Mithun Chakraborty
-
ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడికి చేదు అనుభవం
బాలీవుడ్ ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ మిథున్ చక్రవర్తికి ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. నిర్సా అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి తరఫున మిథున్ ప్రచారానికి వచ్చారు. అయితే ఈయన పాల్గొన్న సభలో దొంగలు చేతివాటం చూపించారు. ఏకంగా ఈయన పర్స్ కొట్టేశారు.(ఇదీ చదవండి: స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ)పర్స్ పోయిందనే విషయాన్ని గుర్తించిన మిథున్ చక్రవర్తి.. నిర్వహకులకు చెప్పగ వాళ్లు మైక్లో, పర్స్ తిరిగిచ్చేయమని చాలాసేపు బతిమాలాడారు. అయినా సరే ఎవరూ పర్స్ తిరిగివ్వలేదు. దీంతో అసంతృప్తికి లోనైన మిథున్ చక్రవర్తి.. ఉండాల్సిన టైమ్ కంటే ముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు.బాలీవుడ్లో ఒకప్పుడు హీరోగా అద్భుతమైన సినిమాలు చేసిన మిథున్ చక్రవర్తి.. కొన్నాళ్ల క్రితం నుంచి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆ మధ్య తెలుగులో వెంకటేశ్ 'గోపాల గోపాల' మూవీలో చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నారు. ఏదేమైనా ఈయన పర్స్ పోవడం, తిరిగిచ్చేయమని నిర్వహకులు బతిమాలడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!) -
బాలీవుడ్ సీనియర్ హీరో తొలి భార్య కన్నుమూత
బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి తొలి భార్య హెలెన ల్యూక్ కన్నుమూసింది. అమెరికాలోనే చనిపోయినట్లు ఈమె ఫ్రెండ్, నటి కల్పన అయ్యర్ ధ్రువీకరించింది. ఇండో-అమెరికన్ సిటిజన్ అయిన హెలెన్.. గతంలో పలు హిందీ సినిమాల్లో నటించింది. ఆ సమయంలోనే మిథున్ చక్రవర్తిని పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నాలుగు నెలలు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత ఎవరి దాని వాళ్లు చూసుకున్నారు.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!)మిథున్ చక్రవర్తితో పెళ్లి గురించి అప్పట్లో ఓసారి మాట్లాడిన హెలెన్.. తనని మిథున్ బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేసుకున్నాడని, తర్వాత అతడి నిజస్వరూపం బయటపడటంతో విడిపోయానని చెప్పింది. ఈమె విడాకులు ఇచ్చేసిన తర్వాత యోగిత బలిని మిథున్ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన తర్వాత అమెరికా వెళ్లిపోయిన హెలెన్.. అక్కడి ఉండిపోయింది. తాజాగా ఈమె మరణవార్త తెలిసి పలువురు నెటిజన్లు సంతాపం తెలియజేస్తున్నారు.అయితే చనిపోవడానికి కొన్ని గంటల ముందే హెలెన్.. తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. 'ఫీలింగ్ వీర్డ్. మిక్స్డ్ ఎమోషన్స్ అండ్ నో క్లూ' అని రాసుకొచ్చింది. అయితే ఈమె తన అనారోగ్య సమస్యల గురించే ఇలా పరోక్షంగా ప్రస్తావించిందని, కానీ అకస్మాత్తుగా మరణించడం మాత్రం షాక్కి గురిచేసిందని ఆమె స్నేహితులు అంటున్నారు. ఈమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్) -
ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్లవైపు మళ్లాయి: నటుడు మిథున్ చక్రవర్తి
‘‘నా చర్మపు రంగు నలుపుగా ఉండటం అనేది నా కెరీర్ ఆరంభంలో పెద్ద సవాల్లా అనిపించింది. నల్లగా ఉన్నవారు నటులుగా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కష్టమన్నట్లు కొందరు మాట్లాడారు. ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్లమని కూడా సలహా ఇచ్చారు. ఒకానొక దశలో నా చర్మపు రంగును మార్చమని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఆ తర్వాత అసలు నేనేం చేయగలను? నా బలం ఏంటి? అని ఆలోచించాను. నేను బాగా డ్యాన్స్ చేయగలనని నా బలం తెలుసుకున్నాను.మంచి డ్యాన్సర్ కావాలనుకున్నాను. అప్పుడు ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్ల వైపు మళ్లుతాయని అనుకున్నాను. ప్రేక్షకులు నా డ్యాన్స్ను అభిమానించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు నా కలర్ను మర్చిపోయారు. నేనో సెక్సీ డ్యాన్సర్గా, డస్కీ బెంగాలీ బాబుగా పేరు సంపాదించుకున్నాను’’ అని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం స్వీకరించిన అనంతరం ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి. దేశ రాజధాని ఢిల్లీలో 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. 2022 సంవత్సరానికిగాను ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం ‘ఆట్టమ్’ (మలయాళం), ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి (కాంతార–కన్నడ), ఉత్తమ నటీమణులుగా నిత్యా మీనన్ (తిరుచిత్రంబలం–తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ఎక్స్ప్రెస్–గుజరాతీ) అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ‘కార్తికేయ 2’కు దక్కింది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డు స్వీకరించగా, చిత్రదర్శకుడు చందు మొండేటి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు. ‘΄పొన్నియిన్ సెల్వన్– 1’కు గానూ ఉత్తమ సంగీతం (నేపథ్య సంగీతం) విభాగంలో ఏఆర్ రెహమాన్ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు వివిధ భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ వేదికపై ఇంకా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి మూడు జాతీయ అవార్డులు అందుకున్నాను. తొలి అవార్డు (‘మృగయా’) అందుకున్నప్పుడే నేను చాలా సాధించాననుకున్నాను. ‘మృగయా’ సినిమా స్క్రీనింగ్కి వెళ్లినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్... అతను ఈ లోకంలో లేడు కాబట్టి పేరు చెప్పను. అతను ‘ఈ సినిమా చాలా బాగుంది. నువ్వు అద్భుతమైన నటుడివి. కానీ ఇలాంటి బట్టలతో నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా?’ అంటే నేను నిర్ఘాంతపోయాను.నేను ఆయన ముందు నగ్నంగా నిలబడ్డానా? అనిపించింది. వెంటనే ఆయన ‘మృగయా’లో నేను చేసిన ఆదివాసీ పాత్ర గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. నేను నా తొలి జాతీయ అవార్డు అందుకున్న తర్వాత హాలీవుడ్ యాక్టర్ అల్ పచీనో అంతటి ప్రతిభ నాలోనూ ఉందనుకున్నాను. అకస్మాత్తుగా నా తీరు మారిపోయింది. కొందరు నిర్మాతలతో దురుసుగా ప్రవర్తించాను. నన్ను నేను అల్ పచీనో అనుకుం టున్నానని నిర్మాతలు గ్రహించలేకపోయారు. ఓ సందర్భంలో ఒక నిర్మాతకు కథను నా ఇంటికి పంపాలన్నాను. అతను వెంటనే లేచి నా చెంప చెళ్లుమనిపించాడు. అప్పట్నుంచి నన్ను నేను ఓ అల్ పచీనోలా ఊహించుకోవడం మానేశాను. నాదే తప్పని గ్రహించాను. నా తీరు మార్చుకున్నాను’’ అన్నారు.మంచి మార్పు తీసుకురావాలన్నదే...: రిషబ్ శెట్టిప్రతి సినిమా ప్రభావం ప్రేక్షకుల పై ఉంటుంది. అందుకే ప్రజల్లో, సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే సినిమాలు తీయాలన్నది నా ఉద్దేశం.కష్టానికి ప్రతిఫలం దక్కింది: నిత్యా మీనన్ చిత్రపరిశ్రమలో దాదాపు 15 ఏళ్ల కష్టం నాది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ అవార్డు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి దీన్ని బాధ్యతగా చూడకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. ‘తిరుచిత్రంబలం’ బృందానికి, నా సహ నటులకు ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మంచి దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను. సినిమాకి సరిహద్దులు లేవు: ఏఆర్ రెహమాన్ సినిమాకి ప్రాంతం, భాష అంటూ ఎలాంటి సరిహద్దులు లేవు. నేను అందుకున్న ఏడో జాతీయ అవార్డు ఇది. సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాకు వచ్చేందుకు కారకులైన ఫిల్మ్ మేకర్స్కి, ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నంగారికి ధన్యవాదాలు. -
దాదాకు ఫాల్కే
బాలీవుడ్లో తెల్లరంగు హీరోల మధ్య మొదటిసారి ఒక నల్లరంగు హీరో జెండా ఎగరేశాడు. పంజాబీ హీరోల మధ్య మొదటిసారి ఒక బెంగాలీ సూపర్స్టార్ అవతరించాడు. దక్షిణాదిలో కమల్ హాసన్, చిరంజీవి డాన్స్ను అట్రాక్షన్ గా పూర్తిగా మలచక ముందే ‘డిస్కో డాన్సర్’తో మిథున్ చక్రవర్తి డాన్సింగ్ సూపర్స్టార్ అయ్యాడు. వెండితెర మెరుపులను పూర్తిగా నమ్మక ‘మోనార్క్’ బ్రాండ్తో హోటెలింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించి స్థిరపడ్డాడు. ఇండస్ట్రీకి అతను ‘మిథున్దా’! దాదాకు దాదాసాహెబ్ ఫాల్కే!! నటించిన తొలి సినిమాకే నేషనల్ అవార్డు వస్తుందా ఎవరికైనా? మిథున్ చక్రవర్తికి వచ్చింది. మృణాల్సేన్ దర్శకత్వంలో మిథున్ నటించిన బెంగాలీ చిత్రం ‘మృగయా’ (1976) అతనికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది. అందులో అతను నేర విచారణను ఎదుర్కొనే అమాయక గిరిజనుడిగా నటించాడు. ఈ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లిన మిథున్, అవార్డు అందుకున్నాక బయటకు రాగానే జర్నలిస్టులు చుట్టుముట్టి ఇంటర్వ్యూ అడిగారు. ‘ఇస్తాను.. ఇస్తాను.. ముందు నాకు భోజనం పెట్టించండి’ అన్నాడు మిథున్ . జేబులో రూపాయి దారి ఖర్చులు లేని పేదరికం అతడి చేతి అవార్డు కంటే ఆకలి తీరడమే ముఖ్యమనిపించింది.∙∙ మిథున్ చక్రవర్తికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. మిథున్ ఇప్పుడు వందల కోట్ల ఆస్తి కలిగినవాడు. కాని అతను పుట్టిన ఇల్లు ఎలా ఉంటుంది అని నార్త్ కోల్కతాలో ఇప్పటికీ అలాగే ఉన్న ఆ ఇంటిని రెండో కొడుకు ఉష్మయ్ చక్రవర్తి సందర్శించాడు. ‘ఇంటి వాకిలిలోనే మురుగునీటి కాలువ ఉంది. దానిని దాటి లోపలికి వెళితే ఆయన పెరిగిన ఇంట్లో కనీసం సూర్యకాంతి రావడం లేదు. ఈ చీకటి కొట్టం నుంచి వచ్చిన మా నాన్న అంత పెద్ద స్వ΄్నాన్ని కన్నాడా అని ఆయన పట్ల నా గౌరవం వందరెట్లు పెరిగింది’ అన్నాడతను.∙∙ మిథున్ చక్రవర్తి అసలు పేరు వేరు. అదేంటనేది మనకు అక్కర్లేదు. కాని అతను కాలేజీ రోజుల్లో రాడికల్ స్టూడెంట్గా మారాడు. ఆ సమయంలో నక్సలైట్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ ఉద్యమంలోనే అతడి సొంత తమ్ముణ్ణి పోగొట్టుకున్నాడు. ఇక కోల్కతాలో ఉండేందుకు ఏ మాత్రం వీలు లేని పరిస్థితి వచ్చింది. ఉద్యమంలో ఉన్నప్పుడు మిథున్ చక్రవర్తి వీథి నాటకాలు హుషారుగా వేసేవాడు. అది గమనించిన ఒక మిత్రుడు నువ్వు దాక్కున్నట్టు ఉంటుంది, నటన నేర్చుకున్నట్టు ఉంటుంది అని పూణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్లో చేర్పించాడు. అక్కడే అతను సొంతపేరు దాచి మిథున్ గా మారాడు. కోర్సు పూర్తయిన వెంటనే సినిమా కూడా దొరికింది. విడుదలైంది. నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇక దిగుల్లేదు... బాలీవుడ్లో బతికిపోవచ్చు అని ముంబై చేరుకున్నాడు మిథున్ . అక్కడ అతి కర్కశమైన జీవితం అతడికి ఎదురుపడింది.∙∙ ‘నలుపు నలుపు అనేరు నలుగురు నవ్వేరు నలుపు నారాయణమూర్తే గాదా’ అనే పాట మనం పాడుకుంటాంగానీ బాలీవుడ్ వాళ్లు విని అర్థం చేసుకునే అవకాశం లేదు. బాలీవుడ్లో హీరోలంటే తెల్లరంగు పంజాబీవారు. అంతే! దక్షిణాదిలో బాలచందర్ ఎలాగో అప్పటికే రజనీకాంత్ను ప్రవేశపెట్టాడు కాని బాలీవుడ్లో నల్లరంగు హీరో అసాధ్యం. మిథున్ నల్లగా ఉంటాడు. పైగా హిందీ కూడా సరిగ్గా రాదు. దానికి తోడు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఒకటి తెచ్చుకున్నాడు. ఇక ఎవరు రానిస్తారు? తినడానికి తిండి, ఉండటానికి గది ఏమీ లేని దారుణమైన రోజులు చూశాడు. చాలారోజులు పార్కుల్లో పడుకున్నాడు. ఒక స్నేహితుడు మాతుంగాలోని జిమ్ఖానాలో మెంబర్షిప్ ఇప్పిస్తే ఉదయాన్నే కాలకృత్యాల కోసం అక్కడకు వెళ్లేవాడు. మిగిలిన సమయం అంతా రోడ్డు మీదే. ప్రసిద్ధ దర్శకుడు మన్ మోహన్ దేశాయ్ దగ్గరకు వెళితే ఆయన తన జేబులో ఉన్న పది రూపాయల నోటు ఇచ్చి పంపించేయడం ఇప్పటికీ చెప్పుకుంటారు. మరో దర్శకుడు ‘ఇతను కనుక హీరో అయితే నేను ఇండస్ట్రీ వదిలేసి పోతాను’ అని ముఖానే చె΄్పాడు. 1980ల కాలం అది. అప్పటికే అమితాబ్ సూపర్స్టార్ అయ్యాడు. యువ ప్రేక్షకుల కోసం రిషికపూర్ లాంటి వారు ఉన్నారు. నె΄÷టిజం ఉంది. ఏ తలాతోకా లేని మిథున్ ఎలా హీరో అవుతాడు? ∙∙ కాని దేవుడు కూడా ఏదో ఒక వేళలో ఎదురు పడతాడు. ఈసారి దేవుడు బి.సుభాష్ అనే పేరుతో వచ్చాడు. ‘నేను నీతో సినిమా తీస్తాను. దాని పేరు డిస్కో డాన్సర్’ అన్నాడు బి.సుభాష్. అప్పటికే బప్పి లాహిరి కూడా ఇండస్ట్రీకి వచ్చి మంచి అవకాశం కోసం చూస్తున్నాడు. బి.సుభాష్, మిథున్, బప్పి లాహిరి కలిసి ‘డిస్కో డాన్సర్’ తయారు చేశారు. డిసెంబర్ నెల 1982లో విడుదల అయిన ఆ సినిమా దేశమంతా అగ్గి పుట్టించింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ కుర్రకారు నుంచి గృహిణుల వరకూ అందరి నోటా ‘ఐయామే డిస్కో డాన్సర్’ పాటే. ఏ పెళ్లిలో కాలేజీ ఫంక్షన్ లో చూసినా ఆ పాటే. రష్యాలో ఆ సినిమా 1000 ప్రింట్లతో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ రోజుల్లో 100 కోట్లు సంపాదించిన తొలి సినిమా అది. ఇప్పటి లెక్కల ప్రకారం 1200 కోట్లు! మిథున్ ఇప్పుడు సూపర్స్టార్ అయ్యాడు. ఆ తర్వాత బి.సుభాష్తోనే తీసిన ‘కసమ్ పైదా కర్నేవాలేకీ’, ‘డాన్స్ డాన్స్’ కూడా భారీ హిట్లే. అమితాబ్, జితేంద్ర, శశి కపూర్, వినోద్ ఖన్నా అందరూ ఇప్పుడు మిథున్ వైపు కళ్లప్పగించి చూస్తున్నారు. అమితాబ్కు ప్రధాన పోటీదారు వచ్చినట్టే.∙∙ మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో మాస్ పాత్రలు పోషించినా బెంగాలీలో తనకు నచ్చిన పాత్రలు పోషిస్తూ అక్కడా తన ప్రాభవం కాపాడుకున్నాడు. ‘స్వామి వివేకానంద’ (1998)లో రామకృష్ణ పరమహంసగా నటిస్తే దానికి మళ్లీ నేషనల్ అవార్డ్ వచ్చింది. మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చేలా తీసిన ‘΄్యార్ ఝక్తా నహీ’ (1985) సంవత్సరాల తరబడి ఆడింది. ఇది తెలుగులో కృష్ణ, శ్రీదేవిలతో ‘పచ్చని కాపురం’ పేరుతో రీమేక్ అయ్యింది. పద్మినీ కొల్హాపురి, రంజిత, శ్రీదేవిలతో మిథున్ చేసిన సినిమాలు ప్రేక్షకులకు హిట్ జోడీగా నచ్చాయి. ∙∙ మిథున్ చక్రవర్తి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా హిట్ అయ్యాడు. అమితాబ్ ‘అగ్నిపథ్’లో వేసిన అయ్యర్ పాత్ర అతడికి చాలా పేరు తెచ్చింది. మణిరత్నం తీసిన ‘గురు’లో పత్రికాధిపతిగా (గోయెంకా) నటించి ఆశ్చర్యపరిచాడు. ‘ఓ మైగాడ్’ (గోపాల గోపాల)లో స్వామీజీగా వేసిన పాత్ర మిథున్ లోని మరో పార్శా్వన్ని చూపింది. టెలివిజన్ షోస్ చేస్తూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మిథున్ అనుక్షణం బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తాడు.∙∙ ప్రారంభాలు మర్చిపోనివాడి గమనం స్థిరంగా ఉంటుంది. ఒకరోజు ఊటీలో షూట్ జరుగుతుంటే అక్కడొక మురికి కాలువ పారుతూ ఉంది. పక్కన ఉన్న నటిని పిలిచి ‘నా ఫ్లాష్బ్యాక్ చెప్పమని అడుగుతావుగా. ఇదే నా ఫ్లాష్బ్యాక్’ అన్నాడతను ఆ కాలువ చూపుతూ.మురుగు నీటి నుంచి వెలిసిన వెండితెర వేల్పు మిథున్ . కుప్పతొట్టిలో ఉన్న అమ్మాయిని కూతురిగా1996 డిసెంబర్ 1న కోల్కతాలో న్యూస్ పేపర్ చదువుతున్న మిథున్ కి ఒక వార్త కలుక్కుమనిపిం చింది. తన భార్య యోగితా బాలి (ఒకప్పటి హీరోయిన్ )ని పిలిచి ఆ వార్త చూపించాడు. అందులో కుప్పతొట్టిలో ఎవరో ఆడపిల్లను వదిలేసి పోయారు అని ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. బాధపడ్డారు. ఆ పాపను తెచ్చి పెంచుకోవాలని వెంటనే నిశ్చయించుకున్నారు. ఒక ఎన్ .జి.ఓ ద్వారా ప్రయత్నిస్తే కుప్పతొట్టిలో ఉండటం వల్ల పాప చాలా సీరియస్ కండిషన్ లో ఉందని చె΄్పారు. అయినా సరే మిథున్, యోగితా ఆ పాపను తెచ్చుకుని కంటికి రెప్పలా కాపాడారు. చట్ట ప్రకారం దత్తత తీసుకున్నారు. దిశానీ చక్రవర్తి అని పేరు పెట్టారు. అమెరికాలో చదివించారు. మిథున్ కు ఎంతో ప్రాణం ఈ కూతురు.నవ్వలేను...సంతోషంతో ఏడవలేను‘దాదాసాహెబ్ వచ్చిందన్న వార్త నన్ను చేష్టలుడిగేలా చేసింది. నేను నవ్వలేను... ఆనందంతో ఏడ్వలేను. ఫుట్పాత్ నుంచి వచ్చిన నేను ఇక్కడ దాకా చేరుకున్నానంటే ఈ పురస్కార ప్రకటన నాలో ఇంకా రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. ఒకటి మాత్రం నిజం. నేను ఈ అవార్డు ΄÷ందానంటే ప్రతిభ, అంకితభావం ఉన్న ఎవరైనా ΄÷ందవచ్చు’ అన్నారు మిధున్ చక్రవర్తి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటన తర్వాత! కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా ఈ వార్తను సోమవారం ప్రకటించారు. దాదాసాహెబ్ పురస్కారం సందర్భంగా మిథున్ చక్రవర్తికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. -
మిథున్ చక్రవర్తిని వరించిన 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్'
భారత చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈ ఏడాది బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్మీడియా ద్వారా ప్రకటించింది. అక్టోబర్ 8న జరిగే నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్లో మిథున్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నారు. సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరిస్తుంది. 1976లో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన మిథున్ తొలి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయన సినీ కెరియర్లో మొత్తం మూడు నేషనల్ అవార్డ్లను సొంతం చేసుకున్నారు. తెలుగులో గోపాల గోపాల సినిమాతో టాలీవుడ్కు మిథున్ చక్రవర్తి పరిచయం అయిన విషయం తెలిసిందే.'ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్..' పాట వినగానే వెంటనే మిథున్ చక్రవర్తి గుర్తుకొస్తారు. సుమారు 45 ఏళ్ల క్రితం మిథున్ హీరోగా నటించిన డిస్కో డ్యాన్సర్ సినిమాలోని ఈ పాట అప్పటికీ, ఇప్పటికీ పాపులరే.. అయితే కెరీర్ తొలినాళ్లలో తనతో నటించడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. కలర్ తక్కువని పెద్ద హీరోయిన్స్ అతడిని దూరం పెట్టేవారని ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. పుట్టుకతో వచ్చిన రంగును ఎలాగూ మార్చలేం కాబట్టి తన డ్యాన్స్తో అందరినీ ఆకట్టుకోవాలనుకుని. చివరకు అందరూ తన రంగు గురించి కాకుండా డ్యాన్స్ గురించి మాట్లాడుకునేలా మిథున్ చేశారు.మిథున్తో నటించేందుకు ఓకే చెప్పిన తొలి హీరోయిన్ జీనత్ అమన్మిథున్ సినీ జర్నీలో మొదట పెద్ద హీరోయిన్స్ తన వైపు కన్నెత్తి చూసేవారు కాదు. అలా ఏ ఒక్క హీరోయిన్ కూడా ఆయనతో కలిసి నటించడానికి ఇష్టపడేవారు కాదు. ఒకరకంగా చెప్పాలంటే తనను హీరోగానే వాళ్లు చూడలేదు. ఆయనతో పని చేస్తే వారికి ఎటువంటి ఫేమ్ రాదని పక్కనపెట్టేవాళ్లు. సరిగ్గా అలాంటి సమయంలో జీనత్ అమన్ వచ్చింది. ఇతడు చాలా బాగున్నాడు.. ఇతడితో నటించడానికేంటి సమస్య అని మిథున్ సరసన హీరోయిన్గా నటించింది. ఇక అప్పటినుంచి తన కెరీర్ బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది. ఈ వషయాన్ని కూడా ఓ వేదిక మీదు మిథున్ చక్రవర్తి పంచుకున్నారు.మిథున్ చక్రవర్తి 1976లో వచ్చిన 'మృగయ' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశారు. ఈ సినిమా జాతీయ అవార్డు అందుకుంది. సురక్ష, డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ ఝుక్తా నహీ, కసమ్ ఫాయిదా కర్నే వాలేకీ వంటి బ్లాక్బస్టర్ సినిమాల్లో ఆయన నటించారు. హీరోగా 80, 90 దశకాల్లో ఆయన చేసిన చిత్రాలు విశేష ఆదరణ పొందాయి. బాలీవుడ్లో ఒకే ఏడాది 19 చిత్రాల్లో నటించి అరుదైన ఘనత సాధించిన మిథున్.. తన కెరియర్లో సుమారు 350కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. గతేడాదిలో 'కాబులివాల' అనే బెంగాళి చిత్రంలో ఆయన నటించారు. -
నటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షోలో రాళ్ల దాడి
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మరో అల్లర్ల ఉదంతం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మిడ్నాపూర్లో నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి రోడ్ షోలో కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. అనంతరం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిడ్నాపూర్ లోక్సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ పోటీ చేస్తున్నారు. ఈయనకు మద్దతుగా మిథున్ చక్రవర్తి రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఊరేగింపుపై గాజు సీసాలు, రాళ్లు విసిరారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను రాష్ట్ర అధికార టీఎంసీ కొట్టిపారేసింది. కాగా ఈ ఘటనలో చక్రవర్తి, పాల్ ఇద్దరికీ ఎటువంటి గాయాలు కాలేదు.మిడ్నాపూర్ కలెక్టరేట్ మలుపు నుండి ప్రారంభమైన రోడ్ షో కెరనిటోలా వైపు వెళుతుండగా వందలాది మంది బీజేపీ మద్దతుదారులు నినాదాలు చేస్తుండగా, మిథున్ చక్రవర్తి, అగ్నిమిత్ర పాల్ జనానికి అభివాదాలు తెలిపారు. ఈ రోడ్ షో షేక్పురా మలుపు వద్దకు చేరుకోగానే రోడ్డుపక్కన నిలుచున్న కొందరు ఊరేగింపుపై రాళ్లు, సీసాలు విసిరారు. ఈ నేపధ్యంలో బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడులకు దిగడంతో ఘర్షణ చెలరేగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.బీజేపీకి మద్దతు పెరుగుతుందనే భయంతో తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి గూండాయిజానికి పాల్పడుతోందని అగ్నిమిత్ర పాల్ ఆరోపించారు. మిథున్ చక్రవర్తి లాంటి ప్రముఖ నటుడిని అవమానించేలా వారు ప్రవర్తించారన్నారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి త్రినాంకుర్ భట్టాచార్య బీజేపీ నేత చేస్తున్న ఆరోపణలను ఖండించారు. రోడ్ షో ఫ్లాప్ కావడంతో బీజేపీ ఇలాంటి నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. -
ఆ స్టార్ హీరో అమ్మాయిలను ఫూల్ చేస్తాడు.. జన్మలో పెళ్లి చేసుకోడు!
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సల్మాన్ ఖాన్ హీరోయిన్లతో నడిపిన ప్రేమాయణాలకు లెక్కే లేదు. ఎంతోమంది ముద్దుగుమ్మలను బుట్టలో వేసుకున్న ఇతడు వారితో జీవితాన్ని కొనసాగించాలని మాత్రం ఎన్నడూ ఆలోచించలేదు. అందుకే ఇప్పటికీ సింగిల్గానే ఉన్నాడు. అయితే సల్మాన్ పెళ్లి చేసుకోడన్న విషయం తనకెప్పుడో తెలుసంటున్నాడు నటుడు మిథున్ చక్రవర్తి. తాజాగా ఓ షోలో సల్మాన్ తుంటరితనాన్ని వెల్లడించాడు.ఒక్క నిమిషం కూడాసల్మాన్ నన్ను ఎంతగానో అభిమానిస్తాడు. ఎక్కువ ప్రేమను పంచుతాడు. మేము కలిసున్నప్పుడైతే నా వెంటే తిరుగుతాడు. ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండలేడు. నేను పడుకున్నా సరే నిద్రలో నుంచి లేపి మరీ కబుర్లు చెప్తుంటాడు. ఓసారి సెయింట్ పీటర్స్బర్గ్లో రాత్రి రెండు గంటలకు షూటింగ్ ఉంది. నేను ఆ విషయం మర్చిపోయి గదిలో గడియ పెట్టి నిద్రపోయాను. సడన్గా కళ్లు తెరిచేసరికి అతడు నా ఎదురుగా నిలబడి నవ్వుతున్నాడు. అతడు లోపలకు ఎలా వచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నువ్వేం మనిషివిరా బాబూ అనుకుని లేచాను.పెళ్లి చేసుకోడుతనలో ఆ తుంటరితనం ఎక్కువగా ఉండేది. అతడు ఎప్పటికీ పెళ్లి చేసుకోడు.. అమ్మాయిలందరినీ ఫూల్ చేస్తాడు. నాకింకా పెళ్లవలేదు, తెలుసా అంటూ అమ్మాయిలతో మాట కలుపుతాడు. వాళ్లేమో.. ఇంత హ్యాండ్సమ్ సూపర్ స్టార్ను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ప్రేమలో పడతారు. కానీ అతడు ఎన్నటికీ పెళ్లిపీటలెక్కడని నేను గ్యారెంటీ ఇస్తాను' అని మిథున్ చెప్పుకొచ్చాడు. -
హాస్పిటల్లో ఉంటే ప్రధాని ఫోన్ చేసి తిట్టారు: నటుడు
కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు ఏ అనారోగ్య సమస్య తలెత్తుతుందో అర్థం కాని పరిస్థితి! అప్పటిదాకా ఆరోగ్యంగా కనిపించినవాళ్లు కూడా సడన్గా ఛాతీ నొప్పి, గుండెపోటు, ఇలా రకరాకల సమస్యలతో ఆస్పత్రిపాలవుతున్నారు. మూడు రోజుల క్రితం బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి సైతం తీవ్రమైన ఛాతీ నొప్పితో కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జ్ అయ్యాడు. బాగానే ఉన్నా.. తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ.. 'నేను బాగానే ఉన్నాను. ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే నా ఆహారపు అలవాట్లను కాస్త నియంత్రణలో ఉంచుకోవాలి. ఇక నేను నా పని మొదలుపెట్టాలి. రేపటి నుంచి షూటింగ్లో జాయిన్ అవ్వాలి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవలే పద్మ భూషణ్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు తిట్టారు' అని చెప్పుకొచ్చాడు. కాగా మిథున్ చక్రవర్తి హిందీ, బెంగాలీ, ఒడియా, భోజ్పురి, తమిళ భాషల్లో కలిపి 350 సినిమాలు చేశాడు. సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇతడికి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. చదవండి: సెల్వతో పనిచేయడం ఇష్టమే.. మాజీ భర్త సినిమాపై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు -
నటుడు మిథున్ చక్రవర్తిని పరామర్శించిన బీజేపీ నేత
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి(73) తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ కోల్కతాలోని ఒక ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం మిథున్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆయనను వీడియోలో చూసిన అభిమానులు భగవంతునికి ధన్యవాదాలు చెబుతున్నారు. #WATCH | West Bengal BJP chief Sukanta Majumdar met veteran actor and BJP leader Mithun Chakraborty at a private hospital in Kolkata pic.twitter.com/4FRNoTuwKb — ANI (@ANI) February 11, 2024 కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన మిథున్ చక్రవర్తిని బీజేపీ నేత సుకాంత్ మజుందార్ పరామర్శించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిథున్ చక్రవర్తికి చెందిన వీడియోను ఏఎన్ఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో మిథున్ చక్రవర్తి హాస్పిటల్ బెడ్పై పడుకుని, వైద్యులతో మాట్లాడటాన్ని చూడవచ్చు. మిథున్ చక్రవర్తి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు ఈ వీడియోలో స్పష్టమవుతోంది. భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా మిథున్ చక్రవర్తిని కలుసుకుని పరామర్శించారు. #WATCH | West Bengal: Former Indian cricketer Sourav Ganguly arrives at a private hospital in Kolkata to meet his mother, who is admitted here. pic.twitter.com/c4goODkOX1 — ANI (@ANI) February 11, 2024 -
గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరో
ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. ఆయన కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలోని అత్యవసర విభాగం నందు చికిత్స పొందుతున్నారు. నేడు (ఫిబ్రవరి 10) ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన ఆరోగ్య విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మిథున్ చక్రవర్తికి 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం 'పద్మ భూషణ్' అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు. మిథున్ గతంలో కిడ్నీ సమస్యతో బాధపడ్డారు. సుమారు రెండేళ్ల క్రితం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఛాతీ వద్ద నొప్పి రావడంతో ఆయన కోల్కతాలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు. కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. దీంతో త్వరగా ఆయన కోలుకోవాలని కోరుతూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు హీరోగా బెంగాలీ, హిందీ ఇండస్ట్రీలలో దుమ్మురేపిన మిథున్ చక్రవర్తి. శ్రీదేవి సరసన అనేక చిత్రాల్లో నటించారు. 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంలో మిథున్ మెప్పించిన విషయం తెలిసిందే. -
ఖాళీ కడుపుతో రోడ్లపై నిద్రించి.. తిండి కోసం పార్టీలో డ్యాన్స్ చేసిన హీరో..
ఇష్టమైనది సాధించేవరకు ఎంతైనా కష్టపడుతుంటారు. విజయాలు అందుకోవాలంటే కష్టాలను దాటుకుని ముందుకు రావాల్సిందే! ఇండస్ట్రీలో గొప్ప నటులుగా పేరు పొందిన ఎంతోమంది కష్టాల కడలిని ఈదుకుంటూ ముందుకు వచ్చినవారే! అందులో నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఉన్నాడు. జీరో నుంచి హీరోగా మారిన ఇతడి ప్రయాణం ఎంతోమందికి ఆదర్శకనీయం. సినిమా ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్బస్టర్స్ ఇచ్చిన ఇతడు ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.నన్నెవరు హీరోగా తీసుకుంటారులేఓ షోలో ఆయన మాట్లాడుతూ.. 'అన్నం దొరకని సమయాల్లో ఖాళీ కడుపుతో రోజులు గడిపేశాను. ఆకలి కేకలతో నన్ను నేను తిట్టుకుంటూ, ఏడుస్తూ నిద్రపోయాను. నాకు ఇప్పుడు తిండి దొరుకుతుందా? నిద్రపోవడానికి కాస్త చోటు దొరికితే బాగుండు.. ఇలా ఆలోచిస్తూ భారంగా కాలాన్ని నెట్టుకొచ్చిన సందర్భాలు ఎన్నో.. చాలాసార్లు నేను ఫుట్పాత్ల మీదే నిద్రపోయాను. అయితే ఇండస్ట్రీలో నన్నెవరు హీరోగా తీసుకుంటారని అనుకునేవాడిని. అందుకే, విలన్ అవ్వాలనుకున్నాను.తిండి దొరుకుతుందని పార్టీలో డ్యాన్స్..అది కూడా మంచి డ్యాన్స్ చేయగలిగే విలన్గా! పని ఎక్కడ దొరికితే అక్కడికి నడుచుకుంటూ వెళ్లేవాడిని. నాలుగు మెతుకుల కోసం పార్టీలలో డ్యాన్స్ చేసేవాడిని' అని తెలిపాడు. అయితే ఒకానొక సమయంలో తన ప్రాణాలే తీసుకోవాలనుకున్నాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు మిథున్. 'నేను అనుకున్నది సాధించలేనేమోనని భయపడేవాడిని. తిరిగి కోల్కతాకు కూడా వెళ్లలేకపోయాను. ఒకానొక సమయంలో చనిపోదామనుకున్నాను.బ్లాక్బస్టర్ హిట్స్కానీ అందరికీ నేనిచ్చే సలహా ఒక్కటే.. ఎవరూ జీవితాన్ని ముగించాలనుకోకండి.. పోరాడండి. నేనూ ఫైట్ చేశాను.. ఇదిగో ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా మిథున్ చక్రవర్తి 1976లో వచ్చిన 'మృగయ' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశాడు. ఈ సినిమా జాతీయ అవార్డు అందుకుంది. సురక్ష, డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ ఝుక్తా నహీ, కసమ్ ఫాయిదా కర్నే వాలేకీ వంటి బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించాడు. హీరోగా 80, 90 దశకాల్లో ఆయన చేసిన చిత్రాలు విశేష ఆదరణ పొందాయి. ఈయన తెలుగులో 'గోపాల గోపాల' సినిమాలో లీలాధర స్వామి పాత్రలో కనిపించాడు.చదవండి: మరికాసేపట్లో పెళ్లి.. హల్దీ ఫంక్షన్లో కాబోయే భార్యతో స్టెప్పులేసిన మానస్ -
నాకు కలర్ తక్కువని హీరోయిన్స్ దూరం పెట్టారు: సీనియర్ హీరో
'ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్..' పాట వినగానే హిందీ సినిమాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి గుర్తుకొస్తాడు. 40 ఏళ్ల క్రితం మిథున్ హీరోగా నటించిన డిస్కో డ్యాన్సర్ సినిమాలోని ఈ పాట అప్పటికీ, ఇప్పటికీ పాపులరే.. అయితే కెరీర్ తొలినాళ్లలో తనతో నటించడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదట. కలర్ తక్కువని పెద్ద హీరోయిన్స్ అతడిని దూరం పెట్టేవారట. పుట్టుకతో వచ్చిన రంగును ఎలాగూ మార్చలేం కాబట్టి తన డ్యాన్స్తో అందరినీ ఆకట్టుకోవాలనుకున్నాడు. చివరకు అందరూ తన రంగు గురించి కాకుండా డ్యాన్స్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. డ్యాన్స్ వల్ల నా కలర్ పక్కనపెట్టారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ.. 'నన్ను హీరోగా చూశాక జనాలు నాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. నా కొడుకును కూడా హీరో చేసేయొచ్చు అనుకున్నారు. నేను సామాన్య ప్రజల హీరోగా మారాను. కామన్ మ్యాన్కు సూపర్స్టార్ అవడం అనేది నాకు గొప్ప విషయం. నేను నా కాళ్లను కదిలిస్తూ డ్యాన్స్ చేస్తే ఎవరూ నా రంగు గురించి పట్టించుకోరనుకున్నాను. అదే నిజమైంది. నా డ్యాన్స్ వల్ల నా కలర్ను మర్చిపోయారు. ఎందుకంటే నలుపు రంగులో ఉన్నందున ఎవరూ నన్ను హీరోగా అంగీకరించలేకపోయారు. ఆ సందర్భంలో నాకు చాలా బాధేసేది. ఏడ్చేవాడిని కూడా! ఆ హీరోయిన్ ఒక్కరే నన్ను పొగిడారు పెద్ద హీరోయిన్స్ నావైపు కన్నెత్తి చూసేవారు కాదు.. నాతో నటించడానికి ఇష్టపడేవారు కాదు. నన్నసలు వాళ్లు హీరోగానే చూడలేదు. నాతో పని చేస్తే వారికి ఎటువంటి ఫేమ్ రాదని నన్ను పక్కనపెట్టేవాళ్లు. సరిగ్గా ఆ సమయంలో జీనత్ అమన్ వచ్చింది. ఇతడు చాలా బాగున్నాడు.. ఇతడితో నటించడానికేంటి సమస్య అని నా సరసన హీరోయిన్గా నటించింది. ఇక అప్పటినుంచి నా కెరీర్ బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది' అని చెప్పుకొచ్చాడు మిథున్ చక్రవర్తి. చదవండి: చై మంచివాడు, సామ్ ఆ ఫోటో డిలీట్ చేసినందుకు నాపై ద్వేషం: ప్రీతమ్ -
Nenekkadunna: టాలీవుడ్లోకి బాలీవుడ్ సీనియర్ హీరో కొడుకు
బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మాధవ్ కోదాడ దర్శకత్వంలో ‘నేనెక్కడున్నా' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి కథానాయిక. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టైటిల్ వెల్లడించడంతో పాటు పోస్టర్, టీజర్ విడుదల చేశారు. అనంతరం సురేశ్ బాబు మాట్లాడుతూ..‘టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కథ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్' అని చెప్పారు. ‘జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది’అని దర్శకుడు మాధవ్ కోదాడ అన్నారు. ‘సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉన్నాం. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’అని నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు. -
డిసెంబర్లో బెంగాల్ సర్కార్ కూలిపోనుందా?
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ పదే పదే చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్లో ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటూ కమలం కీలక నేతలంతా ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. తాజాగా.. బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్రా పాల్ సైతం ఇదే కామెంట్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘డిసెంబర్లో ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమ’ని ప్రకటించారు. ‘‘టీఎంసీ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్లో ఉన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉనికి ప్రమాదంలో పడింది అంటూ వ్యాఖ్యానించారామె. అంతేకాదు.. రాబోయే రోజుల్లో బెంగాల్లో పెద్ద ఆట చూడబోతున్నారంటూ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారామె. ‘‘వ్యూహమేంటో మేం చెప్పం. కానీ, ఏదో జరగబోతోంది. డిసెంబర్లో పెద్ద ఆట ఉండనుందని మా నాయకత్వం పదే పదే చెబుతోంది. రాష్ట్రం ఆర్థిక ఎమర్జెన్సీ దిశగా పయనిస్తోంది. ఇది(టీఎంసీని ఉద్దేశించి..) దివాలా తీసిన ప్రభుత్వం. వాళ్ల(ప్రభుత్వం) వద్ద డబ్బు లేదు. ఖాళీ ఖజానాతో ఎలా పని చేస్తారు? రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్లలో 50 శాతం మంది జైలుల్లోనే ఉన్నారు. మిగిలిన 50 శాతం మంది కూడా జైలుకు వెళ్తారు. మరి ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరు?.. అంటూ వ్యాఖ్యానించారామె. ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంతా మజుందార్ ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, మమతా బెనర్జీ సైతం జైలుకు వెళ్తారంటూ ఓ ప్రకటన ఇచ్చారు. అంతేకాదు డిసెంబర్ బెంగాల్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి కూడా టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ కామెంట్ చేశారు. వ్యక్తిగతంగా తనకే 21 మంది ఫోన్ ద్వారా టచ్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రతిపక్ష నేత సువేందు అధికారి సైతం టీఎంసీ ఎమ్మెల్యేలు కాంటాక్ట్లో ఉన్నారని చెబుతూ.. డిసెంబర్లో దీదీ సర్కార్ కూలిపోవడం ఖాయమంటూ ప్రకటించారు. అవినీతిలో కూరుకుపోయిన నేతలను చూసి.. మరికొందరిలో భయం నెలకొందని, వాళ్లు పార్టీ మారేందుకు ఆస్కారం ఉందని చెప్పారు సువేందు. అయితే బెంగాల్ అసెంబ్లీ సంఖ్యా బలం చూసుకుంటే.. టీఎంసీ ఫుల్ మెజార్టీతో ఉంది. మరోవైపు బెంగాల్ పంచాయితీ ఎన్నికల వేళ.. ఎలాగైనా భారీ విజయం సాధించాలని బీజేపీ పరితపిస్తోంది. స్టార్ క్యాంపెయినర్ మిథున్ చక్రవర్తిని రంగంలోకి దించిన బీజేపీ.. ఇప్పటికే టీఎంసీ పట్టున్న ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించే యత్నం చేస్తోంది. ఇదీ చదవండి: రామారావు పార్టీ మారితే నేను మారతానా? -
21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఇంకా టచ్లోనే ఉన్నారు
కోల్కతా: ప్రముఖ నటుడు, పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార టీఎంసీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ఇంకా తనతో నేరుగా టచ్లోనే ఉన్నారని చెప్పారు. ఇదివరకే ఈ విషయాన్ని చెప్పానని, మరోసారి దాన్ని గుర్తు చేస్తున్నానని పేర్కొన్నారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కోల్కతాలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మిథున్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే టీఎంసీ నేతలను బీజేపీలో చేర్చుకోవడంపై తమ నాయకులు కొందరు అభ్యంతరాలు తెలిపారని మిథున్ వెల్లడించారు. ప్రజల్లో ఆదరణ లేని నాయకులు తమకు అవసరం లేదని సూచించారని చెప్పారు. అయితే తనకు ఈ విషయంపై అవగాహన ఉందని, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మిథన్ చక్రవర్తి గతంలోనూ ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చి వార్తల్లో నిలిచారు. 20మందికిపైగా టీఎంసీ ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీ గూటికి చేరుతురాని రెండు నెలల క్రితమే చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను టీఎంసీ నాయకులు అప్పుడు తోసిపుచ్చారు. మిథున్కు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు కన్పిస్తున్నారని సెటైర్లు వేశారు. ఓసారి వైద్యుడ్ని కలిసి చికిత్స తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఇప్పుడు మిథున్ చక్రవర్తి మళ్లీ తన వ్యాఖ్యలకు కట్టుబటి ఉన్నానని చెప్పడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. చదవండి: యువతి హత్య కేసులో కుమారుడు అరెస్టు.. తండ్రిని సస్పెండ్ చేసిన బీజేపీ -
మిథున్ చక్రవర్తికి మెంటల్.. టీఎంసీ కౌంటర్..
కోల్కతా: బెంగాల్లో మహారాష్ట్ర పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించిన బీజేపీ నేత మిథున్ చక్రవర్తిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది టీఎంసీ. ఆయనకు బహుశా మెంటల్ అయి ఉండవచ్చని మండిపడింది. టీఎంసీ ఎంపీ శాంతను సేన్ ఈమేరకు స్పందించారు. 'మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరారని విన్నాము. బహుశా ఆయనకు శారీరక సమస్య కాదు మానసిక సమస్య అయి ఉంటుంది. ఆయన చెప్పే మాటలను బెంగాల్లో ఏ ఒక్కరూ పట్టించుకోరు. ఆయనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. అదే సమస్య' అని శాంతను సేన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. #WATCH | I heard that Mithun Chakraborty was admitted to a hospital a few days back. I think he was mentally ill & not physically... The problem is that he does not know politics: TMC MP Santanu Sen on Mithun Chakraborty's remarks pic.twitter.com/5FUKkM7RIQ — ANI (@ANI) July 27, 2022 అంతకుముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మిథున్ చక్రవర్తి. మంత్రి పార్థ చటర్జీ అరెస్టు తర్వాత టీఎంసీలో తుఫాన్ మొదలైందని, ఆ పార్టీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని అన్నారు. బెంగాల్లో కూడా మహారాష్ట్ర పరిస్థితి రావొచ్చని వ్యాఖ్యానించారు. చదవండి: మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీతో టచ్లో టీఎంసీ ఎమ్మెల్యేలు! -
మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీతో టచ్లో టీఎంసీ ఎమ్మెల్యేలు!
కోల్కతా: నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్లో ఉన్నారని తెలిపారు. వీరిలో 21 మంది నేరుగా తనతోనే మాట్లాడుతున్నారని చెప్పారు. టీఎంసీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టు తర్వాత ఆ పార్టీలో తుఫాన్ చెలరేగిందని, ఇదే బిగ్ బ్రేకింగ్ అన్నారు. ఈమేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. దీంతో మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలు బెంగాల్లో కలకలం రేపుతున్నాయి. బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో పార్థ చటర్జీ అరెస్టుపై మాట్లాడుతూ.. ఆయన తప్పు చేయకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మిథున్ పేర్కొన్నారు. ఒకవేళ తప్పు చేస్తే మాత్రం ఎవరూ ఆయన్ను కాపాడలేరని స్పష్టం చేశారు. ఇది రూ.2000కోట్ల భారీ కుంభకోణం అని ఆరోపించారు. అలాగే బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీనా? అనే అంశంపైనా ఆయన స్పందించారు. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సూపర్స్టార్లు అయిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్లు ముస్లింలే అని చెప్పారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు ఆదరించడం వల్లే తను నటుడిగా ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని అక్కడ కూడా వాళ్ల సినిమాలకు భారీ కలెక్షన్లు వస్తున్నట్లు వివరించారు. ఒకవేళ బీజేపీ వాళ్లను ద్వేషిస్తే ఇది సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. గతేడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు మిథున్ చక్రవర్తి. మమతా బెనర్జీ కచ్చితంగా ఓడిపోతుందని అప్పుడు వ్యాఖ్యానించారు. కానీ ఎన్నికల్లో టీఎంసీ భారీ మెజార్టీతో గెలిచింది. బీజేపీ 70 పైచిలుకు స్థానాలతో సరిపెట్టుకుంది. చదవండి: శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది -
మంత్రి పార్థ అరెస్ట్ తర్వాత టీఎంసీలో తుపాను చెలరేగింది: మిథున్
-
ఇక నావల్ల కాదు, చచ్చిపోదామనుకున్నా..
మిథున్ చక్రవర్తి.. ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించాడు. 80, 90 దశకాల్లో ఆయన చేసిన చిత్రాలు విశేష ఆదరణ పొందాయి. 1976లో మృగయ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆయన డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ జుక్త నహీ, కసమ్ ఫాయిదా కర్నె వాలేకీ, కమాండో వంటి సినిమాలతో బాలీవుడ్ను ఓ ఊపు ఊపాడు. అయితే తన జీవితం ఏమీ పూలపాన్పు కాదంటున్నాడు మిథున్. తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు. 'సాధారణంగా ఇలాంటి వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడాను. నా లైఫ్ను మరీ అంత కష్టంగా నెట్టుకొచ్చిన సందర్భాలు కూడా పెద్దగా ఏమీ లేవు. పైగా నేను పడ్డ కష్టాలను చెప్తే నటుడిగా ఎదగాలనుకుంటున్న కొత్త తరాన్ని నేను నిరాశపర్చినట్లు అవుతుందని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరూ ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. నా జీవితంలో అలాంటివి చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు నేను నా లక్ష్యాన్ని చేరుకోలేనేమోనని భయపడ్డాను, అంతేకాదు ఆ భయంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. కానీ ఆ ఆలోచనను విరమించుకునేవాడిని. నేను మీకిచ్చే సలహా కూడా ఇదే.. ప్రాణం తీసుకోవాలన్న ఆలోచననే మానేయండి.. ప్రతిదానితో పోరాడండి. అలా పోరాడాను కాబట్టే నేనీ స్థాయిలో ఉన్నా. రానురానూ మానవ విలువలు తగ్గిపోతున్నాయి. సోషల్ మీడియాను పాజిటివ్ అంశాలకంటే కూడా నెగెటివిటీకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు మేము షూటింగ్ అయిందంటే అందరం కలిసి కూర్చుని తినేవాళ్లం. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్లు వ్యానిటీ వ్యాన్లోకి వెళ్లిపోయి ఫోన్లతో బిజీ అవుతున్నారు' అని చెప్పుకొచ్చాడు. కాగా మిథున్ బెంగాలీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అవ్జిత్ సేన్ ప్రజాపతి సినిమాలో అతడు నటించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ హీరో భార్య నన్ను శారీరకంగా, మానసికంగా హింసించింది: హీరోయిన్ కేటీఆర్ గారూ, కాలక్షేపం కావాలంటే ఈ షోలు చూసేయండి -
రాజ్యసభకు మిథున్ చక్రవర్తి!
కోల్కతా: ప్రముఖ నటుడు, పార్టీ స్టార్ క్యాంపెయినర్ మిథున్ చక్రవర్తి(72)ని రాజ్యసభకు పంపే యోచనలో బీజేపీ ఉంది. రూపా గంగూలీ స్థానంలో ఆయన్ని పెద్దల సభకు పంపాలని దాదాపుగా నిర్ణయించేసినట్లు సమాచారం. నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మిథున్ చక్రవర్తి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్గా పని చేశారు. అయితే ఆ తర్వాత నుంచి అనారోగ్యం రిత్యా ఆయన బెంగాల్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పొలిటికల్ తెర మీదకు వచ్చిన ఆయన స్వయంగా చేసిన వ్యాఖ్యలే.. చర్చనీయాంశంగా మారాయి. ‘నా అనారోగ్య కారణాల వల్ల నేను చాలా కాలం ప్రజల ముందుకు రాలేకపోయాను. రాజకీయాలను రాజకీయాల్లాగే ఉంచాలి. కానీ, ఎన్నికల తర్వాత బెంగాల్లో అశాంతి నెలకొందన్న వార్త చాలా బాధించింది’ అంటూ పొలిటికల్ రీఎంట్రీ సంకేతాలను అందించారాయన. రాజ్యసభలో రూపా గంగూలీ, స్వపన్ దాస్గుప్తాల పదవి కాలం ముగియనుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు త్వరలోనే ఉన్నాయి. ఈ తరుణంలో ఖాళీ రాజ్యసభ స్థానాలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉంది. బెంగాల్కు చెందిన ఈ రెండు ఖాళీలను బెంగాల్కు చెందిన వాళ్లతోనే భర్తీ చేయాలని ఇప్పటికే బీజేపీ కీలక ప్రకటన చేసింది కూడా. ఈ తరుణంలో.. ఢిల్లీ నుంచి సోమవారం అఘమేఘాల మీద కోల్కతా చేరుకున్న మిథున్ చక్రవర్తి.. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుఖంత మజుందార్తో భేటీ అయ్యారు. రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని మిథున్ చక్రవర్తికి ఆహ్వానం అందిందని, ఈ మేరకు ఆయన సైతం అందుకు సానుకూలంగా స్పందించినట్లు పార్టీ కీలక వర్గాలు ప్రకటించాయి కూడా. లోక్సభ బరిలో ఛాన్స్!.. ఇదిలా ఉంటే 2024 లోక్సభ బరిలోనూ మిథున్ చక్రవర్తిని దించే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. దీదీ(మమతా బెనర్జీ) టీఎంసీకి చెక్ పెట్టేందుకు.. మిథున్ చక్రవర్తినే సరైన వ్యక్తిగా భావిస్తోంది ఆ పార్టీ. బాలీవుడ్, బెంగాలీ చిత్రాల ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న మిథున్ చక్రవర్తి.. ఆ తర్వాతి రోజుల్లో రాజకీయాల్లోనూ రాణించారు. 2012 రాష్ట్రపతి ఎన్నికల సమయంలో.. తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ప్రణబ్ ముఖర్జీకి దక్కడంలో కీలక పాత్ర పోషించింది మిథున్ చక్రవర్తినే. టీఎంసీ తరపున గతంలోనూ(2014 నుంచి) ఆయన రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు కూడా. అయితే 2016లో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే.. కిందటి ఏడాది మార్చిలో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ సమక్షంలో మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. -
ఆసుపత్రి పాలైన మిథున్ చక్రవర్తి, బయటికొచ్చిన ఆస్పత్రి ఫొటో
Mithun Chakraborty Hospitalised Photos Goes Viral: ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవరి ఆసుపత్రి పాలయ్యారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరారు. బీజేపీ నాయకుడు అనుపమ్ హజ్రా ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఆసుపత్రిలోని ఆయన ఫొటోలను ట్వీట్లో షేర్ చేశారు. దీంతో ఆసుపత్రి బెడ్పై పడుకుని ఉన్న మిథున్ చక్రవర్తి ఫొటోలు సోషల్ మీడయా వైరల్గా మారాయి. ఆకస్మాత్తుగా మిథున్ చక్రవర్తి ఆసుప్రతి పాలవడంతో ఆయన అభిమానులంతా ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఆయన రెండో కుమారుడు మిమో చక్రవర్తి ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చాడు. ఇండియా టూడేతో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. ఆయన కిడ్నీ స్టోన్స్ పెయిన్ ఏప్రిల్ 30న ఆసుప్రతి చేరినట్టు చెప్పాడు. ఆయనకు ఆపరేషన్ జరిగిందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని మిమో చక్రవర్తి చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా 80, 90లలో హీరోగా బెంగాలీ, హిందీ సినిమాలలో చక్రం తిప్పారు మిథున్ చక్రవర్తి. ఇక చివరగా మిథున్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో నటించి మెప్పించారు. Get well soon Mithun Da ❤️ তোমার দ্রুত আরোগ্য কামনা করি মিঠুন দা ❤️ pic.twitter.com/yM5N24mxFf — Dr. Anupam Hazra 🇮🇳 (@tweetanupam) April 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తిపై పోలీసుల ప్రశ్నల వర్షం
కోల్కతా: బాలీవుడ్ సీనియర్ నటుడు, బెంగాల్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తిని కోల్కతా పోలీసులు ప్రశ్నించారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిథున్ చేసిన ఓ ప్రసంగంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బుధవారం మిథున్ను 45 నిమిషాలపాటు పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, 71 ఏళ్ల మిథున్ చక్రవర్తి.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు బహిరంగ సభల్లో, ర్యాలీల్లో ఆవేశపూరితంగా ప్రసంగించారు. కాగా, బెంగాల్ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ హింసపై మిథున్ ప్రసంగాల ప్రభావం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ‘ఎగిరి తంతే.. శవం శ్మశానంలో పడుతుంది’ అంటూ తన సినిమాలోని డైలాగును ఉపయోగించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను ఆవేశంగా డైలాగులు చెప్పానే తప్ప.. ఉద్దేశపూర్వక ప్రసంగాలు చేయలేదని మిథున్ కోల్కతా కోర్టుకు విన్నపించాడు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోర్టును కోరాడు కూడా. అయితే కోర్టు మాత్రం ఆయన్ని వర్చువల్గా ప్రశ్నించాలని పోలీసులను ఆదేశించింది. ఇక మరో బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘నేనేం ఉత్త పామును కాను. నల్లత్రాచుని. కాటేస్తే.. నీ ఫొటోకి దండ పడాల్సిందే’ అని అర్థం వచ్చేలా కామెంట్లు చేశాడు. అన్నట్లు.. ఈ డిస్కో డ్యాన్సర్ పుట్టినరోజు ఇవాళే. చదవండి: మిథున్ కొడుకుపై రేప్ కేస్ -
ప్రముఖ నటుడి నివాసంలో ఆర్ఎస్ఎస్ చీఫ్
ముంబై: పశ్చిమ బెంగాల్లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సర్కార్ను గద్దెదించి బీజేపీ జెండాను ఎగురువేయాలని ఆ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని మంగళవారం ముంబైలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మోహన్ భాగవత్, మిథున్ను కలిసినట్లు చర్చ జరుగుతోంది. దీంతో మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగాల్కు చెందిన సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తికి పెద్ద సంఖ్యలో అభిమానులు, పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. తృణముల్ కాంగ్రెస్ పార్టీలో మిథున్ చాలా కాలం పని చేసి ఆనారోగ్య కారణాల వల్ల ఆ పార్టీకి 2016లో రాజీనామా చేశారు. ఆయన తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన తన పదవికి 20 నెలల తర్వాత రాజీనామా చేయడం గమనార్హం. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చదవండి: 2024లో ప్రధాని పదవి చేపట్టేది ‘ఆమెనే’! -
భయం ఎందుకు?
వివేక్ రంజన్ అగ్నిహోత్రీ దర్శకత్వంలో తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ తీస్తున్న హిందీ చిత్రం ‘ది కశ్మీరీ ఫైల్స్’. ‘‘కశ్మీరీ హిందువులపై సాగిన మారణహోమం గురించి ఇంతవరకూ ఎవ్వరూ సినిమా తీయలేదు. ఆ కథ అందరికీ తెలియజేయాలనుకున్నా’’ అని సినిమాకి శ్రీకారం చుట్టినప్పుడే వివేక్ పేర్కొన్నారు. కశ్మీర్లో ఈ చిత్రం షూటింగ్ జరిపారు. కాగా, ఈ చిత్రాన్ని తీసినవాళ్లను, చూసే ప్రేక్షకులను వదిలేదు లేదంటూ కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ బెదిరించినట్లుగా తాజాగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘‘ఇంకా ఈ సినిమా ఎడిటింగ్ కూడా మొదలుపెట్టలేదు. వాళ్లెందుకు భయపడుతున్నారు? నిజానికా? నిజాన్ని నిర్భయంగా చెప్పాలనుకుంటున్న మమ్మల్ని ఆశీర్వదించండి’’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు అభిషేక్ అగర్వాల్. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రాన్ని ఏప్రిల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
మిథున్ చక్రవర్తి ప్రేయసిగా శ్రుతీహాసన్
శ్రుతీహాసన్, మిథున్ చక్రవర్తి ముఖ్య పాత్రల్లో హిందీలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ‘ది బెస్ట్ సెల్లర్ షీ రోట్’ అనే నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కించనున్నారు. దీనిని అమెజాన్ ప్రైమ్లో విడుదల చేయనున్నారు. ఓ సూపర్ స్టార్ నవలా రచయితకూ, అతని ప్రేయసికీ మధ్య జరిగే కథే ఈ నవల. ఇందులో సూపర్స్టార్ నవలా రచయితగా మిథున్ చక్రవర్తి, అతని ప్రేయసిగా శ్రుతి కనిపిస్తారని టాక్. మనోజ్ బాజ్పాయ్ నటించిన హిందీ చిత్రం ‘మిస్సింగ్’ని తెరకెక్కించిన ముకుల్ అభ్యంకర్ ఈ సిరీస్ను డైరెక్ట్ చేయనున్నారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా నిర్మాత. ఉత్తరాఖండ్లో చిత్రీకరణ జరగనున్న ఈ సిరీస్ను ఒకే షెడ్యూల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. చదవండి: సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది అదే -
షూటింగ్లో కుప్పకూలిన నటుడు
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో బాలీవుడ్ విలక్షణ నటుడు మిథున్ చక్రవర్తి నటిస్తోన్న చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. అయితే తాజాగా షూటింగ్లో నటుడు మిథున్ చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పి కారణంగా ఆరోగ్యం క్షీణించి షూటింగ్లో కుప్పకూలిపోయాడు. దీంతో సడెన్గా చిత్రీకరణను నిలిపి వేశారు. ఈ మేరకు డైరెక్టర్ వివేక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మిథున్ పాత్రపై పెద్ద యాక్షన్ సన్నివేశం కోసం షూట్ చేస్తున్నాం. ఈ క్రమంలో మిథున్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా కళ్లు తిరిగి పడిపోయాడు. సాధారణంగా ఏ వ్యక్తి కూడా ఆ పరిస్థితుల్లో కనీసం నిల్చోలేరు. కానీ మిథున్ కొద్దిసేపు తీసుకొని విశ్రాంతి మళ్లీ వచ్చి షూట్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా షూట్ చేస్తారని నేను అస్సలు ఉహించలేను. కానీ మిధున్ చేశాడు. అందుకే అతను సూపర్ స్టార్ అయ్యాడు. చదవండి: మిథున్ చక్రవర్తి కొడుకుపై అత్యాచారం కేసు తన నాలుగు దశబ్దాల కెరీర్లో ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదని ఇటీవల మిథున్ నాకు చెప్పాడు. మీ షూటింగ్ నా వల్ల ఆగిపోలేదు కదా అని నన్ను అడిగే వాడు. నాకు నిజంగా ఆశ్యర్యం వేస్తోంది. ఎందుకంటే ఇంతటి అంకితభావంతో పనిచేసేవాళ్లను ఈ తరం నటుల్లో ఎవర్ని చూడలేదు. మిథున్చాలా కష్టజీవి. ప్రతిరోజు షూట్కు వచ్చినప్పుడు అందరిని ఆప్యాయంగా పలకరిస్తాడు. తన పని తాను వేగంగా చేస్తాడు. మిథున్ చక్రవర్తి లాంటి నటుడు ఉండటం ఏ మూవీ యూనిట్కైనా ఆస్తి వంటింది.’ అని వివేక్ పేర్కొన్నారు. కశ్మీరీ హిందువుల దుస్థితి గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ‘కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ఒక చిన్న మెట్టులాగా ఉపయోగపడుతుందని వివేక్ అభిప్రాయపడ్డారు. అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ 2021 లో విడుదల కానుంది. -
మిథున్ చక్రవర్తి కొడుకుపై అత్యాచారం కేసు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు, నటుడు మహాక్షయ్పై అత్యాచారం కేసు నమోదైంది. మహాక్షయ్ అత్యాచారం చేసి, మోసం చేసినట్లు 38 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేయడంతో ఓషివారా పోలీసు స్టేషన్లో గురువారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. దీంతో అతడిపై అత్యాచారం, మోసం కేసు నమోదు చేసినట్లు ఓషివారా పోలీసు అధికారి వెల్లడించారు. దీనిపై సదరు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. బాధిత మహిళతో మహాక్షయ్ 2015 నుంచి 2018 వరకు కలిసి ఉన్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో అతడు ఆమెను వివాహం కూడా చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. 2015లో పశ్చిమ అంధేరిలో మహాక్షయ్ కోనుగోలు చేసిన ఇంటిని ఆమె చూడటానికి వెళ్లగా సాఫ్ట్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొందన్నారు. (చదవండి: చివరి చూపు చూడలేదు) తాను గర్భవతి అయిందని ఆ విషయం అతడికి చెప్పడంతో అబార్షన్ చేసుకోవాలని కోరుతూ బలవంతంగా గర్భస్రావం మందులు ఇచ్చినట్లు ఆరోపించింది. తనను పెళ్లి చేసుకోవాలని బాధిత మహిళ మహాక్షేను ప్రశ్నించినప్పుడల్లా మాట దాటేస్తూ తనని మూడేళ్లు మోసం చేశాడని తెలిపారు. 2018 జనవరిలో కూడా మరోసారి తమ వివాహం గురించి ప్రశ్నించగా అతడు చేసుకోనని తెల్చిచెప్పడంతో వారి మధ్య గొడవలు కూడా జరిగాయని చెప్పారు. ఈ విషయంపై అతడి తల్లి యోగితా బాలి కూడా తనని బెదిరించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. దీంతో 2018లో ఢిల్లీలోని బేగంపూర్ పోలీసు స్టేషన్లో మహాక్షయ్తో పాటు అతడి తల్లిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు 376(అత్యాచారం) 313(బలవంతంగా గర్భస్రావం చేయడం) కేసులు నమోదు చేసి హైకోర్టుకు పంపినట్లు చెప్పారు. (చదవండి: కంగనా సిస్టర్స్కు కోర్టు షాక్) హైకోర్టు మహాక్షయ్, అతడి తల్లికి ముందస్తు బెయిల్ మంజూర్ చేసి స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయాల్సిందిగా బాధిత మహిళకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ మేరకు 2020 జులైలో ఓషివారా పోలీసు స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 376(అత్యాచారం) 376(2)(ఎన్) (పలుమార్లు అత్యాచారం చేయడం) 328(అంగీకారం లేకుండా గర్భస్రావం చేయడం, బాధకలిగించడం, బలవంతం చేయడం) 417(మోసం చేయడం), 506(క్రిమినల్ బెదిరింపులు) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే మహాక్షయ్ హాంటెడ్ 3డీ, లూట్ వంటి చిత్రాల్లో నటించాడు. (చదవండి: వివేక్ ఒబెరాయ్ భార్యకు నోటీసులు!) -
చివరి చూపు చూడలేదు
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి బసంత్ కుమార్ చక్రవర్తి (95) ఇటీవలే మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన మనవడు, మిథున్ చక్రవర్తి కుమారుడు నిమిష్ చక్రవర్తి తెలిపారు. లాక్డౌన్ ముందు ఓ సినిమా షూటింగ్ నిమిత్తం బెంగళూర్ వెళ్లిన మిథున్ చక్రవర్తి లాక్డౌన్ కావడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తండ్రిని చివరిసారిగా చూసే అవకాశం దక్కలేదట. -
ప్రముఖ నటుడి తండ్రి మృతి
ముంబై: ప్రముఖ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్కుమార్ చక్రవర్తి (95) మంగళవారం సాయంత్రం ముంబైలో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. కాగా, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో బెంగుళూరులో చిక్కుకున్న మిథున్ చక్రవర్తి ముంబై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ తమ తండ్రి మరణించారని బసంత్కుమార్ రెండో కుమారుడు నామాషి చక్రవర్తి తెలిపారు. బెంగాళీ నటి రీతూపర్ణ సేన్గుప్తా ట్విటర్ వేదికగా.. మిథున్ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. (చదవండి: మహమ్మారి కేంద్రంగా మహారాష్ట్ర..) -
దొరికిన పాపాయి
‘అమృత’ సినిమా గుర్తుంది కదా.. మాధవన్ హీరోగా.. సీత, పార్థిబన్ల కూతురు టైటిల్ రోల్ పోషించిన మణిరత్నం సినిమా! శ్రీలంకలో అస్తిత్వ పోరాటం చేస్తున్న ఓ తమిళ యోధురాలు రామేశ్వరం (తమిళనాడు) కాందీశీకుల శిబిరంలో బిడ్డను కని.. పాపను ఇక్కడే వదిలేసి వెంటనే శ్రీలంక వెళ్లిపోతుంది అక్కడి తమిళుల విముక్తి పోరును ముందుకు నడిపించడానికి. ఆ శిబిరంలో ఈ పసికూనను వృత్తిరీత్యా ఇంజనీర్, ప్రవృత్తిరీత్యా రచయిత అయిన శ్రీనివాస్ దత్తత తీసుకుంటాడు. ఆ చంటిదాన్ని దత్తత తీసుకోవడం కోసమే ఇందిర అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ బిడ్డకు ‘అమృత’ అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా చూసుకుంటూంటుంది ఆ జంట. ఇన్నేళ్లకు ఈ సినిమాను ఎందుకు గుర్తుచేయాల్సి వచ్చిందంటే.. ఇంచుమించు ‘అమృత’ లాంటి కథే బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి జీవితంలోనూ ఉంది. మిథున్ దత్తత తీసుకున్న అమ్మాయి పేరు దిశాని. చాన్నాళ్ల కిందటి సంగతి ఇది. బహుశా అప్పటికి అమృత సినిమా విడుదలై ఉండకపోవచ్చు. పశ్చిమ బెంగాల్లో జరిగిందీ సంఘటన. ఆడపిల్ల భారమనే అభిప్రాయంతో ఉన్న ఓ జంట తమకు పుట్టిన కూతురును రోడ్డు పక్కనున్న చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయారు.సన్నగా .. గొంతులో ఊపిరి పెట్టుకున్న ఆ పిల్ల పాలకోసం గుక్కపట్టి ఏడుస్తుంటే ఆ రోడ్డు పక్కన వెళ్తున్న వాళ్లు చూసి.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల ద్వారా ఒక స్వచ్ఛంద సంస్థకూ విషయం తెలిసింది. ఆ పసిగుడ్డును తీసుకెళ్లి తమ హోమ్లో పెట్టుకున్నారు. ఇది వార్తగా మారి తెల్లవారి పత్రికల్లో, టీవీ చానళ్లలో వచ్చింది. అది మిథున్చక్రవర్తి కంటా పడింది. అతని మనసును కలిచివేసింది. అప్పటికే ముగ్గురు పిల్లలున్న మిథున్ నాలుగో బిడ్డగా ఆ పాపను సాకాలనుకున్నారు. భార్య యోగితాకు చెప్పాడు. ‘‘పదండి పాపను తెచ్చుకుందాం’’ అంది. వెంటనే ఆ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న హోమ్కు వెళ్లి .. ఆ పాపను దత్తత తీసుకుంటామని చెప్పారు ఈ తల్లిదండ్రులు. సంబంధించిన నియమ నిబంధలన్నిటికీ రాతపూర్వకమైన పూచీకత్తు ఇస్తూ ఆ బిడ్డను ఇంటికి తెచ్చుకున్నారు. ‘దిశాని’ అని పేరు పెట్టుకున్నారు. ముద్దుగా పెంచుకున్నారు. ఇప్పుడు... దిశానీకి తండ్రిలాగే సినిమాల్లో నటించడం ఇష్టం. దాన్నే కెరీర్గా ఎంచుకుంటానని తల్లి, తండ్రికి చెప్పింది. వాళ్లూ ‘‘ఓకే’’ అని.. అమ్మాయిని న్యూయార్క్లోని ఫిల్మ్ అకాడమీలో చేర్పించారు. నటనలో తర్ఫీదు కోసం. శిక్షణ తీసుకుంటున్న దిశాని చక్రవర్తి తెరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదీ మిథున్ చక్రవర్తి ‘అమృత’ కథ.సైలెంట్గా ఇలాంటి మంచి పనులెన్నో చేస్తూంటాడు మిథున్. ఓ ట్రస్ట్ పెట్టి దాని తరపున పేదవాళ్ల కొరకు ఆసుపత్రి, స్కూల్నూ నడిపిస్తున్నాడు. కుడిచేత్తో చేసే సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనే మాటను బాగా నమ్ముతాడట మిథున్ చక్రవర్తి. -
మరోసారి దుమ్మురేపిన డ్యాన్సింగ్ అంకుల్
మీకు డ్యాన్సింగ్ అంకుల్ గుర్తున్నారా? గోవిందా హిట్ సాంగ్ అయిన 'ఆప్కే ఆ జానేసే' పాటకు డ్యాన్స్ చేసి ఒక్కసారిగా దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అదిరిపోయే స్టెప్పులతో రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారు సంజీవ్ శ్రీవాస్తవ. ఆయన డ్యాన్స్ వైరల్గా మారి.. సెలబ్రిటీని చేసింది. తాజాగా ఆయన మళ్లీ వార్తల్లోకి వచ్చారు. మరోసారి తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అందరిని అదరగొట్టాడు. 1988లో రిలీజ్ అయిన 'జీతే హై హమ్ షాన్' సినిమాలో మితున్ చక్రవర్తి నటించిన 'జూలీ జూలీ' పాటకు స్టెప్పులేసి అందరిని ఆకట్టుకున్నారు సంజీవ్. ఇటీవల ఓ పెళ్లికి హాజరైన ఆయన వేసిన ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో మరోమారు వైరల్ అయింది. చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘డ్యాన్సింగ్ అంకుల్ ఈజ్ బ్యాక్’ అంటూ ప్రశంసిస్తున్నారు. ‘డాన్సింగ్ అంకుల్’గా పేరు తెచుకున్న ఈ విదిషా ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మెచ్చుకోవడమే కాక విదిషా మున్సిపల్ కార్పొరేషన్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమించిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి అంకుల్... ఇరగదీశావ్ పో! -
డ్యాన్సింగ్ అంకుల్ ఈజ్ బ్యాక్
-
బెయిల్పై వచ్చి పెళ్లి చేసుకున్న నటుడి కొడుకు
అర్థాంతరంగా పీటల మీదే ఆగిపోయిన బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ వివాహం మంగళవారం ఊటిలో జరిగింది. ఓ యువతిని రేప్ చేసి, మోసం చేసిన కేసులో కోర్టు ఆదేశాలతో మహాక్షయ్ను విచారణ చేయడం కోసం పోలీసులు గత శనివారం ఊటీలోని వివాహ వేదిక వద్దకు చేరుకోవడంతో వధువు కుటుంబం అక్కడ్నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే యువతిని అత్యాచారం చేసిన కేసులో కోర్టు మహాక్షయ్కు బెయిల్ మంజూరు చేయడంతో తన ప్రియురాలు, దక్షిణాది నటి అయిన మదాలస శర్మను ఈ నెల 7న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు సమాచారం. అనంతరం మంగళవారం(ఈ రోజు) తమిళనాడు ఊటిలోని తన విలాసవంతమైన హోటల్లో సాంప్రదాయబద్దంగా మరోసారి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే మహాక్షయ్, అతని తల్లి యోగిత మీద నమోదైన కేసును విచారించిన ఢిల్లీలోని ఓ కోర్టు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదుచేసేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ కేసులో చట్టప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని యోగిత, మహాక్షయ్లు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. కానీ వీరి విజ్ఞప్తిని తిరస్కరించిన హైకోర్టు.. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. -
రేప్ కేసులో బాలీవుడ్ నటుడి కుమారుడికి బెయిల్
న్యూఢిల్లీ : రేప్ కేసులో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి భార్య యోగితా బాలి, కుమారుడు మహాక్షయ్ చక్రవర్తిలకు ఢిల్లీ కోర్టు శనివారం యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల షూరిటీ సమర్పించడంతో జడ్జి అశుతోష్ కుమార్ బెయిల్ ఇచ్చారు. ఈరోజు(శనివారం) తమిళనాడులోని నీల్గిరి జిల్లా ఊటీలో మహాక్షయ్ చక్రవర్తి పెళ్లి, హీరోయిన్ మదాలసా శర్మతో జరగాల్సి ఉంది. ఈ ఘటనతో పెళ్లి రద్దు అయింది. తనకు మహాక్షయ్తో నాలుగు సంవత్సరాలుగా ఫిజికల్ రిలేషన్ ఉందని, తనను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడని రేప్ ఆరోపణలు చేసిన మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మహాక్షయ్ వల్ల తాను గర్భవతిని అయ్యాయని, ఈ విషయం తెలిసి తనకు తెలియకుండా మాత్రలు మింగించి బలవంతంగా అబార్షన్ చేయించాడని ఫిర్యాదులో తెలిపింది. యోగితా బాలి తన చంపుతానని బెదిరిస్తోందని, మహాక్షయ్తో సంబంధం పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిందని కూడా ఫిర్యాదులో వెల్లడించింది. తనకు యోగితా బాలి, మహాక్షయ్తో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఫిర్యాదు ద్వారా కోరింది. ప్రాథమిక వివరాలను బట్టి యోగితా బాలి, ఆమె కుమారుడు మహాక్షయ్ చక్రవర్తిలపై చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చునని, ఆ ప్రకారం దర్యాప్తు చేపట్టవచ్చునని కోర్టు అభిప్రాయపడింది. -
నటుడి భార్య, కొడుకుపై అత్యాచార కేసు
సాక్షి, ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ చక్రవర్తిపై చీటింగ్, అత్యాచార కేసు నమోదైంది. మహాక్షయ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఒక యువతి చేసిన ఫిర్యాదు మేరకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా రోహిణి కోర్టు ఆదేశించింది. వివరాలు.. గత మూడేళ్లుగా తనతో రిలేషన్లో ఉన్న మహాక్షయ్ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి.. తనకు ఇష్టం లేకున్నా అబార్షన్ చేయించాడని ఆమె ఆరోపించింది. ఈ విషయంలో మహాక్షయ్కు అతడి తల్లి యోగితా బాలి కూడా సహకరించిందని.. అందుకే ఆమె పేరును కూడా ఫిర్యాదులో చేర్చినట్లు బాధిత యువతి పేర్కొనట్లు సమాచారం. కాగా గత నెలలో మహాక్షయ్తో మూడేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నట్లు స్పష్టం చేసిన ఓ హీరోయిన్.. జూలై 7న అతడిని వివాహం చేసుకోబోతున్నట్లుగా తెలిపింది. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘‘మూడేళ్లుగా నేను, మహాక్షయ్ రిలేషన్షిప్లో ఉన్నాం. మా రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో ఈ విషయాన్ని చెప్పగానే వారేమీ ఆశ్చర్యపోలేదు. వారి అంగీకారంతోనే మార్చి నెలలో మహాక్షయ్ ఇంట్లో మా ఎంగేజ్మెంట్ జరిగింది. అందుకే ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోవచ్చు. అయితే మా వివాహం ఎక్కడ జరుతుందనేది ఇంకా నిర్ణయించలేదు కానీ కచ్చితంగా ముంబైలో మాత్రం జరగదు. డెస్టినేషన్ వెడ్డింగ్ను ప్లాన్ చేస్తున్నాం’ అంటూ పేర్కొంది. ఈ నేపథ్యంలో మహాక్షయ్పై అత్యాచార ఆరోపణలు రావడం గమనార్హం. -
మిథున్ చక్రవర్తి కొడుకుతో హీరోయిన్ పెళ్లి
సాక్షి, ముంబై : బాలీవుడ్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సోనమ్ కపూర్, నేహా ధూపియాలు గత నెలలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా కొత్త బంగారు లోకం సినిమా హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ కూడా త్వరలోనే బాలీవుడ్ దర్శకుడిని వివాహం చేసుకోనున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం మరో హీరోయిన్ మదాలస శర్మ కూడా తన వివాహ తేదీని ప్రకటించేశారు. బాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మిథున్ చక్రవర్తి తనయుడు మహాక్షయ్ చక్రవర్తితో జూలై 7న తన వివాహం జరగనున్నట్లు మదాలస శర్మ తెలిపారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మదాలస.. ‘మూడేళ్లుగా నేను, మహాక్షయ్ రిలేషన్షిప్లో ఉన్నాం. మా రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో ఈ విషయాన్ని చెప్పగానే వారేమీ ఆశ్చర్యపోలేదు. వారి అంగీకారంతోనే మార్చి నెలలో మహాక్షయ్ ఇంట్లో మా ఎంగేజ్మెంట్ జరిగింది. అందుకే ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోవచ్చు. అయితే మా వివాహం ఎక్కడ జరుతుందనేది ఇంకా నిర్ణయించలేదు కానీ కచ్చితంగా ముంబైలో మాత్రం జరగదు. డెస్టినేషన్ వెడ్డింగ్ను ప్లాన్ చేస్తున్నాం’ అంటూ చిరునవ్వులు చిందించారు. కాగా 2008లో ‘జిమ్మీ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహాక్షయ్కు.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ప్రస్తుతం పెద్దగా అవకాశాలేమీ రావడం లేదు. అదే విధంగా 2011లో ‘ఏంజెల్’ సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయమైన మదాలస.. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లో కూడా నటించారు. -
పోర్న్స్టార్తో ఫొటోకు ఫోజిచ్చిన నటుడు.. వైరల్
న్యూఢిల్లీ : సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మిథున్ చక్రవర్తి తనయుడు మహాక్షయ్ పోర్న్ స్టార్తో కలిసి దిగిన ఫొటో సోషల్మీడియాలో వైరల్ అయింది. అమెరికన్ పోర్న్ స్టార్ కెడెన్ క్రాస్తో లాస్ ఏంజెల్స్లో మహాక్షయ్ ఫొటోను ఫోజిచ్చారు. కాగా, ఈ ఫొటోపై నెటిజన్లు పలు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. మహాక్షయ్ 2008లో జిమ్మి అనే చిత్రంలో నటించారు. కాలిఫోర్నియాలో కెడెన్ను కలిసిన మహాక్షయ్, ఆమెతో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. 'అందగత్తెను కలిసినప్పుడు' అంటూ ఫొటోకు క్యాప్షన్ కూడా పెట్టారు. -
నాడు అమితాబ్.. నేడు మిథున్ చక్రవర్తి
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి మూడు రోజుల క్రితం తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 1987లో తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇద్దరు మూడేళ్లు మాత్రమే ఎంపీలుగా కొనసాగారు. కాకపోతే నాడు అమితాబ్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించగా, నేడు మిథున్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. నాడు అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ పార్టీ తరఫున 1984లో అలహాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించగా, మిథున్ చక్రవర్తి మూడేళ్ల క్రితం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయ్యారు. నాడు బోఫోర్స్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో అమితాబ్ రాజీనామా చేయగా, నేడు శారదా చిట్ఫండ్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో మిథున్ రాజీనామా చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్లనే రాజీనామా చేసినట్లు మిథున్ అధికారికంగా ప్రకటించారు. శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో మొదటిసారి మిథున్ పేరు 2014లో బయటకు వచ్చింది. శారదా స్కామ్పై సిబీఐతోపాటు దర్యాప్తు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు ఆయన పలుసార్లు హాజరయ్యారు. వేలాది మందికి రూ. కోట్లు ముంచారు... వేలాది మందికి కోట్లాది రూపాయలను ఎగవేసిన శారదా చిట్ఫండ్ కంపెనీ 2013లో బోర్డు తిప్పేసింది. దానికి మిథున్ చక్రవర్తి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. చిట్ఫండ్ కంపెనీ నుంచి రెండు కోట్ల రూపాయలను తీసుకున్నట్లు తెలియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మిథున్ను విచారించారు. తాను బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసినందుకు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు మిథున్ వెల్లడించారు. అందులో 56 లక్షల రూపాయలను పన్ను కింద చెల్లించానని, మిగతా సొమ్ములో 1.19 కోట్ల రూపాయలను కూడా చెల్లిస్తానని అధికారులకు ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు 2015లో ఈడీ అధికారులకు ఆయన చెల్లించారు కూడా. అయినప్పటికీ తుది చార్జిషీటులో కూడా మిథున్ పేరు కూడా ఉంది. రాజ్యసభ నుంచి తప్పుకున్న రెండో వ్యక్తి శారదా స్కామ్ కారణంగా రాజ్యసభ సభ్యత్వానికి తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజీనామా చేసిన రెండో వ్యక్తి మిథున్ చక్రవర్తి. ఈ కేసులో 2014, నవంబర్ నెలలో అరెస్టయిన శ్రీంజయ్ బోస్ ముందుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత మూడు నెలలకు రాజ్యసభకు రాజీనామా చేశారు. ఇదే కేసులో నిందితుడైన కునాల్ ఘోష్ను 2013లోనే పార్టీ తొలగించింది. అయితే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. దూకుడు పెంచిన సీబీఐ శారదా చిట్ఫండ్ స్కామ్ను దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఈ మధ్య తన దూకుడును పెంచింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపాస్ పాల్ను ఇటీవలనే అరెస్ట్ చేసింది. అయితే శారదా స్కామ్ కన్నా అతి పెద్దదిగా భావిస్తున్న ‘రోజ్వ్యాలీ’ స్కామ్లో ఆయనను అరెస్ట్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. ఇదే స్కామ్కు సంబంధించి లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన సుధీప్ బందోపాధ్యాయ్ని మొన్న మంగళవారం నాడు సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న కారణంగానే తమ పార్టీ నేతలపై మోదీ సీబీఐని ప్రయోగిస్తోందని తృణమూల్ నేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. -
ఎంపీ పదవికి సీనియర్ నటుడి రాజీనామా!
కోల్కతా: అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు మిథున్ చక్రవర్తి సోమవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శారద చిట్ఫండ్ కుంభకోణంలో ఈడీ విచారణ ఎదుర్కొన్న ఆయన హఠాత్తుగా తన రాజ్యసభ స్వభ్యత్వానికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలు చూపి ఆయన పదవిని వదులుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ బెంగాల్లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరపున ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయితే, ఎంపీగా ప్రమాణం చేసేందుకే ఆయన నాలుగు నెలలు సమయం తీసుకున్నారు. ఈ క్రమంలో శారద చిట్ఫండ్ స్కాంలో ప్రమేయంపై ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరేక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే మిథున్ పదవిని వదులుకున్నట్టు తెలుస్తోంది. అధికార టీఎంసీకి సన్నిహితంగా ఉండటం, శారద స్కాంలో ఆరోపణలు రావడంతో ఆయన వ్యక్తిగతంగా, వృత్తిగతంగా కుంగిపోయారని, అందుకే ఎంపీ పదవిని వదులుకుంటున్నారని సన్నిహితులు చెప్తున్నారు. ఈ స్కాంలో ఈడీ నోటీసులు అందిన నాటి నుంచి ఆయన తృణమూల్ కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నారని వారు చెప్తున్నారు. మరోవైపు, వివిధ అంశాల్లో మోదీ ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తుండటంతో ఢిల్లీ సర్కార్ తనపై, తన పార్టీ నేతలపై ఈడీని, సీబీఐని ఉసిగొల్పుతున్నదని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి శారద గ్రూప్తో అనుబంధమున్న వారిలో సంస్థ నుంచి తీసుకున్న డబ్బులు స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చిన ఏకైక వ్యక్తి మిథున్ చక్రవర్తియే. ఆయన గత ఏడాది జూన్ 16న స్వచ్ఛందంగా రూ. 1.19 కోట్ల చెక్కును తన లాయర్ ద్వారా ఈడీ కార్యాలయానికి పంపించారు. అంతేకాకుండా అప్పటినుంచి రాజ్యసభ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే, మిథున్ అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేశారని, ఇందులో రాజకీయకోణం లేదని తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. కాగా, పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన మిథున్ చక్రవర్తి తెలుగులో 'గోపాలా గోపాలా' సినిమాలో నటించారు. -
సూపర్ హిట్ ప్యార్ ఝక్తా నహీ...
ఫ్లాపుల్లో ఉన్న మిథున్ చక్రవర్తిని మళ్లీ నిలబెట్టిన సినిమా ఇది. ప్రేమ జంట విడిపోయి తమకు పుట్టిన పిల్లాడి ద్వారా కలవడం గతంలో ‘ఆ గలే లగ్ జా’ (1973- తెలుగులో మంచి మనసులు) వంటి కథల ద్వారా చూసినా అదే కథ కొంచెం మార్పుచేర్పులతో ప్రేక్షకులను అలరించింది. పేదవాడైన హీరో, కలవారి అమ్మాయి... వారి మధ్య కొందరు అడ్డు పడటం.. ఇంతే కథ. అయితే మిథున్, పద్మిని కొల్హాపురి జంట ప్రేక్షకులకు నచ్చింది. అంతేకాదు సినిమాను లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగీతం నిలబెట్టింది. ‘తుమ్ సే మిల్ కర్... నా జానే క్యూ’... పాట రేడియోలో మోగిపోయింది. 1985లో రిలీజైన ఈ సినిమా సంవత్సరం రోజులు ఆడటం ఆప్పట్లో ఆషామాషీ కాదు. దీని ప్రభావం దక్షిణాదిన పడింది. తమిళంలో రజనీకాంత్, కన్నడలో విష్ణువర్థన్ దీని రీమేక్లలో నటించారు. తెలుగులో ‘పచ్చని కాపురం’ పేరుతో కృష్ణ, శ్రీదేవి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పట్లో ఎస్.పి.బాలు, కృష్ణల మధ్య స్పర్థలు ఉండటంతో ఇందులోని పాటలు కె.జె. ఏసుదాస్ గళంలో వినిపిస్తాయి. ‘వెన్నెలైనా చీకటైనా’... పాట ఇప్పటికీ హిట్టే. -
ఈడీకి రూ. 1.2 కోట్లు కట్టిన హీరో!
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి రూ. 1.2 కోట్ల సొమ్ము కట్టారు. శారదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినందుకు తనకు ముట్టిన సొమ్ము మొత్తాన్ని ఆయన ఈడీకి కట్టేశారు. ఈ విషయాన్ని మిథున్ న్యాయవాదులు, ఆయన ప్రతినిధులు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న విచారణాధికారికి ఆయన రూ. 1.2 కోట్ల డిమాండ్ డ్రాఫ్టును సమర్పించారు. శారదా గ్రూపు నుంచి తనకు అందిన మొత్తం సొమ్మును ఇచ్చేస్తానని మిథున్ ఇంతకుముందే ఈడీకి చెప్పారని, అందులో భాగంగానే ఈ డీడీని అందజేశారని మిథున్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మే నెలలో మిథున్ చక్రవర్తిని ఈడీ వర్గాలు విచారించాయి. ఆసమయంలో ఆయన కొన్ని డీవీడీలు, సీడీలు, స్క్రిప్టులు వాళ్లకు అందజేశారు. అవన్నీ శారదా గ్రూపు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన సమయంలో వాళ్ల నుంచి తనకు అందినవని ఆయన చెప్పారు. -
'నాన్న ఆరోగ్యం భాగానే ఉంది'
ముంబై: బాలీవుడ్ హీరో, తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తి రొటీన్ చెక్ అప్లో భాగంగానే ఆస్పత్రికి వెళ్లాడని ఆయన కుమారుడు మహాక్షయ్ చెప్పారు. వాంతులు, జ్వరంతో ఆదివారం ఆస్పత్రిలో చేరినట్టు వచ్చిన వార్తలని ఖండిస్తూ అవన్ని అవాస్తవాలని కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదురుగానే ఉండి ఇంట్లోనే ఉన్నాడని మహాక్షయ్ తెలిపారు. కోట్లాది శారదా చిట్ఫండ్ స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల కోల్కతాలో మిథున్ చక్రవర్తిని ప్రశ్నించారు. శారదా గ్రూపునకు మిథున్ చక్రవర్తి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. వీటికి సంబంధించిన డీవీడీలు, సీడీలు, రికార్డులను ఈడీ అధికారులకు అందజేశారు. శారదా గ్రూపు నుంచి తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇస్తానని మిథున్ చక్రవర్తి ఇదివరకే చెప్పారు. వృత్తిపరంగానే శారదా గ్రూపుతో పనిచేశానని, ఎవర్నీ మోసం చేయాలన్న ఉద్దేశం తనకు లేదని మిథున్ చక్రవర్తి చెప్పిన విషయం తెలిసిందే. -
బాలీవుడ్ హీరోను ప్రశ్నించిన ఈడీ
కోల్కతా: కోట్లాది శారదా చిట్ఫండ్ స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల కోల్కతాలో బాలీవుడ్ హీరో, తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తిని ప్రశ్నించారు. ఆయన వాంగూల్మాన్ని నమోదు చేశారు. శారదా గ్రూపునకు మిథున్ చక్రవర్తి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. వీటికి సంబంధించిన డీవీడీలు, సీడీలు, రికార్డులను ఈడీ అధికారులకు అందజేశారు. శారదా గ్రూపు నుంచి తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇస్తానని మిథున్ చక్రవర్తి చెప్పారు. వృత్తిపరంగానే శారదా గ్రూపుతో పనిచేశానని, ఎవర్నీ మోసం చేయాలన్న ఉద్దేశం తనకు లేదని మిథున్ చక్రవర్తి చెప్పారు. శారద స్కాంకు సంబంధించి తన పాత్ర లేదని వివరించారు. -
డిస్కోడ్యాన్సర్కు 'శారద' చిక్కులు!
'డిస్కోడ్యాన్సర్' సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొని అటుపై ఎన్నో హిట్లు సాధించి.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయారంగేట్రం చేసి ప్రస్తుతం ఎంపీ(రాజ్యసభ)గా కొనసాగుతున్న మిథున్ చక్రవర్తి చి్క్కుల్లో పడ్డారు. పశ్చిమబెంగాల్, ఒడిశా, అసోం రాష్ట్రాలను కుదిపేసిన శారద చిట్ఫండ్ కేసులో ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు సమన్లు జారీచేసింది. కోట్ల విలువైన కుంభకోణం వ్యవహారంతో తన ప్రమేయం లేదని రుజువుచేసేలా అకౌంట్ల వివరాలను వెల్లడించనందునే మనీలాండరింగ్ చట్టం ప్రకారం మిథున్కు సమన్లు జారీచేసినట్లు ఈడీ వర్గాలు గురువారం వెల్లడించాయి. అయితే వార్తలను మిథున్ చక్రవర్తి న్యాయవాది బిమన్ శంకర్ తోసిపుచ్చారు. ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని పీటీఐ వార్తా సంస్థతో అన్నారు. శారద చిట్ఫండ్ కంపెనీ ప్రకటనలకు మిథున్ చక్రవర్తి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. అందుకుగానూ ఆయన రెండు కోట్ల రూపాయలు స్వీకరించారని, అదంతా అక్రమ డబ్బేనని ఈడీ విచారణలో తేలింది.ఇదే విషయమై గత ఏడాది జూన్లో ఈడీ అధికారులు మిథున్ చక్రవర్తిని ముంబైలో ప్రశ్నించారు. కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలంటే తన బ్యాంక్ అకౌంట్ల వివరాలన్నీ వెల్లడిస్తానని మిథున్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగతంగానైనా, లాయర్ ద్వారానైనా ఖాతాల వివరాలు తెలపాలని మిథున్కు ఈడీ సమన్లు జారిచేసింది. -
తెలుగులోకొచ్చిన లీలాధరుడు
అత్యుత్తమస్థాయి నటులు మాత్రమే చేయగలిగే పాత్రలు కొన్ని ఉంటాయి. అలాంటి పాత్రే... హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’లో మిథున్ చక్రవర్తి పోషించిన లీలాధర్ స్వామి పాత్ర. శారీరక కదలికల్లో ఓ విధమైన ఆడతనం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడతాడేమో అనిపించేంత ఆడంబరం కనిపిస్తుంది ఆ పాత్రలో. చూపులకు దైవత్వం, అంతర్లీనంగా కన్నింగ్ నేచర్, చిత్రమైన సంభాషణా చాతుర్యం... ఇన్ని ప్రత్యేకలుండే పాత్ర అది. ఆ పాత్రను మిథున్చక్రవర్తి అనితర సాధ్యంగా పోషించారంటే అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అందుకే... ‘ఓ మైగాడ్’ తెలుగు రీమేక్ ‘గోపాల గోపాలా’లో కూడా లీలాధర స్వామి పాత్రకు మిథున్ చక్రవర్తినే తీసుకున్నారు దర్శకుడు కిషోర్కుమార్ పార్థసాని (డాలీ). మాతృకలో పోషించిన పాత్రనే మళ్లీ చేయాలని అడగడంతో, అంగీకారం తెలుపడానికి కాస్త తటపటాయించారట మిథున్. కానీ చిత్ర యూనిట్ కమిట్మెంట్ చూసి, ఆ పాత్రను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. వెంకటేశ్, పవన్కల్యాణ్ లాంటి సూపర్స్టార్లు కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్లో మిథున్చక్రవర్తిలాంటి నటి సూపర్స్టార్ తోడవ్వడంతో ‘గోపాల గోపాలా’కు మరింత శోభ చేకూరిందని చెప్పాలి. గురువారం మిథున్చక్రవర్తి ఈ సినిమా షూటింగ్లోకి ప్రవేశించారు. మిథున్ ఇందులో తన పాత్రకు తనే డబ్బింగ్ చెబుతారట. ఇందుకోసం తెలుగు భాషను శ్రద్ధగా నేర్చుకుంటున్నారాయన. సెట్లో కూడా అందరితో తెలుగులోనే మాట్లాడుతున్నారట. డి.సురేశ్బాబు, శరత్మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రియ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కథ: భవేష్ మండాలియా, ఉమేశ్ శుక్లా, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్. -
పవన్ కల్యాణ్ పాత్ర 25 నిముషాలే
హైదరాబాద్: తన దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న గోపాల గోపాల చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేవలం 25 నిముషాలు మాత్రమే కనిపిస్తారని ఆ చిత్ర దర్శకుడు కిషోర్ కుమార్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ... తాను పవన్ కల్యాణ్కి వీరాభిమానినని చెప్పారు. తాను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో పవన్ కల్యాణ్ నటించడం ఆనందంగా ఉందని తెలిపారు. తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్పై షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభించినట్లు చెప్పారు. హిందీలో నిర్మితమైన ఓ మై గాడ్ చిత్రాన్ని తెలుగులో గోపాల గోపాలగా నిర్మిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఓ మై గాడ్ చిత్రంలోని అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను పవన్ కల్యాణ్ పోషిస్తున్నారని చెప్పారు. గోపాల గోపాల చిత్ర హీరో వెంకటేశ్, పవన్ కల్యాణ్ల మధ్య చిత్రీకరిస్తున్న సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయన అన్నారు. చిత్రంలోని పవన్, వెంకటేశ్ల డైలాగ్లు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటాయని వెల్లడించారు. 2015 సంక్రాంతి పండగ నాటికి ఈ గోపాల గోపాల చిత్రం విడుదలవుతుందని కిషోర్ కుమార్ తెలిపారు. ఈ చిత్రంలో శ్రియా, మిథున్ చక్రవర్తి, మురళి శర్మలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. -
మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, అలనాటి డిస్కో డాన్సర్ మిథన్ చక్రవర్తికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపింది. పశ్చిమబెంగాల్ కేంద్రంగా సంచలనం సృష్టించిన శారదా చిట్ఫండ్స్ స్కాం కేసులో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఈడీవర్గాలు సమన్లు పంపాయి.ఆయన వచ్చేటప్పుడు సంబంధిత పత్రాలన్నింటినీ వెంట తీసుకు రావాలని, కొన్నేళ్ల క్రితం ఆయన శారదా చిట్స్తో చేసిన లావాదేవీల వివరాలు కావాలని ఈడీ తెలిపింది. అయితే, దీనిపై వివరాలు కోరేందుకు ప్రయత్నిచంగా మిథున్ అందుబాటులో లేరు. కేసు దర్యాప్తులో కొన్ని వివరాల కోసమే మిథున్ను కూడా ఈడీ విచారిస్తున్నట్లు తెలిసింది. గురువారం నాడు కోల్కతాలో ఈడీ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా మిథున్ చక్రవర్తికి తెలిపారు. శారదా గ్రూపు ఖాతాల నుంచి కొన్ని కోట్ల రూపాయలు మిథున్ ఖాతాలోకి వెళ్లాయి. దీనికి సంబంధించిన వివరాలతో పాటు మరికొన్ని ప్రశ్నలను కూడా ఈడీ అడిగే అవకాశం కనిపిస్తోంది. శారదా గ్రూపునకు చెందిన ఓ మీడియా సంస్థకు మిథున్ చక్రవర్తి బ్రాండ్ అంబాసిడర్ కావడంతో ఈ మొత్తం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, శారదా చిట్స్ కేసులో ఇప్పటికే ఈడీ పీఎంఎల్ఏ చట్టం కింద పలువురిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చాలామంది ఎంపీలను విచారించింది. ఇప్పుడు మిథున్ చక్రవర్తి వంతు వచ్చింది. -
పవన్ తో కలిసి నటిస్తోన్న మిధున్
-
రాజ్యసభకు ‘డిస్కో డాన్సర్’
* బెంగాల్ నుంచి ఎన్నికైన మిథున్ చక్రవర్తి * ముగిసిన రాజ్యసభ ఎన్నికలు * 55 సీట్లకుగాను 18 చోట్ల ఎన్నికలు * క్రాస్ఓటింగ్తో తృణమూల్కు అదనపు సీటు * ఒడిశాలో బీజేడీకి ఎదురుదెబ్బ న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. 16 రాష్ట్రాల్లోని 55 స్థానాలకు గానూ.. 12 రాష్ట్రాల్లోని 37 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారు. మిగిలిన 18 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. అనంతరం ఫలితాలు ప్రకటించారు. రాష్ట్రాలవారీగా ఫలితాలు.. పశ్చిమబెంగాల్: మొత్తం 5 స్థానాలకు గానూ.. తృణమూల్ కాంగ్రెస్ అధికారిక అభ్యర్థులైన బాలీవుడ్ నటుడు ‘డిస్కో డ్యాన్సర్’ మిథున్ చక్రవర్తి, జోగెన్ చౌధురి, కేడీ సింగ్లు విజయం సాధించారు. లెఫ్ట్ ఫ్రంట్ అధికారిక అభ్యర్థి, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి రితబ్రత బెనర్జీ కూడా గెలుపొందారు. వారితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన పాత్రికేయుడు అహ్మద్ హసన్ కూడా గెలిచారు. ఆయనకు తృణమూల్ మద్దతిచ్చింది. కాం గ్రెస్, వామపక్షాలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ జరిపి హసన్కు ఓటేయడంతో ఆయన విజయం సులభమయింది. హసన్కు ఓటేసిన ఎమ్మెల్యేలు సుశీల్ రాయ్, ఎమాని బిశ్వాస్లను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఒడిశా మొత్తం 4 స్థానాలకు గానూ.. అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ తమ ముగ్గురు అధికారిక అభ్యర్థులైన ఏయూ సింగ్దేవ్, కల్పతరు దాస్, సరోజిని హేంబ్రాంలను గెలిపించుకుంది. వారితో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ నేత, ఐపీఎల్ చైర్మన్ రంజిబ్ బిశ్వాల్ గెలుపొందారు. బీజేడీ తమ అదనపు ఎమ్మెల్యేల ఓట్ల ను తాము మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి వేయించలేకపోవడంతో బిశ్వాల్ విజయం సాధించగలిగారు. అస్సాం మొత్తం 3 స్థానాలకు గానూ.. అస్సాం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న ఉత్తరప్రదేశ్ ఎంపీ సంజయ్ సింగ్, అస్సాం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భువనేశ్వర్ కాలితలు విజయం సాధించారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన బోడో పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి బిశ్వజిత్ దైమారి కూడా గెలుపొందారు. ప్రతిపక్షాలు ఒక్కటై మద్దతిచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ హైదర్ హుస్సేన్ ఓటమి పాలయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల సంఖ్య మహారాష్ట్ర - 7 ( కాంగ్రెస్ 2, ఎన్సీపీ 2, శివసేన 1, ఆర్పీఐ 1, స్వతంత్ర 1) తమిళనాడు-6 (ఏఐఏడీఎంకే 4, డీఎంకే 1, సీపీఎం 1) బీహార్ - 5 (జేడీయూ 3, బీజేపీ 2) గుజరాత్ - 4 ( బీజేపీ 3, కాంగ్రెస్ 1) మధ్యప్రదేశ్ -3 ( బీజేపీ 2, కాంగ్రెస్ 1) రాజస్థాన్ - 3 (బీజేపీ 3) హర్యానా - 2 (కాంగ్రెస్ 1, ఐఎన్ఎల్డీ 1) ఛత్తీస్గఢ్ - 2 ( కాంగ్రెస్ 1, బీజేపీ 1) జార్ఖండ్ - 2 (ఆర్జేడీ 1, స్వతంత్ర 1) హిమాచల్ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ - 1 చొప్పున (మూడూ కాంగ్రెస్కే) -
రాజ్యసభ ఎన్నికల బరిలో బాలీవుడ్ నటుడు!
పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ బరిలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి బరిలో దిగారు. ఫిబ్రవరి 7 తేదిన జరిగే ఎన్నికల్లో పోటీపడేందుకు మిథున్ తోపాటు నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున మిథున్ చక్రవర్తి రాజ్యసభకు పోటీ చేయనున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నాను. ఇక భవిష్యత్ లో కూడా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతాను. రాష్ట్ర సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తాను అని తృణమూల్ పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మిథున్ అన్నారు. తృణమూల్ పార్టీ తరపున పెయింటర్ జోగెన్ చౌదరీ, బెంగాలీ దిన పత్రిక కలామ్ ఎడిటర్ ఆహ్మద్ హసన్, కేడీ సింగ్ లు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి సీపీఐ పార్టీ తరపున స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రితబ్రత బెనర్జీ, కాంగ్రెస్ మద్దతుతో ఉర్దూ దిన పత్రిక ఆజాద్ హింద్ మాజీ ఎడిటర్ మలిహబడి పోటీలో ఉన్నారు. -
పెద్దల సభకు డిస్కోడాన్సర్
మమతా దీదీ విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటారు. అందుకు గతంలో ఎన్నో ఉదాహరణ ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు మిధున్ చక్రవర్తిని పెద్దల సభకు పంపాలని మమత దీదీ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఐదు ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో వాటిలో ఒకదానిని మిధున్ చక్రవర్తికి కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ శనివారం వెల్లడించింది. మిధున్ తన జీవితాన్ని సాంస్కృతిక, సాంఘిక సేవా కార్యక్రమాలకు పూర్తిగా వినియోగించి, అందులో సంపూర్ణ ఫలితాలను పొందారని ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రశంసలతో ముంచెత్తారు. అల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ తరపున మిధున్ చక్రవర్తిని రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక చేసేందుకు ఇప్పటికే మమత దీదీని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మిధున్ చక్రవర్తి గతంలో బాలీవుడ్ చిత్రం డిస్కోడాన్సర్ లో నటించిన విషయం తెలిసిందే. -
సూపర్ ‘స్టార్ వేదిక’
సినీ దిగ్గజాలు ఒక్కచోట చేరిన సందర్భం. సినీ ప్రముఖులు అమితాబ్బచ్చన్, జయాబచ్చన్, కమల్హాసన్, షారుక్ఖాన్, మిథున్చక్రవర్తి కోల్కతాలో ఆదివారం జరిగిన 19వ కోల్కతా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ ‘వేగంగా ముక్కలవుతున్న ప్రపంచాన్ని ఏకం చేసే ముఖ్యమైన పాత్ర సినిమా పోషిస్తోంద’న్నారు. నేతాజీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు బెంగాలీ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
సూపర్ ‘స్టార్ వేదిక’
సినీ దిగ్గజాలు ఒక్కచోట చేరిన సందర్భం. సినీ ప్రముఖులు అమితాబ్బచ్చన్, జయాబచ్చన్, కమల్హాసన్, షారుక్ఖాన్, మిథున్చక్రవర్తి కోల్కతాలో ఆదివారం జరిగిన 19వ కోల్కతా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ ‘వేగంగా ముక్కలవుతున్న ప్రపంచాన్ని ఏకం చేసే ముఖ్యమైన పాత్ర సినిమా పోషిస్తోంద’న్నారు. నేతాజీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు బెంగాలీ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
19వ కోల్కతా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం
సినీ దిగ్గజాలు ఒక్కచోట చేరిన సందర్భం. సినీ ప్రముఖులు అమితాబ్బచ్చన్, జయాబచ్చన్, కమల్హాసన్, షారుక్ఖాన్, మిథున్చక్రవర్తి కోల్కతాలో ఆదివారం జరిగిన 19వ కోల్కతా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ ‘వేగంగా ముక్కలవుతున్న ప్రపంచాన్ని ఏకం చేసే ముఖ్యమైన పాత్ర సినిమా పోషిస్తోంద’న్నారు. బెంగాలీ సాహిత్యం, బెంగాలీ సినిమా ప్రపంచానికి చేసిన సేవలను వివరించారు. నేతాజీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు బెంగాలీ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
కాంచీ విడుదలకు తొందరేం లేదు: సుభాష్ ఘాయ్
తన దర్శకత్వంలో రూపుదిద్దుకోంటున్న 'కాంచీ' చిత్రం విడుదలకు అంత తొందర ఏమి లేదని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ వెల్లడించారు. కాంచీ చిత్రాన్ని తగినంత సమయం తీసుకుని విడుదల చేస్తానని ఆయన తెలిపారు. ఆ చిత్ర నిర్మాణంలో మహాబీజిగా ఉన్న ఆయన కాసంత విరామం సమయంలో విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. కాంచీ చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుందని తెలిపారు. అలా అని షూటింగ్ పూర్తి అయిన వెంటనే విడుదల చేయనన్నారు. సినిమా చిత్రీకరణ ఓ సారి పూర్తి అయితే ఎప్పుడు విడుదల చేద్దామా అనే ఆలోచన అతనకు ఉంటుందన్నారు. అయితే ఈ సారి అలా కాకుండా సరైన సమయంలో కాంచీ విడుదల చేస్తానన్నారు. తన దర్శకత్వంలో ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన యువరాజ్ చిత్రంలా అరిబరీగా తీసి మళ్లీ చేతులు కాల్చుకోనే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు. యువరాజ్ చిత్రాన్ని ఒడిలోపెట్టన దడిలో పెట్టన అన్న రీతిలో తీసి ఆగమేఘాలపై విడుదల చేశానని సుభాష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ చిత్రం తనకు ఓ గుణపాఠం అని వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే ఆ చిత్రంతో తనకు జ్ఞానోదయం అయిందని వివరించారు. అలాంటి తప్పులు మరల జీవితంలో చేయకుడదని ఓ నిర్ణయం తీసుకున్నట్లు సుభాష్ ఘాయ్ వివరించారు. కార్తీక్ తివారీ, నూతన నాయక మిస్తి ప్రధాన తారాగణంగా కాంచీ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రంలో రిషి కపూర్, మిథున్ చక్రవర్తులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.