Match
-
ఆ జట్టులో నితీశ్ రెడ్డి లేడు కారణం అదేనా
-
రిటైర్మెంట్ హింట్ ఇచ్చిన రోహిత్...
-
IND vs AUS:పెర్త్ టెస్టులో భారత్ ఘన విజయం
-
పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్
-
ఉప్పల్ మ్యాచ్ పై VHP కీలక వార్నింగ్
-
భారత్-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్: ఉప్పల్ స్టేడియం వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వద్ద హైటెన్షన్ నెలకొంది. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరో వైపు, మ్యాచ్ను అడ్డుకుంటామంటూ వీహెచ్పీ హెచ్చరించిన నేపథ్యంలో స్టేడియం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు బాంబ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. 250 మంది సెక్యూరిటీ వింగ్, 400 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2,600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ వెల్లడించారు.ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలుభారత్– బంగ్లాదేశ్ల మధ్య టీ–20 క్రికెట్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్ జరిగే సమయాల్లో ఉప్పల్ స్టేడియంవైపు భారీ వాహనాలను అనుమతించరు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్రోడ్డు, చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్ఎఫ్సీ మీదుగా తమ గమ్యాలను చేరుకోవాలి.ఇదీ చదవండి: ఉప్పల్లో గెలుపెవరిదో!వరంగల్ వైపు నుంచి ఎల్బీనగర్ వెళ్లాల్సిన వారు ఉప్పల్ ఏషియన్ ధియేటర్ ఎదురుగా భగాయత్ రోడ్డు నుంచి నాగోల్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు నాగోల్ మెట్రోస్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి ఏషియన్ ధియేటర్ మీదుగా బోడుప్పల్ చేరుకోవాలి. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం పారిశ్రామిక వాడ ద్వార చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. రామంపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ వీధి నంబర్–8 మీదుగా హబ్సిగూడ మెట్రో పిల్లర్ 972 వద్ద యూ టర్న్ తీసుకుని ఉప్పల్ ఎక్స్ రోడ్డుకు చేరుకోవాలి. -
అనంతపూర్ లో క్రికెట్ సందడి
-
వింబుల్డన్ మ్యాచ్లో సందడి చేసిన గేమ్ ఛేంజర్ భామ.. ఫోటోలు
-
India vs Bangladesh Photos : 50 పరుగులతో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
పాక్పై విజయం: ‘వన్ విత్ నేచర్’ అంటున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (ఫొటోలు)
-
తెలుగు కుర్రాడు అరుదైన ఘనత.. నితీష్ రెడ్డి టీమిండియాలోకి ఎంట్రీ ..!
-
అర్జున్కు మిశ్రమ ఫలితాలు..!
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్మాస్టర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్ గేమ్లో అర్జున్ 45 ఎత్తుల్లో ఎల్తాజ్ సఫారిల్ (అజర్బైజాన్)పై గెలిచాడు.రెండో రౌండ్ గేమ్లో అర్జున్ 28 ఎత్తుల్లో నికోలస్ (గ్రీస్) చేతిలో ఓడిపోయాడు. తెలంగాణకే చెందిన మరో గ్రాండ్మాస్టర్ రాజా రిత్విక్ తొలి గేమ్లో 28 ఎత్తుల్లో అభినవ్ మిశ్రా (అమెరికా) చేతిలో ఓడిపోయి... లియోన్ మెండోకా (భారత్)తో జరిగిన రెండో గేమ్ను 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.ఇవి చదవండి: Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట! -
Anchor Sreemukhi: ఉప్పల్ స్టేడియంలో యాంకర్ శ్రీముఖి సందడి (ఫోటోలు)
-
చెపాక్లోనూ లక్నో చేతిలో చెన్నైకి భంగపాటు!
-
ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్.. అభిమానులకు మరోసారి నిరాశే
-
గుజరాత్పై చెన్నై సూపర్కింగ్స్ ఘన విజయం (ఫొటోలు)
-
లియాండర్ పేస్... ప్రముఖ డ్యాన్సర్!
‘ఎక్స్’యూజర్ పృథ్వీ తన చిన్నారి మేనకోడలు వర్క్బుక్ నుంచి పోస్ట్ చేసిన స్నాప్చాట్ నెట్లోకంలో నవ్వులు పూయిస్తోంది. ఈ వర్క్బుక్లో‘మ్యాచ్ ది ఫాలోయింగ్’ శీర్షిక కింద ఎడమవైపు ప్రముఖుల పేరు, కుడివైపు ఆయా రంగాలకు సంబంధించిన బొమ్మలు ఇచ్చారు. ఏ వ్యక్తి ఏ రంగానికి చెందిన వారో జత చేయాలి. విరాట్ కోహ్లీ–క్రికెటర్, లతా మంగేష్కర్–సింగర్... ఇలా అన్నిటికీ కరెక్ట్గానే జత చేసింది ఆరు సంవత్సరాల చిన్నారి. అయితే లియాండర్ పేస్ దగ్గరే వచ్చింది పేచీ. ప్రభుదేవాతో పాటు లియాండర్ పేస్ను కూడా డ్యాన్సర్ని చేసింది. ఇది చూసి సరదాకారులు ఊరుకుంటారా ఏమిటి? మీమ్సే మీమ్స్! -
నాలుగేళ్ల క్రితం మ్యాచ్ కు ఇప్పుడు ఇంత క్రేజా..?
-
ఈనెల 25న భారత్ Vs ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్కు సర్వం సిద్ధం
-
ఐపీఎల్ మినీ వేలం 2023
-
భారత్ మ్యాచ్ గెలిస్తే చాట్ ఫ్రీ!
ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య పోరు ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. యూపీలోని అమేథీకి చెందిన ఒక చిరు తినుబండారాల వ్యాపారి ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలిస్తే తాను స్థానికులకు చాట్ ఉచితంగా పంచుతానని ప్రకటించాడు. దీనిని సంబంధించిన ప్రకటనను కూడా దుకాణం వద్ద అతికించాడు. అమేథీలోని గౌరీగంజ్ ప్రాంతానికి చెందిన సురేంద్ర గుప్తాకు క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. క్రికెట్లో రాణిస్తూ జిల్లా స్థాయిలో వివిధ టోర్నమెంట్లలో కూడా ఆడాడు. సురేంద్ర తన దుకాణం వద్ద ఒక పోస్టర్ అతికించాడు. భారత్ వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచిన తర్వాత సోమవారం ఉదయం 10 గంటల నుంచి తన వద్ద సరుకు ఉన్నంతవరకు, కస్టమర్ల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా చాట్ ఉచితంగా పంపిణీ చేస్తానని ప్రకటించాడు. ఇది కూడా చదవండి: పులితో పెట్టుకున్న కోతి.. మరి ఏది గెలిచింది? -
మ్యాచ్ అహ్మదాబాద్లో.. ‘రెట్టించిన ఉత్సాహం’ ఢిల్లీలో..
ఈరోజు (ఆదివారం) గుజరాత్లోని అహ్మదాబాద్లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు పబ్లు, రెస్టారెంట్లలో క్రీడాప్రియులు మ్యాచ్ను మరింత ఉత్సాహంతో తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేయడం మొదలుకొని ప్రత్యేక పానీయాలు అందించడం వరకు అన్నింటినీ అందుబాటులో ఉంచారు. ప్రపంచ కప్ ఫైనల్ను క్యాష్ చేసుకునేందుకు ఢిల్లీ-ఎన్సిఆర్లోని పలు పబ్లు, రెస్టారెంట్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. సెమీ ఫైనల్స్లో న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్కు చేరిన టీమ్ఇండియా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లోనూ విజయం సాధించడం విశేషం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ‘ఎస్ మినిస్టర్ - పబ్ అండ్ కిచెన్’ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ఇది బిగ్ మ్యాచ్ కావడంతో ‘కవర్ ఛార్జీ’గా మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నాం. సాధారణ రోజుల్లో, మేము దీనిని వసూలు చేయం. ఫైనల్ మ్యాచ్ అయినందున ఇంత రేటును వసూలు చేస్తున్నాం. దీనిని ఆహారానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది’ అని అన్నారు. కాగా బ్లూ జెర్సీ ధరించి వచ్చే వారి కోసం ‘బీర్ కేఫ్’లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీర్ కేఫ్ వ్యవస్థాపకుడు రాహుల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘టీమ్ ఇండియా ఫైనల్కు చేరడంతో ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న మా అవుట్లెట్లలో అభిమానులను స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పెద్ద స్క్రీన్లపై మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. టీమ్ ఇండియా జెర్సీ ధరించి వచ్చిన వారికి ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాం’ అని అన్నారు. హర్యానాలోని సైబర్ సిటీ ఆఫ్ గురుగ్రామ్లోని ‘సోయి 7 పబ్’, ‘బ్రూవరీ’లలో క్రీడాభిమానులు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ‘సోయి 7 పబ్’కి చెందిన లలిత్ అహ్లావత్ మాట్లాడుతూ ‘మ్యాచ్లను ప్రసారం చేయడానికి మూడు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశాం. సైబర్ సిటీలో అతిపెద్ద వేదిక ఏర్పాటు చేశాం. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: మ్యాచ్ తిలకించేందుకు అహ్మదాబాద్కు అనుష్క శర్మ -
మ్యాచ్ తిలకించేందుకు అహ్మదాబాద్కు అనుష్క శర్మ
బాలీవుడ్నటి అనుష్క శర్మ మరోమారు గర్భం దాల్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ఒక వీడియో వైరల్గా మారింది. అందులో అనుష్కశర్మ బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది. అనుష్కకు సంబంధించి తాజా వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఆమె గుజరాత్లోని అహ్మదాబాద్ చేరుకోవడం కనిపిస్తుంది. ఈ వీడియోలో ఆమెతో పాటు కుమార్తె వామికా కోహ్లీ కూడా ఉంది. ఒక అభిమాని షేర్ చేసిన ఈ వీడియోలో మొదట వామికా కోహ్లీ, తరువాత అనుష్క శర్మ ప్రైవేట్ విమానం నుంచి తెల్లటి సూట్లో బయటకు వస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్..‘ఫైనల్ మ్యాచ్ కోసం అనుష్క శర్మ కుమార్తె వామికాతోపాటు అహ్మదాబాద్ చేరుకున్నారు’ అని రాశారు. కాగా ఈ వీడియో వైరల్గా మారింది. అయితే ఈ వీడియో ఎప్పటిది? అనేది స్పష్టం కా లేదు. నవంబర్ 19న భారత్- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది కూడా చూడండి: భారత్-ఆసీస్ ఫైనల్ పోరు.. హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే? Anushka Sharma has arrived at Ahmedabad for the finals with Vamika #INDvsAUS #WorldcupFinal#AUSvsSA #SAvsAUS #CWC23#ViratKohli𓃵 #RohithSharma#NarendraModiStadium#anushkasharmapic.twitter.com/U0FsYm6TDs — 𝑴𝑺 𝑭𝑶𝑶𝑻𝑪𝑹𝑰𝑪 ⚽🏏 (@IFootcric68275) November 18, 2023 -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు ప్రధాని మోదీ
అహ్మదాబాద్: క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు అహ్మదాబాద్ వైదికైంది. ఈ మ్యాచ్ను చూడటానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ హాజరు కానున్నారు. మ్యాచ్ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు రానున్న నేపథ్యంంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మ్యాచ్ నిర్వహణకు కావాల్సిన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. మ్యాచ్ సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు. మ్యాచ్ సందర్భంగా మొత్తం 4,500 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అభిమానులకు ఇబ్బంది కలగకుండా నరేంద్ర మోదీ స్టేడియం వైపు మెట్రో రైళ్ల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం మ్యాచ్కు ముందు పది నిమిషాల పాటు ఎయిర్ షోను నిర్వహించనున్నారు. మిడ్-ఇన్నింగ్స్లో కంపోజర్ ప్రీతమ్ ప్రదర్శనతో సహా అనేక ఈవెంట్లు నిర్వహించనున్నారు. వింగ్ కమాండర్ సిదేశ్ కార్తిక్ నేతృత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన తొమ్మిది విమానాలు వైమానిక ప్రదర్శన నిర్వహిస్తాయి. మ్యాచ్ టాస్ వేసిన తర్వాత నరేంద్ర మోడీ స్టేడియం పైన ఎయిర్ షో ప్రదర్శిస్తాయి. ఇప్పటివరకు ప్రపంచ వరల్డ్కప్లలో విజయం సాధించిన జట్ల కెప్టెన్లందర్ని బీసీసీఐ సత్కరించనుంది. సంగీత స్వరకర్త ప్రీతమ్ లైవ్ షో నిర్వహించనున్నారు. 500 కంటే ఎక్కువ మంది డ్యాన్సర్లతో ఈ ప్రదర్శన జరగనుంది. మ్యాచ్ సందర్భంగా స్డేడియం విద్యుత్ వెలుగులతో మెరిసిపోనుంది. ఇందుకోసం యూకే నుంచి ప్రత్యేక టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇదీ చదవండి: జై షాకు క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం.. -
ఉదయనిధికి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో జై శ్రీరాం నినాదాలు చేయడాన్ని డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తప్పుబట్టడంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఉదయనిధిని విషాన్నిచిమ్మే దోమగా బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా పేర్కొన్నారు. గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా పాక్ క్రికెటర్ రిజ్వాన్ ముందు అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ చర్యను సహించరానిదిగా పేర్కొన్నారు ఉదయనిధి. క్రీడా వేదికగా ద్వేషాన్ని చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఆటలు దేశాల మధ్య సోదరభావాన్ని పెంచాలని కోరారు. India is renowned for its sportsmanship and hospitality. However, the treatment meted out to Pakistan players at Narendra Modi Stadium in Ahmedabad is unacceptable and a new low. Sports should be a unifying force between countries, fostering true brotherhood. Using it as a tool… pic.twitter.com/MJnPJsERyK — Udhay (@Udhaystalin) October 14, 2023 ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఉదయనిధి వ్యాఖ్యలు విద్వేషంతో కూడుకున్నవని మండిపడ్డారు. మైదానంలో నమాజ్ చేయడానికి ఆటను కాసేపు ఆపినప్పుడు మీకు ఎలాంటి అభ్యంతరం లేదా..? అంటూ ఉదయనిధిని ఉద్దేశించి బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా దుయ్యబట్టారు. రాముడు విశ్వంలో ప్రతి అణువునా ఉంటాడని పేర్కొన్న గౌరవ్ భాటియా.. జై శ్రీ రాం అనాలని ఉదయనిధికి హితువు పలికారు. नफ़रती डेंगू मलेरिया मच्छर फिर निकला है विष घोलने जब मैच रुकवा कर फील्ड पर नमाज़ पड़ी जाती है तो तुम्हें साँप सूँघ जाता है सृष्टि के हर कन कन मे हमारे प्रभु श्री राम बसते है, तो बोलो जय श्री राम 🙏#IndiavsPak pic.twitter.com/Tm7Ikxbtqw — Gaurav Bhatia गौरव भाटिया 🇮🇳 (@gauravbhatiabjp) October 15, 2023 పాక్ క్రికెటర్ల సమక్షంలో జై శ్రీరాం నినాదాలకు సంబంధించిన వీడియోలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వచ్చాయి. అభిమానుల చర్య క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని, క్రికెటర్పై వేధింపులుగా కొందరు భావించారు. అదే క్రమంలో యుద్ధంలో గాజాకు సంఘీభావం తెలుపుతూ మైదానంలో రిజ్వాన్ నమాజ్ చేశాడని మరికొందరు స్పందించారు. మైదానంలోకి మతాన్ని తీసుకురావడంపై నెటిజన్లు మండిపడ్డారు. ఇదీ చదవండి పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి -
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజే వేరు
-
హై వోల్టేజ్ మ్యాచ్..ఇండియా వర్సెస్ పాకిస్థాన్
-
ఆసియా కప్ లో కీలక మ్యాచ్..పాకిస్థాన్ కు షాక్..!
-
వానదే విజయం
పల్లెకెలె: భారత్తో ఆసియా కప్ పోరులో పాకిస్తాన్ విజయలక్ష్యం 267 పరుగులు... పాక్ దీనిని ఛేదిస్తుందా లేక తొలి ఇన్నింగ్స్ తరహాలో భారత బౌలర్లు కూడా చెలరేగి ప్రత్యచ్చిని కట్టడి చేస్తారా... ఇరు జట్ల అభిమానుల్లో ఉత్కంఠ... అయితే అందరి ఆసక్తిపై వర్షం నీళ్లు చల్లింది... పాకిస్తాన్ అసలు బ్యాటింగ్కు దిగే అవకాశమే రాలేదు. అత్యంత ఆసక్తికర, హోరాహోరీ సమరంగా అంచనాలు పెంచిన మ్యాచ్ చివరకు వరుణుడి బారిన పడింది. శనివారం భారత్, పాకిస్తాన్ మధ్య లీగ్ మ్యాచ్ వాన కారణంగా రద్దయింది. భారత్ ఇన్నింగ్స్ పూర్తిగా సాగగా, ఆపై వానదే విజయమైంది. అర్ధాంతరంగా ముగిసిన మ్యాచ్లో టాప్–4 విఫలం కావడం భారత్ కోణంలో నిరాశపర్చే అంశం కాగా... ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చెప్పుకోదగ్గ విశేషం. ముగ్గురు ప్రధాన పేసర్లు చెలరేగడం పాకిస్తాన్కు సంబంధించి పెద్ద సానుకూలాంశం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. హార్దిక్ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. వీరిద్దరు ఐదో వికెట్కు 138 పరుగులు జోడించారు. షాహిన్ అఫ్రిది (4/35) బౌలింగ్ హైలైట్ కాగా, నసీమ్ షా, హారిస్ రవూఫ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. తొలి మ్యాచ్ నెగ్గిన పాకిస్తాన్ ఈ ఫలితంతో ‘సూపర్–4’ దశకు చేరగా, రేపు నేపాల్తో జరిగే మ్యాచ్లో భారత్ గెలిస్తే సూపర్–4 దశకు అర్హత సాధిస్తుంది. టాప్–4 విఫలం... రోహిత్ శర్మ (22 బంతుల్లో 11; 2 ఫోర్లు), గిల్ (32 బంతుల్లో 10; 1 ఫోర్) కలిసి జాగ్రత్తగా భారత ఇన్నింగ్స్ను ప్రారంభించారు. రోహిత్ రెండు బౌండరీలు కొట్టినా గిల్ పదో బంతికి గానీ తొలి పరుగు చేయలేకపోయాడు. పాక్ బౌలర్ల జోరుతో కొద్ది వ్యవధిలోనే అంతా మారిపోయింది. చక్కటి బంతితో రోహిత్ను క్లీన్»ౌల్డ్ చేసి షాహిన్ మొదటి దెబ్బ కొట్టగా, అతని తర్వాతి ఓవర్లోనే కోహ్లి (4) బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత మైదానంలోకి దిగిన శ్రేయస్ (14), కెరీర్లో పాక్తో తొలి మ్యాచ్లో తడబడుతూనే ఆడిన గిల్ను రవూఫ్ పెవిలియన్ పంపించాడు. దాంతో 66/4తో భారత్ కష్టాల్లో పడింది. ఈ స్థితిలో కిషన్, పాండ్యా భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్ను నిలబెట్టింది. తాను ఆడిన గత మూడు వన్డేల్లో (వెస్టిండీస్తో) అర్ధసెంచరీలు సాధించిన కిషన్ ఇక్కడా అదే ఫామ్ను కొనసాగించగా... పాండ్యా పాక్పై మరోసారి సత్తా చాటాడు. వీరిద్దరు పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ చక్కటి సమన్వయంతో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 54 బంతుల్లో కిషన్, పాండ్యా 62 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వికెట్ల మధ్య పరుగెత్తడంలో కొంత ఇబ్బంది పడిన కిషన్ భారీ షాట్కు ప్రయత్నించడంతో ఈ భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పాండ్యా సహా 7 బంతుల వ్యవధిలో జట్టు తర్వాతి 3 వికెట్లు కోల్పోగా, నసీమ్ 49వ ఓవర్లో 2 వికెట్లతో భారత్ ఆట ముగించాడు. మళ్లీ మళ్లీ అడ్డుపడి... భారత జట్టు ఇన్నింగ్స్ సమయంలో రెండుసార్లు వర్షం అంతరాయం కలిగించింది. 4.2 ఓవర్ల తర్వాత (స్కోరు 15/0) 33 నిమిషాల పాటు... 11.2 ఓవర్ల తర్వాత (స్కోరు 51/3) 20 నిమిషాల పాటు ఆట ఆగిపోయింది. భారత్ ఇన్నింగ్స్ ముగియగానే విరామ సమయంలో వచ్చిన వర్షం కారణంగా సమయం నష్టపోవాల్సి వచ్చింది. ఎంతసేపు నిరీక్షించినా తెరిపి లభించలేదు. రెండు సార్లు అంపైర్లు పరీక్షించినా ఆ వెంటనే చినుకులు రావడంతో పరిస్థితి మొదటికొచ్చింది. చివరకు రాత్రి గం. 9.52కు మ్యాచ్ రద్దు చేయక తప్పలేదు. 5 భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇప్పటి వరకు రద్దయిన వన్డే మ్యాచ్లు. రెండు జట్ల మధ్య మొత్తం 133 మ్యాచ్లు జరిగాయి. 55 మ్యాచ్ల్లో భారత్, 73 మ్యాచ్ల్లో పాకిస్తాన్ గెలుపొందాయి. 26 వన్డే ఫార్మాట్లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దు కావడం 26 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1997లో టొరంటోలో జరిగిన సహారా కప్లో చివరిసారి ఈ రెండు జట్ల మధ్య వన్డే మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) షాహిన్ 11; గిల్ (బి) రవూఫ్ 10; కోహ్లి (బి) షాహిన్ 4; శ్రేయస్ (సి) ఫఖర్ (బి) రవూఫ్ 14; కిషన్ (సి) బాబర్ (బి) రవూఫ్ 82; పాండ్యా (సి) సల్మాన్ (బి) షాహిన్ 87; జడేజా (సి) రిజ్వాన్ (బి) షాహిన్ 14; శార్దుల్ (సి) షాదాబ్ (బి) నసీమ్ 3; కుల్దీప్ (సి) రిజ్వాన్ (బి) నసీమ్ 4; బుమ్రా (సి) సల్మాన్ (బి) నసీమ్ 16; సిరాజ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 20; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 266. వికెట్ల పతనం: 1–15, 2–27, 3–48, 4–66, 5–204, 6–239, 7–242, 8–242, 9–261, 10–266. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–2–35–4, నసీమ్ షా 8.5–0–36–3, రవూఫ్ 9–0–58–3, షాదాబ్ 9–0–57–0, నవాజ్ 8–0–55–0, సల్మాన్ 4–0–21–0. -
WI vs IND 1st T20 Match Photos : ఉత్కంఠపోరులో విండీస్ విజయం (ఫొటోలు)
-
భారత్, పాకిస్థాన్ మ్యాచ్...మళ్లీ జరగాలంటే అదొక్కటే మార్గం
-
భార్య జెర్సీ నెంబర్ తో అదరగొడుతున్న రుతురాజ్ గైక్వాడ్..!
-
మరోసారి గ్రౌండ్లో దిగనున్న మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా.. రేటు ఎంతంటే..?
-
WTC లో భారత్ ఓటమికీ అసలు కారణాలు ఇవే
-
ఐపీఎల్ దెబ్బకి లక్షన్నర మొక్కలు..!
-
IPL 2024కి రెడీ 41 ఏళ్ళ వయసు ఆయన తగ్గేదేలే ..!
-
ఏడాది క్రితం సరిగ్గా అదే రోజు ఇది RR కాదు CSK
-
CSK IPL ట్రోఫీ కి ప్రత్యేక పూజలు..!
-
ధోని నోట రిటైర్మెంట్ మాట ఎప్పటికి క్లారిటీ వచ్చింది..
-
CSK వద్దనుకుంది GT కొనుక్కుంది 20 లక్షలు తీసుకుని చెన్నై పై రెచ్చి పోయడుగా ....
-
చరిత్రలో తోలి సారి కంకషన్ సబ్ స్టిట్యూట్
-
ఒక్క సిరీస్ తో వరల్డ్ కప్ కి యశస్వి జైస్వాల్..
-
ముంబయి చిత్తు చిత్తు.. CSK పై రివెంజ్ కు రెడీ
-
శుభ్మన్ గిల్కు ఆరెంజ్ క్యాప్..
-
ఫైనల్ బెర్త్ ఎవరిది..
-
నర్సు నిర్వాకం..పేషెంట్ నుంచి రక్తం తీసుకునే టైంలో..
ఇటీవల డాక్టర్లు పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పలు ఘటనలను చూశాం. ఆపరేషన్ చేసేటప్పుడో లేదా చికిత్స చేసేటప్పుడో తప్పులు దొర్లిన ఘటనలు చూశాం. అదికూడా కంటిన్యూ డ్యూటీల వల్లో లేక ఆరోజు వారు అసహనగా ఉండటం వల్లో జరిగిన అనూహ్య ఘటనలే. కానీ ఇక్కడొక నర్సు మాత్రం కేవలం గేమ్ పిచ్తో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. అది కూడా రక్తం తీసుకునే టైంలో మ్యాచ్ చూస్తు ఉండిపోయింది. దీంతో పేషెంట్కి పెద్ద గాయమైంది కూడా. కానీ ఆమెలో ఏ మాత్రం అయ్యే తప్పుచేశానన్న భావన కూడా లేదు. ఈ షాకింగ్ ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..19 ఏళ్ల లిబ్బి బేట్స్ మూర్చరోగంతో బాధపడుతుంది. ఒకరోజు మూర్చ రోగంతో స్ప్రుహతప్పి పడిపోవడంతో అంబులెన్స్లో వూల్విచ్లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడ నర్సు లిబ్సికి రక్త పరీక్షల నిమిత్త రక్తం స్వీకరించేందుకని ఓ గదిలోకి తీసుకువెళ్లింది. ఐతే అక్కడ నర్సు కంప్యూటర్ ముందు మొబైల్ పెట్టి ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ.. బ్లడ్ శ్యాంపిల్స్ తీస్తోంది. వాస్తవానికి లిబ్బికి చేతి నుంచి రక్తం సేకరించేందుకు అంత తేలికగా నరం దొరకదు. దీని గురించి ఆమె తల్లి నికోలా బేట్స్ నర్సును హెచ్చరించింది. అందుకోసం అల్ట్రాసౌండ్ సాయంతో రక్తం సేకరించాల్సి ఉంటుంది. ఐతే ఆమె మాత్రం అదేమి వినిపించుకోకుండా మొబైల్లో మ్యాచ్ చూసుకుంటూ లిబ్బి చేతిని ఎలా పడితే అలా సుదితో గుచ్చేస్తుంది. దీంతో ఆమె చేతికి పెద్ద గాయం కూడా అయ్యింది. అయినా పేషెంట్ భాదను పట్టించుకోకుండా తన ఇష్టమొచ్చిన రీతిలోనే ప్రవర్తించింది. చివరికి ఏదోలా రక్తం సేకరించి బయటకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో పేషెంట్ తల్లి నికోలా నర్సుని ఫోటోలు కూడా తీస్తుంది. కోపంతో నికోలా ఆ నర్సు బయటకు వెళ్లిపోతుండగా మీరు ఫుట్బాల్ మ్యాచ్ అస్వాదించటం మర్చిపోకండి అని వెటకారంగా అంది. అప్పుడూ కూడా ఆమె నవ్వుతూ వెళ్లిపోయిందే తప్ప.. ఎందుకలా అందో కూడా ఆలోచించలేనంతగా మ్యాచ్ మూడ్లోనే ఉందామే. దీంతో సదరు పేషెట్ తల్లి నికోలా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లానని, ఇప్పటివరకు తనకు తన కుమార్తెకు తనకు ఈ విషయమై క్షమాపణలు చెప్పలేదని వాపోయింది. ఈ ఘటనతో ఆస్పత్రి యాజమాన్యం స్పందించి.. ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో..సదరు నర్సు తన తప్పిదాన్ని అంగీకరించిందని, అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పడమే గాక మరోసారి ఇలా జరగదవి హామీ ఇచ్చినట్లు పేర్కొంది ఆస్పత్రి యాజమాన్యం. (చదవండి: ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి..) -
హర్షదీప్ పై తిలక్ వర్మ రివెంజ్ మాములుగా లేదు గా..
-
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా టోర్నమెంట్
-
గెలవాల్సిన మ్యాచ్ ఓడిన ఆర్ సీబీ కి మరో దెబ్బ
-
నగరంలో ఐపీఎల్ ధమాకా..
-
హైదరాబాద్ లో నేడు సానియా మీర్జా చివరి మ్యాచ్
-
న్యూజీలాండ్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ
-
ఇండియాకి వరల్డ్ కప్ గెలిచే సత్తా ఉందా..?
-
రోహిత్ శర్మను మెప్పించిన కుర్ర బౌలర్..
-
భయపడితే పనులు కావంటున్న గంభీర్
-
Ind Vs Aus- Uppal: రోహిత్, దినేష్ కార్తీక్ ఫోటోలతో హైదరాబాద్ పోలీసుల ట్వీట్
సాక్షి, హైదరాబాద్- Ind Vs Aus 3rd T20- Hyderabad: హైదరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా నగర ప్రజలకు సూచనలు ఇస్తూ చైతన్యవంతం చేస్తూ ఉంటారు. ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు.. ఇలా పలు అంశాలపై జాగ్రత్తలు చెబుతూ నెటిజన్లకు అవగాహన కల్పిస్తుంటారు. ఇందుకోసం అప్పుడప్పుడూ పాపులర్ సినిమా డైలాగులు, పాటలు, పోస్టర్లు ఉపయోగించి.. సృజనాత్మకంగా జనాలకు వివరిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసులు క్రికెట్ను ఇందుకోసం వాడుకున్నారు. ఓ ట్రెండింగ్ ట్వీట్తో ముందుకు వచ్చారు. హైదరాబాద్ వేదికగా.. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ మధ్య కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్, దినేష్ కార్తీక్కు చెందిన రెండు ఫోటోలను షేర్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ధరించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. ఇందులో మొదటి ఫోటోలో రోహిత్ గ్రౌండ్లో కార్తీక్పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతన్ని ముఖాన్ని నలిపేసే ప్రయత్నం చేశాడు. When commuters follow traffic rules... #HelmetSavesLives #HyderabadCityPolice #wearhelmet #BeSafe #RoadSafety pic.twitter.com/DZwlQggJ6W — Hyderabad City Police (@hydcitypolice) September 26, 2022 రెండో దానిలో రోహిత్ దినేష్ను దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతున్నాడు. అయితే ఆ సమయంలో అతని ముఖానికి హెల్మెట్ ఉంది. ఈ రెండిటిని హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విటర్లో షేర్ చేస్తూ.. ప్రయాణికులు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎలా ఉంటుందో, పాటించకుంటే ఎలా ఉంటుందో వెల్లడించారు. హెల్మెట్ ధరించకుంటే ప్రమాదమని, అదే హెల్మెట్ ధరిస్తే అందరూ సంతోషంగా ఉండచ్చనే అనే కోణంలో ఈ మేరకు ట్వీట్ చేశారు. -
ఫైనల్ ఫైట్
-
హై టెన్షన్ క్రియేట్ చేస్తున్న హైవోల్టేజ్ మ్యాచ్
-
సరికొత్త హార్దిక్ పాండ్య
-
ధోని వారసుడే
-
పాకిస్థాన్ పై ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నభారత్
-
సిరీస్ పై ఐసీసీదే తుది నిర్ణయం
-
‘ఒరేయ్ కన్నా.. ఏంట్రా ఈ పని!’
ఎంతటోడైనా సరే అమ్మ ముందుకు వచ్చేసరికి పసివాడే అవుతాడు. అలాంటిది అమ్మ ముందు వేషాలేస్తే ఊరుకుంటుందా?. సాధారణంగా అభిమానంతోనో లేదంటే నిరసన తోనో కొందరు ఆట జరిగేటప్పుడు మైదానాల్లోకి పరుగులు తీయడం చూస్తుంటాం. కానీ, ఇక్కడో బుడ్డోడు అల్లరిలో భాగంగా మైదానంలోకి పరుగులు తీశాడు. సీరియస్గా ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా.. రెండున్నరేళ్ల పిలగాడు తల్లి ఒడి నుంచి తప్పించుకుని గ్రౌండ్లోకి దూరబోయాడు. ఆటలో పడి పరధ్యానంలోకి వెళ్లిన ఆ తల్లి.. కాసేపటికే కొడుకు ఫెన్సింగ్ కింద నుంచి పాకుతూ గ్రౌండ్ వైపు పోతున్న సంగతి గుర్తించింది. We hope this mother and her young pitch invader are having a great day. 😂 pic.twitter.com/hKfwa6wyWI — Major League Soccer (@MLS) August 9, 2021 వెంటనే రియాక్ట్ అయ్యి ఒక దూకున బారికేడ్ దూకి కొడుకు వెంటే గ్రౌండ్లోకి దౌడు తీసింది. ఆ వెంటనే కొడుకును ఒడిసి పట్టి, సిబ్బంది సహకారం లేకుండానే గ్రౌండ్ నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇంకేం గ్రౌండ్ మొత్తం ఒక్కసారి ఘొల్లుమని గోల చేసింది. A young pitch invader was quickly scooped up by their own personal security detail without incident. #FCCincy #mls pic.twitter.com/gK2bzgNdas — Sam Greene (@SGdoesit) August 8, 2021 కట్ చేస్తే.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. సిన్సిన్నాటి, ఓర్లాండో మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనను మేజర్ లీగ్ సాకర్ ట్విటర్ పేజ్ ఆ సరదా వీడియోను పోస్ట్ చేసింది. ఆ పిలగాడి పేరు జేడెక్ కార్పెంటర్, ఆ తల్లి పేరు మోర్గాన్ టక్కర్. ఓహియోలో ఉంటారు ఆ తల్లీకొడుకులు. -
సిరీస్ విజయానికి అడుగు దూరంలో ఇంగ్లాండ్
-
ఎవరిదో పైచేయి!
కార్డిఫ్: ప్రపంచకప్లో శ్రీలంక మాజీ చాంపియన్. రెండు సార్లు రన్నరప్ కూడా! అయితే ఇది గతం. ఇప్పటి పరిస్థితి పూర్తి భిన్నం. మరోవైపు క్రికెట్లో అఫ్గానిస్తాన్ కూనే! కానీ ఎదుగుతున్న తీరు, ఆడుతున్న ఆట చక్కగా ఉంది. ఇరు జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో లంకపై అఫ్గాన్ పైచేయి సాధించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ రెండు జట్ల తొలి మ్యాచ్ ప్రదర్శన చూస్తే ఎవరైనా ఈ పోరులో శ్రీలంకకు కష్టాలు తప్పవనే అంటారు. పేలవమైన బ్యాటింగ్, బౌలింగ్తో శ్రీలంక 10 వికెట్ల తేడాతో కివీస్ చేతిలో పరాభవం చవిచూసింది. కెప్టెన్ కరుణరత్నే మినహా ఇంకెవరూ నిలబడే సాహసమే చేయలేదు. 11 మందిలో ఏకంగా ఎనిమిది మంది సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇక బౌలింగ్లో లంక ఆశలన్నీ సీనియర్ పేసర్ మలింగపైనే. కానీ అతను కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో జట్టు పరిస్థితి ఘోరంగా మారింది. గత మ్యాచ్లో డకౌటైన మాథ్యూస్ ఆల్రౌండర్గా విజయవంతమైతేనే జట్టు పరిస్థితిలో మార్పు రావొచ్చు. మరోవైపు గుల్బదిన్ నైబ్ సారథ్యంలోని అఫ్గానిస్తాన్ కూడా తొలి మ్యాచ్లో ఓడింది... కానీ ప్రపంచకప్లో అద్వితీయమైన రికార్డు ఉన్న ఆసీస్ను సమర్థంగా ఎదుర్కొంది. ఓపెనర్లు షహజాద్, హజ్రతుల్లా డకౌట్ కావడం, ఆల్రౌండర్ నబీ విఫలమవడంతో తడబడింది. లేదంటే మరింత మెరుగైన స్కోరు చేసేది. ఈ మ్యాచ్లో వీళ్లంతా కష్టపడితే మాత్రం అఫ్గాన్ బోణీ అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఇçప్పుడున్న పరిస్థితుల్లో లంక కంటే అఫ్గానే మెరుగైన ఆల్రౌండ్ జట్టుగా సమతూకంతో ఉంది. ముఖాముఖిగా ఇప్పటివరకు శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లు మూడుసార్లు తలపడ్డాయి. రెండు మ్యాచ్ల్లో శ్రీలంక నెగ్గగా... మరో మ్యాచ్లో అఫ్గానిస్తాన్ గెలిచింది. భారత్ ‘ఎ’ ఘనవిజయం హుబ్లీ: శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు 152 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. రెండు మ్యాచ్ల సిరీస్ను 2–0తో క్లీన్స్వీప్ చేసింది. 430 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ రెండో ఇన్నింగ్స్లో 277 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 210/7తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక ‘ఎ’ మరో 67 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ ‘ఎ’ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ 112 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. శివమ్ దూబేకు రెండు వికెట్లు లభించగా... సందీప్ వారియర్, ఆదిత్య సర్వతే, జయంత్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు. భారత్ ‘ఎ’ తరఫున తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీ సాధించిన ఆంధ్ర రంజీ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 269 పరుగులు చేయగా... శ్రీలంక ‘ఎ’ 212 పరుగులకు ఆలౌటైంది. భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్లో 372 పరుగులు సాధించి శ్రీలంక ‘ఎ’కు 430 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ రెండు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ ఈనెల 6న తొలి మ్యాచ్తో మొదలవుతుంది. -
ప్రపంచకప్ : పాకిస్తాన్పై విండీస్ ఘన విజయం
-
చెన్నైపై బెంగళూరు విజయం
-
సంచలనం సృష్టించేనా?
కోల్కతా: అచ్చొచ్చిన వేదికపై అద్భుతం సృష్టించాలనే లక్ష్యంతో భారత పురుషుల టెన్నిస్ జట్టు డేవిస్ కప్ బరిలోకి దిగుతోంది. మాజీ చాంపియన్ ఇటలీతో నేడు మొదలయ్యే క్వాలిఫయర్ మ్యాచ్లో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలో తొలి రోజు రెండు సింగిల్స్ను నిర్వహిస్తారు. రెండో రోజు తొలుత డబుల్స్ మ్యాచ్... ఆ తర్వాత రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్లు జరుగుతాయి. తొలి సింగిల్స్ మ్యాచ్లో ప్రపంచ 37వ ర్యాంకర్ ఆండ్రియా సెప్పి (ఇటలీ)తో 129వ ర్యాంకర్ రామ్కుమార్ రామనాథన్... రెండో సింగిల్స్లో ప్రపంచ 129వ ర్యాంకర్ మాటియో బెరెటిని (ఇటలీ)తో భారత నంబర్వన్, ప్రపంచ 102వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తలపడతారు. ఇటలీ టాప్ ర్యాంకర్, ప్రపంచ ర్యాంకింగ్స్లో 16వ స్థానంలో ఉన్న మార్కో సెచినాటోను డబుల్స్లో ఆడించాలని ఆ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ కొరాడో బారాజుటి తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపరిచింది. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్లో సెచినాటో–సిమోన్ బొలెలీ (ఇటలీ) ద్వయంతో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జంట ఆడుతుంది. రివర్స్ సింగిల్స్లో బెరెటినితో రామ్కుమార్; సెప్పితో ప్రజ్నేశ్ తలపడతారు. సొంత గడ్డపై ఆడనుండటం... అదీ ఇటలీ ఆటగాళ్లకు అంతగా అలవాటులేని పచ్చిక కోర్టులపై మ్యాచ్లను నిర్వహించడం భారత్కు సానుకూలాంశం. ఇటీవలే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో తొలిసారి ఆడిన ప్రజ్నేశ్ అదే జోరు కొనసాగించి... డబుల్స్లో బోపన్న–దివిజ్ జంట మెరిస్తే భారత్ సంచలనం సృష్టించినా ఆశ్చర్యపోవద్దు. వ్యక్తిగత ర్యాంక్లతో సంబంధం లేకుండా డేవిస్ కప్లో పలువురు భారత ఆటగాళ్లు అద్భుత విజయాలు సాధించారు. కోల్కతా సౌత్ క్లబ్లోని పచ్చిక కోర్టులపై నిర్వహిస్తున్న ఈ వేదికపై భారత్ గెలుపోటముల రికార్డు 8–2తో ఉంది. ఇదే వేదికపై చివరిసారి ఇటలీతో 1985 వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్లో ఆడిన భారత్ 3–2తో విజయాన్ని అందుకుంది. ఓవరాల్ ముఖాముఖి రికార్డులో భారత్ 1–4తో వెనుకబడి ఉంది. చివరిసారి ఇటలీతో 1998లో వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్లో తలపడిన భారత్ 1–4తో పరాజయం పాలైంది. ఈ ఏడాది నుంచి డేవిస్ కప్ను కొత్త ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. ముందుగా 24 జట్ల మధ్య 12 స్థానాల కోసం క్వాలిఫయర్స్ జరుగుతాయి. క్వాలిఫయింగ్లో గెలిచిన 12 జట్లు నవంబర్ 18 నుంచి 24 వరకు స్పెయిన్లోని మాడ్రిడ్లో 18 జట్ల మధ్య జరిగే ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. గతేడాది సెమీఫైనల్స్ చేరిన క్రొయేషియా, ఫ్రాన్స్, స్పెయిన్, అమెరికా జట్లతోపాటు ‘వైల్డ్ కార్డు’ పొందిన అర్జెంటీనా, బ్రిటన్ నేరుగా ఫైనల్స్ టోర్నీలో ఆడతాయి. ఫైనల్స్ టోర్నీలో 18 జట్లను ఆరు గ్రూప్లుగా (మూడు జట్లు చొప్పున) విభజించి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తారు. గ్రూప్లో టాపర్గా నిలిచిన ఆరు జట్లతోపాటు రెండో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్ నిర్వహిస్తారు. కొత్త ఫార్మాట్ ప్రకారం ఇక నుంచి డేవిస్ కప్ మ్యాచ్లను ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్’ సెట్స్ పద్ధతిలో కాకుండా ‘బెస్ట్ ఆఫ్ త్రీ’ సెట్స్ పద్ధతిలో ఆడిస్తారు. -
ఇంగ్లాండ్ టూర్కు సిద్ధమైన టీమిండియా
-
జోరు మనదే
154 స్కోరుకు, 159 స్కోరుకు మధ్య తేడా ఐదు పరుగులే! కానీ వికెట్ల పతనం డబుల్ అయింది. ఈ డబుల్ ధమాకా భువనేశ్వర్ది. మొదటి స్కోరు వద్ద నాలుగు వికెట్లతో ఉన్న సఫారీ జట్టు రెండో స్కోరుకల్లా మరో నాలుగు వికెట్లను చేజార్చుకుంది. అంతలా... భువీ దెబ్బతీశాడు. కాదు కాదు... దెబ్బ మీద దెబ్బ తీశాడు. వన్డేల్లో ఆధిపత్యాన్ని కొనసాగించిన కోహ్లి సేన... తాజాగా టి20ల్లోనూ శుభారంభం చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. జొహన్నెస్బర్గ్: ధావన్ ధనాధన్ పరుగులు, భువనేశ్వర్ ఫటాఫట్ వికెట్లు సఫారీని కుదిపేశాయి. శిఖర్ ఇన్నింగ్స్ భారీ స్కోరుకు బాట వేస్తే, భువీ బౌలింగ్ ప్రత్యర్థిని ఉన్నపళంగా కూల్చేసింది. పటిష్టస్థితి నుంచి పరాజయానికి పడేసింది. దీంతో తొలి టి20లో భారత్ 28 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగుల భారీస్కోరు చేసింది. ధావన్ (39 బంతుల్లో 72; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. అనంతరం సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హెన్డ్రిక్స్ (50 బంతుల్లో 70; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ (5/24) నిప్పులు చెరిగాడు. రెండో టి20 మ్యాచ్ బుధవారం జరుగుతుంది. మోకాలి గాయంతో దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్ ఈ సిరీస్కు దూరం కాగా... చేతి వేలి గాయంతో ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ఆడలేదు. సిక్స్లతో మొదలైంది... మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ ఇన్నింగ్స్కు సిక్సర్లతో శ్రీకారం చుట్టాడు రోహిత్ శర్మ. ప్యాటర్సన్ వేసిన తొలి ఓవర్లో రెండు సిక్స్లు, ఒక ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. అయితే ఇదెంతో సేపు సాగలేదు. మరుసటి ఓవర్లోనే రోహిత్ (9 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు ముగిశాయి. డాలా బౌలింగ్లో కీపర్ క్లాసెన్ క్యాచ్తో వెనుదిరిగాడు. ఏడాది తర్వాత బరిలోకి దిగిన రైనా (7 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడే ప్రయత్నంలోనే నిష్క్రమించాడు. ఈ దశలో ధావన్, కోహ్లి జోరు కొనసాగించారు. షమ్సీ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ తొలిబంతికి లాంగాన్లో బెహర్దీన్ క్యాచ్ చేజార్చడంతో బతికిపోయిన కోహ్లి (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్)... ఆ ఓవర్లో ఫోర్, భారీ సిక్సర్ బాదాడు. అయితే షమ్సీ వేసిన మరుసటి ఓవర్లో భారత కెప్టెన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం మనీశ్ పాండే, ధోని, పాండ్యా రాణించడంతో భారత స్కోరు 200 పరుగులు దాటింది. రాణించిన హెన్డ్రిక్స్... కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్కు ఓపెనర్ హెన్డ్రిక్స్ వెన్నెముకగా నిలిచాడు. టాపార్డర్ విఫలమైనా... బెహర్దీన్ (27 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్లు)తో కలిసి హెన్డ్రిక్స్ గట్టెక్కించే ప్రయత్నం చేసినా భువనేశ్వర్ దెబ్బకు సాధ్యపడలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) క్లాసెన్ (బి) డాలా 21; ధావన్ (సి) క్లాసెన్ (బి) ఫెలుక్వాయో 72; రైనా (సి అండ్ బి) డాలా 15; కోహ్లి ఎల్బీడబ్ల్యూ (బి) షమ్సీ 26; పాండే (నాటౌట్) 29; ధోని (బి) మోరిస్ 16; పాండ్యా (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–23, 2–49, 3–108, 4–155, 5–183. బౌలింగ్: ప్యాటర్సన్ 4–0–48–0, డాలా 4–0–47–2, మోరిస్ 4–0–39–1, షమ్సీ 4–0–37–1, స్మట్స్ 2–0–14–0, ఫెలుక్వాయో 2–0–16–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: స్మట్స్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 14; హెన్డ్రిక్స్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 70; డుమిని (సి) రైనా (బి) భువనేశ్వర్ 3; మిల్లర్ (సి) ధావన్ (బి) పాండ్యా 9; బెహర్దీన్ (సి) పాండే (బి) చహల్ 39; క్లాసెన్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 16; ఫెలుక్వాయో (సి) చహల్ (బి) ఉనాద్కట్ 13; మోరిస్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 0; ప్యాటర్సన్ (రనౌట్) 1; డాలా (నాటౌట్) 2; షమ్సీ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–29, 2–38, 3–48, 4–129, 5–154, 6–158, 7–158, 8–159, 9–175. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–24–5, ఉనాద్కట్ 4–0–33–1, బుమ్రా 4–0–32–0, హార్దిక్ పాండ్యా 4–0–45–1, యజువేంద్ర చహల్ 4–0–39–1. 5 భారత్ తరఫున టి20ల్లో 5 వికెట్లు తీసిన తొలి పేసర్ భువనేశ్వర్. 78 పవర్ప్లేలో టీమిండియా చేసిన పరుగులు. భారత్కిదే అత్యధికం. 203 దక్షిణాఫ్రికాపై భారత్ సాధించిన అత్యధిక స్కోరు. 1 కేవలం 8.2 ఓవర్లలోనే భారత్ 100 కొట్టడం ఇదే తొలిసారి. 12 పుష్కర కాలం క్రితం భారత్ తొలి అంతర్జాతీయ టి20 ఆడింది ఇక్కడే. అప్పటి జట్టులో ఆడినవారిలో ధోని, రైనా ఇప్పుడు ఆడారు. -
‘చిల్లర’ విసిరేశాడు!
లండన్: ‘ఎవరైనా కోపం వస్తే అరుస్తారు, అసహనం ఎక్కువైపోతే ఏవైనా బూతులు తిట్టేస్తారు, వీడేంట్రా ఇలా ఆగ్రహం వ్యక్తం చేశాడు’... గురువారం వింబుల్డన్లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ ప్రవర్తన చూస్తే అందరికీ వచ్చే సందేహమిది! తొలి రౌండ్లో వావ్రింకాపై సంచలన విజయంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ 21 ఏళ్ళ కుర్రాడు రెండో రౌండ్లో ఓటమిని మాత్రం భరించలేకపోయాడు. రూబెన్ బెమెల్మన్స్ (బ్రెజిల్)తో జరిగిన మ్యాచ్లో మెద్వెదేవ్ 4–6, 2–6, 6–3, 6–2, 3–6 తేడాతో పోరాడి ఓడాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత తన చెయిర్ వద్దకు వెళ్లిన అతను వ్యాలెట్ను బయటకు తీశాడు. అందులోంచి ఒక్కొక్కటిగా చిల్లర నాణేలు తీసి అక్కడే ఉన్న అంపైర్ మారియానా ఆల్వ్ కాళ్ల వద్దకు వరుసగా విసిరేయడం ఆశ్చర్యం కలిగించింది! ఐదో సెట్లో ఒక పాయింట్ విషయంలో అంపైర్ తనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు అతను ఇలా చేసి ఉంటాడని అక్కడ ఉన్నవారు భావించారు. ‘ఓటమితో నేను తీవ్రంగా నిరాశ చెందాను. చిల్లర విసిరేయడానికి కారణం ఇదీ అని కూడా నేను చెప్పలేను. అలా ఎందుకు చేశానో నాకే తెలీదు. ఆ సమయంలో అసహనంతో అలా జరిగిపోయిందంతే. దీనికి క్షమాపణ కోరుతున్నాను’ అని మెద్వెదేవ్ ఆ తర్వాత మీడియా సమావేశంలో చెప్పాడు. అయితే వింబుల్డన్ నిర్వాహకులు మాత్రం దీనిని సీరియస్గా తీసుకున్నారు. మ్యాచ్ జరిగే సమయంలో, ఆ తర్వాత అతని ప్రవర్తనను కారణంగా చూపిస్తూ మూడు వేర్వేరు రకాల జరిమానాలు విధించారు. మూడూ కలిపి మెద్వెదేవ్పై మొత్తం 14,500 డాలర్లు (దాదాపు రూ. 9.38 లక్షలు) జరిమానా పడింది. మరో వైపు తొలి రౌండ్లో ఏమాత్రం ఆసక్తి లేకుండా ఆడి ‘టెన్నిస్ బోర్ కొట్టింది’ అనే వ్యాఖ్యలు చేసిన బెర్నార్డ్ టామిక్కు కూడా 15,000 డాలర్లు (దాదాపు రూ. 9.71 లక్షలు) జరిమానా విధించి గట్టి హెచ్చరిక జారీ చేశారు. -
పాప కోసం మ్యాచ్ ఆపిన రఫెల్!
-
పాప కోసం మ్యాచ్ ఆపిన రఫెల్!
మల్లోర్కా: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, సహచర ఆటగాడు సిమోన్ సోల్బాస్ ల జోడి మల్లోర్కా లో బుధవారం ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడటానికి సిద్ధమైంది. ఆ సమయంలో నాదల్ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలోనే అలజడి. తన పాప కనిపించడం లేదంటూ ఓ తల్లి ఆవేదన. ఆ పాప కోసం స్టేడియం అంతా కలియ తిరుగుతుంది. ఆ పాపం కోసం వెతుకుతోంది. అయితే సాధారణంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో చోటు చేసుకునే సందడిని ఆటగాళ్లు పట్టించుకోరు. మరి రఫెల్ నాదల్ మ్యాచ్ ను ఆపేశాడు. ఆ తల్లి పాపకోసం పడుతున్న బాధను తనకు జరిగిన నష్టంగా భావించిన నాదల్ స్టేడియం వైపే తన దృష్టిని కేంద్రీకరించాడు. ఇది ఏ కొద్ది సేపటికో పరిమితం కాలేదు. ఆ పాపను తల్లి చేరేవరకూ నాదల్ అలానే ఉండిపోయాడు. చివరకు ఆ పాప-తల్లి కూతుళ్లు కలవడంతో నాదల్ ఊపిరి పీల్చుకున్నాడు. -
హల్చల్ చేస్తున్న వాటర్మిలన్ బోయ్
మెల్బోర్న్: అందరిలా ఉంటే స్పెషల్ ఏముంది అనుకున్నాడో ఏమో.. క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ కుర్రాడు వాటర్మిలన్(పుచ్చకాయ)ను మొత్తం తినేసి ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాడు. పుచ్చకాయ మొత్తం తింటే ఆశ్చర్యం ఏముంది.. మేం కూడా చాలా సార్లు తిన్నాం కదా అని అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆ పిల్లాడు పుచ్చకాయ తొక్కను, గింజలను దేన్నీ వదలకుండా మొత్తం తిన్నాడు. అందుకే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాడు. శనివారం ఆస్ట్రేలియాలో బిగ్బాష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆ చిన్నోడు తాపీగా కూర్చొని పుచ్చకాయ మొత్తాన్ని లాగించేస్తున్నాడు. అయితే మ్యాచ్ మధ్యలో కెమెరామెన్ ఆ కుర్రాడిని కవర్ చేయడంతో అందరి కళ్లు అతగాడిపై పడ్డాయి. తీక్షణంగా గమనించిన కామెంటేటర్లు.. ఓ మైగాడ్ అతను తొక్కతో సహా మొత్తం తినేస్తున్నాడు అంటూ కామెంటరీ అందుకున్నారు. రెండు మహిళా జట్ల మధ్య జరుగుతున్న ఆ మ్యాచ్ ఫలితం కంటే కూడా, కుర్రాడు ఆ పుచ్చకాయ మొత్తం అలాగే తినేస్తాడా అనే ఆసక్తి ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. కాసేపటికే ట్విట్టర్లో 'ది వాటర్ మిలన్ బోయ్' అనే హ్యష్ట్యాగ్ హల్ చల్ చేసింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిన పింక్ కలర్ టీ షర్ట్ ధరించిన ఆ బుడతడు ఎవరనేది మాత్రం తెలియరాలేదు. క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా కెమెరా కంట్లో పడటానికి నానా పాట్లు పడే ప్రేక్షక లోకం ఈ చిన్నోడిని చూసి షాక్ అవుతున్నారు. -
భారత్తో మరిన్ని మ్యాచ్లు ఆడాల్సింది
- మిస్బా గత కొన్నేళ్లలో భారత్తో మరిన్ని మ్యాచ్లు ఆడి ఉంటే వ్యక్తిగతంగా తాను సంతోషించి ఉండేవాడినని పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ వ్యాఖ్యానించాడు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సిరీస్లో ఆడి రిటైర్ కావాలని ఇటీవల మిస్బా తన కోరికను వెలిబుచ్చాడు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ అవకాశం కనిపించడం లేదు. తన కెరీర్లో 61 టెస్టులు ఆడిన మిస్బా భారత్పై 3 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. -
‘అడ్డంగా’ నిలబడ్డారు!
-
మ్యాచ్లో గుండెపోటు
ఐసీయూలో నమీబియా క్రికెటర్ విన్డోక్ (నమీబియా): క్రికెట్ మైదానంలో మరో విషాదం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలోనే గుండెపోటుకు గురి కావడంతో నమీబియాకు చెందిన రేమండ్ వాన్ స్కూల్ ఆస్పత్రిపాలయ్యాడు. నమీబియా, ఫ్రీ స్టేట్ జట్ల మధ్య జరిగిన లిస్ట్-ఎ మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో క్రీజ్లో బ్యాటింగ్ చేస్తున్న 25 ఏళ్ల రేమండ్ అకస్మాత్తుగా విరామం కోరాడు. తనకు ఏదోలా అవుతుందంటూ మంచినీళ్లు అడిగాడు. కొన్ని నీళ్లు తాగగానే అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో సహచరులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఐసీయూలో చికిత్స జరుపుతున్నట్లు క్రికెట్ నమీబియా సీఈఓ డొనోవాన్ వెల్లడించారు. రేమండ్ ఇప్పటివరకు 92 ఫస్ట్క్లాస్, 103 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడాడు. -
కొడుకు ఊచకోత... తండ్రి ‘ఆపరేషన్’
భారత్తో ముంబైలో ఆదివారం జరిగిన చివరి వన్డేలో డివిలియర్స్ ఎలా ఆడాడో గుర్తుందిగా... బౌలర్లను ఊచకోత కోసి మెరుపు సెంచరీతో క్రికెట్ ప్రపంచాన్ని మరోసారి అబ్బురపరిచాడు. అయితే అదే సమయంలో డివిలియర్స్ తండ్రి (ఆయన పేరు కూడా ఏబీ డివిలియర్స్) దక్షిణాఫ్రికాలోని వార్మ్బాత్స్ అనే చిన్న పట్టణంలో రెండు ప్రాణాలను కాపాడారు. వృత్తిరీత్యా ఆయన వైద్యుడు. స్పోర్ట్స్ మెడిసిన్ కూడా చదివిన డివిలియర్స్ సీనియర్ ప్రఖ్యాత సర్జన్. ఆదివారం దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చూడటానికి ఇంట్లో కూర్చున్న ఆయనకు... ఓ మహిళ ప్రసవ వేదన చెందుతూ చాలా సీరియస్గా ఉందని తెలిసింది. అంతే.. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి ఆపరేషన్ చేశారు. ఆ మహిళతో పాటు పండంటి పాపను కాపాడారు. సాధారణంగా కుమారుడు ఎక్కడ ఆడుతున్నా తప్పకుండా చూసే డివిలియర్స్ సీనియర్ ఆ గొప్ప ఇన్నింగ్స్ మాత్రం చూడలేకపోయారు. కొడుకు చేసిన సెంచరీ చూడటం కంటే రెండు ప్రాణాలను కాపాడటంలోనే ఎక్కువ ఆనందం ఉందని ఆయన చెబుతున్నారు. అన్నట్లు... డివిలియర్స్ తాత పేరు కూడా ఏబీ డివిలియర్స్ అట. నవంబరు 14 నుంచి బెంగళూరులో జరిగే టెస్టుతో డివిలియర్స్ 100 మ్యాచ్ల మైలురాయిని చేరుకుంటున్నాడు. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూ సేందుకు అతని కుటుంబసభ్యులు వస్తున్నారు. -
ఆంధ్ర పరాజయం
ఒంగోలు: బ్యాట్స్మెన్ తడబాటుతో... ఉత్తరప్రదేశ్ (యూపీ)తో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు 56 పరుగుల తేడాతో ఓడిపోయింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్లో 126 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్లో ఆంధ్ర జట్టుకిదే తొలి పరాజయం కావడం గమనార్హం. అంతకుముందు ఆడిన తొలి మూడు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకోవడంతోపాటు ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. ఆట నాలుగోరోజు ఆదివారం ఓవర్నైట్ స్కోరు 26/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టును బౌలర్ అంకిత్ రాజ్పుత్ (5/35) హడలెత్తించాడు. దాంతో ఆంధ్ర జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 47.3 ఓవర్లలోనే ఆలౌటైంది. ఈ గెలుపుతో ఉత్తరప్రదేశ్కు ఆరు పాయింట్లు లభించాయి. ఆంధ్ర తమ తదుపరి మ్యాచ్ను ఈ నెల 30నుంచి పాటియాలాలో పంజాబ్తో ఆడుతుంది. సంక్షిప్త స్కోర్లు ఉత్తరప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 170; ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: 297; ఉత్తరప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: 309; ఆంధ్ర రెండో ఇన్నింగ్స్: 126 (47.3 ఓవర్లలో) (భరత్ 16, రికీ భుయ్ 12, శివ కుమార్ 15, ప్రదీప్ 10, అయ్యప్ప 17, విజయ్ కుమార్ 28, అంకిత్ రాజ్పుత్ 5/35, అమిత్ మిశ్రా 2/21, కుల్దీప్ యాదవ్ 2/15). -
పాక్తో భారత్ పోరు
న్యూఢిల్లీ: సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో భారత్ తొలి మ్యాచ్ను దాయాది పాకిస్తాన్ తో ఆడనుంది. వచ్చే నెల 11 నుంచి 18 వరకు మలేసియాలోని జోహోర్ బహ్రూలో ఈ మ్యాచ్లు జరుగుతాయి. వరుసగా రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్గా ఉన్న భారత్ ఈసారీ ఫేవరెట్గా ఉం డగా పాక్, గ్రేట్ బ్రిటన్, అర్జెంటీనా, ఆసీస్, మలేసియా పోటీ పడుతున్నాయి. ‘వరుసగా మూడోసారి టైటిల్ గెల వాలనే పట్టుదలతో ఉన్నాం. అదే జరిగితే ఎనిమిదో పురుషుల జూనియర్ ఆసియా కప్కు ఆత్మవిశ్వాసం తో వెళ్లగలం. అంచనాలకు అనుగుణంగానే రాణించగలమనే నమ్మకం ఉంది’ అని హాకీ ఇండియా ప్రధా న కార్యదర్శి మహ్మద్ ముష్తాక్ అహ్మద్ అన్నారు.