గానికి, ప్రచార కమిటీ చైర్మన్గా బీసీని సోనియాగాంధీ, రాహుల్గాంధీ నియమించారని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్పార్టీ దిక్కుగా భావిస్తున్న ఈ తరుణంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాలు తిరుగుబాటు చేస్తామని అంటున్నాయని తెలిపారు. రేవంత్ మాట్లాడిన భాష, యాస అటు అన్ని వర్గాలను, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించేలా, అవమాన పర్చేలా ఉందన్నారు. పీసీసీ అధ్యక్షుడికి పర్సనల్, పబ్లిక్ అంటూ ఏమీ ఉండదని, ఏ వ్యాఖ్యలు చేసినా వాటిని పీసీసీ అధ్యక్షుడి మాటలుగానే మీడియా, ప్రజలు గుర్తిస్తారని తెలిపారు. -
రేవంత్రెడ్డికి మధుయాష్కీ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్. ఈ మేరకు రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ‘సర్వాయి పాపన్న, మహాత్మా జ్యోతిరావు ఫూలే, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఉద్యమ స్ఫూర్తిగా, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల సాక్షిగా బానిస సంకెళ్లు తెంచుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏకమయ్యాయి. దేశంలో, రాష్ట్రంలో ఉన్న వనరుల్లో వారి త్యాగం, భాగస్వామ్యం ఉంది. నేడు ఆ వర్గాలన్నీ మేల్కొన్నాయి. సమాన అవకాశాల కోసం పోరాటాలు చేస్తున్నాయి. అణచివేతకు, అవమానాలను సహించమని చెబుతున్నాయి. సాధించుకున్న సగం తెలంగాణ నుంచి సామాజిక తెలంగాణ సాధించాలని ఆయా వర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీ దిక్కుగా భావిస్తున్న ఈ తరుణంలో.. అన్ని పార్టీలకు రెడ్ల మాత్రమే నాయత్వం వహిస్తే మనుగడ ఉంటుందని మీరు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి. వ్యక్తిగతంగా మీకు .. పార్టీకి ఈ వ్యాఖ్యలు తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాలు తీవ్రంగా రగులుతున్నాయి. మీ వ్యాఖ్యలపై తిరుగుబాటు చేస్తామని ఆ వర్గాలు అంటున్నాయి. బహుజన వర్గాలన్ని మీ వ్యాఖ్యలను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.. ఖండిస్తున్నాయి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మేమెంతో.. మాకంతా అంటూ ఆయా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి’ అని లేఖలో ప్రస్తావించారు మధుయాష్కీ గౌడ్. ‘కాంగ్రెస్ పార్టీ 2004-2009లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే అది సోనియాగాంధీ నాయకత్వం, రెడ్డి-బీసీల కలయిక అనే విషయన్ని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇది అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2023 లక్ష్యంగా అధికారంలోకి వచ్చేందుకు కొత్తగా వచ్చిన మీకు (రెడ్డి సామాజిక వర్గానికి) పీసీసీ పదవి, సీఎల్పీ పదవి దళిత వర్గానికి, ప్రచార కమిటీ ఛైర్మన్ గా బీసీని, పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీగా మరో దళితుడికి, కన్వీనర్లుగా ఇద్దరు మైనార్టీలతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కొత్త కార్యవర్గాన్ని రూపొందించారు. అన్నికులాలను, వర్గాలను కలుపుకుపోవాలన్న లక్ష్యంతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ గారు ముందుకు వెళుతున్నారు’ అని అన్నారు. ‘మీరు మాట్లాడిన భాష, యాస అటు అన్ని వర్గాలను సోనియాగాంధీ, రాహుల్ గాధీ నాయకత్వాన్ని ప్రశ్నించేలా అవమాన పర్చేలా కించపర్చేలా ఉంది. బడుగుల, బలహీన వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా పీసీసీ అధ్యక్ష హోదాలో మాట్లాడడం తగదు. పీసీసీ అధ్యక్షుడిగా మీకు పర్సనల్, ప్రవేట్, పబ్లిక్ అంటూ ఏమీ ఉండదు. మీరు ఎక్కడ మాట్లాడినా, ఏ వ్యాఖ్యలు చేసినా వాటిని పీసీసీ అధ్యక్షుడు మాటలుగానే మీడియా, ప్రజలు గుర్తిస్తారు. మీరు మాట్లాడే ప్రతి మాటను ఆలోచనతో కూడా ఉండాలి. మీరు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తోంది. దీనిని నివారించడానికి మీరు వెనువెంటనే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వడంతో పాటు, అధినాయకత్వానికి విధేయత ప్రకటించాలి. పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల్లో ఏర్పడ్డ ఆందోళనను, గందరగోళాన్ని నివృత్తి చేయాలని అడుగుతున్నా’ అని లేఖ ద్వారా ప్రశ్నించారు మధుయాష్కీ గౌడ్. -
‘దరఖాస్తుల తీసుకోవడమే తప్పా పరిష్కరించింది లేదు’
హైదరాబాద్: కేసీఆర్ సర్కారుపై మరొకసారి ప్రశ్నలు కురిపించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇస్తున్న 200 రూపాయల పింఛన్ను 1000 రూపాయలకు పెంచుతామమని కేసీఆర్ ప్రకటించారని, ఎన్నికల్లో గెలుపు తర్వాత ఆసరా పింఛన్ 65 ఏళ్లు పూర్తయిన వాళ్లు మాత్రమే అర్హులుగా ప్రకటించారని మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. అంతేకాకుండా భార్యభర్తల్లో ఒకరికి మాత్రమే ఆసరా పింఛన్ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించిందనే విషయాన్ని ప్రస్తావించారు. ఆదివారం ప్రెస్నోట్ను విడుదల చేసిన మధు యాష్కీ గౌడ్.. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. 2018 ఎన్నికల సమయంలో 65 సంవత్సరాలు అర్హతను 57కు తగ్గిస్తామని ప్రకటించాడు. ‘ఎన్నికలు పూర్తయి మళ్లీ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సారాలు అవుతున్నా ఇప్పటివరకు ఆసరా పెంక్షనర్ల వయసు తగ్గింపుపై కల్వకుంట్ల ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పింఛన్దారుల అర్హత వయసు తగ్గింపుపై ఇప్పటివరకూ కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. 57 సంవత్సారాలు నిండిన వారు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని మాత్రమే.. అది కూడా పత్రికా ముఖంగా ప్రకటించారు.. అంతకుమించి మరేమీ చేయలేదు.రాష్ట్రంలో కొత్త పెంక్షన్ల కోసం దాదాపు 11 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆసరా పించన్లకోసం వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యంగులు, వృద్దులు దరఖాస్తు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2018 నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వడం ఆపేసింది. కేవలం హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాల్లో మాత్రమే కొత్తగా పింఛన్లు ఇచ్చారు. మిగిలిన రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వలేదు. ప్రస్తుత రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది.. ఆసరా పింఛన్లు వస్తున్న వాళ్లకు కూడా నెలాఖరుకి మాత్రమే డబ్బులు వస్తున్నాయి.2021 - 2022 కు పెట్టిన భారీ అంకెల బడ్జెట్ చివరకు లోటు బడ్జెట్ గా మిగిలింది.. మొత్తంగా 10 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఏర్పడింది. ప్రతిపాదిత పథకాలకు కూడా డబ్బులు లేవు. కేసీఆర్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక అన్ని పథకాలకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప వాటిని పరిష్కరించింది లేదు. ఇప్పటివరకు ఆసరా పింఛన్ కోసం 13.07 లక్షల దరఖాస్తులు, ధరణి సవరణలకోసం 5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్సిడీ లోన్ల కోసం 8.20 లక్షలు, రేషన్ కార్డుల కోసం 3.90 లక్షలు, పోడు పట్టాల కోసం 2.50 లక్షలు, గొర్రెల పంపిణీ కోసం 3.63 లక్షల దరఖాస్తులను ప్రభుత్వ తీసుకుంది. వీటిలో వేటికి ప్రభుత్వం పరిష్కారం చూపలేదు’ అని మధు యాష్కీ గౌడ్ విమర్శించారు. -
‘టీఆర్ఎస్ వణుకు.. బీజేపీకి భయం’
హైదరాబాద్: ఇటీవల వరంగల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభను చూసి అధికార టీఆర్ఎస్ వణుకు మొదలైతే, బీజేపీకి భయం పట్టుకుందని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ సభ ప్రతీ రైతు కుటుంబాన్ని తట్టిలేపిందన్న మధుయాష్కీ గౌడ్.. రైతు డిక్లరేషన్పై రాష్టంలోని ప్రతీ ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. మంగళవారం గాంధీ భవన్లో ప్రెస్మీట్ నిర్వహించిన మధుయాష్కీ గౌడ్..‘రైతు డిక్లరేషన్ లోని 9 పథకాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల అధ్యక్షులు ప్రెస్ మీట్ లు పెట్టి రైతు డిక్లరేషన్ ప్రచారం చేయాలి.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని రైతు డిక్లరేషన్ ను నెల రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్తాము. రాహుల్ గాంధీ సభ తరువాత బీజేపి.కి భయంపట్టుకుంది. రాహుల్ గాంధీ సభ చూసి టీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతోంది. రాహుల్ గాంధీ సభ ప్రతీ రైతు కుటుంబాన్ని తట్టి లేపింది. విగ్గుగాళ్ళకు, పెగ్గుగాళ్ళకు రాహుల్ గాంధీ గూర్చి మాట్లాడే స్థాయి లేదు. రాష్ట్రంలోని అన్ని రంగాల ప్రజలను మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటేనే మోసం దగా. కల్వకుంట్ల కుటుంబం అంటే ఊసరవెల్లిలా రంగులు మార్చే కుటుంబం. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది అని అసెంబ్లీ సాక్షిగా చంద్రశేఖర్ రావు చెప్పాడు. కాంగ్రెస్ రైతాంగాన్ని కాపాడటానికి రైతు డిక్లరేషన్ను తీసుకుంది. నిరుద్యోగులు, ఆదివాసులు , మైనారిటీలని ఏకం చేస్తూ మరో బహిరంగ సభ ఉంటుంది. సోనియాగాందీ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగే ఎమ్మెల్యేకి బంగ్లాలు, వజ్ర వైడూర్యాలు ఎట్లా వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీకి 884 కోట్ల రూపాయల ఫండ్ ఎలా వచ్చింది?, రాహుల్ గాంధీ వచ్చిన తరువాత తెలంగాణ మేలుకుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే టీఆర్ఎస్ నేతలు మొహంజ మార్కెట్ లో గులాబీ పూలు అమ్ముకుంటు బతికేవారు. టీఆర్ఎస్ పతనం మొదలైంది’ అని మండిపడ్డారు. -
‘24 గంటల్లో ఏర్పాటు చేయాలి.. కేసీఆర్కు ఇదే మా అల్టిమేటం’
హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత ప్రధానమంత్రి, మంత్రులు, అధికారులు ఎవరూ లేని సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో వరి దీక్ష పేరుతో దొంగ డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. గాంధీ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మధు యాష్కీగౌడ్ మాట్లాడుతూ.. ‘పన్ను నొప్పితో పది రోజులపాటు ఢిల్లిలో ఉన్న చంద్రశేఖర్ రావు పట్టు వస్త్రాలతో తిరిగిండు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి, మంత్రులు, అధికారులు కలిసే అవకశముంది. చుట్టూ ఎయిర్ కండీషన్లు పెట్టుకుని ఫైవ్ స్టార్ హోటళ్లలో పందికొక్కుల్లా మెక్కుతూ టీఆర్ఎస్ నాయకులు రైతు నిరసన దీక్షల పేరుతో మరో కొత్త నాటకానికి తెరతీశారు. చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ 24 గంటల్లో కేంద్ర వరి కొనాలని అల్టిమేటం ఇచ్చాడు. తెలంగాణ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రికి అల్టిమేటం జారీ చేస్తున్నాం.24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం సివిల్ సప్లైస్ - ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందాలు చేసుకుంది. అందులో భాగంగా ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయడం, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వెనువుంటనే చెల్లించేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎస్సీఐ ఇచ్చే మొత్తాన్ని సంచులకు, తాళ్లకు, హమాలీ, ట్రాన్స్ పోర్ట్, ఛార్జీలకు చెల్లించడం జరిగేది. ఐకేపీ సెంటర్ల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లుకు ఇచ్చి రైతులను కాపాడడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ ప్రాంత రైతులకు గిట్టుబాటు ధర రావడం జరిగింది. 2014లో తెలంగాణ వచ్చినంక కల్వకుంట్ల చంద్రశేఖర్ కథ మొదలు పెట్టినాడు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కొత్త నాటకానికి తెరతీశాడు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు పందికొక్కుల్లా తిని బలిసి గజదొంగల్లా ఏసీలు పెట్టుకుని దొంగ దీక్షలు చేస్తున్నారు.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గజదొంగ రూపాన్ని, ద్రోహాన్ని తెలంగాణ సమాజం మొత్తం అర్థం చేసుకోవాలి. గత రబీ పంటలోనే కేంద్రానికి ఇవ్వాల్సిన 13 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇప్పటి వరకూ ఇయ్యలేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన ధాన్యం ఇవ్వలేదని చెబుతున్నారు. అంతేకాక రైస్ మిల్లర్ల దగ్గర ఉండాల్సిన బియ్యం కొన్ని వేల టన్నులు కనపడకుండా పోయిందని వార్తలు వస్తున్నాయి. ఉత్తర తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రూ.300 నుంచి రూ. 400 వరకూ రైతులకు మద్దతు ధర తగ్గించి మిల్లర్లు కొంటున్నారు. ఎకరానికి రూ.7 వేల నుంచి 10 వేల వరకూ రైతులకు నష్టం కలుగుతోంది. ఇతను ఇచ్చే బోడిరూ. 5వేలతో రైతులకు ఏం మేలు జరుగుతుంది. దీనిపైన పూర్తి వివరాలోతో 13వ తేదీన గవర్నర్ ను కలుస్తాం. 2014 నుంచి తెలంగాణలో ఎలా మోసం జరుగుతుందో మొత్తం వివరిస్తాం.కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే దీనిపై సీబీఐ విచారణ జరపాలి. కేసీఆర్ ఏమో ఢిల్లీలో ధర్నా చేస్తాడు. మోదీ పార్టీ ఏమో హైదరాబాద్ లో ధర్నా చేస్తుంది. సమస్యను పరిష్కరించాల్సిన ప్రధానమంత్రి.. ముఖ్యమంత్రి ధర్నాలు చేస్తుంటే కొనుగోలు ఎవరు చేయాలి?, సమస్యల పరిష్కారం పక్కన పెట్టి రైతులకు పంగనామాలు పెడ్తున్నారు. దరిద్రపుగొట్టెంగాళ్ల వేషాలతో రైతుల ప్రాణాలను ఫణంగా పెడ్తున్నారు. ముఖ్యంగా ఫెసిలిటేటర్ గా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై బాధ్యత ఉంటుంది.. కొనుగోలు చేసి రైతులును ఆదుకోవాలి. ఎగుమతులు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి.. రైతులకు ఒక శాపంగా మారాడు. కల్వకుంట్ల కుటుంబం మిల్లర్లతో కుమ్మక్కై దోపిడీ చేస్తోంది’ అని ఆరోపించారు. -
మిల్లర్లతో సర్కారు కుమ్మక్కు
సాక్షి, న్యూఢిల్లీ: యాసంగి ధాన్యం సేకరణలో రాష్ట్రం లోని మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై రైతుల జేబులను కొల్లగొడుతోందని, రూ. వేల కోట్లను దోచుకుంటోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం లో రైతుల నుంచి ఎంఎస్పీ కంటే సుమారు రూ.400 నుంచి రూ.600 తక్కువకే మిల్లర్లు ధాన్యం కొంటున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఇలాంటి అక్రమాలపై విజిలెన్స్ దాడులు చేయించకపోవడం, క్రిమినల్ కేసులను పెట్టకపోవడాన్ని బట్టి మిల్లర్లతో సర్కారు కుమ్మక్కైనట్లు అర్థమవుతోందన్నారు. శనివారం తెలంగాణభవన్లో మధు యాష్కీ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఉన్న సీఎం.. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రధాని మోదీ, మంత్రులను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. కేంద్రం ధాన్యం సేకరించకపోతే తామే కొంటామని ఢిల్లీ ధర్నాలో కేసీఆర్ ప్రకటిస్తారని జోస్యం చెప్పారు. గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ధర్మపోరాటం పేరుతో ఢిల్లీలో దీక్ష చేస్తే ఏం జరిగిందో తెలుసుకుంటే మం చిదని సీఎం కేసీఆర్కు సూచించారు. రైస్ మిల్లర్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేసేలా పెద్ద కుంభకోణం జరుగుతోందని, రాష్ట్రంలో ధా న్యం సేకరణను ప్రారంభించకపోతే ఈ నెల 15 నుంచి రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. -
‘టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల గోసను పట్టించుకోకుండా తమ అధికారాన్ని కాపాడుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. శనివారం ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్.. వరి ధాన్యం కొనుగోలు అంశంపై ప్రధానమంత్రిని, సంబంధిత మంత్రులను కలవరని, కొనుగోలుకుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురారని దుయ్యబట్టారు. కానీ రాష్ట్రంలో మాత్రం ధర్నాలంటూ రహదారులను దిగ్బందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యాన్ని కొనకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బతుకులను బజారు పాలు చేస్తున్నాయన్నారు. ‘‘వరి ధాన్యం ఇప్పటికే కల్లాల్లోకి వచ్చింది. రైస్ మిల్లర్లు ధాన్యాన్ని ఎమ్మెస్పీ రూ.1900 ఉంటే, రూ.400 నుంచి రూ. 500 తక్కువగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. కేంద్రం కొనకపోతే నేను కొంటానని కేసీఆర్ అంటాడు. కానీ అప్పటికే ధాన్యం మొత్తం రైస్ మిల్లర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. రైస్ మిల్లర్ల దగ్గర నుంచి గత రబీలో చేసినట్లే తెలంగాణ ప్రభుత్వం మిల్లర్ల దగ్గర ఎమ్మెస్పీ ధరకు కొంటుంది. తెలంగాణలో ధాన్యం కొనుగోలు పేరుతో సీఎం కేసీఆర్ పెద్ద కుంభకోణం చేస్తున్నాడు. బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కల్వకుంట్ల కుటుంబంపైనా, ముఖ్యమంత్రిపైనా సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై చేస్తున్న అవినీతిని నిగ్గు తేల్చాలన్నారు. ‘రైస్ మిల్లర్లు.. రైతులకు క్వింటాల్కు మద్దతు ధర కన్నా రూ. 400 నుంచి రూ. 500 తక్కువగా ఇస్తున్నప్పటికీ విజిలెన్స్ ఎందుకు దాడులు చేయడం లేదు? క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టడం లేదని’’ మధుయాష్కీ ప్రశ్నించారు. -
కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్లో పడొద్దు: మధు యాష్కీ
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ ఫ్రంట్కు మోదీ నిర్మాత, డైరెక్టర్ ప్రశాంత్ కిషోర్, ప్రధాన నటుడు కేసీఆర్’ అంటూ టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాఖండ్ ఎన్నికల తరువాత కేసీఆర్ ఎందుకు సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ‘‘మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం కాదు.. కుటుంబ దోపిడీకి వ్యతిరేకమని’’ ఆయన అన్నారు. చదవండి: కేసీఆర్కు పీకే.. మాకు 40 లక్షల మంది ‘ఏకే 47లు’ : రేవంత్ ‘‘కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ లో మనం పడకూడదు. నియామకాల్లో తెలంగాణ బిడ్డలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు. మనం బీహార్ అధికారులపై విమర్శలు చేస్తున్నప్పుడు .. తెలంగాణ ఐఏఎస్లు మనతో కలిసి వస్తారా.. తెలంగాణ ఐఏఎస్ అధికారులకు లేని ఇబ్బంది మనకెందుకు. తెలంగాణలో పనిచేసే అధికారం దేశంలోని అన్ని ప్రాంతాల ఐఏఎస్లకు ఉంది. తెలంగాణ ప్రత్యేక దేశం కాదు.. ప్రత్యేక రాష్ట్రం మాత్రమేనని’’ మధుయాష్కీ అన్నారు. ‘‘మన ఊరు-మన పోరు కార్యక్రమాల్లో బహిరంగ సభలు పెట్టడం వల్ల లాభం లేదు. గ్రామస్థాయిలో రచ్చ బండపై కూర్చొని మాట్లాడితే లాభం ఉంటుంది. గ్రామాల పర్యటనల తరువాత సభలు పెట్టాలి. చెడ్డి వేసుకున్నాక ప్యాంటు వేసుకోవాలి .. ప్యాటు వేసుకున్నాక చెడ్డి వేసుకోవడం సరికాదు. భట్టి విక్రమార్క చేస్తున్నట్లుగా గ్రామ గ్రామంలో తిరగాలి. త్వరలో ప్రచార కమిటీ ద్వారా కూడా గ్రామాల వారిగా సమావేశాలు పెడతాం. ప్రచార కమిటీ ద్వారా ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రణాళిక రూపొందిస్తాం. దీనిపై రాహుల్ గాంధీకి నివేదిక ఇచ్చాను. త్వరలోనే ప్రచార కమిటీ లు ఏర్పాటు చేస్తామని’’ మధు యాష్కీ వెల్లడించారు. -
టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే: మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకే రకమైన ఆలోచనలతో కలిసి పనిచేస్తున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ దుయ్యబట్టారు. బయటకు మాత్రం శత్రువుల్లా.. కనిపిస్తూ.. లోలోపల కలిసి ఒకరి కోసం ఒకరంటూ పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ‘‘ఈ రెండు పార్టీల నాకుడు.. జోకుడు వ్యవహారం వల్లే తెలంగాణకు విభజన చట్టం ప్రకారం రావాల్సిన ఏవీ రాలేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద.. విభజిత రాష్ట్రాలకు చట్టం ప్రకారం ఇవ్వాల్సిన అన్ని అంశాలను పక్కన పెట్టి.. డైవర్షన్ స్కీమ్ లెక్కన కొత్త వివాదాలకు తెరలేపుతున్నాయి. కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇచ్చింది.. రెండు రాష్ట్రాలకు సమానంగా చెందాల్సిన అన్ని అంశాలకు సబంధించి.. కొత్తగా ఏర్పాటు చేయాల్సిన వ్యవస్థపైనా చట్టం రూపొందించింది.. ఇన్నేళ్లు అధికారంలో ఉన్న మీరు వాటిపై ఏంజేశారో చెప్పుకోలేక.. చెప్పుకోనికి ఏమీలేక.. మీడియా హైప్ కోసం కోట్లాడుతున్నట్లు డ్రామాల్జేస్తున్నారు. నిజంగా తెలంగాణ మీద మోదీ-కేసీఆర్ లకు చిత్తశుద్ది ఉంటే.. వెంటనే విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలని మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. -
కేటీఆర్.. ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపు: మధు యాష్కీ
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపి.. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. సీసీఐ(సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంగతి సరే.. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పని.. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోని బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. చదవండి: బండి సంజయ్కు చుక్కెదురు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ ‘‘2014 సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. వంద రోజుల్లో ఈ ఫ్యాక్టరినీ ప్రభుత్వ పరం చేసుకుంటామని మీ చెల్లెలు కల్వకుంట్ల కవిత.. హామీ ఇచ్చారు. ఇన్నేళ్లయినా.. ఈ హామీ ఎందుకు నెరవేరలేదు. దాదాపు 16 వేల ఎకరాల్లో ఏర్పడిన బోధన షుగర్ ఫ్యాక్టరి ఆసియాలోనే అతిపెద్దది. ఈ ఫ్యాక్టరీ మీరు అధికారంలోకి వచ్చిన ఏడాది తిరగకుండానే మూతపడింది. ఫ్యాక్టరీకి చెందిన వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా ఫ్యాక్టరీ భూములును టీఆర్ఎస్ నేతలే కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని’’ మధు యాష్కీ గౌడ్ దుయ్యబట్టారు. -
రాష్ట్ర కాంగ్రెస్లో విచిత్ర పరిస్థితి.. ఎంపీనా.. ఎమ్మెల్యేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ముందస్తు ఎన్నికలు కచ్చితంగా వస్తాయని, జమిలి ఎన్నికలకు కూడా చాన్స్ లేకపోలేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నా ఎక్కడ పోటీ చేయాలన్న దానిపై ఆ పార్టీ నేతలకే స్పష్టత లేకుండా పోయింది. ముఖ్యంగా ఈసారి అసెంబ్లీకి పోటీచేయాలా లేక.. పార్లమెంటుకెళ్లాలా అన్న విషయంలో సీనియర్లు, జూనియర్లు సహా ఎవరూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు ఎంపీలూ ఈసారి అసెంబ్లీకే సై అంటుండగా, ఆ మూడు చోట్లా పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు కనిపించని పరిస్థితి. వీరితోపాటు గత ఎన్నికల్లో అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీచేసి ఓడిన చాలామంది నేతలు కూడా ఈసారి ఎక్కడ పోటీ చేయాలనే విషయంపై ఊగిసలాటలో ఉన్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకుగాను మెజార్టీ స్థానాల్లో ఇదే పరిస్థితి ఉండటం పార్టీని కలవరపాటుకు గురిచేస్తుండగా.. అసలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కనీసం సమీక్షకు కూడా టీపీసీసీ నాయకత్వం ఇప్పటివరకు ఉపక్రమించకపోవడం గమనార్హం. హైదరాబాద్, మహబూబాబాద్లో ఎలా? మహబూబాబాద్ ఎంపీగా పోటీచేసిన మాజీ మంత్రి బలరాం నాయక్, హైదరాబాద్ ఎంపీ గాపోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని యోచిస్తున్నారు. దీంతో మహబూబా బాద్, హైదరాబాద్ లోక్సభ స్థానాల్లో అభ్యర్థిత్వాలపై అస్పష్టత నెలకొంది. వీరంతా మళ్లీ పార్లమెంటుకు వెళ్తారనే ఆశతో కొందరు ఆశావహులు ఆయా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందరూ అసెంబ్లీకే మొగ్గు! గత ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ ఈసారి కరీంనగర్ అసెంబ్లీకా, పార్లమెంటుకా అనేది తేల్చుకోలేకపోతున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ ఈసారి అసెంబ్లీ స్థానాన్ని వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నారు. గత ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఓడిన తర్వాత మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేసిన వంశీచంద్రెడ్డి కూడా అసెంబ్లీకే ప్రాధాన్యమిస్తున్నారు. మెదక్ ఎంపీగా పోటీ చేసిన గాలి అనిల్కుమార్ నర్సాపూర్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. నాగర్కర్నూల్ ఎంపీగా బరిలో ఉన్న మల్లురవి జడ్చర్ల అసెంబ్లీ అడుగుతారా? లేక ఎంపీగా పోటీ చేస్తారా అన్నదానిపైనా అస్పష్టతే. అంజన్కుమార్ యాదవ్ (సికింద్రాబాద్), రేణుకా చౌదరి (ఖమ్మం) కె.మదన్మోహన్ (జహీరాబాద్)లు మా త్రమే మళ్లీ పార్లమెంటుకైనా ఓకే అనే భావనలో ఉండగా, మిగిలిన వారంతా ప్రస్తుతానికి జోడు పడవలపై ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఆ ముగ్గురూ ఎక్కడి నుంచి? రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున ముగ్గురు ఎంపీలున్నారు. రేవంత్రెడ్డి(మల్కాజ్గిరి), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి) అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి కొడం గల్, నల్లగొండ స్థానాల్లో ఓడిపోయిన తర్వాత ఎంపీలుగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఇక, మరో ఎంపీ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి (నల్లగొండ) అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి గెలుపొందినా ఎంపీగా పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈ ముగ్గురూ అసెంబ్లీకి పోటీచేయాలనే భావనలో ఉన్నారు. దీంతో మల్కాజ్గిరి, భువనగిరి, నల్లగొండ స్థానాల్లో ఎంపీలుగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత లేకుండాపోయింది. అసలు ఈ లోక్సభ స్థానాల్లో పోటీచేసేందుకు ఫలానా అభ్యర్థి ఉన్నారనే చర్చ కూడా పార్టీలో జరగడం లేదు. -
రూ.18 వేల కోట్ల కుంభకోణం.. విచారణ జరపాలి: మధుయాష్కీ
సాక్షి, ఢిల్లీ: కనీస మద్దతు ధర కూడా రైతులకు అందడం లేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలు లేక.. అకాల వర్షంతో రైతులు రూ.1300, రూ.1400కే వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లుకు అమ్ముకున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు చెబుతోంది. ఈ ధాన్యం మొత్తాన్ని రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు తెలుస్తోందన్నారు. చదవండి: 'తెలంగాణ మంత్రులు కేంద్రమంత్రిని అడుక్కోవడానికి రాలేదు' రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.1940తో కొనుగోలు చేసింది. రైస్ మిల్లర్లు మాత్రం రైతులను మోసం చేసి మూడు, నాలుగు వందల రూపాయల తక్కువ ధరకు తీసుకుందని దుయ్యబట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం రూ.18 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే రూ.18 వేల కోట్ల కుంభకోణంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఇటు టీఆర్ఎస్.. అటు బీజేపీ నాయకులు తెలంగాణ రైతుల కష్టార్జితాన్ని రూ.18వేల కోట్లను మెక్కినట్లుగా తెలుస్తోందని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. -
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ మద్దతు: మధు యాష్కీ గౌడ్
ఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగలతో పాటు సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ఢిల్లీలోని కల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరిగిన స్టూడెంట్ మాదిగ పెడరేషన్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మందకృష్ణ మాదిగ సహాయాన్ని తీసుకుని.. అధికారంలోకి వచ్చాక ఆయనను జైల్లో పెట్టిన చరిత్ర కేసీఆర్దని మధు యాష్కీ మండిపడ్డారు. చదవండి: తమిళనాడు సీఎం స్టాలిన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ఎస్సీల్లో మాదిగలు వెనుకబడ్డారన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎస్సీలకు అన్యాయం జరిగిందని.. ప్రత్యేక రాష్ట్రంలో అయినా వారికి న్యాయం జరుగుతుందన్న లక్ష్యంతోనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. అయితే కేసీఆర్ పాలనలో దళితులకు న్యాయం జరగడం లేదన్నారు. దళితుల్లో మాదిగలు కిందిస్థాయిలో ఉన్నారు.. వారిని కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలని మధు యాష్కీ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ కూడా మాదిగలను మోసం చేసింది. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ వారి మద్దతు తీసుకుని.. అధికారంలోకి వచ్చాక వారిని మోదీ మోసం చేశాడు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవాలి. దేశ సంపదలో దళితులు కూడా భాగమే. అట్టుడుగు వర్గాలకు అందాల్సిన సంపదను కూడా మోదీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నాడు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను పెద్ద ఎత్తున అమ్మేశాడు. దీనితో పాటు విద్యాసంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసి.. దళితులకు, బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లను మోదీ దూరం చేస్తున్నాడు. తద్వారా దళితులకు విద్య అందకుండా చేస్తున్నాడని మధు యాష్కీ ఆరోపించారు. దళిత విద్యార్థులకు ఫెలోషిప్స్, స్కాలర్ షిప్స్ అందించాలని మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రానికి ఏం కావాలో కేసీఆర్కు అవగాహన లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిపై అధికార టీఆర్ఎస్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, సీఎం కేసీఆర్కు అసలు తెలంగాణ గురించి ఏమీ తెలియదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. రాష్ట్రానికి ఏం కావాలో ఆయనకు అవగాహన లేదన్నారు. తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీల గురించి కనీసం ప్రస్తావించారా? అని సోమవారం మధుయాష్కీ ఒక ప్రకటనలో నిలదీశారు. ఈ ఏడేళ్ల కాలంలో బీజేపీని ఏనాడైనా నిలదీశారా? అని ప్రశ్నించారు. ఏడేళ్లుగా జాతీయస్థాయిలో బీజేపీకి అండగా నిలిచిన టీఆర్ఎస్.. ఇప్పుడు గల్లీలో నాటకాలు మొదలుపెట్టిందని, కేంద్రంతో కుస్తీ పడుతున్నట్లు మంత్రి కేటీఆర్ డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. వారం రోజుల్లోనే పత్తి క్వింటాల్కు రూ.1,000 తగ్గిందని, దీనిపై సంబంధిత మంత్రి లేదా ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని మధుయాష్కీ డిమాండ్ చేశారు. -
‘టీఆర్ఎస్-బీజేపీలవి పగటి వేషగాళ్లలా దోస్తీ-కుస్తీ నాటకాలు’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ప్రభుత్వానికి తెలంగాణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ గురించి కేసీఆర్కే చెబుతారా? అంటే ప్రెస్మీట్లలలో ఫైర్ అయ్యే కేసీఆర్కు అసలు తెలంగాణ గురించి ఏ మీ తెలియదని.. రాష్ట్రానికి ఏమి కావాలో అసలు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో.. తెలంగాణ విభజన చట్టంలో నాటి కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన వాటి గురించి ప్రస్తావన అయినా కేసీఆర్ ప్రభుత్వం చేసిందా? అని సూటిగా ప్రశ్నించారు. చదవండి: రూ.10 వేల కోట్లతో వడ్లు కొనలేరా? ఐటీఐఆర్ పార్క్, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవన్నీ విభజన చట్టంలోని అంశాలే.. వీటిపైనా ఈ ఏడేళ్లలో ఏనాడైనా బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసిందా.. కనీసం అడిగిందా? అని నిలదీశారు. మోదీ ప్రభుత్వానికి ఏడేళ్లుగా పార్లమెంట్లో అండగా నిలిచిన కేసీఆర్.. ఇప్పుడు గల్లీల్లో నాటకాలకు అండగా నిలిచాడని మండిపడ్డాచరు. కొత్తబిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా.. ఇప్పుడు కేటీఆర్ కేంద్రంతో కుస్తీ పడుతున్నట్లు పెద్దపెద్ద డ్రామాలు ఆడుతున్నాడని అన్నారు. కేంద్రం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని అంటున్నాడు.. అంటే ఇన్నేళ్లనుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు తీసుకురాలేకపోయాని నిస్సిగ్గుగా కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించినట్లేనని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీతో కుస్తీ డ్రామాలు ఆడేందుకు సమయం ఉంటుంది కానీ.. ధరలు తగ్గి అయోమయంలో ఉన్న పత్తి రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు సమయం ఉండదని మండిపడ్డారు. కేవలం వారం రోజుల్లోనే క్వింటాలు పత్తికి రూ.1000 తగ్గింది. వరంగల్ జిల్లా సహా ఎనుమాముల మార్కెట్ సహా ఇదే పరిస్థితి ఉందని పత్రికల్లో వస్తోందని అన్నారు. దీనిపై సంబంధిత మంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్-బీజేపీలు ఇప్పటికైనా పగటి వేషగాళ్లలా దోస్తీ-కుస్తీ నాటకాలు ఆపి ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. -
వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సామాజిక న్యాయ సాధన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీ వర్గాలకిస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ చెప్పారు. డీసీసీ అధ్యక్షులతో సమావేశం అనంతరం గాంధీభవన్లో సోమవారం విలేకరుల సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్, ప్రచార కమిటీ కోకన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్, రంగారెడ్డి, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఈర్ల కొమురయ్యలతో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాక లబ్ధి పొందింది కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమేనన్నారు. మం చిర్యాల జిల్లాకు చెందిన మహేశ్ అనే నిరుద్యోగి ఆత్మహత్యకు సీఎం కేసీఆరే కారణమని, ఆయ నపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాం డ్ చేశారు. నిరుద్యోగులు నిరాశతో బలవన్మరణాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 8, 9 తేదీల్లో పార్టీ సభ్యత్వ నమోదుపై డీసీసీ, మండల, టౌన్, బ్లాక్ కాంగ్రెస్ నేతలకు శిక్షణ ఇస్తామని, రాష్ట్రంలోని యువత పెద్ద సంఖ్యలో సభ్యత్వాలను నమోదు చేసుకోవాలని మధుయాష్కీ కోరారు. నిరుద్యోగ, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 9న హైదరాబాద్లో నిర్వహించనున్న బహిరంగసభకు లక్షలాది మంది హాజరు కావాలని, ఈ సభకు రాహుల్గాంధీ ముఖ్యఅతిథిగా వస్తారని వెల్లడించారు. బీజేపీ పాలనలో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులతో పాటు పప్పుదినుసుల రేట్లు పెరిగి సామాన్యు డికి భారంగా మారాయని, మతం పేరుతో విడిదీసి పాలించే బీజేపీ.. ఆ పార్టీకి వత్తాసు పలికే టీఆర్ఎస్కు చరమగీతం పాడితేనే ఆగమైన ని రుద్యోగ బతుకులు బాగుపడతాయని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రజలెదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 14 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా జనజాగరణ యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమైక్యమే తన స్టాండ్ అంటూ రాష్ట్ర విభజన విషయంలో పార్టీ ఎమ్మె ల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో కూడా రేవంత్రెడ్డి వ్యాఖ్యలను తప్పు గా ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీలో ఎవరి టికెట్లయినా ఫైనల్ చేసేది ఏఐసీసీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మధుయాష్కీ సూచించారు. -
ప్రజల కళ్లలో మట్టి కొట్టారు
సాక్షి, హైదరాబాద్: సొంత బిడ్డల్లాంటి రాష్ట్ర ప్రజల మీద, వారి భవిష్యత్ అవసరాల మీద కనీస ప్రేమలేని పాలకుడు కేసీఆర్ అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన జరిగిందని, కష్టపడి సాధించుకున్న స్వరాష్ట్రంలో అవి ప్రజలకు అందే పరిస్థితి లేకుండా పోయిందని శనివారం ఒక ప్రకటనలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అడ్డగోలు పాలనతో దక్షిణ తెలంగాణ జిల్లాలు ఎడారిలాగా మారే పరిస్థితి ఏర్పడిందని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ రెండు జిల్లాల ప్రజల కళ్లలో సీఎం మట్టి కొట్టారని పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణకు చెందిన ప్రాజెక్టులపై కేసీఆర్కు పట్టింపు లేదని, ఏపీ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోలేని ఆయన కాంగ్రెస్ హయాంలో అనుమతులు వచ్చిన ప్రాజెక్టులను కూడా నిర్వీర్యం చేస్తున్నారని మధుయాష్కీ విమర్శించారు. -
నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీలో పెరిగిన జోష్
అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములతో పూర్తి నిస్తేజం ఆవరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒక్క సారిగా జోష్ పెరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో పాటు జిల్లా నుంచి సీనియర్ నేతలు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్కు ప్రచార కమిటీ చైర్మన్, మహేశ్ కుమార్ గౌడ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు దక్కాయి. వీరిద్దరు బుధవారం జిల్లాకు రానుండడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాట్లు చేశాయి. ఇందల్వాయి నుంచి జిల్లా కేంద్రానికి భారీ బైక్లు, కార్ల ర్యాలీ తీయనున్నారు. సాక్షి, నిజామాబాద్ : అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పారీ్టలో గతంలో వివిధ వర్గాల వారీగా కార్యక్రమాలు చేస్తూ వచ్చేవారు. అయినప్పటికీ కాంగ్రెస్ పారీ్టకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు కారణంగా మంచి విజయాలు సా ధిస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో రెండు సంవత్సరాలుగా నాయకుల్లో, శ్రేణుల్లో నిస్తేజం ఆవరించింది. తెలంగాణ తామే ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ వరుసగా 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. గత ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ శ్రేణు ల్లో మరింత స్తబ్ధత ఆవరించింది. ఈ క్రమంలో గత లోక్సభ ఎన్నికల్లోనూ మరింతగా దెబ్బతిన్నది. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఓ టమిపాలైంది. ఎ న్నికల్లో ఆమెకు ఉన్న వ్యతిరేక పవనాలను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మ లుచుకోలేకపోయింది. సంప్రదాయ ఓటు బ్యాంకు తగ్గిపోవడంతో పాటు యువతరం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపగా అనూహ్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి అరి్వంద్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. తరువాత వరుసగా జరిగిన మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ పార్టీ మూడో స్థానంలోనే నిలిచింది. చివరకు నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అయితే కేవలం రెండు స్థానాలతో నాలుగో స్థానానికి పడిపోయింది. పరిస్థి తి ఎలా తయారైందంటే పార్టీ కార్యాలయాల్లో నిర్వహించే కార్యక్రమాలకే కాంగ్రెస్ నేతలు పరిమితమ య్యారు. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల పీసీసీ అ ధ్యక్షుడిగా రేవంత్రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించడంతో రాష్ట్రవ్యాప్తంగా శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. జిల్లా నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్కు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా, మహేష్కుమార్ గౌడ్కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవులు ఇవ్వడంతో జిల్లా పారీ్టలోనూ జోష్ వచ్చింది. ఇద్దరు నేతలు.. పదవులు పొందిన తర్వాత ఇద్దరు నేతలు బుధవారం జిల్లాకు రానుండడంతో ఇందల్వాయి నుంచి నగరంలోని లక్ష్మి కల్యాణ మండపం వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టా రు. దీని కోసం గతానికి భిన్నంగా వర్గాలతో సంబంధం లేకుండా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు కదులుతుండడం గమనార్హం. భారీ ద్విచక్రవాహనాలు, కార్ల ర్యాలీ తీయనున్నారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మారిన తరువాత గత మూడు వారా ల్లో మూడుసార్లు చలో హైదరాబాద్ కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. రైతు సమస్యలపై నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఇవి గాక గతంలో చెప్పుకోదగిన కార్యక్రమం సైతం రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాకముందు గత జనవరి 30న ఆర్మూర్లో పసుపు రైతుల సమస్యలపై భారీ కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అ ధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, బీసీ సెల్ జి ల్లా అధ్యక్షుడు శేఖర్గౌడ్ తదితర నాయకుల ఆధ్యర్యంలో ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీసీసీ అధ్యక్ష పదవి రేసు మొదలైంది. బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు శేఖర్గౌడ్, పార్టీ నగర అధ్యక్షుడు కేశ వేణు డీసీసీ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. -
బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే!
నిజామాబాద్నాగారం: బీజేపీ ప్రజా వ్యతిరేక విధానల వల్ల దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. కాంగ్రెస్తోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా ఇంకా మభ్యపెడుతున్నాయని విమర్శించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ అనుభవిస్తూ, ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆజాద్ ప్రసంగించారు. తెలంగాణ ఇచ్చింది ఒకరైతే, అనుభవించేది మరొకరని కేసీఆర్నుద్దేశించి అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని, నోట్ల రద్దు, జీఎస్టీకి టీఆర్ఎస్ మద్దతు పలకడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎరువుల సబ్సిడీ ఎత్తివేసినా కేసీఆర్ ఒక్కమాట కూడా మాట్లాడలేదని తెలిపారు. పసుపుబోర్డు ఏర్పాటుపై బీజేపీ, టీఆర్ఎస్ మాయమాటలు చెబుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని చెప్పారు. రాహుల్గాంధీ తీసుకొచ్చిన కనీస ఆదాయ పథకం పేదల బతుకుల్లో వెలుగులు నింపుతుందన్నారు. మధుయాష్కిని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నియంత పాలన: షబ్బీర్ కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. అసదుద్దీన్ ఓవైసీతో కలిసి రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పేద ముస్లింలను ఓవైసీ ఏనాడూ పట్టించుకోలేదని, వారి ఓట్లతో గెలిచి వారి సంక్షేమాన్ని విస్మరించారని పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత కేవలం హామీల కవితలకే పరిమితమైంది తప్ప నెరవేర్చలేదని.. పసుపుబోర్డు, ఎర్రజొన్న రైతులకు న్యాయం చేయకపోవడంతోనే ఎంపీ కవితపై రైతులు పోటీలకు దిగారని గుర్తుంచుకోవాలన్నారు. హామీలు నెరవేర్చలేదు: గద్దర్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జీఎస్టీతో పాటు కేఎస్టీ అమలవుతోందని గద్దర్ ఆరోపించారు. ఏ పని చేపట్టినా కేఎస్టీ చెల్లిస్తేనే వాటి పనులు జరుగుతాయని, లేకుంటే ఆగిపోయే పరిస్థితి ఉందన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, వక్ఫ్బోర్డు భూములు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి: మధుయాష్కి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నిజామాబాద్ అభ్యర్థి మధుయాష్కి తెలిపారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే జిల్లాకు అలీసాగర్, గుత్ప పథకాలతో పాటు పాస్పోర్టు కార్యాలయం, మెడికల్ కళాశాల తీసుకువచ్చానని గుర్తు చేశారు. ఈ సారి గెలిపిస్తే సదా మీ సేవలో ఉంటానన్నారు. మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, డీసీసీ చీఫ్ మానాల మోహన్రెడ్డి, నేతలు మహేష్కుమార్గౌడ్, కేశ వేణు, తాహెర్బిన్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే..
సాక్షి, నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని నిజామాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఏఐసీసీ సభ్యులు మధుయాష్కిగౌడ్ విమర్శించారు. ఈ రెండు పార్టీల ప్రేమాయణం బయటపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం కాంగ్రెస్భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో హామీలను సాధించడంలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. చిన్నా, చితక వ్యాపారుల బతుకులను రోడ్డు పాల్జేసిన పెద్దనోట్ల రద్దు వంటి ప్రధాని మోదీ నిర్ణయాలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతు పలికారని గుర్తు చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ వెనుక మోదీ ఉన్నారని ఆరోపించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న దళిత నేతకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ సర్కారు హయాంలో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 16 శాతానికి తగ్గాయని ఆరోపించారు. దేశంలో మైనార్టీలు, దళితులపై దాడులు జరుగుతుంటే టీఆర్ఎస్ కనీసం స్పందించిన దాఖలాల్లేవన్నారు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగేతర శక్తిగా మారుతుంది.. బీజేపీపైనా మధుయాష్కి నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగేతర శక్తిగా మారుతుందని ఆరోపించారు. గోమాత పేరుతో హత్యలకు పాల్పడే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ప్రధాని మోదీ తన స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని మతపరంగా విభజిస్తున్నారని అన్నారు. తాను గెలిచాక పసుపుబోర్డు సాధిస్తానని, పసుపునకు రూ.పదివేలు, ఎర్రజొన్నకు రూ.మూడు వేల క్వింటాలు చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీస ఆదాయం కల్పించే దిశగా పథకాలను అమలు చేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు వ్యత్యాసం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్ముకుంటుందని, జ్యోతిష్యులను కాదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత వైఫల్యాల నుంచే తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని మధుయాష్కి ప్రకటించారు. విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్రెడ్డి, ఆ పార్టీ నాయకులు డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, తాహెర్బీన్ హందాన్, ఈరవత్రి అనీల్, అర్కల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మధుయాష్కీకి నిరసన సెగ
మెట్పల్లి (కోరుట్ల): కాంగ్రెస్ నేత మధుయాష్కీకి నిరసన సెగ తగిలింది. ఆ పార్టీకి చెందిన కొమురెడ్డి రాములు వర్గీయులు, టీఆర్ఎస్ కార్యకర్తలు గురువారం రాత్రి ఆయన వాహనాలను ధ్వంసం చేశారు. తమ నాయకుడికి టికె ట్ రాకుండా చేశారని రాములు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. డబ్బులు పంచేందు కు ఇక్కడికి వచ్చారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చోటుచేసుకుంది. మధుయాష్కీ కొందరితో కలసి రెండు వాహనాల్లో పట్టణంలోని చైతన్యనగర్లోని ఓ ఇంటికి వ చ్చారు. విషయం తెలుసుకున్న రాములు వర్గీయులు తమ నాయకుడికి టికెట్ రాకుండా చేశారని నిలదీశారు. మధుయాష్కీ వచ్చిన విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రావడమే కాకుండా పెద్దఎత్తున డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ అ క్కడ బైఠాయించి ఆందోళనకు దిగారు. మధుయాష్కీతో వాగ్వాదానికి దిగారు. అయినా ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోతుండటంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. తర్వాత వాహనం దిగి మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వాహనాలను డ్రైవర్లు తీసుకువెళ్తుండగా.. వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు వాహనాలను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిని ఖండించిన ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్పై గురువారం రాత్రి మెట్పల్లిలో జరిగిన దాడిని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఖండించారు. ఈ దాడి అనాగరికమైన చర్య అని, ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. -
మధుయాష్కీకి కవిత హెచ్చరికలు
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్ పార్టీని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కాంగ్రెస్ నేత మధుయాష్కీ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్ట, రాజకీయ పరపతి దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడుతున్నారని, తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు ఆమె తెలిపారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని తనపై భర్తపై ఆధారాలు లేని అవాస్తవాలు, ఆరోపణలు చేయడం విచారకరమని అన్నారు. తన పట్ల, తన భర్త పట్ల వాడిన అసభ్య పదజాలాన్ని వాపస్ తీసుకుని క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కవిత హెచ్చరించారు. -
అధికారంలోకి వస్తే బీసీ సబ్ప్లాన్ అమలు
హైదరాబాద్: బీసీల రాజకీయ చైతన్యాన్ని ఈ ఎన్ని కల్లో నిరూపించాల్సిన అవసరం ఉందనీ, తాము అధికారంలోకి వస్తే బీసీ సబ్ప్లాన్ అమలు చేస్తామని టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. లక్డీకాపూల్లోని ఓ హోటల్లో ఆదివారం ‘బీసీల సమగ్ర ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి బీసీ డిక్లరేషన్’ పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో పొన్నం ప్రభాకర్ ప్రసంగించారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ చేపట్టిన బీసీ బస్సు యాత్రతో అన్ని రాజకీయ పార్టీలు బీసీల వైపు చూస్తున్నాయన్నారు. ఇదే ఒరవడి కొనసాగించి అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం పెంచే దిశగా కృషి చేయాలని కోరారు. చట్టసభల్లో బీసీలు అడుగు పెట్టాలంటే అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండేసి ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని సూచించారు. ఆ స్థానాల్లో అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులను నిలబెడితే ధన ప్రవాహం పనిచేయకుండా బరిలో దిగిన అభ్యర్థి గెలిచినా, ఓడినా బీసీలే ఉంటారన్నారు. అప్పుడు కనీసం 34 మంది బీసీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో చూడవచ్చని అన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ దొంగచాటున అసెంబ్లీ టికెట్లను ప్రకటించినందున బీసీలు ఆశించిన స్థానాలు దక్కకపోయినా కాంగ్రెస్ లో మాత్రం వారికి ఎక్కువ స్థానాలు లభించేలా కృషి చేస్తానని అన్నారు. బీసీల పక్షాన అండగా నిలబడేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనకు ఈ పదవిని కట్టబెట్టారని, ఈ బాధ్యతను శిరసావహిస్తానని చెప్పారు. బీసీ సంఘం కూర్చిన మేనిఫెస్టో మహాకూటమి తరహాలో ఉండేలా చూస్తామన్నారు. అధికారంలోకి వస్తే బీసీ జనాభాకు దామాషా ప్రకారం నిధులు ఒక హక్కుగా దక్కడానికి బీసీ సబ్ప్లాన్ చట్టాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ... బీసీలకు అవకాశం వస్తే ఎవరికీ తీసిపోరని, అందుకు తానే ఒక ఉదాహరణ అని చెప్పారు. నాడు ఎన్టీఆర్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా మచ్చలేకుండా 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా ఈ స్థాయికి చేరుకున్నట్లు వివరించారు.మహా కూటమిలో బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం దక్కేలా తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు.బీసీ మేనిఫెస్టోలో పొందుపరిచిన డిమాండ్లను తాము అంగీకరిస్తున్నామని ఈ ఎజెండా అమలుకు పాటుపడతామని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించాలని డిమాండ్ చేశారు. దీన్ని అమలు చేసిన పార్టీలే అధికారంలోకి వస్తాయని, మోసపూరిత మాటలతో కాలం వెళ్లదీస్తే బీసీలు నమ్మడానికి సిద్ధంగా లేరని అన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ మిగతా 14 సీట్లు బీసీలకు ఇవ్వాలని, మహా కూటమి, బీజేపీ పార్టీలు సగం సీట్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ ఏ సామాజిక వర్గానికీ లేని క్రీమీలేయర్ బీసీలపైన విధించడం దారుణం అని అన్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే దీన్ని ఎత్తివేస్తామని హామీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లా సూర్య ప్రకాశ్ (బీఎల్ఎఫ్), చెరుకు సుధాకర్(తెలంగాణ ఇంటిపార్టీ), కాసం వెంకటేశ్వర్లు (బీజేపీ), బోమ్మవోని ప్రభాకర్(సీపీఐ)లతో పాటుగా మేధావులు, విద్యావేత్తలు, కుల సంఘాల నేతలు హాజరై ప్రసంగించారు. కేసీఆర్కు బీసీల సమస్యలు పట్టవు: మధుయాష్కీ మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ... ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన బడుగులకు అసలు సిసలైన తెలంగాణ రాలేదని, నేడు సగం తెలంగాణ మాత్రమే వచ్చిందని అన్నారు. సంపూర్ణ తెలంగాణ రావాలంటే సామాజిక తెలంగాణ రావాలని ఉద్ఘాటించారు. ఫాం హౌస్కు పరిమితమైన కేసీఆర్కు బీసీల సమస్యలు పట్టవని అన్నారు. గొర్రెలు, బర్రెలతో మోసగించి బీసీలకు కేవలం 20 టికెట్లు ఇచ్చి ఫాం హౌస్కు పారిపోయారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అయినా, కాంగ్రెసైనా బీసీలకు అన్యాయం చేసినప్పుడు ఒక బీసీ బిడ్డగా ఎదిరిస్తానని అన్నారు.బీసీలకు ఈ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లో ప్రాధాన్యమివ్వాలని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్కు ఆదేశాలు ఇచ్చారని, బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే విధంగా రాహుల్గాంధీని ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. -
కేసీఆర్కు కూటమి భయం: మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్పై ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజామాబాద్ సభలో సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సచివాలయానికి రాకుండా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు కట్టుకున్న కేసీఆరా కాంగ్రెస్ను విమర్శించేదని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం ఏర్పడుతున్న మహాకూటమి కేసీఆర్కు రాజకీయంగా బొందపెట్టడం ఖాయమని, కూటమి అంటే కేసీఆర్కు భయం పట్టుకుందన్నారు. ‘కేటీఆర్ ఆంధ్రా కాంట్రాక్టర్లతో కలసి తిరుగుతుంది నిజం కాదా? అమరావతిలో కేసీఆర్ బాబుకు వంగి సలామ్లు కొట్టింది నిజం కాదా? చంద్రబాబు తో కలసి రొయ్యల పులుసు తిన్నప్పుడు దోస్తానా గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ ఇప్పుడు కాటే సే నక్కలా మారారని ధ్వజమెత్తారు. తాను తెలంగా ణ కోసం పనిచేసినప్పుడు కేసీఆర్ ఫాంహౌస్లో పడుకున్నారన్నారు. నా ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగావో మర్చిపోయావా కేసీఆర్ అని ప్రశ్నించారు. సంస్కారంతో మాట్లాడాలని లేదంటే తాము కూడా అదే రీతిలో సమాధానం చెప్తామన్నారు. -
‘పాపాత్ముడి పాలన అంతమైంది’
సాక్షి, హైదరాబాద్ : ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారమిస్తే.. కేసీఆర్ చాతకాకనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ గౌరవంగా మాట్లాడితే తాము మర్యాదిస్తాం అన్నారు. కాదని తాగుబోతులా మాట్లాడితే తాను కూడా తాగకుండా అదే రేంజ్లో తిడతానన్నారు. పేకాట క్లబ్బులు ముసామని చెబుతున్న కేసీఆర్ పబ్బులు ఎందుకు తెరిచారో చెప్పాలన్నారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్కు లేదన్నారు. నిస్వార్థంగా సోనియా తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ మోసం చేసి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో పాపాత్ముడి పాలన అంతమైందన్నారు. అసెంబ్లీ రద్దుతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ను ప్రభుత్వ ఆసుపత్రిని చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్తో కలిసిరావలని కోరారు. -
మధుయాష్కీపై చెక్ బౌన్స్ కేసు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేశారంటూ ఆయనపై నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో బుధవారం చెక్ బౌన్స్ కింద ఫిర్యాదులు దాఖలయ్యాయి. కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన రామస్వామిగౌడ్, పడాల నారాయణగౌడ్, భూంరెడ్డి ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. తమ నుంచి రూ. 90 లక్షలు అప్పుగా తీసుకున్నారని, ఇందుకోసం ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని పేర్కొన్నారు. -
'వారిది న్యాయమైన పోరాటం'
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులపై లాఠీచార్జ్ను కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు మధుయాష్కీ, వివేక్, రాజయ్య, పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఉద్యోగాల కోసం విద్యార్ధుల చేస్తున్నది న్యాయమైన పోరాటమని సమర్థించారు. ఇంటికో ఉద్యోగమన్న హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఓయూ విద్యార్ధుల పోరాట ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్న వాస్తవాన్ని టీఆర్ఎస్ నాయకులు మర్చిపోరాదని అన్నారు. తమకు ఉద్యోగాలు రావన్న విద్యార్ధుల ఆందోళనపై టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. -
బిల్లు గడువు వారం పెంచే అవకాశం: యాష్కీ
హైదరాబాద్: తెలంగాణ బిల్లులో ఎలాంటి లోపాలు లేవని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. తెలంగాణపై ఏర్పాటు చేసిన జీవోఎంలో న్యాయ కోవిధులున్నారని గుర్తు చేశారు. మధుయాష్కీ తెలంగాణ బిల్లు ఫిబ్రవరిలో ఆమోదం పొందుతుందని ఆయన జోస్యం చెప్పారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల కోరిక మేరకు బిల్లు గడువును రాష్ట్రపతి మరోవారం పొడిగించే అవకాశం ఉందన్నారు. విభజన బిల్లు తప్పుల తడక అని దాన్ని తిప్పి పంపాలంటున్న సీఎం కిరణ్ తీరు అప్రజాస్వామికమని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సీఎం ఇచ్చిన విభజన బిల్లు తిరస్కార నోటీసును పరిగణలోకి తీసుకోవద్దని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ను కోరామని ఆయన తెలిపారు. బిల్లు అసమగ్రంగా ఉంది, దాన్ని తిప్పి పంపాలన్న సీఎం.. మళ్లీ బిల్లుపై చర్చకు గడువు పెంచాలనడం వితండవాదమే అవుతుందన్నారు. బిల్లుపై అభిప్రాయాలు మాత్రమే రాష్ట్రపతి కోరారని, దానిపై ఓటింగ్ ఉండదని స్పష్టం చేశారు. -
తెలంగాణపై ఆందోళన వద్దు
కలెక్టరేట్, న్యూస్లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఎంపీ మధుయాష్కీగౌ డ్ అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్భవన్లో టీఎన్జీవోస్ 2014 -డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎంపీ, టీఎన్జీవోస్ రాష్ట్ర, జిల్లా నాయకులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమా న్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యోగులు , ఉపాధ్యాయులు , కార్మికులు, కర్షకులు, విద్యార్థులు నిరంతరం పోరాటం చేశారన్నారు. ఎంతో మంది విద్యార్థులు తెలంగాణకోసం అమరులయ్యారన్నారు. వా రి ఆశయం మరో పది, పదిహేను రో జు ల్లో తీరబోతుందన్నారు. ఫిబ్రవరి తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలి చిపోతుందన్నారు. ఉద్యమంలో ఉద్యోగులే ముందు టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉద్యోగులు ముందు ఉన్నారన్నారు. సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులను మొదటి నుంచి మోసం చేస్తునే ఉందన్నారు. 610 జీవోను పూర్తిగా అమలు చేయాలన్నారు. ప్రత్యేక తెలంగాణ వల్ల లక్షా 40 వేల మంది ఉద్యోగులు నష్టపోవాల్సి వస్తుందని స్వయంగా సీఎం కిరణ్కుమార్రెడ్డి తెలిపారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కాంట్రాక్టు , అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీవితాలు బాగుపడతాయన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ రాష్ట్ర నాయకులు బుచ్చిరెడ్డి, శ్రీనివాసరావు, టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం, కార్యదర్శి కిషన్, టీజీఓ అధ్యక్షులు బాబురావు, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యప్రకాశ్, తెలంగాణ ట్రెజరీ అధ్యక్షుడు రాములు, జేఏసీ చైర్మన్ గోపాల్శర్మ, సాయరెడ్డి, టీఎన్జీవోస్ నాయకులు అమృత్కుమార్, నరహరి, దయానంద్, నరేందర్, తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు శంకర్, రాంజీ తదితరులు పాల్గొన్నారు.